breaking news
Movie News
-
ఫౌజీ @ 40
‘స్పిరిట్’ సినిమా షూటింగ్ అనుకున్నట్లుగానే సజావుగా సాగుతోందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారి ΄పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు ప్రభాస్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ను కూడా ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్నారు ప్రభాస్. ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ‘ఫౌజీ’ చిత్రీకరణలో పాల్గొంటారు.ఈ చిత్రం డిసెంబరు 3న రిలీజ్ కానుంది. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’. ‘ఫౌజీ’ సినిమాలో తన షూటింగ్ పూర్తయిన తర్వాత జెట్ స్పీడ్తో ‘స్పిరిట్’ చిత్రీకరణను పూర్తి చేస్తారు ప్రభాస్. ఈ చిత్రం 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ‘కల్కి 2’ సినిమా షూట్లో ప్రభాస్ జాయిన్ అవుతారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్ షురూ
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో దర్శకుడిగా హిట్ అందుకున్న సాయిలు కంపాటి దర్శకత్వంలో రెండో సినిమా షురూ అయింది. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్ హీరో. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై పుస్కూర్ రామ్మోహన్ రావు, భరత్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో పూజ తో ప్రారంభమైంది.ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో అడివి శేష్ క్లాప్ కొట్టారు. తొలి షాట్ను సాయిలు కంపాటి డైరెక్ట్ చేయగా, సదానంద్ స్క్రిప్ట్ను మేకర్స్కు అందించారు. ‘‘చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ , ఎంటర్టైన్ మెంట్కు ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
థ్రిల్ రెడీ
నూతన తారలతో ఎస్కే బషీద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘ఆమెన్’. రేగుల నీరజారాణి సమర్పణలో ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.ఈ సంద ర్భంగా ఎస్కే బషీద్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, థ్రిల్, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆమెన్’. ఇప్పటి వరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్ను పూర్తిగా మార్చేలా మా మూవీ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక అంశాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉండటంతో మేమే విడుదల చేస్తున్నాం’’ అన్నారు. -
పుట్టినరోజు ప్రత్యేకం
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’. ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం(జూలై 20న) రవికిరణ్ కోలా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘రౌడీ జనార్థన’ సెట్స్ నుంచి ఆయన వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్.‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ‘రౌడీ జనార్థన’ సినిమా రూపొందుతోంది. ‘దిల్’ రాజు, శిరీష్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవికిరణ్ ఎంతో ప్యాషనేట్గా, కాన్ఫిడెంట్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్పై చూసేందుకు విజయ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబరులో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ సి చంద్రన్. -
ఎట్టకేలకు మారుతికి 'మెగా' హీరో సెట్?
రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజాసాబ్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేక పోయింది. అనంతరం ప్రభాస్ ఎప్పట్లానే తన సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ మారుతి మాత్రం చాలా కాలం పాటు ట్రోలింగ్కు గురైయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో ఇచ్చిన సవాళ్లు, స్టేట్మెంట్లు ఆయనపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ తెచ్చాయి. అయితే, ఇటీవల ఆయన కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నానని, దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నానని ప్రకటించారు.ఇప్పుడు ఆ స్క్రిప్ట్కి సరిపోయే హీరోను మారుతి ఫైనల్ చేసినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా తర్వాత, తన చెల్లెలు నిహారిక నిర్మాతగా తెరకెక్కుతున్న ‘బరి’ సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమాతో పాటు మారుతి చేయబోయే చిత్రానికి కూడా వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వీలైనంత రీజనబుల్ బడ్జెట్లో,మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుతికి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నాడని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఒడిస్సీలా మనం ఎందుకు చేయలేం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని అఖిల్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. ఏజెంట్ తర్వాత అఖిల్కు హిట్ పడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన నాగార్జున టాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ముఖ్యంగా సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై నాగార్జున కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు. ఒడిస్సి మూవీ ఏడాది కిందట రిలీజ్ డేట్ ప్రకటించి అదే తేదీకి విడుదల చేశారు. కానీ మనం రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ టైమ్కు రిలీజ్ చేయలేకపోతున్నామని అన్నారు. లెనిన్ విషయంలోనూ అదే జరిగిందని తెలిపారు. గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీని చూసేవాళ్లమని నాగ్ వెల్లడించారు. ఇప్పుడు అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే నా ప్రశ్న అని అన్నారు. ప్రకటించిన తేదీకే అందరు సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాను కనీసం రెండు వారాల ముందు ఇస్తే బాగుంటుందని నాగ్ అన్నారు. Lenin Blockbuster Mikela Undho Theliyadhu Kani Naku, Chaitanya Ki, Akhil Ki Pandaga Laa Undhi, Illantha Kalakalalaaduthundhi - King @iamnagarjuna speech @ #LENIN Blockbuster Vaibhavam Event ❤️🔥 #BlockbusterLENIN 📷🌋 pic.twitter.com/bw3bAtC4ca— Annapurna Studios (@AnnapurnaStdios) July 20, 2026 -
మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్.. ఆసక్తిగా ట్రైలర్
సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హాలీవుడ్ ఫ్రాంచైజీల్లో అవెంజర్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ అవెంజర్స్: డూమ్స్డే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్గా కాకుండా.. డాక్టర్ డూమ్గా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోకి తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంలో క్రిస్ హమ్స్వర్త్, వెనెస్సా కిర్బీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్లో డౌనీ రూపాంతరం, అవెంజర్స్తో సంఘర్షణ, ఇవాన్స్ కనిపించడం హైలెట్గా నిలిచాయి. అవెంజర్స్: డూమ్స్డే మూవీ కోసం దర్శకులు జో, ఆంథోనీ రుస్సోలతో మార్వెల్ మళ్లీ కలిశారు. 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్గేమ్' తర్వాత వీరు మొదటిసారిగా తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి మైఖేల్ వాల్డ్రాన్, స్టీఫెన్ మెక్ఫీలీ రచయితలుగా ఉన్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబరు 18న విడుదల కానుంది. -
బిగ్బాస్ బ్యూటీకి అసభ్యకర సందేశాలు.. పోలీసులకు ఫిర్యాదు
కన్నడ నటి, బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ ఐశ్వర్య పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో వేధింపులు, దుర్భాషలు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించింది. తనకు తెలిసిన ఒక వ్యక్తి పేరును వెల్లడిస్తూ.. పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి తనను లక్ష్యంగా చేసుకున్నారని వాపోయింది.తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు తెలిపింది. దీని వెనుక ఉన్నవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో బెంగళూరులోని సంజయ్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వేధింపులు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అందుకే తాను మరోసారి పోలీసులను ఆశ్రయించానని నటి తన ఫిర్యాదులో పేర్కొంది.కాగా.. కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళా నటీమణులను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి రమ్య, దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ కూడా ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు కూడా చేశారు. -
ఓటీటీకి ఆపరేషన్ సఫేద్ సాగర్.. ట్రైలర్ అదుర్స్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్ యుద్ధం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు.కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే వస్తోన్న ఆపరేషన్ సఫేద్ సాగర్ ట్రైలర్లో యుద్ధ సన్నివేశాలు, వైమానిక దాడులు ఆకట్టుకునేలా ఉన్నాయి. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ పేరే సఫేద్ సాగర్. పాకిస్తాన్పై వైమానిక దాడులతో మంచు కొండలపై భారత్ విరుచుకుపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1999 మే 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో ది గోల్డెన్ యారోస్ కీలక పాత్ర పోషించింది.కాగా.. ఈ సిరీస్లో సిద్దార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో ఎయిర్ఫోర్స్ కమాండర్గా కనిపించనున్నారు. -
ప్రభాస్ ఫౌజీ.. రెబల్ స్టార్ పవర్ఫుల్ రోల్..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ముందుగా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి.. ఆ తర్వాత సుభాశ్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరుతాడని తెలుస్తోంది. ఇది కేవలం నేతాజీ బయోపిక్ మాత్రమే కాదని.. అంతే కాకుండా ఇండియన్ ఫ్రీడమ్ కోసం పోరాడిన సైనికుల కథను చూపించే చిత్రంగా ఉండనుందని టాక్. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ధైర్య సాహసాలు, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ చిత్రాన్ని డిసెంబరు 3న ఫౌజీ విడుదల కానుందని తాజాగా పోస్టర్ను పంచుకుంది.ఈ పోస్టర్లో ఎప్పుడు చూడని లుక్లో ప్రభాస్ కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ప్రభాస్ ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆ తర్వాత సలార్: పార్ట్ 2, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2 సినిమాలు చేస్తున్నారు. अज्ञातपर्व ENDS. THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y— Fauzi (@FauziTheMovie) July 16, 2026 -
ఓటీటీకి లేటేస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. కమెడియన్ యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించారు. హరీష్ దురైరాజ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది జూన్ 26న తెలుగు, తమిళంలో రిలీజైంది. మనీ కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు.. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వచ్చిన చిత్రమే "కాన్ సిటీ". ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
'ఆయనే అలా అంటే నేను తోపే కదా'.. నిహారిక కొణిదెల
'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నిర్మాత నిహారిక కొణిదెల స్పందించారు. నా సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రుద్రవీణకు నాగబాబు అవార్డు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సినిమాకు అవార్డ్ రావడంపై చిరంజీవి, సురేఖ ప్రశంసించారని నిహారిక ఆనందం వ్యక్తం చేసింది.నన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పెదనాన్న చిరంజీవి అనడంపై నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మన ఇండస్ట్రీకి ఇది గొప్ప గర్వకారణమన్నారు. ఆయనే మన ఇండస్ట్రీకి ప్రైడ్ అని ఫీలవుతుంటానని తెలిపింది. ఆయన నన్ను తోపు అంటుంటే.. నేను కూడా నిజంగానే తోపు అని ఫీలవుతా కదా అని సరదాగా మాట్లాడింది.కాగా.. నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డ్ దక్కింది. -
‘నా క్యారెక్టర్ వచ్చేది అప్పుడే.. కల్ట్పై విశ్వక్ సేన్ కామెంట్స్'
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కల్ట్. ఈ మూవీకి తానే సొంతంగా కథ రాసుకోవడమే కాదు..డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఈ మూవీని కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. హీ ఈజ్ మై దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ అనేది ఇంటర్వెల్లో వస్తుందని తెలిపారు. ఈ మూవీ ద్వారా నేను 150 మందికి పైగా కొత్తవారిని పరిచయం చేస్తున్నానని విశ్వక్ వెల్లడించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్లోపు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు. ఈ నగరానికి ఏమైంది-2 రిలీజైన తర్వాతే కల్ట్ మూవీ వస్తుందన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. -
శ్రీనివాస మంగాపురం.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్
ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు మూవీ టీమ్. తాజాగా ఈ చిత్రంలోని ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలోని రావే చెలియా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ పాటకు నాగ్ అర్జున్ రెడ్డి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
‘భాయ్కి ఏమైంది?..’ సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
కండలవీరుడు, బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన ఆయన తాజా లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ ఫిట్గా, ఎనర్జిటిక్గా కనిపించే సల్మాన్.. ఈసారి కాస్త సన్నగా, ముఖం మొత్తం పాలిపోయి కనిపించడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. అక్కడ ఆధునిక డేటా కలెక్షన్, వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సల్మాన్ ఆరోగ్యంపై అభిమానుల మధ్య చర్చ మొదలైంది. కొందరు ఆయన బాగా సన్నబడ్డారని, అలసటగా కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరేమో వయసు పైబడడం వల్లేనేమో అని చర్చించుకున్నారు.Is everything ok with Salman Khan and his health ..? 😳😳 pic.twitter.com/dSSPmz0OCX— Yo Yo Funny Singh (@moronhumor) July 19, 2026సల్మాన్ ఖాన్(60) గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడినట్లు వెల్లడించారు. తీవ్రమైన ముఖ నొప్పిని కలిగించే ఈ వ్యాధిని సాధారణంగా సూసైడ్ డిసీజ్ “Suicide Disease” అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కారణంగా తాను ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. విదేశాల్లో చికిత్స సైతం తీసుకున్నానని ఆయన సల్మాన్ గతంలో తెలిపారు. అలాగే మెడకు సంబంధించిన సమస్యలు, నొప్పుల కారణంగా కూడా ఆయన గతంలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆయన తాజా లుక్కు ఈ ఆరోగ్య సమస్యలే కారణమా? అనే చర్చా జోరందుకుంది. అయితే సల్మాన్ ఖాన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. “Aap logon ki tabiyat kaisi hai?” (మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?) అంటూ ఆయన అభిమానులను పలకరించారు. తాజాగా కనిపించిన లుక్తోనే ఆయన బ్లాక్ అండ్ వైట్లో స్టైలిష్ ఫొటో షూట్ ఫొటోలను పోస్ట్ చేసి మరీ ఆ ప్రశ్న వేశారాయన. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అభిమానులు కూడా స్పందిస్తూ.. “ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి భాయ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.Aap logon ki tabiyat kaisi hai ? pic.twitter.com/sFWklGKo8K— Salman Khan (@BeingSalmanKhan) July 19, 2026ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యంపై అధికారికంగా ఆయన బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన కూడా నేరుగా స్పందించలేదు. అయితే ఆయన తాజా లుక్, ఆ తర్వాత చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. “భాయ్ జాగ్రత్తగా ఉండండి”, “మీ ఆరోగ్యం ముఖ్యం” అంటూ సందేశాలు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వయసు పెరుగుతున్నా సహజంగా కనిపించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన భారత సైన్యానికి చెందిన కల్నల్ పాత్రలో కనిపించనున్నారు. చిత్తరంగదా సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఈద్ 2027 సందర్భంగా నయనతారతో ఓ కొత్త ప్రాజెక్ట్లోనూ సల్మాన్ కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. -
శ్రీరాముడు పాత్ర చేయడం నా అదృష్టం: రణ్బీర్ కపూర్
రామాయణం ఆధారంగా రూపొందిన తాజా హిందీ సినిమా ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 1’, వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ: పార్ట్ 2’ విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు. తొలి భాగం ట్రైలర్ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా, ఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట వేడుక నిర్వహంచి, ఈ సినిమా హిందీ 3డీ ట్రైలర్ను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి యోగా గురువు రామ్దేవ్ బాబా అతిథిగా హాజరై, ట్రైలర్ నచ్చిందని చెప్పి, ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో రణ్బీర్ మాట్లాడుతూ– ‘‘రామానంద్ సాగర్గారు తీసిన ‘రామాయణం’ (సీరియల్)లో శ్రీరాముడిగా అరుణ్ గోవిల్గారు అత్యద్భుతంగా నటించారు. తరాలుగా శ్రీరాముడి పాత్రలో అరుణ్గారిని చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నేను చిన్నప్పట్నుంచి శ్రీ రాముడి కథలు వింటూ, ఆయన నామస్మరణ, ఆశీస్సులతో పెరిగాను. అలాంటి శ్రీరాములవారి పాత్రను పోషించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘సీతమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం. ఆ సీతమ్మే నాతో ఆమె పాత్ర చేయిస్తుందని, సీతమ్మకు కావాల్సినట్లుగా నా చేత నటింపజేసుకుంటుందని నమ్మి నేను ఈ రోల్ చేశాను. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను’’ అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘మన శ్రీరాముడి కథను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ‘రామాయణ’ చేశాం’’ అని అన్నారు.‘‘మన గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’ని ప్రపంచంతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని తెలిపారు నమిత్ మల్హోత్రా. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు రామాయణంలోని భావోద్వేగం, మానవత్వం, వేల సంవత్సరాలుగా దాన్ని చిరస్థాయిగా నిలబెట్టిన ఆత్మను కూడా అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు నితీష్ తివారి. ఈ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, శోభన, అజింక్య, కునాల్ కపూర్, రకుల్ ప్రీత్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అవార్డ్ ప్రకటన.. చైల్డ్ ఆర్టిస్ట్ ఫుల్ ఎమోషనల్
తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2024 ఏడాదిలో రిలీజైన సినిమాలకు గానూ ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు సైతం సత్తాయి చాటాయి. కమిటీ కుర్రోళ్లు మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే కోలీవుడ్లో పలు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి. అయితే కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మూవీ మహారాజా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చైల్ట్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్కు జాతీయ అవార్డ్ దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్లో వీక్షించిన సచనా.. తనపేరు వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడుస్తూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026 -
రామ్ చరణ్- సుకుమార్ కాంబో.. పుష్ప రిపీట్ కానుందా?
పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప తరహాలో రెండు భాగాలు తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తన్నట్లు అనిపిస్తోంది.ఈ చిత్రంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు కోరుకునే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్మామెన్స్కు స్కోప్ ఉంటుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ మూవీ 2027 చివర్లో లేదా.. 2028 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
సల్మాన్ ఖాన్కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా లుక్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ముంబైలో ఓ ఐటీ సర్వర్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్కు సంబంధించిన వీడియోలే ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ డియోలో సల్మాన్ ఖాన్ మునుపటి కంటే చాలా బరువు తగ్గి, కాస్త సన్నగా కనిపించారు.ఆయన కళ్లలో తీవ్రమైన అలసట కనిపించడం, ముఖంలో గ్లో తగ్గడం, నడిచేటప్పుడు కూడా కాస్త నీరసంగా ఉండటంతో నెటిజన్లు షాక్కు గురయ్యారు. ‘కండల వీరుడు ఇలా అయిపోయాడేంటి?’, ‘ఆయనకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమా కొత్త సినిమా కోసం ఇలా మేకోవర్ అయ్యాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు. Salman khan’s latest video😳Bhai ye kaisa majdoor sa lag rha h….Waqt kabhi nahi rukta, aur ise bhi ab apne apko hero ke role dena band karna chahiye 💯 pic.twitter.com/mYwJ2r1VOV— Sharma Ji (@Hsharma2712) July 19, 2026 -
మెగా158లో సీనియర్ హీరో..!
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మెగా 158(వర్కింగ్ టైటిల్). వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత వీరిద్దరు మరోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో నివేతా పేతురాజ్ నటిస్తున్ననట్లు తెలుస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరల్గా మారింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శరత్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ కుమార్ పాత్రతో పాటు ఈ చిత్రంలో మరో స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని సమాచారం.. అది కూడా నెగిటివ్ రోల్ అని లేటేస్ట్ టాక్. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. -
మైత్రి చేతికి రా అండ్ రస్టిక్ ‘మండాడి’.. రిలీజ్ ఎప్పుడంటే..?
సుహాస్, సూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మండాడి’. ఈ రా అండ్ రస్టిక్ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. -
బాలయ్య- కొరటాల కాంబో.. ఊహించని టైటిల్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఫుల్ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నారు. యాక్షన్తో పాటు సామాజిక కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య మూవీ టైటిల్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో సినిమా టైటిల్ టాలీవుడ్లో ఆసక్తిగా మారింది.ఈ చిత్రానికి కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ పేరును ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ టైటిల్ పెడితే సామాజిక కోణంలో కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీలో సోషల్ మేసేజ్తో పాటు ఫుల్ యాక్షన్ ట్రీట్ కూడా ఉండనుందని తెలుస్తోంది.ఇక వచ్చేనెల చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్లో బాలయ్యపై భారీ యాక్షన్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ విషయంలో కొరటాల శివ భారీగానే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
జన నాయగన్.. కోలీవుడ్లో తగ్గిన క్రేజ్.. అక్కడ మాత్రం రికార్డ్!
విజయ్ హీరోగా వస్తోన్న చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. ఎట్టకేలకు ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.ఇప్పటికే జన నాయగన్ మూవీ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో జన నాయగన్ దూసుకెళ్తోంది. శనివారం ఒక్క రోజే ఏకంగా 95 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు.కేవలం ఒక్క తమిళనాడులోనే ఒక్క రోజే 12 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. కేరళలో ఏకంగా 83 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. కేరళలో కేవలం 17 నిమిషాల్లో పదివేల టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో కోలీవుడ్ కంటే మలయాళంలోనే ఎక్కువ క్రేజ్ ఉండడం మరో విశేషం. ఈ డిమాండ్ చూస్తుంటే జన నాయగన్ పట్ల ఉన్న భారీ క్రేజ్ అర్థమవుతోంది. ఇవాల్టి నుంచి మరిన్ని రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలవనున్నాయి. GAME ON — 🫰🔥#JanaNayagan sold 12,000+ Tickets at Tamilnadu Box-office from it's very limited shows ( 71** ) ✊💥Real-time Pre-sales 22.43 Lakhs & Counting*** 📈💥More shows will open in coming hours, Stay tuned for Real-time updates 📌#ThalapathyVijay𓃵… pic.twitter.com/kwxzaSgyeM— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 83000+ Tickets sold for #JanaNayagan at Kerala Box-office within just 18 Hours after bookings opened ✊💥Real-time Pre-sales touched 1.40 CRORES Mark as more shows will open in coming days 📈Total Ww opening day advances gone past 13.25 Crores 🙏🔥Just 4 More days to go 🔜… pic.twitter.com/rzClqQv5Oh— Jerin Georgekutty (@jerinGeorgekut2) July 19, 2026 -
వదినకి ఏ చీర కావాలి?... నాగ చైతన్య సమాధానం ఇదే
టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. చైతూ ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా శోభిత-నాగచైతన్య జంటగా వెళ్లి షాపింగ్కు వెళ్లారు. ఓ చీరల దుకాణంలో సందడి చేశారు. వదినకి ఏ చీర తీసుకుంటారని అక్కడివాళ్లు ప్రశ్నించారు. దీనికి చైతూ స్పందించారు. తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటానని నాగచైతన్య నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమాని: అన్నా... వదినకి ఏ చీర తీసుకున్నారు?నాగ చైతన్య: తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటాను.#NagaChaitanya #SobhitaDhulipala #Sobhita #ChaySo #Tollywood #TupakiFollow 👉 @tupaki_official pic.twitter.com/DsADTOvzey— Tupaki (@tupaki_official) July 18, 2026 -
బాక్సాఫీస్ వద్ద 'ది ఒడిస్సీ' ప్రభంజనం.. 2 రోజుల్లోనే రూ.2000 కోట్లు!
