breaking news
Movie News
-
నవ్వులే నవ్వులు
తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా భరత్ దర్శన్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా ‘శివమ్ భజే’తో ప్రేక్షకులని అలరించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ఇది.‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు. -
చాన్నాళ్ల తర్వాత ఈ హీరోయిన్ల 'తెలుగు' సినిమాలు
ఎప్పటిక్పపుడు సినిమాలు చేస్తూ ఉంటేనే హీరోలకైనా హీరోయిన్లకైనా ఫేమ్ ఉంటుంది. అలానే హిట్ కూడా కొడుతూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశముంది. సరే ఇదంతా పక్కనబెడితే తెలుగులో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ఇద్దరు.. చాలా గ్యాప్ తర్వాత తమ కొత్త చిత్రాల్ని మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ 'నేను శైలజ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్.. తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాలు చేసింది. హిట్స్, ఫ్లాప్స్ అందుకుంది. అయితే 2023లో వచ్చిన 'భోళా శంకర్' తర్వాత మరో మూవీలో కనిపించలేదు. గతేడాది 'కల్కి'లో ఈమె ఉంది కానీ కారు పాత్రకు డబ్బింగ్ చెప్పిందంతే. ఎన్నాళ్లగానో సెట్స్పై ఉండిపోయిన 'రివాల్వర్ రీటా' మూవీ.. ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబరు 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని పోస్టర్ అయితే వదిలారు. గతంలో పలుమార్లు ఇలానే చెప్పారు గానీ వాయిదాపడింది. ఈసారైనా చెప్పిన టైంకి వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా అనేది చూడాలి?గతేడాది సంక్రాంతికి రిలీజైన 'నా సామి రంగ' చిత్రంతో ఆకట్టుకున్న ఆషికా రంగనాథ్.. తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లోనూ నటించింది. కానీ ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇంతలోనే 'గత వైభవం' అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. దుశ్యంత్, ఆషిక హీరోహీరోయిన్లు కాగా సునీ దర్శకుడు. ఫాంటసీ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి) -
స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి
తమిళ నిర్మాతలు ఎట్టకేలకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లపాటు సినిమాపై లాభమొచ్చినా నష్టమొచ్చినా దాన్ని నిర్మాత మాత్రమే భరించేవాడు. కానీ ఇకపై అలా కుదరదని, స్టార్ హీరోలందరూ పూర్తి రెమ్యునరేషన్ తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. బదులుగా నిర్మాతతో పాటు లాభనష్టాల్ని భరించాల్సి ఉంటుందని ఓ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో తమిళ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నారు.తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ రకంగా స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్, సూర్య లాంటి వాళ్లకు నిజంగానే షాకింగ్. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పూర్తి పారితోషికం తీసుకునేవారు. లాభాలు వస్తే నిర్మాత ఇష్టం కొద్దీ కారు లాంటి బహమతులు ఇచ్చేవారు. అదే నష్టమొస్తే మాత్రం హీరోలు, నిర్మాతల్ని అస్సలు పట్టించుకోని సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఓ రకంగా నిర్మాతలకు మంచిదే. కానీ హీరోలు దీనికి ఒప్పుకొంటారా అనేది చూడాలి. ఇలాంటిది తెలుగులో ఇండస్ట్రీలోనూ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్)ఇదే సమావేశంలో ఓటీటీ డీల్స్ గురించి నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. మిడ్ రేంజ్ హీరోలైతే 6 వారాలు, చిన్న బడ్జెట్ చిత్రాలతే 4 వారాల రూల్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది తమిళంలో రిలీజయ్యే 250 చిత్రాలకు థియేటర్ల కేటాయింపు కోసం ప్రత్యేక పద్ధతి తీసుకురానున్నట్లు తెలిపారు.తమిళ నటీనటులు అందరూ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ల కంటే థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా నిర్మాతల మండలి కోరింది. ఇండస్ట్రీ బాగు కోసమే ఇలా చేయాలని పేర్కొంది. అయితే నిర్మాతల మండలి తీసుకున్న ప్రపోజల్స్ బాగానే ఉన్నాయి గానీ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది చూడాలి? (ఇదీ చదవండి: Bigg Boss 9 : నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి) -
జాన్వీ 'చికిరి' వైబ్.. రకుల్ ప్రీత్ డిఫరెంట్ స్టైల్
చికిరి పాట వైబ్లోనే హాట్ బ్యూటీ జాన్వీ కపూర్డిఫరెంట్ హెయిర్ స్టైల్తో రకుల్ ప్రీత్ సింగ్పెళ్లయినా సరే అమలాపాల్ గ్లామర్ తగ్గేదే లేబేబీ బంప్తో సీరియల్ నటి చైత్రా రాయ్నెలల పిల్లాడితో ఆడుకుంటున్న ఈషా రెబ్బాగ్లామరస్ పోజులతో యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) -
నవ్వుల బంతి భోజనంలా ‘ప్రీ వెడ్డింగ్ షో’.. తిర్వీర్ ఆనందం
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ని సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి. బుకింగ్స్ పెరగడం పట్ల హీరో తీర్వీర్ ఆనందం వ్యక్తం చేశాడు‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. మా సినిమాపై ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ప్రోత్సహిస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు’’ అని తిరువీర్ చెప్పారు. -
ఓవైపు లగ్జరీ కార్ల వివాదం.. కొత్త కారు కొన్న దుల్కర్
సినిమా సెలబ్రిటీలకు కొన్ని విషయాల్లో విపరీతమైన ఇష్టముంటుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్కి ఇలానే లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ఎంతలా అంటే అన్ని బ్రాండ్స్ కార్స్ ఇప్పటికే ఇంట్లో చాలా ఉన్నాయి. అయినాసరే ఇప్పుడు మరో కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఓవైపు లగ్జరీ కార్ల కొనుగోలు విషయమై కస్టమ్స్ వివాదంలో కొన్నాళ్ల క్రితమే చిక్కుకున్నాడు. ఇలాంటి టైంలో దుల్కర్ కొత్త కారు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది.అక్రమంగా విదేశాల నుంచి వాహనాలని దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలతో కస్టమ్స్ అధికారులు.. కొన్నిరోజుల క్రితం కేరళలో సోదాలు చేపట్టారు. సినిమా హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరుల ఇళ్లలో రైడ్ చేసి 40కి పైగా కార్లని సీజ్ చేశారు. తన కార్లని కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై దుల్కర్.. కేరళ హైకోర్టుని ఆశ్రయించగా ఊరట దక్కింది. కొన్ని షరుతులు, కార్ల విలువలో 20 శాతాన్ని బ్యాంక్ గ్యారంటీగా ఇవ్వడంతో కార్లని తిరిగి దుల్కర్కి ఇచ్చేశారు.(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)సరే ఈ సంగతులన్నీ పక్కనబెడితే తాజాగా దుల్కర్ సల్మాన్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కంపెనీకి చెందిన 100 ఆక్టా ఎడిషన్ కారుని కొనుగోలు చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లగ్జరీ కారు ధర రూ.3 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. 4.4 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్ కలిగిన ఈ కారు.. నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఈ కారు కాకుండా దుల్కర్ దగ్గర మెర్సిడెస్ బెంజ్, పోర్షే, ఫెరారీ, వోల్వో లాంటి టాప్ క్లాస్ ఖరీదైన కార్లలోని మోడల్స్ అన్నీ ఉన్నాయి. 80,90లా వింటేజ్ కార్లని కూడా కొనుగోలు చేసి దుల్కర్.. తన కలెక్షన్లో పెట్టుకోవడం విశేషం. దుల్కర్ సినిమాల విషయానికొస్తే గతేడాది 'లక్కీ భాస్కర్'తో హిట్ కొట్టిన దుల్కర్.. ఈ మధ్యే నిర్మాతగా 'లోక' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇతడు హీరోగా నటించి నిర్మించిన 'కాంత'.. ఈ శుక్రవారం(నవంబరు 14) థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: 'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?) -
హైదరాబాద్లో సందడిగా రెహమాన్ కన్సర్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. హైదరాబాద్లో శనివారం రాత్రి కన్సర్ట్ నిర్వహించారు. తన లైవ్ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ అభిమానులు, సంగీత ప్రియులు వేలాది తరలివచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ కన్సర్ట్లో రెహమాన్.. తమిళ, హిందీ పాటలు ఆలపించారు. అలానే తెలుగులోని కొన్ని సాంగ్స్ కూడా పాడారు. 'పెద్ది' హీరోహీరోయిన్ల రామ్ చరణ్, జాన్వీ కపూర్తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సందడి చేశారు. ఇక స్క్రీన్ పై 'పెద్ది' నుంచి ఈ మధ్యే రిలీజైన 'చికిరి' పాటని ప్లే చేయడం విశేషం. -
అంతా ఓకేనా? అని 17 సార్లు అడిగాడు: నటి
కన్నడ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah).. హిందీలో సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లో స్థిరపడిపోయాడు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 21 ఏళ్ల తర్వాత తన మాతృభాషలో సినిమా చేసే ఛాన్స్ వరించింది. అదే కాంతార: చాప్టర్ 1 (Kantara: A Legend Chapter-1 Movie). ఈ మూవీలో విలన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న గుల్షన్ ప్రస్తుతం 'థెరపీ షెరపీ' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇందులో మరాఠి నటి గిరిజ ఓక్ నటిస్తోంది.ముందే చెప్తారుతాజాగా ఆమె సిరీస్ షూటింగ్లో ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. గిరిజ (Girija Oak Godbole) మాట్లాడుతూ.. సిరీస్ అయినా, సినిమా అయినా కొన్ని అభ్యంతరకర ససన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కొందరు సెట్లోనే ఉంటారు. నటీనటులు ఇబ్బందిపడకుండా వాళ్లు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సీన్ ఎలా ఉండబోతుంది? ఏం చేయాలి? అనేది వాళ్లు క్లియర్గా వివరిస్తారు.ఏ ఇబ్బందీ రానివ్వలేదుఅయినప్పటికీ కొన్నిసార్లు సడన్గా డైలమాలో పడుతుంటాం. అయితే కొందరు నటులతో పనిచేసినప్పుడు అసౌకర్యం అనేదే ఉండదు. అలాంటివారిలో గుల్షన్ ఒకరు. మేము దుస్తులు ధరించే ఉన్నాం, అక్కడ చెడుగా ఏమీ లేదు. అప్పటికీ అతడు మీకు ఓకే కదా? ఇబ్బందేం లేదుగా అని 16-17 సార్లు అడిగాడు. ఆయన చూపించిన గౌరవం, కేరింగ్ నాకెంతో నచ్చింది. తనవల్లే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీన్ పూర్తి చేశాం అని గిరిజ ఓక్ చెప్పుకొచ్చింది.చదవండి: తనవల్లే తెలిసొచ్చింది.. నేను పూర్తిగా మారిపోయా: శర్వానంద్ -
'గర్ల్ఫ్రెండ్' కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంత?
హీరోహీరోయిన్లు అన్నాక సినిమాలు చేస్తారు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ గత కొన్నాళ్లలో కొందరు సెలబ్రిటీలు.. ముందు మూవీస్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత పారితోషికాలు అందుకుంటున్నారు. పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ రష్మిక కూడా 'ద గర్ల్ఫ్రెండ్' విషయంలో ఇలానే చేసినట్లు తెలుస్తోంది. మూవీ విడుదలకు ముందు ఓ ఈవెంట్లో నిర్మాత ధీరజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రిలీజ్ తర్వాత తనకు డబ్బులివ్వాలని రష్మిక చెప్పిన సంగతి బయటపెట్టారు.'గర్ల్ఫ్రెండ్' రీసెంట్గానే (నవంబరు 07న) థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రోజురోజుకీ కలెక్షన్ నంబర్స్ పెరుగుతున్నాయి. దీంతో రష్మిక రెమ్యునరేషన్ ఎంత తీసుకుందా అనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక.. ఒక్కో ప్రాజెక్ట్ కోసం రూ.5-6 కోట్ల వరకు అందుకుంటోందట. 'గర్ల్ఫ్రెండ్' కోసం మాత్రమే రూ.3 కోట్లు చాలానే అందట. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: 'జటాధర' సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా)కొన్నిసార్లు కొన్ని సినిమాలు.. ఆయా హీరోహీరోయిన్లకు కిక్ ఇస్తుంటాయి. బహుశా రష్మికకు కూడా 'గర్ల్ఫ్రెండ్'తో ఇలాంటి సంతృప్తి లభించినట్లు ఉంది. అందుకే సాధారణంగా తీసుకునే దానికంటే తక్కువగానే తీసుకుందని మాట్లాడుకుంటున్నారు. దీంతో రష్మిక మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అలానే ప్రస్తుతం ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది కాలంలో ఈమె నుంచి ఐదు వైవిధ్య భరిత సినిమాలు రావడం విశేషం.'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. భూమా(రష్మిక) ఎం.ఏ లిటరేచర్ స్టూడెంట్. తండ్రి(రావు రమేశ్)ని ఒప్పించి హస్టల్లో చేరుతుంది. కానీ కాలేజీలో చేరిన తొలిరోజే భూమా, విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ప్రేమలో పడతారు. విక్రమ్ని దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) కూడా ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం భూమానే ప్రేమిస్తాడు. రిలేషన్లో మానసికంగా, శారీరకంగా చాలానే దూరం వెళ్తారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..) -
సినిమాకు నెగిటివ్ టాక్.. కలెక్షన్స్ మాత్రం ఇలా
తెలుగులో ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజయ్యాయి. రష్మిక 'గర్ల్ఫ్రెండ్'తో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా చిత్రాలతో పాటు ఆర్యన్, డీయస్ ఈరే లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. వీటితోనే రిలీజైన సుధీర్ బాబు 'జటాధర'కు మాత్రం తొలి షో నుంచే తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షాకింగ్ అనిపిస్తున్నాయి.ఈ వారాంతం రిలీజైన సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ చిత్రాలు ఉన్నంతలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారు గానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే మేకర్స్ వైపు నుంచి ఎలాంటి పోస్టర్స్ బయటకు రాలేదు. మరోవైపు తెలుగు-హిందీలో రిలీజైన 'జటాధర' టీమ్ మాత్రం కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..)తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ సాధించగా.. రెండు రోజులకు కలిపి రూ.2.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. పాజిటివ్ టాక్ ఏ మాత్రం రాని 'జటాధర'కు ఈ రేంజు వసూళ్లు రావడం అంటే ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు. వీకెండ్ పూర్తయ్యేసరికి మరి ఏ మూవీ రేసులో ముందు ఉంటుందో చూడాలి?'జటాధర' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలోని ఓ ఇంట్లో దాచిన లంకె బిందెలకు ఓ ధన పిశాచి (సోనాక్షి సిన్హా) కాపలా ఉంటుంది. ఓసారి బంధనానికి విఘాతం కలిగి ధనపిశాచి రక్తాన్ని మరుగుతుంది. దీంతో ఊరంతా ఖాళీ అయిపోతుంది.. మరోవైపు శివ(సుధీర్ బాబు) అనే ఘోస్ట్ హంటర్.. సైంటిఫిక్గా దెయ్యాలు లేవని నిరూపిస్తూ ఉంటాడు. శివకు తరుచుగా ఓ బాబుని అతడి తల్లి చంపుతున్నట్లు పీడకల వస్తూ ఉంటుంది. ఈ పీడకలకు, ధనపిశాచికి, శివకు మధ్య సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు) -
ఒంటరితనం.. పిచ్చోడినైపోయా.. డిప్రెషన్తో బాధపడ్డా!
హీరోయిన్ తమన్నాతో డేటింగ్తో ఆ మధ్య వార్తల్లో నిలిచాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma). ఎక్కడికి వెళ్లినా జంటగానే కనిపించేవారు. కానీ, సడన్గా బ్రేకప్ చెప్పుకుని అందరికీ షాకిచ్చారు. ఇద్దరూ విడిపోయి ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్.. గతంలో డిప్రెషన్తో బాధపడిన విషయాన్ని బయటపెట్టాడు. నటి రియా చక్రవర్తి పాడ్కాస్ట్లో అతడు మాట్లాడుతూ.. ముంబైలోని నా అపార్ట్మెంట్లో ఒక్కడినే ఉంటాను. పిచ్చోడినయ్యా..అక్కడ ఒక చిన్న టెర్రస్ ఉండేది. అక్కడ ఆకాశాన్ని చూస్తూ గడిపేవాడిని. లేదంటే నాకు పిచ్చిపట్టేదేమో! నిజం చెప్పాలంటే పిచ్చోడ్నయ్యాను కూడా.. షూటింగ్స్ అంటూ ఎప్పుడూ పరిగెత్తే నాకు సడన్గా బ్రేక్ వచ్చింది. అప్పుడు నా చుట్టూ ఒంటరితనం ఆవరించింది. ఎందుకో భయమేసేది. గదిలో నుంచి బయటకు రాకపోయేవాడిని. రోజుల తరబడి సోఫాకే ఎందుకు అతుక్కుపోయేవాడినో నాకే తెలిసేది కాదు.. ఏం జరుగుతుందో అర్థం కాలేదు.ఆమిర్ కూతురి వల్లే..అలాంటి సమయంలో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ (Ira Khan), నటుడు గుల్షన్ దేవయ్య నాకు అండగా నిలబడ్డారు. దహాడ్ వెబ్ సిరీస్ షూటింగ్లోనే మేము ముగ్గురం ఫ్రెండ్సయ్యాం. అప్పుడప్పుడు వీడియో కాల్ చేసుకునేవాళ్లం, కలిసి డిన్నర్కు వెళ్లేవాళ్లాం. అప్పటికీ నా మనసు బాగోలేదు. ఆ విషయం ఇరా పసిగట్టింది. ఇలా ఆగిపోకు, ముందుకు సాగాలని భుజం తట్టింది. వీడియోకాల్లో వర్కవుట్స్ చేయించింది. డిప్రెషన్ఓ థెరపిస్ట్తో మాట్లాడినప్పుడు నేను డిప్రెషన్తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ధ్యానం చేయమని సూచించాడు. అదే విషయం తనకు చెప్పి దాన్నుంచి బయటకు వచ్చేందుకు నేనే ప్రయత్నిస్తానన్నాను. అలా సూర్య నమస్కారాలు, యోగా ద్వారా ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పుకొచ్చాడు. విజయ్ చివరగా ఐసీ 814: ద కాందహర్ హైజాక్ వెబ్ సిరీస్లో, మర్డర్ ముబారక్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు నటించిన గుస్తాఖ్ ఇష్క్ నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది.చదవండి: మాపై చిన్నచూపు.. బతకాలనిపించలేదు: రాము తల్లి భావోద్వేగం -
20 ఏళ్ల యువతిపై 'అనుపమ పరమేశ్వరన్' ఫిర్యాదు
ఇటీవల బైసన్, కిష్కింధపురి, ది పెట్ డిటెక్టివ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ట్రెండింగ్లో ఉంది. అయితే, కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెబుతూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి తన ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన కుటుంబం గురించి అనుచితమైన పోస్టులు షేర్ చేస్తున్నట్లు ఆమె పేర్కొంది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపింది.అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొంది. 'కొద్దిరోజులుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నా గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివి సర్వసాధారణమేనని మొదట పట్టించుకోలేదు. అయితే, నా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సహ నటీనటులకు కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే ఎవరో కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నట్లు అర్థమైంది. దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఫైనల్గా తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఫేక్ అకౌంట్ల నుంచి తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. దీంతో వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను.' అని అనుపమ తెలిపింది.యువతి వివరాలు గోప్యంగా ఉంచండిసైబర్ క్రైమ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆశ్యర్యపోయే విషయం వెలుగులోకి వచ్చిందని అనుపమ ఇలా చెప్పింది. ' ఇదంతా చేసింది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆమె వయసులో చాలా చిన్నది. తన భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఐడెంటిటీని బయటి ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. అయితే, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు కూడా ఈ ఘటన గురించి చెప్పాలని నాకు లేదు. కానీ, యువత మేలుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. చేతిలో ఫోన్ ఉందని, సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ఇతరులను ద్వేషిస్తూ ఆన్లైన్లో మేరు చేసే ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. సెలబ్రిటీలు అయినంత మాత్రానా మాకు కూడా సామాన్యులకు ఉండే హక్కులు ఉంటాయి. చట్టం అందరికీ సమానమే.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
ఒక రోజులో జరిగే కథే ‘బా బా బ్లాక్ షీప్’
టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్ లఘుసాని, మాల్వి మల్హోత్రా ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మేఘాలయలో జరుగుతోంది. వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. ఆరుగురి మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది. గన్స్, గోల్డ్, హంట్ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. ‘బా బా బ్లాక్ షీప్’ కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. ఇటీవల మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె. సంగ్మాగారిని కలిశాం. మేఘాలయలో షూటింగ్ కోసం తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు సీఎం. మేఘాలయలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం మాదే. ఈ చిత్రకథ మొత్తం నార్త్, ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబట్టి ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. జల΄ాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో సాగే కథ ఇది’’ అని చెప్పారు. -
కొత్త ఇంట్లోకి సతీసమేతంగా 'బుచ్చిబాబు' గృహప్రవేశం
'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి, జాతీయ అవార్డు అందుకున్న బుచ్చిబాబు కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. మొదటి సినిమానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్చరణ్తో కలిసి పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'ని తెరకెక్కిస్తున్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన బుచ్చిబాబు తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. గృహప్రవేశం కార్యక్రమంలో వల్ల గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్కు బుచ్చిబాబు రాలేకపోయారు. కానీ, ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్లో వినిపించారు.లైఫ్ ఇచ్చిన సుకుమార్బుచ్చిబాబు, సుకుమార్లది గురు-శిష్యుల బంధమని తెలిసిందే. సుకుమార్ కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేశారని తెలిసిందే. అయితే, అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో సుకుమార్ చెప్పే పాఠాలంటే బుచ్చిబాబుకు బాగా ఇష్టం ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే, గురువు దర్శకుడిగా మారడంతో తాను కూడా అదే దారిలో అడుగులు వేశారు. అలా ‘ఆర్య 2’ నుంచి సహాయ దర్శకుడిగా బుచ్చిబాబు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం,100% లవ్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.పిఠాపురం లో కొత్త ఇల్లు కట్టుకున్న పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా. శనివారం గృహ ప్రవేశ వేడుక జరిగింది.#Peddi #BuchiBabuSana #RamCharan pic.twitter.com/cOSJ3aIZLq— Tollywoodtopics (@filmytopics) November 9, 2025 -
'రాము రాథోడ్' సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. హౌస్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రాము రాథోడ్ సడెన్గా సెల్ఫ్ ఎలిమినేషన్ కావడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, షోలో ఉన్నంత కాలం పెద్దగా నెగటివిటీ లేకుండా బయటికి రావడం విశేషం. సుమారు 60 రోజులకు పైగానే బిగ్బాస్లో రాము ఉన్నాడు. దీంతో ఆయన భారీగానే రెమ్యునరేషన్ రూపంలో సంపాధించాడు.యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించిన రాము రాథోడ్ ఫోక్ సింగర్గా బాగా పాపులర్ అయ్యాడు. “రాను బొంబాయికి రాను” అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయనకు చాలా సాంగ్స్ పాడేందేకు అవకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలోనే బిగ్బాస్ ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే, రాము రాథోడ్ ఒక వారానికి రెమ్యునరేషన్గా రూ. 2లక్షల వరకు తీసుకున్నట్లు టాక్ ఉంది. దీంతో 9వారాలకు గాను బిగ్బాస్తో అతను రూ. 18 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.హోస్ట్ నాగార్జునతో పాటు హౌజ్మేట్స్ కూడా బిగ్బాస్లో ఉండాలని రాము రాథోడ్ను కోరారు. కానీ, తన వినకుండా ఇంటిని వీడాడు. ఈక్రమంలో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. 'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని బిగ్బాస్ నుంచి బయటకు వచ్చేశాడు. -
సెలబ్రిటీ మేనేజర్గా దూసుకుపోతున్న అంబటి శివ
