Movie News
-
మరోసారి తల్లి కాబోతున్న దీపిక.. ‘రాకా’ కోసం కీలక నిర్ణయం!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ శుభవార్తని ఆదివారం అభిమానులతో పంచుకుంది దీపిక. దీంతో అందరూ రణ్వీర్, దీపిక దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో ఆమె కొత్త సినిమాలపై రకరకాల పుకార్లను కూడా పుట్టించారు. దీపిక ఇక ఏ సినిమా షూటింగ్లో పాల్గొనదని.. పూర్తిగా రెస్ట్ తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఆమె విశ్రాంతి తీసుకోనున్నారట.రాకా కోసం యాక్షన్దీపికా ఒప్పుకున్న సినిమా రాకా ఒక్కటి. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తికాలేదు. ఇందులో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్రకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్ సీన్స్ చేయడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయం దర్శకుడు అట్లీకి కూడా చెప్పడంతో.. వీలైనంత తొందరగా దీపికకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ‘కింగ్’కోసం కూడా.. దీపికా ఒప్పుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కింగ్’. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా పూర్తికాలేదు. ఇందులో కూడా దీపిక పదుకొణె పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని కూడా ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటూనే పూర్తి చేయాల్సి ఉంది. తనవల్ల షూటింగ్కి అంతరాయం కావొద్దనే దీపికా ఈ నిర్ణయం తీసుకుందట. ‘పఠాన్’లాంటి బ్లాక్బస్టర్ తర్వాత షారుక్ఖాన్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Agadha: ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల.. లుక్ అదిరింది!
'దేవి', 'శత్రువు', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి కల్ట్ చిత్రాల నిర్మాత , ‘డర్టీ హరి’, ‘ మళ్లీ పెళ్లి ‘ చిత్రాల దర్శకుడు ఎం.ఎస్. రాజు మరో సూపర్ ఇంట్రెస్టింగ్ చిత్రంతో మీ ముందుకు వస్తున్నారు. ఆయన తాజా చిత్రం 'అగధ'లో మహాదేవి పాత్ర పరిచయం ఈ మర్మమైన, దైవిక థ్రిల్లర్కు కొత్త ఉత్కంఠను జోడిస్తుంది.'అగధ' ఫస్ట్ లుక్తో రేగిన ఉత్సుకత ఇప్పుడు తదుపరి వెల్లడికి దారితీసింది. మునుపటి పోస్టర్లో దైవ విగ్రహం ముందు నిలబడి కనిపించిన ఆ రహస్య యువతి మరెవరో కాదు, కామాక్షి భాస్కర్ల అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆమె ఈ చిత్రంలో కీలక కథానాయిక మహాదేవి పాత్రను పోషిస్తున్నారు.ఈ ప్రకటనతో, మొదటి పోస్టర్ ద్వారా ఎంఎస్ రాజు సృష్టించిన దృశ్యరూపానికి ఇప్పుడు ఒక ముఖం, శక్తివంతమైన తెరపై ఉనికి లభించాయి. త్రిశూలాలు, దీపాలు, ఎత్తైన విగ్రహంతో కూడిన ఆధ్యాత్మిక నేపథ్యం ముందు, సాంప్రదాయ నల్ల చీర కట్టుకుని గంభీరంగా కూర్చున్న కామాక్షి భాస్కర్ల రూపమే, కథనంలో ఆమె పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని సూచిస్తోంది. ఆమె ప్రచండమైన హావభావం, సాంప్రదాయ రూపం, ఆ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాదేవి కేవలం ఒక సాధారణ పాత్ర కాదని, కథ యొక్క ఆధ్యాత్మిక మూలంతో గాఢంగా ముడిపడి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తున్నాయి. -
18 రోజుల్లో రూ. 205 కోట్ల కలెక్షన్స్.. మలయాళ మూవీ సంచలనం!
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు నూతన నటీనటుల మూవీస్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలు కూడా పాన్ ఇండియా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కేవలం ఒక భాషలోనే కాకుండా..ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు..మలయాళ, కన్నడ సినిమాలు చేసి అక్కడ విజయాలు అందుకుంటున్నారు. అలా తెలుగు నిర్మాత సాహు గారపాటి రూ.10 కోట్లతో నిర్మించిన మలయాళ సినిమా ఒకటి అక్కడి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 18 రోజుల్లోనే రూ. 205 కోట్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. అదే ‘వాళా 2’. 2024లో వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాళా’ చిత్రానికి కొనసాగింపు ఇది. కొత్త నటీనటులతో సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విపిన్ దాస్ తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2 మలయాళంలో విడుదలై.. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా 18 రోజుల్లోనే రూ. 205 కోట్ల వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రూ.300+ కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ఎల్2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ చిత్రాలు ఉన్నాయి. వాళా 2 చిత్రాన్ని ఏప్రిల్ 24న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. -
విజయ్-సంగీత విడాకులు.. రూ. 250 కోట్లు అడిగారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీనీ స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవ్వగానే.. సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ విడాకుల కేసు నేడు (ఏప్రిల్ 20) చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ విజయ్ తన లాయర్తో పిటిషన్ దాఖలు చేయించాడు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఇదిలా ఉంటే.. విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిట్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. -
ఎమోషనల్ కిడ్
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘రిచ్ కిడ్’. మంజునాథ్ రెడ్డి, సుప్రియ మార్ల హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ మంజునాధ సినిమాస్ బ్యానర్ పై జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.షఫీ ఉల్లాహ్, అనిల్ దేరంగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘‘తండ్రీకొడుకుల ఎమోషన్స్, హాస్యం, మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
రాక్షసి వస్తోంది
షెరాజ్ మెహదీ హీరోగా నటించి, దర్శకత్వం వహించి, సంగీతం అందించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్డే, కృతీ వర్మ హీరోయిన్లుగా నటించారు. సురీందర్ కౌర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది.ఈ చిత్రాన్ని ఈ నెల 24న రీ–రిలీజ్ చేస్తున్న సందర్భంగా షెరాజ్ మెహదీ మాట్లాడుతూ– ‘‘సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో మా మూవీలో చూపిస్తున్నాం. అలాగే మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశం ఉంది’’ అన్నారు. ఈ చిత్రంలో నేహా దేశ్ పాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్, అనంత్ బాబు, ప్రియ కీలక పాత్రలు పోషించారు. -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ మధు రెడ్డి హైదరాబాద్లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఎడిటర్గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న 'అగ్ని నక్షత్రం' లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేసే విధానాన్ని తెలియజేస్తాయి.కేవలం ఫీచర్ ఫిలిమ్స్కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్గా కూడా పనిచేశారు. 'జగడం', 'జల్సా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది. -
షాకింగ్: ర్యాపర్ చెంప చెళ్లుమనిపించిన అభిమాని
హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ ఐస్ స్పైస్కు చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్లోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఆమెపై ఓ అభిమాని భౌతిక దాడికి పాల్పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.హాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.., ఐస్ స్పైస్ తన స్నేహితురాలితో కలిసి మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్కి వెళ్లింది. అక్కడికి ఓ యువతి వచ్చి.. అభిమానిని అని మాట్లాడడం ప్రారంభించిది. మొదట సాధారణంగానే అనిపించినప్పటికీ, ఆ అభిమాని అతిగా ప్రవర్తిస్తూ ఐస్ స్పైస్ను అసౌకర్యానికి గురిచేసింది. దీంతో ఐస్ స్పైస్, ఆమె స్నేహితురాలు సదరు యువతిని తమ టేబుల్ వద్ద నుండి వెళ్ళిపోవాలని కోరారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఆ అభిమాని ఒక్కసారిగా ఐస్ స్పైస్ చెంపపై కొట్టింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి గందరగోళంగా మారింది.చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఆ అభిమానిని ఆమె స్నేహితుడు బయటకు లాక్కెళ్తుండగా, ఐస్ స్పైస్ వారిని వెంబడించింది. రెస్టారెంట్లోని బల్లలపై దూకుతూ వెళ్లి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించింది. రెస్టారెంట్ డోర్ ముందు కూడా కాసేపు వాగ్వాదం జరిగింది. కోపంలో కింద పడిపోయిన ఒక ఫోన్ను ఐస్ స్పైస్ పగలగొట్టింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, అవి నెట్టింట వైరల్గా మారాయి. ఈ దాడి అకారణంగా జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఐస్ స్పైస్ న్యాయవాది తెలిపారు. అయితే సదరు యువతి మాత్రం.. తన తప్పు ఏమి లేదన్నారు. అభిమానిగా కలిసేందుకు వెళ్తే.. ఐస్ స్పైస్ తనతో అమర్యాదగా ప్రవర్తించి, అభ్యంతరకర భాష వాడటం వల్లే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. 😳 EXCLUSIVE: Ice Spice was slapped by a fan inside of an L.A. McDonald's. https://t.co/v9zZmQq05w pic.twitter.com/L1lvzOfGsF— TMZ (@TMZ) April 17, 2026 -
నభా నటేశ్ నాగబంధం మూవీ.. మరో సాంగ్ రిలీజ్
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధానపాత్రల్లో వస్తోన్న మూవీ నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్తో పాటు టీజర్ కూడా చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సుర సుర అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ, నల్గొండ గద్దర్, అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను జునైద్ కుమార్, అభే కంపోజ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
రూ.10 కోట్లతో అపార్ట్మెంట్ కొన్న టబు.. ప్రత్యేకతలు ఇవే!
సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఆ అపార్ట్మెంట్ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా ఉంటుందట. ఆ వెంచర్లో మొత్తం 2 టవర్స్ ఉన్నాయట. ఒక్కో టవర్ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్, స్వీమ్మింగ్ పూల్తో పాటు రెండు కార్లు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజయ్ సేతు పతి కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో నటిస్తోంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ నటి శివాలికా ఒబెరాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త, డైరెక్టర్ అభిషేక్ పాఠక్తో కలిసి ఈ శుభవార్త పంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. మా ఇంటికి చిన్నారి లక్ష్మీ దేవి ఈ శుభ దినాన మా జీవితంలోకి అడుగుపెట్టింది.. ఇది స్వచ్ఛమైన రూపంలో లభించిన ఒక వరం' క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. శివాలికా తాను గర్భవతి అయిన విషయాన్ని గతేడాది డిసెంబర్లో రివీల్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. నటి శివాలికా, డైరెక్టర్ అభిషేక్ పాఠక్ ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. 2020లో 'ఖుదా హాఫిజ్' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరు మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నిర్మించగా.. శివాలికా హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఈ జంట టర్కీలో నిశ్చితార్థం చేసుకున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య శివాలికాకు అభిషేక్ ప్రపోజ్ చేశారు.కాగా.. కిక్, హౌస్ఫుల్-3 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా శివాలికా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత యే సాలీ ఆషికి (2019) చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఖుదా హఫీజ్ చిత్రంలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకుంది. ఇక అభిషేక్ పాఠక్ హిందీలో దృశ్యం -2, ఉజ్డా చమన్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ప్యార్ కా పంచ్నామా, ఖుదా హాఫిజ్, సెక్షన్ 375 లాంటి ప్రాజెక్టులను నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) -
శృతిహాసన్పై పబ్లిక్లో కామెంట్స్.. నటి ఆగ్రహం..!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న శృతిని రోడ్డుపై ఉన్న కొందరు కామెంట్స్ చేశారు. శృతిని చూసి మమ్మ అంటూ పబ్లిక్లో గట్టిగా అరిచారు. ఇది విన్న శృతి హాసన్ 'కౌన్ హై మమ్మ.. హమ్ నే మమ్మ హై.. ఏ మాట్లాడుతున్నారు మీరు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ బండి ఎక్కడ ఉంది అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. అడివి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా రజినీకాంత్ కూలీ చిత్రంలో కనిపించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని కోలీవుడ్లో వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే శృతి హాసన్కు రెండుసార్లు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. Kamal Haasan's daughter Shruti Haasan was heading to a party when someone called her “mumma.” She got angry and replied brutally 😭 pic.twitter.com/mi8rJfKVGe— Sunita Indian (@NationSpeax4j) April 19, 2026 -
వాలీబాల్ నేపథ్యంలో ‘వాలీ’
టాలీవుడ్లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్వాటర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రానికి దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి వాలీ అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఈ చిత్రంతో రోనిత్ జీఆర్జీ హీరోగా పరిచయం అవుతున్నాడు. నిపుణ్ సత్య ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. అభిగ్న్య వుత్తలూరు హీరోయిన్గా నటిస్తోంది. చిత్రాన్ని జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా, స్నేహ దాసరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.‘ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇస్తాం’అని మేకర్స్ తెలిపారు. -
గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ
దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాము రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. రెండోసారి దీపికా ప్రెగ్నెన్సీతో ఉందన్న శుభవార్తను పంచుకున్నారు. ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ముద్దుల కూతురు దువా పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు.కాగా.. వీరిద్దరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకు దువా అని నామకరణం చేశారు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న దీపికా, రణవీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలో ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే రణ్వీర్ ప్రస్తుతం 'ధురందర్ 2' మూవీతో మరో బ్లాక్బస్టర్ అందుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఇకపోతే దీపిక సైతం చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఆమె ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన 'కింగ్' చిత్రంలో నటించనుంది. అంతేకాకుండా అల్లు అర్జున్తో రాకా మూవీలోనూ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
బాక్సాఫీస్ వద్ద దురంధర్-2 హవా.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 వసూళ్లను అధిగమించింది. విడుదలైన 31 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1,749.01 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.'ధురంధర్ 2: ది రివెంజ్' ఇండియా వ్యాప్తంగా రూ.1329.31 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.419.70 కోట్ల వసూలు చేసింది. ఈ వసూళ్లతో రూ.1,742 కోట్లు సాధించిన 'పుష్ప 2' చిత్రాన్ని అధిగమించింది. ఓవరాల్గా దురంధర్-2 ఇండియాలో అత్యధిక వసూళ్ల జాబితాలో మూడోస్థానం సొంతం చేసుకుంది. తొలి స్థానంలో అమిర్ ఖాన్ దంగల్ ఉండగా.. రెండో ప్లేస్లో రాజమౌళి బాహుబలి-2 కొనసాగుతోంది. దురంధర్-2 వసూళ్లు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బాహుబలి-2 రికార్డ్ సైతం బ్రేకయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాకిస్తాన్ స్పై నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, మానవ్ గోహిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. -
అలాంటి పాత్రలు చేయడమంటే ఇష్టం.. ఛాంపియన్ బ్యూటీ..!
ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందుకు ఫర్ఫెర్ట్ ఎగ్జాంపుల్ అనస్పర రాజన్. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తెలుగు, తమిళం, హిందీ అంటూ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మాతృభాష మలయాళంలో ఉదహరణం సుజాత అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ 9 ఏళ్లలోనే 30కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు.ఇటీవల తమిళంలో హీరోయిన్గా నటించిన విత్లవ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో కళాశాల విద్యార్థినిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఇట్లు అర్జున, తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 7 జీ రెయిన్బో కాలని చిత్రాలతో పాటు మలయాళంలో ఓ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా అనస్పర రాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఛాలెంజింగ్ కథా పాత్రల్లో నటించడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఎలా ఇలాంటి పాత్రల్లో నటించారు అని చర్చించుకునే విధంగా బలమైన పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు. తనకు ఛాలెంజ్లను ఎదుర్కొవడం ఇష్టం అన్నారు. అలాంటి వైవిద్యభరిత కథా పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు ఇప్పటి వరకూ నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేశారు. ఈ 23 ఏళ్ల బ్యూటీ ముందు ముందు ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే. -
పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స
సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pavan Kalyan)కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. శుక్రవారం ఉదయం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు.2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
తెలుగు మాస్ సాంగ్తో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం.. వీడియో వైరల్
ఐపీఎల్ సందడి మామూలుగా ఉండదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటే తెలుగువారికి పూనకాలే. అది కూడా హైదరాబాద్లో మ్యాచ్ జరిగితే ఆ జోష్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని ఉన్న సీఎస్కే టీమ్తో మ్యాచ్ అంటే క్రేజ్ వేరే లెవెల్. ఈ క్రేజీ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సీఎస్కే తలపడగా.. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే ఈ మ్యాచ్లో తెలుగు సాంగ్స్ క్రికెట్ ప్రియులను ఊర్రూతలుగించాయి. ముఖ్యంగా నాని మూవీ ప్యారడైజ్ సాంగ్ స్డేడియాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్ మధ్యలో పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ అనే పాటను ప్లే చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్కు ఏకంగా పూనకాలతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ప్యారడైజ్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉప్పల్ రోర్స్ విత్ ఆయా షేర్ మానియా అంటూ వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో కేవలం తెలుగులోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. కాగా.. నాని హీరోగా వస్తోన్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సూపర్హిట్గా నిలిచింది. మరోసారి వీరిద్దరు కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. Nannu peekuthava...Jumbalikay aayasher 💥💥Uppal Stadium roars with #AayaSher mania🧡 pic.twitter.com/T9WIePBKzN— THE PARADISE (@TheParadiseOffl) April 18, 2026 -
ఇద్దరితో బ్రేకప్.. పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ..!
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళంతో పాటు తెలుగులో సినిమాలు చేసింది. చివరిసారిగా రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీలో కనిపించింది. ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సినిమాలతో కాకపోయినా.. వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.అయితే గతంలో బాయ్ఫ్రెండ్తో విడిపోయిన ముద్దుగుమ్మ.. సింగిల్గానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ గురించి కోలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. శృతి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన వాడితోనే మూడుముళ్లకు రెడీ అయినట్లు లేటేస్ట్ టాక్. వరుడిని కోసం ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూడగా.. అవీ వారికి నచ్చలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్కు మ్యారేజ్ చేయాలని కమల్ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో లండన్కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ బ్రేకప్ అయింది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. -
గ్రామంలో రహస్యం
సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ సినిమాకు ‘హ్యాష్ట్యాగ్ 418 ది ఫిల్మ్’ అనే టైటిల్ ఖరారైంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకానికీ అర్థం కాని ఒక రహస్యంతో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని ఓ సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీజీ వెంకీ. -
లేట్ అయినా లేటెస్ట్గా...