ప్రముఖ హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్తో జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా, కేవలం రెండు రోజుల్లోనే అటు ఇండియాలో, ఇటు వరల్డ్వైడ్గా కనకవర్షం కురిపించింది.ఇండియాలో ఎంతంటే..తొలి రోజు ఇండియాలో రూ. 17.40 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు ఏకంగా రూ. 22 కోట్లను వసూలు చేసింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 39.40 కోట్ల షేర్ (రూ. 47.03 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ని సాధించింది. ఇండియాలో ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్ అత్యధిక వసూళ్లను సాధించగా, తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లు కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. నోలన్ గత చిత్రం 'ఓపెన్హైమర్' ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును కూడా 'ది ఒడిస్సీ' బ్రేక్ చేయడం విశేషం. గ్లోబల్ మార్కెట్లో రికార్డు..గ్లోబల్ మార్కెట్లో కూడా క్రిస్టోఫర్ నోలన్ తన పవర్ ఏంటో చూపించారు. ఈ సినిమా నోలన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్గా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్త మొత్తం వసూళ్లు 257.8 మిలియన్ల డాలర్లు.. అంటే దాదాపు రూ.2,150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇందులో నార్త్ అమెరికా (డొమెస్టిక్) మార్కెట్ నుంచి 120.5 మిలియన్ల డాలర్లు రాగా, మిగిలిన చోట్ల నుంచి 137.3 మిలియన్ల డాలర్లు వసూళ్లు నమోదయ్యాయి. నోలన్ గత బ్లాక్బస్టర్లు అయిన 'ది డార్క్ నైట్ రైజెస్' ($249 మిలియన్లు), 'ఓపెన్హైమర్' ($180 మిలియన్లు) వరల్డ్వైడ్ ఓపెనింగ్స్ రికార్డులను 'ది ఒడిస్సీ' కేవలం రెండు రోజుల్లోనే దాటేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం కలెక్షన్లు కూడా తోడైతే ఈ నంబర్లు మరింత భారీగా పెరగనున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. గమనిక: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్ రిపోర్టులకు సంబంధించిన సమాచారం నేషనల్ మీడియా సంస్థలు, ప్రొడక్షన్ హౌస్లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. -
పూర్తిగా ఏఐ టెక్నాలజీతో తెరకెక్కిన ఇండియన్ సినిమా ఇదే
సాంకేతిక పరిజ్ఞానం నానాటికి అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్భవించిన సాంకేతిక పరిజ్ఞానం ఏఐ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్). ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకుంటోందని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ఇప్పుడు సినీ రంగంలోనూ విజంభిస్తోంది. అలాంటి ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న తాజా చిత్రం అవిరా. దీనికి కథా, కథనం, సంభాషణలు ,దర్శకత్వం,ఏఐ సాంకేతిక బాధ్యతలను ప్రభాకరన్ నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సుమారు 70కి పైగా వాణిజ్య ప్రకటనలను రూపొందించారు. ఆ అనుభవంతో పూర్తిగా ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో అవిరా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూర్తి స్థాయి ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. పురాణ కథలకు ఫాంటసీని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రంలోని పాత్రలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆబాలగోపాలాన్ని అలరించే కథా చిత్రంగా అవిరా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.కాగా దీన్ని లైట్ హౌస్ ఫిలిం కంపెనీ పతాకంపై గణేష్, జగదీష్ కలిసి నిర్మిస్తున్నారు. -
అందుకే షాపు ఓపెనింగ్స్కి వెళ్తుంటా : శ్రీలీల
తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలు చేసి పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్న నటి శ్రీలీల. ముందు డాక్టర్ అయి ఆ తర్వాత యాక్టర్ అయినా ఈ బ్యూటీ అమెరికా , మెక్సికో జిల్లాలో పుట్టి బెంగళూరులో పెరిగారన్నది తెలిసిందే. కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పెళ్లి సందడితో తెలుగులో సందడి చేశారు. ఆ తర్వాత నటించిన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందించింది అంతే ఆపై వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారు. దీంతో ఓపక్క చిత్రాలు నటిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అంతేకాకుండా షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. పుష్ప 2 చిత్రంలో కిసక్కు అనే ఐటెం సాంగ్లో నటించి కురక్రారును కిర్రెరక్కించారు. ఆ తర్వాత పరాశక్తి చిత్తంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఒక హిందీ చిత్రంలో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఎక్కువగా షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనడం గురించి ఆమె పేర్కొంటూ..‘ నాకు తరచూ అభిమానులను కలుసుకోవడం ఎంతో ఇష్టం. అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు వారు చూపే ప్రేమాభిమానాలు నాకు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాంటి అభిమానుల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. అభిమానుల అంచనాలను పూర్తి చేయడానికి మంచి మంచి కథా చిత్రాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నటి శ్రీలీల పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో నటుడు ధనుష్కు జంటగా ఓం చిత్రంతో పాటు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
చిన్న సినిమాలో థియేటర్స్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచన మలయాళ చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రం ఇది. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ చిత్రానికి కథను అందించాడు.ఫర్జానా పాలత్గింగల్, ఆది శేషన్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ హిట్ టాక్ సంపాదించింది. రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్ని రిలీజ్ చేసింది. బాలన్-ది బాయ్ కథేంటే..ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన కొడుకు(ఆది శేషన్)తో బయటకు వచ్చిన ఓ మహిళ(ఫర్జానా పాలత్గింగల్) చుట్టూ ఈ కథ తిరుగుంది. బయటకు వచ్చిన ఆ మహిళ..పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పని చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రోవైపు స్కూల్కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకొని పోలీసులు అతన్ని స్టేషన్కి తీసుకెళ్తాడు. అయితే తల్లి ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్లాడు? తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా? తల్లి కొడుకుల కథలోకి టొవినో థామస్ ఎలా వచ్చాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఎన్టీఆర్ వద్దని చెబితే ఈ పనులన్నీ ఆపేస్తాం : RAW NTR వ్యవస్థాపకుడు
సాక్షి, తిరుపతి: ‘అభిమానాన్ని వృధా చేయకండి.. పది మందికి సాయం చేసే పనులు చేయండి’ అని పదేళ్ల క్రితం ఓ ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు విని సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు రా ఎన్టీఆర్ (RAW NTR) వ్యవస్థాపకుడు సాయి రూప్. కొద్దిరోజులుగా రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తిరుపతిలో సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్, సంస్థ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రూప్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చేయబోమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన సేవలు ఎవరూ చేయలేదని, సేవ అంటే అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని.. ఏదైనా చేయవచ్చునని చెప్పారు.గత వారం రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, వంద కోట్ల మోసగాడు అంటూ, అభిమానులు ముసుగులో దందా చేస్తున్నారు అంటూ అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్కు సంబంధం లేకుండా మాకు వ్యతిరేకంగా లేఖ విడుదల అయినట్లు అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. ''మాకు వ్యతిరేకంగా లేఖ ఎలా వచ్చింది అనేది మాకు కూడా అర్ధం కాలేదని.. ఎన్టీఆర్ స్వయంగా చెబితే.. ఈ పనులు ఆపేస్తామ''ని సాయి రూప్ స్పష్టం చేశారు.అనంతరం తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు – వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా సంస్థపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.‘మేము చేపట్టబోయే సేవా కార్యక్రమాల్ని మూడు అడుగులుగా విభజించాం. అందులో మొదటిది ‘సేవతో యువ జాగృతి’, యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.రెండో అడుగు ‘మన ఊరు మన బాధ్యత’: గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతాం.మూడో అడుగు ఊరి మాట.. పాలకుల దాకా..: గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం పనిచేస్తుంది’ అని సాయి రూప్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఊరి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. -
‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో సినిమా అంటే ఏ నటుడైనా నటించాలని కోరుకుంటారు. కానీ నటుడు, ఆస్కార్ విన్నర్ సిలియన్ మర్ఫీ మాత్రం ఎలాంటి బాధ లేదని చెబుతున్నాడు. పైగా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని.. దానిని తానొక బహుమతిగా భావిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నోలన్ తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ రిలీజ్ నేపథ్యంలో.. ఆయనతో చిరకాల అనుబంధం ఉన్న మర్ఫీ ఏమన్నాడంటే..సిలియన్ మర్ఫీ, క్రిస్టోఫర్ నోలన్ కాంబినేషన్ హాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరి ప్రయాణం ‘బ్యాట్మ్యాన్ బిగిన్స్’ (2005)తో మొదలైంది. ఆ తర్వాత ‘ది డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’, ‘డంకిర్క్’లోనూ మర్ఫీ నటించారు. ఇక.. 2023లో వచ్చిన ‘ఓపెన్హైమర్’లో శాస్త్రవేత్త జే. రాబర్ట్ ఓపెన్హైమర్ పాత్రలో మర్ఫీ అద్భుత నటనకు ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఈ సినిమా నోలన్-మర్ఫీ భాగస్వామ్యానికి మరో మైలురాయిగా నిలిచింది.నోలన్తో కలిసి ఇప్పటికే ఆరు సినిమాల్లో పనిచేసిన మర్ఫీ.. ‘ది ఒడిస్సీ’లో మాత్రం లేడు. అయితే నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ను ఓ ప్రేక్షకుడిగా ఆస్వాదించడం తనకు ఆనందంగా ఉందన్నారు. సాధారణంగా ఇలాంటి అవకాశం కోల్పోతే వచ్చే ఫోమో (Fear Of Missing Out)కు బదులుగా తనకు ROMO (Relief Of Missing Out) అనిపించిందని సరదాగా వ్యాఖ్యానించాడాయన.“క్రిస్ సినిమాలను చూస్తున్నప్పుడు నా సొంత ముఖాన్ని తెరపై చూడాల్సిన భారం లేకుండా ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతి” అంటూ మర్ఫీ నవ్వుతూ చెప్పారు. నోలన్తో తన కెరీర్లో ఎన్నో గొప్ప చిత్రాలు చేసిన మర్ఫీ.. ఈసారి తెరపై కనిపించకుండా, ప్రేక్షకుడిగా ఆ సినిమాను ఆస్వాదించడమే తనకు ప్రత్యేక అనుభూతి అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.భారీ అంచనాల మధ్య ‘ది ఒడిస్సీ’హోమర్ రచించిన ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’లో మ్యాట్ డామన్ ఒడిస్సియస్ పాత్రలో నటించారు. అన్నే హాత్వే, టామ్ హాలండ్, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రాయ్ యుద్ధం తర్వాత స్వదేశం ఇథాకాకు చేరుకునేందుకు ఒడిస్సియస్ చేసిన పదేళ్ల సాహస ప్రయాణమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. అలాగే ఐమ్యాక్స్ స్క్రీనింగ్ ఈ సినిమాకు మరో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. -
జానీ మాస్టర్పై ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం
కొరియోగ్రాఫర్ జానీపై ఫిల్మ్ ఫెడరేషన్ సంచనల నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. ఇకపై జానీ మాస్టర్ దేశ వ్యాప్తంగా ఏ సినిమాకు వర్క్ చేసినా.. మిగతా 23 క్రాప్ట్లు సహకరించబోవని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలియజేయనుంది. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.జానీ మాస్టర్ తన భార్య పదవిని అడ్డుపెట్టుకొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న జానీ చేసిన వ్యాఖ్యలు, సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తీరు, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడంపై మండిపడింది. ఈ నెల 14న విచారణకు పిలిచినా హాజరు కాలేదని, ఇందుకు సంబంధించి 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇచ్చిన గడువు లోగా వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని ఫెడరేషన్ హెచ్చరించింది. ఒకవేళ ఫెడరేషన్ ప్రకటించిన సహాయ నిరాకరణ అమల్లోకి వస్తే.. జానీ మాస్టర్తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. అతనితో పని చేసే దర్శక నిర్మాతలకు ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంటుంది. మరి జానీ మాస్టర్ వివరణ ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ వివరణ ఇచ్చినా.. ఫెడరేషన్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది. -
ఐరన్ లెగ్ అని ముద్ర వేయకండి : హీరోయిన్ విజ్ఞప్తి
ఏ రంగానికి చెందిన వారికైనా అవమానాలు, అవరోధాలు ఎదురుకావడం సహజం. ముఖ్యంగా సినిమా రంగంలోని వారికి ఇలాంటి ఇబ్బందులు కాస్త ఎక్కువే ఉంటాయి. ఒక్కోసారి శాయశక్తులా శ్రమించినా తమనే కార్నర్ చేసే విమర్శలు గుండెల్లో కలుక్కుమంటుంటాయి. నటి భాగ్యలక్ష్మి భోర్సే ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందట. అలా తన ఆవేదనను ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేసిందీ బ్యూటీ. నిజం చెప్పాలంటే నటిగా ఈ అమ్మడికి అదృష్టం ఉన్నా, సరైన విజయం వరించలేదు. తెలుగులో రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టినా, ద్విభాషా చిత్రం కాంతాలో దుల్కర్ సల్మా న్ వంటి నటుడితో రొమాన్స్ చేసినా మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ మంచి సక్సెస్ మా త్రం దోబూచులాడుతూనే ఉంది. అలాంటిది తాజాగా అఖిల్ అక్కినేనితో జత కట్టిన లెనిన్ చిత్రం సంతృప్తి కరమైన విజయాన్ని అందించింది. దీంతో చాలా కాలంగా గూడు కట్టుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. దాన్ని ఒక భేటీలో వ్యక్తం చేస్తూ. ‘‘చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతే వెంటనే ఆ చిత్ర కథానాయికిని కార్నర్ చేస్తూ ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయకండి. చిత్ర అపజయాన్ని హీరోయిన్లకు మాత్రమే ఆపాదించడం ఎంత వరకు న్యాయం. నేనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను’’ అంటూ విమర్శకులపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్కు జంటగా సెయోన్ చిత్రంలో నటిస్తోంది. -
బర్త్ డేకి టీజర్?
సూర్య హీరోగా ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సూర్య 47’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు.కాగా, ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 23న సూర్య బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, టీజర్ను రిలీజ్ చేయాలనే సన్నాహాల్లో ఉన్నారట. అంతేకాదు... వచ్చే పొంగల్కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. -
మా మధ్య ఎవరూ లేరు
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరో యిన్లుగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, నిర్మాత మల్లిడి సత్య నారాయణ రెడ్డి, నటుడు సురేష్ అతిథులుగా పాల్గొన్నారు. ఖాన్ దురాని మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో ఉన్న నాలుగు పాటలకు శ్రీ మురళి మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘నా లైఫ్లోని కొన్ని ఘటనలకు కల్పిత అంశాలు జోడించి రూపొందించిన ఈ చిత్రంలో మంచి లవ్స్టోరీ ఉంది’’ అని చెల్పిరు రవి లోకిరెడ్డి. ‘‘సినిమాలపైప్యాషన్తో కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాను. యూఎస్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశా. ‘కళ్యాణం కమనీయం..’లో ప్రేక్షకులు కోరుకునే అంశాలున్నాయి’’ అన్నారు కిషోర్ గుండాల. ‘‘రామాయణం ఎవరి కథ కాదమ్మా! కానీ అందులో నీతి ఎందరో జీవితాలకు దారి, ఇంత చిన్న వయసులో వారికి పెళ్లి చేస్తున్నావ్’, ‘ఇక మా మధ్య ఎవరూ లేరు’ వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. -
మరింత ముదురుతున్న 'జానీ మాస్టర్' డాన్సర్ అసోసియేషన్ వివాదం
డాన్సర్స్ అసోసియేషన్ – ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఫెడరేషన్ జానీ మాస్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో సాయంత్రం జానీ మాస్టర్ ఫెడరేషన్ నాయకులపై నిర్మాతలకు ఫిర్యాదు చేశారు. ఫిలిం ఛాంబర్లోని పెద్దలను కలిసిన జానీ మాస్టర్ యూనియన్లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డుపడుతోందని ఆరోపించారు. అంతేకాక సస్పెండ్ చేసిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ వారిపై ఒత్తిడి తెస్తోందని, నిర్మాతలను మోసం చేస్తున్న వారిపై ప్రెసిడెంట్ సుమలత చర్యలు తీసుకుంటే ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఆమెపై లింగభేదం చూపుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత కూడా నిర్మాతలతో సమావేశమైయ్యారు. ఫెడరేషన్ జోక్యం లేకుండా చూడాలని కోరారు. తప్పు చేసిన సభ్యుల ఆధారాలను ఛాంబర్ పెద్దలకు అందజేశాం. అవినీతి చేస్తున్న వారిని శిక్షించి వారికి సహకరిస్తున్న ఫెడరేషన్ పెద్దలను మందలించాలని విజ్ఞప్తి చేశారు. డాన్సర్స్ అసోసియేషన్లో కొంతమంది సభ్యులు నిర్మాతలను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫెడరేషన్ మాత్రం వారిని కాపాడుతోందని డాన్సర్స్ అసోసియేషన్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదం ఫిలిం ఛాంబర్ వరకు చేరింది. ఇప్పుడు ఫెడరేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
ఓటీటీకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది.ఈ ఏడాది మలయాళంలో రిలీజైన చిన్న చిన్న ఆసై ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు చేశారు. ఈనెల 28 నుంచి జియో హాట్స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఇంద్రన్స్, మధు, అపర్ణ బాలమురళి, జాఫర్ సాదిక్, విష్ణు అగస్త్య కీలక పాత్రల్లో నటించారు. Every little wish has a story worth telling.Chinna Chinna Aasai streams from July 28 in Malayalam, Tamil, Telugu, Kannada, and Hindi, exclusively on JioHotstar.@Aparnabala2#ChinnaChinnaAasai #JioHotstar #MalayalamCinema pic.twitter.com/ZLvfrvCZIl— JioHotstar Malayalam (@JioHotstarMal) July 17, 2026 -
రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్.. భద్రతా కల్పించాలని వినతి
టాలీవుడ్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్టాపిక్గా మారింది. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న వార్తలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతోన్న కార్యక్రమాలకు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది.ఈ వివాదం నేపథ్యంలో రా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెస్మీట్ నిర్వహించనుంది. తిరుపతిలోనే తాజ్ హోటల్లో జరగనున్న ఈవెంట్కు భద్రతా కల్పించాలని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్, రా ఎన్టీఆర్ మధ్య వివాదంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించాలంటూ తిరుపతి రూరల్ పోలీసులను కోరింది.ఎలాంటి సంబంధం లేదు..'రా ఎన్టీఆర్' అనే సంస్థకు గానీ, దాని కార్యకలాపాలకు గానీ.. జూ.ఎన్టీఆర్కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అధికారిక బృందం స్పష్టం చేసింది. ఎలాంటి సేవా కార్యక్రమాలకైనా, ప్రకటనలకైనా ఎన్టీఆర్ టీమ్ లేదా ఆయన మాత్రమే అధికారికంగా మాట్లాడుతారని, రూమర్స్ నమ్మవద్దని మీడియాను కోరింది. -
ఎమోషనల్ డ్రామా.. వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూ
దినేష్ కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ జంటగా వచ్చిన మూవీ వెంకట్రామయ్య గారి తాలుకా. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూలై 17న థియేటర్లలో రిలీజైంది. తండ్రీ, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. మరి ఆ ఎమోషన్ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..వెంకట్రామయ్య - సీత (మురళీధర్ గౌడ్, సుధ) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. పొలం, పిల్లలే వారికి ప్రాణం. ఒక రైతు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేయడమంటే మాటలా? ఇద్దరు ఆడపిల్లల కోసం తనకున్న ఐదెకరాల్లో రెండు ఎకరాల పొలం అమ్మేస్తాడు. కొడుకు తనకు రైల్వే జాబ్ వస్తుంది. రూ.20 లక్షలు కట్టాలంటే మరో ఎకరం అమ్మేస్తాడు. ఇక చిన్న కూతురు లత (దివిజ) తను ప్రేమించిన రాజు (దినేష్)ను పెళ్లి చేసుకుంటానంటుంది. కానీ రాజుకి సీత తన కూతురును రాజుకు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. కానీ తను ఇష్టపడిన వ్యక్తితో కూతురి వివాహం చేయాలనుకున్న వెంకట్రామయ్య.. భార్యకు నచ్చజెప్పి వివాహం జరిపిస్తాడు. అయితే సీత భయపడిందంతా జరుగుతుంది. అత్తవారింట లత ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. మరోవైపు వెంకట్రామయ్య కొడుకు మురళి సైతం ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. పిల్లలంతా వివాహాలవడంతో ఆడపిల్లలు అత్తవారిళ్లకు.. కొడుకు ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. ఇక ఉన్న ఒక ఎకరంతో ఎలాగైనా బతుకుదామనుకుంటే అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఎకరం పొలం అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింద? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..1992లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటించిన సూరిగాడు చిత్రం వచ్చింది. ఆ సినిమా కూడా ఒక తండ్రి కథే. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ హిట్. నలుగురు పిల్లలున్నా.. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. అదే తల్లిదండ్రులు తరువాతి కాలంలో పిల్లలకు భారంగా ఎందుకు మారుతున్నారనేదే కథ. తొలి అర్థ భాగమంతా.. వెంకట్రామయ్య తన పొలాన్ని అపురూపంగా చూసుకోవడం.. పొలాన్ని పరువుగానూ.. గౌరవంగానూ భావించడం.. పిల్లల కోసం దాన్ని అమ్ముకోవల్సి రావడం అలా రోటీన్గా సాగుతుంది.ఇక సెకండాఫ్లో కంప్లీట్గా వెంకట్రామయ్య చుట్టూనే కథ నడుస్తుంది. ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా సెకండాఫ్ చూస్తున్నప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు. ఇక క్లైమాక్స్లో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కుతుంది. కళ్ల నిండా నీళ్లతో బయటకు వస్తారు. పల్లెటూరి కథలు ఇటీవలి కాలంలో వచ్చినా కూడా లవ్ స్టోరీకే పరిమితమవుతున్నాయి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అనేది రావడం లేదు.ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు.. నేటి సమాజానికి అద్దం పట్టే భావోద్వేగ ప్రయాణం. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, వారి కుటుంబ పరిస్థితులు, గ్రామీణ జీవనశైలిని పరిచయం చేస్తాయి. ఆ తరువాత కథ భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. రెండో భాగంలో వచ్చే తండ్రీ, కూతుళ్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ, అసభ్య సంభాషణలు లేకుండా జాగ్రత్తపడ్డారు.కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా దర్శకుడు రూపొందించారు. యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం పరుగులు తీస్తున్న మనుషులు.. క్రమంగా దూరమవుతున్న కుటుంబ బంధాలు... వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు.. ఈ నేపథ్యంలో ఓ మధ్యతరగతి తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలే 'వెంకట్రామయ్య గారి తాలూకా' కథ. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, మానవ సంబంధాల విలువలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఓవరాల్గా వెంకట్రామయ్య గారి తాలుకా’ ఓ ఫీల్ గుడ్ మూవీ.ఎవరెలా నటించారంటే..దివిజ, దినేశ్ ఇద్దరు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. సుధ తల్లిగా చాలా సహజంగా నటించారు. ఇక మిగిలిన నటీనటులంతా వారి పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో మరింత కట్ చేయాల్సింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బిగ్ షాక్
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్కు ఫిల్మ్ ఫెడరేషన్ షాకిచ్చింది. ఇటీవల తలెత్తిన వివాదంపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈనెల 12న చేసిన కామెంట్స్పై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 14 న విచారణకు పిలిచిన హాజరు కాలేదని మండిపడింది.ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్కు షోకాజ్ నోటీసులిచ్చింది. 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని జాను మాస్టర్ను ఆదేశించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఫెడరేషన్ హెచ్చరించింది. జానీ మాస్టర్కు ఫెడరేషన్ తరపున సహాయ నిరాకరణ అమలు చేయాలని నిర్ణయించింది.సుమలత తీరుపై ఆగ్రహం..డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని ఆమెకు సూచించింది. డాన్సర్స్ ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఫెడరేషన్ ప్రకటించింది. -
న్యూటన్స్ థర్డ్ లా.. వారం ముందుగానే వస్తోంది
సుమంత్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు రాజేశ్ కర్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. వారం రోజులు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. జూలై 31న రిలీజ్ కానుందని వెల్లడించారు.ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జంట హత్యల చుట్టూ సాగే కథగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సుమంత్తో పాటు జగపతి బాబు, కార్తీక్ రత్నం, రవివర్మ, నేహా పఠాన్, హరిణి రావు కీలక పాత్రల్లో నటించారు. మొదటి ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా వారం ముందుగానే ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. The reaction begins sooner than expected. ⚡️🔥 Newton's 3rd Law is now arriving in cinemas on July 31!!!Get ready for the ThrillerOfTheYear.#Newtons3rdLawMovie – In Theatres Worldwide on July 31#Newtons3rdLaw #ThrillerOfTheYear #TheReactionBegins #ReleaseUpdate… pic.twitter.com/19nuf5MfTp— Annapurna Studios (@AnnapurnaStdios) July 16, 2026 -
'మాకు సీఎం కేక్ కావాలి'.. విజయ్ బర్త్ డేకు జాక్పాట్
దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారే సీఎం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలే విజయ్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో అభిమానులు పండుగలా జరుపుకున్నారు. హీరోయిన్ త్రిష సైతం విజయ్ బర్త్ డే రోజు కేక్ కట్ చేయించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే విజయ్ పుట్టినరోజు ఓ బేకర్ యజమానికి అనూహ్యంగా కలిసొచ్చింది. జూన్ 22న నటి త్రిష పంచుకున్న పుట్టినరోజు ఫోటోలో తమ కేక్ కనిపించిందని యజమాని తన్వి బొకారియా తెలిపారు. ఆ రోజు నుంచే ఆ ఫోటోలోని మామిడి వెనీలా కేక్ కోసం విపరీతంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఆ తర్వాత వరుసగా రెండు వారాల్లో అదే కేక్ కోసం సుమారు 300 నుంచి 400 ఆర్డర్లు వచ్చాయని వెల్లడించారు.బేకర్ యజమాని మాట్లాడుతూ.. "మాకు రాత్రికి రాత్రే గొప్ప క్రేజ్ వచ్చింది. ఆ కేక్ ఏ సందర్భం కోసమో మాకు అస్సలు తెలియదు. అది చాలా ప్రత్యేకమైనది.. నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. రెండు వారాలుగా అమ్మకాలతో చాలా బిజీగా ఉన్నాం. అందుకు నేను కృతజ్ఞతతో ఉన్నా. నా బృందం సీఎం జోసెఫ్ విజయ్ వీరాభిమానులు" అని అన్నారు. ప్రస్తుతం మామిడి కేక్ బదులు సీఎం కేక్ కావాలని కస్టమర్స్ అడుగుతున్నారని బొకారియా అన్నారు. కాగా.. విజయ్ సీఎం అయ్యాక త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
'నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందిరా ఈ పళ్లబురుసు'