సెలబ్రిటీలను చూడాలనేది కోట్లాది మందికి కల కావొచ్చు.. అయితే.. సెలబ్రిటీల పాపులారిటీ లో కలర్ఫుల్ కెరీర్ను చూడటం అనేది అతి కొద్దిమందికి మాత్రమే అబ్బిన కళ. అలాంటి కళని అవపోసన పట్టిన ఓ కుర్రాడు ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్గా సిటీలో దూసుకుపోతున్నాడు. పిన్న వయసులోనే పెద్ద పెద్ద స్టార్లతో శెభాష్ అనిపించుకుంటూ సెలబ్రిటీ మేనేజ్మెంట్ రంగం వైపు చూస్తున్న యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. దక్షిణాదిలో సెలబ్రిటీ మేనేజ్మెంట్ అనే పదం అంతగా వినపడని రోజుల్లోనే షోకేస్ అనే సంస్థ స్థాపించిన అంబటి శివ ఈ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నాడు.చాలా మంది తెలుగు కుర్రాళ్లలాగే నేను కూడా డిగ్రీ పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగంలో సెటిలవుదాం అనుకున్నా. అయితే ముంబై వెళ్లడంతో నా ఆలోచనతో పాటు తలరాత కూడా మారింది. తొలుత బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహర్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్లో ప్రాజెక్ట్ మేనేజర్గా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకి పని చేశాను. అక్కడే నాకు సెలబ్రిటీ మేనేజ్మెంట్ అనే రంగం గురించి తెలిసింది. ఆ సమయంలో జాన్వీ, రకుల్ ప్రీతి సింగ్ వంటి తారలతో పనిచేశాను. ఆ తర్వాత వాళ్లు దక్షిణాది నటీనటులను హ్యాండిల్ చేయడానికి ఒక విభాగం ఏర్పాటు చేశారు. దానికి నన్ను కీలక బాధ్యతల్లో పెట్టారు. అదే సమయంలో సురేష్ ప్రొడక్షన్స్లో రానా ఆరి్టస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి పిలుపుతో నగరానికి వచ్చేశాను. ఆ తర్వాత ‘షోకేస్’ స్థాపించాను. అనేక రకాల సెలబ్రిటీ ఈవెంట్స్ నిర్వహించాను. ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్లో విశాఖ బీచ్ ఫెస్టివల్, కాకినాడ బీచ్ ఫెస్టివల్, ఫ్లెమింగోస్ బర్డ్స్ ఫెస్టివల్(మూడుసార్లు) చేశాం. ఏం చేస్తామంటే..ఒకప్పుడు ఈవెంట్లలో సెలబ్రిటీల ఒప్పందాల వరకే చూసేవాళ్లం అయితే ఇప్పుడు ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ కూడా. ఎవరైనా ఒక సెలబ్రిటీతో ప్రోగ్రామ్ నిర్వహించాలనుకుంటే మొత్తం డిజైన్ చేసి అందిస్తాం. ప్రొడక్షన్, సెట్ డిజైనింగ్, నిర్వహణ అంతా మేమే చూసుకుంటాం. ఇక కార్యక్రమంలో ముఖ్యమైన భాగం సెలబ్రిటీలతో నిర్వాహకులకు మధ్య వారధిగా పనిచేయడం. ఆ తర్వాత సెలబ్రిటీలను కార్యక్రమానికి తీసుకురావడం నుంచి తిరిగి వెళ్లేవరకూ బాధ్యత తీసుకుంటాం. గ్లామరస్ కెరీర్.. డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫారమ్ల విస్ఫోటనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎకోసిస్టమ్ భారీ పెరుగుదలతో సెలబ్రిటీ మేనేజ్మెంట్ను కీలకమైన, బహుముఖ వృత్తిగా మార్చింది. నైపుణ్యం కలిగిన యువతకు అధిక డిమాండ్ సృష్టించింది. దేశంలో దాదాపు 78కోట్లకు పైగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల వల్ల ఇంటర్నెట్ ప్రకటనల రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మారింది. దీంతో యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్, ఓటీటీ వేదికలపై బ్రాండ్ ఒప్పందాలు, కంటెంట్ సృష్టి ఆదాయ మార్గాలను అన్వేషించడానికి సెలబ్రిటీలకు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ తప్పనిసరి అయ్యింది. మరోవైపు దేశంలో ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య 4 మిలియన్లకు పైగా పెరిగింది. ఇది కంటెంట్–ఆధారిత బ్రాండ్ సహకారాల కోసం ఒక భారీ పరిశ్రమను సృష్టించింది. ఈ బూమ్ కొత్త డిజిటల్ స్టార్ల కోసం బ్రాండ్ ఒప్పందాలు, కాంట్రాక్టులు కెరీర్ వ్యూహాన్ని నిర్వహించడానికి వందలాది మంది టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, మేనేజర్లను నియమించుకోవడానికి దారితీసింది. – అంబటి శివ -
'మిడిల్ క్లాస్'తో రీఎంట్రీ ఇచ్చిన విజయలక్ష్మి
ఇటీవల మంచి కంటెంట్తో రూపొందుతున్న చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. మంచి కథ ఉంటే హీరో హీరోయిన్లు ఎవరైనా గానీ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అలా పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి పాపులర్ అయిన నటులలో మునీష్ కాంత్ ఒకరు. పలు చిత్రాల్లో క్యారెట్ ఆర్టిస్ట్ గానూ మెప్పించిన ఈయన తాజాగా హీరోగా అవతారం ఎత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిడిల్ క్లాస్. కాగా ఇంతకుముందు పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిన నటి విజయలక్ష్మి తాజాగా రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దివంగత నిర్మాత ఢిల్లీబాబుకు చెందిన యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన తాజా చిత్రం మిడిల్ క్లాస్. కిషోర్ ముత్తు రామలింగం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది వినోదభరిత కథాచిత్రంగా అనిపించినా , ఒక సందర్భంలో థ్రిల్లర్ బాణీలో సాగుతుందన్నారు. ఇందులో నటుడు మునీష్ కాంత్ తన సొంత ఊరిలో స్థలం కొనుక్కుని సెటిల్ అవ్వాలని ప్రశాంతంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటాడన్నారు. అయితే ఆయన భార్య మాత్రం సిటీలో జీవించాలని ఆశపడుతుందన్నారు. అలా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తుందన్నారు. ఆ తర్వాత వారి సంతాన జీవితం ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో నటుడు రాధారవి, వేల రామమూర్తి ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు. -
థ్రిల్లర్ రెడీ
అర్జున్, ఐశ్వర్యా రాజేశ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘మఫ్తీ పోలీస్’. దినేష్ లెట్చుమనన్ దర్శకత్వంలో జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ థ్రిల్లర్ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రబృందం పేర్కొంది. -
క్రిస్మస్కి వృషభ
మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘వృషభ’. తండ్రీ కొడుకుల మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ప్రేమ, విధి, ద్వేషం వంటి భావోద్వేగాలను మిళితం చేసి నందకిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్ణని, జుహి పరేఖ్ మెహతా నిర్మించారు.ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించారు. ఈ రెండు భాషలతో పాటు హిందీ, కన్నడలోనూ విడుదల చేయనున్నారు. -
ఇఫీలో రజనీకాంత్కి సత్కారం
సాధారణ బస్ కండక్టర్ నుంచి చిత్రసీమలోకి వచ్చి సూపర్ స్టార్గా ఎదిగిన రజనీకాంత్కి 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో సత్కారం జరగనుంది. గోవా వేదికగా ఈ నెల 20న ఆరంభమయ్యే ఈ ‘ఇఫీ 2025’ వేడుక 28 వరకూ సాగుతుంది. ముగింపు రోజున రజనీకి సత్కారం జరగనుంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమై, తొలి నాళ్లల్లో విలన్గా, ఆ తర్వాత హీరోగా తిరుగులేని సూపర్ స్టార్ అనిపించుకున్న రజనీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. చిత్రరంగానికి సుదీర్ఘ సేవలు అందించినందుకుగానూ రజనీకాంత్ని ఘనంగా సత్కరించాలని ‘ఇఫీ’ నిర్ణయించుకుంది.అలాగే గత ఏడాది అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, తపన్ సిన్హా, మొహమ్మద్ రఫీ వంటి లెజెండ్స్ శత జయంతి వేడుకలు నిర్వహించినట్లుగా ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ‘ఇఫీ’. ప్రముఖ తెలుగు నటి–దర్శక–నిర్మాత–గాయని పి. భానుమతీ రామకృష్ణ, ప్రఖ్యాత నటుడు–దర్శక–నిర్మాత గురుదత్, మరో ప్రముఖ దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, గొప్ప ఫిల్మ్ మేకర్గా పేరు తెచ్చుకున్న దర్శక–రచయిత రిత్విక్ ఘటక్, లెజెండరీ సింగర్–రైటర్–మ్యూజిక్ డైరెక్టర్ భూపేన్ హజారికా, మరో ప్రముఖ గాయకుడు–రచయిత సలీల్ చౌదరిల శత జయంతి వేడుకలు ‘ఇఫీ 2025’లో జరగనున్నాయి. ఈ స్టార్స్కి సంబంధించిన ఒక్కో ‘ఐకానిక్ ఫిల్మ్’ని ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలానే బ్యాడ్ గర్ల్, చిరంజీవ, కిస్, మిత్రమండలి, బారాముల్లా తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ బొమ్మలు.. డిజిటల్గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు జారన్ అనే సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వీటితోపాటు ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)కొన్నాళ్ల క్రితం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం హౌస్మేట్స్. జీ5లో అందుబాటులో ఉండేది. ఇప్పటివరకు తమిళంలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దెయ్యమే లేకుండా ఈ హారర్ సినిమా తీయడం విశేషం. ఒకే అపార్ట్మెంట్లో రెండు వేర్వేరు కాలాల్లో రెండు కుటుంబాలు ఉంటాయి. దీంతో ఒకరి గురించి మరొకరు తెలుసుకుని భయపడతారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.మరోవైపు 2023 అక్టోబరులో రిలీజైన 'ధీమహి' అనే తెలుగు సినిమా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. అమెరికాలో సర్జన్గా కార్తీక్(సాహస్) పనిచేస్తుంటాడు. ఇతడికి మేనకోడలు ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. కొన్నిరోజులకు మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. తర్వాత చంపేస్తారు కూడా. మేనకోడలు చావుకి తానే కారణమని బాధపడే కార్తీక్.. నెక్రోమాన్సీ అనే పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు) -
రష్మిక 'గర్ల్ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు
ఈ వారం తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' మాత్రమే ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ కూడా దక్కించుకుంది. మరి తొలిరోజు దీనితో పాటు రిలీజైన సినిమాల సంగతేంటి? కలెక్షన్స్ ఎంత వచ్చాయని టాక్ వినిపిస్తుంది? ఇంతకీ వీటిలో ఏయే సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.రష్మిక 'ద గర్ల్ఫ్రెండ్' విషయానికొస్తే.. విడుదలకు ముందురోజే ప్రీమియర్స్ వేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలిరోజు వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. అలా దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.1.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. చిత్రబృందం మాత్రం తొలిరోజు కంటే రెండో రోజు వచ్చేసరికి నాలుగురెట్ల వసూళ్ల పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయలేదు. బహుశా వీకెండ్ తర్వాత చేస్తారేమో చూడాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!)మహేశ్బాబు బావమరిది సుధీర్బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. హీరోతో పాటు కొందరు మాత్రమే తెలుగు నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ సబ్జెక్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అయినప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా మరీ తీసికట్టుగా ఉండటంతో నెగిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ దీన్ని రిలీజ్ చేశారు. అయినప్పటికీ తొలిరోజు రూ.1.47 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి కనీస వసూళ్లయినా వస్తాయా అనేది చూడాలి.వీటితో పాటు తిరువీర్ హీరోగా నటించిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ లక్షల్లో మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ కూడా థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందని అంటున్నారు. ఇదొకటి వచ్చిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలీదు. కాబట్టి దీనికి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చుంటాయి. ఇవి కాకుండా 'ఆర్యన్', 'డీయస్ ఈరే' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ వీటికి చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే రష్మిక సినిమా మాత్రమే ప్రస్తుతానికి లీడ్లో ఉంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
వంటగదిలో నిహారిక.. అను 'గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలు
వంటగది వీడియో పోస్ట్ చేసిన నిహారికఇంట్లో పెట్ డాగ్తో నమ్రత హ్యాపీనెస్'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాల్లో అను ఇమ్మాన్యుయేల్హీరోయిన్ మానస వారణాసి అడవిలో షికార్లుఉత్తరాది అమ్మాయిలా మారిపోయిన రాశీఖన్నాఅమ్మకు పుట్టినరోజు విషెస్ చెబుతూ శివానీ View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బిగ్బాస్ 9లో సెల్ఫ్ ఎలిమినేషన్.. అలానే మరొకరు!
బిగ్బాస్ షోలో వీకెండ్ వచ్చిందంటే చాలు హౌస్ట్ నాగార్జున వచ్చేస్తారు. కాస్త సందడి చేస్తారు. ఈసారి కూడా అలానే 'శివ' రీ రిలీజ్ ప్రమోషన్ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ, మూవీలో హీరోయిన్-నాగ్ భార్య అమల షోలో సందడి చేశారు. నాగ్-అమల స్టెప్పులు కూడా వేశారు. ఇవన్నీ సరే గానీ వీకెండ్ వస్తే కచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈసారి బిగ్బాస్కి ఛాన్స్ ఇవ్వకుండా సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)9వ సీజన్లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. ఈసారి సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ నామినేషన్స్లో ఉన్నారు. సేవ్ చేసేందుకు ఓటింగ్ లైన్స్ శుక్రవారం రాత్రి వరకు ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత చివరి స్థానంలో సాయి శ్రీనివాస్ నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీకెండ్ ఇతడు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్. గత కొన్నాళ్ల నుంచి డల్గా ఉన్న రాము.. సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఐదోవారం వరకు రాము రాథోడ్ బాగానే బండి లాక్కొచ్చాడు గానీ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయిపోయాడు. నామినేషన్స్లో వాదించట్లేదు, పైపెచ్చు తానే నామినేట్ అవుతానని అంటున్నాడు. మరోవైపు గేమ్స్ వేటిలోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని పదే పదే అంటున్నాడు. శనివారం ఎపిసోడ్లోనూ హౌస్ట్ నాగార్జున ఇదే విషయం అడిగారు. దీంతో తనదైన స్టైల్లో పాటపడి తనకు ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారని చెప్పకనే చెప్పాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్)'చిన్నప్పుడే మా అమ్మనాన్న పనికోసం వేరే ఊరికి వెళ్లిపోయారు. అలా 5-6 ఏళ్లు దూరంగా ఉన్నా. ఇప్పుడు లైఫ్ అంతా సెట్ అయింది. ఇక వాళ్లని చూసుకుందాం అనే టైంలో ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను' అని రాము అన్నాడు. దీంతో బిగ్బాస్ గేట్స్ ఓపెన్ చేయండి అని నాగ్ చెప్పడంతో తలుపులు తెరుచుకున్నాయి. మరి వెళ్తావా లేదా తేల్చుకో అని నాగ్ అడగడంతో.. 'వెళ్తాను సర్' అని రాము దీనంగా చెప్పాడు. ప్రోమోలో డ్రామా చూపించినప్పటికీ నిజంగానే రాము బయటకొచ్చేశాడట. శనివారం ఎపిసోడ్లోనే ఈ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది.ప్రతివారం ఒకే ఎలిమినేషన్ ఉంటుందిగా. రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడంతో రెగ్యులర్గా జరగాల్సిన ఉంటుందా లేదా అందరూ అనుకుంటున్నారు. అయితే సాయి శ్రీనివాస్ని కూడా పంపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాలావరకు అయితే రాము మాత్రమే హౌస్ నుంచి బయటకు రావొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన బిగ్ బాస్ వితిక) -
విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో తన చివరిదైన 'జన నాయగణ్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన తొలి పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'తళపతి కచేరీ' అంటూ సాగే మూవీలోని తొలి పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)అనిరుధ్ ఎప్పటిలానే మరో మాస్ బీట్తో అలరించాడు. దానికి విజయ్, జనాలతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన అభిమానులకు కనువిందు చేసేలా ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలతో వివాదాస్పద దర్శకుడిగా వివేక్ అగ్నిహోత్రి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చివరి చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్'. 1947లో ఇండియా-పాక్ విభజన బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే చర్చనీయాంశమైన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'ద బెంగాల్ ఫైల్స్' సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివితో దీన్ని తీశారు. తొలి రెండు చిత్రాల్లానే ఇది కూడా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈనెల 21 నుంచి హిందీ భాషలో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన)'ద బెంగాల్ ఫైల్స్' విషయానికొస్తే.. 1947వ సంవత్సరంలో భారత్-పాక్ ఎలా విడిపోయాయి. ఈ విషయంలో గాంధీ ఎలాంటి పాత్ర పోషించారు. అప్పుడు హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు చేలరేగాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు. ఈ అనర్థాలన్నీ ఎందుకు జరిగాయనేది ఈ సినిమా స్టోరీ.ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయే సమయంలో గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాని ఇదంతా వద్దని అంటారు. జిన్నా మాత్రం.. ముస్లింలు ఎప్పుడూ ముస్లింలే, హిందూ ముస్లిం భాయ్ భాయ్ కాదు అని అంటాడు. తర్వాత జిన్నా మనుషులు అప్పటి దేశ రాజధాని అయిన కలకత్తాలో మారణహోమం సృష్టిస్తారు. హిందూ స్త్రీలని, మహిళలని, చిన్నపిల్లలని చూడకుండా దారుణంగా కాల్చి చంపేస్తారు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటీషర్లు ఏం చేశారు? ముస్లింలపై భారతీయులు ఎలా తిరుగుబాటు చేశారు? తమని తాము ఎలా కాపాడుకున్నారనే అంశాల్ని ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
చెల్లి సీమంతం గ్రాండ్గా చేసిన వితిక
హీరోయిన్గా టాలీవుడ్లోకి వచ్చిన తెలుగమ్మాయి వితికా షేరు.. తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్ని తర్వాత కొన్నాళ్లకు పెళ్లిచేసుకుంది. మధ్యలో వీళ్లిద్దరూ కలిసి బిగ్బాగ్ 3వ సీజన్లో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఈ షో నుంచి వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు గానీ వితిక మాత్రం యూట్యూబ్లో వీడియోలు చేస్తోంది.ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే విశేషాలని పంచుకునే వితికా షేరు.. తన చెల్లి క్రితిక సీమంతం చేసిన విషయాన్ని పంచుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలు, యూట్యూబ్లో ఈ శుభకార్యానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో వితిక కుటుంబంతో పాటు క్రితిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా కనిపించారు.(ఇదీ చదవండి: ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్)'సీమంతం అనేది మహిళ జీవితంలో ఓ అందమైన సంప్రదాయ వేడుక. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు. అమ్మతనం, ప్రేమ అనే కొత్త ప్రారంభానికి ఇదో సెలబ్రేషన్' అని వితిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇకపోతే నెలన్నర క్రితం అంటే సెప్టెంబరు చివరి వారంలోనూ చెల్లికి సింపుల్గా బేబీ షవర్ (సీమంతం) చేసింది. అప్పుడు కేవలం స్నేహితురాళ్లతో దీన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకని జరుపుకొన్నారు.చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇప్పుడు సీమంతం జరిగింది.(ఇదీ చదవండి: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
Dies Irae: సౌండ్తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ
గత కొన్నేళ్లుగా హారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. కానీ దీనికి కామెడీ మిక్స్ చేసి తీస్తున్నారు. అలా కాకుండా కేవలం హారర్ ఎలిమెంట్స్తో తీసి వేరే లెవల్లో భయపెట్టిన చిత్రాలంటే అరుదు. ఇప్పుడు అలా ప్యూర్ హారర్ కాన్సెప్ట్తో తీసిన మూవీ 'డీయస్ ఈరే'. ఇదో మలయాళం సినిమా. అక్టోబరు 31న అక్కడ రిలీజైంది. వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న తెలుగులో థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ)కథేంటి?రోహన్ (ప్రణవ్ మోహన్లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్ కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట గజ్జెల శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భావిస్తుంటాడు. అసలు ఈ ఆత్మ ఎవరిది? ఎందుకు రోహన్ వెంటపడుతోంది? కని పొరుగింటి వ్యక్తి మధు(జిబిన్ గోపీనాథ్), రోహన్కి ఎలాంటి సాయం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?హారర్ సినిమా అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. ఓ దెయ్యం, దానికో ఫ్లాష్ బ్యాక్, అది హీరో లేదా హీరోయిన్ని వేధించడం.. చివరకు దాని నుంచి బయటపడటం.. దాదాపు ఇదే పాయింట్తో చాలా వరకు తీస్తుంటారు. 'డీయస్ ఈరే' కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. కానీ చూస్తున్న ప్రేక్షకుడిని ఎంతవరకు భయపెట్టామా అనేది కీలకం. ఈ విషయంలో 'డీయస్ ఈరే' టీమ్కి నూటికి నూటి మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఆ రేంజులో భయపెట్టారు. కొన్ని సీన్లలో అయితే వణికిపోతాం.సినిమా మొదలైన కాసేపటివరకు కథలో పెద్ద కదలిక ఉండదు. రోహన్, అతడు చుట్టూ ఉంటే ప్రపంచాన్ని పరిచయం చేశారు. కని ఆత్మహత్య చేసుకోవడం, ఆమె ఇంటికి రోహన్ వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. కని హెయిన్ పిన్ని రోహన్ తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి ఓ ఆత్మ రోహన్ని భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం చూపించే సీన్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండాఫ్లో దెయ్యం ఎవరు? దాన్ని రోహన్ ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలు చూపిస్తారు. అయితే సెకండాఫ్లో ప్రతి సీన్లోనూ నెక్స్ట్ ఏం జరగబోతుందా అని ఒకటే ఆత్రుత. చివరి 20 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. సీటు నుంచి మనల్ని కదలం. ఊపిరి కూడా తీసుకోకుండా చూస్తాం. అప్పటివరకు నిదానంగా సాగిన సినిమా కాస్త క్లైమాక్స్లో పరుగెడుతుంది.(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ)ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ (చెబితే స్పాయిలర్ అవుతుంది)ని పలు సందర్భాల్లో మనం వార్తల్లో చూసే ఉంటాం. ఇంత చిన్న పాయింట్ని తీసుకుని ఓ హారర్ మూవీ తీయడం అంటే మాటలు కాదు. అదే టైంలో మలయాళ చిత్రాలపై ఎప్పుడు ఉండే కంప్లైంట్ ఇందులోనూ ఉంటుంది. చాలా అంటే చాలా నిదానంగా మూవీ సాగుతుంది. అసలు కని ఏ కారణంతో చనిపోయిందో రివీల్ చేయలేదు. చివర్లో పార్ట్ 2 ఉంటుందనే హింట్ ఇచ్చారు. బహుశా సీక్వెల్లో ఆ విషయం రివీల్ చేస్తారేమో?కని తమ్ముడు ఓ సందర్భంలో రోహన్ ఇంటికొస్తాడు. అక్కడి ఆత్మ కారణంగా కిరణ్ పై ఫ్లోర్ నుంచి కిందపడిపోతాడు. ఆ విజువల్స్ చూస్తే మన ఒళ్లు జలదరిస్తుంది. క్లైమాక్స్లో కని పొరుగింటికి రోహన్ వెళ్తాడు. ఆ సీన్స్ చూస్తున్నంతసేపు కళ్లు తిప్పుకోలేం. ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు భయమేస్తుంది.ఎవరెలా చేశారు?ఇందులో పాత్రలు చాలా తక్కువ. లీడ్ రోల్ చేసిన ప్రణవ్ మోహన్లాల్ ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్లైమాక్స్లో ఎల్సమ్మ పాత్రలో జయ కురుప్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవల్. ఓ రకంగా ఆమె సర్ప్రైజ్ చేస్తుంది. మధు పాత్రలో జిబిన్ గోపీనాథ్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు అందరూ న్యాయం చేశారు. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ గురించి చెప్పుకోవాలి. గతంలో భూతకాలం, భ్రమయుగం అనే హారర్ మూవీస్తో భయపెట్టిన ఈయన.. ఇప్పుడు ఈ చిత్రంతో ఇంకాస్త భయపెట్టాడు. అసలు స్టోరీ ఏం లేనప్పటికీ ఏదో ఉందనే భ్రమ కల్పించి, తనదైన మ్యాజిక్ చేశాడు.మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్జేవియర్ ఈ సినిమాకు మరో హీరో. ఎందుకంటే సాధారణంగా హారర్ సినిమాల్లో జంప్ కట్స్, స్కేరీ మూమెంట్స్ ఎక్కడొస్తాయో ఇప్పటి ప్రేక్షకులు పసిగట్టేస్తున్నారు. అలా పండిపోయిన హారర్ మూవీ ప్రేమికుల్ని కూడా తనదైన నేపథ్య సంగీతంతో భయపెడతాడు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్కి తోడు సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ వేరే లెవల్ డ్యూటీ చేశాడు. సీన్ మూడ్ ఎలివేట్ చేసేలా, లైటింగ్తో.. ఇదెక్కడి హారర్ మూవీ బాబోయే అనిపిస్తాడు. నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ మూవీ ఇది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి అయ్యో దీన్ని థియేటర్లో మిస్ అయిపోయామే అనుకోవచ్చు. వీలుంటే మాత్రం బిగ్ స్క్రీన్పై ఈ చిత్రాన్ని ఎక్స్పీరియెన్స్ చేయండి. ఇకపోతే 'డీయస్ ఈరే' అనేది లాటిన్ పదం. తన కోపం చూపించే రోజు, శిక్షాదినం అని దీనికి అర్థం.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?) -
రజనీకాంత్ సోదరుడికి గుండెపోటు
తమిళ నటుడు రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్ (84) గుండెపోటుకు గురయ్యారు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఈ వార్త అందిన వెంటనే రజనీకాంత్ చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. తన సోదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రికి రజనీ వెళ్తున్నప్పుడు కొందరు తీసిని వీడియోలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అభిమానులు కూడా.. సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన కోలుకుంటారని ఆశాభావం వైద్యులు వ్యక్తం చేశారు. సత్యనారాయణ రావు గైక్వాడ్కు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆపై కొంత కాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో తరుచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం. -
'సైక్ సిద్ధార్థ'గా నందు.. ఇవేం బూతులు!