చిత్ర పరిశ్రమలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటిస్తుంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, ఔట్పుట్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు ఒక్కోసారి ఉండక పోవచ్చు.షూటింగ్స్ ఆలస్యం, పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్ఎక్స్, డేట్స్ క్లాష్... వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయింది. ఏది ఏమైనా కానీ కంటెంట్, ఔట్పుట్, క్వాలిటీ... ఇలా ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ లేట్ అయినా లేటెస్ట్గా వస్తాం అంటున్నారు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న కొందరు దర్శక–నిర్మాతలు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ఎన్టీఆర్ ‘ఎన్టీఆర్నీల్’, రామ్చరణ్ ‘ పెద్ది’, నాని ‘ది ప్యారడైస్’, అఖిల్ ‘లెనిన్’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ వంటి సినిమాల విడుదల తేదీలు ముందే ఖరారు అయినప్పటికీ వాయిదా పడ్డాయి. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... విశ్వంభర ఎప్పుడు? చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదలను వాయిదా వేశాం’’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి విడుదల వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ రిలీజ్ కాలేదు. 2025 మే 9న సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ రాలేదు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్కి ప్రాధాన్యం ఉందట. ఈ పనుల ఆలస్యం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన పుట్టినరోజున (ఆగస్టు 22) చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేసి, ‘‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే వేసవి మొదలైనప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరి... ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెన్నడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు. జూన్లో ఎన్టీఆర్ నీల్? ‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫొటోని ఇటీవల ఆయన షేర్ చేయగా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ పిక్ వైరల్గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట, హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు రూ. 15 కోట్ల తో ఎన్టీఆర్ ఇంటి సెట్ని నిర్మించడం హైలెట్గా మారాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి సినిమాని రిలీజ్ చేయడం లేదని యూనిట్ ప్రకటించింది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి. జూన్లో పెద్ది రెడీరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండి యన్ మూవీ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ కోసం రామ్చరణ్ ఫుల్æమాస్ లుక్లోకి మారి పోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి అద్భుతమైన స్పందన వచ్చింది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి..., రై రై రారా...’ పాటలు చార్ట్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన రామ్ చరణ్ శక్తివంతమైన కొత్త పోస్టర్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే... రామ్చరణ్ బర్త్ డే కానుకగా 2026 మార్చి 27న ‘పెద్ది’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ రెండోసారి వాయిదా వేశారు.జూన్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘మాపై మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్తో వస్తాం. విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ‘పెద్ది’ చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్, నేపథ్య సంగీతం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టులో ప్యారడైస్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో నానీని ఫుల్ మాస్ లుక్లో చూపించారు శ్రీకాంత్ ఓదెల. కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ మూవీలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషి స్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే కారణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఉండక పోవచ్చనే చర్చ జరిగింది కూడా. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయినప్పటికీ టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందుకే లేట్ అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా లేటెస్ట్గా ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ఆలోచన.ఇదిలా ఉంటే.. ఆగస్టు 21న ‘ది ప్యారడైస్’ రిలీజ్ డేట్కి వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసొస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీ ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి నానీపై ఇప్పటికే విడుదల చేసిన ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్కి అద్భుతమైన స్పందన వచ్చింది. లెనిన్ డేట్ ఫిక్స్అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్లోకి మారి పోయారు అఖిల్. పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో మేకోవర్ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. పైగా రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా...’కి చాలా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఈ నెల 16న ఈ మూవీలోని ‘ఎట్టా ఎట్టా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్గా నిలిచింది. అఖిల్ తన మాస్ స్టెప్స్తో అదరగొట్టగా, భాగ్యశ్రీ తన చార్మ్తో మెప్పించారు. ఇదిలా ఉంటే... ‘లెనిన్’ని మే 1న విడుదల చేయనున్నట్లు తొలుత అధికారికంగా ప్రకటించింది యూనిట్. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ విడుదలను మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ లెక్కన చూస్తే ఇటు ‘పెద్ది’, అటు ‘లెనిన్’ సినిమాలు జూన్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్’. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. మా మూవీ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మేలో స్వయంభు ‘కార్తికేయ 2’ (2022) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు అదే స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తొలుత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రిలీజ్ని పోస్ట్ పోన్ చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని చిత్రయూనిట్ స్పష్టం చేయాలి. వార్తల్లో ఉన్న ప్రకారం మేలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారాయన. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాక పోవడంతో రిలీజ్ వాయిదా పడిందని ఫిల్మ్నగర్ టాక్.ఈ మూవీని 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ‘‘దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్ను ‘స్వయంభు’లో భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ‘స్వయంభు’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. సంబరాలు ఎప్పుడు?సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ రూపొందించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్గా మేకోవర్ అయ్యారు. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు జరిగే అవకాశం లేక పోలేదు. – డేరంగుల జగన్ మోహన్ -
సినిమా నిలబడాలి: కిరణ్ అబ్బవరం
‘‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచి ప్రయత్నం చేశారంటూ ఇండస్ట్రీ పెద్దలు, ఇతరులు ప్రశంసించడం హ్యాపీగా ఉంది’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. సాయి తేజ్ హీరోగా, వేద జలంధర్ హీరోయిన్గా వి. మునిరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సుమైర స్టూడియోస్తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన ఒక్క రోజులోనే ఇందులో నటించిన ఐదారుగురికి అవకాశాలు రావడం హ్యాపీ. నెక్ట్స్ కూడా కొత్తవాళ్లతోనే చేస్తాను. కొత్తవాళ్లు రావాలి, సినిమా నిలబడాలి’’ అన్నారు. ‘‘మేము థియేటర్స్కి వెళ్లినప్పుడు మా సినిమాలోని పాత్రల పేర్లను ప్రేక్షకులు పలుకుతున్నారు. పాత్రలన్నీ ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యాయనేందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి’’ అని మునిరాజు చెప్పారు. ‘‘మా ప్రయత్నం విజయవంతమైందనే నమ్మకం కుదిరింది’’ అన్నారు వేద. ‘‘మాలాంటి కొత్తవాళ్లకు ధైర్యాన్నిచ్చిన సక్సెస్ ఇది’’ అని సాయి తేజ్ తెలిపారు. -
‘ది బ్రేకింగ్ న్యూస్’ కోసం ఎదురు చూస్తున్నా : చిరంజీవి
ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రేకింగ్ న్యూస్’. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్ని ఇంత అగ్రెసివ్గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసించారు. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, ‘ది బ్రేకింగ్ న్యూస్’ ఒక మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్గా రూపొందుతోంది. ఈ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. -
‘ఓ అందాల రాక్షసి’ మళ్లీ వచ్చేస్తోంది
షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను’ అని తెలిపారు.ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. చిత్రంలో విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, షెరాజ్ మెహదీ, నేహా దేశ్పాండే, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం. -
300 సినిమాలు చేశా.. నాలో ఉన్న లోపం ఏంటి?.. : సుమన్ శెట్టి ఎమోషనల్
ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్ కూడా దొరకనంత బిజీ కమెడియన్ అయిపోయాడు. దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్.. సడెన్గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్బాస్ షోతో మళ్లీ సుమన్ శెట్టి ఫామ్లోకి వచ్చాడు. బిగ్బాస్ 9వ సీజన్లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్ అయ్యాడు. బిగ్బాస్ తర్వాత ఆయన కెరీర్ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. 300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్ ఎమోషనల్ అయ్యాడు. -
కాళ్లకు మెట్టెలతో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటలకు పైనే!
మొన్నటిదాకా పెళ్లి, బడ్డీమూన్ అంటూ పర్సనల్ లైఫ్ని ఆనందంగా గడిపినన రష్మిక, విజయ్ దేవరకొండ..ఇప్పుడు కెరీర్పై ఫోకస్ పెట్టారు. ఇద్దరూ తమ కొత్త సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు. రష్మిక అయితే తన ఫోకస్ అంతా ‘మైసా’పైనే పెట్టింది. ఈ చిత్రం కోసం ఆమె మానసికంగానే కాకుండా శారీరకంగానూ కష్టపడుతుంది.ఇన్నాళ్లు రొమాంటిక్, కమర్షియల్ పాత్రలకే పరిమితం అయిన రష్మిక..ఇప్పుడు యాక్షన్ అవతారం ఎత్తింది. మైసాలో ఆమెకు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అందుకే సవాళ్లతో కూడా శిక్షణను తీసుకుంటుంది. దాని కోసమే తాజాగా రష్మిక బ్యాంకాక్ వెళ్లింది. అక్కడ అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ నేతృత్వంలో, అలాగే ప్రఖ్యాత జైకా స్టంట్ టీమ్తో కలిసి మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్లో శిక్షణ పొందుతోందట. దీని కోసం రష్మిక రోజుకు దాదాపు 8 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుందట. కాళ్లకు మట్టెలు ధరించి.. ప్రాక్టీస్ చేస్తున్న రష్మిక ఫోటోలు ఇప్పుడు నెటింట వైరల్గా మారాయి. మైసా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు. అన్ఫార్ములా ఫిలింస్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమాలో గోండు జాతి హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక నటించబోతుందని సమాచారం.Rashmika ma'am training 8 hours a day in Bangkok for a stunt sequence in #Mysaa. Can't wait to watch it on the big screen @iamRashmika #RashmikaMandanna pic.twitter.com/SEa2iPqC4q— Rashmikamandannafan (@Geethamadam) April 18, 2026 -
ఆ సినిమా వల్ల అంత నెగెటివ్ అవుతాననుకోలేదు : రాశి
నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా నా ఉద్దేశం.నెగెటివ్ రోలా? పాజిటివ్ క్యారెక్టరా? అనేది నేను పట్టించుకోను. పాత్ర నచ్చితే చేసేస్తా’ అని అన్నారు సినీయర్ నటి రాశి. ఆమె కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. తీరువీర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాశి హీరో తల్లి పాత్ర పోషించింది. చాలా కాలం తర్వాత రాశి తెరపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ‘నిజం సినిమాలో నెగెటివ్ రోల్ చేయడంతో హీరోయిన్గా అవకాశాలు కోల్పోయారు కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అవును. ఆ పాత్ర అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదన్నారు. ‘ఎలాంటి పాత్ర కావాలనేది నేను నిర్ణయించుకోలేదు. దర్శకులే వచ్చి..‘మిమ్మల్ని అనుకోనే ఈ పాత్ర రాశాను’ అంటారు. ఆ పాత్ర నచ్చితే చేస్తా. అంతేకాని అది నెగెటివ్ రోలా? పాజిటివ్ రోలా? అనేది చూడను. నటి అన్నాక.. ఓ నటిగా అన్నిరకాల షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేయాలి. ఆ ఉద్దేశంతోనే ‘నిజం’లో నటించా. కానీ, ఆ పాత్ర అంతగా నెగెటివ్ అవుతుందని అనుకోలేదు. ఇకపై ఏ రోల్ అయినా ప్రేక్షకులు అంగీకరించేవిధంగా ఉంటేనే చేస్తాను’ అని రాశి అన్నారు. కాగా, తేజ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘నిజం’ సినిమాలో రాశి నెగెటివ్ పాత్ర చేసింది. విలన్గా నటించిన గోపిచంద్కి ప్రియురాలి పాత్ర అది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే రాశి అలాంటి పాత్ర చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్గా చాన్స్ రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగానే ‘పాపం ప్రతాప్’ మూవీ చేసింది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు. -
జగమెరుగని జగ్గయ్య బహుముఖ ప్రతిభ
అది 1975 సంవత్సరం... కర్నూల్ మెడికల్ కాలే జీలో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కాలేజీ వార్షికోత్సవానికి నేను మద్రాసు వెళ్లి జగ్గయ్యగారిని ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది. అదే ఆయనతో నా మొదటి పరిచయం. ఆయనంటే నాకు వల్లమాలిన అభిమానం. నేను 1983లో విజయవాడలో సైకియాట్రిస్టుగా ప్రాక్టీస్ ప్రారంభించిన తరువాత జగ్గయ్యగారు బెజవాడ వచ్చినప్పుడల్లా కలిసేవాడిని.నేను రచించిన ‘మనో దర్పణం’ మనోవైజ్ఞానిక గ్రంథాన్ని 1996లో విజయవాడ బుక్ ఫెస్టివల్లో ఆవిష్కరించేందుకు నా కోరిక మేరకు ఆయన మద్రాసు నుండి రావడం నా పైన, సాహిత్యం పైన ఆయనకున్న అభిమానానికి తార్కాణం. ఆయన చివరి వరకు చెన్నై వెళ్లినప్పుడల్లా మేం కలిసి పలు విషయాలు ముచ్చటించుకునేవాళ్లం. ఒక డాక్టర్గానే కాకుండా రచయితగా సాహిత్యం పైన మక్కువ ఉన్న వ్యక్తిగా నన్ను ఆయన ఇష్టపడేవారు. అదే నాకు, జగ్గయ్యగారికి ఉన్న సాహితీ బంధం.ఇది జగ్గయ్య శతజయంతి సంవత్సరం1926 డిసెంబర్ 31న జన్మించిన జగ్గయ్య 2004 మార్చి 4న మరణించారు. జగ్గయ్య చలనచిత్ర నటుడిగానే అందరికీ తెలుసు కానీ, మిగతా ఏ నటులకు లేనన్ని బహుముఖ ప్రతిభలు ఆయనకే సొంతం. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో ‘ప్రియురాలు’ (1952) సినిమాతో ప్రారంభమైన ఆయన దాదాపు 500 సినిమాల్లో నటించారు. ‘కుంతీపుత్రుడు’ (1993) ఆయన చివరి చిత్రం. జగ్గయ్య నిర్మించి, నటించిన ‘పదండి ముందుకు, కీలు బొమ్మలు’ చిత్రాలు అటు మాస్కో, కార్క్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ప్రశంసలు అందుకు న్నాయి. జగ్గయ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్, సాఫ్ట్ విలన్ రోల్స్ వేస్తే అసలు హీరో కనబడకుండా పోయేవాడని ఆ కాలంలో ప్రతీతి. పాలిష్డ్ విలన్ రూపకర్తతెలుగు సినిమాల్లో ‘పాలిష్డ్ విలన్’ పాత్రలకు మొదట రూపకల్పన చేసింది జగ్గయ్యే! అసాధారణ సాత్విక భావ ప్రకటన, ఉచ్చారణ వైవిధ్యం ఆయన్ను తెలుగు సినీ రంగంలో ప్రత్యామ్నాయం లేని నటుడిగా నిలబెట్టాయి. హీరో అంటే స్టెప్పులు, డాన్స్, స్టంట్స్ కాకుండా నిజజీవితంలో ఒక హీరో ఎలా ఉండాలో అలాగే సినిమాల్లో కూడా హీరో పాత్ర సహజంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం.సావిత్రి, జమున సినిమాల్లోకి రాకముందు నాటక రంగానికి వారిని పరిచయం చేసింది జగ్గయ్యే! అలాగే ప్రముఖ హీరో కృష్ణను (actor krishna) ‘తేనె మనసులు’ చిత్రానికి ముందే జగ్గయ్య తాను 1962లో నిర్మించిన ‘పదండి ముందుకు’ ద్వారా పరిచయం చేసినది బహుశా చాలామందికి తెలియని విషయం. ఇక కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’లోని రూథర్ ఫోర్డ్ పాత్రలో జగ్గయ్య నటన అమితంగా ఆకట్టుకుంది. ఇంకా జగ్గయ్య తెలుగుకి పరిచయం చేసినవారిలో కన్నడ నటి భారతి, నటుడు శ్రీధర్ ఉన్నారు. సంగీత దర్శకుడు కోదండపాణిని ‘పదండి ముందుకు, కన్న కొడుకు’ చిత్రాల ద్వారా పరిచయం చేసింది, ఇంకా పలువురు రచయితలను పరిచయం చేసిన ఘనత జగ్గయ్యదే.టీచర్ నుంచి న్యూస్ రీడర్గా...దుగ్గిరాల స్కూల్లో టీచర్గా ప్రారంభమైన జగ్గయ్య కెరీర్ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా వెళ్లడంతో జర్నలిస్ట్గా మలుపు తిరిగింది. ‘వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య’ అనగానే ఆయన కంచు కంఠానికి అందరూ చెవులప్పగించేవారు. శివాజీ గణేశన్ (Sivaji Ganesan) నటించిన అన్ని తమిళ చిత్రాలకు తెలుగులో జగ్గయ్యే డబ్బింగ్ చెప్పారు. ఇక నాటక రంగానికి వస్తే చిన్న వయస్సు నుండే రంగస్థలం మీద నటుడిగా– దర్శకుడిగా రాణించారు. షేక్స్పియర్ ఇంగ్లిష్ నాటకాలను అనువదించి, ప్రదర్శించేవారు కూడా. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏలో సహవిద్యార్థి అయిన ఎన్టీఆర్, ముక్కామల, శివరావులతో కలిసి పలు నాటకాలు ప్రదర్శించారు.చిన్న వయసులోనే రచయితగా...జగ్గయ్య తన 14వ ఏట నుండి కవితలు, నాటికలు రాయటం మొదలుపెట్టారు. ఆ చిన్న వయసులోనే హంపి వెళ్లి అక్కడి శిధిలావస్థను చూసి, చలించి తన స్వదస్తూరితో రాసుకున్న పద్యాలలో మచ్చుకు ఒకటి. విశ్వకవి రవీంద్రుడి ‘గీతాంజలి’ని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించి అందరి ప్రశంసలు అందుకున్నారు జగ్గయ్య. రాజకీయాలపై ఉన్న మక్కువతో ‘రాజకీయ విజ్ఞాన కోశం’గ్రంథాన్ని రాశారు. ‘దేశాభిమాని’ పత్రికకు 1944లో సబ్ ఎడిటర్గాను, ‘ఆంధ్రా రిపబ్లిక్’ అనే ఆంగ్ల పత్రికకు ఎడిటర్గాను బాధ్యతలు నిర్వహించారు. లోక్సభకు ఎన్నికైన తొలి నటుడుమొదటి నుండి జగ్గయ్యకు రాజకీయాలంటే మక్కువ. ఆచార్య నరేందర్ దేవ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఉంటూ తదుపరి 1958లో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 1962 జనరల్ ఎలక్షన్స్ లో తెనాలి లోక్సభ నుండి ఆచార్య ఎన్జీ రంగా మీద పోటీకి కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యను నిర్ణయించగా, ఆయన్ను నాటి ప్రధాని నెహ్రూ ఢిల్లీకి రప్పించి, రంగా మీద పోటీ వద్దని వారించారు.కమ్యూనిస్టుల చేతిలో రంగా ఎలాగైనా ఓడిపోతారని జగ్గయ్య చెప్పినా, రంగా ఓటమికి కాంగ్రెస్ పార్టీ కారణం కాకూడదు, రంగా లాంటివారు పార్లమెంటుకు రావడం అవసరం అని జగ్గయ్యను పోటీ నుంచి విరమింపజేశారు నెహ్రూ. తదుపరి 1967 ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నుండి జగ్గయ్య కమ్యూనిస్టు అభ్యర్థిపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి భారత దేశంలోనే సినీ రంగం నుండి లోక్సభకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డ్కి ఎక్కారు.చిత్రకారుడుగానూ...జగ్గయ్య మంచి చిత్రకారుడు కూడా. అడవి బాపిరాజు (Adivi Baapiraju) దగ్గర శిక్షణ పొంది పలు చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులు కూడా అందుకున్నారు. ఇన్ని రంగాల్లో ఉంటూ కూడా సినీ కార్మికుల సంక్షేమం కోసం దక్షిణ భారత సినీ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయనకు వాస్తు శాస్త్రంపై మక్కువ ఎక్కువ. అయితే మూఢనమ్మకాలతో ఇల్లు గుల్ల చేసుకోకుండా వాస్తును శాస్త్రీయ కోణంలో మాత్రమే చూసి ఆచరించాలనేవారు.ఆత్రేయతో అనుబంధంఆచార్య ఆత్రేయ (Acharya Aatreya) అంటే జగ్గయ్యకు వల్ల మాలిన అభిమానం. ఆత్రేయ గురించి ‘మాది మనసులు కలిసిన అనుబంధం’ అనేవారు. ఆత్రేయ కడపటి కోర్కెను తీర్చడం కోసం ‘మన స్విని ట్రస్టు’ తరపున జగ్గయ్య సంపాదకత్వం వహించి, ప్రచురించిన ‘ఆత్రేయ సాహితి’ ఏడు సంపుటాల సెట్ జగ్గయ్యకు ఆత్రేయతో ఉన్న అనుబంధానికి ఒక నిదర్శనం. ‘మనస్విని’ సంస్థ ఎంపిక చేసిన పాటలకే పలుమార్లు ప్రభుత్వ నంది అవార్డులు కూడా రావటం ఆయన ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా జరిగే ఎంపికే అన్నది పరిశీలకుల అభిప్రాయం. అభిమాన సంఘాలకు, ప్రచారాలకు, ఆర్భాటాలకు ఆమడ దూరం ఉండేవారు. 1992లో పద్మ భూషణ్ తెనాలి ఆర్ట్స్ కాలేజీకి, వరంగల్ మెడికల్ కాలేజీకి, మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు ఉదారంగా విరాళమిచ్చారు. పురస్కారాల విష యానికొస్తే.. 1967లో అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుండి ‘కళావాచస్పతి’ పురస్కారం, 1991లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 1992లో తెలుగు చిత్రసీమలో నేరుగా పద్మభూషణ్ గౌరవాన్ని రాష్ట్రపతి నుండి పొందిన ఘనత జగ్గయ్యదే.ప్రతిభలు అనేకంజనానికి తెలియని జగ్గయ్య బహుముఖ ప్రతిభలు అనేకం. ఆయన కేవలం నటుడే కాదు గొప్ప సాహితీవేత్త, మంచి ఉపన్యాసకుడు, అధ్యాపకుడు, రాజకీయ నాయకుడు, ట్రేడ్ యూనియనిస్ట్, చిత్రకారుడు, రేడియో ప్రవక్త, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే జగ్గయ్య ఇన్ని కళల్లో ఆరితేరినా ఆయన ప్రేమించినది సాహిత్యాన్ని, పెళ్ళాడింది నటనను. ఒక సందర్భంలో మిమ్మల్ని అభిమానించే వారికి మీరు ఇచ్చే సందేశం అని అడగ్గా ‘బ్రతుకు మనకీయబడిన వరమ్ము... తిరిగి పరులకిచ్చిననే దాని ఫలము దక్కు’ అని రవీంద్రుని సూక్తి రూపంలో చెప్పారు. ఇలాంటి బహుముఖ ప్రతిభగల మహోన్నత వ్యక్తి కొంగర జగ్గయ్యకి ఆయన శతజయంతి సందర్భంగా నా దివ్యాంజలి!– డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, విజయవాడ ప్రముఖ మానసిక వైద్యులు, రచయితindlas2@gmail.com -