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజైన వీడియో చూస్తుంటే పక్కా విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
సన్నీడియోల్ ‘ఇక్కా’ మూవీ రివ్యూ
ఉన్నావాడికైనా, లేనివాడికైనా , ఎవ్వరికైనాసరే ఉండేది స్వార్ధం. ఈ సమాజంలో జరుగుతున్న వందశాతం నేరాలు స్వార్ధంతో చేసేవే. అటువంటి నేరాలకు కొమ్ము కాస్తూ అన్యాయంగా న్యాయాన్ని తమ స్వార్ధానికి వాడుకుంటున్న వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పిన ఆటే ఈ ఇక్కా. తెలుగులో ఇక్కా అంటే పేకాటలో వచ్చే ఆసు ముక్క అని అర్ధం. పేకాటలో ఆసు ముక్కకు ఎంత యుక్తి శక్తి ఉందో అంతకంటే వందలరెట్లు తెలివిగలవాడు ఈ సినిమా హీరో. ఈ సినిమాలో వచ్చే పాత్రలు, చేసే పనులన్నీ చూసే ప్రేక్షకుడికి వినోదంతో పాటు కాస్త విజ్ఞానాన్ని కూడా అందిస్తుదనడంలో సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కా సినిమా ప్రేక్షకులకు కనువిందుతో పాటు కనువిప్పు కూడా కలిగిస్తుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం.సోమా మిట్టల్ అనే యువతి ప్రముఖ వ్యాపారవేత్త శౌర్యమాన్ గౌర్ కారు నుండి విసిరివేయబడి దారుణ హత్యకు గురవుతుంది. అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు శౌర్యమాన్ గౌర్ ను అరెస్ట్ చేస్తారు. శౌర్యమాన్ తండ్రి పెద్ద రాజకీయనాయకుడు కావడం వల్ల నగరంలోని ప్రముఖ లాయర్ అయిన అర్జున్ మెహరాను ఈ కేసు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తారు. కాని న్యాయానికి కట్టుబడ్డ అర్జున్ మెహరా ముందు ఈ కేసును తీసుకోనని ససేమిరా తిరస్కరిస్తాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కేసును అర్జున్ మెహరా శౌర్యమాన్ తరపున వాదించడానికి ఒప్పుకుంటాడు. తన జీవిత కాలంలో న్యాయనికి కట్టుబడ్డ అర్జున్ మెహరా మొట్టమొదటిసారిగా అన్యాయం తరపున వకాల్తా పుచ్చుకోవడం మొత్తం కోర్టు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. అన్యాయం వైపు నిలబడ్డ అర్జున్ మెహరా న్యాయం కోసం తన ఆసు ముక్కని ఎలా ఆడతాడో ఇక్కా సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ మండి డ్రమెటిక్ థ్రిల్లర్.అల్తియా కౌశల్ అందించిన ఇక్కా కథను ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ మల్హోత్రా తెరకెక్కించారు. ప్రముఖ నటులు సన్నీడియోల్, అక్షయ్ ఖన్నా తో పాటు దియా మర్జా వంటి వర్ధమాన తారలు ఈ ఇక్కా సినిమాలో తమ పాత్రలకు పక్కా న్యాయం చేశారు.విశేషంగా సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మంచి థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఈ ఇక్కా సినిమా మాతృక హిందీ అయినా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోను లభ్యమవుతోంది. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ప్లే జాయ్ ఫుల్లీ విత్ యువర్ ఇక్కా.-హరికృష్ణ ఇంటూరు -
మౌనీ రాయ్తో డేటింగ్ వార్తలు.. నటుడు స్ట్రాంగ్ రియాక్షన్
ఇటీవలే విడాకుల ప్రకటనతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్. నాగిని సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. ఈ ఏడాది మే నెలలో తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తన భర్త సూరజ్ నంబియార్తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే విడాకుల ప్రకటించిన రెండు నెలల్లోనే మౌనీ రాయ్పై రూమర్స్ మొదలయ్యాయి. నటుడు అర్జున్ బిజ్లానీతో ఆమె డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా ఓ హోటల్ నుంచి బయటికి వస్తున్న వీడియో వైరలైంది. దీంతో మౌనీ రాయ్, అర్జున్ రిలేషన్లో ఉన్నారంటూ బాలీవుడ్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ వార్తలపై నటుడు అర్జున్ బిజ్లానీ స్పందించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు రాస్తోన్న వారిని విమర్శించారు. ఇలాంటి కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన మీడియా సంస్థలను కోరారు. మా మధ్య 15 ఏళ్లకు పైగా ఉన్న స్నేహాన్ని ప్రేమగా చిత్రీకరించడం నిరాశపరిచిందన్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న నా స్నేహితురాలికి అండగా నిలబడినప్పుడు ఇలా జరగడం మరింత బాధాకరమని అర్జున్ అన్నారు. మా ఇద్దరి చుట్టూ అల్లుతున్న కథనాలు అవాస్తవమని అర్జున్ వెల్లడించారు. ఈ విషయంపై ఓ ప్రత్యేక నోట్ విడుదల చేశారు. అర్జున్ తన నోట్లో రాస్తూ..' "ప్రియమైన క్లిక్బైట్ మిత్రులారా.. 15 ఏళ్లకు పైగా స్నేహంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక గాసిప్ పేజీ శీర్షికలో వచ్చినంచ మాత్రాన ఒక్కసారిగా జంటగా మారిపోరు. కొన్నిసార్లు మన స్నేహితుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ వ్యూస్ కోసం ప్రతి స్నేహాన్ని ప్రేమ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ప్రచురించే ముందు వాస్తవాలను సరిచూసుకోవడం మంచింది. మనం సృష్టించే కథనాల విషయంలో బాధ్యతగా ఉందాం." అంటూ రాసుకొచ్చారు.ప్రజల వ్యక్తిగత జీవితాలకు నష్టం కలిగించేలా సంచలనాత్మక శీర్షికలను వాడకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి అనవసరంగా చొరబడి.. గందరగోళం సృష్టించే తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని మీడియాను కోరారు. బాధ్యతాయుతమైన జర్నలిజం విశ్వసనీయతను పెంచుతుందని.. క్లిక్బైట్ పెంచదని సూచించారు. అర్జున్, మౌని ప్రేమలో ఉన్నారన్న వార్తలను క్రిస్టల్ డిసౌజా కూడా ఖండించింది. ఇదేం పిచ్చి. కేవలం వ్యూస్ కోసం ఏమైనా పోస్ట్ చేస్తారా అని ప్రశ్నించింది.కాగా.. నటుడు అర్జున్, మౌనీ రాయ్ 15 ఏళ్లకు పైగా స్నేహితులుగా ఉన్నారు. 2015లో, ఏక్తా కపూర్ నిర్మించిన 'నాగిన్' సీరియల్లో వారు రితిక్, శివన్య పాత్రలలో నటించారు. వీరి జోడీ అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకటిగా నిలిచింది. గతంలో జనవరి 27, 2022న సూరజ్ను పెళ్లాడిన మౌనీ రాయ్.. ఈ ఏడాది మే 14న విడిపోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించింది.ఇక కెరీర్ విషయానికొస్తే మౌని రాయ్ ఇటీవల 'ది భూత్నీ','సలాకార్' చిత్రాలలో కనిపించారు. ఆమె అబ్ హోగా హిసాబ్ వెబ్ సిరీస్, హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో కూడా నటించారు. అర్జున్ బిజ్లానీ ఇటీవల అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో 'రైజ్ అండ్ ఫాల్' గెలుచుకున్నారు. అతను ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కామెడీ డ్రామాతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. మరి ఇంతగానా?
టాలీవుడ్ నటి నమిత గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో తనదైన నటనతో అదరగొట్టింది. అప్పట్లో బొద్దు బొద్దుగా తన గ్లామర్తో అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.అయితే తాజాగా నమితకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జిమ్లో కసరత్తులు చేస్తూ కనిపించింది. అప్పట్లో లావుగా, బొద్దు బొద్దుగా ఉండే నమిత.. ఇప్పుడేమో పూర్తి స్లిమ్గా మారిపోయింది. అసలు ఎవరు గుర్తు పట్టలేనంతగా కనిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో వావ్ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ అవుతున్న ఫిట్నెస్ వీడియో!#Namitha #ViralVideo #Tollywood #Kollywood #TeluguNews #TupakiFollow 👉 @tupaki_official pic.twitter.com/b3QJnYUfTY— Tupaki (@tupaki_official) July 17, 2026 -
విజయ్కు త్రిష.. నాకేమో నవ్వు!
సాక్షి సినిమా : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిష కృష్ణన్ బంధంపై తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. తన తాజా చిత్రం 'విజిటర్' ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన ధ్యాన్.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకను పరోక్షంగా ప్రస్తావిస్తూ వేసిన సరదా పంచ్లు ప్రేక్షకులను నవ్వించాయి. అయితే ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ ఈవెంట్లో తన సహనటి నవ్యా నాయర్ను ఉద్దేశించి ధ్యాన్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. నవ్యాకు పెళ్లై, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయినా నేను ఒకరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. నువ్వు తెల్లచీర కట్టుకుని ముందు వరుసలో కూర్చొని, కళ్లలో నీళ్లతో నన్ను చూస్తూ ఉండాలి" అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మాటలతో సభలో నవ్వులు పూశాయి.Trisha emotions were on high during Vijay oath ceremony. An emotional moment ❤️ pic.twitter.com/GrJcW88bwg— Devanshu Mani Tripathi (@devanshu_mani) May 10, 2026ఆ తర్వాత మైక్ అందుకున్న నవ్యా నాయర్ కూడా అదే స్థాయిలో స్పందించింది. "నువ్వు సీఎం అయితే.. నువ్వు చెప్పినట్టే తెల్లచీరకు ఆకుపచ్చ అంచు, డైమండ్ నెక్లెస్ వేసుకుని ముందు వరుసలో కూర్చుంటా. కళ్లలో ఆనందబాష్పాలతో నీకు జైకొడతా. కానీ ముందు వరుసలో నాకు సీటు మాత్రం రిజర్వ్ చేయాలి" అంటూ చమత్కరించింది. దీంతో సభలో మరోసారి నవ్వుల వెల్లువ ఎగిసింది.ఇదంతా సరదా సంభాషణలా అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తప్పు బడుతున్నారు. ఈ వ్యాఖ్యలను విజయ్ ప్రమాణ స్వీకార వేడుకతో పోలుస్తున్నారు. వాళ్లిద్దరిపైనా మండిపడుతున్నారు. The day I take the oath as CM... I think Navya will be there in the front row wearing a saree...!!- Dhyan Sreenivasan 😂 pic.twitter.com/UT5GvyK8Fq— Trollywood 𝕏 (@TrollywoodX) July 16, 2026 తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు త్రిష.. ఆయన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురికావడం అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఘటననే ధ్యాన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ధ్యాన్ మరో సరదా వ్యాఖ్య కూడా చేశాడు. విజయ్ ముఖ్యమంత్రి అయినట్లే.. తానూ రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అవుతానని జోక్ చేశాడు. అలాగే తన స్నేహితుడు, నటుడు అజు వర్గీస్ను ఈ సంభాషణలోకి లాగుతూ.. తనకి గవర్నర్ పదవి బాగుంటుందని నవ్వించాడు. వెంటనే అజు వర్గీస్ మీ అమ్మగారికి రాష్ట్రపతి పదవి దక్కుతుందని జోక్ చేశాడు.అయితే ఈ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందని అనుకున్నాడో ఏమో.. అజు వర్గీస్ వేదిక మీదకు వచ్చి "విజయ్ సార్, నా ఫ్రెండ్ కొంచెం పిచ్చోడు.. దయచేసి క్షమించండి" అంటూ వ్యాఖ్యానించాడు. ఆ మాటతో అక్కుడున్నవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.ఎవరీ ధ్యాన్-నవ్యా?ధ్యాన్ శ్రీనివాసన్(Dhyan Sreenivasan) మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత అయిన శ్రీనివాసన్ కుమారుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వినీత్ శ్రీనివాసన్కు సోదరుడు. 2013లో వచ్చిన తీరా సినిమాతో నటుడిగా పరిచయమైన ధ్యాన్, 2013లో 'తీరా' చిత్రంతో నటుడిగా పరిచయమైన ధ్యాన్ శ్రీనివాసన్.. 'ఆది కాప్యారే కూటమణి', 'కుంజిరామాయణం', 'గూడలోచన', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక.. నవ్యా నాయర్ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటి. 'నందనం', 'ఇష్టం', 'కళ్యాణరామన్', 'పందిప్పాడ' వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె, మలయాళంతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్ 2017లో అర్పితా సెబాస్టియన్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్యా నాయర్ 2010లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. -
భావోద్వేగాల హుషారు పిట్టలు
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నాయి. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘టోంగా టోంగా...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు.ఈ పాటకు ఎస్.ఎస్. చిరంజన్ సాహిత్యం అందించగా మంగ్లీ పాడారు. మోయిన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ వేడుకకి అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాను. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. వెంకట్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఇందులో అన్ని భావోద్వేగాలున్నాయి’’ అన్నారు.బిక్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తూ తిట్టారు. అయితే సినిమా చూసిన తర్వాత నెగెటివ్ కామెంట్స్ని వెనక్కి తీసుకుంటారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఏషియన్ సురేష్ ప్రోడక్షన్స్, బెక్కెం వేణుగోపాల్గారి సహకారంతో మా సినిమాకి మరింత బలం చేకూరింది’’ అని వాసవి గణేషన్ తెలిపారు. చరణ్ అర్జున్, నటులు గోవర్థన్, నవీన్, అంజి, కెమెరామేన్ రుద్రసాయి, రచయిత ఎస్.ఎస్.చిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమోషనల్ రాజా
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం ‘రాజా ది రాజా’. కె. శ్రీలత రెడ్డి సమర్పణలో అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలఅవుతోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రుత్విక్ మాట్లాడుతూ–‘‘నిన్న (బుధవారం) జరిగిన ప్రీమియర్స్కు మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి, నేను చాలా అదృష్టవంతుడిని అనిపించింది.అలాంటి ప్రేమ, ఆదరణ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశాను. మీ అందరి ముందుకు హీరోగా రావడం చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది. మేము ఎంతో ప్యాషన్తో చేసిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒక కల. ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మంచి అవుట్పుట్ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఈ సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి’’ అన్నారు అనిల్.‘‘ఈ సినిమా కోసం రుత్విక్ పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేను. మా టీమ్లోని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో కష్టపడి పని చేశారు. ప్రేక్షకులు కూడా ఇదే ప్రేమతో సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కె.నిహారిక. సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ మాట్లాడారు. -
ఆ భయం మంచిదైంది
‘‘సినిమా అనేది సముద్రం. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో హీరోయిన్ లైఫ్ స్పాన్ నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని, అందుకే వీలైనంత సంపాదించుకుని సెటిలైపోవాలని, ఎవరైనా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవాలని ఇలా ఏదేదో చెప్పారు. నిజమని నమ్మి, వెంట వెంటనే సినిమాలు చేశాను. ఆ భయంతోనే ఇప్పటికే దాదాపు 50 సినిమాలు చేశాను.ఆ భయం మంచిదైంది (సరదాగా..)’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో ఐశ్వర్యా రాజేష్ చెప్పిన సంగతులు...⇒ ‘ఓ..! సుకుమారి’ క్యూట్ లవ్స్టోరీ. ఈ సినిమాలో తిరువీర్, గవిరెడ్డి అన్నదమ్ములుగా నటించారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికి ముందు అబ్బాయి పుడితే వారికి కుటుంబ ఆస్తి వస్తుంది. ఈ సమయంలో నాకు, తిరువీర్కు వివాహం జరుగుతుంది. కానీ హీరో నన్ను ముట్టుకుంటే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ ⇒ ఈ సినిమాలో నేను దామిని క్యారెక్టర్ చేశాను. ఒక వ్యక్తిపై ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్ ఎలా పాజిటివ్గా మారింది? అన్నదే ఈ సినిమా స్టోరీ లైన్. ⇒ సినిమాలు... ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓటీటీలో చేయడం వల్ల వేల్యూ తగ్గిపోదు. తమిళంలో ‘సుళల్’ వెబ్ సిరీస్ చేశాను. ఈ సిరీస్ను దాదాపు 40 భాషల్లో డబ్ చేశారు. ‘ఇసకపట్నం’ సిరీస్ను 16 భాషల్లో డబ్ చేశారు. నా కెరీర్లో ఇప్పటివరకు నెగెటివ్ క్యారెక్టర్స్ చేయలేదు. ‘ఇసకపట్నం’ సిరీస్లో నా క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్ ఉంటుంది. నాకు ఫుల్ నెగెటివ్ షేడ్ రోల్స్ చేయాలని ఉంది. రమ్యకృష్ణగారు చేసిన ‘నీలాంబరి’, ఇంగ్లిష్ సినిమా ‘అబ్సెషన్’’లో హీరోయిన్ చేసిన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. -
జూ.ఎన్టీఆర్ తరహాలో రూమర్లపై బన్నీ వ్యవహరిస్తాడా?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి సినీ రంగానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు వస్తారనే ఊహాగానాలు ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ రూమర్లు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ రూమర్లు ఎన్టీఆర్ పై రావడం కొత్తేం కాదు. ఇప్పటికే అతడిపై చాలా ఏళ్లుగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న ప్రతి ఊహాగానాన్ని ఎన్టీఆర్ ఖండిస్తూ వచ్చాడు. తాజాగా వచ్చిన రూమర్లపై కూడా తన టీమ్ స్పందించింది. తాజాగా అల్లు అర్జున్ పై కూడా అలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈ విషయంపై బన్నీ నుంచి ఎలాంటి స్పందన లేదు. తన టీమ్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మొన్నటికిమొన్న తనపై వస్తున్న పొలిటికల్ ఎంట్రీ పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ‘రా ఎన్టీఆర్’ అనే సంస్థతో కానీ అది చేసే పనులతో తారక్కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈనెల 18న ‘రా ఎన్టీఆర్’ చేయబోయే ఛారిటీతో కూడా ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ ప్రకటించింది. ఈ మద్య వచ్చిన రూమర్లలో ఎన్టీఆర్ కంటే ముందే బన్నీ పొలిటికల్ ఎంట్రీ అంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అవి అలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అతడిపై వస్తున్న ఊహాగానాలకు ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది.ఇంత జరుగుతుంటే..అల్లు అర్జున్ మాత్రం తనపై వస్తున్న పుకార్లపై ఏమాత్రం స్పందించలేదు. ఆయన స్పందన కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమాల షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. పుకార్లపై ఎన్టీఆర్ టీమ్ స్పష్టత ఇచ్చినప్పటికీ, అల్లు అర్జున్ నుంచి మాత్రం మౌనం కొనసాగుతుండటంతో ప్రజల్లో చర్చ మరింత పెరిగింది. ఆయన ఈ పుకార్లను ఓపెన్గా ఖండిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఓటీటీలో సరికొత్త యానిమేషన్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజాగా సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ పిల్లల పుస్తకం ‘ ది వెరీ ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్పై సరికొత్తగా అందించనున్నారు. కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది.వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందించిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్కు ఆరంభం మాత్రమే. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించనుంది. పిల్లలు భారతీయ పౌరాణిక కథలను వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ కతలో ఇద్దరు అల్లరి అసుర పాత్రలను పెట్టడం ద్వారా, అల్లరి పిల్లలకు విలువలు లేదా క్రమశిక్షణ ఉండవనే అభిప్రాయాన్ని ప్రశ్నిస్తుంది. కుండక్క, మండక్క చేసే సాహసాల ద్వారా ఆసక్తి, అల్లరి కూడా దయ, ధైర్యం, అనుభూతితో కలిసి ఉంటుందని మనకు అవగతమవుతుంది. ఈ సిరీస్ సిరీస్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది.రైటర్ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ..'నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథలను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్ఫామ్స్ రూపొందించటం అనందంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించదగ్గ విషయం' అని అన్నారు -
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ప్రియ జంటగా నటించగా లేటేస్ట్ ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్లో తెలుగు సినిమాలను చూసే విధానంపై మాట్లాడారు. తన చిత్రం క తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు. కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదన్నారు.తమిళనాడులో మన సినిమాలపై వివక్ష ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష చిత్రాలను మనవాళ్లు ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం.. ఆదరణ దక్కడం లేదన్నారు. అఖిల్ అన్న నటించిన లెనిన్ అక్కడ కూడా ఒకేసారి విడుదలై ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని తెలిపారు.మన సినిమాలు కూడా తమిళంలో మంచి విజయాలు సాధించాలనేది తన కోరికని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా.. థియేటర్లు ఇచ్చినా తమిళులు తెలుగు సినిమాలు చూడరని తెగేసి చెప్పారని వెల్లడించారు. వారి సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసిందని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. -
జిమ్లో 'సిల్క్ స్మిత' వర్కవుట్స్.. వీడియో వైరల్
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్ సిల్క్ స్మిత. అప్పట్లో టాలీవుడ్లో ప్రేక్షకుల గుండెల్లో ఐటమ్ గర్ల్గా ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్ మూవీ నా దేశం చిత్రంలో నేనొక నెత్తురు దీపం సాంగ్ తర్వాత ఐటెం గర్ల్గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.అదే సమయంలోనే గూండా, ఛాలెంజ్, బాలకృష్ణ ఆదిత్య 369వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.అయితే మనుషుల పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని మనందరం వింటుంటాం. అదే నిజమో కాదో తెలియదు కానీ.. ఓ అమ్మాయి మాత్రం అచ్చం సిల్క్ స్మితను తలపిస్తోంది. గతంలో అచ్చం సౌందర్యలాగే ఓ అమ్మాయి కనిపించింది. తాజాగా సిల్క్ స్మితను పోలిన ఓ అమ్మాయి జిమ్లో సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమె అచ్చం స్మితలా కాకపోయినా.. ఇంచుమించు అలానే కనిపిస్తోంది. అచ్చం సిల్క్ స్మిత లాగే వుంది, కొంచం లావుగా వుంది.#SilkSmitha pic.twitter.com/Jk1LX1mn1X— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 16, 2026 -
ఓటీటీకి మా ఇంటి బంగారం.. ఒక్క రోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' థియేటర్లలో సందడి చేయనుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వడ్డే నవీన్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు కన్నడ మూవీ ది డెవిల్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో పాటు ఈ శుక్రవారం పలు హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17 ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17 డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17 హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17 25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17 స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18అమెజాన్ ప్రైమ్..ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17ఆహాఓవెల్స్(తమిళ సినిమా)- జూలై 17జియో హాట్స్టార్.. మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17 టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18జీ5 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17 ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17శివలోక్ కె కుండక్క మండక్క(యానిమేషన్ సిరీస్)- జూలై 17లయన్స్ గేట్ ప్లే..డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17 -
అఖిల్ లెనిన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు.సినిమా బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తోన్న వేళ.. మేకర్స్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లెనిన్ మూవీ నుంచి ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. బ్లాక్బస్టర్ మాషప్ పేరుతో ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అఖిల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్పెషల్ వీడియో చూసేయండి. -
టాలీవుడ్లో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆమెన్. ఈ సినిమాకు ఎస్కే బషీద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై రేగుల నీరజరాణి నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్కే బషీద్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్కు భిన్నంగా ఆమెన్ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం... గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన మూవీ. ఔట్పుట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ మూవీ ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే నన్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి. -
విడాకులు తీసుకున్న రామాయణ నటుడు
ప్రముఖ బాలీవుడ్ జంట తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసుకుంది. మరాఠీ నటుడు, దర్శకుడు అదినాత్ కొఠారి, ఆయన భార్య నటి ఊర్మిళ కనేత్కర్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులను కోరారు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ తమ కుమార్తె జిజా పట్ల ఇద్దరం బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తనను ఇద్దరం కలిసికట్టుగా పెంచడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు.కొఠారే తన ఇన్స్టాలో రాస్తూ.. "మా స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు మా విజ్ఞప్తి. చాలా సార్లు ఆలోచించిన తర్వాత నేను, ఊర్మిళ పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒక జంటగా మా ప్రయాణం ముగిసింది. కానీ మా కుమార్తె జిజా పట్ల మా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆమె మాకు అత్యంత ప్రాధాన్యత. ఆమె ప్రేమ, భద్రత, మద్దతుతో పెరిగేలా చూసేందుకు మేము చాలా సంతోషంగా, అంకితభావంతో కలిసి పెంచుతాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని అదే విధంగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం" అని రాసుకొచ్చారు.ఈ సమయంలో మీడియా మిత్రులు, ప్రజలు మా గోప్యతను గౌరవిస్తారని మేము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక సిని కెరీర్ విషయానికొస్తే కొఠారే నెట్ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'లో కనిపించారు. ఈ షోలో ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, విహాన్ సమత్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 83లో క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ పాత్ర పోషించారు. కాగా.. కొఠారే ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తోన్న 'రామాయణంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవీ దూబే, యశ్, సన్నీ డియోల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. -
లెనిన్ విలన్.. ప్రభాస్ను అంత మాట అనేశాడా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్ లెనిన్లో విలన్గా మెప్పించిన కన్నడ నటుడు ప్రమోద్ పంజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీట్లో ప్రభాస్ గురించి మాట్లాడారు. ఆయనలో తనకు నచ్చింది హాస్పిటాలిటీ అని తెలిపారు. అఖిల్ అన్నలో కూడా అదే చూశానని కొనియాడారు. అయితే ప్రభాస్ను పొగిడే క్షణంలో వాడు అని ప్రమోద్ సంభోదించారు. తెలుగు సరిగా రాకపోవడం వల్లా అలా అన్నారా.. లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రభాస్ను వాడు అని సంభోధించడంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. India’s Biggest Star #Prabhas ని “వాడు” అని సంబోధించిన #Lenin Villain🤯 pic.twitter.com/1xFNLFUQ1u— cinee worldd (@Cinee_Worldd) July 15, 2026 -
పెళ్లికి ముందు ఇంకొకరితో ప్రేమలో ఉన్నా.. బ్రేకప్కి కారణం ఇదే: నటి
