Movie News
-
హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?) -
'కేరళ క్రైమ్ ఫైల్స్ 2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఇదే సమయంలో విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్కు సీక్వెల్గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించాడు. పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసును ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. పలు మర్డర్ కేసులకు సంబంధించి పోలీసులు ఎలా చేధించారనేది దర్శకడు చెబుతున్నట్లు తెలుస్తోంది. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. జూన్ 20న జియోహాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడలో కూడా స్ట్రీమింగ్ కానుంది. -
మన 'పైడి జయరాజ్' పేరుతో అవార్డ్.. అందుకోనున్న 'మణిరత్నం'
భారతీయ సినిమా మాటలు నేర్వకముందే అంటే మూకీయుగంలోనే పైడి జైరాజ్ సినీ ప్రయాణం మొదలైంది. భారత తొలి మాటల చిత్రం అలం ఆరా (1931) సినిమాతో తనదైన ముద్ర వేసిన పైడి జైరాజ్ హిందీలో కూడా గుర్తింపు పొందారు. నేడు (జూన్ 14)న తెలంగాణ సర్కారు ఆయన పేరుతో అవార్డు ప్రదానం చేస్తోంది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ సెప్టెంబర్ 28, 1909లో జన్మించారు. పంజాబీ అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. 2000 ఆగస్టు 11న ఆయన మరణించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 11 మూకీ సినిమాల్లో 156 టాకీ సినిమాల్లో హీరోగా, 300 సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.1929లో బొంబాయికినిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో జైరాజ్ నాటకలు, సినిమాలపై ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. స్టార్క్లింగ్ యూత్ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతభూమి, ఆల్ ఫర్ లవర్, మహాసాగర్ మోతి, ఫ్లైట్ ఇన్టు డెత్, మై హీరో మొదలైన పదకొండు నిశ్శబ్ద చిత్రాల్లో నటించాడు. శాంతారామ్, అశోక్ కుమార్, పథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ వంటి వారితో ఏడు దశాబ్దాల పాటు కొనసాగారు. నిరూపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ల సరసన నటించారు. 86ఏళ్ల వయసులో 1995లో గన్ అండ్ గాడ్ సినిమా తరువాత సినీరంగం నుంచి తప్పుకున్నారు. టాకీకాలంలో మోహర్, మాల, ప్రతిమ, రాజ్ఘర్, సాగర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అమర్సింగ్ రాథోడ్, పథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, షాజహాన్, టిప్పు సుత్తాన్, హైదర్ ఆలీ వంటి పా త్రలు పోషించిన ఆయన హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, మలయాళం తదితర భాషా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.పైడి జైరాజ్ సినీ పురస్కారంరాష్ట్ర విభజన నాటి నుంచి 2014–2024 మధ్యలో విడుదలైన చిత్రాలకు గద్దర్ పేరున తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డులైన రఘుపతి వెంకయ్య, బీఎన్రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులకు తోడు తెలంగాణకు చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనుంది. సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ పేరున తొలిసారిగా అవార్డు ప్రకటించగా, ఈనెల 14న ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ప్రదానం చేయనున్నారు.తెలుగు సినిమాల సమీక్షల్లో తనదైన ముద్ర వేసి, సినీ రంగం పైన అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసిన కరీంనగర్ ఫిల్మీ సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర పైడి జైరాజ్పై నిర్మించిన డాక్యుమెంటరీ గాను 2024 సంవత్సరానికి బెస్ట్ ఫిలిం క్రిటిక్గా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును శనివారం హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రవిచంద్ర అందుకోనున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యులు లక్ష్మీ గౌతమ్, మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, కోల రామచంద్రారెడ్డి, వారాల మహేశ్ తదితరులు అభినందించారు. -
మృణాల్ కామెంట్స్ కమల్ హాసన్ చెవిన పడితే..
ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకుంటే స్టార్ హీరోహీరోయిన్లకు జరిగే నష్టమేమీ ఉండదు. అయితే అభిమానులు ఆ సమయంలో కాస్త నిరాశపడతారు. హీరోహీరోయిన్లు మాత్రం వాటిని అధిగమించి పోతుంటారు. కమల్ హాసన్( Kamal Haasan) వంటి వారైతే ఇలాంటివి ఇంతకుముందు చాలా చూసి ఉంటారు. ఆయన సమీపకాలంలో నటించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన ఇండియన్–2, థగ్లైఫ్ చిత్రాలు ప్రేక్షుకుల అంచనాలను అందుకోలేకపోయాయి. కాగా ప్రస్తుతం ట్విన్స్ స్టంట్మాస్టర్స్ అన్బరివ్లను దర్శకులుగా పరిచయంచేస్తూ కమల్ తన రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈచిత్రం ద్వారా ఆయన ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయనున్నారు. ఇందులో కమల్ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ దృష్టిలో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur) పడే ప్రయత్నం చేశారు. హిందీ, మరాఠి, తెలుగు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇంతకుముందు తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె మార్కెట్ డల్ అయ్యింది. మళ్లీ కోలీవుడ్లో మిస్ అయిన అవకాశాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తమకు నచ్చిన కథానాయకులతో జతకట్టాలని ఆశిస్తుంటారు. అలా మృణాల్ఠాకూర్ కమలహాసన్ సరసన నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కమల్తో కలిసి నటించాలని ఎంతగానో ఆశపడుతున్నానని పేర్కొన్నారు. కమల్తో కలిసి స్టెప్స్ వేయాలని ఆశపడుతున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. ఈ వార్త నటుడు కమల్ దృష్టికి వెళితే ఆమె కలను నెరవేరుస్తారా చూడాలి. -
అజిత్కి జోడీగా...
స్టార్ హీరో అజిత్కి జోడీగా శ్రీనిధీ శెట్టి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రీనిధీ శెట్టి. ఆ సినిమాపాన్ ఇండియా హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, తమిళ చిత్రం ‘కోబ్రా’ మంచి విజయాలు సాధించాయి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు శ్రీనిధి.ఈ చిత్రంలో తనదైన నటన, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... అజిత్ కుమార్తో నటించే క్రేజీ చాన్స్ను శ్రీనిధి అందుకున్నట్లు టాక్. అజిత్ నటిస్తున్న 64వ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.అజిత్తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ‘ఏకే 64’ (వర్కింగ్ టైటిల్)కి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నవంబరులో ఆరంభం అవుతుందట. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... అజిత్కి జోడీగా శ్రీనిధి నటిస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
రెండు గంటలు... ఏడు ప్రాజెక్ట్లు!
ఎనిమిది పదుల వయసులో ఎంతో చురుకుగా సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, టీవీ షోలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. వేగంగా పని చేయడం తనకు ఇష్టం అంటున్నారు ఈ బిగ్ బి. అందుకు ఉదాహరణగా ఇటీవల తాను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు (ఐదు వాణిజ్య ప్రకటనలు, రెండు ఫొటోషూట్లు) చేసిన విషయం గురించి చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రెండు గంటల్లో ఏడు ప్రాజెక్ట్లు చేయడంతో నా డైరెక్టర్ ఫ్రెండ్ ఒకరు ‘ఇలా పని చేయడం సరి కాదు.ఒక్క రోజులో పూర్తి చేయాల్సిన పనిని నువ్వు రెండు గంటల్లో పూర్తి చేస్తే ఎలా? నువ్వు పని వి«ధానాన్నిపాడు చేస్తున్నావు. ఇలా చేస్తే క్లైంట్లు ఒకే రోజులో ఎక్కువ ప్రాజెక్ట్లు చేయమంటారు. అది కరెక్ట్ కాదు’ అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నాకు ఇలా స్పీడ్గా పని చేయడం ఇష్టం’’ అని పేర్కొన్నారు అమితాబ్ బచ్చన్. -
మిస్టరీ థ్రిల్లర్గా హంటర్ ఛాప్టర్ -1.. గ్రాండ్ రిలీజ్
హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హంటర్ ఛాప్టర్ 1'. ఈ చిత్రంలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమాకు షరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ.రాజశేఖర్, సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.తాజాగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించారు. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోనుంది. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు!
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్పై ప్రభావం చూపింది.అయితే థగ్లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. -
అతి అభిమానం ఆరోగ్యానికి చాలా హానికరం.. బండ్ల గణేశ్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏది చేసిన వెరైటీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఆయన.. జీవితానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. తాజాగా బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా చేసిన నెట్టింట వైరల్గా మారింది. అతి ప్రేమ.. అతి అభిమానం.. అతి విశ్వాసం.. అతి నమ్మకం.. ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది కేవలం మన లైఫ్ కోటేషన్ తరహాలోనే పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తనకు నిజ జీవితంలో ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నట్లుగా కనిపిస్తోంది.ఇటీవల బండ్ల గణేశ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కలిశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కలిసి పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో కోట శ్రీనివాసరావు గుర్తు పట్టలేనంతగా మారిపోయినట్లు కనిపించారు. కాగా.. టాలీవుడ్లో పలు సినిమాల్లో నటుడిగి మెప్పించిన బండ్ల గణేశ్.. నిర్మాతగాను తనదైన ముద్రవేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.అతి ప్రేమ అతి అభిమానం అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం ………..!— BANDLA GANESH. (@ganeshbandla) June 13, 2025 -
'24 ఏళ్లుగా అక్కడే ఉన్నా.. నేను, నా స్నేహితులు షాకయ్యాం '
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. అక్కడే దాదాపు 24 ఏళ్లు నివసించానని తెలిపారు. తాను నివాసమున్న ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్లో విమాన ప్రమాదం జరిగిందని అన్నారు. నా బాల్యమంతా అక్కడే గడిచిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను నివసించిన ప్రాంతంలో ఈ విషాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన విన్న వెంటనే తాను, తన పాఠశాల స్నేహితులు షాక్లో ఉన్నామని తెలిపారు. కాగా.. కేరళలోని త్రిసూర్లో జన్మించిన ఉన్ని ముకుందన్ అహ్మదాబాద్లోని మణినగర్లో పెరిగారు.అంతకుముందు బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉన్ని ముకుందన్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. మేఘనినగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ఉన్ని ముకుందన్ సినీ కెరీర్ విషయానికొస్తే 'సీడన్' అనే తమిళ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'మల్లూ సింగ్'లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'విక్రమాదిత్యన్', 'కెఎల్ 10 పట్టు', 'స్టైల్', 'ఒరు మురై', 'వంతు పార్థయ', 'అచాయన్స్', 'మాలికప్పురం' 'మార్కో' చిత్రాలతో అభిమానులను అలరించారు. నిర్మాతహా తన తొలి చిత్రం'మెప్పడియాన్'కి జాతీయ అవార్డు అందుకున్నారు. -
'క్షీణించిన బిగ్బాస్ విన్నర్ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా'
బాలీవుడ్ నటి, బిగ్బాస్ విన్నర్ సనా మక్బుల్ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. లివర్ సైరోసిస్ అనే వ్యాధితో సనా పోరాడుతోంది. ఇటీవల సనా హాస్పిటల్ బెడ్పై ఫోటోను పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సనా ఐదేళ్లుగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్తో బాధపడుతోంది. గతంలోనే చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదని తెలుస్తోంది.తన ఆరోగ్యంపై సనా మాట్లాడుతూ.. 'నేను కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్తో బాధపడుతున్నా. కానీ ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. నా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా లేదు. నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇమ్యునోథెరపీని ప్రారంభించానని.. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి సారించానని' ఆమె తెలిపింది.అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సనా తెలిపింది కొన్ని రోజులు కష్టమైన సరే కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇది అంత సులభం కాదని.. కానీ నేను అంత తేలికగా వదిలిపెట్టనని సనా మక్బుల్ అన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తున్నానని తెలిపింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేసిందని చెప్పింది.కాగా.. సనా మక్బుల్ బిగ్బాస్ ఓటీటీ సీజన్-3 విన్నర్గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమాల చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. -
లగ్జరీ ఫ్లాట్లను అమ్మేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ కూడా నటించారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే హృతిక్ రోషన్ ఆయన తండ్రితో కలిసి ఖరీదైన మూడు ఫ్లాట్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఆంధేరి వెస్ట్లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తులు ముంబైలోని అంధేరి శివారులోనే ఉండగా.. వాటిలో రెండు ఆయన తండ్రి రాకేశ్ రోషన్వి కాగా.. మూడో ఫ్లాట్ హృతిక్ రోషన్కు చెందినదిగా సమాచారం.మరోవైపు హృతిక్ రోషన్ క్రిష్-4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను రాకేశ్ రోషన్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు హృతిక్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ రోషన్ దంపతులను వారి నివాసంలో కలిశారు. అతను క్రిష్ 4లో భాగం అవుతానని ఇప్పటికే ధృవీకరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే క్రిష్-4 ఇంకా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ దుర్ఘటన నిజంగా దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషాదంపై ఇప్పటికే టాలీవుడ్ సినీతారలతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారుయ ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