టాలీవుడ్ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న సినిమా 'సైక్ సిద్ధార్థ'.. అడల్ట్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక వంటి వారు నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. తాజాగా విడుదలైన టీజర్ను చూస్తుంటే పూర్తిగా యూత్ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా బూతులతోనే టీజర్ను నింపేశారు. డిసెంబర్ 12న థియేటర్స్లోకి సైక్ సిద్ధార్థ రానున్నాడు. -
'జువెల్లర్స్' యాడ్లో మెరిసిన మరో వారసురాలు
ఘట్టమనేని మంజుల తన కూతురు జాన్వీ స్వరూప్ను ఒక వాణిజ్య ప్రకటనతో పరిచయం చేశారు. లెజెండరీ సూపర్స్టార్ కృష్ణకు మనవరాలు, మహేష్ బాబుకు మేనకోడలుగా జాన్వీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ఒక జువెల్లర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక అయ్యారు. సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తొలిసారి జువెల్లర్స్కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో కనిపించి మెప్పించారు.ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని కూడా జువెల్లర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాన్వీ కూడా ఈ యాడ్లో చాలా చక్కగా కనిపించడమే కాకుండా తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. నెటిజన్ల నుంచి కూడా ఆమెకు ప్రశంసలు అందుతున్నాయి.ఘట్టమనేని జాన్వీ స్వరూప్ త్వరలో హీరోయిన్గా పరిచయం కానుంది. ఆమె నటన, డాన్స్లో ప్రత్యేక శిక్షణ పొందడమే కాకుండా ఇప్పటికే ఒక స్టోరీని కూడా ఫైనల్ చేశారట. ఇక జాన్వీ తల్లి మంజుల ఘట్టమనేని సినిమా పరిశ్రమలో దర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె సినిమాల నుంచి కొంత దూరంగా ఉన్నప్పటికీ కూతురును ప్రోత్సహిస్తున్నారు. జాన్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తప్పుకుండా ఘట్టమనేని అభిమానులు స్వాగతిస్తారని చెప్పవచ్చు. -
ఇక చాలు ఆపండి, మీ కాళ్లు మొక్కుతా..: విశాల్
సాక్షి, తమిళనాడు: కోయంబత్తూర్ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితుడితో కారులో ఉన్న విద్యార్థినిని ముగ్గురు యువకులు అపహరించి, ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇకచాలు, ఆపండిఅయితే రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకెళ్లిందని ఎమ్మెల్యే ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరాత్రి పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లుఉవెత్తాయి. తాజాగా హీరో విశాల్ (Vishal) సైతం ఈ వ్యవహారంపై స్పందించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకు ఉందని నిందించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయండి మానుకోండి.మీ కాళ్లు మొక్కుతా..న్యాయవ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా.. మీ కాళ్లు పట్టుకుంటా.. దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి. గతంలో నిర్భయ ఉదంతాలను చూశాం. ఏడేళ్ల బాలికను అత్యాచారం చేయడంతో పాటు కన్న తల్లిని నిర్దాక్ష్యిణ్యంగా హత్య చేసిన వ్యక్తి సుదీర్ఘ విచారణ తర్వాత గత నెలలో నిర్దోషిగా బయటకు వచ్చాడు. వైఎస్సార్కు సెల్యూట్ఇలాంటివి సౌదీ అరేబియా వంటి దేశాల్లో సాధ్యమవుతాయా? ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకున్న చర్యలు నిజంగా మెచ్చుకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నా.. అని విశాల్ ట్వీట్ చేశాడు. Stop blaming the victim for being at that place at that hour. Stop politicising this bloody gory recurring issue, rape in our country. High time atleast now I beg, bow and fall on your feet dear Judicial system and lawmakers. Kindly bring about captial punishment and death…— Vishal (@VishalKOfficial) November 7, 2025 చదవండి: ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే! -
18 ఏళ్లు మరొకరితో ఎఫైర్.. నా భార్యకి అంతా తెలుసు!
పెళ్లయ్యాక కూడా ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నా.. 18 ఏళ్లపాటు ఆ ఎఫైర్ నడిపాను అంటున్నాడు మలయాళ సీనియర్ నటుడు జనార్ధనన్. అంతేకాదు, ఈ ఎఫైర్ గురించి తన భార్యక్కూడా తెలుసని చెప్తున్నాడు. మలయాళంలో ఎక్కువగా కామెడీ, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన జనార్ధనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.18 ఏళ్లపాటు మరో మహిళతో ఎఫైర్ఈ సందర్భంగా జనార్ధనన్ (Actor Janardhanan) మాట్లాడుతూ.. నేను వివాహేతర సంబంధం పెట్టుకున్నాను. 18 ఏళ్ల క్రితం ఓ మహిళతో రిలేషన్ కొనసాగించాను. తనకోసం నేను చాలా చేశాను. ఇవన్నీ నా భార్యకూ తెలుసు. తనకు కొన్ని విషయాల్లో ఆసక్తి తగ్గిపోయింది. అందుకే నేను ఇంకో అమ్మాయిని చూసుకున్నాను. నేనూ మనిషినే కదా! 18 ఏళ్లపాటు తనతో సంబంధం కొనసాగించాను. ఏ తప్పూ చేయలేదుకానీ, ఆమె ఈ సమాజానికి భయపడి సడన్గా నన్ను దూరం పెట్టేసింది. నా జీవితంలో ఇదొక్కటే చెడుమరకగా మిగిలిపోయింది. ఇది కాకుండా నేనింకే తప్పూ చేయలేదు. పైగా దీనివల్ల నా కుటుంబంలోని ఎవరూ ఇబ్బందులకు గురికాలేదు. ఈ వయసులో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను కోల్పోవడానికంటూ ఏమీ లేదు. నా భార్య విషయానికి వస్తే తను చాలా మంచిది. చాలా బాగా వండిపెట్టేది అని చెప్పుకొచ్చాడు. సినిమాజనార్ధనన్ బంధువులమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుర్లు జన్మించారు. ఒరు సీబీఐ డైరీ కురిప్పు, మెలపరంబిల్ ఆన్వీడు, మన్నార్ మఠై, 2018 వంటి పలు మలయాళ సినిమాల్లో నటించాడు. నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా మోహన్లాల్ హృదయపూర్వంలో కనిపించాడు.చదవండి: ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే! -
వరల్డ్ కప్ విజయం.. అనుష్క సినిమా విడుదలకు ప్లాన్
బాలీవుడ్ నటి అనుష్కా శర్మ(Anushka Sharma) సుమారు ఏడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన కొత్త సినిమా ‘చక్దే ఎక్స్ప్రెస్’ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2022లోనే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదల కాలేదు. భారత దిగ్గజ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క లీడ్ రోల్ చేసింది. దర్శకులు ప్రొసిత్ రాయ్ ఈ సినిమాను తెరకెక్కించారు.మహిళల వన్డే ప్రపంచకప్లో ఛాంపియన్గా భారత జట్టు నిలిచింది. ఈ విజయం యావత్ మహిళల క్రికెట్ను మార్చబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ‘చక్దే ఎక్స్ప్రెస్’ విడుదలైతే సినిమాకు మంచి మైలేజ్ వస్తుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో ఆగిపోయిన ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. 2018లో జీరో సినిమాలో షారుఖ్ ఖాన్తో చివరిగా అనుష్క శర్మ నటించారు. తర్వాత ఆమె కొత్త సినిమాలకు ఒప్పుకోలేదు. దీంతో చక్దే ఎక్స్ప్రెస్ విడుదలైతే మంచి కెలక్షన్స్ రావచ్చు.క్లీన్స్లేట్ ఫిల్మ్జ్, నెట్ఫ్లిక్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ‘చక్దా ఎక్స్ప్రెస్’ని నిర్మించాయి. వీరి కాంబినేషన్లో ఇప్పటికే బుల్బుల్, కాలా, కోహ్రా వంటి సందేశాత్మక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు బ్యానర్లు పలు కారణాల వల్ల తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. ‘చక్దే ఎక్స్ప్రెస్’ సినిమా బడ్జెట్ విషయంలోనే వారికి మనస్పర్థల వచ్చాయని టాక్. దీంతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. అయితే, తాజా సమాచారం మేరకు క్లీన్స్లేట్ ఫిల్మ్జ్ ఇప్పుడు ‘చక్దే ఎక్స్ప్రెస్’ను విడుదల చేయాలని చూస్తుందట. అందుకోసం నెట్ఫ్లిక్స్ ఇండియా సంస్థతో చర్చలు కూడా జరిపిందని సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చిని తెలుస్తోంది. -
21 ఏళ్ల తర్వాత ఆటోగ్రాఫ్ మళ్లీ వస్తోంది..
ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. దర్శకుడు చేరన్ (Cheran). ఈయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ప్రజలకు ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. అలా ఆయన దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో ఆటోగ్రాఫ్ (Autograph Movie) అనే తమిళ చిత్రం ఒకటి. చేరన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలై 21 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ ఇందులోని పాటలు చాలాచోట్ల వినిపిస్తూనే ఉంటాయి. ఆ పని చసుంటే ఎదిగేవాడ్ని..అలాంటి చిత్రం మళ్లీ డిజిటల్ ఫార్మెట్లో కొత్త హంగులతో నవంబర్ 14న విడుదల కానుంది. గురువారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేరన్తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గం, ఇతర మిత్ర వర్గం పాల్గొని తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు అమీర్, ఆరి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చేరన్ మాట్లాడుతూ.. తాను మంచి కమర్షియల్ చిత్రాలు చేసుంటే ఆర్థికంగా ఎదిగి ఉండేవాడినేమో.. కానీ, ఆ తరువాత కనిపించకుండా పోయేవాడినేమోనని అన్నారు. 15 నిమిషాలు కట్ చేశాంఈ ఆటోగ్రాఫ్ చిత్ర నిడివిని 15 నిమిషాలు తగ్గించినట్లు చెప్పారు. డాల్బీ అట్మాస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చామని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేసి తాను సాధించేదేమీ లేదన్నారు. అయితే నేటి తరం ఎలా ఉందన్నది తెలుసు.. కాబట్టి ఇప్పుడు వారు ఈ చిత్రాన్ని చూస్తే వేరే ఆలోచన కలగవచ్చన్నారు. తాము విత్తనం మాత్రమే నాటగలమని, ఆటోగ్రాఫ్ చిత్రానికి ఆ అర్హత ఉందని భావించి మళ్లీ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.చదవండి: రీల్స్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
ఈ ఫోన్ నంబర్ నాది కాదు: రుక్మిణి వసంత్
కాంతార చాప్టర్-1 విడుదల తర్వాత రుక్మిణి వసంత్ పేరు పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిపోయింది. దీంతో కొందురు కేటుగాళ్ళు తన పేరు చెప్పుకుని మోసాలు చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తాజాగా తన సోషల్మీడియా ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. తన పేరు మీద జరుగుతున్న మోసాల గురించి ఆమె పేర్కొంది.నా పేరు చెబుతూ ఒక వ్యక్తి 9445893273 ఈ నంబర్తో వివిధ వ్యక్తులకు కాల్స్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నాలాగే మాట్లాడుతూ ఇతరులను సంప్రదించి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెంబర్ నాది కాదు. ఈ విషయాన్ని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ నంబర్ నుంచి వచ్చే మెసేజ్లు, కాల్స్ పూర్తిగా నకిలీవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దయచేసి అలాంటి కాల్స్కు ఎవరూ స్పందించకండి. ఇలా ఒకరి పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడటం సైబర్ నేరం అవుతుందని గుర్తుచేస్తున్నాను. ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ వస్తే.. డైరెక్ట్గా నన్ను లేదా నా టీమ్ను సంప్రదించండి. ఇలాంటి మోసపూరిత, తప్పుదారి పట్టించే కార్యకలాపాలలో పాల్గొన్న వారి పట్ల తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఆన్లైన్లో ఇలాంటి వారితో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. 'అని ఆమె పేర్కొన్నారు.కాంతార చాప్టర్ 1 విజయం తర్వాత రుక్మిణి వసంత్ చేతిలో భారీగా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లో ఆమె బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు మణిరత్నం- విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ చేయబోతుంది. కన్నడ హీరో యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా రుక్మిణి నటిస్తుంది. ఈ మూవీని గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్నారు.🚨 Important Alert & Awareness Message 🚨It has come to my attention that an individual using the number 9445893273 is impersonating me and reaching out to various people under false pretenses.I want to clarify that this number does not belong to me, and any messages or calls…— rukmini (@rukminitweets) November 7, 2025 -
రీల్స్ నుంచి హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ
తమిళ నటి మృణాళిని రవి(Mirnalini Ravi) లగ్జరీ కారు కొనుగోలు చేసింది. లిమిటెడ్ ఎడిషన్లో మాత్రమే అందుబాటులో ఉన్న కారును కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో డబ్స్మాష్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఉన్న మృణాళిని రవికి దర్శకుడు త్యాగరాజన్ కుమార్ తొలి ఛాన్స్ ఇచ్చారు. 2019లో విడుదలైన సూపర్ డీలక్స్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో ఆమె నటించింది. అయితే, ఆమెకు వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో ఛాన్స్ దక్కడంతో పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా తన మార్కెట్ను పెంచుకుంది.ఫ్రీడమ్ NU పేరుతో ఒక ఈవెంట్ను నిర్వహించి మహీంద్రా కంపెనీ ఈ కారును విడుదల చేసింది. సరికొత్త టెక్నాలజీతో పాటు లేటెస్ట్ డిజైన్లో మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కారును మృణాళిని రవి కొనుగోలు చేసింది. మహీంద్రా BE6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను ఆగష్టులో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కార్ల అమ్మకం లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రీసెంట్గా మార్కెట్లోకి వచ్చాయి. ఆ కారు మోడల్ను దక్కించుకున్న మొదటి వ్యక్తిగా మృణాళిని రికార్డ్ క్రియేట్ చేసింది.కారు మోడల్ బాగున్నడంతో చాలామంది ధర గురించి వెతుకుతున్నారు. సరికొత్త ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర రూ. 28 లక్షల వరకు ఉంది. బ్యాట్మ్యాన్ ఎడిషన్ BE6 మోడల్ కారును ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లతో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా కొనుగోలు చేశారు. అయితే, దక్షిణాది నటీనటుల్లో ఈ కారు సొంతం చేసుకున్న తొలి సినీ నటి మృణాళిని మాత్రమే . ఈ కారు కేవలం 6.7 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలుపుతుంది. నాలుగు డ్రైవింగ్ మోడ్ల్స్ను అందుబాటులోకి తెచ్చింది. డిఫాల్ట్, రేంజ్, ఎవ్రీడే, రేస్ అందుబాటులో ఉన్నాయి. అయితే, బ్యాట్మ్యాన్ ఎడిషన్ మాత్రమే లిమిటెడ్ అని కంపెనీ పేర్కొంది.2019లో కోలీవుడ్ నుంచి సూపర్ డీలక్స్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాళిని రవి.. తెలుగులో గద్దల కొండ సినిమాతో బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ఛాంపియన్, ఎనిమీ, కోబ్రా, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర, రోమియో సినిమాలతో టాలీవుడ్కు మరింత దగ్గరైంది. రీసెంట్గా విజయ్ ఆంటోనీతో లవ్గురు సినిమాతో మెప్పించింది. View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) -
విజయ్ సేతుపతి, రుక్మిణిలతో ప్రేమకథ
మణిరత్నం తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారన్నది ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత రేంజ్లో విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న మణిరత్నం తాజాగా ఒక ప్రేమ కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు ఇందులో నటుడు దృవ్ విక్రమ్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ కాంబినేషన్కు బ్రేక్ పడింది. దీంతో శింబుతో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం వైరల్ అవుతోంది. అయితే శింబు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న అరసన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా నటుడు విజయ్సేతుపతి ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్సేతుపతి ఇంతకు ముందు నవాబ్ అనే చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. తాజాగా రెండోసారి మణిరత్నం, విజయ్సేతుపతి కాంబో రిపీట్ కానుందన్నమాట. ఇకపోతే ఇందులో ప్రస్తుతం పుల్ ఫామ్లో ఉన్న నటి రుక్మిణి వసంత్ను నాయకిగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా రుక్మిణి వసంత్ కోలీవుడ్కు పరిచయమైంది విజయ్సేతుపతి హీరోగా నటించిన ఏస్ ద్వారా అన్నది గమనార్హం. దీంతో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా విజయ్సేతుపతి ప్రస్తుతం బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతోపాటు, తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
అందమైన ప్రయాణం
దీప్సిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రమణి కళ్యాణం’(Ramani Kalyanam). ‘కోర్ట్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.ఈ చిత్రం టైటిల్ లుక్ని కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జీవీ ప్రకాశ్కుమార్ తదితర ప్రముఖులు ఆవిష్కరించి, యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘జీవితంలో ఎదురయ్యే సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, బలమైన భావోద్వేగాలతో సాగే అందమైన ప్రయాణంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా!
‘చికిరి చికిరి...’ అంటూ హుషారైన స్టెప్పులేశారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి...’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్ని శుక్రవారం విడుదల చేశారు.‘చికిరి చికిరి... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...’ అంటూ ఈ పాట సాగుతుంది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటని మోహిత్ చౌహాన్ పాడగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫోక్ ఎనర్జీ, మోడ్రన్ బీట్స్తో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట అదిరిపోతుంది. రామ్చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూమెంట్స్, హుక్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్రేస్, చార్మ్ అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
రాజ్తో సమంత డేటింగ్.. ఈ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందిగా!
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత (samantha) పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఏ ఈవెంట్కెళ్లినా అతను కూడా వాలిపోతున్నాడు. గత కొన్ని నెలలుగా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటిపై ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల సమంత కొత్త సినిమా ప్రారంభోత్సంలోనూ అతను కనిపించాడు.తాజాగా మరోసారి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. అయితే ఎప్పటిలాగా కంటే ఈ సారి మరింత సన్నిహితంగా మెలిగారు. ఈ ఫోటోల్లో రాజ్ నిడిమోరును హగ్ చేసుకోవడం పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో అందరూ ఊహించినట్లుగానే రాజ్తో సామ్ డేటింగ్ చేస్తోందని కన్ఫామ్ చేసిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రాజ్ నిడిమోరు, సామ్ ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత సామ్, రాజ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ఏడాది సమంత నిర్మించిన శుభం మూవీకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రస్తుతం సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీకి కూడా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఇప్పటికే పలు మలయాళ మూవీస్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో చిత్రం సినీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. మలయాళంంలో హిట్ అయిన కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో సందడి చేయనుంది. సెన్నా హెగ్డే దర్శకత్వంలో వచ్చిన అవిహితం అనే బ్లాక్ కామెడీ మూవీ జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 14 నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఉన్నిరాజ్, రెంజి కంకోల్, వినీత్ చాక్యార్, రాకేష్ ఉషార్, ధనేష్ కోలియత్, అజిత్ పున్నద్, బృందా మీనన్ కీలక పాత్రలు పోషించారు. Avihitham – Not just a man’s right.Streaming exclusively on JioHotstar from November 14th.#Avihitham #AvihithamOnHotstar #Comedy #Family #Drama #JioHotstar #JioHotstarMalayalam pic.twitter.com/ZikNnucPFg— JioHotstar Malayalam (@JioHotstarMal) November 7, 2025 -
కిచ్చా సుదీప్ యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది!
కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తోన్న తాజా చిత్రం మార్క్. ఈ యాక్షన్ ఓరియంటెడ్ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మార్క్ ఇంట్రో పేరుతో పవర్ఫుల్ యాక్షన్ టీజర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ యాక్షన్, ఫైట్స్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీతో సుదీప్ సరికొత్త మార్క్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కాగా.. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. Here it is,, The Teaser,, a small sneek peek into the world of#MarkTheFilm.This Christmas. https://t.co/bLprnhCXL7 @VKartikeyaa @AJANEESHB @iampriya06 @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @kevinkumarrrr @subbu6panchu @iYogiBabu @Naveenc212 @gurusoms…— Kichcha Sudeepa (@KicchaSudeep) November 7, 2025 -
‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ
సాత్విక్ వర్మ, ప్రీతీ నేహా జంటగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల చేసీన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని పాటలకు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాలతో నేడు(నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హీరో(సాత్విక్ వర్మ).. తొలి చూపులోనే హీరోయిన్(సాత్విక్ వర్మ)తో ప్రేమలో పడిపోతాడు. అందరు ప్రపోజ్ చేసినట్లుగా కాకుండా కాస్త వెరైటీగా తన ప్రేమ విషయాన్ని వ్యక్తం చేస్తాడు. ‘నీతో రొమాన్స్ చేయాలని ఉంది’ అనే ప్రపోజల్ పెడతాడు. హీరోయిన్ మాత్రం మనోడి ప్రపోజల్ని సిల్లీగా తీసుకొని.. స్నేహితులతో కలిసి కాలేజీకీ వెళ్తుంది. సాత్విక్ టైమ్ టేబుల్ వేసుకొని మరీ ఆమెను ఫాలో అవుతుంటాడు. నాన్నకు తెలిస్తే ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందోనని భయపడి.. సాత్విక్ అడిగినట్లుగా రొమాన్స్కి ఓకే చెబుతుంది.కానీ ఒక కండీషన్ పెడుతుంది. అదేంటి? ప్రాణంగా ప్రేమించిన సాత్విక్ని ప్రీతీ ఎందుకు దూరం పెట్టింది? చాలా మంది అమ్మాయిలు ఉన్నా...సాత్విక్ ప్రీతీని మాత్రమే ఎందుకు ఇష్టపడ్డాడు? వీరిద్ధరి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ప్రీతి రాకతో సాత్విక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమ్మాయి కోసం పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? తనది లస్ట్ కాదని నిజమైన ప్రేమ అని నిరూపించుకునేందుకు ఏం చేశాడు? కొడుకుని కాపాడుకునేందుకు తల్లి శారద ఎం చేసింది? భర్తతో లండన్ వెళ్లాల్సిన ప్రీతికి చివరి నిమిషంలో తెలిసిన అసలు నిజం ఏంటి? ఇంతకీ సాత్విక్ని నిజమైన ప్రేమేనా లేదా వ్యామోహమా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరిని ప్రేమిస్తున్నారంటే..అందులో కోరిక కూడా ఉంటుంది. లవ్ ఉన్న చోట లస్ట్ కూడా ఉంటుందని చాటి చెప్పే చిత్రమిది. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో కాస్త బోల్డ్గా చూపించారు దర్శకుడు. సినిమా ప్రారంభంలో హీరోది నిజంగానే కోరిక అనుకుంటాం. అతని ప్రవర్తన చూసి కోపం, అసహ్యం కూడా కలుగుతుంది. కానీ రాను రాను ఇది కూడా ప్రేమలో ఒక భాగమే కదా.. తప్పు ఎందుకు అవుతుందనే భావన కలుగుతుంది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ దాని చుట్టు అల్లుకున్న సీన్లు..డైలాగులు.. అన్నీ బాగున్నాయి. కథను ముందు వెనక్కీ నడుపుతూ రాసుకున్న స్క్రీన్ప్లే కథపై ఆసక్తిని పెంచేలా చేసింది. ఒక ఎమోషనల్ సీన్తో కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ వెంటనే ప్లాష్బ్యాక్లోకి వెళ్లి లవ్స్టోరీని చూపించాడు. హీరోయిన్తో తొలి చూపులోనే ప్రేమలో పడడం.. రొమాన్స్ చేయాలని ఉందంటూ వెంటపడడం.. ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లడం.. ఎంగిలి తినడం..ఇవన్నీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తాయి. అమ్మాయి రొమాన్స్ ఒప్పుకోవడంతో కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అమ్మాయి ఎందుకు అంతగా అసహ్యయించుకుంది? ఆస్పత్రిలో రొమాన్స్ తర్వాత ఏం జరిగిందనేది ముందే చెప్పకుండా..ప్రస్తుతాన్ని, ప్లాష్బ్యాక్ని మిక్స్ చేసి కథను చెబుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే..ఫ్యూజులు ఎగిరిపోతాయి.ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ సాగితే.. సెకండాఫ్ ఎమోషనల్గా సాగుతుంది. కొడుకును కాపాడుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాలు, అమ్మాయి ప్రేమ కోసం హీరో పడే తాపత్రాయాలు భావోద్వేగానికి లోను చేస్తాయి. ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్గా సాగుతుంది. తనది నిజమైన ప్రేమ అని తెలిసిన తర్వాత హీరో తీసుకునే నిర్ణయం, ఈ క్రమంలో వచ్చే సంబాషణలు అదిరిపోతాయి . అసలైన ప్రేమ అంటే ఏంటి? లవ్కి లస్ట్కి తేడా ఏంటి? అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. క్లైమాక్స్ కి ముందు వచ్చే చిన్న చిన్న ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై కనిపించని ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను కాస్త బోల్డ్గా చెప్పారు. నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ కథకు అవసరం కాబట్టి దాన్ని భరించొచ్చు. యూత్తో పాటు లవ్లో ఉన్న వారందరికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే..చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించిన సాత్విక్ వర్మ ఇందులో హీరో పాత్రను పోషించాడు. పిచ్చి ప్రేమికుడిగా ఆయన ఫెర్మార్మెన్స్ అదరగొట్టేశాడు. ఆయన పాత్ర ప్రవర్తన తీరు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్రాల్లోని హీరో పాత్రలను గుర్తుకు తెస్తుంది. రొమాంటిక్తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ప్రీతీ నేహా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించడమే కాకుండా..నటనతోనూ ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమే నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అతికించినట్లుగా కాకుండా కథలో భాగంగానే వస్తుంటాయి. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
లెజెండ్ హీరోయిన్ పవర్ఫుల్ రోల్.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్!