యాక్షన్... థ్రిల్
‘‘పరమపద సోపానం’ ట్రైలర్ గ్రిప్పింగ్గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనిపించింది. దర్శకుడు నాగ శివ ప్రతిభ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జోడీగా నటించిన చిత్రం ‘పరమపద సోపానం’. నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ని శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
డేట్ ఫిక్స్
థియేటర్స్లో జెట్లీ రాక ఖరారైంది. సత్య, రియా సింఘా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జెట్లీ’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించారు.ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. -
ఆట పూర్తి
‘ఐ యామ్ గేమ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.ఈ చిత్రంలో కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు – దర్శకుడు మిస్కిన్, కదిర్, పార్థ్ తివారీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘‘ఈ ఏడాది ఓనమ్ పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్
తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన హీరో.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రాశి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ స్టోరీ చెప్పినప్పుడు నా పక్కన మొదట అజయ్ అనుకున్నానని రాశి తెలిపింది. టాలీవుడ్లో నాకు హైట్ ఎక్కువగా ఉండే అజయ్ మాత్రమే తెలుసని వెల్లడించింది. కానీ సెట్లో బయటికి వచ్చి అజయ్ కోసం వెతుకుతున్నా.. కానీ అక్కడే అజయ్ ఘోష్ చైర్లో కూర్చుని కనిపించారు. అజయ్ ఘోష్ని చూసి.. నాకు మావయ్య క్యారెక్టర్ ఏమోనని అనుకున్నానని రాశి చెప్పింది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యానని అన్నారు. కానీ అజయ్ ఘోష్ అద్భుతంగా చేస్తారని రాశి కొనియాడింది. ఫస్ట్ టైమ్ ఆయనతో పని చేశానని తెలిపింది. సింగిల్ టేక్లో సీన్ చేయడం ఆయనకే సాధ్యమన్నారు రాశి. స్టోరీ చెప్పినప్పుడు నాకు పక్కన అజయ్ అనుకున్నా. సెట్ లో అజయ్ ఘోష్ ని చూసి అతను నాకు మావయ్య క్యారక్టర్ ఏమో అనుకున్నా. ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యా.- Actress Raasi#PapamPrathap Thank You Meet pic.twitter.com/9769n5f7TT— idlebrain.com (@idlebraindotcom) April 17, 2026 -
తెరచాప మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో వచ్చిన చిత్రం తెరచాప. ఈ మూవీకి జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్పై కైలాశ్ దుర్గం నిర్మించారు. ఈ రోజు ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అసలు కథేంటంటే..సమాజంలో తన ప్రజల కోసం పోరాడే నాయకుడైన కాశీ బాబు (నాగ మహేష్) అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడు. తనను ఎంతో ప్రేమించే తండ్రి కొడుకు నిర్లక్ష్య స్వభావం వల్ల చనిపోయాడని అందరూ అంటారు. అయితే తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టడానికి ఈశ్వర్ (నవీన్ రాజ్) ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) పాత్ర ఏంటి? ఆనంద్ రాజు (రాజీవీ కనకాల), పుష్ప ఫేమ్ కేశవ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే..సముద్ర బ్యాక్డ్రాప్లో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మత్స్యకారుల నేపథ్యం ఉన్న కథ అని ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయితే ఈ కథలో తండ్రి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ జోయెల్ జార్జ్. తాను అనుకున్న కథను ఎక్కడా మిస్సవకుండా తెరపై ఆవిష్కరించాడు.సెకండాఫ్లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారేమో అనిపిస్తాయి. దర్శకుడు తీసుకున్న కథనం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. మధ్య మధ్యలో కనిపించే రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్తా చిరాకు తెప్పిస్తాయి. మొత్తానికి స్క్రీన్ప్లేలో లోపాలు ఈ కథకు పెద్ద మైనస్. ఓవరాల్గా ఓ ఆకట్టుకునే వాస్తవిక డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. . ఈ వీకెండ్కు తెరచాపను ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..గ్రామీణ యువకుడి పాత్రలో నవీన్ రాజ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మత్స్యకారుడిగా ఆయన లుక్ చాలా సహజంగా.. పాత్రకు తగినట్లుగా ఉంది. శ్రీలు, పూజా సుహాసిని తమ పాత్రల్లో మెప్పించారు. రాజీవ్ కనకాల, నాగ మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేశవ బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే ప్రజల్ కృష్ణ అందించిన సంగీతం బాగుంది.. ఎంఎల్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. అజీమ్, వెంకట్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. రాజు బోదాసింగి ఎడిటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.రేటింగ్: 2.5/5 -
స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..!
కొత్త లోకా మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్ లాంటి రిలేషన్స్ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్కు తెరపడింది. -
'సెట్లో నేను ఏడ్చిన సందర్భం అదొక్కటే'.. హన్సిక కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ దేశముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అమాయకపు మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణమని ప్రశంసలు కురిపించింది. తాను ఓ మూవీ సెట్లో ఏడ్చిన సందర్భం నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముదురు సెట్లో టీమ్తో సెండాఫ్ టైమ్లో ఏడ్చేశానని హన్సిక తెలిపింది. ఆ తర్వాత ఏ మూవీ సెట్లోనూ తాను ఏడ్వలేదని చెప్పింది. కాగా.. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన దేశముదురు చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్కు జంటగా హన్సిక హీరోయిన్గా నటించింది. Hansika Motwani says, “The only time I CRIED ON SET was ‘DesaMuduru’.”“#AlluArjun is an amazing person and very respectful. He has a Natural Charm of being a friend. I remember I cried on set for a Crew during #DesaMuduru, After that, I never cried for leaving any film set.” pic.twitter.com/Xx3dxdta4D— Whynot Cinemas (@whynotcinemass_) April 17, 2026 -
చియాన్ విక్రమ్ కొత్త సినిమా.. టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తంగలాన్ తర్వాత మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లో 63వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ చియాన్ విక్రమ్ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫ్లేమ్ పేరుతో ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. What starts as a FLAME ends in a BLAZE 🔥 #Chiyaan63 FIRST FLAME out now ▶️ https://t.co/2FnD5WetinWishing the one and only #ChiyaanVikram a very happy birthday!#CookingStartsNow #Chiyaan63FirstFlame@SathyaJyothi @chiyaan @anandshank @Music_Santhosh @RDRajasekar @arjun1on… pic.twitter.com/w6UTCR34tP— Sathya Jyothi Films (@SathyaJyothi) April 17, 2026 -
హీరోయిన్ రాశీ ఖన్నాకు చేదు అనుభవం..!
హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్లోని వానిటీ వ్యాన్లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.ఈ చోరీతో మూవీ సెట్స్లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్లతో కనిపించనుంది. -
‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ
సిల్వర్స్క్రీన్ మీదే కాదు వెబ్ స్క్రీన్ మీద కూడా మైథలాజికల్ కంటెంట్కి కూడా రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి కథను చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద పిల్లల వరకు అందరూ ఆసక్తికరంగా చూస్తారు. అందుకే మన దర్శకనిర్మాతలు మైథలాజికల్ టచ్తో డిఫరెంట్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వెబ్ సిరీసే పోచమ్మ. అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, అర్జున్ అంబటి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నేటి(ఏప్రిల్ 17) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వ్యాపారవేత్త ఫెడ్రిక్(రమేశ్ ఇందిరా) అరకులో కొత్తగా ఓ కాఫీ ఎస్టేట్ కొనుగోలు చేస్తాడు. ఒకప్పటి ఆ ఎస్టేట్ ఓనర్ రఘుపతి(అచ్యుత్ కుమార్).. ఆర్థిక సమస్యలతో దాన్ని ఫెడ్రిక్కి అమ్మి, అందులోనే మేనేజర్గా పని చేస్తాడు. ఫెడ్రిక్ ఆ బంగ్లాలోకి రాగానే.. ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేయిస్తాడు. ఆ తర్వాత వారింట్లో సమస్యలు మొదలవుతాయి. ఫెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ(స్నేహల్ కామత్) అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. ఆమె చావుకు రఘుపతి కొడుకు సురేశ్ కారణమని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా(ప్రియా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక ఇవా భర్త డేవిడ్(అర్జున్ అంబటి) కూడా ఉన్నట్లు అనుమానిస్తారు. ఊరువాళ్లు మాత్రం పోచమ్మ విగ్రహం తొలగించినందుకే.. అమ్మ ఆగ్రహించి జెస్సీని చంపేసిందని నమ్ముతారు. అసలు జెస్సీ ఎలా చనిపోయింది? ఆమె చావుకు అసలు కారకులు ఎవరు? దేని కోసం చేశారు? పోచమ్మ విగ్రహం తొలగించిన తర్వాత ఫెడ్రిక్ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? చివరకు ఫెడ్రిక్కి తెలిసిన నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇదొక మర్డర్ మిస్టరీ. దానికి మైథాలజీ ఎలిమెంట్ను యాడ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్ని తీర్చిదిద్డాదు దర్శకుడు రమేష్ ఇందిరా. తక్కువ నిడివితో మొత్తం ఐదు ఎపిసోడ్స్గా ఈ సిరీస్ని తెరకెక్కించారు. జెస్సీ చనిపోయే సన్నివేశంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ మరణం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్..కథపై ఆసక్తిని పెంచుతుంది. జెస్సీ చావుకు కారణం ఏంటనేది చివరి వరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. రెండో ఎపిసోడ్లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నా.. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే సీన్ మాత్రం కాస్త ఎమోషనల్గా ఉంటుంది. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొత్త కొత్త విషయాలు బయటకు రావడం.. మరోవైపు పోచమ్మకు సంబంధించిన సీన్లతో ఐదు ఎపిసోడ్లను ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. అయితే థ్రిల్లర్ సిరీస్లు చూసే ఆడియెన్స్ మాత్రం విలన్ ఎవరు అనేది ఈజీగానే కనిపెట్టగలరు. రూపాలు వేరైనా దేవుళ్లు అందరూ ఒక్కటే అంటూ సిరీస్ని ముగించిన తీరు బాగుంది. తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటీనటులు ఉండడం.. కథనం కొంతమేర ఊహకందేలా సాగడం ఈ సిరీస్కి మైనస్. అలాగే పోచమ్మకు సంబధించిన సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం ఈ సిరీస్కి ప్లస్ పాయింట్. థ్రిల్లర్స్ని ఇష్టపడేవారికి ‘పోచమ్మ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సిరీస్కి రమేశ్ ఇందిరా దర్శకత్వం వహించడమే కాకుండా.. కీలకమైన ఫెడ్రిక్ పాత్రను కూడా పోషించాడు. కాఫీ ఎస్టెట్ ఓనర్గా ఆయన లుక్, బాడీ లాంగ్వేజీ చక్కగా కుదిరింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న డేవిడ్ పాత్రలో అర్జున్ అంబటి ఒదిగిపోయాడు. నిడివి తక్కువే అయినా.. ఆయన పాత్ర గుర్తిండిపోతుంది. ఇక జెన్సీగా స్నేహిల్ గ్లామర్గా కనిపిస్తూనే..తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇవా పాత్రకి ప్రియా న్యాయం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అచ్యుత్ కుమార్ రోల్ గురించి. రఘుపతి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. చివరిలో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. ఇంకా ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 రిలీజై నెల రోజులవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మార్చి 19న విడుదలైన దురంధర్-2 వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఇప్పటికే రెండు పార్టులు కలిపి రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాలు ఇండియన్ సినిమా గతినే మార్చేశాయి. తాజాగా దురంధర్-2 మూవీ అరుదైన రికార్డ్పై కన్నేసింది.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 అల్ టైమ్ వసూళ్ల రికార్డ్కు అతి చేరువగా వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,742.10 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ దురంధర్ రూ. 1,737.74 కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. అంటే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనకంజలో ఉంది. ఈ మూవీ 5 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే పుష్ప-2 రికార్డ్ను బ్రేక్ చేయనుంది. ఈ జాబితాలో అమిర్ ఖాన్ దంగల్, రాజమౌళి బాహుబలి-2, పుష్ప-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వసూళ్లు ఇలాగే కొనసాగితే దురంధర్-2 త్వరలోనే పుష్ప-2ను వెనక్కి నెట్టనుంది.కాగా..ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన దురంధర్కు సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేసిన సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
స్టార్ హీరోయిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్లో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. చివరిసారిగా జిగ్రా మూవీలో కనిపించిన ఆలియా.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'లవ్ అండ్ వార్' (2027) చిత్రంలో కనిపించనుంది.ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ బ్యూటీ సిస్టర్ షాహీన్ భట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ ఇషాన్ మెహ్రీతో తన నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ జంట తమ బంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మేము ఒకరినొకరు ఇష్టపడటంలో కాస్త అతిగా చేశామేమో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న షాహీన్ తల్లి, ఆలియా అత్త నీతూ కపూర్, సోనీ రజ్దాన్, అనన్య పాండే, నీనా గుప్తా, మసాబా గుప్తా, జోయా అక్తర్, షనయా కపూర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.కాగా.. మహేష్ భట్, సోనీ రజ్దాన్ల పెద్ద కుమార్తె షాహీన్ భట్. ఆమె స్క్రీన్ రైటర్తో పాటు మానసిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. షాహీన్ కాబోయే భర్త ఇషాన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కోచ్గా రాణిస్తున్నారు. ఆమెతో పాటు ఆలియా భట్, పూజా భట్, రాహుల్ భట్ అనే మరో ముగ్గురు వీరికి సంతానం. ఆలియా భట్ ఇప్పటికే రణ్బీర్ కపూర్ను పెళ్లాడగా.. వీరికి రాహా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Shaheen Bhatt (@shaheenb) -
‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు కిరణ్ అబ్బవరం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా తన సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 17) రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథ 1996 నేపథ్యంలో సాగుతుంది. కుప్పం దగ్గర్లోని తిమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన సతీష్(సాయి తేజ్).. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రతి శివరాత్రికి టీవీ, వీసీఆర్ని రెంట్కి తీసుకొచ్చి సినిమాలు వేస్తుంటాడు. ఆ ఊరికి తొలిసారి టీవీ కొని తీసుకొస్తాడు రాజప్ప(పదీప్ కొట్టె). రాజప్ప చెల్లెలు శారద(వేద జలంధర్)కు సతీష్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమలో ఉంటారు. అది రాజప్పకు నచ్చదు. ఓ రోజు టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన సతీష్తో రాజప్ప తండ్రి గొడవకు దిగుతాడు. అదికాస్త పెద్దదై.. రాజప్ప, సతీష్ తీవ్రంగా కొట్టుకుంటారు. ఆ మరుసటి రోజే.. రాజప్ప ఇంట్లో ఉన్న టీవీని ఎవరో ఎత్తుకెళ్లిపోతారు. సతీషే ఆ టీవీని దొంగతనం చేశాడంటూ రాజప్ప పంచాయితీ పెడతాడు. ఊరంతా సతీష్ని దొంగ అంటుంది. రెండు వారల్లో టీవీ దొంగతనం చేసినవాళ్లను కనిపెట్టి, పంచాయితీ ముందు నిలపెడతానని సతీష్ సవాల్ చేస్తాడు. అసలు ఆ టీవీని దొంగతనం చేసిందెవరు? ఎందుకు చేశారు? తనపై పడ్డ నిందను పోగొట్టుకునేందుకు సతీష్ ఏం చేశాడు? సతీష్-శారదల ప్రేమ ఏమైంది? సిద్దు(లతీష్ కీలపట్టు) వల్ల సతీష్కి ఎదురైన సమస్యలు ఏంటి? టీవీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? చివరకు సతీష్ -శారదలు ఒకటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 90లలో టీవీ అనేది ఒక ఎమోషన్. గ్రామాలల్లో ఒకరిద్దిరి ఇంట్లోనే టీవీలు ఉండేవి. సినిమాలు, సీరియళ్లు చూసేందుకు ఊరంతా వారింటి ముందు క్యూకట్టేది. వాళ్లు చీదరించుకున్నా..తిట్టినా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయేవాళ్లు. ఇప్పటితరానికి ఇవేవి తెలియదు కానీ.. 80-90 తరానికి చెందినవాళ్లకు మాత్రం టీవీతో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయినా దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఒక చిన్న లైన్ని తీసుకొని.. దానికి పల్లెటూరి అనుబంధాలను, చక్కని ప్రేమ కథను జత చేసి.. ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడ ప్రజల అలవాట్లను పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఊర్లో జాతరకు టీవీ తీసుకురావడం.. టీవీ చూసేందుకు ఊరంతా ఒక చోటికి రావడం.. చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాక్తో ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అయితే పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కొంతవరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. టీవీని దొంగిలించారనే విషయం తెలిసినప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. అదే సమయంలో సతీష్-శారదల లవ్స్టోరీ రాజప్పకు తెలియడం.. హీరో సవాల్ చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. టీవీ దొంగతనం చేసినవాడిని హీరో ఎలా కనిపెట్టాడు అనేదే ద్వితియార్థం కథ. ఆ దొంగ ఎవరనేది ప్రేక్షకుడు కూడా చివరివరకు కనిపెట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్గా తిమ్మరాజుపల్లి టీవీ.. 80-90 తరాలకు పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది.ఎవరెలా చేశారంటే.. ఇందులో నటించినవారంతా కొత్తవాళ్లే అయినా కూడా చక్కగా నటించారు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్గా వేద జలంధర్ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. వీరిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. వంశీకాంత్ రేఖన సంగీతం ఈ సినిమాకు మరో అదనపు బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. అక్షయ్ రామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..