తొలిసారి బేబీ బంప్తో కనిపించిన మెగా కోడలు
మెగా కోడలు త్వరలో తల్లి కాబోతుంది. గత నెలలోనే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. తన భార్య లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భంతో ఉందని తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పటినుంచి అటు వరుణ్ గానీ ఇటు లావణ్య గానీ మీడియా కంట పడట్లేదు. తాజాగా ఇద్దరూ కలిసి మాల్దీవుల్కు వెకేషన్ వెళ్లారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లావణ్య బేబీ బంప్తో కనిపించింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. 'శక్తిమాన్')కలిసి రెండు సినిమాలు చేసిన వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత చాలావరకు సినిమాలు తగ్గించేసిన లావణ్య.. అంతకు ముందే ఒప్పుకొన్న ఒకటి రెండు సినిమాలు, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. అలా ఈ ఏడాది మే 6న తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.ఇప్పుడు బేబీ బంప్తో బీచ్ ఒడ్డున భర్తతో కలిసి కనిపించింది. ప్రస్తుతం వరుణ్-లావణ్య.. మాల్దీవుల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మెగా కోడలు ఇప్పట్లో కొత్త సినిమాలు చేయడం కష్టమే. ఒకవేళ బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్పై కనిపిస్తే కనిపించొచ్చు. లేదంటే మొత్తానికే కెరీర్ని వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు వరుణ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే కొంతమేర షూటింగ్ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) -
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
అమ్మతో పంచుకోలేనవి, నాన్నతో చెప్పుకోలేనివి, సోదరుడు/సోదరితో మాట్లాడలేనివి.. ఏవైనా సరే ఈ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. మొహమాటాలకు అస్సలు తావుండదు. అతడే ఫ్రెండ్.. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నమ్మి దోచుకునేవారికంటే నిజాయితీగా మసులుకునే ఫ్రెండ్ ఒక్కరున్నా చాలనుకునేవారు చాలామంది.ఫ్రెండ్స్ గ్యాంగ్మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)కు అలా చెప్పుకునే స్నేహితులు ముగ్గురున్నారు. వారే వితికా షెరు, మహాతల్లి జాహ్నవి, అంబటి భార్గవి. ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. తాజాగా వితికా షెరు (Vithika Sheru).. నిహారికకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. తనకోసం ఏం చేయాలా? అని ఆలోచించగా ఓ మంచి ఐడియా తట్టింది. నిహారిక పాటరీ స్టూడియోను అందంగా మార్చేసింది. భార్గవితో కలిసి ఆ పాటరీ గదిలోని ఓ గోడకు రంగు వేసింది. తర్వాత అక్కడున్న వస్తువుల్ని కొన్ని తీసేయించి అందంగా సర్దింది. కొన్ని పూలమొక్కల్ని కూడా గదిలో అలంకరించింది.నిహారికకు తెలియకుండా..ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పింది. నిహారిక, నేను ఒకే టీచర్ దగ్గర పాటరీ (మట్టి పాత్రలు తయారు చేయడం) నేర్చుకున్నాం. మేము ఫ్రెండ్స్ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం. నేను కుమ్మరి పనిలో బేసిక్స్ మాత్రమే వచ్చు. కానీ నిహారిక, భార్గవి డిగ్రీలు చేసేశారు అని చెప్పుకొచ్చింది. ఈ మేకోవర్ అంతా నిహారికకు తెలియకుండా చేసింది. తీరా ఆ పాటరీ స్టూడియోకు వచ్చిన నిహారిక.. తన గదిని అంత అందంగా మార్చిన వితికాను ముద్దులతో ముంచెత్తింది.దిష్టి తగలొద్దువితికా చేసిన పనిని మెచ్చుకుంటూ నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నీకు, నీ ప్రేమకు ఏ దిష్టీ తగలకూడదు. తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది. నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థాంక్యూ. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను. కానీ, నువ్వు చేసిన పని చూశాక నాపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలినైపోయాను. నువ్వెప్పుడూ నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్గా ఫీలయ్యేలా చేస్తావ్. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తావ్. దీన్ని నేను గ్రాంటెడ్గా తీసుకోను.. నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్యూ బేబీ.. అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. వితికా లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్? -
అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్ ఆగ్రహం!
అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.మీరా చోప్రా ట్వీట్లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. #AirIndia insensitivity is beyond shocking..My husband is scheduled to travel to Dubai on 15th June on @airindia and we wanted to cancel the flight due to the lack of safety measures. But Air India declined to refund any amount citing no advisory has come to them. We all took…— Meerraa Chopraa (@MeerraChopra) June 12, 2025 -
అల్లు అర్జున్.. 'శక్తిమాన్'
90స్ జనరేషన్కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) రీసెంట్గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు) -
ప్రదీప్ రంగనాథన్ బిగ్ ప్లాన్.. మరో హిట్ గ్యారెంటీనా?
కోలీవుడ్లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్హిట్ కొట్టారు. ఇటీవల డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్ ప్రస్తుతం విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది. -
'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా టీజర్.. ఈ నెల 16న రిలీజ్ చేస్తామని కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. దీంతో అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోనిది జరిగింది. ఎవరో టీజర్ని లీక్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మూవీ టీమ్ అలెర్ట్ అయిపోయింది. హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 'రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలానే అకౌంట్ సస్పెండ్ చేస్తాం. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం' అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు కొన్నిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు.హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించారు. సంజయ్ దత్ విలన్గా చేశాడు. తమన్ సంగీతమందించాడు. ఇప్పటికే చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో రాబోయే టీజర్తో మూవీ కంటెంట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున)Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….We request everyone to cooperate and stand with us in protecting the experience….Let’s celebrate responsibly. Be aware. ⚠️— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025 -
కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?
సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్డేకు కేక్ కట్ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?ఫేమస్ సాంగ్..తెలుగులో ఓ ఫేమస్ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. కూతురి బర్త్డే..తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్డే మై బేబీ అని క్యాప్షన్ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్ ఊది కేక్ కట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.అందమైన కూతురుఅరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్తో లేదంటే పాతకాలం నాటి అమూల్ యాడ్లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్ ఖాన్ పర్దేశ్ సినిమాతో కెరీర్ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది. View this post on Instagram A post shared by Mahima Chaudhry (@mahimachaudhry1) చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున
నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్లో చూడొచ్చేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) #Nagarjuna: Coolie Vs Kubera #Coolie: Lokesh is larger than life Filmmaker🔥. Loki says Walk in like a Tiger, people should scared with ur Look🐯👿#Kubera: Sekhar is very realistic filmmaker🫶. Director says you are waking like a Hero bring it down😀 pic.twitter.com/lVkVCkYE1r— AmuthaBharathi (@CinemaWithAB) June 13, 2025 -
తెలుగు నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ ఏడాది ప్రారంభంలో ‘దంగల్’ నటి ఫాతిమా సనా షేక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. హైదరాబాద్కు చెందిన కొందరు ఏజెంట్లు ఛాన్స్లు ఇప్పిస్తానంటూనే 'ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా..?' అని అడిగినట్లు తెలిపింది. ఆపై కొందరు టాలీవుడ్ నిర్మాతలు కూడా తనని పరోక్షంగా అలాంటి ప్రశ్నలే వేశారని చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. అయితే, తాజాగా మరోసారి ఫాతిమా రియాక్ట్ అయ్యారు.దక్షిణాదిలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో చెప్పిన మాటలు నిజమేనని మరోసారి 'దంగల్' నటి ఫాతిమా పేర్కొంది. కానీ, తను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని తెలిపింది. ఒక వ్యక్తి వల్ల మాత్రమే తాను ఇబ్బంది ఎదుర్కొన్నానని క్లారిటీ ఇచ్చింది. అతను ఒక ఏజెంట్ కావచ్చు లేదా చిన్న నిర్మాత కావచ్చని చెప్పింది. కానీ, దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పుపట్టలేదని స్పష్టత ఇచ్చింది. ఒకరి గురించి చెప్పిన మాటలను కొందరు అదేపనిగా అక్కడి పరిశ్రమ మొత్తాన్ని ఆపాదిస్తూ ప్రచారం చేయడం చాలా తప్పని పేర్కొంది. ' కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి పరిశ్రమలో ఉంది. అనేక రంగాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. దారి వెంట వెళ్తున్న ఒక స్త్రీని అదేపనిగా చూస్తూ ఆమెను తప్పుగ చూసే వారు ఎందరో ఉన్నారు. వాటిని దాటుకుని నేటి మహిళ ముందుకు వెళ్తుంది.' అని ఆమె చెప్పింది.ఫాతిమా గతంలో ఏం చెప్పిందంటే..అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో నటి ఫాతిమాకు మంచి గుర్తింపు వచ్చింది. గీతా ఫోగట్ పాత్రలో ఆమె అదరగొట్టేసింది. 2015లో ఆమె తెలుగులో నటించిన ‘నువ్వు నేను ఒకటవుదాం’ చిత్రం విడుదలైంది. ఆ మూవీ తర్వత మరో సినిమా చేస్తున్న క్రమంలోనే ఒక నిర్మాత నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు గతంలో ఇలా చెప్పింది. ' హైదరాబాద్లో నేను చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్నాను. ఒక హౌటల్లో దిగాను. ఆ నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి నాతో మాట్లాడారు. నీకు అవకాశం ఇవ్వాలంటే మేము చెప్పిందల్లా చేయాలని అన్నాడు. నేను కాదని చెప్పడంతో ఆ నిర్మాత నన్ను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. చాలా అసభ్యకరంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పచ్చిగానే అడిగేశాడు. ఇంకోకరు అదే విషయాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతాను. కానీ, నాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు.' అని ఆమె గతంలో వెల్లడించింది. -
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలామంది చూసేవి థ్రిల్లర్స్. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో అలరించిన కొన్ని మూవీస్ని డబ్బింగ్ చేసి తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తమిళ చిత్రాన్ని దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. సడన్ సర్ప్రైజ్ అన్నట్లు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)2022లో తమిళంలో రిలీజై ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'యుగి'. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇప్పుడు 'కార్తీక: మిస్సింగ్ కేస్' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆహా ఓటీటీలోకి శుక్రవారం(జూన్ 13) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.ఇకపోతే ఇదే వీకెండ్లో ఈ సినిమాతో పాటు మరో 22 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చేయడం విశేషం. వీటిలో శుభం, కేసరి 2, ఏస్, ఎలెవన్, జింఖానా, బ్లైండ్ స్పాట్, సిన్, డియర్ ఉమ, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీసే. ఈసారి థియేటర్లలో కొత్త సినిమాలేం రిలీజ్ కాలేదు కాబట్టి ఓటీటీ మూవీస్పై తెలుగు ప్రేక్షకులు లుక్కేయడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా: అల్లు అరవింద్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటీ రిలీజ్ కాలేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం ఏకంగా 22 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటిలో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. వీటిలో ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ ఉండటం విశేషం. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 13)అమెజాన్ ప్రైమ్బ్లైండ్ స్పాట్ - తెలుగు సినిమాఏస్ - తెలుగు డబ్బింగ్ మూవీఎలెవన్ - తెలుగు సినిమాఇన్ ట్రాన్సిట్ - హిందీ సిరీస్అమెరికన్ థండర్ - ఇంగ్లీష్ సినిమాద ట్రైటర్స్ - హిందీ రియాలిటీ షోడీప్ కవర్ - ఇంగ్లీష్ సినిమానెట్ఫ్లిక్స్కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్రానా నాయుడు 2 - తెలుగు సిరీస్ఫ్యూబర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఫ్లాట్ గర్ల్స్ - థాయ్ మూవీగ్రేస్ అనాటమీ సీజన్ 21 - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 14)హాట్స్టార్కేసరి ఛాప్టర్ 2 - హిందీ సినిమాశుభం - తెలుగు మూవీఅండర్ డాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)సోనీ లివ్అలప్పుళా జింఖానా - తెలుగు డబ్బింగ్ మూవీఆహాసిన్ - తెలుగు సినిమాసన్ నెక్స్ట్డియర్ ఉమ - తెలుగు మూవీజీ5డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ - తెలుగు డబ్బింగ్ సినిమాఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ - ఇంగ్లీష్ మూవీనాట్ ఏ బాక్స్ - ఇంగ్లీష్ సిరీస్మనోరమ మ్యాక్స్సూపర్ గర్ల్స్ - మలయాళ సిరీస్(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు) -