లెజెండ్ హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం సాలీ మొహబ్బత్. ఈ మూవీలో మరోసారి పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాకు టిస్కా చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. గతేడాది రిలీజవుతుందని ప్రకటించిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేటర్లకు రాలేదు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. సాలీ మొహబ్బత్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మూవీని త్వరలోనే జీ5 వేదికగా మీ ముందుకు రానుందని ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్ సమర్పణలో స్టేజ్5 ప్రొడక్షన్ బ్యానర్లో జ్యోతి దేశ్పాండే, దినేశ్ మల్హోత్రా, మనీశ్ మల్హోత్రా నిర్మించారు. Kabhi dard, toh kabhi sukoon deti hai..Yeh Saali Mohabbat na jaane kya kya karwati hai!#SaaliMohabbat, coming soon on #ZEE5#SaaliMohabbatOnZEE5@radhika_apte @divyenndu @anuragkashyap72 @anshumaanpushk1 #SauraseniMaitra #SharatSaxena @tiscatime #JyotiDeshpande… pic.twitter.com/WCnR9Sc9vg— Jio Studios (@jiostudios) November 7, 2025 -
'ఓజీ' సుజీత్ డైరెక్షన్లో సచిన్.. ఫొటోలు వైరల్
రెండు నెలల క్రితం 'ఓజీ' సినిమాతో సక్సెస్ అందుకున్న తెలుగు దర్శకుడు సుజీత్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఏకంగా దిగ్గజ సచిన్తో తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. అలా అన్నీ కలిసొచ్చాయని రాసుకొచ్చాడు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)రన్ రాజా రన్, సాహో, ఓజీ సినిమాలతో టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం నానితో ఓ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు గానీ కొన్నిరోజుల క్రితమే అధికారికంగా పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత సుజీత్ దర్శకత్వంలో నటిస్తాడు.మరి అంతలోపు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడేమో గానీ సుజీత్.. కమర్షియల్ యాడ్ షూట్ తీశాడు. ఓ పెయిటింగ్ సంస్థకు సంబంధించిన యాడ్ ఇది కాగా.. ఇందులో దిగ్గజ సచిన్ టెండూల్కర్ యాక్ట్ చేశారు. గతవారం విదేశాల్లో దీన్ని చిత్రీకరించారు. ఆ షూటింగ్ జ్ఞాపకాలని సుజీత్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
సమంత గ్లామర్.. పాతకాలం హీరోయిన్లా రుక్మిణి
ఓ రేంజు గ్లామర్ చూపించేస్తున్న సమంతపాతకాలం హీరోయిన్లా రుక్మిణి వసంత్మోడ్రన్ డ్రస్సులో మాయ చేసేలా రకుల్ ప్రీత్రష్మిక మందాన 'ద గర్ల్ఫ్రెండ్' జ్ఞాపకాలుకాంత ప్రమోషన్లలో అందంగా భాగ్యశ్రీ బోర్సేబెంజ్ కారుపై రొమాంటిక్ పోజులతో అషూరెడ్డి View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Prem Jacob (@premtheactor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
సంక్రాంతికి వస్తున్నాం మూవీ అరుదైన ఘనత!
అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలకు ఎంపికైంది. ఈ నెల 20న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) అవార్డుల వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇండియన్ పనోరమ(ఫీచర్ ఫిల్మ్స్) విభాగంలో అఫీషియల్గా ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్లో సరికొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేసిందని మేకర్స్ ట్వీట్ చేశారు.అంతేకాకుండా ఇవాళ పలు అవార్డులకు నామినేట్ వారి జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో టాలీవుడ్ డైరెక్టర్ యదు వంశీ నామినేట్ అయ్యారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికిగానూ ఆయనకు నామినేషన్ దక్కింది. ఇదే విభాగంలో.. మలయాళం నుంచి జితిన్లాల్ (ఎ.ఆర్.ఎం), హిందీ నుంచి కరణ్ సింగ్త్యాగి (కేసరి చాప్టర్ 2) బెంగాలీ నుంచి రామ్ కమల్ ముఖర్జీ (బినోదిని)పోటీపడుతున్నారు.#SankranthikiVasthunam has been officially selected for the Indian Panorama (Feature Films) at the International Film Festival of India (IFFI) 2025 ❤️🔥❤️🔥❤️🔥Another remarkable milestone for a film that set a new benchmark for regional films in TFI 💥An @AnilRavipudi film 🔥… pic.twitter.com/eMP57q7Zw9— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2025 -
మోహన్ లాల్ ఫ్యాన్స్కు మళ్లీ నిరాశే.. ఆ సినిమా వాయిదా!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రంపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. మొదట అక్టోబర్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఏమైందో గానీ విడుదల వాయిదా వేశారు.ఆ తర్వాత మరో డేట్ను రివీల్ చేశారు. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఈ డేట్లో కూడా రిలీజ్ చేయలేదు. తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. ఇక ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఓ వీడియోను పంచుకున్నారు. ఈ డేట్లోనైనా రిలీజ్ కానుందా? లేదంటే మళ్లీ సంక్రాంతికి పోస్ట్పోన్ అవుతుందా? అనేది తెలియాలంటే క్రిస్మస్ వరకు ఆగాల్సిందే.కాగా.. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. Some stories are more than cinema, they’re legacies. This Christmas, witness that legacy roar to life in #Vrusshabha.A film that celebrates emotion, grandeur, and destiny. Releasing worldwide on 25th December 2025.#RoarOfVrusshabha #VrusshabhaOn25thDecember #SamarjitLankesh… pic.twitter.com/Dq5yPhYHoQ— Mohanlal (@Mohanlal) November 7, 2025 -
ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో థ్రిల్లర్ లేదంటే హారర్ సినిమాలని ఎక్కువగా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు డిఫరెంట్ హారర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. తెలుగులో మాత్రం వివిధ భాషల్లోనూ ఈ జానర్ మూవీస్ హిట్ ఫార్ములానే. అలా ఈ ఏడాది జూన్లో రిలీజైన ఓ మరాఠీ హారర్.. ఇన్నాళ్లకు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి మూవీ స్పెషాలిటీ? ఎందులో చూడొచ్చు.(ఇదీ చదవండి: 'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?)ఈ ఏడాది జూన్లో థియేటర్లలో రిలీజైన మరాఠీ సినిమా 'జారన్'. మరాఠీ భాషలో ఈ టైటిల్కి అర్థం చేతబడి. పేరుకి తగ్గట్లే మొత్తం బ్లాక్ మ్యాజిక్ తరహా సీన్స్ ఉంటాయి. ఇది ఆగస్టులోనే జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే హిందీలో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ని కూడా తీసుకొచ్చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సైకలాజికల్ హారర్ చిత్రాలంటే ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయండి.'జారన్' విషయానికొస్తే.. రాధ(అమృత సుభాష్)కు భర్త, కుమార్తె ఉంటారు. బతకడం అయితే బతుకుతూ ఉంటుంది గానీ ఈమె ఇంట్లో ఏ మాత్రం ప్రశాంతత, సంతోషం అనేది ఉండదు. దానికి కారణం చేతబడి. రాధ కుటుంబాన్ని ఎవరో చేతబడి చేస్తారు. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి రాధ.. ఈ సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అసలు రాధకు ఎవరు ఇలా చేతబడి చేశారు? ఆమె కుటుంబంపై ఎవరికి పగ ఉంది? ఎందుకు ఉంది? చివరకు ఏమైందనేదే అసలు స్టోరీ.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ) -
'ఆర్యన్' రివ్యూ.. థ్రిల్లర్ సినిమా ఎలా ఉంది?
'రాక్షసుడు' అనే తమిళ సినిమాతో మన ప్రేక్షకులకు కాస్త పరిచయమైన యంగ్ హీరో విష్ణు విశాల్. మట్టీ కుస్తీ, అరణ్య లాంటి తెలుగు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ తర్వాత 'రాక్షసుడు' తరహా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్తో వచ్చాడు. అదే 'ఆర్యన్'. తమిళంలో గత వారం రిలీజ్ కాగా.. ఇప్పుడు(నవంబరు 07) తెలుగులోనూ థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ)కథేంటి?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి... ప్రముఖ న్యూస్ ఛానెల్లో నయన(శ్రద్ధా శ్రీనాథ్) హోస్ట్ చేస్తున్న షోకి వస్తాడు. గన్తో అందరినీ బెదిరించి భయపెట్టేస్తాడు. తను ఓ ఫెయిల్యూర్ రచయితనని ఓ థ్రిల్లింగ్ కథ చెబుతానని అంటాడు. రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని.. ఎవరో చెప్పి మరీ చంపేస్తానని చెబుతాడు. అలా చెప్పిన కాసేపటికే గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కేసుని పైఅధికారులు.. పోలీసాఫీసర్ నంది(విష్ణు విశాల్)కి అప్పజెబుతారు. చెప్పినట్లే ఆత్రేయ చనిపోయినా వరస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆత్రేయ ఎవరు? వీళ్లనే ఎందుకు చంపుతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఓ ఫార్మాట్ ఉంటుంది. హత్యలు చేసే విలన్ని చివర్లో చూపిస్తారు లేదంటే విలన్ని ఇంటర్వెల్లో బయటపెడతారు. ఇదీ కాదంటే ప్రారంభంలోనే విలన్ ఎవరో రివీల్ చేసేసి దొంగ పోలీస్ గేమ్ తరహాలో స్టోరీని నడిపిస్తాడు. ఇవన్నీ కాకుండా సరికొత్తగా తీయొచ్చా అంటే తీయొచ్చు. అదే విషయాన్ని 'ఆర్యన్' దర్శకుడు నిరూపించి చూపించాడు.న్యూస్ ఛానల్ లైవ్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తర్వాత ఐదు రోజుల్లో మనుషుల్ని చంపడం అనే డిఫరెంట్ పాయింట్తో ఈ సినిమా తీశారు. వినడానికి బాగానే ఉంది గానీ మూవీ ఎలా తీశారా అంటే అదిరిపోయిందనే చెప్పొచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్గా అయితే మంచి థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.హీరో ఎవరో తెలుసు. విలన్ ఎవరో తెలుసు. మరోవైపు హత్యలు జరుగుతుంటాయి. పోని చనిపోతున్నవాళ్లు చెడ్డవాళ్లా అంటే కాదు. అందరూ మంచివాళ్లు. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడేవాళ్లు. అలాంటి వాళ్లని ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాన్ని క్లైమాక్స్ వరకు పట్టుసడలకుండా అద్భుతంగా చూపించారు. 'రాక్షసుడు' అంత కాకపోయినప్పటికీ 'ఆర్యన్' కూడా బాగుంది.కథంతా సీరియస్ టెంపోలో వెళ్తున్న టైంలో హీరో, అతడి భార్యతో విడాకులు, కోర్టు వాదనలు ఈ సీన్స్ అన్నీ అనవసరం అనిపిస్తాయి. అసలు ఈ సన్నివేశాలు సినిమాలో లేకపోయినా సరే స్టోరీలా పెద్దగా పోయేదేం ఉండదు కదా అనిపిస్తుంది. సినిమా అంతా బాగానే ఉంటుంది గానీ క్లైమాక్స్లో ఈ హత్యల వెనక కారణం కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది. అదే విషయాన్ని విష్ణు విశాల్ పోషించిన నంది పాత్రతోనూ చెప్పించారు.ఎవరెలా చేశారు?నంది అనే పోలీసాఫీసర్గా విష్ణు విశాల్ అదరగొట్టేశాడు. ఫిజిక్, యాక్టింగ్ అన్నీ కూడా నిజంగానే పోలీస్ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించాయి. నయనగా చేసిన శ్రద్ధా శ్రీనాథ్, నంది భార్య అనితగా చేసిన మానస చౌదరివి సైడ్ క్యారెక్టర్స్ లాంటి పాత్రలు. చాలా పరిమితంగా సీన్స్ ఉంటాయి. విలన్ ఆత్రేయగా సెల్వ రాఘవన్ మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే.. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. జిబ్రాన్ ఈ విషయంలో అదరగొట్టేశాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే తెరపై సీన్, వెనక నేపథ్య సంగీతం వింటుంటే టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఆ రేంజ్ సౌండింగ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ డీసెంట్. డైరెక్టర్ ప్రవీణ్ వావ్ అనిపించాడు. ఓవరాల్గా సరికొత్త థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని మిస్ అవ్వొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ‘జటాధర’ మూవీ రివ్యూ) -
పొట్టి దుస్తులు వద్దని కన్నీళ్లు.. అనుష్క బర్త్డే స్పెషల్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ‘దేవసేన’కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన 'ఘాటీ' కాస్త నిరాశపరిచింది. కానీ, 'కతనార్' అనే లేడీ ఓరియెంటేడ్ మలయాళ సినిమాతో త్వరలో రానుంది. నేడు అనుష్క 44వ పుట్టినరోజు జరుపుకుంటుంది.నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. పొట్టి దుస్తులు వల్ల కన్నీళ్లు పెట్టుకున్న స్వీటీసినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న దేవసేన... 2005 సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా హోదా సంపాదించారు. పూరీ జగన్నాథ్ ‘సూపర్’లో నటించేందుకు హీరోయిన్ కోసం చూస్తున్న సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్గా పనిచేస్తున్న అనుష్క ఫోటో చూపించారు. అలా అనుష్కను పూరీ కలిశారు. సినిమా గురించి చర్చించిన తర్వాత ఆమె హైదరాబాద్కు రావడం ఆపై తొలి సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు. కెమెరా ముందు పొట్టి దుస్తులు వేసుకుని మొదట నటించాలంటే ఆమె చాలా ఇబ్బంది పడింది. ఈ క్రమంలో తాను చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే, చాలా పట్టుదలతో వాటిని ముందుకు వెళ్లానని చెప్పింది. బిల్లా సినిమాలో ఆమె ఏకంగా బికినీ ధరించి అందరికీ షాకిచ్చింది. మొదటిసారి పూరీ జగన్నాథ్ను కలవడాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పంచుకుంది. 2005లో తన జీవితాన్ని మార్చేసిన రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె చెప్పింది.సూపర్ చిత్రం తర్వాత ‘మహానంది’లో హీరో సుమంత్కు జోడిగా నటించింది అనుష్క. అయితే ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. మాస్ మహారాజా , రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’తో అనుష్క్కు స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్లాపులు పడినప్పటికీ.. 2009లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’తో అనుష్క జీవితమే మారిపోయింది. ఆ సినిమాలో యువరాణి జేజమ్మగా అనుష్క అభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.పేరు ఎందుకు మార్చుకుందిఅనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి అని చాలామందికి తెలుసు.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనే పేరును మార్చుకుంది. అనుష్కకు స్వీటీ అని తన పిన్ని పెట్టింది. అయితే, ఆ పేరును అమ్మవాళ్లు ప్రతి సంవత్సరం మారుస్తాం అని మాటిస్తూ పోయారని పదో తరగతి తర్వాత జరిగిన ఒక సంఘటనను ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇంటర్లో అడ్మిషన్ అప్పుడు అప్లికేషన్లో స్వీటీ అని రాస్తే ముద్దు పేరు బావుంది.. కానీ, అసలు పేరు రాయాలని వారు అన్నారు. ఆ మయంలోనే పేరు మార్చాలని తమ తల్లిందడ్రులను కోరినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత సెట్లో ‘స్వీటీ’ అని పిలుస్తుంటే బాగోలేదని కొందరు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకుంది. అయితే, ఈ పేరు అందరికీ అలవాటు అయేందుకు సుమారు ఏడాది కాలం పట్టినట్లు ఆమె చెప్పంది. -
Kamal Haasan: బార్బర్ షాపులో పనిచేసి.. విశ్వనటుడిగా ఎదిగి.. (ఫోటోలు)
-
రష్మిక మందన్నా లవ్ లెటర్.. నెట్టింట వైరల్
ది గర్ల్ఫ్రెండ్ సినిమా (The Girlfriend Movie)లో నటనకు రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు జాతీయ అవార్డు రావాల్సిందే! నిన్నటివరకు ఇది అల్లు అరవింద్ మాట.. కానీ, ఈ సినిమా చూశాక చాలామందిదీ ఇదే మాట! రష్మికకు అవార్డు ఇచ్చి తీరాల్సిందే.. అంత అద్భుతంగా నటించింది అని కొనియాడుతున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్. మీ అందరికీ నా ప్రేమలేఖరాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (నవంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ లవ్ లెటర్ రాసింది. అమ్మాయిలందరికీ దాన్ని అంకితమిచ్చింది. అందులో ఏముందంటే.. స్త్రీగా ఎదుగుతున్న అమ్మాయిలందరికీ నా ప్రేమలేఖ.. 'నీకేం తెలుసు?' అన్న ప్రశ్న ఎదుర్కొనే ప్రతి అమ్మాయి 'తనకేం కావాలో బాగా తెలుసు' అనే స్థాయికి చేరుకుంటుంది. ఈ జర్నీ చిన్నదేమీ కాదు. ప్రేమ అంటే బంధీ అవడం కాదునువ్వు ఎంతోదూరం వచ్చావ్.. ఇప్పటికైనా నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను చూసి నువ్వు గర్వపడు. ఇలాంటి అమ్మాయిలకు అండగా నిలబడిన అబ్బాయిలు.. మీ ప్రేమ వల్లే తాను ఇంత ధైర్యంగా నిలబడగలిగింది. ప్రేమలో ఎవరూ మాట్లాడని విషయాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ప్రేమ అంటే హద్దులు గీసుకుని బంధీ అవడం కాదు, స్వేచ్ఛగా జీవించడం.. ఎన్ని గాయాలైనా సరే.. మనసును తేలిక చేసుకుని ధైర్యంగా ముందుకు సాగడం. మిమ్మల్ని మీరు ప్రేమించండినా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ మనసును తాకుతుందని, మీ బలాన్ని మీకు గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారని అనుకుంటున్నాను. అదే గనక నిజమైతే నా ఆశయం నెరవేరినట్లే! నిశ్శబ్ధాన్ని చీల్చుకుని ధృడసంకల్పంతో ముందడుగు వేసేవారికి.. వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే వారికోసమే నా ఈ ప్రేమలేఖ అని ట్వీట్ చేసింది. ఈ లవ్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. A love letter to all the girlies growing into the woman they love.To every Girl who was told “what do you know”… and yet grew into a woman “who knows what she wants”.You’ve come a long way, give yourself that proud, tight Hug🫂 And to the men who’ve loved, not by leading,…— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ రివ్యూ -
చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)
-
ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి
తమిళ సినిమా '96'తో తెలుగువారికి పరిచయమైన గౌరీ కిషన్(Gouri Kishan )కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్ ప్రమోషన్స్లో భాగంగా మూవీ యూనిట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో తన బరువు గురించి అవమానకరమైన ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆపై తన ప్రశ్నను అతను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేయడంతో గౌరీ కూడా ఫైర్ అయింది. దీంతో ఆమెకు నెటిజన్లు మద్ధతుగా నిలిచారు.తమిళ, మలయాళ చిత్రాలతో గౌరీ కిషన్ ఫుల్ బిజీగా ఉంది. అబిన్ హరికరణ్ దర్శకత్వంలో తను నటిస్తున్న కొత్త చిత్రం ‘అదర్స్’ త్వరలో విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రెస్మీట్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ ‘మీ బరువు ఎంత ఉంటుంది..?’ అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు గౌరీ అసహనం వ్యక్తం చేయడంతో ఆ జర్నలిస్ట్ కూడా తన ప్రశ్నను సమర్థించుకుంటూ మరోసారి అడిగాడు. ఈ ప్రశ్నకు గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా సమాధానం చెప్పారని వాయిస్ పెంచాడు. నా బరువుతో మీకేంటి అవసరందీంతో గౌరీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'నా బరువు గురించి నాతో చర్చించే హక్కు దర్శకుడికి ఉంది. కానీ, ఒక జర్నలిస్ట్గా మీకేంటి అవసరం..? స్త్రీ శరీరం చాలా సంక్లిష్టమైనది, హార్మోన్ల అసమతుల్యతతో ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండానే, నా బరువు గురించి అడగడానికి మీరు ఎవరు.. నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు..? నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టం జరిగిందా..? ఇప్పటికి నేను చాలా సినిమాలు చేశాను. నా ప్రతిభ గురించి అడగండి. కనీసం ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి అడగరెందుకు..' అని ఆమె ఫైర్ అయింది. ఆ జర్నలిస్ట్ కూడా తన తప్పును తెలుసుకుని ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆమెను బాడీ షేమింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని గౌరీ కిషన్ చెప్పింది. తాను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చానని తెలిపింది. కానీ, ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టిక్ నీతిని పాటించవని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్ సందర్భంగా తనను ఇలా ఇబ్బంది పెట్టడం బాధ అనిపించినప్పటికీ వారి పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆమె స్పష్టం చేసింది.96 సినిమా త్రిష చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఇదే మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలైంది. ఆమె ఇందులో కూడా నటించిది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.நடிகையிடம் அநாகரிக கேள்வி எழுப்பிய யூடியூபர்.. தனி ஆளாக தரமான பதிலடி கொடுத்த நடிகை கௌரி கிஷன்....!#Polimer | #Chennai | #Actress | #Movie | #GouriGKishan pic.twitter.com/4qkQqGVYyw— Polimer News (@polimernews) November 6, 2025 -
'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్ ఈవెంట్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)
-
ది గర్ల్ఫ్రెండ్ చూసి నా భార్య, నేను ఎమోషనలయ్యాం!
‘‘తెలుగులో నేను అంగీకరించిన తొలి సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend Movie). కాకపోతే ‘ఖుషి’ తో నా ఎంట్రీ జరిగింది. ‘ఖుషి, హాయ్ నాన్న, మనమే, 8 వసంతాలు’... ఇలా నా మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రాలతో పోల్చినప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి కాస్త విభిన్నమైన సంగీతం అందించాను. ఎందుకంటే... ఇది ఇంటెన్స్ లవ్స్టోరీ’’ అని చెప్పారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab). రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నా భార్యతో సినిమా చూశా..రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు, నేటి తరం యువత, తల్లిదండ్రులు ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను కచ్చితంగా చూడాలన్నది నా అభిప్రాయం. నా భార్యతో కలిసి నేను ఈ సినిమా చూశాను. మేం భావోద్వేగానికి లోనయ్యాం. నేటి సమాజంలోని ఓ అంశాన్ని ప్రస్తావించారు రాహుల్ రవీంద్రన్. రష్మిక, దీక్షిత్ అద్భుతంగా నటించారు. సంగీతానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు. ఆ సినిమాకు ఏఐ వాడా..కానీ సినిమా మేకింగ్ ప్రాసెస్లో కొంత ఏఐ వాడాం. ‘హాయ్ నాన్న’ సినిమాకు సంగీతంలో ఏఐ వాడాను. ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నాను. తమిళంలో ఓ సినిమాకు, కన్నడంలో గణేశ్గారి సినిమాకు సంగీతం అందిస్తున్నాను. కన్నడలో నా తొలి మూవీ ఇది. హిందీలో నా తొలి సినిమా ఖరారైంది. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది’’ అని చెప్పారు.చదవండి: సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్క ట్వీట్తో.. -
కాంత ట్రైలర్ లాంచ్.. ఒకే వేదికపై దుల్కర్, రానా (ఫోటోలు)
-
"పుష్ప ది ఎపిక్" కమింగ్ సూన్..
-
Disha: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ప్రభాస్ వల్ల నేను కంట్రోల్ తప్పా..!
-
ఇక దుల్కర్ని నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా
‘‘కాంత’ చిత్రం ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని థియేటర్స్లో చూస్తే గొప్ప అనుభూతినిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ఎనర్జీ ఓ రేంజ్లో ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని దుల్కర్ సల్మాన్ చెప్పారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ని హీరో ప్రభాస్ లాంచ్ చేశారు.అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. అలాంటి నేపథ్యంలో సెల్వ చెప్పిన ‘కాంత’ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనిపించింది. ఈ నెల 14 తర్వాత దుల్కర్ని అందరూ నట చక్రవర్తి అని పిలుస్తారు’’ అని చెప్పారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకు నా సినిమాలు చూశారు. ఈ చిత్రంలో నా నటన చూస్తారు’’ అన్నారు.‘‘కాంత’లో నటించడం గర్వంగా ఉంది’’ అన్నారు సముద్ర ఖని. ‘‘ఈ సినిమా విడుదలైన రోజునే మీ అందరితో కలిసి సినిమా చూడాలని ఉంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ తెలిపారు. ‘‘ఈ చిత్రానికి ప్రాణంపోసి మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ప్రశాంత్ పొట్లూరి పేర్కొన్నారు. -
బీస్ట్ మోడ్కి సిద్ధం
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా షూటింగ్కి కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్కు సంబంధించిన చర్చలు, ఎన్టీఆర్ మేకోవర్పై వర్క్ జరుగుతోంది.‘‘సిద్ధం అవుతున్నాను’’ అంటూ తన ఇన్స్టా స్టోరీలో ప్రశాంత్ నీల్తో ఉన్న ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. ‘‘బీస్ట్ మోడ్ మళ్లీ మొదలవుతుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే..‘ఎన్టీఆర్నీల్’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్. -
మంచు లక్ష్మీ యోగాసనాలు.. కలర్ఫుల్ డ్రెస్లో దేవర భామ!
పారిస్లో చిల్ అవుతోన్న నటి శాన్వి మేఘన.. మహారాణి జ్ఞాపకాల్లో శ్వేతాబసు ప్రసాద్.. కలర్ఫుల్ డ్రెస్లో జాన్వీ కపూర్ పోజులు.. వెకేషన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న నిషా అగర్వాల్.. టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ యోగాసనాలు.. View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
శ్రీలీల క్రేజీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) , శ్రీలీల(Sreeleela) హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సింగారాల సీతాకోకవే అంటూ రొమాంటిక్ లవ్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. ఎల్వీ రేవంత్, ఢీ, సీ రోల్డాన్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజికల్ లవర్స్ను తెగ అలరిస్తోంది. ఇందులో రవిమోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. -
ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్.. ఎమోషనల్ సాంగ్ ఫుల్ వీడియో!
లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. బాగుండు పో.. అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ ఎమోషనల్ లవ్ సాంగ్కు రాజజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజీత్ హెగ్డే, సాయి అభ్యంకర్ ఆలపించారు. ఈ పాటను సాయి అభ్యంకర్ కంపోజ్ చేశారు. కాగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. -
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ
మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోనటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులునిర్మాణ సంస్థ: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్నిర్మాత: అగరం సందీప్రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్సంగీతం: సురేష్ బొబ్బిలిసినిమాటోగ్రఫి: సోమశేఖర్ఎడిటర్: నరేష్ అడుపవిడుదల తేది: నవంబర్ 7, 2025కథేంటంటే.. విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్(తీరువీర్) ఓ ఫోటోగ్రాఫర్. ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తుంటాడు. అతని అసిస్టెంట్ రామ్(రోహన్ రాయ్)కి పనిమీద కంటే తిండిమీదే ధ్యాస ఎక్కువ. రామ్ చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా..తన స్టూడియోకి ఎదురుగా ఉన్న పంజాయితీ ఆఫీస్లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు రమేశ్. హేమకు కూడా రమేశ్ అంటే ఇష్టమే కానీ..ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు. కట్ చేస్తే.. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్(నరేంద్ర రవి) రమేశ్ స్టూడియో దగ్గరకు వచ్చి.. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ చేయాలని అడ్వాన్స్ ఇచ్చివెళ్లిపోతారు. ఔట్డోర్లో షూటింగ్ అంటే..తనకు కాబోయే భార్య సౌందర్య(యామిని)తీసుకొని జిల్లాకు వెళ్తాడు. దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేయించి..షూట్ కంప్లీట్ చేస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్ని తన అసిస్టెంట్ రామ్ కి ఇచ్చి..స్టూడియోలో పెట్టమని చెప్తాడు. పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టని రామ్.. ఆ చిప్ని ఎక్కడో పారేస్తాడు. ఈ విషయం ఆనంద్కు తెలిస్తే..ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో రమేశ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? తన నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత రమేశ్ ఏం చేశాడు? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏంటి? రమేశ్ తీసుకున్న నిర్ణయం ఆయనతో పాటు ఆనంద్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు రమేశ్కు హేమ ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఆనంద్, సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద కథ అవరసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా సరే.. చెప్పాలనుకునే పాయింట్ని సిన్సియర్గా తెరపై చూపిస్తే చాలు.. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ కథను ఎంచుకొని.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ జోలికి పోకుండా.. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. స్టార్స్ని కాకుండా కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది? సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుందనే విషయాన్ని కామెడీ వేలో చక్కగా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ.. అవి అలా గుర్తిండిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఆనంద్, సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్.. చిప్ పోవడం.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు...ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. పెళ్లి చెడగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు..కొంతవరకు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్లో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లను కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే..ఆలోచింపజేస్తూంది. ఆటో సీన్తో అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా చూస్తే.. అందరికీ నచ్చేస్తుంది. కామెడీ పేరుతో వల్గారిటీని చూపిస్తున్న ఈ రోజుల్లో.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడంలో తీరువీర్ దిట్ట. ఈ సారి కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫోటోగ్రాఫర్ రమేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై అమాయకత్వంగా కనిపిస్తూనే..హీరోయిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర నరేంద్ర రవిది. పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో ఆయన జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. హేమా పాత్రకు టీనా శ్రావ్య న్యాయం చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
శుక్రవారం సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 17 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలా బాక్సాఫీస్ వద్ద సినిమాలు సందడి. అలా ఈ ఫ్రైడే సుధీర్ బాబు నటించిన జటాధర, రష్మిక ది గర్ల్ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా లాంటి చిత్రాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. వీటితో పాటు ఆర్యన్, ఫీనిక్స్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. వీటిలో ఒకట్రెండ్ చిత్రాలపైనే ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. వీటి సంగతి పక్కన పెడితే.. శుక్రవారం ఓటీటీల్లోనూ సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారంలో తెలుగులో చిరంజీవ మూవీ స్ట్రీమింగ్కు రానుంది. బాలీవుడ్ నుంచి ఏక్ చతుర్ నార్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు పలు హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా సందడి చేయనున్నాయి. మరి ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో తెలియాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్ ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) - నవంబరు 07 బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 07 ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 07 మ్యాంగో(హాలీవుడ్ మూవీ)- నవంబరు 07 యాజ్ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 07 గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07 జియో హాట్స్టార్ఆల్ హర్ ఫాల్ట్- (హాలీవుడ్ మూవీ)- నవంబరు 07అమెజాన్ ప్రైమ్ వీడియోమ్యాక్స్టన్ హాల్ (జర్మన్ సిరీస్) - నవంబరు 07ఆహా చిరంజీవ (తెలుగు చిత్రం) - నవంబరు 07జీ5 కిస్ (తమిళ సినిమా) - నవంబరు 07 తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07సోనీ లివ్ మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) - నవంబరు 07ఆపిల్ ప్లస్ టీవీ ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07మనోరమ మ్యాక్స్ కరమ్ (మలయాళ సినిమా) - నవంబరు 07లయన్స్ గేట్ ప్లే అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) - నవంబరు 07 ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - నవంబరు 07సన్ నెక్ట్స్ఎక్కా(కన్నడ సినిమా)- నవంబరు 07 -
'సినిమా తీయడం గొప్ప కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదన్నారు. మనం తీసిన సినిమాకు ఆడియన్స్ను రప్పించడమే అసలైన సవాల్ అని తెలిపారు. ప్రెస్మీట్స్ పెట్టి ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మీరిచ్చే కంటెంట్తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని సూచించారు. మార్నింగ్ షోకు ఆడియన్స్ తీసుకురావడమే గొప్పదనమన్నారు. మీడియా వాళ్లు కూడా పాజిటివ్గా రివ్యూలు ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలని దిల్ రాజు అన్నారు. మీరు అలా రాసినప్పుడే మార్నింగ్ ఫస్ట్ షోలకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ లాంఛ్కు హాజరైన దిల్ రాజు మాట్లాడారు.కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాలు తీయడాలు, ప్రెస్ మెట్లు పెట్టి ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు..మార్నింగ్ షోకు జనాలను తీసుకొచ్చి, సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప! - #DilRaju#SanthanaPrapthirasthu pic.twitter.com/MxmRCTmP9s— Suresh PRO (@SureshPRO_) November 6, 2025 -
మహిళా క్రికెటర్ కధతో సినిమా... నవంబరు 7న మళ్లీ విడుదల...
కళ అంటే కాసుల్ని మాత్రమే కాదు కలల్ని ఒడిసిపట్టేది కూడా. సినిమా అంటే వ్యాపారం కావచ్చు కానీ వ్యాపారం మాత్రమే కారాదు. దీన్ని గుర్తించిన సినీ రూపకర్తలకు డబ్బులకు మించిన ఆత్మసంతృప్తిని ఆనందాన్ని కొన్ని సినిమాలు అరుదుగానైనా అందిస్తాయి. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అండ్ టీమ్ ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. అవును . ప్రస్తుతం మహిళా క్రికెట్ విజయ విహారంలో ఊగిపోతున్న భారతావని సంబరంలో సగర్వంగా పాలు పంచుకోవడానికి వారికి సరైన కారణం ఉంది మరి.అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), సయామి ఖేర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఘూమర్’(Ghoomer Movie) ఈ నవంబర్ 7న తిరిగి థియేటర్లలోకి రానుంది. మాములూగా అయితే ఇది కేవలం ఓ సినిమా రీ రిలీజ్ మాత్రమే. కానీ భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ఐసిసి ప్రపంచ కప్ దక్కించుకున్న సందర్భంలో ఈ విజయానికి ఈ సినిమా ఓ కళాత్మక అభినందన కూడా. ఈ విషయాన్ని సినిమా టీమ్ సగర్వంగా ప్రకటించింది.గత బుధవారం ప్రొడక్షన్ బ్యానర్ హోప్ ప్రొడక్షన్ ్స తమ ఇన్ స్ట్రాగామ్లో టీమ్ ఇండియా విజయం సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అభినందన సందేశాన్ని అందిస్తూ ఒక నోట్ రాసింది. ‘‘ అభిరుచి, పట్టుదల నమ్మకపు శక్తి.ఘూమర్ రిటర్న్స్ తో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలకు అభినందనలు అందిస్తున్నాం’’ అని అభిషేక్ సయామి నటించిన చిత్రం పోస్టర్తో పాటు పంచుకుంది.గత 2023లో విడుదలైన సినిమా ఘూమర్. తన అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన ఔత్సాహిక క్రికెటర్ అనినా (సయామి)అనే మహిళా క్రికెటర్ పోరాటం చుట్టూ తిరుగుతుంది. వృత్తి పరంగా అవమానానికి గురైన మాజీ క్రికెటర్ పాడీ (అభిషేక్) ఆమెకు ఎడమచేతి వాటం బౌలర్గా మారడానికి శిక్షణ ఇస్తాడు, ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి సహాయపడటానికి ’ఘూమర్’ అనే కొత్త బౌలింగ్ టెక్నిక్ను కనిపెట్టడం ద్వారా ఆమెకు కొత్త ఆశను కలలను ఆయన అందిస్తాడు. ఈ చిత్రం హంగేరియన్ షూటర్ కరోలీ టకాక్స్ జీవిత కథ నుంచి ప్రేరణ పొందింది, ఆయన తన కుడి చేతికి తీవ్రంగా గాయమైన తర్వాత కూడా పట్టుదల సడలకుండా తన ఎడమ చేతితో రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు ఆర్. బాల్కి తమ చిత్రం తిరిగి విడుదల కావడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ‘ఘూమర్ మహిళల క్రికెట్ కు మహిళా క్రికెటర్ల స్థితిస్థాపకతకు ఒక పురస్కారం. ఘూమర్ను చిత్రీకరించిన అదే స్టేడియంలోనే వారు ఘన విజయాన్ని సాధించారు’’ అని బాల్కీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయాలను కీర్తించేవారు ఎందరో. కానీ స్ఫూర్తిని అందించే వారు కొందరే. అలాంటివారికి ఆ విజయాలు ఎప్పుడూ రుణపడి ఉంటాయి. వ్యాపార లెక్కలకు అతీతంగా ఇలాంటి స్ఫూర్దిదాయక సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్ధాం. -
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు. -
విశ్వక్ సేన్- అనుదీప్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ కా దాస్గా పేరున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). మాస్ చిత్రాలతో పాటు కామెడీ ఎంటర్టైనర్లతోనూ మెప్పించారు. ఈ ఏడాది లైలా అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ ఫంకీ(FUNKY). ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాద్ లోహర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 3న సమ్మర్లో థియేటర్లలో ఫంకీ సందడి చేయనుందని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వీకే నరేశ్, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. Unlimited Laughter. 😆Unlimited Entertainment. 😎Unlimited FUN! 🥳#FUNKY GRAND RELEASE WORLDWIDE on APRIL 3rd, 2026. 🎬#FunkyFromApril3rd 🤘🏻Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @NavinNooli @Venkatupputuri… pic.twitter.com/KLdhiJrMWL— Sithara Entertainments (@SitharaEnts) November 6, 2025 -
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips) -
కల్కి సీక్వెల్లో హీరోయిన్గా ఛాన్స్! కల్యాణి ఏమందంటే?
గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie) ఒకటి. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.దీపికా స్థానంలో కల్యాణి?ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికా(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్ మెంబర్స్కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.అంతకన్నా సంతోషం ఇంకేముంది?ఈ రూమర్పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.చదవండి: పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్ -
ఇండో-చైనా యుద్ధంపై సినిమా.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్ లేటెస్ట్ మూవీ '120 బహదూర్'. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా లీడ్ రోల్స్ చేశారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)మన దేశానికి చెందిన 120 మంది సైనికులు.. ఏకంగా 3000 మంది చైనా సైన్యంతో ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనేది '120 బహదూర్' మూవీ స్టోరీ. ట్రైలర్ చూస్తుంటే ఇదివరకే వచ్చిన వార్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించేలా ఉన్నాయి.(ఇదీ చదవండి: తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్) -
Bandla Ganesh: నా ఉద్దేశం అది కాదు.. సారీ విజయ్..
-
పూసలమ్మే మోనాలిసాతో ఫస్ట్ మూవీ.. నిర్మాత నల్గొండవాసి
నల్గొండ జిల్లా: నిడమనూరు చెందిన విరిగినేని అంజయ్య సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం సహకారం సంఘం జిల్లా డైరెక్టర్ ఉన్న అంజయ్య సినీ రంగంలోకి నిర్మాతగా (పొడ్యూసర్) అడుగుపెట్టారు. మొదటి సినిమానే కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఫేం అయినా మోనాలిసాతో ‘లైఫ్’ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సీనియర్ నటుడు సురేష్ హాజరయ్యారు. గతంలో సినీ రంగంలో డైరెక్టర్గా, సినీ ఫొటోగ్రాఫర్గా పలువురు నిడమనూరు మండల వాసులు పనిచేశారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ చోటా కే.నాయకుడు నిడమనూరు మండలానికి చెందిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు మేరెడ్డి వెంకట్రాహుల్, నల్లమోతు సిద్ధార్థ తదితరులు హాజరయ్యారు. -
తమిళ సినిమాలో అనసూయ రొమాంటిక్ సాంగ్
గతంతో పోలిస్తే సినిమాలు చేయడం తగ్గించేసిన అనసూయ.. గతేడాది పుష్ప 2, రజాకర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ ఏడాది రిలీజైన వాటిలో 'అరి' అనే మూవీలో లీడ్ రోల్ చేయగా 'హరిహర వీరమల్లు'లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతానికైతే అనసూయ కొత్త చిత్రాల్లో నటించట్లేదు. అలాంటిది ఈమె చేసిన తమిళ చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు రిలీజైంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్)నాలుగైదేళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలు చేసిన అనసూయ.. అదే టైంలో తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాంటి వాటిలో 'ఊల్ఫ్' ఒకటి. ప్రభుదేవా హీరో. అనసూయతో పాటు లక్ష్మీ రాయ్ హీరోయిన్గా చేసింది. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ని 2023 ఆగస్టులో రిలీజ్ చేశారు. తర్వాత ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'సాసా' అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.ఇందులో ప్రభుదేవా సరసన అనసూయ, లక్ష్మీ రాయ్, మరో నటి గ్లామరస్గా కనిపించారు. పేరుకే తమిళ సినిమా అయినప్పటికీ 'ఊల్ఫ్'ని తెలుగు, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేస్తామని టీజర్ రిలీజ్ టైంలో ప్రకటించారు. ఇప్పుడు వీడియో సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి త్వరలో ఏమైనా మూవీని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి? ఏదేమైనా అనసూయ ఇలాంటి రొమాంటిక్ పాటలో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు చిన్నపాటి షాకే అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్) -
బూతులు, అసభ్యకరమైన కామెంట్లు.. పోలీసులకు చిన్మయి ఫిర్యాదు
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. రాయడానికి, చెప్పడానికి కూడా వీలు లేని పదాలతో ఆమెను దారుణంగా తిడుతున్నారు. తననే కాకుండా, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్కు చిన్మయి ఎక్స్ (ట్విటర్)లో ఫిర్యాదు చేసింది. సజ్జనార్కు ఫిర్యాదు'వాళ్ళు పబ్లిక్గా మహిళలపై మాట్లాడుతున్న భాష దారుణంగా వుంది. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఉన్నా ప్రొత్సహించకండి. ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. మా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని పట్టించుకోకండి. అంతేకానీ, నా పిల్లలు చనిపోవాలని ఎలా కోరుకుంటారు? వీళ్లను అలాగే వదిలేయలేను. అందుకే నాపై వేధింపులను మీ దృష్టికి తీసుకొస్తున్నా..' అంటూ సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. దీనిపై సజ్జనార్ స్పందిస్తూ.. చిన్మయి ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.ఏం జరిగింది?రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో రాహుల్ మాట్లాడుతూ.. మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది నా భార్య చిన్మయి ఇష్టం. ఆ విషయంలో తనను బలవంతం చేయను అన్నాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. రాహుల్- చిన్మయి దంపతులను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటివారికి పిల్లలు పుట్టకూడదు.. పుట్టినా వెంటనే చనిపోవాలి అని కొందరు మరీ దారుణంగా కామెంట్స్ చేయడంతో చిన్మయి పోలీసులను ఆశ్రయించింది. Respected @SajjanarVC SirPlease take cognisance of this. I am sick and tired of this everyday abuse and women deserve better in Telangana. If they dont like an opinion they can ignore and leave. I am happy to file a complaint and even if this case takes 15 years let law take its… https://t.co/l4In1xLlhx— Chinmayi Sripaada (@Chinmayi) November 5, 2025Apparently This is Mr Charan Reddy here. *Sanghi* Far Right Hindu Conservative who wishes that women he dislikes for tweets dont have children and even if they give birth to children they should be dead as soon as they are born.JUST BECAUSE HE DOESNT LIKE AN OPINION. If a… https://t.co/Rz5h7GBbSs pic.twitter.com/mXFHaX1yZS— Chinmayi Sripaada (@Chinmayi) November 5, 2025 చదవండి: 12 ఏళ్ల తర్వాత వెండితెరపై రోజా రీఎంట్రీ -
ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్.. బడా నిర్మాత భార్య హీరోయిన్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నింటిని మాత్రం సర్ప్రైజ్ స్ట్రీమింగ్ అనేలా అప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అలా ఓ హిందీ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రజల సొమ్ము దొచుకునే కొందరిపై ఓ మహిళ పాములా పగబడితే అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తీశారు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్)2004లో వచ్చిన ఉదయ్ కిరణ్ 'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ అయిన దివ్య ఖోస్లా.. తర్వాత ఏడాదే బాలీవుడ్ బడా నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ని పెళ్లి చేసుకుంది. నటన పక్కనబెట్టేసింది. 2016 నుంచి నటి, దర్శకురాలిగా సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు 'ఏక్ చతుర్ నార్' అనే సినిమాతో వచ్చింది. డార్క్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 12న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం(నవంబరు 07) నుంచి నెట్ఫ్లిక్స్లోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.ఏక్ చతుర్ నార్ విషయానికొస్తే.. లక్నోలోని ఓ మురికివాడలో మమత (దివ్య ఖోస్లా).. కొడుకు, అత్తతో కలిసి జీవిస్తుంటుంది. మెట్రో స్టేషన్లో ఉద్యోగం చేస్తుంటుంది. ఓ రోజు మమత పనిచేస్తున్న చోట పెద్ద ఫైనాన్షియర్ అభిషేక్ వర్మ (నీల్ నితిన్ ముఖేష్) ఫోన్ దొంగతనానికి గురవుతుంది. ఆ ఫోన్ని పట్టుకోవడానికి వెళ్లిన మమత ఏం చేసింది? అసలు ఫైనాన్షియర్కి మమతకు మధ్య గొడవేంటి? ఆ ఫోన్లో ఏముంది? దీన్ని అడ్డం పెట్టుకుని మమత ఏమేం పనులు చేసిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి బిగ్ బాస్ ఫేమ్ కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్)Ek Chatur Naar, joh hai tez tarrar jaise chaaku ki dhaar 👀 Jeetega is khel mein kaun? 😏Watch Ek Chatur Naar, out 7 November, on Netflix.#EkChaturNaarOnNetflix pic.twitter.com/IwpE0kUXNN— Netflix India (@NetflixIndia) November 6, 2025 -
ఇది ప్రతి యువకుడి కథ.. శ్రీ విష్ణు కొత్త సినిమా
శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా మొదలైంది. సన్నీ సంజయ్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 'ప్రతి యువకుడి కథ' అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు.'దైనందిన జీవితాన్ని నిర్వచించే సంఘర్షణలు, ఆశలు, భావోద్వేగాలు వంటివి అన్వేషించే కథతో సన్నీ సంజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ గొప్ప పాత్రలతో అలరించిన శ్రీవిష్ణు ఈ చిత్రంలో అద్భుత పాత్ర చేయనున్నారు' అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. 'అనగనగా' అనే ఓటీటీ సినిమాతో సంజయ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.The story of every YOUNGSTER 🤘A new-gen entertainer packed with laughs, vibes & emotions that stay with you ❤️🔥#SitharaEntertainments Production No.39 x @SreeVishnuOffl 🔥Directed by @ASunnySanjayProduced by @vamsi84 & #SaiSoujanyaShoot begins soon 🎬@SitharaEnts… pic.twitter.com/la5NV2YIK9— Sithara Entertainments (@SitharaEnts) November 5, 2025 -
బ్రహ్మచారి.. భర్త కావాలనుకుంటే? 'పురుష' ఫస్ట్ లుక్
'బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది' అనే క్యాప్షన్తో 'పురుష' ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ పోస్టర్ ఆవిష్కరించారు. బత్తుల సరస్వతి సమర్పణలో తన తనయుడు పవన్ కల్యాణ్ను హీరోగా పరిచయం చేస్తూ బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసినీ సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ పేర్కొంది. -
దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంత'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా ఇండస్ట్రీ గురించి ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 14న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు, తమిళ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ చేశారు.లెక్క ప్రకారం సెప్టెంబరులోనే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు. కానీ అనుకోని కారణాల వల్ల నవంబరులో విడుదల చేస్తున్నారు. తొలుత ఇందులో దుల్కర్ మాత్రమే నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ రానా కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్తో క్లారిటీ వచ్చింది. దుల్కర్-రానా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. -
కొత్తింట్లోకి కమెడియన్ జ్యోతి.. ఫొటోలు వైరల్
తెలుగు సినిమాల్లో కమెడియన్, వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకుంది. అలానే బిగ్బాస్ తెలుగు తొలి సీజన్లోనూ పాల్గొంది గానీ ఒకటి రెండు వారాలు కూడా హౌస్లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. గత కొన్నాళ్లలో పెద్దగా మూవీస్లో కనిపించని ఇప్పుడు కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్!)ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది. చివరగా 2020లో వచ్చిన 'గోల గోల' అనే చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా 2017లో మొదలైన బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. రీసెంట్ టైంలో అయితే ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోల్లో కనిపించింది అంతే.చాన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది. దీంతో జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: మెడలో నెక్లెస్తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..) -
స్పిరిట్లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) చాలా బిజీ అయిపోయాడు. ఒకదానివెంట మరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రాజాసాబ్ రిలీజ్కు దగ్గరపడితే ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు స్పిరిట్ మూవీ.. ఆ వెంటనే సలార్, కల్కి సినిమా సీక్వెల్స్ చేయనున్నాడు. రాజాసాబ్ రిలీజే కాలేదు. అప్పుడే దాని సీక్వెల్కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.స్పిరిట్ సంగతులుఅర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సందీప్రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాయే స్పిరిట్. ఇటీవలే ఈ మూవీ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి.. కావాల్సినంత హైప్ తీసుకొచ్చారు. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. దగ్గుబాటి హీరో?అలాగే కొరియన్ నటుడు డాన్లీ కూడా సినిమాలో భాగమైనట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. దగ్గుబాటి హీరో కూడా ఈ సినిమాలో భాగమయ్యాడట! ఆ హీరో మరెవరో కాదు, రానా తమ్ముడు అభిరామ్. ఫుల్ యాటిట్యూడ్ ఉండే పాత్రలో అభిరామ్ను ఎంపిక చేశారట! మరి ఇదెంతవరకు నిజమన్నది చూడాలి!నిజమైతే కెరీర్ టర్న్ అయినట్లే!అభిరామ్.. అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం అనగానే మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అసలు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అయినప్పటికీ అభిరామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడేకంగా రెండో సినిమాకే స్పిరిట్లో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే అతడి పంట పండినట్లే!చదవండి: పవన్కు అన్యాయం.. గౌరవ్పై దివ్య చిన్నచూపు? భోజనం కట్ -
హీరోలకే నా సలహా.. రెమ్యునరేషన్ తగ్గించండి: విష్ణు విశాల్
చాలామంది హీరోలు తమ ప్రతి సినిమాకు ఎంతోకొంత పారితోషికం పెంచుకుంటూ పోతారు. అందులోనూ హిట్టు పడిందంటే రెట్టింపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ మన జీతాల గురించే కాకుండా నిర్మాతల కోణంలోనూ ఆలోచించాలంటున్నాడు తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal). ఈయన హీరోగా నటించడంతోపాటు నిర్మించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్ (Aaryan Movie). ఈ సినిమా తమళనాడులో అక్టోబర్ 31న విడుదలైంది. హీరోలకే నా సలహామిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడవడంతో నిర్మాత గండం గట్టెక్కినట్లే కనిపిస్తోంది! ఇకపోతే ఈ సినిమా తెలుగులో ఆలస్యంగా నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. నేను నిర్మాతలకు ఎటువంటి సలహాలు ఇవ్వను. హీరోలకు, ఆర్టిస్టులకు మాత్రం ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ రెమ్యునరేషన్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం ఖాయంఅప్పుడే నిర్మాతలు సినిమాను మరింత క్వాలిటీగా తీయగలరు. లేదంటే చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం! అని చెప్పుకొచ్చాడు. చాలామంది హీరో అభిప్రాయాన్ని కొనియాడుతున్నారు. కోట్లకు పడగలెత్తిన హీరోలు ఓసారి విష్ణు చెప్పేది వింటే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె దర్శకత్వం వహించాడు.చదవండి: దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం! -
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్లోనూ అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారని సమాచారం. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో ఏ1 స్టార్ అనే ట్యాగ్ ను ఎన్టీయార్ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్ అవడంతో మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో ఈ ట్యాగ్ను స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే దారిలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్యాగ్ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ పోతినేని కి ముందు ఉస్తాద్ అని ట్యాగ్ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 2 సహా పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడట రామ్. తన పాత ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. రాబోతున్న ఆంధ్ర కింగ్ సినిమా పోస్టర్ లోను ఆ పాత ట్యాగ్తోనే వస్తున్నాడు. వేలం వెర్రి కాకూడదుమరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్లో ఈ స్టార్ టైటిల్స్ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్ చేసే మార్కెటింగ్ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్స్టార్, రెబల్ స్టార్...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?ఉదాహరణకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను రామ్ చరణ్ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి. ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే ట్యాగ్ అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది. -
గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు
-
రష్మిక ది గర్ల్ఫ్రెండ్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ది గర్ల్ఫ్రెండ్. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అభిమానులు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. నీదే కథ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు రాకేందు మౌలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సాంగ్ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఈ పాట రష్మిక ఫ్యాన్స్ను తెగ అలరిస్తోంది. కాగా.. ది గర్ల్ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. -
'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మరో ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. -
డైరెక్టర్కు బంపరాఫర్.. నీ సొంతింటి బాధ్యత నాదే: టాలీవుడ్ నిర్మాత
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్. ఈ మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మూవీ నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ రవీంద్రన్ తనతో ఓ మాట అన్నారని తెలిపారు. ఈ మూవీ సూపర్ హిట్ అయితే నెక్ట్స్ మూవీకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఓ ఇల్లు కొనుక్కుంటానని నాతో చెప్పారని అన్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్కు హైదరాబాద్లో ఇప్పటివరకు సొంతిల్లు లేదన్నారు. ఈ సినిమా హిట్ అయితే నేనే మీ ఇంటి కలను నెరవేరుస్తానని నిర్మాత ధీరజ్ మొగిలినేని హామీ ఇచ్చారు.కాగా.. ది గర్ల్ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్
చేతికి మైక్ దొరికితే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడేది ఇద్దరే ఇద్దరు. ఒకరు రాజేంద్రప్రసాద్, మరొకరు బండ్ల గణేశ్. ఈ మధ్య వీళ్ల మాటతీరు అలాగే ఉంటోంది. తెలియకుండానే లేనిపోని వివాదాలను మీదేసుకుంటున్నారు. ఆ మధ్య రాజేంద్రప్రసాద్.. డేవిడ్ వార్నర్, అలీ, రోజాలపై నోరు జారి తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఈ మధ్యేకంగా మాస్ జాతర మూవీ చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు.విజయ్, అల్లు అరవింద్పై సెటైర్లుఇక బండ్ల గణేశ్ (Bandla Ganesh).. లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్లో కొత్త హీరో మౌళిని మెచ్చుకుంటూనే విజయ్ దేవరకొండపై సెటైర్లు వేశాడు. అల్లు అరవింద్ గురించైతే దారుణంగా మాట్లాడాడు. ఈ సినిమాకి బన్నీ వాసు, వంశీ ఎంతో కష్టపడితే చివరకు అల్లు అరవింద్ సినిమా అంటున్నారు. ఆయన చివరి నిమిషంలో వచ్చి పేరు కొట్టేస్తారు అని కామెంట్స్ చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన కె-ర్యాంప్ సక్సెస్ ఈవెంట్లోనూ మరోసారి హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ట్రోల్స్ రావడంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు.నాకంటూ ఓ స్థాయి ఉంది: అల్లు అరవింద్ఇక బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ (Allu Aravind)కు ప్రశ్న ఎదురైంది. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ది గర్ల్ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. బుధవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ విలేఖరి ఓ ప్రశ్న లేవనెత్తాడు. ఆ మధ్య బండ్ల గణేశ్ మీ గురించి మాట్లాడుతూ.. మీరు చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారన్నారు. ఆ మాటకు మీరు చాలా ఫీలయ్యారని ఇన్సైడ్ టాక్.. మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అందుకు అల్లు అరవింద్ సింపుల్గా.. నాకంటూ ఓ స్థాయి ఉంది. దాని గురించి మాట్లాడను అని తేల్చి పడేశాడు.చదవండి: ఎవరినీ ఉద్దేశించి అనలేదు.. క్షమించండి: బండ్ల గణేశ్ -
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖుషీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు
-
సతీమణి బర్త్ డే.. కేఎల్ రాహుల్ స్పెషల్ విషెస్!
బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టికి ఆమె భర్త, టీమిండియా క్రికెటర్ ప్రత్యేక విషెస్ తెలిపారు. ఇవాళ అతియా శెట్టి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. ఇవాళ అతియా తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది.కేఎల్ రాహుల్ తన పోస్ట్లో రాస్తూ.. "నా ప్రాణ స్నేహితురాలు, సతీమణి, ప్రేమికురాలు, స్ట్రెస్ బాల్, గూఫ్బాల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గడిచిన ప్రతి సంవత్సరం నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ సతీమణిపై ప్రేమ కురిపించారు. దీనికి లవ్ యూ అంటూ అతియా శెట్టి రిప్లై కూడా ఇచ్చింది. కూతురు బర్త్ డే సందర్భంగా సునీల్ శెట్టి బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్ట్ చేశారు. అతియాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అతియా బ్రదర్ అహన్ శెట్టి కూడా సిస్టర్కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రాణ స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు.కాగా.. అతియా శెట్టి కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. ముంబయి సమీపంలోని ఖండాలా ఉన్న సునీల్ శెట్టి ఫామ్హౌస్లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంటకు ఈ ఏడాది మార్చిలో తమ మొదటి బిడ్డకు ఎవారా అనే కుమార్తెకు స్వాగతం పలికారు. మరోవైపు అతియా 2015లో హీరోయిన్గా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ వంటి చిత్రాలలో నటించింది. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
న్యూయార్క్లో చిల్ అవుతోన్న కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్.. ఫోటోలు
-
Nupur Alankar: సన్యాసినిగా మారిన హీరోయిన్..
-
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
నీల్ షాకింగ్ అప్డేట్..! NTRకు అసలు ఇంట్రెస్ట్ లేదంట
-
రా.వన్ సీక్వెల్ ఫిక్స్!!
-
మోహన్లాల్ కుమారుడి థ్రిల్లర్ సినిమా ( ట్రైలర్)
మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్లాల్ (Pranav Mohanlal) హీరోగా నటిస్తున్న చిత్రం డియస్ ఈరే.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. -
ఫ్యామిలీ వెకేషన్ ట్రిప్లో కాజల్ అగర్వాల్ చిల్.. (ఫోటోలు)
-
తెలుగు ఇండస్ట్రీని చూసి నేర్చుకోండి: సోనాక్షి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సోనాక్షి రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నవంబర్ 7న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు పరిశ్రమలో పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంది.దక్షిణాది సినీ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా అభిప్రాయం వ్యక్తం చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమలో సమయపాలన పాటిస్తారని తెలిపింది. తొమ్మిది గంటలకు షూటింగ్కు వస్తే సాయంత్రం ఆరు వరకే ఉంటుందని.. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందేనని అన్నారు. వారిని చూసి బాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాలని హితవు పలికింది. బాలీవుడ్లో అర్ధరాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుంటాయని విమర్శించింది. సౌత్లా చేయాలంటే క్రమశిక్షణ అవసరమని సోనాక్షి వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమను చూసైనా బాలీవుడ్ మారాలని సలహా ఇచ్చింది.తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..' స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. గతంలో నేను (లింగా) ఒక తమిళ సినిమా చేశా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చేశా. ఎల్లప్పుడూ ఇలాంటి చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ అంతకు ముందు నా షెడ్యూల్ కుదరక సినిమాలు ఒప్పుకోలేదు' అని చెప్పిందిఆ తర్వాత వర్క్ లైఫ్ ప్రస్తావిస్తూ..' హిందీ, తెలుగు సినిమా పని సంస్కృతిని పోల్చి చూస్తే.. దక్షిణది పరిశ్రమలో సమయపాలన గ్రేట్. అక్కడ పని, లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంది. ఈ విషయాన్ని వారి నుంచి మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సెట్లోని క్రమశిక్షణ తనకు ప్రత్యేకంగా అనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్కు వెళ్తే.. ఆరు గంటల తర్వాత అస్సలు షూట్ చేయరు. అది నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణను అంగీకరించాల్సిన విషయం' అని తెలిపింది. కాగా.. జటాధర మూవీలో ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. -
పెళ్లి రిసెప్షన్లో వాంతులు.. దుల్కర్ సల్మాన్పై కేసు
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్కు కేరళలోని పతనంతిట్ట జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్న రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో రోజ్ బ్రాండ్ రైస్తో చేసిన బిర్యానీ తిన్న వారందరూ ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుల్కర్కు నోటీసులు జారీ చేశారు.నివేదికల ప్రకారం.. 2025 డిసెంబర్ 3న కమిషన్ ముందు దుల్కర్ సల్మాన్ హాజరు కావాలని ఆదేశించబడింది. నటుడితో పాటు, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ జిల్లా మేనేజర్ను కూడా హాజరు కావాలని కోరింది.సంఘటన ఎప్పుడు జరిగింది..?2025 ఆగస్టు 24న ఈ ఘటన జరిగింది. పతనంతిట్ట జిల్లా వల్లికోడ్కు చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ పి.ఎన్. జయరాజన్ చేసిన ఫిర్యాదుతో దుల్కర్పై కేసు నమోదు చేశారు. వల్లికోడ్లో జరిగిన వివాహ రిసెప్షన్ కోసం బిర్యానీ తయారు చేయడానికి 50 కేజీల రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ను ఆయన కొనుగోలు చేశాడు. ఆ వంటకం తిన్న చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల వాంతులు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.అయితే, బియ్యం సంచులపై ప్యాకింగ్ తేదీతో పాటు గడువు తేదీ కూడా ముద్రించి లేదని గుర్తించినట్లు చెప్పారు. దీంతో ఆహార ఉత్పత్తి భద్రత చట్టప్రకారం ఆ కంపెనీ లేబులింగ్ ప్రమాణాలను పాటించలేదని జయరాజన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎ.కె. ట్రేడర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మొదటి నిందితుడిగా, మలబార్ బిర్యానీ స్పైస్ పతనంతిట్ట మేనేజర్ రెండవ నిందితుడిగా, బ్రాండ్ అంబాసిడర్ దుల్కర్ సల్మాన్ మూడవ నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతానికి, దుల్కర్ సల్మాన్, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ ప్రతినిధుల నుంచి నోటీసుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
'నా కెరీర్లోనే అత్యంత చెత్త రోల్'.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ ప్రస్తుతం వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీ అయిపోయింది. మహారాణి సీజన్-4తో పాటు మరో ఆసక్తికర సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఢీల్లీ క్రైమ్ పేరుతో వస్తోన్న మూడో సీజన్లో హ్యుమా ఖురేషీ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్ కాగా.. మూడో సీజన్ నవంబర్ 13న స్ట్రీమింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన హ్యుమా ఖురేషి తన రోల్ బడీ దీదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోల్ గురించి ఉత్తమంగానే చెబుతున్నా.. నా లైఫ్లో చేసిన అత్యంత చెత్త పాత్ర అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా బహుశా చెత్త పాత్రలు పోషించే ఉత్తమ వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.తన పాత్ర గురించి మాట్లాడుతూ.. 'బడి దీదీ పాత్ర పోషించడం చాలా సరదాగా ఉంది. చీకటి పాత్రలు చేసినప్పుడు ఎటువంటి పరిమితులు ఉండవు. మీరు స్వేచ్ఛగా ప్రయోగాలు చేయొచ్చు. కానీ నేను కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా. నేను చిత్రీకరించే ప్రతి స్త్రీకి ఏజెన్సీ, దృక్పథం ఉండేలా చూసుకుంటా. ఇక్కడ నాకు కొంత ఏజెన్సీ ఉన్నప్పటికీ.. అది చాలా ప్రతికూలంగా ఉంటుంది. అందుకే నేను దీన్ని చేయాలా వద్దా అని ఆలోచించా. కానీ ఢిల్లీ క్రైమ్ చాలా ముఖ్యమైన సిరీస్ అనిపించింది. ఇది సమాజానికి అద్దం పట్టే కథ. కొన్నిసార్లు బాగా పాపులరైన వ్యక్తి ప్రతికూల పాత్ర పోషించినప్పుడే అది సమస్యను హైలైట్ చేస్తుంది. నా పాత్ర ఈ విషయం గురించి అవగాహన పెంచడానికి సహాయపడితే అది నిజంగా నాకు గౌరవమేనని' వెల్లడించింది.కాగా.. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ సీజన్-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్, సయాని గుప్తా కీలక పాత్రల్లో నటించారు. రిచీ మెహతా, తనూజ్ చోప్రా ఈ సిరీస్ని రూపొందించారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన 30 మంది అమ్మాయిల ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథ సిల్చార్, ముంబయి, రోహ్తక్, సూరత్, ముజఫర్పూర్ లాంటి నగరాల్లో జరిగిన ఘటనలో నేపథ్యంలో రూపొందించారు. -
మంగళసూత్రం ఎపిసోడ్.. చిన్మయి కౌంటర్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. మంగళసూత్రం ధరించడమనేది చిన్మయి ఇష్టమని.. తానైతే తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పనని అన్నారు. ఈ కామెంట్స్పై కొందరు నెటిజన్స్ విమర్శించగా.. మరికొందరు సమర్థించారు. దీంతో రాహుల్, చిన్మయి జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.దీంతో తమపై పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో సింగర్ చిన్మయి స్పందించింది. ఆయన ఏందో ఒక సందర్భంలో అలా మాట్లాడారని తెలిపింది. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న చర్చపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. కానీ మనదేశంలోని మహిళల గురించే ఆందోళన చెందుతున్నానన నెటిజన్లకు కౌంటరిచ్చింది.(ఇది చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్)ఓ నెటిజన్ చిన్మయి- వైరముత్తు ఎపిసోడ్పై ప్రశ్నించాడు. వైరముత్తు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు.. కానీ ఇక్కడ ఇతర మహిళల గురించి ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై చిన్మయి స్పందిస్తూ..అవును.. ఎందుకంటే లైంగిక వేధింపులకు గురి కావడం నా తప్పే.. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి? దయచేసి ఢిల్లీ గాలిని పీల్చుకోండి.. ఎందుకంటే నేను అలాంటి గాలిని తట్టుకోలేనంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. కాగా.. 2018లో మీటూ ఉద్యమం సమయంలో ఓ ఈవెంట్లో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 20 మంది మహిళలు ఆతనిపై ఆరోపణలు చేశారు.కాగా.. సింగర్ చిన్మయి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఏడాది డేటింగ్ తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూన్ 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కానుంది. He literally said it in some context on an interview which has become a tweet. The rage from the men calling him all sorts of abuses - I am worried for the women here truth be told— Chinmayi Sripaada (@Chinmayi) November 4, 2025 -
హిందీ రిలీజ్ గురించి అడుగుతున్నారు: హీరో ఆది సాయికుమార్
‘‘సినిమాలోని కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న మా ‘శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపరచదు. మా చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’. అర్చన అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రలు చేస్తున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది.ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘మా ట్రైలర్ను రిలీజ్ చేసిన ప్రభాస్గారికి థ్యాంక్స్. ఈ ట్రైలర్ చూసి, రానాగారు మెచ్చుకుని, తన వంతుగా సాయం చేస్తానని చెప్పారు. కొంతమంది హిందీ రిలీజ్ గురించి అడుగుతున్నారు.ఇంకా మాకు సపోర్ట్గా నిలిచిన దుల్కర్, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం, సహకరించిన నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసాద్ అన్నలకు ధన్యవాదాలు. రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిది’’ అని యుగంధర్ ముని చెప్పారు. -
శివతో పెద్ద స్టార్ని చేశారు: నాగార్జున
‘‘శివ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ప్రేమతో వచ్చిన మీ అందరికీ (ఫ్యాన్స్) ధన్యవాదాలు. ఈ సినిమాని మీ తల్లిదండ్రులు థియేటర్స్లో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరూ వచ్చారు. 36 ఏళ్ల క్రితం నాతో ‘శివ’ సినిమా తీసి, నన్ను పెద్ద స్టార్ని చేసిన నా మిత్రుడు రామ్గోపాల్ వర్మకి థ్యాంక్స్. మంగళవారం ఉదయం ‘శివ’ చూశాను. అద్భుతంగా అనిపించింది’’ అన్నారు నాగార్జున. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల జోడీగా నటించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది.అన్నపూర్ణ స్టూడి యోస్ 50 ఏళ్ల సందర్భంగా సరికొత్త 4కె డాల్బీ అట్మాస్లో ఈ నెల 14న ‘శివ’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో రీ రిలీజ్ ట్రైలర్ని లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘దాదాపు 6 నెలల పాటు రాము చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా అద్భుతంగా డిజైన్ చేశాడు. శివ ఈజ్ ఫరెవర్.మరో 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘శివ’కి ముందు ‘శివ’కి తర్వాత అని రాజమౌళిగారు అన్నట్టు ‘శివ’ ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని చెప్పారు. 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం (నాగార్జున, వర్మ) ఒకే వేదికపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా గొప్ప అనుభూతి. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం’’ అని రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
ధన పిశాచి సర్ప్రైజ్ చేస్తుంది: నిర్మాత ప్రేరణ అరోరా
‘‘నేను హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ నాకు తెలుగు సినిమాలు, తెలుగు సంస్కృతి అంటే చాలా ఇష్టం. రామ్చరణ్గారి ‘ఆరెంజ్’ చిత్రం చూశాను. అప్పట్నుంచి తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నాను. ఇండియన్ సినిమాకి తెలుగు పరిశ్రమ గొప్ప చిత్రాలను అందించింది. తెలుగులో సినిమా చేయాలనే నా కల ‘జటాధర’ సినిమాతో నెరవేరడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే చిత్రం ఇది’’ అని చెప్పారు నిర్మాత ప్రేరణ అరోరా. సుధీర్బాబు, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్లో, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’.ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రేరణ అరోరా మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ అంశాలు, ఎమోషన్స్, మైథలాజికల్, సూపర్ నేచురల్ విషయాలు, ఆశ, అత్యాశ... ఇలా అన్ని అంశాలు ‘జటాధర’లో చక్కగా కుదిరాయి.సుధీర్గారు చేసిన క్యారెక్టర్, ఆయన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్కు గుర్తుండిపోతాయి. సోనాక్షీ సిన్హాగారు చేసిన ధన పిశాచి క్యారెక్టర్ ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. ఈ పాత్రకు సోనాక్షినే పర్ఫెక్ట్ చాయిస్. సుధీర్బాబు–సోనాక్షిల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు అలరిస్తాయి. శిల్పాగారి క్యారెక్టర్ కాస్త నెగటివ్ షేడ్స్తో ఉంటుంది. ఇంకా ఈ చిత్రంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం, నాగబంధం, పిశాచి బంధం, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను చూపించాం. ఈ సినిమాకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండే స్కోప్ ఉంది. తెలుగులో ఓ పెద్ద హీరోతో సినిమా చేయనున్నాం’’ అని చెప్పారు. -
దుబాయ్లో సమంత సందడి.. శ్వేతా మీనన్ బోల్డ్ లుక్!
దుబాయ్లో సమంత సందడి..ఏడారిలో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..హీరోయిన్ శ్వేతా మీనన్ బోల్డ్ లుక్..శారీలో హీరోయిన్ లయ పోజులు..ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్లో రష్మిక..ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) -
కొత్త కారు కొన్న డ్యాన్సర్.. అంతలోనే అనంత లోకాలకు!
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నగర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రియాలిటీ షో డ్యాన్సర్ సుధీంద్ర(36) మృతిచెందారు. రోడ్డుపక్కన కారు ఆపి నిలిపి ఉండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు సుధీంద్రను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్యాన్సర్ సుధీంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.నిద్రమత్తులో ట్రక్కు నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. కొత్త కారు కొన్న సుధీంద్ర తన తమ్ముడికి చూపించేందుకు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే కారులో సమస్య రావడంతో నేలమంగళ తాలూకాలోని పెమ్మనహళ్లి సమీపంలో హైవే పక్కన ఆపినట్లు సమాచారం. కాగా.. సుధీంద్ర పలు టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొన్నారు. A Life Lost, A System Failed: Sudheendra’s Death Near Nelamangala Exposes Stark Road Safety NeglectThe tragic death of 36-year-old dancer Sudheendra near Nelamangala is not just a personal loss it’s a damning indictment of our civic infrastructure and administrative apathy.… pic.twitter.com/6FrnDY9A6g— Karnataka Portfolio (@karnatakaportf) November 4, 2025 -
మౌనికను మొదటిసారి కలిసినప్పుడే మాట ఇచ్చా: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ టాలీవుడ్ మూవీ సాంగ్ రిలీజ్ ఈవెంట్కు హాజరైన మనోజ్.. ప్రేమ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రేమకథ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటను ప్రస్తావిస్తూ తన లవ్ ప్రపోజల్ను రివీల్ చేశారు. రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటాననే లిరిక్ తన నచ్చిందని మనోజ్ తెలిపారు. ప్రపంచంలో ఎలాంటి తారతమ్యాలు లేనిది ఒక్క ప్రేమ మాత్రమేనన్నారు. రాజా వెడ్స్ రాంబాయి అనే మూవీ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్ తన ప్రేమ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. నేను కూడా ఫస్ట్ మౌనికను కలిసినప్పుడు ఓ మాట ఇచ్చానని మనోజ్ వెల్లడించారు. నాకు ఎలాంటి రాజ్యాలు లేవు.. నిన్ను బాగా చూసుకుంటానని చెప్పా.. సినిమాలు కూడా చేయట్లేదు.. జీవితాంతం నిన్ను చూసుకుంటానని మాట ఇచ్చా అని గుర్తు చేసుకున్నారు. ఎవరైనా సరే మనల్ని నమ్ముకుని వచ్చారంటే.. వారికోసం మన నిలబడాలి.. అలాంటి వాళ్ల చేయిని వదలకండి అని అన్నారు. శివుడు ఎక్కడో ఉండడు.. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరు దేవుడిలా మారతారని పేర్కొన్నారు. ప్రాణముంటేనే శివ.. ప్రాణం లేకపోతే శవ.. శివుడు యాక్టివేట్ కావాలంటే పదిమంది కోసం మీరు నిలబడాలని పిలుపునిచ్చారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Indiramma Intilo puttina, Indira Gandhi Intilo Puttina. Prema Andharidi- #ManchuManoj at #RajuWedsRambai song launch event pic.twitter.com/qdJWP5I8CA— Suresh PRO (@SureshPRO_) November 4, 2025 -
మరో బాహుబలి వచ్చేస్తోంది.. లేటేస్ట్ టీజర్ చూశారా?
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన మహిస్మతి సామ్రాజ్యం మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే బాహుబలి ది ఎపిక్ పేరుతో మీ ముందుకొచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదలై ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మరో బాహుహలి చిత్రం ముందుకొస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో టీజర్ను విడుదల చేశారు. ఈ బాహుబలి యానిమేషన్ మూవీతో ప్రేక్షకుల సరికొత్త అనుభూతిని అందించనున్నారు మేకర్స్. బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్-1 పేరుతో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. యానిమేషన్ సీన్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యానిమేషన్ చిత్రాలకు ప్రముఖ అవార్డ్ గ్రహీత, డైరెక్టర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా ఉన్నారు. Amarendra Baahubali’s death wasn’t his End…it was the beginning of something Eternal. 🔥#BaahubaliTheEternalWar Teaser out now!Telugu: https://t.co/sj4FkCLo5sHindi: https://t.co/waTg71bKIeTamil: https://t.co/6YYjTrc4RD#Baahubali @ssrajamouli #Prabhas @meramyakrishnan… pic.twitter.com/qDdERcMX7e— Baahubali (@BaahubaliMovie) November 4, 2025 -
'మీరు అలా చెప్పడం సరికాదు'.. ప్రకాశ్ రాజ్పై చైల్డ్ ఆర్టిస్ట్ ఫైర్!