-
రజనీకాంత్ వీడియో లీక్.. షాక్లో అభిమానులు
దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్ మూవీ విడుదలకు ముందే లీక్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు రజనీకాంత్ జైలర్-2 మూవీ నుంచి కొన్ని సీన్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందుతుంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ను ప్రచారం చేయవద్దని చిత్ర నిర్మాతలు ఒక ప్రకటన ద్వారా ప్రేక్షకులను కోరారు.జైలర్ సినిమాకు సీక్వెల్గా పార్ట్-2ను దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. అత్యంత భారీ బడ్జెట్తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కావాల్సిన ఈ మూవీ నుంచి కీలకమైన ఫుటేజ్ లీక్ అయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. దయచేసి మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని కోరింది. తమ పైరసీ నిరోధక టీమ్ ఈ అంశంపై చురుకుగా పర్యవేక్షిస్తోందని పేర్కొంది. ఎవరైనా వీడియోను షేర్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్లను ఎవరూ వాడకూడదని కోరుతూ ఒక పిటీషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను ఉపయోగించుకుని పలు ఉత్పత్తులను విక్రయిస్తూ డబ్బు సంపాదించుకుంటూ తన ప్రతిష్ణను దెబ్బతీసేలా చేస్తున్న వారికి ఈ కేసు వర్తిస్తుంది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ దావా వేశారు. నేడు జస్టిస్ తుషార్ రావు కమిటీ నేతృత్వంలో విచారణకు రానుంది.ఇదే అంశంలో ఇప్పటికే చిరంజీవి , మోహన్ లాల్ , నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, ఐశ్వర్య రాయ్ తదితరులు తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఈ కేసులలో సినీ ప్రముఖల ప్రైవసీ హక్కులను రక్షించకపోతే వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. -
శ్రీ రాముడిపై ప్రకాష్ రాజ్ వివాదస్పద వ్యాఖ్యలు
శ్రీరాముడు హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన దేవుడిగా ఆరాధిస్తారు. రాముడు నిత్యజీవితంలో మమేకమై ఉంటాడని నమ్ముతారు. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. రాముడి వీరత్వంలో తిరుగులేదు. ఎంతో కీర్తి ఉన్న రాముడు, లక్ష్మణులను వలస కూలీలు అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొనడం సిగ్గుచేటని నెటిజన్లు భగ్గుమంటున్నారు. గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక చిక్కుల్లో పడిన ఆయన ఇప్పుడు మరోసారి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ.. రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని, వారిద్దరూ దక్షిణ భారత్కు చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే, దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని అడిగినట్లు ఎద్దేవా చేశాడు. ఈ కారణం వల్లనే వివాదం మొదలైందని ఎటకారంగా కామెంట్ చేశాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ ఇతిహాస కథనాన్ని వక్రీకరించినందుకు నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు. మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ప్రకాష్ రాజ్పై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.బీజేపీ కార్యవిధానాన్ని తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఈ దేశంలో ప్లాన్ ప్రకారం ఒక జాతి నిర్మూలనకు అడగులు పడుతున్నాయి. వారు ముస్లింలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు. ఆపై గిరిజనులను, మైనారిటీలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు." అని ఆయన అన్నాడు. కానీ, మత సామరస్యం, ప్రజల విశ్వాసం అనే అంశాన్ని తీసుకుని ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నెటిజన్లు అనేక పోస్టులు పెడుతున్నారు. రాబోయే ప్రాజెక్టులలో ఆయనకు అవకాశం ఇవ్వడంపై చిత్రనిర్మాతలు పునరాలోచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి వారు వారణాసి, స్పిరిట్, దృశ్యం 3 చిత్రాల నుంచి ఆయన్ను తొలగొంచాలని కోరుతున్నారు. Prakash Raj claims Ram was a North Indian, Ravan a South Indian tribal, and their conflict began because Ram "STOLE FRUITS."🥲This is what happens when you learn itihas from church pic.twitter.com/yRJmEzwivq— The Jaipur Dialogues (@JaipurDialogues) April 16, 2026 -
‘పళ్లిచట్టంబి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టొవినో థామస్ సినిమాలు కేరళలో బాగానే సక్సెస్ అవుతుంటాయి. తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘పళ్లిచట్టంబి’ కోసం తెలుగు ఆడియెన్స్ కోసం ఎంతో వెయిట్ చేశారు. మొత్తానికి ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 17) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ ‘పళ్లిచట్టంబి’ కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? తెలుగు వారిని ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.కథేంటంటే..ఇది పూర్తిగా కేరళ ప్రాంతానికి చెందిన కథ. అందుకే ఇందులోని పాత్రల పేర్లు, ఊరి పేర్లు కూడా అక్కడి నేటివిటికీ తగ్గట్టే ఉంటాయి. 1930లో ఈ కథ ప్రారంభం అవుతుంది. కేరళ, కర్ణాటక ప్రాంతం. అక్కడి చుట్టు పక్కల అటవీ ప్రాంతానికి కింగ్ నంబియార్. నంబియార్ గడ్డ మీద ఆంగ్లేయులు కూడా అడుగు పెట్టలేరు. 1958లో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ సమయంలో కణియార్ గ్రామంలో అల్లర్లు జరుగుతుంటాయి. అక్కడి కమ్యూనిస్టులకు, క్రిస్టియన్లకు గొడవలు జరుగుతుంటాయి. తమ చర్చిని, ప్రజల్ని కాపాడుకునేందుకు అక్కడి ఫాదర్, గ్రామస్తులు కలిసి క్రిష్టోఫర్ (రక్షకుడు), ఓ చట్టంబి (రౌడీ)ని తెచ్చుకుంటుంది. తోమాపురంకి చెందిన హిందువు కృష్ణ పిళ్లై(టొవినో థామస్)ని పోతన్ క్రిష్టోఫర్గా మార్చి తీసుకు వస్తారు. మరి ఆ పోతన్ వచ్చాక కణియార్ గ్రామం ఎలా మారుతుంది? కమ్యూనిస్ట్లను అతను ఎలా నిలువరించారు? కమ్యూనిస్ట్ పార్టీ కోసం నాటకాలు వేసే రెబెక్కా (కయాదు లోహర్) పాత్ర ఏంటి? ఆమె లక్ష్యం కోసం క్రిష్టోఫర్ ఏం చేస్తాడు? అసలు ఈ అల్లర్ల వెనుకున్నది ఎవరు? క్రూరుడైన రైలు రామన్న (శత్రు) పాత్ర ఏంటి? కణియార్ ఊరికి పక్కనే ఉండే పిశాచి కొండ వెనుకున్న రహస్యం ఏంటి? ఇక ఊరిని, చర్చిని క్రిష్టోఫర్ ఎలా కాపాడతాడు అన్నదే కథ.ఎలా ఉందంటే..‘పళ్లిచట్టంబి’ అంటే చర్చ్ రౌడీ. చర్చ్ని కాపాడుకునేందుకు ఒకప్పుడు కేరళలో ఈ చట్టంబిలను పెట్టుకున్నారు. ఈ కథను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని టొవినో థామస్ ఇది వరకే చెప్పాడు. అందుకే అక్కడి ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి.. అక్కడి పేర్లే కనిపిస్తుంటాయి. ప్రాంతం ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే. ఎమోషన్స్ పండితే.. ఏ భాషా చిత్రం.. ఎక్కడి చిత్రం అన్నది ఆడియెన్స్ పట్టించుకోరు. ఈ పళ్లిచట్టంబి చిత్రంలోనూ చాలా వరకు ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.ఊర్లో గొడవలు.. హీరో ఆ ఊరికి రావడం..వారికి రక్షణగా ఉంటూ.. శిక్షణ అందించడం..ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. పళ్లి చట్టంబి కథ కూడా ఇలానే సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కూడా ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకుండా సాగినట్టు కనిపిస్తుంది. ఇంటర్వెల్కి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక ద్వితీయార్దంలో అసలు కథను రివీల్ చేస్తారు. అక్కడి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. నంబియార్ పాత్రను రివీల్ చేసిన తీరు, చూపించిన విధానం బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది.సాంకేతికంగా ఈ చిత్రం టాప్ నాచ్లో ఉంటుంది. ఆర్ఆర్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ప్రతీ ఫైట్, ఎమోషనల్ సీన్స్ జేక్స్ అదరగొట్టేశాడు. ఇక విజువల్స్ అయితే ఎంతో నేచురల్గా కనిపిస్తాయి. ఆర్ట్ వర్క్, క్యాస్టూమ్స్ ఇలా బాగుంటాయి. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే?టొవినో థామస్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతని యాక్టింగ్ కారణంగానే తెలుగులోనూ టొవినోకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. లుక్స్ పరంగానూ, యాక్షన్ పరంగానూ టొవినో అదరగొట్టేశాడు. కామెడీ, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నింట్లోనూ మెప్పించాడు. ఇక కయాదు అయితే చాలా కొత్తగా, మరింత అందంగా కనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్రతో, యాక్టింగ్తో భయపెట్టేస్తాడు. శత్రుకి మంచి పాత్ర లభించింది. మిగిలిన ఆర్టిస్టులు మలయాళీలే కావడంతో మన తెలుగు ఆడియెన్స్ ఎక్కువ కనెక్ట్ కాలేకపోవచ్చు.కేరళ ప్రాంతానికి సంబంధించిన కథ కావడం, తెలుగు నేటివిటికీ దూరంగా ఉండటం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అక్కడి ప్రజలకు నచ్చినంతగా ఈ చిత్రం ఇక్కడి వారికి నచ్చకపోవచ్చు. అలా అని ‘పళ్లిచట్టంబి’ ప్రయత్నం అయితే వృథాగా పోదు. టెక్నికల్లీ బ్రిల్లియంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. -
'జన నాయగన్' లీక్ కేసులో అసలు దొంగ ఎవరంటే..
విజయ్ నటించిన 'జననాయగన్' మూవీ లీక్తో సంబంధం ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. మరో సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్న వ్యక్తే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్న సదరు వ్యక్తి తరచుగా ‘జన నాయగన్’ మూవీ ఎడిటింగ్ జరిగే స్టూడియోలోకి వెళ్లేవాడు. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన కొంత డేటాను దొంగలించి.. దానినే సినిమాగా మార్చాడు. ఆపై తనకు తెలిసిన వారితో ఆ పుటేజీని పంచుకున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ ఆన్లైన్లో కనిపించాయి. పూర్తి ఆధారాలతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారికి రిమాండ్ విధించింది.'జననాయగన్' మూవీ లీక్ కేసులో గతంలోనే ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆపై కోయంబత్తూర్ లోకల్ ఛానల్లో మూవీ ప్రసారం కావడంతో ఆ ఛానల్ యజమానిని కూడా పోలీసులు అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో చెన్నై సైబర్ క్రైమ్ విభాగం ప్రేక్షకులకు ఒ క విజ్ఞప్తి చేసింది. అనధికారికంగా ఇలాంటి వీడియోలను ఎవరితోనైనా షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, మూవీ లీక్ కావడం ఆపై సెన్సార్ చిక్కుల వల్ల విడదల అంశంలో జాప్యం ఏర్పడటంతో భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. -
ఒంటరి జీవితమే ఆనందంగా ఉంది: హీరోయిన్
మన చుట్టూ ఉన్న చాలామంది తమ జీవితంలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఆనందపడుతుంటారు. నటి హన్సిక మోత్వానీ ఈ కోవకు చెందిన అమ్మాయేనని అనిపించక మానదు. తమిళం, తెలుగు,హిందీ వంటి భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించిన హన్సిక. అలా 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబై బ్యూటీ ఎప్పుడూ వార్తలో ఉంటుంటారు. ఇంతకు ముందు ప్రేమ వ్యహారం గురించి ప్రచారం జరిగింది. ఎట్టకేలకు 2022లో సోహైల్ కత్తారియా అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చాలా ఆడంబరంగా జరిగింది.అయితే వీరి వివాహ జీవితం ఎక్కువగా సాఫీగా సాగలేదు. పెళ్లి అయిన కొద్ది కాలానికే మనస్పర్ధలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. ఇటీవలే విడాకులు కూడా పొందారు. దీంతో భర్త నుంచి భరణం కోరుతూ నటి హన్సిక కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారం న్యాయస్ధానంలో ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే నటి హన్సిక తన కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు చుట్టేయడంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఉత్తరాదిలోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్న ఈ అమ్మడు తదిపరి దక్షిణాదిలోని దేవాలయాలను సందర్శంచడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.కాగా ఇటీవల అభిమానులతో చిట్చాట్ నిర్వహించిన హన్సిక ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అంతే కాదు చాలా స్వేచ్చగా ఉన్నానని, ఒంటరితనం తనకు ఎప్పుడూ ఇష్టమని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఒంటరిజీవితంలో చాలా సంతోషం కలిగింది అని అన్నారు. తన వాళ్ల కోసం సమయాన్ని గడపడం, తనకు నచ్చింది చేయడం వంటి విషయాలతో చాలా సంతోషంగా ఉన్నానని నటి హన్సిక చెప్పుకొచ్చారు.ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) -
కథ కొత్తగా అనిపించింది: వరుణ్ సందేశ్
‘‘కాస్ట్’ చిత్రకథ విన్నప్పుడు చాలా కొత్తగా, వైవిధ్యంగా అనిపించింది. ఇందులో బలమైనపాత్ర చేశాను. చాలా మంచిపాయింట్తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని హీరో వరుణ్ సందేశ్ చెప్పారు. ‘సత్యం’ రాజేశ్, వరుణ్ సందేశ్, గగన్, రవి హీరోలుగా, కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కాస్ట్’. ఏకే జంపన్న రచన–దర్శకత్వంలో గోల్డెన్ ప్రోడక్షన్స్ బ్యానర్పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సెన్సిటివ్పాయింట్తో జంపన్నగారు ఈ కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.‘‘మన నిత్య జీవితంలో కులం ఎలా ప్రభావం చూపుతుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అని ఏకే జంపన్న తెలిపారు. ‘‘మా బ్యానర్లో తొలి చిత్రమిది. 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. జూన్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని కోటేశ్వరరావు చెప్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు గగన్ బాబు, రవి. -
పవర్ పేటకి శ్రీకారం
‘ఆనందో బ్రహ్మ, యాత్ర, యాత్ర 2’ వంటి సినిమాలు నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి తమ 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్పై సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమాని ప్రకటించారు. ‘ప్రస్థానం’ (2010) సినిమాతో చిత్ర పరిశ్రమలో తన కెరీర్ మొదలు పెట్టిన సందీప్ కిషన్ ఏప్రిల్ 16వ తేదీకి 16 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘పవర్ పేట’ మూవీని ప్రకటించారు.ఈ సినిమాకి రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు. ‘‘విభిన్న జానర్లను కలిపి ఒక పవర్ఫుల్ కథను తయారు చేశారు కృష్ణ చైతన్య. బలమైన కథలను ఎంచుకోవడంలో పేరు పొందిన సందీప్ కిషన్ తన కెరీర్లోనే ‘పవర్ పేట’ చిత్రంలో అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా ప్రేమ, గౌరవం, భావోద్వేగాలు, రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: మది. -
మేకప్కే ఐదు గంటలు పట్టేది: సత్యదేవ్
‘‘రావు బహదూర్’లో నేను పోషించిన రామప్పపాత్రకి ప్రతి రోజూ మేకప్కే ఐదు గంటలు పట్టేది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్బాబుగారితో కలసి నటించాను. కానీ, ఆ సన్నివేశం చిత్రంలో లేదు. ఇప్పుడు నా ‘రావు బహదూర్’ సిని మాను ఆయన సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో సత్యదేవ్ తెలిపారు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థామస్ జోడీగా నటించిన చిత్రం ‘రావు బహదూర్’.జీఎంబీ ఎంటర్టైన్ మెంట్ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఓ సుందరి...’ అంటూ సాగేపాట విడుదల వేడుకని నిర్వహించారు. రెహ్మాన్ రచించిన ఈపాటని విజయ్ యేసుదాస్పాడారు. సత్యదేవ్ మాట్లాడుతూ– ‘‘బాహుబలి, అవతార్’లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే ఆడియన్స్ని కూర్చోబెట్టగలిగాయో మా ‘రావు బహుదూర్’ కూడా అంతే స్థాయిలో అలరిస్తుంది’’ అని చెప్పారు.వెంకటేశ్ మహా మాట్లాడుతూ– ‘‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా ఇచ్చిన అనుభూతికి పది రెట్లు ఎక్కువ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ‘రావు బహదూర్’ తీశాను’’ అని పేర్కొన్నారు. ‘‘మంచి థియేట్రికల్ అనుభూతి ఇచ్చే సినిమా ఇది’’ అన్నారు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, గోపాలకృష్ణా రెడ్డి. -
సముద్రం నేపథ్యంలో...
నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్ దుర్గం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో జోయల్ జార్జ్ మాట్లాడుతూ– ‘‘సముద్రం నేపథ్యంలో సాగే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.‘‘కథ నచ్చి ఈ సినిమా చేశాను’’ అన్నారు కైలాష్ దుర్గం. ‘‘మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని ఈ సినిమాని రూపొందించాం’’ అని నవీన్ రాజ్ చెప్పారు. ‘‘మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు’’ అని రాజీవ్ కనకాల చెప్పారు. -
బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్తో తీస్తున్న సినిమా సెట్స్పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. -
బ్లాక్ శారీలో నిహారిక అందాలు.. కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ..!
కోలీవుడ్ బ్యూటీ రవీనా రవి స్మైలీ లుక్స్..హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటీఫుల్ వీడియో..కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్..బ్లాక్ శారీలో నిహారిక కొణిదెల అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా హోయలు.. View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanoor Sana Begum (@shanoor_sana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్పై తనయుడి ప్రశంసలు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్పై రామ్ చరణ్ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్గా ఉండేవారని.. అదే ఆయనతో చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు. -
శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్..!
అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్లో బజ్ ఏర్పడింది.ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..దో దివానే షహర్ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17ఆల్ఫా మేల్స్ సీజన్-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17180(మూవీ)- ఏప్రిల్ 17రూమ్మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17ట్విస్టెడ్(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17బెబెఫిన్సింగ్-ఎలాంగ్మూవీ ఇన్ టూ ద పింక్ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19అమెజాన్ ప్రైమ్మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17బ్రదర్స్ అండర్ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17జీ5..అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17ఆహా..పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17బుక్ మై షోది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హెచ్బీవో మ్యాక్స్..డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17హులు..షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17 -
'ముంబయిలో ఆడిషన్.. సౌత్ డైరెక్టర్ చాలా అసభ్యంగా..'
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు. అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్ను ప్రారంభించింది. 'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్ మూవీలో డైసీ హీరోయిన్గా నటిస్తోంది. -
OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా
భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.- హరికృష్ణ ఇంటూరు -
ఆరు పదుల వయసులో అదే జోష్.. చిరంజీవి హీరోయిన్ డ్యాన్స్ చూశారా?
మెగాస్టార్ నటించిన సినిమాల్లో క్లాసిక్ హిట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఆపద్బాంధవుడు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. 1992లో విడుదదలైన ఈ క్లాసిక్ సూపర్ హిట్ మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్గా మీనాక్షి శేషాద్రి కనిపించింది. ఈ మూవీ రిలీజై నేటికి 34 ఏళ్లవుతోంది. అప్పట్లో ఈ చిత్రంలో ఓ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అవురా అమ్మకు చెల్లా అంటూ సాగే పాట సినీ ప్రియులను అలరించింది. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆ సాంగ్ అభిమానులను మెప్పించింది.దాదాపు 34 ఏళ్ల తర్వాత హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా అవురా అమ్మకు చెల్లా పాటకు స్టెప్పులను రీ క్రియేటే చేశారు. అమెరికాలోని డల్లాస్లో తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె ఈ పాటకు చిందేశారు. 62 ఏళ్ల వయసులోనూ అదే స్టెప్పులతో అదరగొట్టారు. ఆమె డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీనాక్షి శేషాద్రి తన ఇన్స్టాలో రాస్తూ..' నా తెలుగు సినిమా 'ఆపద్భాంధవుడు'లోని ఈ అందమైన పాటను ఉగాది ఇన్స్టాలో పోస్ట్ చేద్దామనుకున్నా. కానీ కొంచెం ఆలస్యమైంది. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీ అందరి కోసం ఈ సాంగ్ తీసుకొచ్చా. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ చిత్రాన్ని హైదరాబాద్లో.. అప్పటి ఆంధ్రప్రదేశ్లోని పూడపల్లి అనే మారుమూల గ్రామంలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ పాటను కులు మనాలిలోని పచ్చని ప్రకృతిలో షూట్ చేశారు. డల్లాస్లోని నా బృందానికి ధన్యవాదాలు. ఈ మొత్తం లుక్ను రూపొందించడం చాలా సరదాగా అనిపించింది.' అని పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Meenakshi Seshadri (@iammeenakshiseshadri) -
ఓటీటీలోకి మిస్టీరియస్ థ్రిల్లర్ ‘పోచమ్మ’..ఎక్కడ? ఎప్పుడు?
అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మించిన ఈ సిరీస్కి రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. బుధవారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ ‘కొన్ని కంటెంట్ లు ముందు సైలెంట్ గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంట్ ఉంది. పోస్టర్ , టైటిల్ తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ కు మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ హీరోలు. ఆహా టీమ్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ లో ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్ కు హడావుడి అవసరం లేదు స్ట్రీమింగ్ కాగానే సక్సెస్ అందుకుంటుంది. ఈ నెల 17న ఆహాలో మా ‘పోచమ్మ’ సిరీస్ తప్పకుండా చూడండి’అన్నారు.నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ - ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ జెస్సీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. ఈ సిరీస్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ శృతి నాయుడుకి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే రమేష్ ఇందిర మంచి దర్శకుడి కాదు మంచి కోస్టార్ కూడా. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.నటి శ్రీ పూజ మాట్లాడుతూ - ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న మొదటి రోజే తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్ కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఈ సిరీస్ తమిళం, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని తప్పకుండా ఎంగేజ్ చేసేలా సిరీస్ ఉంటుంది’ అన్నారు.ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ‘పోచమ్మ’ కథ విన్నప్పుడే ఈ సిరీస్ సక్సెస్ మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించింది అనిపించింది. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. మా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుంది’అన్నారు. -
‘తస్సాదియ్యా’.. సమంత డ్యాన్స్ అదిరిందయ్యా!
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీకి సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్. 'తస్సాదియ్యా... తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...' అంటూ సాగే ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్య సెల్వ అద్భుతంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక చీరకట్టులో సమంత వేసిన స్టెప్పులు హైలెట్ అని చెప్పొచ్చు. -
హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. కోటి రూపాయల పరిహారం కోరుతూ హైకోర్ట్ను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ను కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతోనే తమన్నా పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీకి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. అసలేం జరిగిందంటే..పవర్ సోప్స్ అనే సంస్థతో 2008లో తమన్నా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే తమన్నాతో పవర్ సోప్స్కు అగ్రిమెంట్ కుదిరింది. కానీ గడువు ముగిసినా 2010, 2011లో కూడా ఆ సంస్థ తన ఉత్పత్తులతో పాటు ప్రకటనల్లో మిల్కీ బ్యూటీ ఫోటోలను వినియోగించింది. దీంతో ఒప్పందం అయిపోయినా కూడా తన ఫోటోలను ప్రకటనల్లో వాడారని ఆరోపిస్తూ తమన్నా ఇటీవలే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తమన్నా పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నా పిటిషన్ను హైకోర్ట్ తిరస్కరించింది. -
‘హే బాబు’ వెళ్లిపో.. మోహన్ బాబుకే వార్నింగ్ ఇచ్చిన అవ్రామ్ : ఫన్నీ వీడియో
ఖాలీ సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడపడానికి ఇష్టపడే నటుల్లో మంచు విష్ణు ఒకరు. పిల్లలను ఆడించడమే కాదు..వారితో కలిసి ఆయన కూడా అల్లరి చేస్తుంటాడు. షూటింగ్ సమయాల్లోనూ అవకాశం ఉంటే పిల్లలను సెట్స్కి తీసుకెళ్తుంటాడు. అలాగే మోహన్ బాబు కూడా తన మనవళ్లు, మనవరాళ్లతో చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. బయట కానీ, సినిమాల్లో కానీ కాస్త గంభీరంగానే ఉండే ఆయన.. పిల్లల దగ్గరకు వచ్చేసరికి కమెడియన్గా మారిపోతాడు. అందుకే తాతయ్య అంటే వారికి చాలా ఇష్టం. ఇక అవ్రామ్ అయితే తాతయ్యని ఆటపట్టిస్తుంటాడు. తాజాగా ఆయన తాతయ్యకే వార్నింగ్ ఇచ్చాడు. మోహన్ బాబు, విష్ణు ఇంట్లో కూర్చోని మాట్లాడుకుంటుండగా, అవ్రామ్ వచ్చి అల్లరి చేస్తుంటాడు. ఇది చూసిన మోహన్ బాబు ‘కామ్ గా ఉండాలి. అల్లరి చేయొద్దు’ అనగా అవ్రామ్..‘ హే బాబు’ అంటూ మోహన్బాబును కళ్లలోకి కళ్లు పెట్టి చూసి బెదిరిస్తాడు. అంతేకాదు గ్రౌండ్ చేయ్, వెళ్లిపో అంటూ కాసేపు తాతకే వార్నింగ్ ఇచ్చాడు. రచ్చ రచ్చ చేసి చివరకు ‘బాయ్ బాబు’ అంటూ ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. మనవడి అల్లరి తట్టుకోలేక..చివరకు మోహన్ బాబే సైలెంట్ అయిపోయాడు. ఈ ఫన్నీ వీడియోని మంచు విష్ణు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ..‘విలన్లను, విమర్శకులను, కఠినమైన పాత్రలను లయన్ కింగ్ (మోహన్బాబు) ఎదుర్కొన్నారు. కానీ, అవ్రామ్ మూడు నిమిషాల అల్లరిని అడ్డుకోవడం మాత్రం ఆయన సాధ్యం కాలేదు’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
అక్కినేని హీరో సినిమా.. ఎట్టా ఎట్టా అంటోన్న అఖిల్..!
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. ఎట్టా ఎట్టా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ సాంగ్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ఓ సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
శానిటరీ నాప్కిన్ యాడ్.. వివాదంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్కుమార్కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నిర్మించారు.ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్ ఓ శానిటరీ నాప్కిన్ యాడ్లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. -
అందుకే ఆ బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్నా..: ఎస్జే సూర్య
కోలీవుడ్లో బ్లాక్బస్టర్ నిలిచిన చిత్రం 'లబ్బర్ పందు'. 2024లో సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్ గోట్ మూవీతో పోటీ పడింది. పెద్దగా ఫేమ్ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని తమిళరాసన్ పంచముత్తు తెరకెక్కించాడు.తాజాగా లబ్బర్ పందు మూవీని వదులుకోవడంపై స్టార్ నటుడు ఎస్జే సూర్య స్పందించారు. తనకు మొదట ఆఫర్ చేసిన పాత్రను తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఎల్ఐకే సక్సెస్ మీట్లో సూర్య మాట్లాడారు. ఓ సారి దర్శకుడు లబ్బర్ పందు స్క్రిప్ట్తో నన్ను సంప్రదించారని తెలిపారు. నా ఇమేజ్కు సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని నేను అతన్ని అడిగా.. ఆయన దానికి పూర్తిగా అంగీకరించారు. కానీ ఆ మార్పులు పెరుగుతూ పోవడంతో.. నేనే మళ్లీ ఆలోచించానని అన్నారు. నా కోసం మీరు మీ మొత్తం కథను మారుస్తూ ఉంటే.. ఒక డైరెక్టర్గా మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతారని అతనితో చెప్పానని వెల్లడించారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని డైరెక్టర్కు వివరించానని అన్నారు. కాగా.. ఈ మూవీలో అట్టకత్తి దినేష్ పోషించిన ఆ పాత్రను మొదట సూర్యకు ఆఫర్ చేశారు డైరెక్టర్ తమిళరాసన్.ఇటీవలే ఎస్జే సూర్య ఎల్ఐకే చిత్రంలో కనిపించారు. ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఎస్జే సూర్య.. ప్రీతి అశ్రాని సరసన నటిస్తున్నారు. 'కిల్లర్' చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో కూడా భాగమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి, అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. 'కిల్లర్'తో పాటు, కార్తితో 'సర్దార్ 2', 'బ్రో కోడ్' చిత్రాలు చేస్తున్నారు. -
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో కొత్త నాగశౌర్యని చూస్తారు
‘‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీకి నాగశౌర్య మా ఫస్ట్ చాయిస్. ఆయన కథ వినగానే ఓకే అన్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో తన నటనతో శౌర్యగారు అందర్నీ సర్ప్రైజ్ చేస్తారు. తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి తెలిపారు. నాగశౌర్య, విధి జోడీగా రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు చింతలపూడి విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఆది సాయికుమార్ నటించిన ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. సోలో నిర్మాతగా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నా తొలి సినిమా. నాగశౌర్యని ఇప్పటివరకు లవర్ బాయ్గా చూశారు. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో మాత్రం పూర్తి యాక్షన్తో చూస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. కదిరి నరసింహస్వామి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది. రసూల్గారి విజువల్స్, హ్యారిస్ జయరాజ్గారి సంగీతం మా మూవీకి ప్లస్. దాదాపు 400లకు పైగా స్క్రీన్లలో మా సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగుతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశాలో కూడా రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్లో జూన్లో ఒక సినిమా స్టార్ట్ కాబోతోంది. అలాగే ఇంకో సినిమా ప్రకటన కూడా ఉంటుంది’’ అని చెప్పారు. -
నేను ఏ తప్పు చేయలేదు.. చేయను కూడా..: సింగర్ మంగ్లీ
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.మధునాయక్ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. -
బ్లాక్బస్టర్ సినిమా ఫ్రాంచైజీలో అశోక్ గల్లా
ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లో 2018లో విడుదలైన చిత్రం హుషారు.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. నలుగురు స్నేహితులు కలిసి చేసే సాహసాలు ఎలా ఉంటాయి దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఫన్నీగా చూపిస్తూ యూత్కు కనెక్ట్ అయ్యే ప్రేమ కథను చూపించాడు. ఇందులో తేజస్, దక్ష, అభినవ్, ప్రియా వంటి వారు నటించారు. అయితే, తాజాగా రానున్న పార్ట్-2లో అశోక్ గల్లా నటించనున్నారని తెలుస్తోంది.‘హీరో’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అశోక్ గల్లా.. మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత 'దేవకీ నందన వాసుదేవ' చిత్రంతో అలరించాడు. అయితే, ఇప్పుడు హుషారు-2 చిత్రంలో భాగం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్కు కూడా శ్రీహర్ష కొనుగంటినే దర్శకత్వం వహించనున్నారు. ఈ వార్త నిజమైతే, అశోక్ గల్లా కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. అశోక్ గల్లా తన తొలి చిత్రం 'హీరో'తో ఆకట్టుకున్నారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ ప్రాజెక్ట్ సరిగ్గా సెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేశ్ బాబుకు మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీలోకి అశోక్ ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి సినిమా హీరోతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు హుషారు-2తో తన జోరు చూపేంచే ప్లాన్లో ఉన్నాడు. -
స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్
హైదరాబాద్కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. పవన్ కల్యాణ్ మూడు వివాహాల గురించి ఆయన అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో జనసేన పార్టీ నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు చేయడంతో కాకినాడ I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనుదీప్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో తాజాగా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. -
హారర్ థ్రిల్లర్ సినిమా.. భయానికి కొత్త నిర్వచనం ఇస్తామంటున్న మేకర్స్
హారర్, మిస్టరీ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే మరో ఆసక్తికరమైన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల ప్రెజెంట్స్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం “Production No. 4”గా రూపొందుతోంది. “Inspired by True Events” అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా, నిజ ఘటనల ఆధారంగా రూపొందుతున్నదనే ఆసక్తిని పెంచుతోంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్తో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పోస్టర్లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయానక చిహ్నాలు, మిస్టీరియస్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పిస్తూ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్కు మంచి స్పందన లభించగా, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్గా కూడా హై స్టాండర్డ్స్లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రీ లుక్ పోస్టర్తో టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
స్టార్ హీరోతో మమితా బైజు.. ఎందుకు తీసుకున్నామంటే: దర్శకుడు
మలయాళ నటీమణులు కోలీవుడ్లో మంచి అవకాశాలను తన్నుకు పోతున్నారు. అదేసమయంలో తమిళ చిత్రాల్లో తమిళ నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదు వంటి ఆరోపణలు ఇటీవల ఎక్కవగా వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల కోలీవుడ్లో మంచి క్రేజీ అవకాశాలను అందుకుంటున్న మాలీవుడ్ నటి మమితా బైజు(Mamitha Baiju). ఈమె సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలోనూ, ధనుష్కు జంటగా కర చిత్రంలోనూ నటించారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ప్రస్తుతం మరిన్ని తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర చిత్రంలో పరభాషా నటి మమితా బైజును నటింపజేయడం గురించి ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్రాజా ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ సినిమాల్లో నటీనటులను ఎంపిక చేయడం అనేది వారి భాష, ప్రాంతీయత ఆధారంగా ఎంపిక చేయడం ఉండదన్నారు. వారి నటనా ప్రతిభ, పాత్రలకు నప్పడం, ఉండే మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తామన్నారు. కర చిత్రం విషయంలో మమితా బైజును ఎంపిక చేయడానికి కారణం ఆమె పోషించిన పాత్రకు అంతకుముందు 20–25 మందిని ఆడిషన్ చేసినట్లు చెప్పారు. వారెవరూ తగిన ప్రతిభను పదర్శించలేదన్నారు. అందరికంటే మమిత బైజు స్పష్టంగా బెటర్గా ఉండడంతో ఆమెను ఎంపిక చేసినట్లు విఘ్నేశ్రాజా వివరించారు. కాగా ధనుష్, మమితా బైజు జంటగా నటించిన కర చిత్రం 1990లో రామనాథపురంలో జరిగిన ఒక బ్యాంకు దోపిడీ ఇతివృత్తంతో రూపొందిందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈనెల 30న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందన్నది గమనార్హం. -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రావు బహదూర్ మూవీ.. ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో సత్యదేవ్ నటిస్తోన్న తాజా చిత్రం రావు బహదూర్. ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్గా తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ చిత్రాన్ని మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో.. ఏప్లస్ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓ సుందరి అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందిచగా.. విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఈ పాటను స్మరణ్ సాయి కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు బహదూర్ చిత్రం ఈ ఏడాది సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'నా వల్ల కావడం లేదు.. నా తప్పుంటే జైలుకైనా వెళ్తా'.. సింగర్ మంగ్లీ ఆవేదన
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. పాటే నా ప్రాణమని చెప్పిన మంగ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంపై సీపీ సజ్జనార్ను కలిపి ఫిర్యాదు చేసిన మంగ్లీ.. తన లాయర్తో డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా మాట్లాడారు. ఈ వివాదంతో 30 రోజులుగా నా ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దయచేసి చెబుతున్నా.. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎవరు నమ్మకండని విజ్ఞప్తి చేసింది. సోషల్మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైనా కేసులు పెట్టానని మంగ్లీ తెలిపింది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.మంగ్లీ మాట్లాడుతూ..'నాకు పాటల ప్రపంచ తప్ప మరేది తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. కొందరి కామెంట్లు చూసి లోలోపల కుమిలిపోతున్నా. ఇక నా వల్ల కావటం లేదు. నేను తప్పు చేస్తే, విచారణకు సిద్ధం. ఆరోపణలు నిజమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. బాధితుడి ఆవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నేను కూడా పేదరికం నుంచే వచ్చా. ఆ బాధేంటో నాకు తెలుసు. నాపై కోపం ఉంటే వచ్చి మాట్లాడండి. ప్రజలకు నన్ను దూరం చేస్తున్నారు. తెలిసి, తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి. సంబంధం లేని విషయాల్లో నా ఫొటోలు దయచేసి వాడకండి. బాధితులకు నేను అండగా ఉంటా. నా దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేశా' అని అన్నారు. అసలేం జరిగిందంటే..సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసానికి పాల్పడ్డారని సుబ్బారావు అనే న్యాయవాది ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసత్య ప్రచారం చేస్తోన్న సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
మలయాళ బ్లాక్బస్టర్.. తెలుగులోనూ రిలీజ్
మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ ఇప్పటికే ది గోట్ లైఫ్ ఆల్ టైమ్ వసూళ్లు అధిగమించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-6 ప్లేస్లో నిలిచింది. ఏప్రిల్ 2న రిలీజైన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ఏప్రిల్ 24న తెలుగులో విడుదల కానుందని వాళా-2 పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.వాళాకు సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు విపిన్ దాస్ కథ అందించారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థమట. ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాళ్లను ఇదే పేరుతో పిలుస్తారట. The laughter, the chaos, the brotherhood… now in Telugu.After emerging as the biggest Malayalam blockbuster of 2026, #Vaazha2 is all set to arrive for the Telugu audience on April 24th ❤️🔥Get ready to experience this sensational blockbuster on the big screens 🎬… pic.twitter.com/NpJ0R4gfMC— Shine Screens (@Shine_Screens) April 15, 2026 -
పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.