మలయాళ, తమిళ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక విజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గత ప్రేమ బంధం గురించి వివరిస్తూ, సినీ పరిశ్రమలోని సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లికి ముందు నేను ఒకరితో రిలేషన్లో ఉన్నా. ఒక సీరియల్లో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డాను. 'మనసు పోలే మంగళ్యం' సీరియల్ షూటింగ్ సమయంలో మా పరిచయం ప్రేమగా మారింది. అతను వృత్తిరీత్యా గేమ్ డెవలపర్. అతని కుటుంబానికి నటనతో ఎలాంటి సంబంధం లేదు. కానీ కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ ఉండటం వల్ల, అతను సరదాగా సీరియల్లో నటించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి ఆలోచనలు, నటనపై ఉన్న ప్యాషన్ కలవడంతో మేము దగ్గరయ్యాం. అతను చాలా మంచి వ్యక్తి, నన్ను ఎంతో గౌరవించేవాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అనూహ్యంగా అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అలాగే కొందరు కుటుంబ సభ్యులు మరణించారు. ఆ పరిస్థితులు అతన్ని మానసికంగా తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ డిప్రెషన్ కారణంగానే అతను నన్ను దూరం చేసుకున్నాడు. ఇందులో నా తప్పేమీ లేదు’ అని స్వాసిక చెప్పుకొచ్చింది.ఇక సినీ పరిశ్రమలో ఎదురయ్యే 'కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ..ఈ సమస్యలు కేవలం సినిమా రంగానికే పరిమితం కావని, అన్ని రంగాల్లోనూ ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, మీడియా దృష్టి ఎక్కువగా సినిమా పరిశ్రమపైనే ఉండటం వల్ల ఇది ఇక్కడ పెద్ద విషయంగా కనిపిస్తుందని ఆమె విశ్లేషించారు. -
ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘పౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రభాస్ ప్యాన్స్కి గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పౌజీ’ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 3న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసింది. అందులో ప్రభాస్.. యుద్ధంలో ఒంటి నిండా రక్తంతో, తుపాకీపై చేయి పెట్టి కూర్చొని ఉన్నాడు. మునుపెన్నడూ ఇలాంటి పాత్రలో ప్రభాస్ని చూడలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటించగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర బృందం త్వరలోనే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానుంది. ప్రచారంలో భాగంగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. अज्ञातपर्व ENDS. THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y— Fauzi (@FauziTheMovie) July 16, 2026 -
అప్పుల బాధలు.. కూలీ పనికి వెళ్లా: విజయ్ సేతుపతి ఎమోషనల్
సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుల్లో తమిళ 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ఒకరు. కేవలం కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లోనూ తనదైన నటనతో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారాయన. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి తన బాల్యం, కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించాడు.నాన్న పక్కనే కూర్చునేవాడినిచిన్నప్పడు మేము చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా నాన్న మా కోసం చాలా అప్పులు చేశాడు. అవి కట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాం. ఒక్కోసారి అప్పులు కట్టలేదని మా ఇంటిపైకి దాడికి వచ్చేవాళ్లు. ఆ సమయంలో మా నాన్న ఒంటరిగా బాధపడకూడదని నేను ఎప్పుడూ ఆయన పక్కనే కూర్చునేవాడిని. మా నాన్నకు ఒక అలవాటు ఉండేది. ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు బుల్లెట్ బండిపై ఇంటికి వస్తూ.. ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేవాడు. మాతో షేర్ చేసుకొని తినేవాడు. అది నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం.డబ్బుల కోసం సినిమాల్లోకి వచ్చానటుడు అవ్వాలనేది నా లక్ష్యమే కాదు. కేవలం కుటుంబ బాధ్యతలు, ఆర్థిక అవసరాల కోసమే నేను సినిమాల్లోకి వచ్చా. మొదట్లో సినిమాల్లో నటించడం నచ్చేది కాదు. కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టం. ఏ పని అయినా సరే గౌరవంగా చేయడం నా అలవాటు. సినిమాల్లోకి రాకముందు దుబాయ్లో అకౌంటెంట్గా పని చేశా. స్కూల్ ఏజ్లో కూలీ పనికి వెళ్లాను. రిటైల్ స్టోర్లో సేల్స్మ్యాన్గా, ఫాస్ట్ ఫుడ్ జాయింట్లో క్యాషియర్గా, ఫోన్ బూత్ ఆపరేటర్గా ఇలా చాలా పనులు ఇష్టంలో చేశాను.అలా సినిమాల్లోకి.. ‘దుబాయ్ నుంచి ఇండియా తిరిగి వచ్చాక నాటక రంగం వారితో పరిచయం ఏర్పడింది. ఆ అనుభవంతోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా మారాను’అని విజయ్ చెప్పుకొచ్చాడు. 'తెన్మేర్కు పరువకాట్రు' చిత్రంతో హీరోగా మారిన ఆయన.. ఆ తర్వాత 'సూదు కావ్వుమ్', 'విక్రమ్ వేద' 'మహారాజా' వంటి వైవిధ్యమైన చిత్రాలతో అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన ‘ట్రైన్’, ‘స్లమ్ డాగ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
‘వారణాసి’లో ప్రియాంక స్లో-మోషన్ జంప్స్.. జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు
గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే విజువల్ వండర్. ఆయనతో పని చేయడానికి స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న 'వారణాసి' చిత్రం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక సినిమా మేకింగ్, రాజమౌళి వర్కింగ్ స్టైల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతి సీన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు..తాజాగా ఓ పాడ్ కాస్ట్లో రాజమౌళి పర్ఫెక్షన్ గురించి ప్రియాంక మాట్లాడుతూ..‘ఈ ప్రాజెక్ట్ కోసం నేను గత 14 నెలలుగా నిరంతరాయంగా పని చేస్తున్నాను. రాజమౌళితో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన సెట్స్పై ప్రతి చిన్న సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా, అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తారు. అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేవరకు ఆయన అస్సలు రాజీ పడరు’అని ప్రియాంక పేర్కొన్నారు.మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్..సినిమాలో తన పాత్ర , యాక్షన్ ఎపిసోడ్స్ గురించి చెప్తూ ఫ్యాన్స్లో మరింత హైప్ పెంచారామె. ఈ సినిమాలో తాను గతంలో ఎన్నడూ చేయని విధంగా ఎన్నో అద్భుతమైన స్లో-మోషన్ జంప్స్ చేశానని, అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.ఇంతకంటే చెప్పలేను!సినిమా కథ, ఇతర వివరాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నప్పటికీ, ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేనని ప్రియాంక నవ్వుతూ దాటవేశారు. ‘ప్రస్తుతానికి నేనింతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ సినిమా మాత్రం చాలా గ్రాండ్గా వస్తోంది’ అంటూ వారణాసి అప్డేట్కు ముగింపు పలికారు.అక్టోబర్లో షూటింగ్ పూర్తిరాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్లో పూర్తి కానుంది. ఇప్పటికే కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసినట్లు రాజమౌళి చెప్పారు. అక్టోబర్లో మొత్తం షూటింగ్ పూర్తి చేసి..వచ్చే ఏడాది జనవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. 2027 ఏప్రిల్ 7 ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
‘అయ్యగారి’ని కలిసిన అభిమాని.. కన్నీళ్లు తూడుస్తూ అఖిల్ ఎమోషనల్!
‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ తనపై ప్రేమను చాటిన వీరాభిమాని నాగరాజును అఖిల్ అక్కినేని ఎట్టకేలకు కలిశాడు. నిన్న(జులై 15) గుంటూరులో జరిగిన ‘లెనిన్’ సక్సెస్ మీట్ అనంతరం అఖిల్ తన అభిమాని నాగరాజుని కారవాన్లోకి పిలిపించుకొని మాట్లాడాడు. ఈ సందర్భంగా నాగరాజు ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ కాళ్ల మీద పడిపోయి బోరున ఏడ్చేశారు. అతణ్ని ఓదారుస్తూ అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది అని చెప్పాడు. తర్వాత తన భార్యను పరిచయం చేశాడు కూడా. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అఖిల్ కెరీర్ ఆరంభంలో ఈ అభిమాని‘అయ్యగారే నంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత అఖిల్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే.. అందరి దృష్టి ఈ అభిమాని మీదకు వెళ్తుంది. లెనిన్ మూవీ రిలీజ్ ముందు కూడా నాగరాజు వీడియో మళ్లీ వైరల్ అయింది. కొంతమంది యూట్యూబర్లు అతన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. నాగరాజు కల్మషం లేని అభిమానం చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఒక్కసారైనా హీరోని కలిస్తే బాగుండేదని కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్లే..నిన్న నాగరాజుకు అఖిల్ను కలిసే అవకాశం దొరికింది. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
శ్రీలీలకు మరో బిగ్ షాక్.. ఈ సారి కయాదు కొట్టేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుంచి కొత్త సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. గుడ్ బాడ్ అగ్లీ చిత్రం తర్వాత ఈయన మరో చిత్రంలో నటించలేదు. దీంతో ఆయన అభిమానులు కొత్త చిత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గుడ్ బాడ్ అగ్లీ చిత్రం దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ నే అజిత్ 64వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువడలేదు. మరోపక్క అజిత్ తన కార్ రేస్ పోటీలపై దృష్టి సారిస్తున్నారు. ఇకపోతే అజిత్ తన పారితోషికాన్ని తగ్గించడానికి అంగీకరించడం లేదని, దీంతో నిర్మాతలు ఆయనతో చిత్రం చేయడానికి ముందుకు రావడంలేదనే ప్రచారం జోరుగానే సాగుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ కథానాయకుడుగా నటించే 64వ చిత్రాన్ని నిర్మించడానికి కోయంబత్తూరు కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చినట్లు తాజా సమాచారం. కాగా ఇందులో నటి శ్రీ లీల నాయకగా నటించనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజా విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీలను తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు సమాచారం.అయితే సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఉన్న ఫ్లాప్ రికార్డు చూసి చిత్రబృందమే ఆమెను తప్పించారనే రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీలీల స్థానంలో కయాదు లోహర్ని తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలీల ‘లెనిన్’లాంటి మంచి సినిమాను మిస్ చేసుకుంది. తొలుత ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నారు.అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆమె పాత్రను భాగ్యశ్రీ చేసింది. సినిమా రిలీజ్ తర్వాత భాగ్యశ్రీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీలల అనవసరంగా ఈ సినిమాను వదులుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు అజిత్ సినిమా కూడా మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె స్థానంలో కయాదుని తీసుకున్నారట. మరో ముఖ్య పాత్రలో నటి స్వాసిక నటించనున్నట్లు, దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు మొదలయ్యాయని త్వరలోనే ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
హీరో సూర్యతో రాజమౌళి కొత్త సినిమా?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్స్టార్ మహేష్బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. గతంలో రాజమౌళి తర్వాత చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఉండబోతుందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిపై అల్లు అర్జున్ నుంచి కానీ, రాజమౌళి టీం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అయితే తాజాగా రాజమౌళి వారణాసి తర్వాత చిత్రం తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా సూర్యతో సినిమా చేయడానికి రాజమౌళి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సూర్య-రాజమౌళి కాంబినేషన్పై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. వీరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ గతంలో కూడా పలు వార్తలు తెగ హల్చల్ చేశాయి. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా ముందు సూర్య పేరును పరిశీలించినట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, అవి అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. సూర్యతో మూవీ చేసే అవకాశాన్ని తాను మిస్ అయ్యానని అప్పట్లోనే రాజమౌళి చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సూర్య తన 50వ సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ఓ భారీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్పై రాజమౌళి నుంచి కానీ సూర్య నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది. అనంతరం భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్తో జతకట్టారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
అయ్యగారే నంబర్వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లెనిన్ సక్సెస్పై జైనాబ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా అయ్యగారే నెంబర్ వన్ అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా లెనిన్ టీమ్కు అభినందనలు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చి ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. #Lenin చూసి #AkhilAkkineni wife #Zainab కూడా ఒకే మాట...' అయ్యగారే నెంబర్ 1 '#Lenin Success Celebrations at Gunturpic.twitter.com/mVE9jJid5r— Taraq(Tarak Ram) (@tarakviews) July 15, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీలోనూ ట్రెండింగ్..!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూస్తో ట్రెండింగ్లో వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
దిల్ రాజు చేతికి ది ప్యారడైజ్.. నిర్మాత ఏమన్నారంటే?
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ అండర్వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది. అయితే మరోసారి కూడా వాయిదా పడనుందనే వార్తలొస్తున్నాయి.ది ప్యారడైజ్ వాయిదా వార్తల వేళ మరో న్యూస్ టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. నాని మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారని ఓ టాక్ వైరలవుతోంది. తాజాగా ఈ వార్తలపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. అలాంటిదేం జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పంపిణీ హక్కుల గురించి ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని కోరారు. ఏదైనా అధికారిక సమాచారం మా అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. దీంతో ది ప్యారడైజ్పై వస్తున్న రూమర్లకు చెక్ పడినట్లైంది. -
'ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏం లేదు.. అదొక్కటి తప్ప'.. పూజా హెగ్డే
సినీ ప్రియుల గుండెల్లో బుట్టబొమ్మగా ముద్ర వేసుకున్న బ్యూటీ పూజా హేగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన జన నాయగన్ రిలీజ్కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచే థియేటర్లలోకి రానుంది. విజయ్ హీరోగా వస్తోన్న చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సంగతి పక్కనపెడితే బుట్టబొమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడింది. ఆయనతో రాధే శ్యామ్ మూవీలో హీరోయిన్గా చేశానని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ టైమ్లో నాకు ప్రభాస్ పంపిన ఫుడ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది. ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంకేం లేదని.. అవకాశం వస్తే ఆయన కుక్ను దొంగిలిస్తానని ఫన్నీ కామెంట్స్ చేసింది బుట్టబొమ్మ. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. Pooja Hegde in her latest interview when asked if she learned anything from Prabhas or if he gave her any advice:"My only core memory of Radhe Shyam is the food. I just want to steal Prabhas's cook and nothing else, cause he doesn’t have anything else to offer" [Laughs] 😭😭 pic.twitter.com/VWSpag2pIE— Raj (@idfcwau) July 14, 2026 -
'అందుకే జానకమ్మను చివరిసారి చూడలేకపోయా'.. సింగర్ శ్వేత ఎమోషనల్
ప్రముఖ లెజెండరీ సింగర్ జానకి మరణంపై గాయని శ్వేతా మోహన్ ఎమోషనల్ అయ్యారు. జానకమ్మ మరణాన్ని తలచుకుని వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 11న లండన్లో జరిగిన ఇళయరాజా సంగీత కచేరీలో శ్వేతా మోహన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె అంత్యక్రియలకు ఎందుకు రాలేదని చాలామంది అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జానకి అంత్యక్రియలకు హాజరు కాలేదని శ్వేతపై కొందరు ట్రోలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.శ్వేతా మోహన్ తన ఇన్స్టాలో రాస్తూ "జానకి అమ్మ అంత్యక్రియలకు నేను ఎందుకు హాజరు కాలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు... ఆ టైమ్లో నేను లండన్లో ఇళయరాజా సార్ సంగీత కచేరీలో పాల్గొన్నా. ఆమెను చివరిసారిగా చూసి ఆశీర్వాదం తీసుకోలేకపోవడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆమె అంబులెన్స్లో ఉన్నప్పుడు చివరిసారిగా వీడియో కాల్లో చూశా. నన్ను విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెడుతున్నా. నన్ను ఎగతాళితో ప్రశ్నించిన వారందరికీ నా విజ్ఞప్తి. దయచేసి ఇది మానసికంగా చాలా కష్టమైన సమయం. దయచేసి నన్ను మరింత బాధపెట్టకండి," అని ఆమె రాసింది.ఈ పోస్ట్కు ఆమె అభిమానుల నుంచి మద్దతు లభించింది. జానకమ్మ మరణంతో మీరు ఎంతగా కుంగిపోయారో మేము చూశామని రాసుకొచ్చాడు. మీరు అంతలా నిబ్బరంగా ఉన్నందుకు మీకు చాలా గౌరవంగా ఉందని మరొకరు పోస్ట్ చేశారు. కాగా.. జానకి మరణవార్త విన్న తర్వాత శ్వేత సోషల్ మీడియాలో నివాళులర్పించారు. View this post on Instagram A post shared by Shweta Mohan (@_shwetamohan_) -
‘ఎలగే పిల్ల’ పాట క్యాచీగా ఉంది : నాగవంశీ
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’.భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఎలగే పిల్ల’ అనే పాటను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేసి చిత్రయూనిట్కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలాన్, దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది. సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. -
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ నటి హేమ.. వీడియో వైరల్
క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. తాజాగా ఆమె ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త కారుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హేమకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ప్రముఖ మెర్సిడెజ్ బెంజ్ బ్రాండ్ కారును హేమ కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.కోటిన్నరకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారును తానే స్వయం నడుపుతూ వీడియోలో కనిపించింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
మరో ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ఈషా. గతేడాది చివర్లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు.ఈషా కథేంటంటే..కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
విజయ్ జన నాయగన్.. రిలీజ్ డేట్ ఫిక్స్
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. రాజకీయాలకు ముందు ఆయన నటించిన చివరి చిత్రమిదే. ఈ మూవీనే తన ఆఖరి సినిమా అని కూడా విజయ్ విజయ్ ప్రకటించారు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.తాజాగా జన నాయగన్ రిలీజ్ డేట్ను రివీల్ చేశారు మేకర్స్. జూలై 23 నుంచే థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్లో పోస్టర్ షేర్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. Tested by fire.Forged by time.Built for history.The tougher the battle,The louder the victory.#JanaNayaganFromJuly23#JanaNayakuduFromJuly23#JanNetaFromJuly23The Hon'ble Chief Minister @actorvijay @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol… pic.twitter.com/21xjixgUBM— KVN Productions (@KvnProductions) July 15, 2026 -
స్టార్ హీరో ఇంట్లోకి ఏలియన్స్.. వీడియో వైరల్
హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఆస్కార్ నామినీ జేమ్స్ ఫ్రాంకో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్ ఇంట తీవ్ర దుమారం రేపుతోంది. తన కొత్త టిక్టాక్ ఖాతా ద్వారా ఆయన పంచుకున్న ఈ వీడియోలో... ఏలియన్స్ తనను అనుసరిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు, ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు ఫ్రాంకో మానసిక స్థితి బాగుందో లేదోనంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?జులై 13న జేమ్స్ ఫ్రాంకో తాను ఒక పెద్ద సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించబోతున్నట్లు ప్రకటించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు.ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలో.. తన ఇంట్లో కొన్ని వింత విషయాలను కనుగొన్నట్లు చెప్పారు. ఇది తనకు ఇష్టం లేకపోయినా తనపై బలవంతంగా రుద్దబడిందని పేర్కొన్నారు. నిజాలు బయటపెట్టకుండా ఉండేందుకు తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, ప్రజలు తనను పిచ్చివాడిగా ముద్ర వేస్తున్నారని ఫ్రాంకో ఆరోపించారు.ఆ వీడియోలో ఏముంది?ఫ్రాంకో తన ల్యాప్టాప్లో రికార్డ్ చేసిన కొన్ని 'బ్లాక్ అండ్ వైట్' దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. అందులో ఒక ఏలియన్ చెట్టు వెనుక దాక్కుని, కిటికీ గుండా లోపలికి చూస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా, ఆ జీవి యొక్క పొడవైన వేళ్లు కిటికీపై నొక్కుతున్న దృశ్యాలు కూడా స్పష్టంగా అందులో రికార్డ్ అయ్యాయి.ఫేక్ వీడియోఈ వీడియో వైరల్ అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం దీన్ని అస్సలు నమ్మడం లేదు.‘ఇది పూర్తిగా నకిలీ వీడియో. హాలోవీన్ దుకాణం నుండి కొనుగోలు చేసిన ఒక చౌకైన మాస్క్ను ఎవరో ధరించి ఈ డ్రామా ఆడుతున్నారు’ అని విమర్శకులు కొట్టిపారేస్తున్నారు.మరికొందరు, ఈ వీడియోను ఇంకాస్త స్పష్టంగా చూడాలంటే తమ ఛానెల్కు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని కోరడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. డబ్బులు సంపాదించడానికి ఇదొక మోసపూరిత చర్య అని ఫైర్ అవుతున్నారు.సినిమా ప్రమోషన్స్ కోసమా?'127 అవర్స్' వంటి అద్భుతమైన చిత్రంతో ఆస్కార్ నామినేషన్ అందుకున్న జేమ్స్ ఫ్రాంకో లాంటి నటుడు ఇలాంటి చౌకబారు పనులు ఎందుకు చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, త్వరలో విడుదల కానున్న ఆయన సరికొత్త చిత్రం 'లవ్ మీట్స్ ఇన్ ది సన్షైన్' ప్రమోషన్లో భాగంగానే ఈ 'పబ్లిసిటీ స్టంట్' చేసి ఉంటారని సినీ పరిశ్రమలో గట్టిగా చర్చ నడుస్తోంది. గతంలో కూడా ఫ్రాంకో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దాఖలాలు ఉన్నాయి.James Franco Drops His Alien Footage. Crystal clear alien in 4k. James Franco poker face.Either the footage is real or James Franco lost his mind. pic.twitter.com/dDksbGShbe— Good Morning UFO (@goodmorningufo) July 13, 2026 -
చిన్న సినిమాలకు రాయితీలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత
‘‘ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తెలంగాణలో చిన్న సినిమాల అభివృద్ధికి మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని ‘తెలంగాణ రక్షణ సేన పార్టీ’ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. దినేష్ కుమార్, దివిజ జంటగా నటించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా, దర్శకుడు దశరథ్ అతిథిగా హాజరయ్యారు. ‘‘ఒక ఆడబిడ్డ కన్నీటి కథే ఈ చిత్రం. సినిమా చూస్తున్నప్పుడు కంటతడి పెట్టకుండా ఉండలేరు’’ అన్నారు కోమలి మహేందర్. ‘‘కుటుంబాల్లో తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మా చిత్రం చూపిస్తుంది’’ అని చెప్పారు సతీష్ ఆవాల. ‘‘వెంకట్రామయ్య పాత్ర చేస్తున్నప్పుడు గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చాయి’’ అని మురళీధర్ గౌడ్ తెలిపారు. సుధ, సత్యశ్రీ, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
నా కెరీర్లోనే ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ప్లే ఇచ్చా : పోసాని
‘నేను రైటర్ గా వంద చిత్రాలు రాశాను. నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను. దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను. నేను చేసిన అన్ని చిత్రాల్లో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ కు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను. ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు’ అని అన్నారు నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ వహించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలతో పాటు నిర్మాతగానూ ఆయనే వ్యవహరించాడు. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. ‘మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నా.ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను. "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పోసాని ఎంతో ప్లానింగ్ తో రూపొందించారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది. ఇది పోసాని గారికి 2.ఓ గా మారుతుందని చెప్పగలను. అన్నారు.‘ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది’ అని హీరోయిన్ హిందోళ చక్రవర్తి అన్నారు. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి సెన్సేషన్ ను మా మూవీ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను’అని నటి కాజల్ శర్మ అన్నారు. నిర్మాత శ్రీనివాస్, డీవోపీ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. -
నెలకు ఇరవై కథలు వింటున్నాను
తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తిరువీర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేనొక అప్కమింగ్ పొలిటీషియన్ పాత్రలో నటించాను. ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది.అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా కథ కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భావోద్వేగానికి గురి చేస్తుంది. నేను నటించిన సినిమాలకు నిర్మాతలకు డబ్బులు వచ్చి, దర్శకుడికి పేరు వస్తే చాలనుకుంటాను. ఒకప్పుడు సినిమాల్లో నటించేందుకు నా ఫొటోలు తీసుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగాను.అలాంటిది ఇప్పుడు నాతో సినిమాలు చేస్తే బిజినెస్ జరుగుతోందని భావించి, దర్శక–నిర్మాతలు నాతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన నేను కంఫర్టబుల్ ప్లేస్లోనే ఉన్నానని అనుకుంటున్నాను. ఇక నెలకు దాదాపు 20 కథలు వింటాను. వీటిలో నాకు నచ్చిన కథలు చేస్తున్నాను. నా తర్వాతి చిత్రం ‘భగవంతుడు’ కొత్తగా ఉంటుంది. అలాగే అమెజాన్ ఓటీటీ ప్లాట్ఫామ్కు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
మధ్య తరగతి కష్టాలను చెప్పడం గొప్ప కళ: శ్రీకాంత్
‘‘మధ్యతరగతి వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఆ విషయంలో నాగేశ్వర్ రెడ్డిగారు అద్భుత విజయం సాధించారు. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికే చెప్పుకుంటాం. అలాంటి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’లో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, లయ జంటగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. జీకే–సీఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ విడుదల వేడుకకు దర్శకులు వీవీ వినాయక్, దశరథ్, రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై, ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈ మూవీ మిడిల్ క్లాస్ని మాత్రమే కాదు... అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అని పేర్కొన్నారు. జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘శ్రీకాంత్ మరో బ్లాక్బస్టర్ సాధించబోతున్నారని గ్యారెంటీగా చెబుతున్నాను’’ అని తెలిపారు. ‘‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత చందు. -
నాని–నితిన్ కాంబోలో కొత్త ప్రాజెక్టు.. హీరోయిన్గా రుక్మిణి వసంత్?