ఈ ఏడాది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులను ప్రకాశ్ రాజ్ నేతృత్వంలోని జ్యూరీ ఎంపిక చేసింది. 2024కు గానూ ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలవడంతో పాటు ఏకంగా 9 విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.అయితే ఈ అవార్డుల ప్రకటనపై మలయాళ చైల్డ్ ఆర్టిస్ట్ విమర్శలు చేసింది. మలికాపురం, గు లాంటి చిత్రాల్లో తన పాత్రలకు పేరు తెచ్చుకున్న బాలనటి దేనానంద జిబిన్ సోషల్ మీడియాలో జ్యూరీని విమర్శించింది. ఈ అవార్డుల్లో బాల నటులను విస్మరించడంపై తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు నిర్వహించే దేవా సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. పిల్లలకు అవార్డులకు ప్రకటించేందుకు జ్యూరీ సభ్యులకు కళ్లు మూసుకుపోయానని రాసుకొచ్చారు.దేవానంద తన ఇన్స్టాలో రాస్తూ.. 'మీ కళ్లతో పిల్లల్ని దగ్గరగా చూడండి. అంతే కానీ ఇక్కడంతా చీకటిగా ఉందని మాత్రం చెప్పకండి. పిల్లలు కూడా ఈ సమాజంలో భాగమే. రాబోయే తరానికి 2024 మలయాళ చలనచిత్ర అవార్డులను ప్రకటించడంలో జ్యూరీకి కళ్లు మూసుకుపోయాయి. స్టానర్తి శ్రీకుట్టన్, గు, ఫీనిక్స్, ఏఆర్ఎం లాంటి సినిమాల్లో పిల్లలు నటించారు. ఇద్దరు పిల్లలకు అవార్డులు ఇవ్వకుండా కూర్చోవడం కాదు.. మరిన్ని పిల్లల సినిమాలు చేయాలని చెప్పడానికి ప్రయత్నించండి. కనీసం ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లకైనా అవార్డ్స్ ఇచ్చి ఉంటే.. అది ఎంతో మంది నా లాంటి పిల్లలకు ప్రోత్సాహంగా ఉండేది. పిల్లలకు మరిన్ని అవకాశాలు రావాలని.. వారు కూడా సమాజంలో భాగమేనని జ్యూరీ చైర్మన్ చెప్పడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నా. అన్ని మీడియా, చిత్రనిర్మాతలు, సాధారణ ప్రజలు కూడా దీని గురించి చర్చించాలి. మా హక్కులను పెట్టుబడి పెట్టడం కాదు.. మార్పులు జరగాలి. మార్పులతో పాటు పిల్లల హక్కులను కూడా కాపాడుకోవాలి' అంటూ పోస్ట్ చేశారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల ప్రకటన అనంతరం నటుడు ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఇందులో ఆయన పిల్లల విభాగం అవార్డులపై కామెంట్స్ చేశారు. ఆ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేవానంద విమర్శించింది.ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?ఉత్తమ బాలల చిత్ర విభాగానికి ఆరు సినిమాలు వచ్చినప్పటికీ.. ఏవీ కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేవని జ్యూరీ నిర్ణయించిందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇది ఈ సినిమాల నటులకు కూడా వర్తిస్తుందని అన్నారు. చిన్న పిల్లల విభాగంలో మనకు ఒక్క బెస్ట్ సినిమా కూడా కనిపించలేదు.. అంతేకాకుండా పిల్లలతో సినిమా తీసే ప్రయత్నం కూడా జరగలేదని వెల్లడించారు. సినిమాలు అంటే కేవలం పెద్దలు, యువకులు మాత్రమే కాదు.. పిల్లలు కూడా సమాజంలో భాగమని దర్శకులు, రచయితలు గ్రహించాలని ప్రకాశ్ రాజ్ సూచించారు. పిల్లలు ఏమి ఆలోచిస్తారో మనం తెలుసుకోవాలన్నారు. ఏ సినిమా కూడా పిల్లల అవగాహన గురించి మాట్లాడదని అన్నారు. దీంతో బాల నటులపై ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు వినేష్ విశ్వనాథ్, మరో నటుడు ఆనంద్ మన్మధన్ కూడా జ్యూరీ విధానాన్ని ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Devanandha Jibin (@devanandha.malikappuram) -
స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం ‘పురుష:’
ప్రస్తుతం సినిమాని రిలీజ్ చేయడం కంటే.. జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం.. ఎలా ప్రమోట్ చేస్తున్నాం.. ఎలాంటి కంటెంట్తో ఆడియెన్స్ను మెప్పిస్తున్నాం అన్నది ముఖ్యంగా మారింది. అందుకే ‘పురుష:’ టీం డిఫరెంట్ పోస్టర్లు, రకరకాల క్యాప్షన్స్తో సినిమా కాన్సెప్ట్ను తెలియజేసేలా కంటెంట్ను బయటకు వదులుతోంది.బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండు పోస్టర్లు వదిలారు. ‘ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది’; ‘ స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం’ అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్తో రీలీజ్ చేసిన ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
జ్యూవెల్లరీ ఎగ్జిబిషన్ కోసం సమంత గ్లామరస్ లుక్ (ఫొటోలు)
-
నాగార్జున ఐకానిక్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న రీ రిలీజ్ ట్రైలర్
అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ కమర్షియల్ మూవీ 'శివ' రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కల్ట్ మూవీ శివను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్పై ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే శివ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సరికొత్త 4కె వర్షన్లో శివ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్, హీరోలు శివ మూవీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా గతిని మార్చేసిన సినిమా శివ అంటూ పలవురు స్టార్స్ కామెంట్స్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం శివ 4కె ట్రైలర్ మీరు కూడా చూసేయండి.కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు రాం గోపాల్ వర్మ. -
'దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి'.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తాను నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనపై అలాంటి వార్తలు రాసి ఇబ్బంది పెట్టవద్దని ట్విటర్ వేదికగా కోరారు.బండ్ల గణేశ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..' మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతోనే ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నా. ఇట్లు మీ బండ్ల గణేశ్' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతనెలలో తెలుసు కదా మూవీ ఈవెంట్లో బండ్ల గణేశ్ ఆసక్తిక కామెంట్స్ చేశారు. నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నా.. ఫ్లాప్ మూవీతో కాదు, బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చి బ్రేక్ తీసుకున్నా.. ఇప్పుడు మొదలవుతుంది సెకండాఫ్ అంటూ మాట్లాడారు. ఇప్పుడే అసలు సినిమా మొదలు కాబోతుంది అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ఉండబోతుందని కామెంట్స్ చేశారు. దీంతో మెగాస్టార్తో ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. ఈ వార్తల నేపథ్యంలోనే తాజాగా నిర్మాత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి.మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి చేతులెత్తి నమస్కరిస్తూ…— BANDLA GANESH. (@ganeshbandla) November 4, 2025 -
విజయ్తో ఎంగేజ్మెంట్ రింగ్.. అసలు విషయం చెప్పేసిన రష్మిక!
ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పటికే ఛావాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన ది గర్ల్ఫ్రెండ్ రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా టాలీవుడ్ టాక్ షోకు హాజరైంది. నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము..నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు. దళపతి విజయ్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతో ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్కి ఆల్ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా? అంటూ ఫన్నీగా మాట్లాడారు.ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్ను సెంటిమెంట్తోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. అవీ చాలా ఇంపార్టెంట్ అని ముద్దుగుమ్మ చెప్పేసింది. వాటిలో ఒక రింగ్ ఫేవరేట్ అయి ఉంటుంది.. దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతి నవ్వుతూ అన్నారు. దీనిపై ఆడియన్స్ ఏదో గోల చేస్తున్నారు.. అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా.. అది తాను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.అయితే గతనెలలో రష్మిక- విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టాలీవుడ్ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫుల్గా ఫిక్సయిపోయారు. -
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
సినిమాను తెరకెక్కించడమే కాదు..దాన్ని జనాలకు రీచ్ అయ్యేలా ప్రచారం చేయడంతో రాజమౌళి(SS Rajamouli) దిట్ట. ఎలా ప్రమోషన్స్ చేస్తే ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది? ఎలాంటి ఈవెంట్స్ పెడితే సీనీ ప్రేక్షకులు ఆకర్షితులవుతారు? అనే విషయం జక్కన్నకు బాగా తెలుసు. అంతేకాదు తన ప్రచారాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలో కూడా ఆయన తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జక్కన చేసిన ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయన నిర్వహించిన ఈవెంట్స్ రిలీజ్కు ముందే సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు మహేశ్బాబు సినిమా(SSMB29)ను కూడా స్ట్రాటజీని అప్లే చేయబోతున్నారు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారట. టైటిల్ అనౌన్స్మెంట్ మొదలు..టీజర్, ట్రైలర్.. ఇలా పలు ఈవెంట్లను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నారు. ఈ ఈవెంట్ని హైదరాబాద్లోని రామోజీఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్నారు.భారీ ధరకు ప్రచార రైట్స్జక్కన్న ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అలాగే ప్రతీదీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేస్తున్న జక్కన్న.. ఆ సొమ్ముని కూడా తిరిగి నిర్మాతకు అప్పగిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్కి అమ్మేశారు. భారీ ధరకు జియోస్టార్ ఈ రైట్స్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ మొదలు.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ని జియోస్టార్కు విక్రయించి..ఈ రూపంలోనూ నిర్మాతకు భారీ సొమ్ముని అందించాడట. ఇప్పటివరకు ఏ సినిమా టైటిల్ రివిల్ కార్యక్రమానికి సంబంధించిన హక్కులను ఇలా ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయలేదు. కానీ తొలిసారి మహేశ్ బాబు- రాజమౌళి సినిమా విషయంలోనే ఇలా జరగటం విశేషం.(చదవండి: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న స్టార్ హీరో.. ఒక్క మాట అనలేదు!)ఈ నెల 15న జరిగే టైటిల్ రిలీజ్ ఈవెంట్కి దాదాపు లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ గ్లింప్స్ ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. భారతీయ సినీ చరిత్రలో ఇంతవరకు జరగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట.టైటిల్ ఇదేనా.. రాజమౌళి ఒక సినిమాను ప్రకటించినప్పుడే వర్కింగ్ టైటిల్ని ప్రకటిస్తాడు. అదే టైటిల్ని సినిమాకు పెట్టి..అధికారికంగా వెల్లడిస్తాడు. కానీ మహేశ్ బాబు సినిమా టైటిల్ విషయంలో జక్కన్న గోప్యత పాటించాడు. సినిమా పేరు గురించి ఇంతవరకు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ‘వారణాసి’అనే టైటిల్ని పెట్టబోతున్నట్లు ఆ మధ్య నెట్టింట వైరల్ అయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే సినిమాకు అలాంటి సింపుల్ టైటిల్ పెట్టరని చాలా మంది కొట్టిపారేశారు. (చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)మహేశ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. కానీ ఈ సినిమాకు ‘వారణాసి’నే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15న ఇదే టైటిల్ని ప్రకటిస్తారట. ఇప్పటికే ఈ పేరుని మరో నిర్మాత ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించుకొన్నాడు . ఆయన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ అది కుదరకపోతే..‘వారణాసి’ ముందో లేదా వెనకాలో ఏదో ఒక పదాన్ని యాడ్ చేసి నవంబర్ 15న టైటిల్ని ప్రకటిస్తారు. టైటిల్ కోసం మహేశ్ ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. -
ఏంజెల్లా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
దుల్కర్ సల్మాన్ కాంత.. ట్రైలర్ ఎప్పుడంటే?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత(Kaantha Movie). ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ను డేట్ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 6న కాంత ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. THE FIRST SPARK (Tamil) - OUT NOW!💥TRAILER ON NOV 6th!⚡️https://t.co/FV0u8YSzdkA @SpiritMediaIN and @DQsWayfarerFilmproduction#Kaantha #DulquerSalmaan #RanaDaggubati #SpiritMedia#DQsWayfarerfilms #Bhagyashriborse#SelvamaniSelvaraj #Kaanthafilm#KaanthaFromNov14…— Wayfarer Films (@DQsWayfarerFilm) November 4, 2025 -
చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. ఫస్ట్ లుక్ అదుర్స్!
తండేల్ మూవీ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య(Naga chaitanya) భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీ కోసం కార్తీక్ దండుతో ఆయన జతకట్టారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24(NC24) వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అడ్వంచరస్ మైథాలజీ చిత్రంగా రానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ అడ్వెంచరస్ మూవీలో దక్ష పాత్రలో మెప్పించనుంది. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తుంటే పురావస్తు శాఖలో శాస్త్రవేత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలోనూ ఐపీఎస్ ఆఫీసర్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సారి మరో డిఫరెెంట్ రోల్తో అభిమానులను అలరించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. Super excited to be a part of this team and to Be playing ‘DAKSHA’ . Get ready for a an exciting journey 🥰 https://t.co/NsfGkrI71X— Meenaakshi Chaudhary (@Meenakshiioffl) November 4, 2025 -
చుక్కల డ్రెస్లో కృతిశెట్టి.. బహు చక్కగా! (ఫొటోలు)
-
స్కూల్ డ్రస్ పాప ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. గుర్తుపట్టారా?
ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ స్టార్సే. దీంతో ఈమె కూడా పెరిగి పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. రీసెంట్గానే సూపర్స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు స్కూల్ డ్రస్సులో కనిపిస్తోంది. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా! ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన స్కూల్ డ్రస్సులో మధ్యలో ఉన్న కూర్చుని పాప పేరు శ్రుతి హాసన్. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఈమె అందరికీ తెలుసు. ఈమె తల్లి సారిక కూడా నటి. తండ్రి కమల్ 'హే రామ్' మూవీలో బాలనటిగా శ్రుతి హాసన్ నటించింది. అలా తొలిసారి స్క్రీన్పై మెరిసింది. మరోవైపు టీనేజీలోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకుని సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 2009లో లక్ అనే హిందీ మూవీతో తిరిగి నటిగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్కు 'గబ్బర్ సింగ్'తో బ్రేక్ దొరికింది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ అంటూ మూవీస్ చేసింది. 2023లో 'సలార్', ఈ ఏడాది రజనీకాంత్ 'కూలీ' చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని కూడా పలకరించింది. రీసెంట్గా ఈమె స్కూల్ ఫొటో ఎందుకో వైరల్ అయింది. దీంతో ఈమె ఎక్కడుందా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆ పాప శ్రుతి హాసన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.శ్రుతి హాసన్ వ్యక్తిగత జీవితానికొస్తే.. కెరీర్ ప్రారంభంలో హీరో సిద్ధార్థ్తో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇది నిజమా కాదా అనుకునేలోపు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలు వేసుకుని కనిపించింది. కొన్నాళ్ల క్రితం ఆర్టిస్ట్ శంతను హజరికాతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అతడి నుంచి కూడా విడిపోయింది. ప్రస్తుతానికైతే ఒంటరిగానే ఉంది. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో?(ఇదీ చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్) -
నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్
'అందాల రాక్షసి' హీరోగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన రాహుల్ రవీంద్రన్.. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. మరోవైపు దర్శకుడిగానూ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. పాన్ ఇండియా సెన్సేషన్ రష్మికతో 'ద గర్ల్ ఫ్రెండ్' అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తీశాడు. ఈ శుక్రవారం ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్.. తన భార్య తాళిబొట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'నాకు పెళ్లి అయిన తర్వాత.. మంగళసూత్రం (తాళి) మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది ఓ వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధన మహిళలకు మాత్రమే ఉండటం సరికాదు' అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని కూడా పాజిటివ్గానే తీసుకుంటున్నాడు. తాజాగా రాహుల్ ఇలా అన్నాడని చెప్పి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దానికి స్పందించిన ఓ నెటిజన్.. 'నీ మీదున్న గౌరవం పోయింది రాహుల్ అన్న' అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన రాహుల్.. 'ఒకరి మాటలతో ఏకీభవించకపోవడం, ఒకరిపై గౌరవం పోవడం ఓకే బడ్డీ. కానీ నువ్వు ఈ విషయాన్ని కూడా గౌరవంగా సంభోదిస్తూ చెప్పావ్ చూడు. ఆ విషయంలో నిన్ను మెచ్చుకుంటున్నాను' అని అన్నాడు.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా విషయానికొస్తే.. రష్మిక లీడ్ రోల్ చేసింది. దీక్షిత్ శెట్టి ఈమె సరసన నటించాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేమకథనే అయినప్పటికీ సమ్థింగ్ డిఫరెంట్గా ఉండబోతుందనిపిస్తోంది. రాహుల్ నటుడే అయిప్పటికీ గతంలో 'చిలసౌ' అనే మూవీతో దర్శకుడిగా మారాడు. హిట్ కొట్టాడు. తర్వాత 'మన్మథుడు 2' తీశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్టర్గా వస్తున్నాడు. వ్యక్తిగత జీవితానికొస్తే సింగర్ చిన్మయిని రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
విజయ్ సేతుపతి కుమారుడి సినిమా.. అదిరిపోయేలా ట్రైలర్
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేశాడు. అతను నటించిన తొలి సినిమా తమిళ్లో ‘ఫీనిక్స్’ పేరుతో ఇప్పటికే విడుదలైంది. అక్కడ ఫర్వాలేదనిపించిన ఈ మూవీ ఇప్పుడు ఇదే టైటిల్తో తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు.ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించారు. జూలై 4న తమిళ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తెలుగు వర్షన్ నవంబర్ 7న థియేటర్లో విడుదల కానుంది. ఈమేరకు హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను కూడా మేకర్స్ నిర్వహించారు.ఫీనిక్స్ సినిమాలో యాక్షన్తో పాటు అద్భుతమైన ఎమోషన్ కూడా సూర్య సేతుపతి పండిచాడు. వరలక్ష్మీ శరత్కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. మీడియా సమావేశంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తన కుమారుడు ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎమోషనల్ అండ్ హై యాక్షన్ స్టోరీతో సినిమా తీశామని తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన తెలిపారు. -
మమ్ముట్టి ఖాతాలో అరుదైన రికార్డు
మమ్ముట్టి(Mammootty) నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఆయన జీవించేస్తాడు. తెరపై స్టార్లా కాకుండా పాత్రకు తగ్గ నటుడిలాగానే కనిస్తాడు. ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘భ్రమయుగం’(Bramayugam). గతేడాది విడుదలైన ఈ చిత్రం ఎన్ని రికార్డులకు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. భారీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుంది. తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లోనూ(Kerala State Film Awards 2025) ఈ చిత్రం సత్తా చాటింది. నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది.ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ సహాయ నటుడిగా సిద్ధార్థ్ భరతన్, ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రోనెక్స్ జేవియర్ అవార్డులు గెలుపొందారు. ఈ అవార్డుతో మమ్ముట్టి ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్ర స్థాయిలో అత్యధిక సార్లు(7) ఉత్తమ నటుడి విభాగంలో అవార్డు అందుకున్న నటుడిగా మమ్ముట్టి రికార్డు సృష్టించారు.భ్రమయుగంలో తాంత్రిక విద్యలు తెలిసిన కొడుమోన్ అనే పాత్రను మమ్ముట్టి పోషించారు. . ఈ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరు.. భారతదేశపు అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఆయన స్థాయిని పునరుద్ఘాటించింది. కొన్ని తరాలకు గుర్తుండిపోయే సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మక సరిహద్దులను చెరిపివేసి.. మలయాళ సినిమా ఎలా ముందుకు వెళుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణగా 'భ్రమయుగం' నిలిచింది. నిర్మాతలు రామచంద్ర చక్రవర్తి (నైట్ షిఫ్ట్ స్టూడియోస్), ఎస్. శశికాంత్ (వైనాట్ స్టూడియోస్) తమ సినిమా సృజనాత్మక దృష్టిని గుర్తించినందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జ్యూరీ, విమర్శకులు, మీడియా మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“ఈ అవార్డులు ప్రయోగాత్మక కథలపై మా నమ్మకాన్ని మరింత బలపరిచాయి. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి, కేరళ సినిమాకు కొత్త దారులు చూపే ప్రయత్నాలను కొనసాగించడానికి ఇవి మాకు ప్రేరణగా నిలుస్తాయి. మా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం మరియు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.” అంటూ నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.గత సంవత్సరం విడుదలై విశ్వవ్యాప్త ప్రశంసలు అందుకున్న 'భ్రమయుగం' చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వం వహించారు. మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి అద్భుతమైన తారాగణం నటించారు. -
ఆషికా రంగనాథ్ బార్సిలోనా ట్రిప్ (ఫొటోలు)
-
పాన్ ఇండియా చిత్రంగా ‘కాళీమాతా’
ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jagadishwar Reddy) కొత్త సినిమాను ప్రకటించాడు. నిజ సంఘటనల ఆధారంగా ‘కాళీమాతా’(Kalimatha)ని తెరకెక్కించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి ఆయన కథను అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ని ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘కాళీమాతా కేవలం సినిమా కాదు — ఇది ఒక ఉద్యమం.నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం మతం, జాతి, భాష, ప్రాంతం అనే సరిహద్దులను దాటి — “సత్యానికి పాస్పోర్ట్ ఉండదు” అనే విశ్వసత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇది న్యాయం కోసం, సత్యం కోసం మానవత్వం చేసే ఆత్మపోరాటాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్స్ నటించబోతున్నారు. అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియాతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేస్తాం. కాస్టింగ్తో పాటు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు. -
'రాజాసాబ్' వాయిదా రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
గతేడాది 'కల్కి'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది 'కన్నప్ప'లో అతిథి పాత్రలో మెరిశాడు. బాహుబలి రీ రిలీజ్ వల్ల మరోసారి థియేటర్లలోకి వచ్చాడు. కానీ స్ట్రెయిట్ మూవీ మాత్రం రాలేదు. లెక్క ప్రకారం డిసెంబరు 5న 'రాజాసాబ్' రావాల్సింది. కానీ సంక్రాంతికి వాయిదా వేశాడు. జనవరి 9న రిలీజ్ అని అధికారికంగానే ప్రకటించారు. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వాయిదా అనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.'రాజాసాబ్' సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. ఇవి చూసుంటే ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగానే ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే పని జరుగుతోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఈసారి కూడా ఆలస్యమయ్యేలా ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఖండించిన నిర్మాత.. చెప్పినట్లుగానే జనవరి 9న మూవీ రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)డిసెంబరు 25వ తేదీ కల్లా సినిమా తొలి కాపీ రెడీ అయిపోతుందని, అమెరికాలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని.. పనిలోపనిగా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశారు. దీంతో వాయిదా ఏం లేదులే అని ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హారర్ ఫాంటసీ కథతో తీశారు. భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో ఉండే పాటలు, ఫైట్స్, రొమాన్స్ లాంటివి కూడా ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ అని ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రధారి. తమన్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్) -
తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్
తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి)ఏం జరిగింది?స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు.దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్లో నవీన్ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ) -