-
మహేశ్ బాబు సోదరుడి కుమారుడు ఎంట్రీ.. టీజర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రషా తడాని తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది. ఈ మూవీని చందమామ కథలు బ్యానర్పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లుక్ చూస్తుంటే విలన్గా అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని తిరుపతి నేపథ్యంలో రూపొందించారు. టీజర్లో డైలాగ్స్, ఫైట్ సీన్స్ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో కథ ఉండనున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. Srinu - Manga and their eternal love tale ❤️🔥#SrinivasaMangapuram Teaser out now 🔥-- https://t.co/OvECTgsBpT In cinemas this 2026 💥#JayaKrishnaGhattamaneni @themohanbabu #RashaThadani @DirAjayBhupathi @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl… pic.twitter.com/tLoPCLy7W8— Telugu Film Journalists Association (@FilmJournalists) April 15, 2026 -
అజయ్ కోపం చూసి షాక్ అయిన మంచు లక్ష్మి
-
అనుకున్నదే జరిగింది.. పెద్ది మరోసారి వాయిదా
రామ్ చరణ్ పెద్ది విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ చిత్రాన్ని జూన్కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రానుందని ముందుగా ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.నిర్మాణ సంస్థ తమ నోట్లో రాస్తూ.. 'మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్ఫెక్షన్తో మీ ముందుకొస్తాం. జూన్లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ చెర్రీ రెజ్లర్ లుక్లో అభిమానులను ఆకట్టుకున్నారు.We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/jA5aq7dnW0— Vriddhi Cinemas (@vriddhicinemas) April 15, 2026 -
మెగా హీరో వరుణ్ తేజ్కు తీవ్ర గాయం..!
మెగా హీరో వరుణ్ తేజ్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరియన్ కనకరాజుతో పాటు బరి అనే చిత్రంలో నటిస్తున్నారు. బరి మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయ అయిందని నిహారిక కొణిదెల వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం గాయానికి సర్జరీ జరిగిందని తెలిపారు. వరుణ్ తేజ్ గాయం నుంచి కోలుకుంటున్నారని ఇన్స్టాలో పంచకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘కమిటీ కుర్రోళ్లుతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యుదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. తన సొంత ఫ్యామిలీ బ్యానర్లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తోన్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు చిత్రంలోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
'దురంధర్-2 ఫెయిల్ కావడమే వాళ్లందరి కోరిక': కోహ్లీ సంచలన కామెంట్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.తాజాగా ఈ మూవీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మాట్లాడారు. ధురందర్: ది రివెంజ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారని వెల్లడించారు. అలా కోరుకున్న వారిలో స్టార్ డైరెక్టర్స్ సైతం ఉన్నారని కునాల్ కోహ్లా సంచలన కామెంట్స్ చేశారు. దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతమే ఫెయిల్ అవుతుందని ఊహల్లో తేలియాడారని అన్నారు. కానీ వారి అంచనాలకు విరుద్ధంగా ఈ మూవీ రాణించిందని పంచుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్ల వేటతో అదరగొట్టేసింది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వెయ్యి కోట్లు వసూళ్లు చేసి సత్తా చాటింది.కునాల్ కోహ్లీ మాట్లాడుతూ..'బాలీవుడ్ పరిశ్రమ మొత్తం సినిమాకు మద్దతు ఇవ్వకపోయినా ఆడుతోంది. ధురందర్కు బాలీవుడ్లో ఎవరూ కూడా మద్దతు ఇవ్వలేదు. అగ్రశ్రేణి దర్శకులు సైతం ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. మొదటి సోమవారం నుంచే దురంధర్-2 ప్రదర్శన ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సోమవారం నుంచే వసూళ్లపరంగా మరింత దూసుకెళ్లింది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. బోర్డర్- 2కు సైతం ఎవరూ మద్దతు ఇవ్వలేదు. కానీ అది బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు" అన్నారు.అలాగే ఎవరీ మద్దతు లేకపోయినా తన 'హమ్ తుమ్' (2004) మూవీ కమర్షియల్గా సక్సెస్ అయిందన్నారు. ఈ చిత్రంతో తనకు ఎదురైన అనుభవాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారు నా చిత్రాన్ని మెచ్చుకునే అవకాశం లేదని.. ప్రీమియర్ షో హాజరుకావద్దని ఆదిత్య చోప్రా తనకు సలహా ఇచ్చారని ఆయన పంచుకున్నారు. కానీ సినిమాకు నేను వెళ్లానని.. అక్కడ వచ్చిన స్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు.. చాలా నిరాశతో ఆదిత్య చోప్రాకు ఫోన్ చేశా.. ఇది వాళ్లకు నచ్చే రకం సినిమా కాదని నాకు తెలుసు.. అందుకే నిన్ను వెళ్లవద్దని చెప్పానని అన్నాడు. అంటే పరిశ్రమలోని 99 శాతం మంది మీరు విజయం సాధించాలని కోరుకోరని కునాల్ కోహ్లీ స్పష్టం చేశారు. తన తొలి చిత్రం 'ముఝ్సే దోస్తీ కరోగే!' (2002) సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. స్వయంగా ఫోన్ చేసి అభినందించిన రాకేష్ రోషన్ను కోహ్లీ ప్రశంసించారు. -
పళ్లి చట్టంబి రిలీజ్ వాయిదా.. కారణమదే..!
మలయాళ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం పళ్లి చట్టంబి. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ రోజే సినిమా విడుదల కావాల్సి ఉంది.మలయాళంలో మాత్రం ఈ రోజే విడుదల చేసిన మేకర్స్.. తెలుగు విడుదల వాయిదా వేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రానుంది. సాంకేతిక సమస్యస కారణంగానే ఈ మూవీ తెలుగు రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్ని వాస్ వర్క్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ కీలకపాత్రలు పోషించారు. 1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
తినడానికి కూడా లేనప్పుడే నా చేయి పట్టుకుంది: కిరణ్ అబ్బవరం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సతీమణి రహస్య గోరఖ్పై ప్రశంసలు కురిపించారు. తనకు తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో తనను నమ్మిందని కిరణ్ అబ్బవరం కొనియాడారు. మూవీ ఆఫర్ల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి నాకోసం లంచ్ బాక్స్ తెచ్చేదని వెల్లడించారు. నా భార్య నా దగ్గర ఏమీ లేనప్పుడే నా చేయి పట్టుకుందని ఎమోషనల్ అయ్యారు.ఆ తర్వాత రహస్య గోరఖ్ తన భర్త గురించి మాట్లాడారు. నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్లో అని.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని అని కామెంట్స్ చేసింది. పెళ్లయ్యాక తను కష్టపడతాడు.. నేను ఖర్చు పెడతాను అనుకున్నానని తెలిపింది. కానీ అతనికి చుట్టూ జనం ఉండాలి.. సందడి సందడిగా కనిపించాలని అన్నారు. లైఫ్లో ఇలాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారని రహస్య గోరఖ్ ప్రశంసలు కురిపించింది. -
టాక్సిక్ గ్యాంగ్స్టర్ సినిమా కాదు.. యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్లో ఓ గ్యాంగ్స్టర్ కథ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్ జోనర్ మూవీ అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్ రిలీజ్ తర్వాత అందరూ ఇది గ్యాంగ్స్టర్ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్స్టర్ సినిమా కాదు. యాక్షన్ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అలాగే యశ్ రావణుడిగా, రణ్బీర్ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్బీర్తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్బీర్ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది. -
అందుకే ప్రభాస్ ‘ఫౌజీ’లో నటించలేదు : తీరువీర్
యంగ్ హీరో తీరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ని ప్రారంభించిన తీరువీర్.. ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ.. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీరువీర్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ప్రభాస్తో కలిసి నటించే అవకాశం వచ్చినా.. వదిలేశాడట.‘హీరోగానే కాకుండా సపోర్టింగ్ యాక్టర్గానూ అవకాశాలు వస్తున్నాయి. కానీ కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేశాను. మరికొన్ని నచ్చినా.. డేట్స్, లుక్ సెట్ కాక వదులుకోవాల్సి వచ్చింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్లో మురుగన్ పాత్ర నేనే చేయాల్సింది. కానీ డేట్స్ కుదరలేదు. అలాగే ప్రభాస్ ‘ఫౌజీ’లోనూ ఒక పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ నేను వేరే వేరే సినిమాలతో బీజీగా ఉండడం.. ఒక్కో నెలకు ఒక్కో లుక్లో ఉండాల్సి రావడంతో అది కూడా వదులుకోవాల్సి వచ్చింది. నా కోసం వాళ్లు షూటింగ్ ఆపుకోలేరు. వాళ్లకు ప్రయారిటీస్ ఉంటాయి. బడ్జెట్..కండీషన్స్ ..టార్గెట్స్ అన్నీ ఉంటాయి. మన వల్ల అవ్వనప్పుడు మనం ఇబ్బంది పడొద్దు..ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు. అందుకే కొన్ని నచ్చిన పాత్రలను కూడా వదిలేశా.ఇండస్ట్రీ చాలా చిన్నది. ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు అనేది అందరికి తెలుసు. అందుకే డేట్స్ కుదరట్లేదు అంటే అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం నేను సపోర్టింగ్ యాక్టర్గా ఏ సినిమా చేయట్లేదు. హీరోగా నటించిన రెండు, మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది’ అని తీరువీర్ చెప్పుకొచ్చాడు. -
పడవలో ఫైట్
గంగానదిలో శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు రుద్ర. విజువల్గా ఈ ఫైట్ ఏ లెవల్లో ఉంటుందనేది ‘వారణాసి’ సినిమాలో చూడొచ్చు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘వారణాసి’. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.గంగానదిలో పడవలో ప్రయాణిస్తుండగా శత్రువులతో హీరో చేసే ఫైట్ ఇది. ఈ ఫైట్ సీక్వెన్స్లో మహేశ్బాబు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘వారణాసి’ టీమ్ విదేశాలకు వెళుతుందట. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి చిన్న వీడియో లీకై, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లీక్స్ పట్ల మహేశ్బాబు అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ‘వారణాసి’ షూట్కి సంబంధించిన విజువల్స్ లీకైన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
అడవిలో సవాల్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ రాజమహేంద్రవరంలో ఆరంభమైంది. ‘‘ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘భోగి’ ఒకటిగా నిలిచేలా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రక్షా బంధన్ సందర్భంగా ఆగస్ట్ 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్ అరోకియా. -
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ఆస్కార్ అవార్డును కూడా తెచ్చింది. విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలుగు సినీ ఇండస్ట్రీపైనే ఉంది. అందుకే పరభాషా హీరోలు టాలీవుడ్ దర్శక–నిర్మాతలతో అసోసియేట్ అయి, సినిమాలు తీస్తున్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా హిట్ చేస్తారు, ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ ఇస్తారు. దీంతో తెలుగులో సినిమాలు చేసే పరభాషల హీరోల సంఖ్య ఎక్కువ అవుతోంది. తెలుగు దర్శక–నిర్మాతలు కూడా ‘మీరొస్తామంటే... మేమొద్దంటామా..!’ అంటూ సినిమాలను ఓకే చేస్తున్నారు. మరి... ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న కొందరు పరభాషా హీరోలపై ఓ లుక్ వేయండి.సల్మాన్ భాయ్ వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో తిరుగు లేని నటుడు. అయితే తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూశారు. కొంతమంది కమర్షియల్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.ఈ నెలాఖరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించనున్నారు. వచ్చే నెలలో ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్రాజా డైరెక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.హిట్ 4 అన్నయ్య సూర్య బాటలోనే కార్తీ నడుస్తున్నారు. సూర్య మాదిరిగానే కార్తీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యను ఓన్ చేసుకున్నట్లే కార్తీని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 2016లో ‘ఊపిరి’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ఇది. తెలుగులో కార్తీ చేసిన స్ట్రయిట్ ఫిల్మ్గా ‘ఊపిరి’ని చెప్పుకోవచ్చు. కార్తీతో సినిమాలు చేసేందుకు కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపించారు.‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ వంటి దర్శకులు కథలు వినిపించారని తెలిసింది. ఈ చర్చలు ఇలా ఉండగానే... నాని నిర్మాతగా ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ‘హిట్ 4’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్కు వెళ్లనుందని తెలిసింది. ఇక కార్తీ నటించిన ‘సర్దార్ 2’ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా, ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.డబుల్ ధమాకా! ‘కాంతార, కాంతార: చాప్టర్ 2’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెలుగులో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ప్రశాంత్ శర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా మరో కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.మరోవైపు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయనున్న ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. 18వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోని బెంగాల్ ప్రావిన్స్ ప్లేస్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇందులో ఓ తిరుగుబాటు దళానికి చెందిన నాయకుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జై హనుమాన్’తో రిషబ్ బిజీగా ఉన్నారు. సో... అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి చేయనున్న సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.నిశ్శబ్దం పెరిగేకొద్దీ... ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ రద్దు అయిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు హల్చల్ చేయడం.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్ షేర్ చేసి, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆయన ఫొటో వైరల్గా మారింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.హీరోగా హాస్యనటుడుచాలాకాలం హాస్య నటుడిగా కొనసాగిన సూరి మెల్లిగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. సూరి హీరోగా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆర్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విధంగా తెలుగులో సూరి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుందని తెలిసింది.తెలుగులో బిజీ బిజీ ‘మహానటి, లక్కీభాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి దర్శకురాలిగా పరిచయం అవుతుండగా ఇందులో శ్రుతీ హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాకు నిర్మాతలు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బలమైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి సాహసం చేసిందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఎమోషనల్గా చూపించనున్నారట దర్శకుడు పవన్. అలాగే రవి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంకా నాని నిర్మాతగా ‘కోర్ట్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన రామ్ జగదీష్ డైరెక్షన్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీ బిజీగా ఉంటున్నారు. అటు మలయాళంలోనూ ఆయన హీరోగా ‘ఐ యామ్ ది గేమ్’ సినిమా రూపొందుతోంది. షూటర్ విశ్వనాథ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన హీరోనే అని ఫీలవుతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో అనువాదం అవుతుంటాయి. ఇదిలా ఉంటే... సూర్య తెలుగులో స్ట్రయిట్గా ‘రక్త చరిత్ర 2’ (2010) అనే సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్తో ‘సార్’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో షూటర్ సంజయ్ విశ్వనాథ్గా సూర్య నటిస్తున్నారు. హీరోయిన్గా మమితా బైజు కనిపిస్తారు.రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ విశ్వనాథ్ కన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంటుంది. ఈ సమస్య నుంచి సంజయ్ ఎలా బయటపడ్డాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది.సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’ మే 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయని, రిలీజ్ డేట్పై కూడా స్పష్టత వస్తుందని ఊహించవచ్చు. ఇంకా... ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి సైతం సూర్యను కలిసి, కథ వినిపించారని తెలిసింది.ఒకేసారి రెండు సినిమాలుఅల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఫాహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఈ చిత్రాలు ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’. ఈ రెండు చిత్రాలు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి తనయుడు) నిర్మిస్తున్నవే. ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. భావోద్వేగాలతో ముడిపడిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది.ఈసారి హీరోగా..! తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఉప్పెన, సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. కొంత కాలంగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ కొండ్రల్ల ఈ సినిమాను నిర్మించారు. త్వరలోను రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్తమిళంలో సూపర్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేసిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, సూపర్ హిట్గా నిలిచాయి. ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో తమిళ సినిమా ఇది. అయితే ఈసారి ఇదే నిర్మాణ సంస్థలో ప్రదీప్ హీరోగా ఓ తెలుగు సినిమా రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. చంద్రశేఖర్ ఏలేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేశారని, ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పుడు చాలా సినిమాలు ఒక భాషలో తెరకెక్కి, ఇతర భాషల్లో అనువాదం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ద్విభాషా చిత్రాలుగా కూడా ఉంటున్నాయి. ఈ రకంగా పరభాషా హీరోలు టాలీవుడ్లో సినిమాలు చేసినప్పుడు, ఈ చిత్రాలు ఆ హీరోల మాతృభాషలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా హీరోలకు రెండు విధాలా కలిసొస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరూ ఒక సినిమాను పూర్తి చేసేందుకు దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. సినిమా భారీతనాన్ని బట్టి ఎక్కువ సమయం పడుతోందని ఊహించవచ్చు. పైగా ఒక సినిమా సెట్స్లో ఉండగా ఇంకో సినిమా చేసే వీలు కొందరు హీరోలకు ఉండటంలేదు. పరభాషల హీరోలతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అసోసియేట్ కావడానికి ఇదొక కారణం అనే ఊహాగానాలు ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
తమిళంలోకి మాస్ ఎంట్రీ
లవర్ బాయ్గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రాజ్ తరుణ్, ఆరి అర్జునన్, అమ్ము అభిరామి, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రఫ్ నోట్ ప్రోడక్షన్ సంస్థ తమిళ–తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మిల్టన్ మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన ఈ మూవీ ఆడియన్స్కి మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది. స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ మా చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించారు’’ అని పేర్కొన్నారు. -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'రష్మిక వెడ్డింగ్.. మాకు చాలా తక్కువ టైమ్ ఇచ్చింది'
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఈ ఏడాది తెలుగింటి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్లో ఉదయ్పూర్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఈ పెళ్లిలో రష్మికను ముస్తాబు చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఎక్కువ మేకప్ వద్దని చెప్పిన రష్మిక.. మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల్లో రెడీ చేయాలని సూచించారని వెల్లడించింది. కానీ రష్మిక ఇచ్చిన టైమ్లో మా పని పూర్తి కాలేదని.. దాదాపు 90 నిమిషాలు పట్టిందని తన్వీ వివరించింది.ఆమె అనుకున్న టైమ్ కన్నా ఆలస్యంగా రావడం వల్లే మాకు సమయం తగ్గించారని తన్వీ పేర్కొంది. పెళ్లిలో తాను చాలా సింపుల్గా, నేచురల్గా కనిపించాలని మాతో చెప్పిందని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించింది. కనీసం కాటుక కూడా పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపింది. మేము కూడా రష్మిక చెప్పనట్టే చేశామని.. కానీ ఇంతలా మాకు ప్రశంసలు వస్తాయని అనుకోలేదని చెప్పింది. రష్మిక హీరోయిన్ కావడంతో మేకప్, హెయిర్ స్టైల్పై ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని తన్వీ అన్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబాలితో పాటు మైసా అనే చిత్రంలో నటిస్తున్నారు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. ఈ మూవీని 1854- 1978 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
అల్లు- అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా?