అల్లు అర్జున్ అంటే అంతే.. కొత్త దర్శకుడికి బిగ్ ఛాన్స్
పుష్ప(Pushpa) తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా రేంజ్లో ఆదరణ ఉండటంతో ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. త్రివిక్రమ్(Trivikram) సినిమాను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే బన్నీ లిస్ట్లో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఆయనతో ఒక ప్రాజెక్ట్ తప్పకుండా చేస్తారని టాక్ ఉంది. ఇంతలో ఎవరూ ఊహించలేని ఒక దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అట్లీ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే బన్నీ సినిమా అంటూ పెద్ద ఎత్తున్న వైరల్ అవుతుంది.అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరూ ఊహించలేని దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా బన్నీ ఓకే చేశారట. మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో బన్నీ సినిమా దాదాపు ఖరారు అయిపోయిందట. మలయాళంలో డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సంచలన విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిన్నల్ మురళీ' (2021) చిత్రానికి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, దర్శకుడిగా ఆయన మూడు చిత్రాలకే పనిచేశారు. స్టోరీ రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. జయ జయ జయ జయహే, సూక్ష్మ దర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు వారికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ను ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్ అని ఆయన అన్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మలయాళంలో అల్లు అర్జున్కు భారీ ఇమేజ్ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఒక కథను బాసిల్ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం. -
8k వర్షన్లో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ వీడియో సాంగ్
దేవరలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రొమాంటిక్ స్టెప్పులతో ‘చుట్టమల్లే’ అంటూ యువతను బాగా చుట్టేసుకుంది. ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’లో ఈ పాటకు ఫ్యాన్స్ ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా 'చుట్టమల్లే' పాటను 8k వర్షన్లో ఉన్న వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల నుంచి పలు సాంగ్స్ 8k వర్షన్లో విడుదలయ్యాయి. దసరా, స్త్రీ2, గేమ్ఛేంజర్, రైడ్2 వంటి చిత్రాలతో పాటు కొన్ని పాత సినిమాల నుంచి కూడా సరికొత్తగా 8k వర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం 4K వీడియోలోనే ఎక్కువ పాటలు ఉంటున్నాయి. అయితే, ఇప్పుడు 8k వర్షన్లో విడుదల చేస్తున్నారు. దీంతో 4K వీడియో కంటే ఎక్కువ రిజల్యూషన్తో నాణ్యత ఉంటుంది. 8k వీడియో చూడటం వల్ల మీరు మరింత స్పష్టమైన. పదునైన విజువల్స్ను అనుభవించవచ్చు. 8k వీడియోలను పెద్ద స్క్రీన్లలో లేదా డిస్ప్లేలలో చూడటం ద్వారా వాటిని మరింత బాగా ఆస్వాదించవచ్చు. 4k రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ (pixels) అయితే, 8k రిజల్యూషన్ 7680 x 4320 పిక్సెల్స్గా ఉంటుంది. -
ఓటీటీలో సడెన్ సర్ప్రైజ్.. 'విజయ్ సేతుపతి' కొత్త సినిమా స్ట్రీమింగ్
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) ఓటీటీలోకి వచ్చేసింది. మే 23న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకున్న ఈ మూవీని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి తర్వాత ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ వీకెండ్లో ఓటీటీలో మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.'ఏస్' (Ace) చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని జూన్ 13న అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ్తో పాటు తెలుగు వర్షన్ను ఒకేసారి విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు. అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 12th ఫెయిల్ నటుడి ఇంట్లో విషాదం
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేకు తీవ్ర విషాదం మిగిల్చింది. ఇదే ఫ్లైట్లో తన బంధువు మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన మామయ్య అయిన క్లిఫర్డ్ కుందర్ కుమారుడు క్లైవ్ కుందర్ మరణించాడని విక్రాంత్ తన బాధను వ్యక్తం చేశారు. విక్రాంత్ తన బంధువు మృతికి సంతాపం తెలుపుతూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఈ ప్రమాద బాధిత కుటుంబాలందరికీ తన సానుభూతిని తెలియజేశారు.విక్రాంత్ మాస్సే ఇన్స్టాలో రాస్తూ..' "ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన ఊహించలేని విషాదం జరిగింది. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను చూసి నా హృదయం ముక్కలైంది. ఈ ఘటనలో మా మామ క్లిఫోర్డ్ కుందర్ తన కుమారుడు క్లైవ్ కుందర్ను కోల్పోయారని తెలిసి మరింత బాధగా ఉంది. ఎందుకంటే అతను ఈ విమానంలో పనిచేస్తున్న మొదటి అధికారి" అని రాసుకొచ్చారు.కాగా.. గురువారం మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులతో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. -
రెడ్ శారీలో ఆదితి గౌతమ్ గ్లామరస్ లుక్స్.. బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక హోయలు!
నగల దుకాణంలో బిగ్బాస్ బ్యూటీ దివి..రెడ్ శారీలో ఆదితి గౌతమ్ హోయలు..వెకేషన్లో చిల్ అవుతోన్న మెహరీన్ ఫిర్జాదా..పెళ్లి రోజు తబిత సుకుమార్ స్పెషల్ పోస్ట్..బ్లూ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
విమాన ప్రమాదం వల్లే మంత్రి రాలేకపోయారు: దిల్ రాజు
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు. లండన్ బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గద్దర్ అవార్డుల వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. విమాన ప్రమాదం జరగటం మంత్రి కోమటిరెడ్డి ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.ఇప్పటికే గద్దర్ అవార్డు గ్రహీతలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించామని ఇవాళ నిర్వహించిన ప్రెస్మీట్లో తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేస్తామని ప్రకటించారు. అందరూ తప్పకుండా హాజరైన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని దిల్ రాజు కోరారు. ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శక, నిర్మాతలకు కలిసి నాలుగు అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఇలా ప్రతి ఏడాదిలో మూడు సినిమాలకు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల వేడుక ఈనెల 14న హైదరాబాద్లో జరగనుంది. -
లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
బన్నీ వాసు (Bunny Vas)ది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయమవ్వడం, అతడితో స్నేహం కుదరడంతో గీతా ఆర్ట్స్లో పని చేశాడు. అనంతరం అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి స్థాపించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థలో పార్ట్నర్ అయ్యాడు. నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలందించాడు. ఈ మధ్య తన స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. ఈ బ్యానర్లో బన్నీ వాసు మిత్ర మండలి అనే సినిమా నిర్మిస్తున్నాడు.నా తండ్రికన్నా నీతోనే ఎక్కువ..గురువారం (జూన్ 12న) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. నా జీవితంలో మా తండ్రితో కన్నా ఎక్కువగా మీ (అల్లు అరవింద్)తోనే ఉన్నాను. మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాను. అలాంటిది ఈ రోజు ఇక్కడివరకు ఎదిగిన మమ్మల్ని చూస్తుంటే మీకెంత గర్వంగా ఉందో, మిమ్మల్ని చూస్తుంటే మాకూ అంతే సంతోషంగా ఉంది. మా జీవితంలో అల్లు అరవిందే గాడ్ ఫాదర్. ఇంత సపోర్ట్ ఇచ్చి, ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ సో మచ్ సర్.బన్నీకి కాపలా కాయడమే..మేమందరం మంచి సినిమాలు తీస్తున్నామంటే అది అరవింద్గారు మాకు నేర్పిన శిక్షణ, విద్య అని చెప్పుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే యాంకర్ స్రవంతి.. లైఫ్లో ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేశారా? వాళ్లు పడిపోయారా? అని అడిగింది. అందుకు బన్నీ వాసు ఏ అమ్మాయి నాకు పడిపోలేదు, పైగా తిట్లు తిన్నాను అని రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. నేను 19 ఏళ్ల వయసులో అరవింద్గారి దగ్గరకు వచ్చాను. అప్పటినుంచి నన్ను బన్నీగారి దగ్గర వాచ్మెన్గా పెట్టారు. నా జీవితమంతా ఆయనకు కాపలా కాయడమే సరిపోయింది. నా లైఫ్లో లవ్ పార్ట్ ఏదైనా మిస్సయిందంటే దానికి అరవింద్, బన్నీనే కారణం అని నవ్వుతూ చెప్పాడు.చదవండి: పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్ దేనికంటూ ట్రోలింగ్ -
కీర్తి సురేశ్ కామెడీ ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'రివాల్వర్ రీటా'. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ డేట్ ప్రకటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రివాల్వర్ రీటా వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేశ్ పోస్ట్ర్ను షేర్ చేశారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు.ఇక బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ ధావన్కు జంటగా బేబీజాన్ చిత్రంలో నటించారు. Rita is ready to roll babyyy 💥#RevolverRita from 27th August 🔥Tamil: 🔗https://t.co/hOuJQ0zOUkTelugu: 🔗https://t.co/pGTzJcx1Qz@Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction… pic.twitter.com/TToEIXOLtg— Keerthy Suresh (@KeerthyOfficial) June 11, 2025 -
పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్ దేనికంటూ ట్రోలింగ్
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి (Surekha Vani) పచ్చబొట్టు వేయించుకుంది. ఏముందిలే, కూతురు సుప్రిత పేరును టాటూ వేయించుకుని ఉంటుందనుకుంటున్నారేమో! కానే కాదు, తనకెంతో ఇష్టమైన ఏడుకొండలస్వామి పాదుకలను కుడి చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. అలాగే గోవింద నామాలు కూడా ఉన్నాయి.టాటూ వీడియో..ఇందుకు సంబంధించిన వీడియోను సురేఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో పచ్చబొట్టు వేస్తుండగా సురేఖ నొప్పితో విలవిల్లాడుతుంటే కూతురు సుప్రీత తనకు ధైర్యం చెప్తూ చప్పట్లు కొడుతోంది. అయితే నొప్పిని పంటికింద భరించిన సురేఖ.. చివర్లో ఆ టాటూ చూసి తను పడ్డ కష్టమంతా మర్చిపోయింది. ముందు నా పెదబాబు నడుస్తాడు. ఆయన వెనకాల నేనూ నడుస్తాను. గోవిందా గోవిందా.. అని సురేఖ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆయన వెనకాలే నేనుఇది చూసిన నెటిజన్లు కొందరు ఆమె భక్తికి మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఓవరాక్టింగ్ చేస్తోంది, టాటూ ఉంది కానీ అక్కడ భక్తి లేదు అని విమర్శిస్తున్నారు. అయితే సురేఖకు తిరుమల స్వామివారు అంటే ఎంతో నమ్మకం. ఆ మధ్య తిరుపతిలో ఆమె తలనీలాలు కూడా సమర్పించింది. తనకు ఏ కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా కచ్చితంగా తిరుమల వెళ్తుంది.సినిమాసురేఖావాణి మొదట్లో తెలుగు వెండితెరపై నటిగా రాణించింది. దుబాయ్ శీను, నాయక్, బొమ్మరిల్లు, రెడీ, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించింది. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబోలో సురేఖావాణి చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో సినిమాల సంఖ్య కూడా తగ్గుతూ పోతోంది. అయితే కూతురు సుప్రీతను హీరోయిన్ చేసింది సురేఖ. చౌదరిగారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి సినిమాతో సుప్రిత హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. సినీ తారల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాదం బాలీవుడ్ సినీతారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను షాక్కు గురి చేసిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో వారందరి కుటుంబాల కోసం మనందరం ఆ దేవుడిని ప్రార్థించాలని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం మరో నటుడు రితేశ్ దేశ్ముఖ్ సైతం స్పందించారు. విమాన ప్రమాదం గురించి విని తన గుండె పగిలిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రయాణీకులందరికీ, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.ఈ ఘటనపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రణదీప్ హుడా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వారంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలని కోరారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవాలని పోస్ట్ చేశారు. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సన్నీ డియోల్ విచారం వ్యక్చం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ సమయంలో వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను కదిలించిందని జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేను.. విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది, ప్రతి కుటుంబం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని రాసుకొచ్చింది. మరో నటి అనన్య పాండే ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాధను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. అంతేకాకుండా పరిణీతి చోప్రా, ఆమె భర్త రాఘవ్ చద్దా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నానంటూ సీినియర్ నటి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేసింది. కాగా.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. Heartbroken by the tragic Ahmedabad Air India flight crash. My deepest condolences to the families of the victims. May their souls rest in peace. Truly heart-wrenching 💔— Allu Arjun (@alluarjun) June 12, 2025 Deeply saddened by the Ahmedabad Air India flight crash. Prayers and strength to everyone affected. My thoughts are with the passengers, crew members, and their families.— Jr NTR (@tarak9999) June 12, 2025 Extremely shocked and in disbelief to hear the crash of Air India flight from Ahmedabad to London, with 232 passengers on board, just after take off. Prayers for the safety of the passengers and the crew. #GodBeWithThem #planecrash— KhushbuSundar (@khushsundar) June 12, 2025 Heartbreaking to hear about the tragic plane crash in Ahmedabad.My thoughts and prayers are with all those affected.Hoping for survivors and strength for the rescue teams.May the departed rest in peace, and may their families find the strength to endure this immense loss. 🙏— Randeep Hooda (@RandeepHooda) June 12, 2025 Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025 Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏— Akshay Kumar (@akshaykumar) June 12, 2025 -
సినిమాలతో కాదు.. ఆ ఒక్క డీల్తో కోట్ల రూపాయలు!
బాలీవుడ్ నటులు ఒక్కో సినిమాకు దాదాపు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అది సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బిజినెస్లోనూ కొందరు స్టార్స్ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అలాంటి లిస్ట్లో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా చేరిపోయారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రా వెస్ట్ శివారులో మూడు అపార్ట్మెంట్లను ఆయన లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. వాటి ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.4.30 కోట్ల వరకు అర్జించనున్నారు. తాను లీజ్ తీసుకున్న మూడు అపార్ట్మెంట్లలో నెలవారీ అద్దె రూ. 6.30 లక్షలుగా ఉన్నట్లు టాక్. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.4 కోట్లకు పైగా సంపాందించనున్నారు జాన్ అబ్రహం. ఈ డీల్ను గత నెలలోనే క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫ్లాట్లకు కలిపి రూ.36 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించారు.ప్రధానంగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బాంద్రా ఒకటి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్మెంట్లోకి మారనున్నారు.ఇక జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే చివరిసారిగా ది డిప్లొమాట్ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నటించిన టెహ్రాన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలో నటించింది. -
కామెడీ ఎంటర్టైనర్గా 'మిత్ర మండలి' టీజర్
ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) జోడీగా నటిస్తున్న కొత్త చిత్రం 'మిత్ర మండలి'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ఈ మూవీని విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పిస్తుండగా కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందర్నీ నవ్వించేలా టీజర్ ఉంది.సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక ఎన్ఎమ్ .. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్
సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది సింగర్ సునీత (Sunitha Upadrashta). మృదువైన స్వరంతో ఆమె పాట పాడితే అమృతం కురిసినట్లే ఉంటుంది. ఈమె మాట్లాడితే కూడా తీయని పాట పాడుతున్నట్లే అనిపిస్తుంది. ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే పాటలెన్నో పాడిన సునీత మనసు నేడు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. అందుకు కారణమేంటో చూసేద్దాం..సునీత భావోద్వేగంఏ తల్లికైనా తను సాధించిన విజయాల కంటే పిల్లలు సాధించిన విజయాలే గొప్పగా కనిపిస్తాయి. చేతుల్లో ఆడించిన చంటిపిల్లలు కళ్లముందు ఎదుగుతుంటే ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. సునీత కూతురు శ్రేయ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.ఎంత గర్వంగా ఉందో..మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్బుక్లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా కూతురు ఇప్పుడు ప్రాట్ ఇన్స్టిట్యూట్లో ఇల్లుస్ట్రేటర్గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఫోటో.. ఎన్నాళ్లకెన్నాళ్లకునీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. శ్రేయ గ్రాడ్యుయేషన్ డేకు సునీత భర్త రామ్, కుమారుడు ఆకాశ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.మొదటి భర్త సంతానమే శ్రేయకాగా సునీత 19 ఏళ్ల వయసులోనే కిరణ్ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి కూతురు శ్రేయ, కుమారుడు ఆకాశ్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సునీత- కిరణ్ విడిపోయారు. 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి: దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా? -
ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్ సినిమాలపై ప్రకటన
రెండురోజుల నుంచి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన చేయబోయే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్తో అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేశ్తో చేస్తారని చెప్పుకొచ్చారు. మరొకటి ఎన్టీఆర్తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చేతిలో ఈ రెండు తప్పా ఎలాంటి ప్రాజెక్ట్లు లేవన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్చేస్తున్నారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. త్రివిక్రమ్కు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ ఫైనల్ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని నాగవంశీ తెలిపారు.(ఇదీ చదవండి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్.. బన్నీ కథలో మార్పులు!)నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో త్రివిక్రమ్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ లేనట్టేనని తేలిపోయింది. ఆపై అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా పూర్తిగా ప్రచారం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లు మాత్రమే త్రివిక్రమ్ ప్రస్తుతానికి లాక్ చేశారంటూ నాగవంశీ చెప్పారు. అయితే, మొదట వెంకటేశ్తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్తో భారీ ప్రాజెక్ట్ మొదలౌతుందని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. పురాణాలతో ముడిపడిన కథలో ఎన్టీఆర్ నటించనున్నారు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో తారక్ అన్న నటిస్తున్నారంటూ ఇప్పటికే నాగవంశీ ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తారక్ నటిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో వార్2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, దేవర్2 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్లకు నాగవంశీ ట్విస్ట్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.— Naga Vamsi (@vamsi84) June 12, 2025 -
ఓటీటీలో 'నవీన్ చంద్ర' క్రైమ్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్గానే ఉన్నప్పటికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.కథ ఏంటి..?హైదరాబాద్కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. -
నటి కల్పికపై కేసు నమోదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్పై 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే.గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన చెందింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్లు ఆమె పేర్కొంది. గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. -
గోపిచంద్ బర్త్డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ హీరో గోపిచంద్- దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది. నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. #Gopichand33 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను ఇంకా ప్రకటించలేదు. చిట్టూరి శ్రీనివాస ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. భారతీయ చరిత్రలో అనేక కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. చాలాగ్యాప్ తర్వాత ఆయన నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. -
సింగర్గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ
నటి దేవయాని (50) చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్ ఇండియాలో పాపులర్ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్, టీ రాజేందర్, కార్తీక్ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్లో మంచి సింగర్గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.టాలీవుడ్లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్లో ఆమె నటించనున్నారు. View this post on Instagram A post shared by zeetamil (@zeetamizh) -
టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె. మహేంద్ర (75) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి గుంటూరులో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో గుంటూరులో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.మొదట దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న మహేంద్ర తర్వాత నిర్మాతగా మారి 50కు పైగా సినిమాలు తెరకెక్కించారు. చెన్నై నుంచి హైదరబాద్కు సినీ పరిశ్రమ వచ్చాక ఆయన ఏఏ ఆర్ట్స్ బ్యానర్ను నిర్మించారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కూడా మహేంద్రనే కావడం విశేషం. ఆపై దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా ఆయనే ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ప్రేమించి పెళ్ళి చేసుకో, ఆరని మంటలు, ఎదురులేని మొనగాడు, ప్రచండ భైరవి, ఢాకూరాణి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. -
బర్త్డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ.. డీసీపీ కామెంట్స్
గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి ఇచ్చిన పార్టీలో డ్రగ్స్, గంజాయి ఉపయోగించారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని సోషల్మీడియాలో ఆ వార్తలు వైరల్ అయ్యాయి. తను ఏర్పాటు చేసిన విందులో తన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని అక్కడ ఎలాంటి డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా చేయలేదని ఆమె ఒక వీడియోతో వివరణ ఇచ్చారు. పోలీసులు కూడా దానిని ధ్రువీకరించారు.మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదని చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఇలా చెప్పారు. 'మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దీంతో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు 10 మంది మహిళలతో పాటు 12మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాము. అయితే, జిల్లెలగూడకు చెందిన వ్యాపారి కొసనం దామోదర్రెడ్డికి గంజాయి పాజిటివ్గా వచ్చింది. మిగిలిన వారిలో ఎవరికీ రిపోర్ట్లో పాజిటివ్ రాలేదు. కానీ, అతను కూడా మంగ్లీ ఇచ్చిన పార్టీలో గంజాయ్ తీసుకోలేదని, అంతకుముందే మరోచోట తీసుకున్నట్లు తెలిసింది.' అని డీసీపీ తెలిపారు. పోలీసులు చేసిన సోదాల్లో విదేశీ మద్యం కానీ, ఇతర మత్తు పదార్థాలు కానీ లభించలేదని చేవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ కూడా పేర్కొన్నారు.వివరణ ఇచ్చిన మంగ్లీతన పుట్టినరోజు నాడు జరిగిన అంశంపై సింగర్ మంగ్లీ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ' పుట్టినరోజు వేడుకలు నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి చేసుకున్నాను. అయితే, మద్యం బాటిల్స్, డిజే సౌండ్స్కి అనుమతి తీసుకోవాలి అనే అవగాహన నాకు లేదు. తెలియక తప్పు జరిగింది. అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు.' అని ఆమె చెప్పారు. -
రిస్క్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. పొరపాటు జరిగితే అంతే
పాన్ ఇండియన్ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు ఉమెన్స్ సెంట్రిక్ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్ అగ్వరాల్కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాగే ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె మళ్లీ ఫ్రైమ్ టైమ్లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయకుండా రిస్క్తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి. -
డ్రగ్స్ నివారణకు 'మా' సహకారం.. ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభం
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) మరో ముందడుగు వేసింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) కలిసి 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి, ఎస్పీ శ్రీ పి. సీతారామ, డిపార్ట్మెంట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శ్రీమతి శైలజ హాజరయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని అందరూ ఆకాంక్షించారు. -
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తమ్ముడు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. -
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీకి తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నువ్వు వైరలవుతున్నావని చాలామంది నాకు ఫోన్ చేశారని అన్నారు. నేను ప్రస్తుతం నా షూట్లతో బిజీగా ఉన్నానని తెలిపారు.బర్త్ డే పార్టీలో రచ్చరవి అని ఉన్నారని మీరంతా అనుకుంటున్నారు.. కానీ ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చరవి అని.. అక్కడున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి కూడా నాకు తెల్వదు.. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నా.. అందుకోసమే దయచేసి అర్థం చేసుకోండి.. అపార్థం చేసుకోవద్దని రచ్చరవి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను తాగను... తాగబోను... నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి.. అంటూ రాసుకొచ్చారు. కాగా.. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే రచ్చరవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. ఇవాళ ఉదయం టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
నితిన్ సినిమా వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా: డైరెక్టర్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో నితిన్కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.ఈ ఈవెంట్లో డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హీరో నితిన్పై ప్రశంసలు కురిపించారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నితిన్ మాత్రమేనని అన్నారు. ఆర్టిస్టులు చాలామంది ఇన్సెక్యూర్గా ఉంటారని.. కానీ అతనిలో ఏమాత్రం అభద్రతాభావం ఉండదని తెలిపారు. నితిన్ సినిమాకు రైటర్గా వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని శ్రీరామ్ వేణు వెల్లడించారు. ఇంతకుముందే నితిన్తో నేను సినిమా చేయాల్సిందని..కానీ నా వల్లే కాస్తా ఆలస్యమైందని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
యూట్యూబ్లో డబ్బులు పెట్టి వ్యూస్ కొనొద్దని చెప్పా: దిల్ రాజు
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కెరీర్లోనే అధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (Thammudu Movie). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ లయ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్కు అక్కగా నటించింది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాష్, శిరీష్ నిర్మించారు. తమ్ముడు ట్రైలర్ను బుధవారం (జూన్ 11న) రిలీజ్ చేశారు.ఈరోజు చెప్పేస్తా..ఈ సందర్భంగా దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆ విషయం చెప్పి తీరతాను. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆ వీడియో కింద కనిపించే నెంబర్లన్నీ ఒరిజినల్. ప్రేక్షకులు చూసిన నెంబర్లే అక్కడ కనిపించాలని మా ఆఫీసులో నా పీఆర్ టీమ్తో సహా అందరికీ చెప్పాను. డబ్బులు ఖర్చు చేసి మరీ మిలియన్ల వ్యూస్ కొనొద్దని సూచించాను. ఎలా తెలుస్తుంది?ఎందుకంటే ఒరిజినల్గా మన పాట, ట్రైలర్.. ఏదైనా సరే, జనాల్లోకి ఎంతగా రీచ్ అవుతుందనేది మనకు అర్థం కావాలి. అప్పుడే మన మూవీ ప్రజలకు ఏమేరకు రీచ్ అవుతుందని ఓ అంచనాకు రాగలం. మనం కొనుక్కుంటే వ్యూస్ నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి. కానీ, అది ప్రేక్షకుడికి చేరిందా? లేదా? అనేది తెలియడం లేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జూలై 4న రిలీజ్ చేస్తున్నారు.చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్బస్టర్ వార్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.🎙️ Jr NTR begins dubbing for #WAR2.The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025 -
బిగ్బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.ఆ నెలలో షురూ..ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. సంప్రదింపులు- చర్చ దశల్లోనే..కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు. పార్టిసిపెంట్లు వీళ్లేనా?అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్ -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్లో యే హై మొహబ్బతేన్ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025 -
'చాలా అందంగా ఉన్నారు.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు'.. ఛావా నటి ఆన్సర్ ఇదే!
30 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా వినిపిస్తుంటాయి. కెరీర్, జాబ్ అంటూ వివాహాలు చేసుకోకుండా చాలామంది సింగిల్స్గానే బతికేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో వాళ్లయితే ఏకంగా 40 పదుల వయస్సు దాటినా సింగిల్గానే ఉంటున్నారు. అలాంటి సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, త్రిష, ప్రభాస్ లాంటి అగ్రతారలేందరో ఉన్నారు. అలా సినీ ఇండస్ట్రీలో 40 పదుల వయస్సు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్నవారిలో మరో బాలీవుడ్ భామ దివ్య దత్తా ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.దివ్య పెళ్లి బంధం గురించి మాట్లాడుతూ.. “మీరు మంచి భాగస్వామి దొరికితే వివాహం చేసుకోవడం చాలా బాగుంటుంది. అదే పెళ్లి లేకపోతే జీవితం ఇంకా అందంగా సాగుతుంది. అందుకే పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మంచిది. నాపై చాలా మంది పురుషులు శ్రద్ధ పెడుతుంటారు. నేను వాటిని ఆస్వాదిస్తా అంతే. కానీ మీరు కనెక్ట్ అయితేనే రిలేషన్లో ఉండాలి. ఆ వ్యక్తి మీ చేయి పట్టుకోగలడని మీరు భావించాలి. ఒకవేళ అది జరగకపోతే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నా కోసం నేను ఉన్నా.' అని మాట్లాడింది.దివ్య దత్తా ఇంకా మాట్లాడుతూ.. "నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. కేవలం ఎవరైనా నాతో ప్రయాణించగల సహచరుడిగా ఉండటానికి ఇష్టపడతా. అది లేకపోయినా నేను ఇప్పటికీ సంతోషంగా ఉన్నా. నా ప్రాణ స్నేహితుడు నాకు ఒక కోట్ పంపాడు. 'నువ్వు ఎందుకు ఒంటరిగా ఉన్నావు? నువ్వు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నావు' కదా అని అడిగాడు. దానికి నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయానని చెప్పా. మంచి భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణం కావాలని అవసరం లేదు. గతంలో నాకు కూడా ఆ అపోహ ఉండేది." అని పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ.ఇక సినిమాల విషయానికొస్తే దివ్య దత్తా చివరిసారిగా ఛావా చిత్రంలో కనిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ , అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం దివ్య అర్జున్ రాంపాల్తో కలిసి నాస్టిక్లో కనిపించనుంది. ఈ సినిమాకు శైలేష్ వర్మ దర్శకత్వం వహించారు. -
మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి
ఫోక్ సాంగ్స్తో ప్రజాదరణ పొందిన సింగర్ మంగ్లీ (Singer Mangli) పేరు తాజాగా వార్తల్లో మార్మోగుతోంది. జూన్ 10న తన బర్త్డేను పురస్కరించుకుని చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ విదేశీ మద్యంతోపాటు గంజాయి సరఫరా జరిగిందన్న పక్కా సమాచారంతో పోలీసులు రిసార్ట్పై దాడులు జరిపారు. పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు జరపగా 9 మందికి గంజాయి పాజిటివ్గా తేలింది.తప్పు చేసుంటే..ఈ బర్త్డే పార్టీకి బిగ్బాస్ బ్యూటీ, నటి దివి వైద్య (Divi Vadthya) హాజరైంది. దీంతో ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై దివి స్పందించింది. ఫ్రెండ్ బర్త్డే అని పిలిస్తే వెళ్లాను. కానీ, అక్కడ జరిగిన పొరపాట్లను నాపైన తోయడం సరికాదు. నేను నిజంగా తప్పు చేసుంటే, ఆ మేరకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నా ఫోటో వేయండి. కానీ ఏ సాక్ష్యం లేకుండా నా ఫోటో వాడి నన్ను నెగెటివ్ చేస్తుంటే కెరీర్కు ఎంత ఇబ్బంది అవుతుంది?ఫ్రెండ్ అని వెళ్లా..ఎంతో కష్టపడి ఇంతదూరం వచ్చాను. ఫ్రెండ్ బర్త్డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఫోటో వేస్తున్నారు. మీ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫోటోలు వాడకండి. నాకు ఇబ్బంది అవుతుంది అని ఓ ఆడియో రిలీజ్ చేసింది. అటు ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనూ హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది? అని ఆవేదన వ్యక్తం చేసింది. మంగ్లీ బర్త్డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని దివి స్పష్టం చేసింది.చదవండి: ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి -
కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్.. ఆ స్టార్ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.అయితే ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్తో ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw— Naga Vamsi (@vamsi84) June 11, 2025 My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd— Naga Vamsi (@vamsi84) June 11, 2025 -
ముందుగానే వచ్చేస్తోన్న పంచాయత్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఓటీటీలు వచ్చాక సినీ వినోదం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. థియేటర్లలో కేవలం సినిమాలే కాదు.. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లకు ప్రత్యేకమై క్రేజ్ ఉంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సరికొత్త సిరీస్ పంచాయత్. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్స్కు సినీ ప్రియుల నుంచి ఆదరణ దక్కింది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో రెండో సీజన్.. 2024లో మూడో భాగం ప్రేక్షకులను అలరించాయి. ఈ సిరీస్కు ప్రత్యేక ఆదరణ దక్కడంతో మేకర్స్ మరో సీజన్కు రెడీ అయిపోయారు. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ఇంకాస్తా తొందరగానే స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు.విలేజ్ నేపథ్యంలో సాగే సరికొత్త కామెడీ డ్రామా సిరీస్గా వస్తోన్న నాలుగో సీజన్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్- 4 జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటి ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మొదట జూలై 2న స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తాజాగా తేదీ మారడంతో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఈనెలలోనే సినీ ప్రియులకు అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సిరీస్లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ-డ్రామా సిరీస్ను ఉత్తరప్రదేశ్లోని ఫూలేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథగా తెరకెక్కించారు. ఈ సిరీస్కు దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయవర్గీయ దర్శకత్వం వహించారు. shuru ho chuka hai election🗳 Manju Devi ya Kranti Devi, kiski hogi selection 👀#PanchayatOnPrime, New Season, June 24@TheViralFever @StephenPoppins #ChandanKumar @Akshatspyro @uncle_sherry @vijaykoshy@Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @malikfeb @chandanroy77… pic.twitter.com/dflHA71wbe— prime video IN (@PrimeVideoIN) June 11, 2025 -
స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన మామ పీఎస్ అబు(92) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు. మామ చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది.(ఇదీ చదవండి: హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు)1971 సినిమాలు చేస్తున్న మమ్ముట్టి.. 300కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో మమ్ముట్టి నుంచి భ్రమయుగం, టర్బో, బజుక తదితర మూవీస్ వచ్చాయి.మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మేనమామ గోపీనాథ్ నాయర్ కూడా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. తనువు చాలించారు. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సదరు హీరోల అభిమానులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
సుహాసిని అందం గురించి పార్తీబన్ షాకింగ్ కామెంట్స్
మల్టీ టాస్కింగ్ అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పార్తీబన్ (R. Parthiban). అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్గా తన ప్రతిభ చాటుకున్నారు. యుగానికి ఒక్కడూ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తాజాగా ఆయన హీరోయిన్ సుహాసినిపై ప్రశంసలు కురిపించాడు. వర్డిక్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. అందరూ సుహాసిని యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఓరోజు ఫోన్ చేసి..కానీ తన ఆత్మవిశ్వాసం గురించి మీకు చెప్పాలి. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి పార్తీబన్.. ఈరోజు నాకు 50 ఏళ్లు నిండాయి అని చెప్పింది. అసలు ఏ మహిళ కూడా 28 ఏళ్లు దాటాక తన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తనకు 50 ఏళ్లు అని నిర్మొహమాటంగా చెప్పిందంటే అది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. 50 ఏళ్లు వచ్చినా తనెంత అందంగా ఉందో మీరే చూడండి అనడంతో అక్కడే స్టేజీపై ఉన్న సుహాసిని (Suhasini) సరదాగా నవ్వేసింది.సినిమావర్డిక్ట్ సినిమా విషయానికి వస్తే.. పార్తీబన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి శరత్కుమార్, విద్యుల్లేఖ, ప్రకాశ్ మోహన్దాస్ తదితరులు నటిస్తున్నారు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్..?