నేచురల్ స్టార్ హీరో నాని నిర్మాతగా, నితిన్ హీరోగా ఒక కొత్త సినిమా దాదాపు ఖరారైనట్టే సమాచారం. గత ఏడాది వచ్చిన ‘దండోరా’ చిత్ర దర్శకుడు మురళీకాంత్ చెప్పిన కథ నానికి నచ్చడంతో, తన సొంత బ్యానర్పై ఈ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆమెతో ఈ చిత్రంపై చర్చలు జరిగాయి. అనంతరం రుక్మిణి నుంచి సరే చూద్దాం అన్న స్థాయిలోనే మాట ముగిసిందని సమాచారం. కానీ ఈ సినిమాలో నితిన్ సరసన రుక్మిణి వసంత్ ఫిక్స్ అయింది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయి. ప్రస్తుతం నితిన్ ఓ సినిమా షూట్లో ఉన్నాడు. అక్టోబర్ నెల వరకు ఆయన బిజీగా ఉండే అవకాశం ఉంది. రుక్మిణి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అక్టోబర్ నాటికి ఆమె తన కాల్షీట్లు సర్దుబాటు చేయగలనో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు మాత్రమే చర్చలు జరిగాయి. అధికారికంగా దీనిపై రుక్మిణి ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాని కూడా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూట్లో ఉన్నాడు. మరో నెల రోజుల్లో ఆ సినిమా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాతే ఈ కొత్త ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వనున్నాడు. ఆ తరువాతే రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఉంటుందో లేదో తేలిసే అవకాశం ఉంది. -
తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. అందరికీ తెలుసు.. తాను తీసిన సినిమాలన్నీ తలెత్తుకునేవి చేశాడు. ఎవరు పిలిచినా.. ఏ ఫంక్షన్కు పిలిచినా వచ్చేస్తాడని అన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్ రావిపూడి అని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా చెప్పకపోయినా ఈవెంట్కు వచ్చేశారని అన్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీరోగా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన హీరోగా నటించిన వదలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి సైతం జగపతిబాబుపై ప్రశంసలు కురిపించారు. నేను ఇప్పుడూ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేస్తున్నాను... కానీ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కు పిచ్చెక్కించిన యాక్టర్ జగపతిబాబు అని కొనియాడారు. ఆయనతో ఒక సినిమాకు పని చేయాలని ఉందని అనిల్ రావిపూడి తన మనసులోని మాట బయటపెట్టారు.కాగా.. జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?
హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు ఇండియాలోనూ క్రేజ్ ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన ఓపెన్ హైమర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. అదే ఊపులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన దర్శకత్వలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ది ఒడిస్సీ. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ముంబయిలో సందడి చేశారు. తన టీమ్తో కలిసి ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంబయి వీధుల్లో క్రిస్టోఫర్ నోలన్ ఎంజాయ్ చేశారు. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ నటించిన ఈ మూవీ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.భారీగా టికెట్ రేట్లు..అదే సమయంలో ఈ మూవీ క్రేజ్ దృష్ట్యా టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. ముంబయిలోని ఐమ్యాక్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో రిక్లైనర్ సీట్ రేటు ఏకంగా రూ. 3,100 గా ఫిక్స్ చేశారు. ఇక ఢిల్లీ విషయానికొస్తే పీవీఆర్, సెలెక్ట్ సిటీ వాక్ లాంటి మల్టీప్లెక్సుల్లో రిక్లైనర్ టికెట్ ధరలు ఏకంగా రూ.2,500 వరకు ఉన్నాయి. అదే థియేటర్లలో సాధారణ సీట్స్ కూడా రూ.1,000 నుంచి రూ. 2,100 వరకు రేట్లు నిర్ణయించారు. ఇంతలా భారీ రేట్లు చూసిన ఆడియన్స్ టికెట్లు కొనేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.చెన్నైలో చాలా తక్కువ..ముంబయి, ఢిల్లీ నగరాలను మినహాయిస్తే బెంగళూరు, చెన్నైలో, కోల్కతా, హైదరాబాద్లో టికెట్ ధరలు కాస్తా తక్కువగానే ఉన్నాయి. బెంగళూరులోని మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ. 1,200 నుంచి రూ. 1,950 మధ్య ఉండగా.. కోల్కతాలో రూ.1,100 - 1,240 వరకు పెంచేశారు. చెన్నైలో మాత్రం ఐమాక్స్లో కూడా గరిష్టంగా రూ. రూ.508కే ది ఒడిస్సీ టికెట్లు లభిస్తున్నాయి. -
మాకు చెప్పడానికి మీరెవరు?.. స్పిరిట్ మేకర్స్పై రైతు కూలీ ఆగ్రహం
యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది.తాజాగా ఈ మూవీ టైటిల్పై వివాదం నెలకొంది. ఇప్పటికే ఈ పేరుతో ఓ మూవీని తెరకెక్కించారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పేరుతో ఓ రైతు కూలీ మూవీని నిర్మించారు. తాజాగా ఈ టైటిల్ పేరుతో హిందీ వర్షన్ రిలీజ్ చేయవద్దని నిర్మాతలకు టీ సిరీస్ నోటీసులు పంపించింది. హిందీ వెర్షన్ రిలీజ్ చేయడానికి లేదా హిందీ రైట్స్ అమ్ముకోవడానికి వీల్లేదని నోటీసుల్లో పేర్కొంది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే థియేటర్లలో, ఓటీటీ (OTT), యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటేనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటామని తెలిపింది.తాజాగా టి- సిరీస్ నోటీసులపై స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నరసమ్మ, శ్రీ వెంకటేశ్వర్లు స్పందించారు. టీ సిరీస్ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సినిమా ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. మా సినిమా ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసుకోవాలనేది మా వ్యక్తిగత విషయం.. మాపై నిబంధనలు పెట్టడానికి టీ సిరీస్కు ఎలాంటి హక్కు ఉందని నిర్మాతలు ప్రశ్నించారు. మా సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేసుకుంటాము.. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న స్పిరిట్ హిందీలో హ్యాపీగా రిలీజ్ చేసుకోండి.. దానికి మాకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సినిమా హక్కుల విషయంలో కార్పొరేట్ సంస్థల బెదిరింపులకు భయపడేది లేదని, ఈ ఏకపక్ష షరతులకు తాము అంగీకరించడం లేదని చిత్ర బృందం తెగేసి చెప్పింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. -
ఊహించని డైరెక్టర్తో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ పాన్-ఇండియన్ చిత్రం ఆగస్టు 26న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్పై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. మరి బోల్డ్గా ఉన్నాయంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ఈ సినిమా సంగతి పక్కన పెడితే యశ్ నెక్ట్స్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే యశ్ తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరన్న విషయంపై శాండల్వుడ్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సప్త సాగరదాచే ఎల్లో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు హేమంత్ ఎం రావుతో జతకట్టనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ విషయాన్ని ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ తన పేజీలో ప్రస్తావించింది. దీంతో ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఈ మూవీని ఓ ఆర్మీ జవాన్.. పోలీసుగా మారిన కథాంశంగా తెరకెక్కించనున్నారని ఐఎండీబీ తన పేజీలో పేర్కొంది. ఈ సినిమాకు హేమంత్ ఎం రావుతో పాటు యశ్ రచయితగా ఉండడం మరో విశేషం. ఈ మూవీని కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతాల నిర్మించనున్నారు. అయితే ఈ విషయంపై యశ్ కానీ, హేమంత్ ఎం రావు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హేమంత్ ఎం రావు ప్రస్తుతం '666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో బిజీగా ఉన్నారు. -
కన్నీళ్లు కనిపించలేదని ట్రోలింగ్.. ఎస్.జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్
గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్కు దిగారు. జానకి భౌతికకాయం వద్ద అప్సర ఏడవలేదంటూ కొందరు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోలింగ్కు అప్సర సోషల్ మీడియా వేదికగా అత్యంత హుందాగా, ఎమోషనల్గా సమాధానమిచ్చారు.కంటికి కనిపించని కన్నీళ్లతో మా బాధను కొలవొద్దు‘మనకు ఇష్టమైన మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కేవలం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి, మనసును మెలిపెడుతూనే ఉంటుంది. దయచేసి కంటికి కనిపించని కన్నీళ్లతో మా గుండెల్లోని బాధను ముడిపెట్టొద్దు’ అంటూ అప్సర ఆవేదన వ్యక్తం చేశారు.ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోలేదుఈ ప్రపంచంలో మా నానమ్మ(జానకి)కు మా అక్క వర్ష అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికల దగ్గర నుంచి మాట్లాడడం వరకూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నిజానికి నానమ్మ అంతక్రియలు మా అక్క వర్ష నిర్వహించాలి. కానీ, ఆమె 2023లోనే కన్నుమూసింది. ఆ దుఃఖం నుంచి మేం ఇప్పటికీ కోలుకోలేదు. వర్ష చేయాల్సిన బాధ్యతలు నేను ఎంత బాధతో నిర్వహించానో నా మనసుకు తెలుసు. మాకెంతో ఇష్టమైన అక్క, నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్లారనే బాధ కంటే.. వారిద్దరూ స్వర్గంలో ఒకరినొకరు కలుసుకుని ఉంటారనే ఆలోచనే నాకు ఇప్పుడు పెద్ద ఓదార్పునిస్తోంది’ అని అప్సర తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం అప్సర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుఃఖాన్ని ప్రదర్శించే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని, కష్ట సమయంలో ఉన్న ఒక కుటుంబంపై ఇలాంటి ట్రోలింగ్ చేయడం సరికాదంటూ నెటిజన్లు అప్సరకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Apsara Vydyula (@apsaravydyula) -
నాని ది ప్యారడైజ్.. ముచ్చటగా మూడో 'సారీ'..!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ అండర్వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టుకి వాయిదా పడింది.తాజాగా ఈ మూవీ మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 21న ది ప్యారడైజ్ రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24కు పోస్ట్పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేశారని సమాచారం. అంతేకాకుండా ప్రమోషన్స్కు తగినంత సమయం కావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా ఈ మూవీలో మోహన్బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'మా ముందే దుస్తులు వేసుకోవచ్చుగా?'.. హీరోయిన్కు చేదు అనుభవం
సల్మాన్ ఖాన్ 'వీర్' (2010) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హౌజ్ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది. ఇక తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించింది.ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో పెద్దగా చేయకపోయినా జరీన్ ఖాన్.. తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్లో మెరిసింది. ఓ క్లాత్ స్టోర్ ఓపెనింగ్కు ఆమె హాజరైంది. ఈ సందర్భంగా డ్రెస్సులు చూస్తున్న జరీన్ ఖాన్ను ఓ ఫొటోగ్రాఫర్ అసభ్యకర ప్రశ్న వేశారు. ఈ డ్రెస్ మీరు ట్రయల్ వేయొచ్చుగా అని అడగాడు. దీంతో ఆమె వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి.. మీ ముందేనా? ఇలాంటి ఫాల్తూ మాటలు నా ముందు మాట్లాడొద్దు.. మీ హద్దులు దాటొద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #ZareenKhan slammed the paparazzi after one of them allegedly asked her to "try the dress" in front of everyone at a Mumbai event.She immediately shut it down, saying, "Hadd mein rehna," and made it clear she won't tolerate such comments.Being a celebrity doesn't mean someone… pic.twitter.com/GsiIhprgnB— Anjali (@Vada_paaww) July 14, 2026 -
అసభ్యకరంగా హీరోయిన్ మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు
సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న సైబర్ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ మలయాళ హీరోయిన్ అన్నా రేష్మా రాజన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా, తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసిన ఓ వ్యక్తిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులు, సైబర్ సెల్కు ఆమె ఫిర్యాదు చేశారు.‘ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ను సృష్టించేవారైనా, దాన్ని ఇతరులతో పంచుకునే వారైనా సరే చట్టానికి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను, చట్టపరంగా ముందడుగు వేస్తాను’ అని ఆమె తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది.అన్నా రాజన్కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివిధ వేదికలపై ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. పలు సందర్భాల్లో ఆమె బాడీ షేమింగ్కు, అసభ్యకర వ్యాఖ్యలకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడి వాటన్నింటినీ ఆమె తిప్పికొట్టారు.అన్నా రాజన్ సినీ కెరీర్ విషయాలకొస్తే.. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా 'అంగమాలి డైరీస్' ద్వారా అన్నా రాజన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన 'లిచ్చి' పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో, ఆమెను అంతా 'లిచ్చి' అని పిలవడం ప్రారంభించారు. 'వెలిపడింతే పుస్తకం', 'మధుర రాజా', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' వంటి చిత్రాలకు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'జైలర్ 2' లో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) -
పెద్ది తర్వాత ప్రాజెక్ట్లో చిరంజీవి హీరోయిన్.!
పెద్ది తర్వాత రామ్ చరణ్ మూవీపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కించారు. జూన్ 4న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది.ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్తో చేయనున్నారు. వీరిద్ది కాంబోలో వస్తోన్న ఆర్సీ17 చిత్రంపై తాజాగా ఓ న్యూస్ వైరల్గా మారింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఆమె హీరోయిన్గా కాకుండా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నయనతార ఎంట్రీ ఇస్తే RC17పై అంచనాలు మరింత పెరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. -
జానీ మాస్టర్ అసిస్టెంట్స్ కొట్టడానికే వచ్చారు: శ్రష్టి వర్మ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్లో వివాదంపై శ్రష్టి వర్మ స్పందించారు. గతంలో జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తాజాగా నెలకొన్న వివాదంపై మాట్లాడారు. జానీ మాస్టర్ అనుచరులు రెచ్చిపోయారని అన్నారు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్లతో కలిసి కొట్టించడానికి వచ్చారని శ్రష్టి ఆరోపించారు.నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని శ్రష్టి వర్మ ఆరోపించింది. నా వాయిస్ నొక్కేయాలని చూస్తే ఊరుకోనని ఆమె స్పష్టం చేసింది. జానీ మాస్టర్ వివాదంపై చిరంజీవి, రామ్ చరణ్ కూడా స్పందించాలని శ్రష్టి వర్మ విజ్ఞప్తి చేసింది.శ్రష్టి వర్మ మాట్లాడుతూ..'అసోసియేషన్లో రూల్స్ అందరికీ ఓకేలా ఉండాలి. ఇక్కడ ఏకపక్షంగా చేయడం కరెక్ట్ కాదు. మేము డ్యాన్సర్లం.. మీ బానిసలం కాదు. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఫెడరేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరారు. ఇప్పటికీ మా అందరికీ ఫెడరేషన్ కావాలి. మిస్టర్ షేక్ జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్స్ కేవలం ఇక్కడికి కొట్టడానికే వచ్చారు. అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు' అని తెలిపింది. -
సంక్రాంతికి జాతర.. 2026లో వచ్చే సినిమాలు ఇవే
-
15 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల ముసలి అని ట్రోల్ చేశారు : నటి
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ తన రూపం, వయస్సుపై నెట్టింట వస్తున్న ట్రోల్స్పై తీవ్రంగా మండిపడ్డారు. 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సిరీస్లో కేవలం 11 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం గ్లోబల్ నటిగా, బిజినెస్ ఉమెన్గా రాణిస్తున్న ఆమె.. ఇటీవల జే షెట్టి 'ఆన్ పర్పస్' పాడ్కాస్ట్లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పాడ్కాస్ట్లో మిల్లీ బాబీ బ్రౌన్ మాట్లాడుతూ, పరిశ్రమలో బాలనటిగా ఎదుగుతున్న క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు నా ఎదుగుదలకి ఎంతమాత్రం సహాయపడలేదు. నేను ఎలా కనిపిస్తున్నానో అనే దానిపై జనాలు ఎప్పుడూ నెగెటివ్గా మాట్లాడటం వింటూనే పెరిగాను. నేను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. 60 ఏళ్ల మహిళలా కనిపిస్తున్నానంటూ కొందరు దారుణంగా విమర్శించారు’అని బ్రౌన్ ఆవేదన వ్యక్తం చేశారు.స్టైలింగ్ విషయంలో నెటిజన్ల ద్వంద్వ ప్రమాణాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నేను హై హీల్స్ వేసుకుంటే ఒకలా విమర్శిస్తారు. అదే ఒక సూట్ వేసుకుంటే, నా వయస్సు కంటే పెద్దగా కనిపిస్తున్నానని అంటారు. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లకు సొంత అభిప్రాయమంటూ ఏది ఉండదు. నా దృష్టిలో వాళ్లంతా రోబోలు’ అని బ్రౌన్ అన్నారు.చిన్న వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టడం వల్ల ఎదురైన అనుభవాలు తనకు జీవితపాఠాలు నేర్పాయని, బాలనటులను అన్ని విధాలుగా రక్షించడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నానని ఆమె స్పష్టం చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే యూనిసెఫ్ అత్యంత పిన్న వయస్కురాలైన గుడ్విల్ అంబాసిడర్గా నియమితులైన బ్రౌన్, పిల్లల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.ప్రస్తుతం 'ఎనోలా హోమ్స్ 3' చిత్రంలో నటిస్తున్న బ్రౌన్, తన కెరీర్లో కొత్త మలుపులు చవిచూస్తున్నారు. తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటూనే, భవిష్యత్ తరాల బాలనటుల భద్రత కోసం గళమెత్తడం కొనసాగిస్తానని బ్రౌన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు -
అట్టర్ ఫ్లాప్గా నిలిచిన ‘దురంధర్’.. 900 మంది కూడా చూడలేదు!
ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ని షేక్ చేసిన రన్వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' జపాన్ మార్కెట్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు భాగాలు కలిపి ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీకి, జపాన్ ప్రేక్షకులు ఊహించని షాక్ ఇచ్చారు. భారీ రిలీజ్, పబ్లిసిటీ చేసినప్పటికీ.. మొదటి రోజు థియేటర్లకు కనీసం వెయ్యి మంది కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.తొలి రోజు కేవలం 900 మంది లోపే..!స్థానిక పంపిణీ సంస్థ ‘ట్విన్’ (Twin) ద్వారా జపాన్ వ్యాప్తంగా దాదాపు 80 స్క్రీన్లలో జూలై 10న ‘ఆపరేషన్ ధురంధర్’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. అయితే జపనీస్ బాక్సాఫీస్ ట్రాకర్ ‘మిమోరిన్’ గణాంకాల ప్రకారం విడుదలైన రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 57 ప్రదేశాలలో కలిపి కేవలం 449 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సాయంత్రానికి థియేటర్ల సంఖ్య 80కి పెరిగినప్పటికీ ఆదరణలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రోజు మొత్తం మీద 900 మంది ప్రేక్షకులు మాత్రమే సినిమాను వీక్షించారు.భారీ ప్రచారం చేసినా ఫలితం శూన్యంరిలీజ్కు ముందు జపనీస్ ఆడియన్స్ను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. రన్వీర్ సింగ్ స్వయంగా ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ‘ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం’ అంటూ ప్రమోట్ చేశారు. అయితే ఈ సినిమాను కేవలం జపనీస్ సబ్టైటిల్స్తోనే రిలీజ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్ లేకపోవడం వల్లే జపాన్ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పెద్దగా మొగ్గు చూపలేదని సోషల్ మీడియా టాక్.కాగా, జపాన్లో మొదటి రోజు అత్యధిక అడ్మిషన్లు సాధించిన భారతీయ చిత్రంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేసిన ‘RRR’ (8,230 అడ్మిషన్లతో) ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. -
నాగబంధం.. నభా నట విశ్వరూపం!