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ లుక్లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్తో సన్ పిక్చర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు. ఈ విషయంపై షారుక్ టీమ్ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్పై చూసే అవకాశం ఆడియన్స్కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది. -
దురంధర్ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్టైమ్ కలెక్షన్స్ను దాటేశాయి. దురంధర్, దురంధర్-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2: ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్ దాటలేదు. ఈ విషయంలో దురంధర్ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.మంజులిక అనుకొని.. 2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.అదే తేడాభూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు
కోలీవుడ్ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గతనెల తండ్రిగా ప్రమోషన్ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు. తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా కెరీర్.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) -
ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఓటీటీకి మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. Presenting the JioHotstar official trailer of Sambhavam Adhyayam Onnu starring Askar Ali, Vineeth Kumar and Sidharth Bharathan. Streaming exclusively on JioHotstar from April 15.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/BFtGtdlRGb— JioHotstar Tamil (@JioHotstartam) April 11, 2026 -
‘తెరచాప’: మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్, చాలా కష్టపడ్డారు
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్రాజ్ శంకరాపు అన్నారు. -
ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ టాలీవుడ్లో వైరల్గా మారింది.రూ.250 కోట్ల ఆఫర్..!ఈ సినిమా డిజిటల్ రైట్స్కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది. -
వాళా-2 సూపర్ హిట్.. పార్ట్-3 అధికారిక ప్రకటన
ఇటీవల విడుదలైన మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు. హిట్ మూవీకి సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. #Vaazha3 - Biopic of a Billion Girls.The #Vaazha franchise continues its journey of introducing fresh talent and new voices to cinema. Production begins next year. pic.twitter.com/YcHanDL3Q6— Shine Screens (@Shine_Screens) April 14, 2026 -
టాక్సిక్ మరోసారి వాయిదా.. మేకర్స్ ఏమన్నారంటే?
కన్నడ హీరో యశ్.. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్గా ఉండడంతో మేకర్స్పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్లో మరో ఆందోళన కలిగిస్తోంది.తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. -
రాకా.. బన్ని కెరీర్లోనే తొలిసారి!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకు తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారందరిని మెప్పించే కథలపైనే బన్నీ ఫోకస్ పెట్టాడు. అందులో ఒకటి రాకా. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న తొలి సినిమా ఇది. రూ. 900 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఇందులో బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన లుక్ విలన్ది. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్గా ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలు మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా దీపికా పదుకొణె పేరు బయటకు వచ్చింది. మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక, మృణాల్, జాన్నీ కపూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో రష్మిక అల్రేడీ బన్నీతో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించింది. మృణాల్, జాన్వీలు తొలిసారి బన్నీతో స్క్రీన్ చేసుకుంటున్నారు. ఇలా ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించడం బన్నీ కెరీర్లోనే తొలిసారి. కథ డిమాండ్ మేరకే నలుగురిని తీసుకున్నారట. అంతేకాదు ఈ నలుగురి పాత్రలు కూడా సినిమాలో కీలకం అట. ఒకవైపు కావాల్సినంత గ్లామర్ని చూపిస్తూనే.. మరోవైపు కథలో కీలకంగా వ్యవహరించేలా వీరి పాత్రలను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నలుగురూ బన్నీతో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. -
విజయ్కి బిగ్ షాక్.. లోకల్ ఛానల్లో ‘జననాయగన్’
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్కు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సుమారు ఐదు నిమిషాల నిడివి గల కీలక దృశ్యాలు, పాటలు ఇంటర్నెట్లో లీక్ కాగా, తాజాగా ఓ లోకల్ ఛానల్ ఏకంగా సినిమా మొత్తాన్ని ప్రసారం చేసింది. ఇంకా థియేటర్స్లో కూడా విడుదల కానీ ఈ సినిమా.. టీవీలో ప్రసారం చేయడం చిత్రబృందాన్ని షాక్కు గురి చేసింది.కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో ‘రాశి కేబుల్ టీవీ’ నెట్వర్క్ను నిర్వహిస్తున్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానెల్లో ఏప్రిల్ 11 రాత్రి ఈ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఇంకా థియేటర్స్లో విడుదల కాని సినిమా ఏకంగా టీవీలో ప్రసారం కావడాన్ని చూసి విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు షాకయ్యారు. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సినిమా మొత్తం సదరు ఛానల్లో ప్రసారం అయిందని టీవీకే నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్ లీకేజీకి సంబధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. -
టాలీవుడ్ బిగ్ పాన్- ఇండియా సినిమాలో అలియా భట్
బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ మరోసారి టాలీవుడ్కు రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు కథనాలు బాలీవుడ్ మీడియాలో రావడం విశేషం. రాబోయే పాన్-ఇండియా తెలుగు చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం అలియా భట్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ఖరారైతే ఇండస్ట్రీలో సంచలనంగా మారనుంది. ఆపై ఈ ప్రాజెక్ట్కు దేశవ్యాప్తంగా బలమైన ప్రచారం జరుగుతుంది. అయితే, ఏ సినిమాలో అలియా నటించనున్నారనే అంశం చాలామందిలో ఆసక్తి నెలకొంది.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్).. ఈ ప్రాజెక్ట్లో అలియా భట్ కీలకపాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, ఆలియా కోసం ఒక కీలకమైన, పవర్ఫుల్ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది . ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో సీతగా కనిపించిన విషయం తెలిసిందే.ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’ లో కూడా ఆమె పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. -
రజనీకాంత్ కొత్త చిత్రం ఆగిపోవడానికి.. నానినే కారణం..?
-
కోలీవుడ్ ని ఆశ్చర్యపరుస్తోన్న విక్రమ్ తీరు
-
ఆశా భోంస్లేకి నివాళి.. పాకిస్తాన్ ఛానల్కు నోటీసులు!
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణించారంటూ తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, ఆ సందర్భంగా భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినందుకు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఛానల్కు నోటీసులు జారీ చేసింది.తప్పుడు వార్తలు ప్రసారంలెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం ఆమె అంతక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్కు చెందిన 'జియో న్యూస్' కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది.పాటలతో పాటు వీడియో క్లిప్పింగులుఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్లో ప్రసారం చేశారు. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్ను ప్రసారం చేయొద్దు. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పెమ్రా సీరియస్ అవుతూ.. సదరు న్యూస్ ఛానల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పేముంది?పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని పునఃపరిశీలించి, కీర్తించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. నిజానికి, ఆశా భోస్లే వంటి గొప్ప కళాకారిణికి సంబంధించి, ఆమె కాలాతీతమైన, చిరస్మరణీయమైన పాటలను మనం పంచుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పంచుకోవాల్సింది. అయినప్పటికీ పెమ్రా (PEMRA), దీనిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది’ అని అబ్బాస్ ట్వీట్ చేశారు. భారతీయ కంటెంట్ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026 -
డెకాయిట్ సంతృప్తి ఇచ్చింది: సుప్రియ
‘‘సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండాలి. అలాంటి మ్యాజిక్ ‘డెకాయిట్’ చిత్ర కథలో ఉంది. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించకుండా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. అన్నీ బడ్జెట్ పరంగా ఆలోచిస్తే కథకు న్యాయం చేయలేం. అలాగే మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. ‘డెకాయిట్’ చిత్రానికి పతాక సన్నివేశమే అందం’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం సుప్రియ విలేకరులతో పంచుకున్న విశేషాలు....⇒ ‘డెకాయిట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని ఇస్తోంది. హరి పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. మృణాల్ పోషించిన సరస్వతి పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ బలంగా ఉన్న సినిమా తీయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది. ‘డెకాయిట్’ చిత్రం ఆ సంతృప్తి ఇచ్చింది.⇒ డిస్ట్రిబ్యూషన్ పరంగా, నిర్మాణపరంగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నాం అంతే. నాగార్జునగారి వందో సినిమా గురించి, 2027 సంక్రాంతికి ఆయన హీరోగా రానున్న సినిమా గురించి ప్రస్తుతం నేను ఏం చెప్పలేను.. ఆయనే చెబుతారు. మా ఎస్ఎస్ క్రియేషన్స్లో మళ్లీ సినిమా చేసేందుకు కథలు వినాల్సి ఉంది.⇒ ఓ సినిమా థియేటర్స్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధనపై నిర్మాతలందరూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే నిర్మాతలు–ఎగ్జిబిటర్స్ మధ్య పర్సెంటేజ్ వి«ధానం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. రెంటల్ విధానంవైపే నేను మొగ్గు చూపుతాను. కాకపోతే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం థియేటర్స్వారికి లాభం చేకూర్చేలాగా ఆలోచించాలి. ఈ అంశంపై నువ్వా? నేనా? అనే ధోరణితో కాకుండా మనం అనుకుని అందరం కలిసి మాట్లాడుకోవాలి. -
ప్రతి ఊరి కథ: మునిరాజు
సాయితేజ్, వేద జలంధర్ జోడీగా నటించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. వి. మునిరాజు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మించారు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.మునిరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘దర్శకుడు కావాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చి, ఆన్లైన్ ఎడిటర్గా కెరీర్ను ప్రారంభించాను. కొద్ది రోజుల తర్వాత మా ఊరు తిమ్మరాజుపల్లికి వెళ్లి అక్కడి ప్రజలతో ఓ డెమో సినిమా చేశాను. ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్లో ఉండగా కిరణ్ అబ్బవరంగారితో పరిచయం ఏర్పడింది.నా డెమో మూవీ గురించి ఆయనకు చెప్పాను. పూర్తిస్థాయిలో కథ డెవలప్ చేశాక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రారంభం అయింది. ఇది ప్రతి ఊరి కథ. తిమ్మరాజుపల్లి అనే ఊరికి తొలిసారిగా ఓ టీవీ వస్తుంది. కానీ, ఆ టీవీ మాయం అవుతుంది. ఆ టీవీ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. మంచి సస్పెన్స్ డ్రామాతో కథనం సాగుతుంది. మన పల్లెటూరి సంస్కృతి, ఊరి ప్రజలు, అహం, భావోద్వేగం, ప్రేమ వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించాను. ప్రస్తుతం నా వద్ద వైవిధ్యమైన కథలు ఉన్నాయి’’ అని చెప్పారు. -
'డెకాయిట్'లో హీరోయిన్ మార్పు నిర్ణయం సరైనదేనా?
కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్ను తీసుకున్నారు.అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది. -
'అలా అయితేనే ఒప్పుకుంటా': అనన్య నాగళ్ల
అనన్య నాగళ్ల హీరోయిన్గా వస్తోన్న మూవీ "లీసా". సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..' నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటా. డిఫరెంట్గా ఉంటేనే ఆ మూవీని ఒప్పుకుంటా. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా కొత్తదనాన్ని ఫీలయ్యా. హీరోయిన్స్గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ..' లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య ఫర్మామెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, దశరథ్, కిషోర్ దాస్, రవిరెడ్డి , సత్యశ్రీ, మాసం రత్నాకర్ రెడ్డి, హను శ్రీ, గీత, భాను కీలక పాత్రల్లో నటించారు. -
విష్ణు ప్రియ వివాదం.. మొహం చాటేసిన యాంకర్..!
టాలీవుడ్ యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై . ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించేందుకు యత్నించగా మొహం చాటేసుకున్నారు. మీరు ఎంత డబ్బులు సంపాదించారని కొందరు ఆమెను అడిగారు. దీంతో తన చేతులను మొహానికి అడ్డుగా పెట్టుకుని.. మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే?..ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Anchor :- #VishnuPriya గారిని ఎంత డబ్బులు సంపాదించారు#VishnuPriya : “Mummy” pic.twitter.com/zo5rP9h3w4— Milagro Movies (@MilagroMovies) April 13, 2026 -
'భర్త పోయాక మొదటి మ్యారేజ్ డే'.. ప్రముఖ నటి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.ప్రియా కపూర్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.నటి ప్రియా సచ్దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు. మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్కు కరిష్మా కపూర్తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Priya S Kapur (@priyasunjaykapur) -
'బావ బావ అంటాంటే.. బాగుందే నీతో ఉంటాంటే'.. రవితేజ వారసుడి లవ్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
ది గోట్ లైఫ్ను దాటేేసిన చిన్న సినిమా.. ఏకంగా టాప్-6లో..!
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది. 2024లో వచ్చిన ది గోట్ లైఫ్ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. కేరళ బయట సైతం ఈ మూవీకి క్రేజ్ వస్తోంది. పాఠశాల జీవితం, ఫ్రెండ్స్ కాన్సెప్ట్తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చూస్తే వసూళ్లపరంగా రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో రూ. 73.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇండియాలో రూ. 77.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.హిట్ మూవీకి సీక్వెల్.. 2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. -
అడివి శేష్ డెకాయిట్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్. ఈ నెల ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఓవరాల్గా చూస్తే మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం ఆదివారం రోజు రూ. 6.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విదేశీ మార్కెట్లోనూ రాణిస్తోంది. సండే ఒక్క రోజే రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ వసూళ్లు ఇప్పటివరకు రూ. 11.65 కోట్లకు చేరుకున్నాయి.ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే రూ. 23.12 కోట్ల గ్రాస్ సాధించగా.. రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అడివి శేష్ నటించిన హిట్-2తో పోలీస్తే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డకాయిట్ ముందంజలో ఉంది. హిట్-2 విడుదలైన మూడు రోజుల్లోనే భారతదేశంలో రూ. 16.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా.. అదే సమయంలో డెకాయిట్ రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కాగా.. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించగా.. మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.. -
అతియా శెట్టి చిన్న మిస్టేక్.. నెటిజన్ల దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యారు. ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్షాట్లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా.. ఆదివారం ఏప్రిల్ 12న లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Athiya Shetty gone mad She uploaded a picture of Lata Mangeshkar instead of Asha Bhosle. 😭 pic.twitter.com/bKCZPBAjjG— Mohit (@Warlockmohit) April 12, 2026 Athiya Shetty Is Beauty Without Brains She posted a story with photo of Late Lata Mangeshkar instead of Late Asha Bhosle.Nepo kids just want to be relevant somehow, without hardwork or struggle and that's why their movies flop and they make such blunders. https://t.co/hy3KvJwUUo pic.twitter.com/4TXjZ0SJJ3— Vidhi (@vidhisharmx) April 12, 2026 -
మృణాల్ ఠాకూర్ను లెజెండరి హీరోయిన్లతో పోల్చిన నాగ్ అశ్విన్
సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఆమె మరాఠీ అమ్మాయని తెలిసినప్పటికీ అంతా తెలుగమ్మాయిలాగే భావిస్తారు. తాజాగా ఆమెపై దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. అడివి శేష్తో కలిసి మృణాల్ నటించిన చిత్రం ‘డెకాయిట్’ భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.. దీంతో సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు.డెకాయిట్ మూవీ విజయోత్సవంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మృణాల్ అద్భుతమైన నటి అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమెలాంటి నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. సాధారణమైన పాత్రలు చేసి నీ స్థాయిని తగ్గించుకోవద్దు. లెజెండరీ అలనాటి హీరోయిన్లు స్మిత పాటిల్, మధుబాల తరహాలో గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటాను' అని అన్నారు. అదే సమయంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డను నాగ్ అశ్విన్ అభినందించారు. సుప్రియ స్కూల్లో తన సీనియర్ అని ఆమె ఇంత గొప్ప సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ప్రశంసించారు.అడివి శేష్ కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా డెకాయిట్ నిలిచింది. రెండురోజుల్లోనే ఏకంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ నిర్మాత సుప్రియ అంటూ అడివి శేష్ తెలిపారు. అయితే, మృణాల్ ఈ సినిమాకి మరో బలం అంటూ గుర్తుచేశారు. -
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం 'జననాయగన్' పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి దాదాపు గంటకు పైగా కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమానే లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి. కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. -
శ్రీలంక వెకేషన్లో హీరోయిన్ ప్రణీత.. హాఫ్ శారీలో సురేఖవాణి కూతురు..!
శ్రీలంక వేకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రణీత..లంగా ఓణిలో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..లైట్ పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..బాలీవుడ్ భామ ఇషితా దత్తా హాట్ ఫోజులు..శారీలో ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
సింగర్ ఆశా భోస్లే.. ఆమె పాడిన తెలుగు పాటలేవో తెలుసా?