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu)లో మాధురి ( Madhuri) కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నారు. అయితే, హౌస్లో ఉన్నన్నిరోజులు తనదైన రీతిలో ముద్రవేశారు. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మాధురి 8వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో బిగ్బాస్ షో గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆపై భరణి, తనను కలిపి ట్రోల్ చేస్తున్నవారిపై విరుచుకుపడ్డారు. భరణి రీఎంట్రీ వెనుకు దాగి ఉన్న అసలు కారణం ఏంటో మాధురి ఓపెన్గా చెప్పారు.భరణితో మీమ్స్.. భగ్గుమన్న మాధురిబిగ్బాస్లో మాధురి ఉన్నన్నిరోజులు తన గేమ్తో పాటు పదునైన మాటలతో ఫైర్ అయ్యారు. అయితే, హౌస్లో ఉన్నది కొద్దిరోజులు మాత్రమే అయినప్పటికీ తనకు నచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడా కూడా బిగ్బాస్కు సరెండర్ అయి గేమ్ ఆడలేదనిపించేలా సత్తా చాటారు. అయితే.. ఆమె హౌస్లో ఉండగా కొందరు అదేపనిగా భరణి, మాధురి ఫోటోలతో ట్రోల్స్ చేశారు. వాటిపై ఆమె ఇలా ఇరుచుకుపడ్డారు. 'సోషల్మీడియాలో కొందరు బుద్దిలేని ఎదవలు మాత్రమే ఇలాంటి మీమ్స్ వేశారు. దీపావళి పండగ సందర్బంగా హోస్ట్ నాగార్జున చెబితేనే భరణితో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా చాలా దూరంగా ఉంటూనే రెండు స్టెప్పులు వేశాను. కనీసం అతని చేతులు కూడా నేను టచ్ చేయలేదు. ఎలాంటి అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేస్తే నీచాతినీచంగా ఇలాంటి ట్రోల్స్ చేస్తారా..? నాపై ఎవడైతే ట్రోల్స్ చేశాడు వాడు మనిషి కాదు.. ఒక పశువుతో సమానం. మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడూ కూడా ఇలాంటి నీచమైన ట్రోల్స్ చేయడు.' అని ఆమె ఆవేదన చెందారు.భరణి రీఎంట్రీ వెనుక నాగబాబుబిగ్బాస్లో అత్యంత పేలవమైన కంటెస్టెంట్గా భరణి ఉన్నారు. హౌస్లో అందరితో బాగుండాలనే ఆలోచనతో ఎక్కువగా బాండింగ్స్ పెట్టుకోవడం ప్రేక్షకులకు నచ్చేలేదు. తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని హౌస్ట్ నాగార్జున కూడా చెప్పారు. దీంతో ఆయన 7వ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే, రీఎంట్రీ పేరుతో దమ్ము శ్రీజ, భరణిని హౌస్లోకి పంపారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే హౌస్లో ఉంచుతామని బిగ్బాస్ చెప్పారు. అయితే, దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందని ప్రేక్షకులు ఎక్కువగా భావించారు. కానీ, ఫైనల్గా ఆ ఛాన్స్ భరణికి దక్కింది. ఈ అంశంలో మాధురి కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు ఆశీస్సులు భరణికి ఉన్నాయని.., అందుకే నాగబాబుకు రెండో ఛాన్స్ ఇచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే విషయంలో దమ్ము శ్రీజ కూడా రియాక్ట్ అయింది. భరణి రీఎంట్రీ కోసం తనను బలి చేశారని ఆమె చెప్పింది. భరణి రీఎంట్రీపై చాలామంది ప్రేక్షకులు కూడా తమ అసంతృప్తి తెలిపారు.భరణి కోసం ట్వీట్ వేసిన నాగబాబుబిగ్బాస్ సీజన్ ప్రారంభంలోనే భరణి కోసం నాగబాబు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఇలా ట్వీట్ చేశారు. 'నాకు చాలా సన్నిహితుడైన నా ప్రియమైన భరణి శంకర్.. బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం అతనికి నిజంగా విజయాన్ని, గుర్తింపును తీసుకురావాలి.' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.తనూజ విన్నర్ అవుతుందిబిగ్బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అవుతుందని మాధురి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తనకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె సేఫ్ గేమ్ ఆడటం లేదని క్లారిటీ ఇచ్చారు. 'వాస్తవంగా ఎలిమినేషన్ రౌండ్లో నన్ను సేవ్ చేస్తానని తనూజ కోరింది. నేను వద్దని చెప్పాను. గౌరవ్కు గేమ్ ఆడాలని ఆశ ఉంది కాబట్టి తనను సేవ్ చేయమని తనూజను కోరాను. అంతేకాకుండా హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నా భర్త పుట్టినరోజు ఉందని తనూజకు చెప్పాను. ఎట్టిపరిస్థితిల్లోనూ నన్ను సేవ్ చేయవద్దని ఒట్టు కూడా తనూజతో వేయించుకున్నాను.' అని మాధురి చెప్పారు. -
ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ
కొన్నాళ్ల క్రితం పలు వివాదాలకు కారణమైన తమిళ సినిమా 'బ్యాడ్ గర్ల్'. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని చెప్పి టీజర్ రిలీజ్ టైంలో చాలా హడావుడి చేశారు. సెన్సార్ దగ్గర కూడా పలు సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు సెప్టెంబరు తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు(నవంబరు 04 నుంచి) ఓటీటీలోకి వచ్చేసింది. హాట్స్టార్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరు ఆడపిల్లల్లానే తనకు కూడా ఓ బాయ్ ఫ్రెండ్, సుఖంగా ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే చాలు అని కలలు కంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్లో ఉంటుంది. వీటిలో ఏ బంధం కూడా ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా కావడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ కుర్రాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగితే సమాజం అతడిని ఏం అనదు. ఇదే పని ఓ అమ్మాయి చేస్తే తిరుగుబోతు అనే ముద్ర వేస్తుంది. ఆమె వైపు నుంచి తప్పుందా? అబ్బాయిల వైపు తప్పుందా? అనేది ఎవరు పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడిన ఓ అమ్మాయి కథే 'బ్యాడ్ గర్ల్'.సాధారణంగా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాల్లో మగాళ్లని కొన్నింట్లో వెధవల్లా, మరికొన్నింట్లో విలన్స్గా చూపిస్తుంటారు. 'బ్యాడ్ గర్ల్'లో అలాంటివేం ఉండవు. కేవలం ఓ అమ్మాయి మనసుని.. టీనేజీ నుంచి 30స్లోకి వచ్చేంతవరకు ఆవిష్కరించారు. ఏ మతం, ఏ కులంలో పుట్టినా సరే ఆడవాళ్లకూ మనసు ఉంటుంది. దానికి బోలెడన్ని కోరికలు ఉంటాయి. ఈ సినిమాలోనూ హీరోయిన్కి ప్రేమ, శృంగారం లాంటి ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. ఎంతలా అంటే 9వ క్లాస్లో ఉన్నప్పుడే స్కూల్లోనే ఓ అబ్బాయికి ముద్దు పెడుతుంది. కాలేజీకి వెళ్లేసరికి శృంగారం, జాబ్ చేస్తున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఇలా ఉంటాయి.ఓ అమ్మాయి తనకు నచ్చినట్లు బతికితే ఈ సమాజం, ఇందులోని వ్యక్తులు.. 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్రవేస్తారు అనేది చెప్పిచెప్పనట్లు ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్లో ఆడపిల్లని పిల్లి పిల్లతో పోల్చి చూపించడం.. ఈ క్రమంలో రమ్య తల్లి చెప్పే డైలాగ్ భలే అనిపిస్తాయి. 'ఓ అబ్బాయి చేసిన గాయాన్ని మరో అబ్బాయి మానిపోయేలా చేయలేడు' లాంటి కొన్ని డైలాగ్స్ కూడా అవును నిజమే కదా అనిపించేలా చేస్తాయి. మూవీ విడుదలకు ముందు బ్రహ్మణులని టార్గెట్ చేసేలా సీన్స్ ఉన్నాయని అన్నారు గానీ చూస్తున్నప్పుడు అలా ఏం కనిపించలేదు.ఎవరెలా చేశారు?రమ్యగా అంజలి శివరామన్ అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. టీనేజీ అమ్మాయిలా ఎంత బాగుందో.. స్వతంత్ర భావాలుండే మహిళగానూ చక్కగా ఇమిడిపోయింది. ఈమె పలికించిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. ఈమె తల్లి పాత్ర చేసిన శాంతిప్రియ చాలా రియలస్టిక్ యాక్టింగ్ చేశారు. రమ్య స్నేహితురాలిగా చేసిన సెల్వి, బాయ్ఫ్రెండ్స్గా చేసిన హ్రిదు, శశాంక్, అరుణాచలం కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకురాలు వర్ష భరత్ గురించి చెప్పాలి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ల కోరికలు ఏంటి అనే విషయాల్ని ఫెర్ఫెక్ట్గా చూపించారు. ఈమెకు తోడు అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా సరిపోయాయి. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. చూసే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలాగ్స్ రియలస్టిక్గా ఉంటాయి కాబట్టి కుదినంతవరకు ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన -
జైలర్– 2 ఫ్యాన్స్కు గుడ్న్యూస్
నటుడు రజనీకాంత్( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీష్రాప్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్– 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్ తన షూటింగ్ను పూర్తి చేసుకుని తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. కాగా రజనీకాంత్ తదుపరి సుందర్.సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన చాలా కాలం క్రితం సుందర్.సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వినోదాన్ని మేళవించిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్, కమలహాసన్ కాంబోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది. దీన్ని రజనీకాంత్ ,కమలహాసన్ల వారుసురాళ్లు, సౌందర్య రజనీకాంత్, శృతీహాసన్ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్ పుట్టిన రోజు అయిన ఈ నెల 7న రజనీకాంత్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మోహన్బాబు @ 50
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మంచు మోహన్బాబు. ఆయన స్వర్ణోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన తనయుడు విష్ణు మంచు ఈ నెల 22న ‘ఎమ్బీ50– ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ‘‘నాన్నగారు(మోహన్ బాబు) ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు దశాబ్దాలుగా ఆయన ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. శక్తివంతమైన నటన, ఐకానిక్ డైలాగ్ డెలివరీ, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. 600కి పైగా చిత్రాల్లో నటించారంటే ఆయన బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల అంకితభావాన్ని చాటుతాయి. కేవలం సినీ విజయాలే కాకుండా కళ, విద్య, దాతృత్వం పట్ల ఆయన చూపిన నిబద్ధత కూడా గొప్పది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని, విలక్షణ నటుడిగా ఎదిగిన ఈ ప్రయాణం గురించి మరోసారి చాటి చెప్పబోతున్నాం. ‘ఎమ్బీ50– ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని విష్ణు మంచు తెలిపారు. -
ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక కనిపించరు: దీక్షిత్ శెట్టి
‘‘మనం ఒకే తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం వినోదం కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ, కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే ఇంటివరకూ క్యారీ అవుతుంది. అలాంటి సినిమా ఇది. నా కెరీర్లో చేసిన మూవీస్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఉత్తమ చిత్రం అని చెప్పగలను’’ అని దీక్షిత్ శెట్టి చెప్పారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ–‘‘దసరా’ చిత్రం తర్వాత రాహుల్ రవీంద్రన్గారు నన్ను సంప్రదించి, ‘ది గర్ల్ ఫ్రెండ్’లో విక్రమ్ పాత్రకి నేను సరిపోతానని చెప్పారు. రాహుల్గారికి ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ పాత్ర చేయడం సులభం అయ్యింది. ఈ సినిమా కేవలం యువత కోసమే కాదు.. కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రంలో రష్మికగారి నటన చూశాక ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి మరో నాయిక న్యాయం చేయలేదేమో? అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై రష్మిక కనిపించరు.. ఆమె చేసిన భూమా పాత్ర మాత్రమే కనిపిస్తుంది.రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ టైమ్లో అల్లు అరవింద్గారు రషెస్ చూసి, పిలిస్తే వెళ్లాను. ఆయన నన్ను అభినందించి, తర్వాతి చిత్రానికి అడ్వాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. విద్య, ధీరజ్గార్లు మా యూనిట్కి కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మా సినిమాకు హైలైట్ అవుతుంది. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు ఇష్టం. అందుకే తెలుగు భాషని కూడా నేర్చుకున్నాను. విక్రమ్ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను.బాగా నటిస్తే భాషతో సంబంధం లేకుండా ఆయా నటీనటులను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘దసరా’ చిత్రం నుంచి హీరో నానిగారితో నా అనుబంధం కొనసాగుతోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్, ట్రైలర్ బాగున్నాయంటూ ఆయన ప్రశంసించడం సంతోషం. ఇక నేను కన్నడలో నటించిన ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో ‘షబనా, కేజేక్యూ’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నా. కన్నడలో శివ రాజ్కుమార్గారితో కలిసి ఓ మూవీ చేస్తున్నా. మలయాళంలో నటించిన ‘ఏంజెల్ నెం.16’ రిలీజ్కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని తెలిపారు. -
స్టెప్పులు అదుర్స్
ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు రవితేజ. ఆయన హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ . ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో జరుగుతోంది.ప్రత్యేకంగా వేసిన సెట్లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ– ఆషికలపై అదిరిపోయే పాటని చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో రవితేజ న్యూ స్టైలిష్ లుక్లో కనిపిస్తారు. హ్యూమర్, ఎమోషన్ , రవితేజ మార్క్ ఎనర్జీతో పాటుగా, మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. రవితేజ కెరీర్లోని ఈ 76వ సినిమాకు ‘అనార్కలి, రోల్ మోడల్, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
గుమ్మడి నర్సయ్య పోస్టర్.. ప్రభాస్ పెద్దమ్మ ప్రశంసలు!
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో వస్తోన్న చిత్రం గుమ్మడి నర్సయ్య. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల రిలీజైన గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్పై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవీ ప్రశంసలు కురిపించింది. ఈ మోషన్ పోస్టర్ను చూసిన శ్యామలా దేవీ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు.శ్యామలా దేవీ మాట్లాడుతూ .. ‘పోస్టర్ ఎక్సలెంట్గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. -
విష్ణు విశాల్ ఆర్యన్.. అర్థం లేని క్లైమాక్స్.. దెబ్బకు కట్!
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన లేటేస్ట్ మూవీ ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇటీవలే తమిళనాడు థియేటర్లలో విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కించారు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా అంతగా రాణించలేకపోతోంది.అయితే ఈ మూవీలోని క్లైమాక్స్ సీక్వెన్స్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ మూవీ క్లైమాక్స్లో విలన్ సెల్వ రాఘవన్ ఆ నలుగురిని ఎందుకు చంపాడనేది ఈ సీన్తో సెట్ కాలేదని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వేదికగా నిలదీశారు. ఆ సన్నివేశం స్క్రీన్ప్లేతో సరిపోలేదని ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో ఆర్యన్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీలో కీలకమైన క్లైమాక్స్ చివరి పది నిమిషాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో ఆ సీన్లను తీసేసినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి థియేటర్లలో సెల్వ రాఘవన్ క్లైమాక్స్ సీన్స్ కట్ చేసినట్లు వెల్లడించారు. కొత్త వెర్షన్ సోమవారం నుంచే థియేటర్లలోకి వస్తుందని ఆర్యన్ నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ చిత్రంలోని పది నిమిషాల క్లైమాక్స్ సీన్స్ తెలుగు వెర్షన్ నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ అక్టోబర్ 31న విడుదల చేయాలని భావించారు. కానీ రవితేజ మాస్ జతార, ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి: ది ఎపిక్ రిలీజ్ కావడంతో వాయిదా వేసుకున్నారు. ఈ మూవీని నవంబర్ 7న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీని విష్ణు విశాల్ తన బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతమందించారు. #Aaryan - The suspense soars in theatres now, with solid audience response 💥A big opening weekend for the film all over!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts… pic.twitter.com/Wa0lezNEaj— Vishnu Vishal Studioz (@VVStudioz) November 3, 2025 -
ప్రభాస్తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్బాస్ షోలోనూ సందడి చేసింది.తాజాగా ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్తో చిట్చాట్ నిర్వహించింది. రష్అవర్ పేరుతో ట్విటర్ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్తో కలిసి నటిస్తారా? అలా జరిగితే మీ కాంబో హైప్ దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక.. ప్రభాస్తో నటించడం నాకు కూడా ఇష్టమే.. ఒకవేళ ప్రభాస్ ఈ మేసేజ్ చూస్తారని ఆశిస్తున్నా.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికీ బాలీవుడ్ భామ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ఫ్రెండ్ చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది.😆😆😆😆🩷 I love it.. I hope Prabhas sir see’s this message and I hope we really do work together on something special soon! 🩷— Rashmika Mandanna (@iamRashmika) November 3, 2025 -
స్కర్ట్లో రకుల్.. గ్లామర్ మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే. -
రవితేజ.. తిరిగి చూసుకోవాల్సిన టైమొచ్చింది!
రవితేజ.. టాలీవుడ్లో ఈ పేరుకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్లోకి ఇండస్ట్రీలోకి వచ్చి.. చిన్నచితకా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ ఆపై నటుడిగా, తర్వాత కాలంలో స్టార్ హీరో అయిన ఇతడు.. ఎందరో వర్ధమాన నటీనటులకు ఆదర్శం. కానీ ప్రస్తుతానికొస్తే రవితేజ సినిమాలపై బోలెడన్ని విమర్శలు. తాజాగా 'మాస్ జాతర'తో మరో ఫెయిల్యూర్. ఇదంతా చూస్తుంటే అసలు రవితేజ ఎందుకిలా చేస్తున్నాడు? ఎక్కడ తప్పు జరుగుతోంది? అనేది సగటు ప్రేక్షకుడి సందేహం.(ఇదీ చదవండి: 'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం)గత కొన్నేళ్లుగా రవితేజ సరైన సినిమాలు చేయట్లేదు. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి ఒకటి రెండు ప్రయోగాలు చేసినప్పటికీ వాటిలో యూనిక్ పాయింట్ని కమర్షియల్ అంశాలు డామినేట్ చేశాయి. దీంతో ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్గానే మిగిలిపోయాయి.2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా హిట్. దీని తర్వాత 'టచ్ చేసి చూడు', నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, క్రాక్, ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర.. ఇలా 13 చిత్రాలొచ్చాయి. వీటిలో క్రాక్, ధమాకా మాత్రమే హిట్. 'ధమాకా'పై విమర్శలున్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కాబట్టి హిట్టే.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)అసలు ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా సరే రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అది కూడా స్టార్ హీరోలతో పోలిస్తే వేగంగా. అయితే వేగంగా చేయడం కంటే కంటెంట్ పరంగా ఏది చేస్తున్నాం? ఎలాంటిది చేస్తున్నాం? ప్రేక్షకులకు ఇది నచ్చుతుందా? లాంటి అంశాలు రవితేజ ఓసారి ఆలోచించుకుంటే మంచిదేమో!రవితేజ అనగానే చాలామంది పాత సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు గానీ కొత్త చిత్రాల్లో ఒక్క దాని గురించి మాట్లాడట్లేదు. రవితేజ వైపు నుంచి యాక్టింగ్ పరంగా ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. కానీ ఆయనకు తగ్గ సినిమాలే ఎంచుకోవట్లేదు. ఈ విషయంలో రవితేజ కూడా పొరపాటు చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు స్టార్ దర్శకుల్ని రవితేజ వద్దనుకుంటున్నారా? లేదా వాళ్లే రవితేజ దగ్గరకు రావట్లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతే రవితేజ కూడా సగటు హీరోగానే మిగిలిపోతారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా ఓసారి వెనక్కి తిరిగి చూసుకుని ట్రెండ్కి దగ్గ దర్శకులు, ట్రెండ్కి తగ్గ స్టోరీస్ చేస్తే ఒకటి కాకపోయినా మరొకటి అయినా హిట్ అయి ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. చూడాలి మరి రవితేజ ఏం చేస్తారో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్.. ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. ఫుల్ లిస్ట్ ఇదే!
కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన 55వ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలిచింది. ఉత్తమ నటుడిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నిలిచారు. భ్రమయుగం చిత్రానికి గానూ ఈ ఘనత దక్కించుకున్నారు. ఉత్తమ నటిగా శామ్లా హంజా అవార్డ్ను సొంతం చేసుకుంది. ఫెమినిచి ఫాతిమా మూవీకి గానూ ఈ అవార్డ్ వరించింది. 2024 ఏడాదికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. మంజుమ్మెల్ బాయ్స్ ఏకంగా 9 విభాగాల్లో సత్తా చాటింది.కేరళ ఫిల్మ్ అవార్డ్స్ వీళ్లే..ఉత్తమ చిత్రం - మంజుమ్మెల్ బాయ్స్ (దర్శకుడు - చిదంబరం)ఉత్తమ నటుడు - మమ్ముట్టి (భ్రమ యుగం)ఉత్తమ నటి – శామ్లా హంజా (చిత్రం - ఫెమినిచి ఫాతిమా)ఉత్తమ దర్శకుడు - చిదంబరం ( మంజుమ్మెల్ బాయ్స్)రెండో ఉత్తమ చిత్రం - ఫెమినిచి ఫాతిమా (దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్)ప్రత్యేక జ్యూరీ (చిత్రం) - ప్యారడైజ్ (దర్శకుడు: ప్రసన్న వితానగే)ప్రత్యేక జ్యూరీ(ఫీమేల్) - జ్యోతిర్మయి (బౌగెన్విల్లా), దర్శన రాజేంద్రన్ (స్వర్గం)ప్రత్యేక జ్యూరీ (మేల్) - టోవినో థామస్ (ఏఆర్ఎం), ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం)ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం - ప్రేమలు (దర్శకుడు: గిరీష్ ఎ.డి.)ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్(మేల్) – సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్), సిద్ధార్థ్ భరతన్ (భ్రమయుగం)ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)ఉత్తమ తొలి దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) - చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెండ్) - లాజో జోస్, అమల్ నీరద్ (బౌగిన్ విల్లా)ఉత్తమ ఎడిటర్ - సూరజ్ ఇ.ఎస్. (కిష్కింధ కాండం)ఉత్తమ సినిమాటోగ్రఫీ - షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉమెన్ స్పెషల్ కేటగిరీ అవార్డ్- పాయల్ కపాడియా (ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్)ఉత్తమ కథ - ప్రసన్న వితనగే (స్వర్గం)ఉత్తమ స్వరకర్త - సుషిన్ శ్యామ్ (బౌగిన్విల్లా)ఉత్తమ నేపథ్య సంగీతం - క్రిస్టో జేవియర్ (భ్రమయుగం)ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) - కె.ఎస్. హరిశంకర్ (చిత్రం - ARM)ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) - సెబా టామీ (చిత్రం - ఆమ్ ఆ)ఉత్తమ లిరిక్స్ - మంజుమ్మెల్ బాయ్స్ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ - అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ సింక్ సౌండ్ - అజయన్ అడాత్ (పాణి)ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఫజల్ ఎ.బ్యాకర్, షిజిన్ మెల్విన్ హట్టన్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ సౌండ్ డిజైనింగ్ - షిజిన్ మెల్విన్ హట్టన్, అభిషేక్ నాయర్ (మంజుమ్మెల్ బాయ్స్)ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్) - భాసి వైకోమ్, రాజేష్ (బరోజ్ 3డీ)ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - సయనోరా ఫిలిప్ (బరోజ్ 3డీ)ఉత్తమ కొరియోగ్రఫీ - సుమేష్ సుందర్, జిష్ణుదాస్ ఎం.వి. (బౌగెన్విల్లా )ఉత్తమ మేకప్ - రోనెక్స్ జేవియర్ (బౌగెన్విల్లా, భ్రమయుగం)ఉత్తమ కాస్ట్యూమ్ - సమీరా సనీష్ (రేఖాచిత్రం, బౌగెన్విల్లా)ఉత్తమ వీఎఫ్ఎక్స్- జితిన్ లాల్, ఆల్బర్ట్ థామస్, అనిరుద్ధ ముఖర్జీ (ఏఆర్ఎం)ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్ - శ్రీక్ వేరియర్ (మంజుమ్మెల్ బాయ్స్, బౌగెన్విల్లా) -
యుక్తి తరేజా 'కె-ర్యాంప్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
గ్లామరస్ బొమ్మలా 'నేషనల్ క్రష్' రష్మిక (ఫొటోలు)
-
నిశ్చితార్థం కోసం అల్లు స్నేహా.. ఐలాండ్లో తమన్నా
మరిది నిశ్చితార్థం కోసం ఇలా ముస్తాబైన అల్లు స్నేహామలేషియాలోని ఓ ఐలాండ్లో తమన్నా ఫొటోషూట్దిక్కులు చూస్తూ రుక్మిణి వసంత్ ఫన్నీ పోస్ట్సిల్క్ చీరలో అందమే అసూయపడేలా రష్మిక'బైసన్' షూటింగ్.. సైకిల్ తొక్కుతూ అనుపమగ్రౌండెడ్ అంటూ నేలపై కూర్చుని అదితీ స్టిల్స్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
'ఎంతోమంది అమ్మాయిలతో రిలేషన్స్'.. బిగ్బాస్ కంటెస్టెంట్పై సంచలన ఆరోపణలు!
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ప్రస్తుతం ఆడియన్స్ను అలరిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ షో నడుస్తోంది. బుల్లితెర ప్రియుల్లో అత్యంత ఆదరణ ఈ షో పలువురు నటీనటులు కంటెస్టెంట్స్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హిందీలో బిగ్బాస్-19వ సీజన్కు చేరుకుంది. ఇందులో ప్రముఖ బుల్లితెర నటుడు అభిషేక్ బజాజ్ కూడా కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టారు.అయితే బిగ్బాస్లో ఉన్న బుల్లితెర నటుడిపై ఆయన మాజీ భార్య ఆకాంక్ష జిందాల్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అతని వ్యక్తిగత జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. వైవాహిక జీవితంలో అభిషేక్ తనను మోసం చేశాడని ఆరోపించింది. వాస్తవాలను దాచిపెట్టి.. నటించడంలో అతన్ని మించినవారు లేరని ఆకాంక్ష ఆరోపించింది.అభిషేక్ బజాజ్ తన వయస్సు, వైవాహిక జీవితం గురించి అబద్ధాలు ఆకాంక్ష జిందాల్ చెబుతున్నాడని తెలిపింది. అంతేకాకుండా అతనికి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది. తాము విడాకులు తీసుకోవడానికి అదే కారణమని.. తనతో పాటు ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆకాంక్ష జిందాల్ మాట్లాడుతూ.. “సల్మాన్ సార్ ముందు కూడా అబద్ధం చెప్పడానికి అస్సలు వెనుకాడడు. అతని వయస్సు, వైవాహిక స్థితి గురించి అబద్ధం చెప్పడం ఎప్పుడు అలవాటే. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో 21 ఏళ్ల వ్యక్తిగా తన చరిత్రను రిపీట్ చేస్తున్నాడు. అతని డిక్షనరీలో సిగ్గు అనే పదానికి చోటు లేదు. ఈ విషయాన్ని నేను ప్రతీకారం కోసం చెప్పడం లేదు. మీరందరూ ఇతర పోటీదారుల గురించి మాట్లాడే విధంగానే నిజం బయటకు రావాలని కోరుకుంటున్నా" అని తెలిపింది. -
'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం
పదేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'బాహుబలి'ని ఇప్పుడు రీరిలీజ్ చేశారు. రెండు భాగాల్ని కలిపి ఒక్కటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీకెండ్ అయ్యేసరికి ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం రికార్డే. ఎందుకంటే రీ రిలీజ్ మూవీస్కి ఈ రేంజు వసూళ్లు ఎప్పుడూ రాలేదు. మరోవైపు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. 'బాహుబలి' లేకపోతే తాను ఆ సినిమాల్ని తీసేవాడిని కాదని చెబుతున్నా ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫ్లాప్ దెబ్బకు నిర్మాత షాకింగ్ నిర్ణయం)ఏంటి విషయం?'బాహుబలి' సినిమా మన దేశంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. తెలుగు మూవీకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేయడంతో పాటు ఓ కథని రెండు భాగాలుగా కూడా చెప్పొచ్చనే దారిని దర్శకులకు చూపించింది. గతంలో అంటే 2022లో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఇందులో మాట్లాడిన డైరెక్టర్ మణిరత్నం.. 'బాహుబలి' లేకపోయింటే తాను 'పొన్నియిన్ సెల్వన్' తీసేవాడిని కాదని అన్నారు.''బాహుబలి' లేకపోతే 'పొన్నియిన్ సెల్వన్' లేదు. రాజమౌళి తన సినిమాను రెండు భాగాలుగా తీయకపోతే నేను ఈ చిత్రాన్ని తీసేవాడిని కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. రాజమౌళి మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే మేము కూడా ఒక సినిమాను రెండు భాగాలుగా తీయగలిగాం' అని మణిరత్నం చెప్పారు. పాత వీడియోనే అయినప్పటికీ అది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)If Rajamouli hadn’t made #Baahubali, I wouldn’t have made #PonniyinSelvan. He showed that Indian movies can be made on a big scale and still win hearts. Thank you, #Rajamouli, for the inspiration.:– Director Mani Ratnampic.twitter.com/hJ4CKQvtbo— Milagro Movies (@MilagroMovies) November 3, 2025 -
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్గా నిలిచిన భారత మహిళల టీమ్పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen)