సినిమాల్లో హీరోయిన్లను ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నటిగా తన ప్రతిభను చాటుకుంది నభా నటేష్. ఆమె హీరోయిన్గా, విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాగబంధం. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా..సినిమా చూసిన ప్రతి ఒక్కరు నభా నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో పార్వతి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ నభా నటేష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఒకే పాత్రలో అనేక వైవిధ్యమైన భావోద్వేగాలను పలికించడం ద్వారా నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది నభా. దయ, పట్టుదల, దిక్కారం, బలహీనత, భక్తి..ఇలా అనేక ఎమోషన్స్ ను తన నటనలో పలికించింది అందరి ప్రశంసలు అందుకుంటోందీ నాయిక.తారలకు ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఆ అవకాశాన్ని తన టాలెంట్, డెడికేషన్ తో సద్వినియోగం చేసుకుంది నభా. నాలుగు భిన్నమైన కోణాల్లో ఒకే పాత్రను పోషించి సర్ ప్రైజ్ చేసింది నభా నటేష్. అందమే కాదు ప్రతి ఎక్స్ ప్రెషన్ లో స్టోరీని ఆవిష్కరించింది నభా. నటిగా తనకున్న నిబద్దతను ప్రూవ్ చేసుకుంటూ...ప్రేక్షకుల్ని మైమరపించే నటనను కనబర్చింది.ఈ సినిమా నభా నటేష్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా మిగిలిపోనుంది. -
జానీ,శేఖర్ మాస్టర్ మధ్య మెగా కాంప్రమైజ్
-
రామ్ చరణ్ 40 లక్షలు ఇస్తే రూల్స్ చేంజ్ చేస్తారా..?
-
నా సినిమాలో మీరే హీరోయిన్.. ముందు శరీరమంతా చూపించండి..!
చెన్నైలోని సాలిగ్రామంలో నివసించే 31 ఏళ్ల యువతి, బుల్లితెర, సినిమాల్లో సహాయ నటిగా నటిస్తోంది. ఈమెని పెరుంగుడి ప్రాంతానికి చెందిన నంది రామనాథన్ (65) సంప్రదించి, ‘నేను సినిమా నిర్మాతను. నేను నిర్మిస్తున్న కొత్త సినిమాలో మీరు హీరోయిన్ గా నటించాలి‘ అని చెప్పారు. అదే ప్రాంతంలోని కావేరి వీధిలో ఉన్న ఒక హాస్టల్లో జరుగుతున్న ’ఫోటో షూట్’కు హాజరవ్వమని ఆహ్వానించారు. ఆ తర్వాత ఆ నటి స్వయంగా హోటల్కు వెళ్లారు. ఆ సమయంలో, డైరెక్టర్ నంది రామనాథన్తో పాటు చెన్నై, తరామణి, విరుదునగర్లకు చెందిన ఇద్దరు యువతులు, ఏడేళ్ల బాలిక సహా నలుగురు అదే గదిలో ఉన్నారు. ఆకర్షణీయంగా ఉన్న ఆ నటి ఫోటోలను దుస్తులు ధరించిన మహిళ తన సెల్ ఫోన్తో వివిధ కోణాల్లో తీసింది. ఈ క్రమంలో శరీరం మీద ఒక్క మచ్చ కూడా తెలియకుడదు.. కాబట్టి ముఖం దాచి నగ్నంగా ఫొటో తీయాలని అతను చెప్పా డు. ఈ విషయం విని దిగ్భ్రాంతి చెందిన ఆ నటి, వారితో వాగ్వాదానికి దిగి, తర్వాత తన సెల్ఫోన్ ద్వారా ఈ ఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్కు తెలియజేసింది. దీని తరువాత, సింగప్పెన్ స్పెషల్ పోలీస్ సబ్–ఇన్స్పెక్టర్ జానకి నేతత్వంలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిర్మాత నంది రామనాథన్ను, అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను అరె స్టు చేశారు. వారితో ఉన్న బాలికను కూడా పోలీసులు రక్షించి, అడయార్లోని బాలల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
కావేరి నదిలో జానకి అస్థికల నిమజ్జనం
బెంగళూరు: ప్రముఖ గాయని ఎస్.జానకి అస్థికలను సోమవారం కర్ణాటక శ్రీరంగపట్నంలోని కావేరి నదిలో నిమజ్జనం చేశారు. జానకి శనివారం మైసూరులో మరణించగా, ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించారు. మనవరాలు అప్సర, బంధువులు వేద గురువు రమేష్ శర్మ ఆధ్వర్యంలో తెలుగు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అస్థికలకు నది ఒడ్డున పూజలు నిర్వహించి నదిలో నిమజ్జనం చేశారు.జానకి సంరక్షకుడు నవీన్ మాట్లాడుతూ, జానకి కోరిక మేరకు ఆమె అస్థికలను కావేరీ నదిలో కలిపామని చెప్పారు. ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేశారు. తాము జానకిని గృహ నిర్బంధంలో ఉంచలేదని, ఆమె ఆస్తి తమకు పంపిణీ చేయబడిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జానకి జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని తెలిపారు. -
ఆకట్టుకుంటున్న రొమాంటికి సాంగ్ ‘మనసా మనసా’
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా ఫేమ్ తన్వీ నేగి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. కనిష్క సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘మనసా మనసా...’ అంటూ సాగే పాటని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘మనసా మనసా...’ సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా, జావెద్ అలీ పాడగా, వేద కొరియోగ్రఫీ అందించారు. -
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్: కె. నిహారిక దాసరి
‘‘రాజా ది రాజా’ మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్గుడ్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది.. ఫైనల్ ఔట్పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. మా మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని నిర్మాత కె. నిహారిక దాసరి పేర్కొన్నారు. రుత్విక్, విశాఖ ధీమాన్ జోడీగా అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజా ది రాజా’. కె. శ్రీలతా రెడ్డి సమర్పణలో బృందావన్ క్రియేషన్స్ పై కె.నిహారిక దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కె.నిహారిక దాసరి మాట్లాడుతూ–‘‘హీరో రుత్విక్ నా తమ్ముడు. సినిమాలంటే చాలా ప్యాషన్. తను చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో హీరోగా పరిచయం చేశాం. మా మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ‘మగధీర’ వంటి గొప్ప సినిమాతో పోల్చడం హ్యాపీగా అనిపించింది. అయితే రెండు కథలకు సంబంధం లేదు. దర్శకుడు అనిల్ చాలా క్రియేటివ్ పర్సన్. పర్ఫెక్ట్ ప్లానింగ్తో తెరకెక్కించారు. హీరోయిన్ విశాఖ ధిమాన్ నటన సహజంగా ఉంటుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మా మూవీ రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. రవిశంకర్, నవీన్గార్లకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’’ అని చెప్పారు. -
గ్రీన్ సిగ్నల్?
హీరో నాగార్జున కొత్త సినిమా కబురు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన వందో సినిమా ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణతో బిజీగా ఉన్నారు నాగార్జున. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్పై అప్డేట్ రానుంది. కాగా తన 101వ సినిమా కార్యాచరణను కూడా మొదలుపెట్టారట ఆయన. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ ఇటీవల నాగార్జునకు ఓ కథ వినిపించారట.స్టోరీలైన్ నచ్చడంతో సినిమా చేసేందుకు ప్రాథమిక అంగీకారం తెలిపారట నాగార్జున. దీంతో స్క్రిప్ట్కు మరింత మెరుగులుదిద్దే పనిలో పడ్డారట భాస్కర్. పూర్తి కథ సిద్ధమైన తర్వాత మరోసారి ఫైనల్ నరేషన్ అయ్యాక ఈ సినిమాపై నాగార్జున తుది నిర్ణయం తీసుకుంటారని ఫిల్మ్నగర్ టాక్. మరి.. వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? భాస్కర్కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
మా అమ్మ భావోద్వేగానికి గురయ్యారు: భాగ్యశ్రీ బోర్సే
‘‘లెనిన్’ సినిమా విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను చేసిన భారతి పాత్ర పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ జీవితాంతం మర్చిపోలేను. ‘లెనిన్’లో నా నటన పట్ల మా అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. మా అమ్మగారు నాకు ఫోన్ చేసి, ‘సినిమా చాలా బాగుంది.. నీ నటన కూడా ఎంతో బాగా అనిపించింది’ అన్నారు.అయితే భారతి పాత్ర ముగింపు చూసి ఒక తల్లిగా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే అలాంటి ముగింపును ఏ తల్లి కూడా కోరుకోదు కదా?’’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో భారతి పాత్ర పోషించిన భాగ్యశ్రీ బోర్సే చెప్పిన విశేషాలు... ⇒ ‘‘లెనిన్’ కథని మురళీ కిషోర్గారు చెప్పినప్పుడే నా మనసుకు హత్తుకుంది. భారతి పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఆ పాత్రను ఇంతగా అభిమానించడం చాలా సంతోషంగా ఉంది. భారతి పాత్ర గురించి అందరూ ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. నాగార్జునగారు నా నటన గురించి మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్రశంసలు నాకు సంతోషంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయి. ⇒ ఋలెనిన్–భారతిల ప్రేమకథే ‘లెనిన్’. అఖిల్, నా పాత్రలు తెరపై చాలా సహజంగా కనిపించేలా ప్రతి సన్నివేశంపై ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేశాం. భవిష్యత్తులో మహారాణి, యువరాణి వంటి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి చిత్రాల విషయంలో రాజమౌళిగారు మాస్టర్. ఏదో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంతగారు అద్భుతంగా నటించారు. మాలాంటి కొత్త నటీమణులకు ఆమె ఒక దారి చూపించారు. అవకాశం వస్తే అలాంటి మహిళా ప్రధాన పాత్రలు కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో తమిళంలో ‘సీయోన్’ సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని కథలు వింటున్నాను. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను. -
సమంత తన డెలివరీ కోసం మరో దేశం వెళ్తారా..?
త్వరలోనే అమ్మకానున్న సమంత డెలివరీపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ గ్యాప్లోనే మాతృత్వ దశలోకి అడుగుపెట్టింది సమంత. ఈ ఏడాది డిసెంబర్లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత పూర్తిగా తన నివాసానికే పరిమితమైంది. కాగా తన డెలివరీ కోసం ఎక్కడికి వెళ్తుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సంపన్నులు, సెలబ్రిటీలు తరచుగా అనుసరించే ‘బర్త్ టూరిజం’పై కూడా చర్చ జరుగుతోంది. అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించే అవకాశం ఉండటంతో చాలామంది ఆ దిశగా వెళ్తారు. అయితే అమెరికాలో బర్త్ టూరిజంపై ఇటీవల గందరగోళం నెలకొనింది. వీసా సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత అమెరికా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. కెనడా కూడా పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చే నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే ఆలోచన కూడా సమంతకు లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సమంత టీమ్కు చెందిన క్లోజ్ సర్కిల్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తోంది. ఆమె ఇండియాలోనే తన బిడ్డకు జన్మనిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. అయితే హైదరాబాద్లో కాకుండా, ముంబయిలో డెలివరీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. దీంతో సమంత డెలివరీ ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. -
ప్రియుడితో పెదకాపు హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
తమిళ టీవీ సీరియల్ 'ఆహా కల్యాణం'లో పవి టీచర్గా తెగ వైరలైన బ్రిగిడా సాగా.. ఇటీవలే తన ప్రేమ సంగతి బయటపెట్టింది. నటుడు ఆనంద్ రామ్తో రిలేషన్లో ఉన్న సంగతి సోషల్ మీడియాలో పంచుకుంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.2019లో తమిళం వచ్చిన 'అయోగ్య'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మాస్టర్, ఇళవిన్ నిళల్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్స్పాట్ టూ మచ్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ సింధూరం, పెదకాపు మూవీస్ చేసింది. ఇకపోతే ఈమె తెలుగు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో డేటింగ్ చేస్తుందనే రూమర్స్ కొన్నాళ్ల క్రితం వచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా.. ఆనంద్ రామ్.. హిప్ హాప్ ఆది హీరోగా చేసిన 'మీసయ్య మురుక్క' మూవీలో నటించాడు. మరో తమిళ చిత్రంలో హీరోగానూ చేశాడు. View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే?
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలీజైన 23 రోజుల్లోనే వంద కోట్ల మార్క్ దాటేసింది. దీంతో టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీగా ఘనత సాధించింది. ఈ రికార్డ్తో సామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే సౌత్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల గురించి చర్చ మొదలైంది. దక్షిణాది పరంగా చూస్తే సమంత మూవీ ఏ స్థానం దక్కించుకుందన్న చర్చ నడుస్తోంది. సౌత్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ జాబితాలో మొదటి స్థానంలో కొత్త లోకా చాప్టర్-1 నిలిచింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన ఫీట్ సాధించింది. ఈ సూపర్హీరో చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై ఏకంగా రూ.304 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్ట్ సృష్టించింది. దీంతో మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆ తర్వాత రెండో స్థానంలో సమంత మూవీ మా ఇంటి బంగారం నిలిచింది. వందకోట్లకు పైగా వసూళ్లతో దక్షిణాదిలో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అనుష్క రుద్రమదేవి, కీర్తి సురేశ్ మహానటి, అరుంధతి, భాగమతి, సూక్ష్మదర్శిని చిత్రాలు నిలిచాయి. వీటిలో ఎక్కువగా స్వీటీ అనుష్క మూవీస్ ఉండడం మరో విశేషం. ఏదేమైనా సౌతిండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫీమేల్ లీడ్ చిత్రాల జాబితాలో సామ్ మూవీ రెండోస్థానాన్ని దక్కించుకుంది. -
పుష్ప-2 రికార్డ్ బ్రేక్.. బాక్సాఫీస్ వద్ద దురంధర్ చెత్త రికార్డ్..!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ దురంధర్. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు కలిపి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఏకంగా రూ.3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ స్పై మూవీస్కు ఆడయన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే జపాన్లో ఇండియన్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి మార్కెట్లో గతంలో రిలీజైన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి అభిమానుల ఆదరణ దక్కించుకున్నాయి. జపాన్లో ఇండియన్ చిత్రాల క్రేజ్ దృష్ట్యా తాజాగా దురంధర్ మూవీని సైతం అక్కడ రిలీజ్ చేశారు. దాదాపు 80 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. కానీ తొలి రోజే దురంధర్ మేకర్స్కు నిరాశ ఎదురైంది. ఈ స్పై చిత్రాన్ని తొలి రోజు కేవలం 900 మంది మాత్రమే వీక్షించారు.ఈ చిత్రం జూలై 10న జపాన్ థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో ఆ దేశంలోని టాప్ 25 చిత్రాలలో స్థానం సంపాదించలేకపోయిందని స్థానిక ట్రేడ్ నివేదికల్లో వెల్లడైంది. తొలిరోజు కేవలం 900 టిక్కెట్లు మాత్రమే అమ్ముడవడంతో టాప్-10 ఇండియన్ సినిమాల జాబితాలో దురంధర్కు చోటు దక్కలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' 1300 టికెట్స్తో చివరి స్థానంలో ఉండగా.. 'పుష్ప 2' గతంలో ఇదే మైలురాయిని చేరుకోలేకపోయింది. జపాన్లో రిలీజైన పుష్ప-2 మూవీకి కేవలం 886 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. తాజాగా దురంధర్కు 900 టికెట్స్ మాత్రమే బుకింగ్స్ లభించాయి. గతంలో జపాన్లో విడుదలైన మొదటి రోజే 8230 టికెట్లతో 'ఆర్ఆర్ఆర్' అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా 'సాహో', 'కల్కి 2898 ఏడీ', 'పఠాన్', 'సలార్', 'జవాన్', 'రంగస్థలం', 'దేవర', 'బాహుబలి 2' 'టైగర్ 3' సినిమాలు ఉన్నాయి.మరోవైపు ధురందర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,813 కోట్లు వసూలు చేసి.. 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2025లో థియేటర్లలోకి వచ్చిన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ చిత్రాలను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్ కీలక పాత్రల్లో నటించారు. -
లెనిన్తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..!
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన అఖిల్ సక్సెస్ కొట్టేశాడు.లెనిన్పై కాపీ ట్రోల్స్..లెనిన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మేకర్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. లెనిన్ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కాపీ చేశారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. లెనిన్లో హైలెట్గా నిలిచిన క్లైమాక్స్ సీన్ను మక్కీకి మక్కీ దించేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది. 1999లో బాలయ్య నటించిన క్రిష్ణబాబు మూవీలోని సీన్ను తలపిస్తోందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సేమ్ టూ సేమ్.. 1999లో వచ్చిన క్రిష్ణబాబు మూవీలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి.. ఆమె అరవకుండా చేసి.. హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి హీరోయిన్ను చంపేలా చేస్తాడు. అచ్చం అలానే ఈ చిత్రంలో విలన్ హీరో కళ్లల్లో కెమికల్ కొట్టడం.. హీరోయిన్ నోట్లో గుడ్డలు కుక్కడం.. చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్ను దించేశారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో ఈ తరం ప్రేక్షకులకు తగినట్లుగా సీన్ రీ క్రియేట్ చేశారని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై లెనిన్ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి నటించిన చిత్రం క్రిష్ణబాబు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజై ఓ మాదిరి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సీన్నే.. లెనిన్ టీమ్ కాపీ చేశారని అంటున్నారు. -
శివరాజ్ కుమార్ కొత్త సినిమా.. ఆసక్తిగా పోస్టర్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా వస్తోన్న సినిమా 'వెల్కమ్ టూ వైల్డ్ లైఫ్'. ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆయన గతంలో 'నిను వీడని నీడను నేనే', 'సింగిల్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వైల్డ్ లైఫ్ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఇవాళ శివరాజ్ కుమార్ బర్త్ డే కావడంతో పోస్టర్ను రిలీజ్ చేశారు. చేతిలో సింహం పిల్లని పట్టుకుని శివరాజ్కుమార్ కనిపించారు. మరోవైపు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీని కేవీకే ప్రొడక్షన్స్ బ్యానర్పై కుడిపూడి విజయ్ కుమార్ నిర్మాస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ రియాక్షన్
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం జానీ మాస్టర్ స్పందించారు. శేఖర్ మాస్టర్తో తనకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాలు అని వస్తోన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆదివారం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. శేఖర్ మాస్టర్ ఆగ్రహంతో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోవైరలయ్యాయి. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపులు ఘర్షణకు దిగారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. మా యూనియన్లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. నేను, శేఖర్ మాస్టర్ ఈ రోజు మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశామని వెల్లడించారు. మాకు చిరంజీవి ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య మాత్రమేనని తెలిపారు. అంతే కానీ మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు మాత్రమే వచ్చాయని క్లారిటీ ఇచ్చారు. -
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మా ఊరు పెనుకొండ అంటూ వరుణ్ తేజ్ డైలాగ్స్తో టీజర్ ప్రారంభమైంది. కొరియన్ దెయ్యం కాన్సెప్ట్తో ఈ మూవీ రానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కమెడియన్ సత్యతో కామెడీ సీన్స్ ఆకట్టకుంటున్నాయి. ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. -
విజయ్ జన నాయగన్.. రిలీజ్కు ముందే రికార్డ్స్..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ జన నాయగన్. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదు. తాజాగా ఇటీవల సెన్సార్ బోర్డ్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 24న జన నాయగన్ విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇటీవల ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అప్పుడే రికార్డ్స్ సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో యూకేలో అప్పుడే రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఏషియన్ బాక్స్ ఆఫీస్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా యూకేలో జన నాయగన్ అన్కట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. మరి కొన్ని దేశాల్లోనూ అన్కట్ వెర్షన్ను ప్రదర్శించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. -
లెనిన్ సక్సెస్.. అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు
అక్కినేని అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.స్పందించిన అఖిల్...మెగాస్టార్ ట్వీట్కు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.Congratulations to my dear friend @iamnagarjuna, the entire…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026 -
నీకెంత.. నాకెంత
నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్ జంటగా నటించిన సినిమా ‘ఎమ్ఆర్పీ’. ‘నీకెంత నాకెంత’ అనేది క్యాప్షన్ . శ్రవణ్ జేష్ఠ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నరేష్ అగస్త్య మాట్లాడుతూ–‘‘ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశాం. మా చిత్రాన్ని చూసి, మా కష్టాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.‘‘మా కష్టానికి ప్రేక్షకులు ప్రతిఫలం అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రవణ్ జేష్ఠ. ‘‘నా తొలి తెలుగు సినిమా ‘ఎమ్ఆర్పీ’ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు డోనల్ బిష్ట్. ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్, కశిరెడ్డి రాజ్కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజయ్ అరసాడ స్వరకర్త. -
సరికొత్త కథతో ఓరి నాయనో
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వీరాంజనేయ ప్రొడక్షన్స్ అనే మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం అయింది. గొండి మణితేజ దర్శకత్వంలో సాయి అభిషేక్ నిర్మాణంలో రూపొందనున్న చిత్రం ‘ఓరి నాయనో’. ఈ మూవీ టైటిల్, సినిమా కార్యాలయాన్ని హీరో నవీన్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా గొండి మణితేజ మాట్లాడుతూ–‘‘నా హృదయానికి దగ్గరైన ఒక కథను ‘ఓరి నాయనో’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాను. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది’’ అని తెలిపారు. ‘‘ఓరి నాయనో’ చిత్రం వినోదం, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని సమ్మిళితం చేసిన కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. విభిన్నమైన కథలను ప్రోత్సహించడం, ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ సినిమాలను అందించడం వీరాంజనేయ ప్రొడక్షన్స్ లక్ష్యం’’ అన్నారు సాయి అభిషేక్. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవీంద్ర, కెమెరామెన్ వెట్రి పళనిస్వామి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రోహిత్ కంభంపాటి– డా. ప్రవీణ్ రెడ్డి. -
మలేషియాలో ఓం
ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓం చాప్టర్ 1– ఉదిరమ్: ది బ్లడ్ ఉడ్’. ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి, నసీరుద్దీన్ షా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ మలేషియాలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ధనుష్తో పాటు ప్రధాన తారాగణమంతా మలేషియాకు చేరుకున్నారని కోలీవుడ్ సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేసేందుకు ప్లాన్ చేశారట రాజ్కుమార్. ఈ షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వుండర్బార్ ఫిల్మ్స్పై నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 16న రిలీజ్ కానుంది. -
జైలర్ ఇంట్లో హృతిక్
రజనీకాంత్, హృతిక్రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జైలర్ 2’. రమ్యకృష్ణ, ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ చేశారు. రజనీకాంత్–హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలను జూన్ నెల చివర్లో చెన్నైలో చిత్రీకరించారు.ఆ సమయంలో రజనీకాంత్ ఇంటికి మర్యాద పూర్వకంగా వెళ్లారు హృతిక్ రోషన్ . ఈ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘జైలర్ 2’లో జైలర్ ముత్తువేల్ పాండియన్ గా నటించారు రజనీకాంత్. కథ రీత్యా హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారని తెలిసింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ అక్టోబరు 15న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. 1986లో రిలీజైన హిందీ చిత్రం ‘భగవాన్ దాదా’లో రజనీకాంత్ –హృతిక్ రోషన్ కలిసి నటించారు. ఆ సమయంలో హృతిక్ రోషన్ బాలనటుడు. హృతిక్ రోషన్ తండ్రి, దర్శక–నిర్మాత రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. -
నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. ‘లెనిన్’పై ఆర్జీవీ రివ్యూ
అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’ తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. “వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు” అంటూ ప్రమోషన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. వసూళ్ల వివరాలు పక్కన పెడితే.. అఖిల్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంతో ఆయన తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియాలో అఖిల్ను అభినందించారు. హే అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో బ్లాక్బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్.. ప్లీజ్ సినిమా చూడండి అని రిప్లై ఇచ్చారు. Hey @AkhilAkkineni8 Just saw #Lenin , and apart from the FILM being GREAT , I realised that you are the BEST ACTOR in the #Akkineni family and I swear this on @iamnagarjuna 🔥🔥 Your ease is remarkable even when there’s no emotion in the scenes and in the emotional scenes you… https://t.co/az4x6dFsTL— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2026తాజాగా సినిమా చూసిన ఆర్జీవీ, ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. ఆయన అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అని ఆర్జీవీ పేర్కొన్నారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించే ఈజ్ అద్భుతం, భావోద్వేగ సన్నివేశాల్లో అయితే అదరగొట్టేశాడని వర్మ అభిప్రాయపడ్డారు. అఖిల్కు ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
క్రైమ్ కామెడీగా చోర శికామణులు.. గ్రాండ్గా ప్రారంభం
రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘చోర శికామణులు’. ఈ సినిమాకు ఆనంద్ కుర్మా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి దర్శకడు నక్కిన త్రినాథరావు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్లో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఆనంద్ కుర్మా వెల్లడించారు. జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ చిత్రంలో నరేశ్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీతం అందిస్తున్నారు. ఓ మంచి సాంగ్తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని.. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో మీ ముందుకు వస్తామని మేకర్స్ పేర్కొన్నారు. -
ముంబయి వీధుల్లో హాలీవుడ్ స్టార్స్ సందడి.. వీడియో వైరల్
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ది ఓడిస్సీ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ది ఒడిస్సీ ప్రీమియర్ షో కోసం ముంబయికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ముంబయిలోని ఒలింపియా కాఫీ హౌస్లో సందడి చేశారు.ముంబయి నగరంలోని స్థానిక కొలాబాలో ఉన్న 108 ఏళ్ల పురాతనమైన ప్రసిద్ధ ఒలింపియా కాఫీ హౌస్కు విచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ టీమ్.. అదే కాఫీ హౌస్లో టీ తాగి, బన్ మస్కాను రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్లను కాఫీ హౌస్లో చూడగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అందరూ వెంటనే తమ ఫోన్లు తీసి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. ఈ హాలీవుడ్ అగ్రతారలు ముంబయిలో బన్ మస్కా ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా కనిపించారు. View this post on Instagram A post shared by Universal Pictures India (@universalpicturesindia) -
'బళ్లారి ఎప్పటికీ వెంకటప్పయ్య నాయుడిదే'.. ఆసక్తిగా ట్రైలర్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులోని యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్కు కూడా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో మోహన్ బాబు యాక్షన్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకథతో పాటు మాస్ యాక్షన్ ఉన్న ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ చిత్రంలో నరేశ్, బ్రహ్మజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. -
మా ఇంటి బంగారం వచ్చేస్తోంది.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కేవలం మౌత్ టాక్తో మూడు వారంలోనూ వసూళ్లపరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేశారు. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని జియో హాట్స్టార్ ప్రకటించింది. థియేటర్లలో వందకోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం ఓటీటీలోనూ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. July 17th Okokkodni kodathamu chudu... Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026 -
లెజెండరీ సింగర్ జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
గాన కోకిల ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరు సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని ముగిసింది. బ్రాహ్మణ సంప్రదాయంలో జానకమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. జానకి అంత్యక్రియల్లో పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు పాల్గొన్నారు. అంతకుముందు లెజెండరీ సింగర్ చివరి చూపు కోసం అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూర్లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్లో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్కి పార్థీవదేహాన్ని తరలించారు.ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. సినీ ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత. లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్ జానకి. -
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ..!
టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య వివాదం మొదలైంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అసోషియేషన్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జానీ మాస్టర్ భార్యపై విమర్శలు??తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్లో వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతపై కొందరు డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమలత తీరు నచ్చక అసోసియేషన్కు చెందిన 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్కు సుమలత సిద్ధం కావడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సెంచరీ కొట్టిన సమంత.. స్పెషల్ వీడియో వైరల్
సమంత బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఆమె లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సెంచరీ మార్క్ దాటేసింది. కేవలం రిలీజైన 23 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు రాబట్టిన తొలి ఫీమేల్ లీడ్ చిత్రంగా మా ఇంటి బంగారం నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి మహిళా తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించిందని పోస్ట్ చేశారు. దీంతో సామ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.కాగా.. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్ ట్రలాలా పిక్చర్స్పై నిర్మించింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 19న థియేటర్లలో విడుదలైన మా ఇంటి బంగారం మౌత్ టాక్తో కాసుల వర్షం కురిపించింది GOLDEN CENTURY FOR #MaaIntiBangaaram 💥#MiB creates HISTORY by becoming THE FIRST EVER FEMALE LED TELUGU FILM to gross 100 CRORES Worldwide. @TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads @VasanthMaringa1… pic.twitter.com/MsnP7N60o8— Tralala Moving Pictures (@TralalaPictures) July 12, 2026 Official : #MaaIntiBangaaram crosses 100 CRORES GROSS WORLDWIDE ! Her Happiness 😊 pic.twitter.com/Vs9Sls0S9M— Rajesh Manne (@rajeshmanne1) July 12, 2026 -
'అది మీ పిరికితనమే'.. రాధిక శరత్కుమార్ ఆగ్రహం
టాలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీల పిల్లలను ఎగతాళి చేయడం వాక్ స్వాతంత్ర్యం కాదని మండిపడింది . ప్రముఖుల కుమార్తెలను ఎగతాళి చేయడం హాస్యం కాదని తెలిపింది. ఇది కేవలం మీ పిరికితనమేనని ఎద్దేవా చేసింది. మనకు అవతలి వాళ్ల రూపం కంటే.. వ్యక్తిత్వమే చాలా ముఖ్యమని ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా..గతంలో చాలాసార్లు ఖుష్బు కూతుర్లను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి తనదైన శైలిలో కౌంటరిచ్చింది. దీంతో నటి ఖుష్బు కుమార్తెలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై రాధిక శరత్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడింది. సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య గట్టిగానే కౌంటరిచ్చింది. వాక్ స్వాతంత్ర్యం అంటే బెదిరించే స్వేచ్ఛ కాదని తెలిపింది. విమర్శించడం అనేది క్రూరత్వం కాదు.. హాస్యం అవమానించడం కాదని హితవు పలికింది. నేను ఖుష్బూ, ఆమె కుమార్తెలకు అండగా నిలుస్తానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి ప్రవర్తన ఎక్కడ జరిగినా సరే తాను ఖండిస్తానని రాధిక శరత్కుమార్ స్పష్టం చేసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Freedom of speech is not freedom to bully. Criticism is not cruelty. Humour is not humiliation.Mocking a public figure's daughters is not comedy — it is cowardice. Looks are not an achievement or a failure. Character is.I stand with Khushbu and her daughters. I condemn this… pic.twitter.com/Dn7WjXRYUU— Radikaa Sarathkumar (@realradikaa) July 11, 2026 -
అఖిల్ లెనిన్ కలెక్షన్స్.. మొదటి రోజు కంటే ఎక్కువే
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.ఈ మూవీకి తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డేనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లెనిన్కు పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దీంతో రెండో రోజు ఆడియన్స్లో అదే జోరు కనిపించింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు కంటే రెండో రోజే వసూళ్లలో పెరుగుదల కనిపించింది. వీకెండ్ కావడంతో మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. The word of mouth is doing wonders ❤️The audience is doing the rest 💪🏼37.2 CR+ Worldwide Gross in just 2 days 💥💥#LENIN is marching from strength to strength 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman… pic.twitter.com/SQbib4c1mt— Sithara Entertainments (@SitharaEnts) July 12, 2026 -
జానకమ్మ పాడిన 48 వేల పాటల్లో అత్యంత కష్టమైన సాంగ్ ఇదే!
తన గాత్రంలో కోట్లాది మంది శ్రోతలను ఓలలాడించిన దిగ్గజ గాయని, 'దక్షిణ భారత నైటింగేల్' ఎస్. జానకి (88) ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు ఆమె.లాలిపాటలు, జానపదాలు, క్లాసికల్, మెలోడీలు.. ఇలా ఆమె పాడని పాట లేదు, పలకని భావం లేదు. అయితే, ఇన్ని వేల పాటలు పాడిన జానకమ్మకు తన కెరీర్లో అత్యంత సవాలుగా నిలిచిన ఒక పాట ఉందన్న విషయం మీకు తెలుసా?గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జానకి గారు స్వయంగా తనకు అత్యంత కష్టమైన పాట గురించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 1977లో విడుదలైన కన్నడ చిత్రం 'హేమవతి'లోని 'శివ శివ ఎన్నడ నలికే ఏకే' అనే పాట తాను పాడిన అన్ని పాటలలోకెల్లా అత్యంత కష్టమైనదని ఆమె పేర్కొన్నారు. ఈ పాటను అంత క్లిష్టంగా మార్చింది ఆ పాట యొక్క స్వరకల్పనే. సంగీత దర్శకుడు ఈ పాటలోని ప్రతి రెండో చరణంలో 'తోడి', 'అపోకి' అనే రెండు వేర్వేరు రాగాలను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా అద్భుతంగా, అంతే క్లిష్టంగా స్వరపరిచారు.పాడేటప్పుడు రాగాలలో వచ్చే ఈ అత్యంత సూక్ష్మమైన మార్పులను పట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఏ మాత్రం శృతి తప్పినా పాట గాడి తప్పుతుంది. అందుకే, క్లాసికల్ సంగీతంలో ఎంతో పట్టున్న ఎస్. జానకి సైతం, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఈ పాటను అత్యంత సవాలుతో కూడుకున్న పాటగా అభివర్ణించారు. ఆమె భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆమె పాడిన ఇలాంటి అపురూపమైన పాటలు సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. -
చాలా మిస్ అవుతున్నాను.. త్రిష ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) మరణంతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల నలుమూలల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్న తరుణంలో, ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సందేశం అభిమానులను ఎంతగానో కదిలిస్తోంది. తన బ్లాక్బస్టర్ చిత్రం '96' షూటింగ్ సమయంలో ఎస్. జానకితో కలిసి దిగిన అరుదైన ఫోటోని త్రిష ఈ సందర్భంగా పంచుకున్నారు.జానకమ్మను స్మరిస్తూ ఎమోషనల్ పోస్ట్సోషల్ మీడియా వేదికగా జనకమ్మకు నివాళులులర్పించారు త్రిష. ‘నా కెరీర్లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకదానికి మీ పేరు (జాను) పెట్టడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. మీతో వ్యక్తిగత పరిచయం ఏర్పడటం, మీ అమూల్యమైన ప్రేమను పొందడం నా జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. మీ ఆప్యాయత, దయ, మరువలేని చిరునవ్వుకు ధన్యవాదాలు. ఎంతటి గొప్ప కళాకారులైనా ఎంత వినయంగా ఉండాలో మీరే నిరూపించారు. మీ గాత్రం అమరమైనది, అది ఎప్పటికీ మన మధ్యే ఉంటుంది. జానకి అమ్మా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’ అని ఇన్స్టాలో రాసుకొస్తూ..ఆమెతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసింది.'96' సినిమాలో జానకమ్మచాలా మంది అభిమానులకు తెలియని విషయం ఏమిటంటే, విజయ్ సేతుపతి, త్రిష నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ '96' చిత్రంలో ఎస్. జానకి ఒక ప్రత్యేకమైన సీన్లో నటించారు. సినిమా షూటింగ్ సమయంలో ఆమెపై ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరించినప్పటికీ, చిత్ర నిడివి ఎక్కువైపోవడంతో ఆ సీన్ను ఎడిటింగ్లో తొలగించాల్సి వచ్చింది. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డిలీటెడ్ సీన్ ఇంటర్నెట్లో విడుదలై, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
లైవ్ కచేరీలో గుడ్ న్యూస్ చెప్పిన ‘ధురంధర్’ సింగర్
ప్రముఖ పంజాబీ గాయని, 'యార్ నా మిలే' ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన తన ' ది డ్రీమ్ గర్ల్ ఇండియా' లైవ్ కచేరీ స్టేజీపైనే ఆమె తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కాబోయే భర్త శేఖర్ చౌదరిని అభిమానులకు పరిచయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.స్టేజీపైనే నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచే జాస్మిన్, ఈ కచేరీలో మాత్రం ఎంతో ఉత్సాహంగా కనిపించారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఈవెంట్లో అభిమానుల కోలాహలం మధ్య ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించారు. అనంతరం శేఖర్ చౌదరిని స్టేజీపైకి ఆహ్వానిస్తూ..‘ఇతనే నా వ్యక్తి, నా వేలికి ఉంగరం తొడిగిన నా చౌదరి సాబ్’ అంటూ ఎంతో సంతోషంగా పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఈ జంట జాస్మిన్ పాడిన ప్రసిద్ధ పంజాబీ గీతం 'లావన్' బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా స్టేజీపై రొమాంటిక్గా నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు ఈ కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అలరించిన 'ది డ్రీమ్ గర్ల్ ఇండియా'పంజాబ్ సింగర్ జాస్మిన్ శాండ్లాస్ గాత్రానికి లక్షలాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పాటలకు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ‘ధురంధర్’ సినిమాలో ఆమె ఆలపించిన ‘తెను షరాత్సికా’ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో హచ్చల్ చేస్తోంది. ఈ పాటకు లక్షలాది మంది రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్లో మిలియన్కి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఢిల్లీలో 'ది డ్రీమ్ గర్ల్ ఇండియా' పేరుతో కచేరీ నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఆమె గోల్డెన్ లెహంగా ధరించి ఎంతో అందంగా మెరిశారు. తన కెరీర్ లోని సూపర్ హిట్ పాటలైన 'ధురంధర్', 'శరారత్', 'జాయే సజనా', 'యార్ నా మిలే', 'తరస', 'ఇలీగల్ వెపన్' వంటి పవర్ ఫుల్ పాటలతో స్టేజ్పై ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఢిల్లీ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఢిల్లీ తర్వాత ఈ టూర్ ముంబై, బెంగళూరు, చండీగఢ్లలో కూడా కొనసాగనుంది. -
తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్లో చీటింగ్ కేసు
ప్రముఖ సినీ నటుడు శంషాద్ సీ(ఆర్య)తో పాటు మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థలపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. సదరు సంస్థలు హీరో ఆర్యతో అనంతన్కాడు అనే సినిమా తీసేందుకుగాను రూ. 2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్ పరికరాలను తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ వద్ద తీసుకున్నాయి. రూ. 42లక్షలు మాత్రమే చెల్లించి, రూ.1.80 కోట్ల బాకీ సొమ్ము, జీఎస్టీ బకాయిలను క్లియర్ చేయకుండా మోసగించారని తాహెర్ సినీ టెక్నిక్ అకౌంట్స్ హెడ్ సయ్యద్ జావీద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగినందుకు తన మేజేజర్ను బెదిరించారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
డబ్బు కోసం ముద్దు సీన్లలో నటించలేను : సాయి పల్లవి
సినీ కథానాయకల్లో ఒక్కొక్కరికీ ఒక్కో బాణి ఉంటుంది. కొందరు అందచందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొందరు తమ నటనా ప్రతిభనే నమ్ముకుంటారు. ఇంకొకరు అన్ని రకాల పాత్రలను పోషించాలని కోరుకుంటారు. వీటిలో రెండవ కేటగిరీకి చెందిన నటి సాయి పల్లవి. వైద్య వృత్తి చదివినా నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించిన సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నారు. తర్వా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తూ స్టార్ అంతస్తుకు చేరుకున్నారు.ఈమధ్య ఈమె శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ముఖ్యంగా సాయి పల్లవి నటన సర్వత్ర ప్రశంసలు అందుకుంది. కాగా ఇటీవల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ అమీర్ ఖాన్ వారసుడు జునైత్ ఖాన్గా ఏక్ దిన్ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం భారతీయ ఇతిహాసం అయినా రామాయణం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ అని పాన్ ఇండియా చిత్రంలో సీతగా నటిస్తున్నారు.అదేవిధంగా తమిళంలో ధనుష్ కు జంటగా ఓమ్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరో నాయిక శ్రీలీల నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సాయి పల్లవి నటిగా ఆది నుంచి ఒక ప్రిన్సిపల్స్ పాటిస్తూ వస్తున్నారు. మేకప్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నటనలో సహజత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వడం, గ్లామర్ కు దూరంగా ఉండటం, కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి సమ్మతించడం వంటివి ఈమె కచ్చితంగా పాటిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవి ఇటీవల ఒక భేటిలో పేర్కొంటూ ..‘నా కెరీర్ ప్రారంభం నుంచే నేను చిత్రాల్లో ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకిని. అలాంటి సన్నివేశాలు నటించడానికి నా మనసు అంగీకరించదు. ఈ ప్రపంచంలో ప్రతి యువతి యువకుడు సంతోషంగా జీవించడానికి ఓ ఇల్లు, మంచి కారు ఉండాలని కోరుకుంటారు. దేవుని దయవల్ల నాకు అలాంటి ఆడంబర జీవితం, సంతోషం లభించాయి. అదేవిధంగా ఆడంబరాల కోసం మాత్రమే నేను ఎప్పుడూ సినిమాల్లో నటించలేదు. మరో కొత్త కారు కొనుక్కోవడానికో, డబ్బు కోసం నటులతో ముద్దు సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. అదే విధంగా హద్దులు మీరిన ప్రేమ సన్నివేశాల్లో నటించాలంటే వేరెవరినైనా వెతుక్కోండి.. నా వద్దకు రాకండి. మంచి నటన కోసం మాత్రమే నా వద్దకు రండి’ అని నటి సాయి పల్లవి పేర్కొన్నారు. -
కారం దోసెలు ఫుల్లుగా లాగించాను: రాషా తడానీ
‘తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘బాహుబలి’ నాకు నచ్చిన చిత్రం. తెలుగు సినిమా చాలా అడ్వాన్డ్స్గా ఉంది. అందుకే తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఆ చాన్స్ ‘శ్రీనివాస మంగాపురం’తో లభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే నా తొలి తెలుగు సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రీకరణ తిరుపతిలో జరగడం నా అదృష్టం. దేవుడు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాషా తడానీ. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీదత్ సమర్పణలో అజయ్ భూపతి దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. శనివారం విలేకరుల సమావేశంలో రాషా తడానీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ, మంగ పాత్రలో నేను నటించాం. మంగ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అజయ్ భూపతిగారు ప్రతి డైలాగ్, అందులోని ఎమోషన్ను దగ్గరుండి నేర్పించారు. అశ్వినీదత్గారు నన్ను మనవరాలిలా చూసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఒక విహార యాత్రలా గడిచింది. నేనైతే కారం దోసెలు ఫుల్లుగా లాగించాను. అలాగే సీరియస్గా వర్క్ చేయాలన్నప్పుడు సీరియస్గానే చేశాం. మా అమ్మానాన్నలకు కూడా తెలుగు సినిమా అంటే అభిమానమే. మా నాన్నగారు (డిస్ట్రిబ్యూటర్–నిర్మాత అనిల్ తడానీ) ఓ సందర్భంలో ముంబై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం తెలుగు భాష అర్థం అవుతోంది. పూర్తిగా నేర్చుకోమని మా అమ్మ సలహా ఇచ్చారు. నేనూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. నా తొలి హిందీ చిత్రం ‘ఆజాద్’ పీరియాడికల్ మూవీ. ఆ తర్వాత చేసిన ‘లైకీ లైకా’ డిఫరెంట్ లవ్ ఫిల్మ్. ‘శ్రీనివాస మంగాపురం’ విలేజ్ లవ్స్టోరీ. హిందీలో కామెడీ సినిమా చేస్తున్నాను. ఇలా విభిన్న జానర్స్లో సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
పవర్ఫుల్ ప్రణతి
వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్ని స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో దర్శకుడు రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్’. 2006–2010 మధ్య కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని వన్ సర్కిల్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ యామినీ ఈఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ తండ్రిగా సాయికుమార్, విలన్స్గా కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ నటిస్తున్నారు.ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు యూనిట్ శనివారం ప్రకటించింది. ‘‘ఒక పవర్ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్లో రమ్యకృష్ణగారు కనిపిస్తారు. ప్రజెంట్ సొసైటీతో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్స్టోరీని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. తనికెళ్ల భరణి, నవీన్ బేతిగంటి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భరత్ .ఎం. -
జోరుగా హుషారుగా...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో.. ప్రత్యేకించి హైదరాబాద్లో తెలుగు చిత్రాల మూవీస్ షూటింగ్స్ సందడి జోరుగా హుషారుగా ఉంది. ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని చిత్రాల షూటింగ్స్ జరుగుతున్నాయి. వెంకటేశ్, ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, కల్యాణ్ రామ్, శ్రీ విష్ణు వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో జోరుగా హుషారుగా పాల్గొంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఓ లుక్కేద్దాం...శంషాబాద్లో... ‘గుంటూరు కారం’ (2024) వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్బాబు రాముడిగా, రుద్రగా కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియాంకా చోప్రా మందాకినిగా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ ట్రావెల్ టైమ్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇందులోని రామాయణం ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా సెట్ వేయించారు. ఈ షెడ్యూల్లో మహేశ్బాబు లేకున్నప్పటికీ కీలక తారాగణంపై ఈ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రాజమౌళి.ఈ సినిమా చిత్రీకరణకు కాస్త బ్రేక్ రావడంతో కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లిన మహేశ్బాబు తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ నెల 16 నుంచి ఆయన ‘వారణాసి’ షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు మోకిలా... ఇటు శంకర్పల్లి హీరో వెంకటేష్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా, అటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ మూవీ... ఇలా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారాయన. వెంకటేష్–కల్యాణ్ రామ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఐదో సినిమాగా, కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబోలో రెండో సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘వెంకీఅనిల్5, ఎన్కేఆర్ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన భారీ సెట్లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ రావిపూడి శైలిలో వినోదాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. ‘‘వెంకటేష్–కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ అనుబంధం ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తుంది.ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ పుట్టినరోజు (జూలై 5న) సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. క్రేజీ మల్టీస్టారర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ⇒ వెంకటేష్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్, ‘హిట్ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 2న విడుదల కానుంది.అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో గోపీచంద్ కూడా స్పీడ్ పెంచారు. ఓ వైపు ‘సింగ’, మరోవైపు ‘భరతవర్ష’ మూవీస్తో బిజీగా ఉన్నారాయన. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘సింగ’ ఒకటి. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సింగ’ టైటిల్తో పాటు ఆయన లుక్ను యూనిట్ రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్గా సక్సెస్ అందుకున్న వెంకట్.. గోపీచంద్ని ఎంత పవర్ఫుల్ మాస్ లుక్లో చూపించనున్నారో గ్లింప్స్తోనే చూపించాం.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ను కొత్త కోణంలో చూపించనున్నారాయన. యాక్షన్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా వెంకట్ చేస్తున్న ఈ ప్రయాణంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... గోపీచంద్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అజీజ్ నగర్లో... హీరో ప్రభాస్ యమా జోరు మీద ఉన్నారు. వరుస పాన్ ఇండియన్ మూవీస్తో దూసుకెళుతున్నారాయన. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్, ఫౌజీ, కల్కి 2’ వంటి సినిమాలు చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్, టి. సిరీస్ బ్యానర్స్పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు కీలక తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట సందీప్ రెడ్డి. ‘‘భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్తో రూపొందుతోన్న ‘స్పిరిట్’ చిత్రం ప్రేక్షకులకు ఓ ఇంటెన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకుట్టుకునేలా ఈ మూవీని రూపొందిస్తున్నాం. 2027 మార్చి 5న 8 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ⇒ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా అక్టోబరులో ‘ఫౌజీ’ సినిమా విడుదల కానుంది. ఆర్ఎఫ్సీలో... ‘దేవర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిల్ కపూర్, బిజూ మీనన్ , ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్, సిద్ధాంత్ గు΄్తా, ప్రభాస్ శ్రీను, శత్రు, శివ, భీమల్ జీత్ ఒబెరాయ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఎన్టీఆర్తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్లో ఎన్టీఆర్ని చూపించనున్నారట దర్శకుడు.ఈ మూవీలో ఓ లుక్లో సన్నగా కనిపించే ఆయన మరో లుక్లో కొంచెం బొద్దుగా కనిపిస్తారని తెలిసింది. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘డ్రాగన్’ మూవీపై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ బజ్ నెలకొంది. ‘‘డ్రాగన్’ కథ గోల్డెన్ ట్రైయాంగిల్ ప్రాంతంలోని అంతర్జాతీయ అక్రమ వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అస్సాసిన్–ఇన్–చీఫ్ అనే పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2027 జూన్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా ‘రణబాలి, రౌడీ జనార్థన’ వంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. ‘రణబాలి’ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది.విజయ్ దేవరకొండతో పాటు ఈ మూవీలోని ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట రాహుల్. ‘‘19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది. విజయ్ దేవరకొండ బర్త్ డే (మే 9) సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్లోని యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్ను బాగా ఆకట్టుకున్నాయి.భారీ అంచనాలున్న మా సినిమాని సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘రౌడీ జనార్థన’. రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబరులో ‘రౌడీ జనార్థన’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్పల్లిలో... శ్రీ విష్ణు హీరోగా రెండు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కామ్రేడ్ కళ్యాణ్’ కాగా మరో చిత్రానికి డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజులది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘సామజవరగమన’ (2023) ఘన విజయం సాధించింది. ఆ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది.మై త్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. ఈ సినిమాకు ‘ఫ్యామిలీప్యాక్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.టైటిల్కు తగ్గట్టే ఈ మూవీలో కంప్లీట్ కామెడీతో పాటు ఎమోషన్స్ ఉంటాయని, కుటుంబ సభ్యులందరూ చూసేలా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే... శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్. కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
డిసెంబర్లో ‘ఇడుపు కాయితం’!
తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ, ప్రియదర్శి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీవాసు, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.‘ఇడుపు కాయితం’సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. "ఇడుపు కాయితం" త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు. -
‘లెనిన్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..?
చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని ఖాతాలో హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జులై 10న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించండంతో, తమ హీరోకి హిట్ పడిదంటూ అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ ఊరమాస్ లుక్లో కనిపించాడు. చిత్తూరు యాసతో ఆయన చెప్పిన డైలాగులు..ప్రేక్షకులను ఈళలు వేయిస్తున్నాయి. అఖిల్కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. లెనిన్ కథేంటంటే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.AKHIL 2.0 is here... and the box office has heard it loud and clear 🔥🔥🔥A phenomenal 16.7 CR+ Worldwide Gross on Day 1 for #LENIN 💥💥💥The Telugu audience has once again celebrated good cinema in the grandest way possible 🫶🏻🫶🏻#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8… pic.twitter.com/UOKexRK2CA— Annapurna Studios (@AnnapurnaStdios) July 11, 2026 -
చివరి సినిమా కూడా ఇక్కడే.. కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ
‘లెనిన్’తో సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె భారతి అనే పాత్రను పోషించింది. జులై 10న ఈ చిత్రం విడుదల కాగా.. తొలి రోజు హిట్ టాక్ వచ్చింది. అఖిల్తో పాటు భాగ్యశ్రీ నటనపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధించిందన్నారు భాగ్యశ్రీ. తాజాగా ఈ సినిమా టీమ్ సక్సెస్లో మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. ‘లెనిన్’టీమ్తో ఏడాదిన్నర పాటు జర్నీ చేశాను. ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. మీ(ఫ్యాన్స్) వల్లే నేను ఇక్కడ ఉన్నాను’ అంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్ తన కర్మభూమి అని.. తన చివరి సినిమా కూడా తెలుగులోనే చేయాలాని కోరుకుంటున్నానని చెప్పింది. Bhagyashri ఎమోషనల్ అయిపోయింది.సోషల్ మీడియాలో చాలా Casual గా మాటలు అనేస్తారు But it will cause deep mental agony. Be considerate! #Lenin pic.twitter.com/lOHJFY38Ai— Journalist Nishant (@NishantOpinions) July 11, 2026 -
త్రివిక్రమ్ కొత్తగా ఇంకేం తీస్తాడబ్బా?
సినిమా ఒక కథ చెబుతుంది. కానీ కొన్ని సినిమాలు కథ కంటే ముందే చర్చను మొదలుపెడతాయి. ప్రస్తుతం తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో అదే జరుగుతోంది. దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్లో మురుగన్ నేపథ్యంతో సినిమా వస్తుందనే ప్రచారం ఒకవైపు.. మరోవైపు త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అదే దేవుడి మీద పురాణ నేపథ్యంతో భారీ చిత్రం తెరకెక్కుతోందనే వార్తలు మరోవైపు. ఈ రెండు సినిమాలపై అధికారిక కథ బయటకు రాకముందే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు, భావజాల వర్గాలు, రాజకీయ కార్యకర్తలు తమ తమ తీర్పులు చెప్పేస్తున్నారు.వెట్రిమారన్ ఏమి చెబుతాడు?వెట్రిమారన్ ఇప్పటివరకు తీసిన సినిమాలు చూస్తే.. ఆయనకు చరిత్ర, సామాజిక వాస్తవికత, అణగారిన వర్గాల కథలపై ప్రత్యేక ఆసక్తి ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మురుగన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం రావడంతో.. "దేవుడిగా కాదు.. చారిత్రక తమిళ నాయకుడిగా చూపిస్తారా?" అనే చర్చ మొదలైంది. ఈ వాదనకు కవి అరివుమతి రచించిన తమిళ మురుగన్ పుస్తకాన్ని కొందరు జోడిస్తున్నారు. అయితే ఇదే సినిమా కథ అని చిత్రబృందం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్నవి ఊహాగానాలు, సోషల్ మీడియా చర్చలుగానే చూడాలి.త్రివిక్రమ్ ఏమి చెబుతాడు?త్రివిక్రమ్ సినిమాల్లో పురాణాలు, ఉపనిషత్తులు, గీత, భారతీయ తాత్వికత తరచూ కనిపిస్తుంటాయి. అందుకే ఎన్టీఆర్తో ఆయన రూపొందిస్తున్న చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. "ఇది పూర్తిస్థాయి పౌరాణిక చిత్రమా? లేక పురాణ స్ఫూర్తితో సరికొత్త కథనా?" అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సినిమా విడుదల కాకముందే దానికి ఒక భావజాలాన్ని అంటగట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో సి(మి)నీ యుద్ధంఈ రెండు సినిమాల చుట్టూ జరుగుతున్న చర్చ క్రమంగా దర్శకుల నుంచి అభిమానుల మధ్య పోటీగా మారింది. "ధనుష్ గొప్ప నటుడు.. కానీ పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్కు సాటి లేడు" అంటూ తెలుగు అభిమానులు పోస్టులు పెడుతుంటే.. "వెట్రిమారన్ చరిత్రను కొత్తగా చెబుతాడు" అంటూ తమిళ అభిమానులు మద్దతు ఇస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్, ఎక్స్ పోస్టులు, యూట్యూబ్ డిబేట్లతో ఈ చర్చ మరింత వేడెక్కుతోంది. అయితే ఇందులో ఒక ఆసక్తికర అంశం ఉంది. సినిమా గురించి అధికారిక సమాచారం కంటే.. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలే చర్చను ముందుకు నడిపిస్తున్నాయి.దర్శకుల పోరా? భావజాలాల పోరా?ఈ వివాదాన్ని కేవలం రెండు సినిమాల మధ్య పోటీగా చూడలేం. దక్షిణ భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు దృక్పథాల ప్రతిబింబంగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు ద్రావిడ ఉద్యమ ప్రభావంతో పురాణాలను చారిత్రక, సామాజిక కోణంలో చదవాలనే వాదన ఉంది. మరోవైపు హిందూ సంప్రదాయాలు, పురాణాలు కోట్లాది మంది విశ్వాసాలకు ప్రతీకలని, వాటిని కొత్త వ్యాఖ్యానాల పేరుతో మార్చి చూపించడం సరికాదని మరో వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యమే ఇప్పుడు వెట్రిమారన్, త్రివిక్రమ్ సినిమాల చుట్టూ కూడా ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది.దర్శకులు వేరు.. సినిమా భాష వేరువెట్రిమారన్ కెమెరా సమాజాన్ని ప్రశ్నిస్తుంది. ఆయన పాత్రలు వ్యవస్థను ఢీకొంటాయి. చరిత్రలో దాచిన కోణాలను వెలికితీయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. త్రివిక్రమ్ కథల్లో మాత్రం పురాణ ప్రతీకలు, తాత్విక సంభాషణలు, కుటుంబ విలువలు, ధర్మం-అధర్మం మధ్య సంఘర్షణ ఎక్కువగా కనిపిస్తాయి. ఇద్దరూ గొప్ప కథకులే. కానీ వారి కథనం, దృష్టికోణం పూర్తిగా భిన్నం.తొందరపాటు సరైందేనా?భారతీయ సినిమా చరిత్రలో ఇది కొత్త కాదు. పద్మావత్, ఆదిపురుష్, పీకే, ఓ మై గాడ్, ది కేరళ స్టోరీ వంటి అనేక చిత్రాలు విడుదలకు ముందే పెద్ద వివాదాలకు కేంద్రంగా నిలిచాయి. కొన్ని సినిమాలు విడుదల తర్వాత విమర్శలను ఎదుర్కొన్నాయి. మరికొన్ని ప్రారంభ ప్రచారానికి భిన్నంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందుకే ఇంకా కథ బయటకు రాకముందే వెట్రిమారన్ సినిమాపైనా, త్రివిక్రమ్ సినిమాపైనా తుది తీర్పు ఇవ్వడం తొందరపాటు అవుతుంది. -
కారులో వెంబడించాడు.. అలాంటి సైకోని చూడలేదు : హీరోయిన్
సినిమా తారలంటే అందరికీ క్రేజ్. అభిమాన హీరో, హీరోయిన్లను ఒక్కసారి దగ్గరగా చూడాలని, షేక్హ్యాండ్ ఇవ్వాలని, ఫోటో దిగాలని అభిమానులు ఉత్సాహం చూపించడం సహజమే. కానీ ఓ అభిమాని మాత్రం ఫోన్ నెంబర్ ఇవ్వమంటూ మలయాళ నటి అవంతిక మోహన్ని కారులో వెంబడించాడు. ‘మీరంటే ఇష్టం..ఇన్స్టాలో రిప్లై ఇవ్వండి’అంటూ ఆమెను ఇబ్బందికి గురిచేశాడు. అతను ఏం చేస్తాడోనన్న భయంతో నవ్వుతూ మాట్లాడుతూ.. ఇన్స్టాలో రిప్లై ఇస్తానని చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. వ్యక్తిగత పరిమితులను గౌరవించాలని కోరింది.‘ఇటీవల నాకు చాలా విచిత్రమైన అనుభవం ఎదురైంది. నేను బయట మాస్క్ ధరించి ఉన్నప్పుడు, ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ‘మీరు అవంతికనేనా?’ అని అడిగాడు. నేను కాదని చెప్పినా, నా ఫోన్ నెంబర్ కావాలని పట్టుబట్టాడు. నేను మర్యాదగా తిరస్కరించినా, అతను వెనక్కి తగ్గలేదు. నా స్నేహితురాలు అతనిని వెళ్ళమని కోరగా, అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, అతని కారు మమ్మల్ని వెంటాడుతుందని నేను గుర్తించాను. వెంటనే, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లి, తమను ఫాలో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. వెంటనే అతను ఏడవడం ప్రారంభించాడు, 'నాకు మీరంటే ఇష్టం, మేడం' అని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వండి అని కూడా అడిగాడు. ఆ సమయంలో నా భద్రత కోసం నేను అంగీకరించడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నా జీవితంలో చాలా మంది సైకోలను చూశాను, కానీ అతని ప్రవర్తన అంతుకు మించి ఉంది. దయచేసి ఒకరు వద్దంటే గౌరవించండి, పరిమితులను దాటి ప్రవర్తించొద్దు. అభిమాన నటీనటుల పట్ల మర్యాదగా ఉండండి. వారి వ్యక్తిగత జీవితాలను కూడా గౌరవించండి’ అని అనంతిక కోరింది. అవంతిక.. యక్షి- ఫేత్ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది.ఇంద్రజిత్ ప్రధాన పాత్రలో నటించిన 'ధీరం' సినిమాలో కూడా అవంతిక ముఖ్య పాత్ర పోషించారు. -
అందుకే సావిత్రమ్మకు ‘మహానటి’ అని బిరుదు ఇచ్చారు : జయప్రద
దివంగత మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లిష్ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటీనటులు జయప్రద, బ్రహ్మానందం, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, ఆమె భర్త గోవిందరావు, వర ప్రసాద్ రెడ్డి, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జయప్రద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ పుస్తకం రిలీజ్ చేయడం నా అదృష్టం. చాముండేశ్వరిగారిని చూస్తే నాకు సావిత్రమ్మగారే మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లాంటి వారికి ధీటుగా నటించినందుకే సావిత్రమ్మకు మహానటి బిరుదు ఇచ్చారు’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారు చిరస్మరణీయులు. అలాంటి వారికి మరణం ఉండదు’’ అని అన్నారు. విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ– ‘‘సావిత్రి క్లాసిక్స్’ తెలుగు బుక్కి మంచి స్పందన వచ్చింది. ఇంగ్లిష్లో అనువదిస్తే మరింత మందికి రీచ్ అవుతుందని రిలీజ్ చేశాం’’ అని పేర్కొన్నారు. ‘‘నా పట్టుదల, ప్యాషన్ చూసి సావిత్రిగారి అరుదైన ఫొటోలను చాముండేశ్వరిగారు ఇచ్చారు’’ అన్నారు పుస్తక రచయిత సంజయ్ కిషోర్. -
2016లోనే నయనతారతో కలిసి నటించా.. హీరోయిన్ ముఖ్యం కాదు: యోగిబాబు
నటుడు యోగి బాబు కథానాయకుడిగా నటించిన 300వ చిత్రం అర్జునన్ పేర్ పత్తు. ఇందులో నటి అనామిక మహీ నాయకిగా నటించింది. ఇందులో కాళీ వెంకట్, అరుళ్ దాస్, లెనిన్ భారతి, సుబ్రహ్మ ణ్యం శివ, మైనా నందిని, మదన్ దక్షిణామూర్తి, సెండ్రాయన్, హలో కందస్వామి, ఎం.సౌందర్య శరవణన్, రంజన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆర్.రాజ్ మోహన్ కథ, కథనం బాధ్యతలను చేపట్టారు. ఈ చిత్రాన్ని దేవ్ సినిమాస్ పతాకంపై కతిక తంగపాండి ఎస్.తంగపాండి డీ నిర్మించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం చేప ట్టారు. ఇందులో పాల్గొన్న నటుడు యోగి బాబు మాట్లా డు తూ ఇది తాను నటించిన 300వ చిత్రం అని దర్శక నిర్మాతలు ఎలా కనుగొన్నారో తెలియదన్నారు. తనకు సంఖ్య ముఖ్యం కాదని, నటిస్తూనే ఉండాలని అన్నా రు. నాగే శ్, మనోరమ అమ్మ మాదిరి నటించారని తెలిపారు. అదే విధంగా తనను అందరూ కామెడీ నటుడు అంటున్నారని, అదే తనను కాపాడుతోందన్నారు. మరో విష యం ఏమి టంటే తాను 2016 లోనే నయనతారతో కలిసి నటించానని, ఇకపై ఎవరితో నటించలేదన్న చింత లేదన్నా రు. తనకు హీరోయిన్ ఎవరన్నది ముఖ్యం కాదని, కథే ముఖ్యమన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ మోహన్ గురించి చెబుతూ ఒకసారి తనని కలిసి కథ చెప్పారని, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని చెప్పారు. రెండేళ్ల క్రితం తానే ఆయనకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని అడిగానన్నారు. అందు కు ఆయన తాను చేస్తున్న పని గురించి చెప్ప గా, చెన్నైకి రండి చిత్రం చేద్దాం అని పిలిచానన్నా రు. అలా ఈ చిత్రం ప్రారంభమైనట్లు చెప్పారు. చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందించారు. -
శ్రీలీల ఇన్స్ట్రాగామ్ ఆదాయం ఎంతో తెలుసా?
తమిళంలో ఒక సామెత ఉంది ప్రభుత్వం ఉద్యోగులకు సంబళం కంటే గింబళం ఎక్కువ అని. అంటే జీతం కంటే పైన వచ్చే ఆదాయమే అధికం అని అర్ధం. అలా ఇప్పుడు మనం హీరోయిన్ల పారితోషికంతో పాటు ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చేతి నిండా సంపాదిస్తున్నారు. అందుకు చిన్న ఉదాహరణ నటి శ్రీలీల. కన్నడ సినీ రంగం నుంచి నటిగా కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అలా తొలి చిత్రంతోనే తన చలాకి నటన, రంజింపజేసే డ్యాన్స్తో కుర్రకారును ఆకట్టుకున్నారు. అలా అక్కడ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న ఈ భామ పరాశక్తి చిత్రంతో కోలీవుడ్కు పరిచయమయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా క్రేజీ ఆఫర్లను అందుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా కథానాయకిగా ఎదిగారు. దీంతో కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. యూత్ ఫుల్ క్రేజ్ హీరోయిన్లకు ఇన్స్ట్రాగామ్ ఫాలోవర్స్ మామూలుగా ఉండరు. అలా శ్రీలీలకు 17 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దానికి ప్రతిఫలాన్ని శ్రీలీల అధికంగానే పొందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ప్రకటనలను శ్రీలీల ఇన్స్ట్రాగామ్లో ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకు రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అలా ఈ అమ్మడు నెలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది: రామ్గోపాల్ వర్మ
‘‘స్టార్ ముఖం చూసి ప్రేక్షకులు టిక్కెట్లు కొంటున్నారు. కోట్లాది రూపాయల బిజినెస్ స్టార్ మూలంగా జరుగుతున్నప్పుడు సహజంగానే వారి డామినేషన్ ఉండటం తప్పు కాదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్టార్ను కన్విన్స్ చేసే సత్తా డైరెక్టర్కు ఉందా? లేదా అన్నదే ముఖ్యం’’ అని రామ్గోపాల్ వర్మ చెప్పారు. సూర్య, వివేక్ ఒబెరాయ్, ప్రియమణి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రక్త చరిత్ర’. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న ఈ చిత్రం రీ రిలీజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్మీట్లో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘రాయలసీమ ఫ్యాక్షనిజంలోని వాస్తవ ఘటనలను ఆధా రంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ తీశాను. నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది. శాంతికి, యుద్ధానికి మధ్య ఉన్న అంతరాన్ని చర్చిస్తూ, యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఇందులో చూపిం చాం. ‘రక్త చరిత్ర’ పార్ట్ 3 తీసే చాన్స్ లేదు. నా జీవితంలో ఫ్యామిలీ, సెంటిమెంట్ సినిమాలు ఎప్పటికీ తీయను. పౌరాణిక సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. రియలిస్టిక్ డ్రామాలు మాత్రమే తీస్తాను. ప్రస్తుతం హిందీలో పోలీస్ స్టోరీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
ప్రేమ కబుర్లు
ఇక్కడున్న ఫొటో చూస్తున్నారుగా...కాంపౌండ్ వాల్పై దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటున్నారో! ఈ ప్రేమ కబుర్లు విజువల్గా ‘శ్రీ శ్రీ’లో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘శ్రీ శ్రీ’ టైటిల్ ఖరారైంది. ‘లవ్ విల్ స్పార్క్ అగైన్’ అనేది క్యాప్షన్. ఈ సినిమాను రవి నెలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను చక్కగా మేళవించిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. స్క్రీన్పై హీరో–హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మళ్లీ షురూ
‘వారణాసి’ షూటింగ్ పనులు మళ్లీ ఉపందుకున్నాయి. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ప్రియాంకా చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్కు ఇటీవల చిన్న విరామం వచ్చింది. దీంతో కుటుంబంతో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు మహేశ్బాబు. మరోవైపు తన గత చిత్రాలు (ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ, మర్యాద రామన్న) పారిస్లో ప్రదర్శితమైన నేపథ్యంలో అక్కడికి వెళ్లారు రాజమౌళి. తాజాగా ఈ ఇద్దరూ హైదరాబాద్ చేరకున్నారని సమాచారం. దీంతో ‘వారణాసి’ షూటింగ్ మళ్లీ షురూ అయ్యిందని తెలిసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్లో మొదట మహేశ్బాబు పాల్గొనరని, ఈ నెల 16 తర్వాత పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ షూట్లో దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారని భోగట్టా. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. -
శవాన్ని కిడ్నాప్ చేయడమేంటిరా?.. ఫుల్ ఫన్నీగా ఎంఆర్పీ ట్రైలర్
నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నలుగురు స్నేహితులు కలిసి చేసే కామెడీ ఆడియన్స్ను అలరించేలా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాకు అజయ్ అరసాడ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
అర్జున్ దాస్ లేటేస్ట్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
అర్జున్ దాస్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ హీరో బాబు' (తమిళంలో ‘సూపర్ హీరో’). ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత కేఎస్ సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై సమర్పణలో 'రెడాక్టెడ్ స్టూడియోస్'కు చెందిన శంజన్ జి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ దాస్కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓజీ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి అర్జున్ దాస్ సూపర్ హీరో బాబు చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తేజు అశ్విని కనిపించనుంది. ఈ చిత్రంతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. Super Hero Babu.. Title & Poster 👌 @sinish_s presents #SUPERHERO BABUA commercial family entertainer.@iam_arjundas @iamSandy_Off #SuperHeroBabu pic.twitter.com/XPkx6Rp4kW— H A N U (@HanuNews) July 10, 2026 -
ఐశ్వర్య రాజేశ్ మాస్ యాక్షన్.. ఒకేసారి ఐదు భాషల్లో ట్రైలర్
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ.. సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగే మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాజేశ్ యాక్షన్ ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు. -
మూడేళ్ల తర్వాత హిట్.. అఖిల్ ఫుల్ ఎమోషనల్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రానికి హిట్ టాక్ రావడంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి నాగార్జునను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ కట్ చేస్తుండగా నాగార్జున కాళ్లకు నమస్కరించిన అఖిల్.. ఆయనతో గట్టిగా కౌగిలించుకుని ఎమోషనలయ్యారు. ఈ వీడియోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. A blockbuster on screen.A priceless moment off screen. ❤️A hug that spoke louder than words…#LENIN #BlockbusterLENINBook your tickets now 🎫 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla… pic.twitter.com/YHgBKwEmBI— Sithara Entertainments (@SitharaEnts) July 10, 2026 -
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. వచ్చేది ఎప్పుడంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూవీ క్రియేషన్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీని హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ... 😎💥Get ready for the wildest Indo-Korean horror comedy ride of the year with #KoreanKanakaraju 🐉😈#KOKA GRAND RELEASE WORLDWIDE IN CINEMAS ON AUGUST 7th, 2026 ❤️🔥@IamVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy… pic.twitter.com/BhgLFQN73g— UV Creations (@UV_Creations) July 10, 2026