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇవాళ కన్నుమూశారు. శనివారం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. వేల పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోస్లే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం పట్ల యావత్ సినీ లోకం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా ఆశా పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమె తన గాత్రం అందించారు. లతా మంగేష్కర్ సిస్టర్ అయిన ఆశా తెలుగులో పాడిన పాటలు పాడి ఆడియన్స్ను అలరించారు. ఆమె మరణం వేళ... తెలుగులో పాడిన పాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా)ఇసాలకిడీ (పవిత్ర బంధం)వెన్నెల (ఇద్దరు)నాలో ఊహలకు (చందమామ)ఆశా భోస్తే పాడిన తెలుగు పాటలివే..ఇది మౌనగీతం (పాలు నీళ్లు)జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు)శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం)ఓ ప్రేమ (అశ్వమేథం) -
'దయచేసి అర్థం చేసుకోండి'.. సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతం
టాలీవుడ్ సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తనపై వస్తున్న అసత్య ప్రచారంపై తన బాధను వ్యక్తం చేసింది. ఎవరో వచ్చి నాపై ఆరోపణలు చేస్తే.. ఏది పడితే రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. కేవలం పాటే నా ప్రాణమని మంగ్లీ ఆవేదన తెలిపింది. నిజనిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరింది. నేను కూడా సోషల్ మీడియా నుంచే వచ్చానని.. కానీ అదే నాకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఆ వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నాడని మంగ్లీ అన్నారు. నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకు లాగకండని కోరింది. మీడియా అంటే తనకు చాలా గౌరవం ఉందని.. దయచేసి ఈ విషయంలో మీరు వెనక, ముందు చూసుకోవాలని సూచించింది. ఎవరెవరో నేనంటే పడని వాళ్లు.. నాపై ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. నాపై పార్టీ ముద్రలు వేయడంతో 2003 తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు కూడా పాడలేదన్నారు. -
OTT: హాయిగా అనిపించే, ఆహ్లాదం కలిగించే సినిమా కావాలా?
పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్కు అదొక ఎమోషన్. కొరియన్ కల్చర్కు పట్టం కట్టే వెబ్ సిరీస్, కె–పాప్...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు. అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్ కల్చర్... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.విదేశీ కలల విహారం... ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే సినిమా కథలు మనం గతంలో చూశాం. పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్ ఇన్ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్ డేల్ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్బా అనే యువతి కలల కధే ఈ మేడ్ ఇన్ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా సాగుతుంది? అనేదే ఈ కథ.కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్గా, ఎక్కడా రిస్క్ తీసుకోకుండా సాగుతుంది. ఇది కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ మనసును తాకుతాయి. యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్ డేల్ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్ కల్చర్ మిక్స్ కొత్తగా అనిపించడం మరో బలం.అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్గా ముగించేయడం ఎమోషన్స్ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే ‘‘మేడ్ ఇన్ కొరియా’’ ఒక లైట్, ఫీల్ గుడ్ సినిమా. ఒక వీకెండ్లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్ ఇన్ కొరియా బెస్ట్ ఛాయిస్. ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. -
Karmastalam: యోధుడిలా అరవింద్ కృష్ణ
అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్ను, మేకింగ్ వీడియోని షేర్ చేశారు.అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు. ఇలాంటి టైంలో ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్, మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక సెట్లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్, రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్గా ఉన్నాయి. గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. విజువల్స్, బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది. -
'అందుకే నాపై దుష్ప్రచారం'.. పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు
టాలీవుడ్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ ఇచ్చారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీ తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఇటీవల న్యాయవాది సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.ఆ డబ్బులు ఇవ్వనందుకే తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని మంగ్లీ పోలీసులకు తెలిపారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని సింగర్ అన్నారు. కాగా.. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని పంజాగుట్ట పోలీస్స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
నెంబర్వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్కి కేరాఫ్గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది. -
ఆశా భోస్లే మరణం.. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే?
లెజెండరి సింగర్ ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మరణం వేళ ఆశా సింగర్గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు. అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. -
'అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయాం'.. మెగాస్టార్, ఎన్టీఆర్ నివాళి
ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు. భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నివాళి..లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు. అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.లెజండరి సింగర్, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. Growing up meant waking up to melodies that felt like home, and so many of them carried the voice of Asha Bhosle ji.From old radios in the morning to late-night songs playing softly in the background, she was always there, without us even realizing how deeply she shaped our… pic.twitter.com/OV8Ythx6ms— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) April 12, 2026 Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026 Deeply saddened by the news of Asha Bhosle ji’s passing. Her magical voice was the heartbeat of Indian cinema for decades and touched millions of hearts. She leaves behind a legacy that will live on for generations and will always be remembered with respect and love. My deepest… pic.twitter.com/U81F2NBBeD— Jr NTR (@tarak9999) April 12, 2026 -
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026 -
పిల్లలను ఎలా పెంచాలి?..ఆలియాకు సద్గురు సలహా ఇదే
ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం... నిన్నటి బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెఐటిఓ) చెన్నైప్లస్ ఆధ్వర్యంలో ఇన్ కన్సర్వేషన్ విత్ మిస్టిక్ అనే థీమ్తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్ సద్గురువును అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు. దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు కూడా దీనిని అంగీకరిస్తారని భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి నేర్చుకోమని ఆలియా భట్కు సద్గురు సూచించారు. ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి. -
గ్లామర్తో ట్రెండ్ మార్చనున్న వైరల్ బ్యూటీ
ఇతర భాషా నటీమణులు ముఖ్యంగా ఉత్తరాది కథానాయకలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉంటోంది. అలా చాలా మంది దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మకాం వేస్తున్నారు. అలాంటి వారిలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరు అని చెప్పావచ్చు. ఈ మరాఠి బ్యూటీ మిస్టర్ బచ్చన్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, భాగ్యశ్రీ బోర్సే మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. కారణం చూడగానే ఇట్టే ఆకర్షించే అందం, శరీర ఆకృతి కావచ్చు. అయితే స్టార్ హీరోల సరసన నటిస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించలేదు. అదే విధంగా తమిళంలోకి కాంత చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటనకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటించారు. అలా నటించడం వల్లే ఈ అమ్మడికి రావలసిన క్రేజ్ రావడం లేదని తెలిసి వచ్చినట్లు సమాచారం. దీంతో ఇకపై తన పాత్రల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. అంటే ఇకపై గ్లామర్ విషయంలో కాస్త డోస్ పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల మాట. అందులో భాగంగానే ఈ బ్యూటీ లేటెస్ట్గా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇతర కార్యక్రమాల్లోనూ మోడరన్ దుస్తులు ధరించి పాల్గొంటున్నారు. ఇలాగైనా తన ఫేట్ను మార్చుకోవాలని భాగ్యశ్రీ యతి్నస్తున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఇకపై ఈ అమ్మడిని మరో కోణంలో చూడబోతున్నామన్న మాట. View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) -
యాక్షన్ హీరోలా చూపించారు: వెంకట్
‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఆ మాట నిలబెట్టుకున్నాం: శర్వానంద్
‘‘నేను మంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తాననే తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ‘బైకర్’ చిత్రం తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని మొదటి నుంచే చెబుతున్నాను. మంచి ఫ్యామిలీ సినిమా తీసి, ఆ మాట నిలబెట్టుకున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ మౌత్ టాక్ వల్ల మా చిత్రం అద్భుతంగా ఆడుతోంది’’ అని హీరో శర్వానంద్ తెలిపారు.అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటించిన చిత్రం ‘బైకర్’. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదల అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో శర్వానంద్ మాట్లాడుతూ–‘‘అభిలాష్ మంచి తండ్రీ కొడుకుల కథ చెప్పాడు. నాకు అద్భుతమైన సినిమా అందించిన యూవీ క్రియేషన్స్కు ధన్యవాదాలు. నా వెనుక దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.ఈ ఏడాది నాకు రెండు హిట్లు వచ్చాయి’’ అని చెప్పారు. అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మా సినిమాలోని రేసింగ్తో పాటు తండ్రీ కొడుకు, భార్యాభర్తల భావోద్వేగాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. మొదటి రోజు నుంచే థియేటర్లకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘‘మా మూవీలోని ఎమోషన్ కు ఆడియన్స్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు మాళవిక నాయర్. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. లోక్మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ, శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్గా నిరూపించుకున్నారు. పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. -
శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్
యాంకర్, నటి అనసూయ మరోసారి నటుడు శివాజీపై కౌంటర్ వేసింది. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన చెత్త వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా చీర కట్టుకుని తన కుటుంబంతో పాటుగా అనసూయ గుడికి వెళ్లింది. కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ.. శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆమె కూడా కౌంటర్ ఇచ్చింది.నెటిజన్లు షేర్ చేసిన థంబ్నైల్ ఎలా ఉండాలో తనదైన స్టైల్లో అనసూయ ఒక సలహా కూడా ఇచ్చింది 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్నైల్ పెడుతారనుకున్నాను. సరైన హెడ్లైన్ కూడా ఇదే కదా.. ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు చీరలు కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్ చేసేముందు చూసుకోవాలి కదా..' అంటూ కౌంటర్ ఇచ్చింది. వాస్తవంగా చాలా ఈవెంట్లలో అనసూయ చీరకట్టులోనే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుడికి వెళ్తున్న సమయంలో దాదాపు చీరకట్టులోనే వెళ్తారనే విషయం తెలిసిందే. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా షేర్ చేస్తున్నారు. Tappu tappu! “Sivaji srushtinchina cheera ane vastraanni dharinchi tirugutunna Anasuya” Idi kada undali header!! Endukante antaku mundu memanta asalu cheerale kattukoledu 🙄 entamma.. chuskovali kada post chesemundu 🤦🏻♀️ https://t.co/9IiFZ7PQgh— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 11, 2026 -
సతీమణి పేరుతో రిషబ్ శెట్టి బిగ్ ప్లాన్.. మరో సినిమా కష్టమేనా?
కాంతార ఫ్రాంచైజీ సినిమాలతో కన్నడ నటుడు రిషబ్ శెట్టికి పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడని వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఆయన తన సోషల్మీడియాలో పలు ఖాతాలను అన్ఫాలో చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంతార సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ను ప్రస్తుతం రిషబ్ ఫాలో కావడం లేదు. దీంతో నిర్మాత విజయ్ కిరగందూర్తో విభేదాలు కలిగాయని వార్తలు వచ్చాయి. ఇకపై కాంతార నుంచి మరో సినిమా రాకపోవచ్చని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది. అయితే, ఇందులో తన సతీమణి ప్రగతి శెట్టి పాత్ర ఎక్కువగా ఉందని రూమర్స్ వస్తున్నాయి.కాంతార ఛాప్టర్-1 ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడంతో రిషబ్ శెట్టి తన రెమ్యునరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 75 కోట్ల రెమ్యునరేషన్తో పాటు తన సతీమణి సహ-నిర్మాతగా ఉండాలని కండీషన్ పెట్టారట. ఈ ఢీల్ హోంబలే ఫిల్మ్స్కు నచ్చలేదని టాక్.. డబ్బు విషయం కంటే ఒక సినిమాకు సంబంధించి పూర్తి హక్కులు తమ సంస్థకే చెందాలని నిర్మాత విజయ్ కిరగందూర్ ఉంటారట.. ఇలాంటి కండీషన్ను వారు ఎట్టిపరిస్థితిల్లోనూ అంగీకరించరట. ఈ కారణంతోనే ఆ సంస్థకు సంబంధించిన సోషల్మీడియా ఖాతాలను రిషబ్ శెట్టి అన్ఫాలో కొట్టారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ రిషబ్ శెట్టి కలుగజేసుకుని ముందుకు వస్తేనే కాంతార నుంచి మరో సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అసలు విషయం ఏదైనప్పటికీ రిషబ్పై సోషల్మీడియాలో విమర్శలు వస్తున్నాయి. -
‘ది ప్యారడైజ్’.. అంచనాలు పెంచేసిన సుబ్బలక్ష్మి!
దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట సోషల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా హీరోయిన్గా నటిస్తున్న కయాదు లోహర్ లుక్ని కూడా విడుదల చేశారు. కయాదు బర్త్ డే సందర్భంగా ఈ రోజు(ఏప్రిల్ 11) ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇందులో ఆమె సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘వెండితెర పై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని చూడండి అంటూ కయాదు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్కి చాలా ప్రాధన్యత ఉంటుంది. దసరాలో కీర్తి సురేశ్ పోషించిన వెన్నెల పాత్ర ఏ రేంజ్లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్ర కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం కయాదు ఓ మధ్యతరగతి యువతిగా కనిపించబోతునట్లు సమాచారం. ఇందులో నాని ‘జడల్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఆగస్ట్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘యూత్’. మార్చి 19న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం..అక్కడ సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్స్ని రాబట్టింది. ఇక అదే నెల 27న తెలుగులో విడుదలైంది. అయితే తమిళ్తో పోలిస్తే..తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 16 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.యూత్ కథేంటంటే..ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తండ్రి ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు) బెకరీ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తాడు. తల్లి సరోజ(దేవదర్శిని) ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కొడుకు అంటే ప్రాణం. తండ్రికి మాత్రం ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. చదువు పక్కకు పెట్టి.. అమ్మాయిలకు సైట్ కొడుతుంటాడు. ఆయన చేష్టలకు స్కూల్లో ఏ అమ్మాయి అతని వైపు చూసేది కాదు. కానీ ఇంటర్లో మాత్రం గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్).. ముగ్గురు తన జీవితంలోకి వస్తారు. ఆ ముగ్గురి వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? బ్రేకప్స్, అవమానాలతో ప్రవీణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి? తల్లి సరోజకు వచ్చిన సమస్య ఏంటి? బాగా చదువుకోవాలని ఆశపడ్డ తల్లిదండ్రుల కోరికను ప్రవీణ్ నెరవేర్చాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026 -
ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) రిలీజైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసింది ‘డెకాయిట్’ యూనిట్. అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను మేం ప్రేమతో చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో సరస్వతి పాత్ర చేసిన మృణాల్ మా హీరో (నవ్వుతూ). నా బెస్ట్ ఫ్రెండ్ షానియల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు ఎమోషనల్గా అనిపిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు మృణాల్ ఠాకూర్. ‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు షానియల్ డియో. -
అదే నిజమైన విజయం: నిహారిక
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ‘రాకాస’ వసూళ్ల పరంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ‘రాకాస’ యూనిట్ హైదరాబాద్లో సక్సెస్మీట్ను నిర్వహించగా, బ్రహ్మాజీ, మైత్రీ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మైత్రీ రవి మాట్లాడుతూ– ‘‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ సాధించాం. భవిష్యత్లో ఆమె చేసే సినిమాలన్నింటినీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ అంటే సినిమా హిట్ అయినట్లే. ‘రాకాస’ చిత్రాన్ని నమ్మి, తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు ‘థ్యాంక్స్’ అని చెప్పారు సంగీత్ శోభన్. ‘‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ సంతోషంగా ఉన్నారంటే అదే నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అని చెప్పారు నిహారిక. ‘‘నా డ్రీమ్ని, నా కథను ఇంత వరకు తీసుకుని వచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కు థ్యాంక్స్’’ అని చెప్పారు మానస. పంపిణీదారులు సన్నీ, భాస్కర్, రమేశ్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు. -
డేట్ ఫిక్స్
రవిబాబు ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘రేజర్’. సురేష్ ప్రోడక్షన్స్ సంస్థ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే నెల 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలి పారు.‘‘మా నాన్న చలపతిరావుగారి జయంతి సందర్భంగా మా సినిమాను మే 8న రిలీజ్ చేస్తున్నాం. నాపై ఆయన ఆశీర్వాదాలు ఉన్నట్లుగానే ప్రేక్షకుల ఆశీర్వాదాలూ లభిస్తాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు రవిబాబు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. రాజేశ్. -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
యూకేలో ఆంటీ కేసు... అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ యాంకర్గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.తాజాగా అనసూయ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్ను అనసూయ తన ట్విటర్లో షేర్ చేసింది. హమ్ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్లో చేసిన కామెంట్స్కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. Hmmmm…. pic.twitter.com/NlOfnWbt8l— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 9, 2026 -
భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి
ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్తో పాటు మూవీస్లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్ పాల్తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో శ్రీలీల.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. Actress #Sreeleela visited Tirumala Tirupati Devasthanams today to seek divine blessings 🙏 pic.twitter.com/TBSdj6FQ6G— Eluru Sreenu (@IamEluruSreenu) April 9, 2026 -
'మిమ్మల్ని చూసి నిజంగా గర్వపడుతున్నా'.. ఐకాన్ స్టార్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్పీవీ వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is…— Allu Arjun (@alluarjun) April 10, 2026 -
‘డైమండ్ డెకాయిట్’ మూవీ రివ్యూ
పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(ఏప్రిల్10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..ఒక మనిషిని రక్షించేందుకు ప్రయత్నించిన గోపాల్ కుటుంబం చిన్నాభిన్నాం అవుతుంది. భయంకర డెకాయిట్గా పేరు తెచ్చుకున్న మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్ అతని గ్యాంగ్లో చేరుతాడు. అయితే బయటకు అతను మునుస్వామి నాయుడికి నమ్మకస్తుడిగా కనిపించినా, లోపల మాత్రం అమాయకులను రక్షిస్తూ డబుల్ లైఫ్ గడుపుతుంటాడు. గోపాల్ గతంలో ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? వరుస హత్యలు, మరో హత్యా యత్నం వెనుక ఉన్న నిజం ఏమిటి? గోపాల్ ఎందుకు బండిపోటుగా మారుతాడు? చివరకు బయటపడే నిజాలు కథకు కీలకం అవుతాయి.ఎలా ఉందంటే..క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను నడిపించిన తీరు బాగుంది.అసలు కథను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా, ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగించాడు. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఎమోషనల్గా సాగుతుంది. స్క్రిన్ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. హీరోగా, నిర్మాతగా పార్ధ గోపాల్ రెండు విభాగాలకు న్యాయం చేశాడు. నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరోగా బాగానే నటించాడు. యాక్షన్తో ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథ, స్క్రీన్ప్లే, మాటలతో సినిమాను భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.సాయి రాజు రాసిన డైలాగ్స్ సహజం ఉన్నాయి. : పీఆర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్.గోపాల్ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయే ముందు వచ్చే పాటు బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.5/5 -
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026 -
రాకా మూవీ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్లో ఉన్న అల్లు అర్జున్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