-
ప్రభాస్ కోసం సందీప్ వంగా భారీ ప్లాన్
-
కన్ఫ్యూజ్ చేస్తున్న త్రివిక్రమ్, సుకుమార్
-
సింగిల్గా అన్న.. రెండోపెళ్లితో రెండోసారి తండ్రయిన తమ్ముడు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటుంటారు. కానీ ఈ జనరేషన్కు అది వర్తించదు. కెరీర్ వేటలో పడి ఆలస్యంగా పెళ్లి చేసుకుని లేటుగా సంసారసాగరాన్ని ఈదుతున్నారు. కొందరైతే మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరే పెళ్లి అనే జంఝాటమే వద్దని సింగిల్గా బతికేస్తున్నారు.57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా..బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) విషయంలో ఇదే జరిగింది. ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా పెళ్లికి మాత్రం సిద్ధపడలేదీ హీరో. 59 ఏళ్లు వచ్చినా సింగిల్గానే బతికేస్తున్నాడు. కానీ, ఇతడి సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) మాత్రం 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నాడు.పట్టలేనంత సంతోషంఅర్బాజ్ భార్య షురా ఖాన్ గర్భం దాల్చిందన్న విషయాన్ని నటుడు మీడియాకు వెల్లడించాడు. మేము బయటకు వెళ్లినప్పుడు జనాలు ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టారు. దాన్ని ఎంతోకాలం దాచలేమనుకోండి. ప్రస్తుతం మేమెంతో సంతోషంగా ఉన్నాం. మా జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు వస్తున్న బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అన్నాడు.రెండో పెళ్లిఅర్బాజ్ గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ సంతానం. 2017లో అర్బాజ్-మలైకా విడాకులు తీసుకున్నారు. 2023 చివర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను నిఖా చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో ఎన్నో మూవీస్ చేసిన అర్బాజ్ తెలుగులో 'జై చిరంజీవ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'శివం భజే' వంటి చిత్రాల్లో నటించాడు.చదవండి: ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం -
ఓటీటీలోకి తెలుగమ్మాయి తీసిన లేటెస్ట్ సినిమా
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా చేస్తూ ఓ సినిమా నిర్మించింది. కథ కూడా ఈమెని సమకూర్చడం విశేషం. తొలి చిత్రంతోనే ఇలా ఇన్ని విభాగాలకు పనిచేసిన సుమయ.. మంచి ప్రయత్నం చేసిందనే ప్రశంసలు కూడా అందుకుంది. ఏప్రిల్లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ కాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)సుమయ రెడ్డి స్టోరీ అందించి హీరోయిన్-నిర్మాతగా చేసిన సినిమా 'డియర్ ఉమ'. కన్నడ నటుడు పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. రొమాంటిక్ థ్రిల్లర్గా మెడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 17న రిలీజై మంచి ప్రయత్నం చేశారనే ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ.. సన్ నెక్స్ట్ ఓటీటీలో జూన్ 13 నుంచి అంటే ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే తెలుగులో మాత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'డియర్ ఉమ' విషయానికొస్తే.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిస్తుంది. హాస్పిటల్ కట్టి తన తండ్రి కల నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్(పృథ్వీ అంబర్)కి మ్యూజిక్ అంటే ప్రాణం. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్ కారణంగానే ఆమె ఇతడికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఓ డైరీ ద్వారా ఉమ, దేవ్ జీవితంలోకి వస్తుంది. అలా డైరీ చదువుతూ ఉమతో ప్రేమలో పడతాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్న టైంలో షాకింగ్ నిజం ఒకటి తెలుస్తుంది. ఇంతకీ అదేంటి? కార్పొరేట్ మెడికల్ మాఫియాపై సాగించిన పోరాటంలో ఉమకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంతానం కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
కన్నడిగులని మళ్లీ ట్రిగర్ చేసిన రష్మిక
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. కానీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రేక్షకులే ఈమెని ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. గతంలో పలుమార్లు ఈమే మాట్లాడిన మాటలే దీనికి కారణం అని చెప్పొచ్చు. మరి తెలిసి చేసిందో తెలియక చేసిందో గానీ ఇప్పుడు మరోసారి కన్నడని కెలికింది. అసలే కమల్ హాసన్ వల్ల కోపంతో ఉన్నారు. ఇప్పుడు రష్మిక లేటెస్ట్ పోస్ట్ చూసి షాకవుతున్నారు.రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా జూన్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ముంబైలో ఓ ఈవెంట్ జరగ్గా.. అంతకు ముందు దక్షిణాదిలోనూ జరిగాయి. ఈ క్రమంలోనే రష్మిక తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు చెన్నైతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది. ఇప్పుడదే కన్నడిగుల ఆగ్రహం తెప్పిస్తోంది.(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?)రష్మిక పోస్ట్లో ఏముందంటే.. 'చెన్నైలోనే తన బాల్యం గడిచింది. అందుకే చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది' అని రాసుకొచ్చింది. అంటే ఓ రకంగా తనది చెన్నై అన్నట్లు చెబుతోంది. ఇది ఇప్పుడు కన్నడిగులకు అసంతృప్తి తెప్పిస్తోంది. ఎందుకంటే రష్మిక పుట్టి పెరిగింది, స్కూల్ చదువుకున్నదంతా కర్ణాటకలోనే. కానీ చెన్నైలో బాల్యం గడపడం ఏంటి అని కన్నడ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.గతంలో 'కాంతార' సినిమాని తాను ఇంకా చూడలేదని చెప్పి ట్రోలింగ్కి గురైన రష్మిక.. మరో సందర్భంలో హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని చెప్పి కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు మరి ఉద్దేశపూర్వకంగా చేసిందో లేదో తెలీదు గానీ ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తెలుగులో పలు సినిమాలు తీసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతి చెందారు. గతరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతేడాది చివరగా రాజ్ తరుణ్తో 'తిరగబడరా సామీ' అనే మూవీ చేశారు. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది.గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి.. బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్తో 'పిల్లా నువ్వు లేని జీవితం'తో పాటు ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో తదితర చిత్రాలు తీశారు. అయితే 'తిరగబడరా సామీ' పరాజయం పాలవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం తెలియజేశారు. -
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?
రీసెంట్ టైంలో ఓటీటీలో ట్రెండ్ అయిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇదో తమిళ మూవీ. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడంతో మనోళ్లకు కూడా ఇది నచ్చేసింది. ఈ చిత్రంలో చిన్న పిల్లాడిగా చేసిన కమల్ జగదీశ్ కాకుండా ప్రధాన పాత్రధారి ధర్మదాస్.. ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి కూడా ఆకట్టుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఈమె పాత్ర చిన్నదే గానీ యువతకు తెగ నచ్చేసింది. దీంతో ఈ అమ్మాయి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈమె ఎవరంటే?(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)'టూరిస్ట్ ఫ్యామిలీ'లో ధర్మదాస్ అద్దెకు ఉండే ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి అసలు పేరు యోగలక్ష్మీ. చూడటానికి డస్కీగా ఉన్నప్పటికీ ఈమె యాక్టింగ్కి యూత్ ఫిదా అవుతున్నారు. సినిమాలోని ఈమె ప్రపోజల్ సీన్ని రిపీట్స్లో చూస్తున్నారు. ఈమె విషయానికొస్తే.. ఈ సినిమా కంటే ముందు 'హార్ట్ బీట్', 'సింగపెన్నె' అనే వెబ్ సిరీసులు చేసింది. కాకపోతే ఓ మాదిరి గుర్తింపు మాత్రమే దక్కింది.ఈ మధ్య యూట్యూబ్లో 'మ్యాచ్ ఫిక్సింగ్' షార్మ్ ఫిల్మ్లోనూ యోగలక్ష్మీ నటించింది. ఈమెది తమిళనాడే అయినప్పటికీ ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనే డీటైల్స్ దొరకట్లేదు. ప్రస్తుతానికైతే 'టూరిస్ట్ ఫ్యామిలీ' వల్ల ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఈమె అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈమెపై కొన్ని మీమ్స్ కూడా వస్తుండటం విశేషం. మరి తెలుగులోనూ ఎవరైనా దర్శక నిర్మాతలు ఈమెకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) View this post on Instagram A post shared by Yogz👾 (@iamyogalakshmi) -
ఆమిర్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
'లాల్ సింగ్ చద్దా' లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'సితారే జమీన్ పర్' పేరుతో తీసిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)హాలీవుడ్ మూవీ 'ఛాంపియన్స్'కి అనధికారిక రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. కోపం ఎక్కువగా ఉండే ఓ బాస్కెట్ బాల్ కోచ్.. అనుకోని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో మూడు నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని వాళ్లకు కోచింగ్ ఇవ్వాలని జడ్జి ఆర్డర్ వేస్తారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దానికి ఒప్పుకొంటాడు. కొన్నాళ్లకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని వాళ్లతోనే టోర్నీలో విజయాలు సాధిస్తాడు. ఇదే స్టోరీలా అనిపిస్తుంది.ఆమిర్ స్వయంగా కోచ్గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మకుండా.. 8 వారాల తర్వాత యూట్యూబ్లో పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తానని కొన్నిరోజుల క్రితమే ప్రకటించాడు. అలానే రీసెంట్గా పలువురు సెలబ్రిటీల కోసం 'సితారే జమీన్ పర్' ప్రీమియర్ వేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆమిర్ మూవీ అంటే నెటిజన్ల నుంచి విమర్శలు సాధారణం. మరి ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!) -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!
సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ 'బెంజ్'లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా 'బెంజ్' విలన్కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.లోకేశ్ ప్రస్తుతం 'కూలీ' తీస్తున్నాడు. దీని తర్వాత 'ఖైదీ 2' ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?
'గుంటూరు కారం' తర్వాత ఏడాదిన్నర నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ కోసం భారీ మైథలాజికల్ స్టోరీ ఒకటి సిద్ధం చేశారు. త్వరలో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టైంలో బన్నీ లైనప్ మారింది. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ని కాదని అట్లీతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మాటల మాంత్రికుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి. అలానే ఎవరితో సినిమా చేయాలా అని త్రివిక్రమ్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన గురించి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. అలా అని ఇది ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. రామ్ చరణ్, వెంకటేశ్తో వరసగా మూవీస్ చేస్తారని, ఇవి పూర్తయిన తర్వాత తారక్తో మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. అంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్తో ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని వస్తాడని టాక్.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)'అరవింద సమేత' తర్వాతే త్రివిక్రమ్-ఎన్టీఆర్తో మరోసారి పనిచేస్తారని కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అదే కథతో త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తీశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ఇది నిజమో కాదో సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఒకరు చేయాల్సిన స్టోరీతో మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బన్నీ కూడా ప్రస్తుతం అట్లీతో చేస్తున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ ఉంటుంది. లేదంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా, పుష్ప 3 మూవీస్ ఉండనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమా మిస్ అంటున్న వార్తలు నిజమేనా? లేదంటే పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో త్రివిక్రమ్-రామ్ చరణ్ మూవీ గురించి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
పోలీస్ స్టేషన్లో ఫైట్
పోలీస్ స్టేషన్లో ఫైట్ చేస్తున్నారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారం) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఓ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోందని సమాచారం. పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని, 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్లో పాల్గొంటున్నారని టాక్.ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఓ హైలైట్గా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. -
అడవిలో అన్వేషణ!
అడవుల్లో మహేశ్బాబు కళ్లు దేని కోసమో వెతుకుతున్నాయి. కొందరు నిధి కోసం అంటున్నారు. మరికొందరు ప్రాణం పోసే సంజీవిని తరహా లాంటి మొక్క కోసం అంటున్నారు. ఈ మాటలు మహేశ్బాబు కొత్త సినిమా గురించే. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో మహేశ్బాబు క్యారెక్టరైజేషన్, సినిమా కథ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తుండటం, సినీ ప్రేమికులు వీటిని ఆసక్తికరంగా గమనిస్తుండటం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణ నేపథ్యం ఉంటుందట.రామాయణంలో సంజీవని మొక్క కోసం వెతికే హనుమంతుడిని పోలిన లక్షణాలు మహేశ్బాబు పాత్రలో ఉంటాయని ఫిల్మ్నగర్ భోగట్టా. మరి... మహేశ్బాబు అడవిలో దేని కోసం అన్వేషిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరిగింది. తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఈ వారంలో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, కాశీ నగరాన్ని తలపించే సెట్ని రెడీ చేయించారని, ఈ సెట్లోనే షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిసింది. రెండు వారాలకు పైగా ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఇక ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తోన్న కేంద్ర మాజీ మంత్రి.. మరోసారి అలరించనుందా?
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామందే ఉన్నారు. అలా వచ్చినవారు చాలామంది పొలిటికల్గా సక్సెస్ కూడా అయ్యారు. అలాంటి వారిలో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా? బుల్లితెరపై తన అందంతో అలరించిన మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. భాజపాలో కీలకనేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలదించారు.బుల్లితెరపై రీ ఎంట్రీ?అయితే గతంలో బాలీవుడ్లో ఆమె నటించిన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి'. ఈ సీరియల్కు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం నటి స్మృతి ఇరానీ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం. దాదాపు 150 ఎపిసోడ్లు ఉన్న ఈ షోలో ఆమె మరోసారి తులసి విరానీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా నివేదిక ప్రకారం స్మృతి ఇరానీ జూన్ 8న 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థి 2' కోసం ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది. రెండో వారం ప్రారంభంలోనే ఏక్తా కపూర్కో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.కాగా.. ఇటీవల స్మృతి కపూర్ ఈ సీరియల్లో మిహిర్ విరానీ (మొదటి సీజన్) పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయ్తో పాటు ఏక్తా కపూర్ పుట్టినరోజు వేడుకలో కనిపించారు. కరిష్మా తన్నా, అనితా హసానందనీ కూడా పార్టీకి హాజరయ్యారు. 'క్యుంకి సాస్ భీ కభీ బహు థి' అనే సీరియల్ హిందీ బుల్లితెర చరిత్రలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్లో నటించిన వారి కెరీర్ కూడా మలుపు తిరిగింది. గతంలో ఈ షో 2000 నుంచి 2008 వరకు ప్రసారమైంది. ఆ తర్వాత స్మృతి ఇరానీకి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటిగా వరుసగా ఐదు అవార్డులను గెలుచుకుంది. అంతే కాకుండా రెండు భారతీయ టెలీ అవార్డులు కూడా దక్కించుకుంది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన చాణక్యుడు మూవీ హీరోయిన్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.తాజాగా ఈ ఈ ముద్దుగుమ్మకు రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది. ఇద్దరి నుంచి నలుగురిగా మారిపోయాం.. ఇప్పుడు మా ఫ్యామిలీ సంపూర్ణమైంది.. నాకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.కాగా.. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం -2'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ సేత్ చివరిసారిగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం -1, దృశ్యం- 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
రామ్ చరణ్తో త్రివిక్రమ్ ప్లాన్.. బన్నీనే కారణమా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు.గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, వెంకటేశ్తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్తో సోషయో ఫాంటసీని చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇప్పుడు బన్నీ అట్లీతో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. దీంతో బన్నీతో సినిమా ఇప్పట్లో పట్టలెక్కేలా కనిపించడం లేదు. ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. రామ్ చరణ్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పెళ్లి చీరలో కేతిక శర్మ.. అదితీ మరీ ఇంత క్యూట్నెస్సా
క్యూట్నెస్తో మాయ చేస్తున్న అదితీ శంకర్'సింగిల్' షూటింగ్ జ్ఞాపకాలతో కేతిక శర్మకత్తితో రాణిలా రౌద్రం చూపిస్తున్న నందిని రాయ్బాలిలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్పాస్తా చేసేస్తున్న హీరోయిన్ నివేదా థామస్మే నెల జ్ఞాపకాలతో బన్నీ భార్య స్నేహారెడ్డిబికినీలో అందాలన్నీ చూపించేస్తున్న రమ్య పసుపులేటి View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) -
'నా చావు గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు'.. అమితాబ్ ఘాటు రిప్లై!
బిగ్బీ అమితాబ్కు ఆసక్తికర అనుభవం ఎదురైంది. అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ఓ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు బిగ్ బీ. మీ గాడ్జెట్స్ను బ్రేక్ చేయండి.. మీకు దీర్ఘాయుస్సు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు.ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 'మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి..లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరు' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పోస్ట్కు బిగ్బీ అమితాబ్ తనదైన స్టైల్లోనే నెటిజన్కు ఇచ్చిపడేశాడు. నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు.. అంతా ఆ ఈశ్వరుని దయ' అంటూ చేతులెత్తి నమస్కరించే ఎమోజీ జతచేశాడు.ఆ తర్వాత అమితాబ్ ఆరోగ్యం, జీవితం గురించి వరుసగా పోస్టులు పెట్టారు. మన జీవితాన్ని గడపడానికి ఉత్తమ మార్గానికి సంబంధించిన సూత్రాలను అభిమానులు, నెటిజన్లతో పంచుకున్నారాయన. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీతో అభిమానులను అలలరించాడు. ప్రస్తుతం కల్కి-2లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా 'కౌన్ బనేగా కరోడ్పతి' నెక్ట్స్ సీజన్ హోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.मेरे मरण की बात करने के लिए धन्यवाद ; ईश्वर की कृपा 🙏— Amitabh Bachchan (@SrBachchan) June 9, 2025 -
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు. చివరగా 2023లో వచ్చిన 'సువర్ణ సుందరి' మూవీలో కనిపించారు. తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి ఈయన్న ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కలిశారు. ఆ విషయాన్ని ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు)'కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటోలోని కోటా శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే సదరు ఫొటోలో కోటా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో ఏమైందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'తోనే కోటా శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, దక్కనీ భాషల్లోనూ పలు చిత్రాల్లో ఈయన నటించడం విశేషం. ఇప్పటికీ పాత సినిమాల సీన్లనీ యూట్యూబ్లో చూస్తుంటే అరె ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనని దూరం పెట్టాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్) -
హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు
స్వతహాగా మలయాళీ అయినప్పటికీ హీరో మోహన్ లాల్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్', 'తుడరుమ్' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం ఈయన నటించిన తెలుగు మూవీ 'కన్నప్ప' రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాంటి ఈయన ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?)మోహన్ లాల్కి మేనమామ గోపీనాథన్ నాయర్(93) ఉన్నారు. గతంలో అలప్పుజా కో ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసిన ఈయన.. వయసు మీద పడటంతో గత 14 ఏళ్ల నుంచి మాత్రం అమృతపురిలోని మాత అమృతానందమయి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ కుటుంబ సభ్యులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.మోహన్ లాల్ అసలు పేరు రోషన్ లాల్. కానీ మేనమామ అయిన గోపీనాథన్.. ఈ పేరుని కాస్త మార్పు చేసి మోహన్ లాల్ అని పెట్టారు. తర్వాత తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. మోహన్ లాల్ మామతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అంత్యక్రియలు కూడా మోహన్ లాల్ కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకోనున్నారు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్) -
'ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్'.. రష్మికపై నాగార్జున ప్రశంసలు!
అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హీరో నాగార్జున కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికపై ప్రశంసలు కురిపించారు.ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ అని నాగార్జున కొనియాడారు. రష్మిక గత మూడేళ్లుగా సినిమాల్లో అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించారు. మేము ఎవరూ చేయలేని.. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్ల సినిమాలు రష్మిక మాత్రమే చేయగలదని అన్నారు. మా అందరికంటే రష్మికనే పెద్ద చిత్రాలు చేసిందని నాగార్జున ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత)కాగా.. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. -
'కన్నప్ప' ట్రైలర్ అప్డేట్.. కాస్త త్వరగానే
రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ తెగ హడావుడి పడుతున్నాయి. ఒక డేట్ చెబుతున్నారు. తీరా చూస్తే ఆ తేదీ దగ్గరకొచ్చేసరికి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్, సీన్స్ రీ షూట్ అని చెప్పి వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో 'కన్నప్ప' కూడా మినహాయింపు ఏం కాదు. కాకపోతే మిగతా చిత్రాలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎంత బడ్జెట్ పెట్టారు? ఇలాంటి విషయాలేం పెద్దగా తెలీవు. కానీ మొదట టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. తర్వాత మరో టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి విష్ణు ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)ఇప్పుడు మరో రెండు రోజుల్లో అంటే జూన్ 13న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా సినిమా రిలీజ్కి రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ బట్టి జనాలకు సినిమాపై అంచనా ఏర్పడుతుంది. మూవీ చూడాలా వద్దా అనేది వాళ్లు డిసైడ్ అవుతారు. ప్రమోషన్లలో విష్ణు మాటతీరు చూస్తుంటే.. చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి?మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు. టెక్నీషియన్స్ కూడా బాలీవుడ్కి చెందిన వాళ్లు పనిచేశారు. ఎప్పటినుంచో ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వస్తున్న విష్ణు.. ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
తండ్రి బర్త్ డే.. ఆయన ఆశయం దిశగా దీపికా పదుకొణె!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తన తండ్రి బర్త్ డే సందర్భంగా గొప్ప కార్యక్రమం చేపట్టింది. ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టినరోజు సందర్భంగా పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనేకు అంకితమిస్తున్నట్లు వెల్లడించింది.దీపికా తన ఇన్స్టాలో రాస్తూ.. "బ్యాడ్మింటన్ ఆడుతూ పెరిగిన వ్యక్తిగా.. ఈ క్రీడ ఒకరి జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతగా మారుస్తుందో నేను ప్రత్యక్షంగా అనుభవించా. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ (PSB) ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాడ్మింటన్ ఆడితే కలిగే ఆనందం, క్రమశిక్షణ అందించాలని అనుకుంటున్నా. ఆరోగ్యకరమైన క్రీడ ద్వారా ప్రేరణ పొందిన తరాన్ని నిర్మించాలని మేము ఆశిస్తున్నాం. డాడీ, మీ గురించి బాగా తెలిసిన వారికి.. ఈ క్రీడ పట్ల మీకెంత మక్కువో తెలుసు. 70 ఏళ్ల వయసులో కూడా తినడం, నిద్రపోవడం, బ్యాడ్మింటన్ ఆడడమే మీ ప్రపచం. అందుకే మీ ఇష్టాన్ని నిజం చేయడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. బ్యాడ్మింటన్ ఫర్ ఆల్! మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు పప్పా" అంటూ పోస్ట్ చేసింది. కాగా.. పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఇప్పటికే పలు నగరాల్లో స్థాపించారు. దాదాపు ఇప్పటికే 75 కేంద్రాల్లో నెలకొల్పారు. కాగా.. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణె మాజీ ప్రపంచ నంబర్ వన్ మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్లో ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది కల్కి మూవీలో మెప్పించిన దీపికా.. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. పుష్ప 2, ఛావా లాంటి సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ ధనుష్.. రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో తాను బిచ్చగాడు పాత్ర చేశానని, ఓసారి డంప్ యార్డ్లో దాదాపు ఆరేడు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తామంతా చెత్త నుంచి వచ్చే కంపుతో ఇబ్బంది పడుతుంటే.. రష్మిక మాత్రం నాకేం వాసన రావడం లేదు అని చెప్పేది. దీంతో ఆశ్చర్యపోవడం మా వంతైందని ధనుష్ అన్నాడు. అలానే 'కుబేర'.. జీవితంలోని మరో కోణాన్ని తనకు పరిచయం చేసిందని, చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందని చెప్పాడు.(ఇదీ చదవండి: డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!)ఇదే సినిమాలో కీ రోల్ చేసిన నాగార్జున మాట్లాడుతూ.. రష్మికని ఆకాశానికెత్తేశాడు. టాలెంట్లో ఈ అమ్మాయి పవర్ హౌస్ అంటూ పొగిడేశాడు. అలానే హీరోగా ఎందుకు చేయట్లేదంటే తనకు నచ్చే స్టోరీలు రావట్లేదని అన్నాడు. శేఖర్ కమ్ములు ఈ స్క్రిప్ట్తో తన దగ్గరకు రాగానే విని ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలో 'కూలీ'తో మరోసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నానని కూడా చెప్పాడు.శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'.. ఆయన గత చిత్రాలతో పోలిస్తే సమ్థింగ్ ఉండబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం చాలామందికి అర్థమైంది. కాకపోతే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు ఇది యాక్షన్ మూవీ కాదు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్ధాలు తదితర అంశాలతో సినిమాని తీసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి 'కుబేర'.. బిగ్ స్క్రీన్పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?) -
కత్రినా కైఫ్కు క్రేజీ ఛాన్స్.. ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్గా!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్కు అరుదైన ఛాన్స్ దక్కింది. ఆమె పర్యాటక అభివృద్ధికి అంబాసిడర్గా ఎంపికైంది. అయితే కత్రినాను ఎంపిక చేసింది మాత్రం మన దేశానికి కాదు. గతేడాది మనదేశంతో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన దేశానికి ఆమె గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆ దేశం మరెదో కాదు.. మన దగ్గర్లోనే ఉన్న మాల్దీవుస్. కత్రినా కైఫ్ను మాల్దీవులకు ప్రపంచ పర్యాటక రాయబారిగా నియమించినట్లు మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ వెల్లడించింది. భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన కత్రినా కైఫ్ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశం రావడంపై బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ స్పందించింది. గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై సంతోషం వ్యక్తం చేసింది. మాల్దీవులు అందించే లగ్జరీ, అందాలను సూచించడానికి ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది.గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా తన కొత్త రోల్ గురించి కత్రినా మాట్లాడుతూ.. 'మాల్దీవులు లగ్జరీ, సహజ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్. చక్కని ప్రశాంతంగా ఉండే ప్రదేశం. సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్గా ఎంపికైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నా. ఈ సహకారం ప్రపంచ పర్యాటక ప్రేక్షకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అద్భుతమైన గమ్యస్థానం, ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రపంచ స్థాయిలో పేరు పొందేలా సహాయపడటానికి ఉత్సాహంగా ఉన్నానని" తెలిపింది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. వచ్చే నెలలో మాల్దీవుస్లో ప్రధాని పర్యటించనున్నారు. View this post on Instagram A post shared by Visit Maldives (@visitmaldives) -
డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!
రీసెంట్ టైంలో ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి ఘోరమైన డిజాస్టర్ అయిన సినిమా 'థగ్ లైఫ్'. తొలిరోజు తొలి ఆటకే ఫలితం ఏంటో తెలిసిపోయింది. రిలీజ్కి కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత తేలిపోయింది. ఇప్పుడు వీకెండ్ కూడా పూర్తి కావడంతో చాలాచోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. దీంతో ఓటీటీ లెక్క మారే సూచనలు కనిపిస్తున్నాయి.సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సదరు సినిమా.. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కావాలనేది ముందే మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారు. కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రానికి కూడా నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఉత్తరాదిలోనూ మల్లీప్లెక్స్ రిలీజ్ దక్కింది. తీరా చూస్తే తొలి వీకెండ్కే సినిమా ఫలితం ఏంటో తెలిసిపోయింది. దీంతో నిర్మాతలు.. ఓటీటీ సంస్థతో బేరాసారాలు మొదలుపెట్టారట.ఒప్పందం చేసుకున్నట్లు ఎనిమిది వారాలు కాకుండా నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అడుగుతున్నారట. తద్వారా కొంత మొత్తం ఎక్కువ రాబట్టుకోవాలని నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ టైంలో థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో హిట్ అవుతున్నాయి. కంగువ, విడామయూర్చి, రెట్రో ఈ కోవలోకే వస్తాయి. బహుశా 'థగ్ లైఫ్' కూడా అలానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతుందేమో చూడాలి? ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ రావొచ్చు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. అనుకోకుండా తండ్రిని కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని శక్తిరాజు పెంచుకుంటాడు. తన తర్వాత తన ముఠాకు అమర్ని నాయకుడిగా చేస్తాడు. దీన్ని అదే ముఠాలోని ఇతర సభ్యులు తీసుకోలేకపోతారు. ఇంతలోనే శక్తిరాజుపై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ శక్తిరాజుని చంపాలనుకున్నది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో ఇంద్రాణి, లక్ష్మీ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషకు చెందిన హీరోలు.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి ఏం లేని టైంలోనే దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకున్న కొందరు నటీనటులు ఉన్నారు. వాళ్లలో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఒకరు. ఈయనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడంలో ఓ ఫ్లాట్ ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?)దుబాయిలో బుర్జ్ ఖలీఫా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు దీన్ని సందర్శించకుండా తిరిగిరాడు. అలాంటిది ఈ ఎత్తయిన కట్టడంలోని 29వ ఫ్లోర్లో సింగిల్ బెడ్ రూమ్ని చాన్నాళ్ల క్రితమే మోహన్ లాల్ కొనుగోలు చేశారు. దాదాపు రూ.3.5 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకున్నారు. కాకపోతే దీన్ని తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించారు. దీనితో పాటు దుబాయిలోనే పెద్ద విల్లాలోని 3 బీహెచ్కే ఫ్లాట్ కూడా మోహన్ లాల్ కొన్నారు.ఇలా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక నటుడిగా మోహన్ లాల్ రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. తెలుగు నటుల్లోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్కి కూడా దుబాయిలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారనే గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా చూసుకుంటే మాత్రం దుబాయిలో టూరిజం బాగా పెరిగింది. దీంతో మనదేశానికి చెందిన పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు.మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో నటించడంతో ఈ తరం ఆడియెన్స్కి పరిచమయ్యారు. రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన కొడుకు ప్రణవ్ కూడా హీరోగా మలయాళంలో పలు చిత్రాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ) -
ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ
ఓటీటీలోకి మరో హారర్ కామెడీ సినిమా వచ్చేందుకు రెడీ అయింది. గత నెలలో ఓ పేరడీ పాట వల్ల వివాదాస్పదమైన ఈ చిత్రం.. తిరుమల వేంకటేశ్వర స్వామిని నమ్మే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది. పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అలా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)తమిళ కమెడియన్ సంతానం హీరోగా నటించిన కామెడీ మూవీ 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్'. మే 16న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. కానీ కంటెంట్ తేలిపోవడంతో ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. అయితే గోవింద అంటూ సాగే దేవుడి పాటని ఇందులో పేరడీ చేయడం కాంట్రవర్సీకి కేరాఫ్ అయింది. తర్వాత దాన్ని తొలగించడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.ఇక ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి నెల కూడా అవ్వకుండానే ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 13 నుంచి జీ5లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. కిస్సా 47 అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే కృష్ణ(సంతానం)కి ప్యారడైజ్ అనేది థియేటర్ నుంచి స్పెషల్ టికెట్ వస్తుంది. దీంతో కుటుంబంతో సహా కృష్ణ ఆ థియేటర్కి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఆ థియేటర్లో అసలేం జరుగుతుందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
దిల్ రాజు చేతికి 'వార్ 2'.. కూలీ ఎఫెక్ట్తో పక్కా ప్లాన్
బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.వార్2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్ రాజ్ ఫిలింస్ కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్తో ఆ సంస్థ అడుగులేస్తుంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్ ఇండియాలో వార్2కు పోటీ తప్పదు. అందుకే వార్2 చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ, ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్ పక్కన పెట్టేసింది. -
కమల్ సంస్థలో రోలెక్స్.. భారీ బడ్జెట్తో ప్లాన్
కథానాయకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్న నటుడు కమలహాసన్. ఈయన ఇటీవల తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం అమరన్. నటి సాయిపల్లవి నాయకిగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో మెడ్రాస్ టాకీస్తో కలిసి రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన థగ్లైఫ్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తదుపరి కమలహాసన్ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి, ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా తాజాగా కమలహాసన్ మరో చిత్రం నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకు ముందు సిద్ధార్థ్ హీరోగా చిత్తా, విక్రమ్ కథానాయకుడిగా వీర ధీర శూరన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరో ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరికి నటుడు సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యతో నిర్మించనున్న ఈ సినిమా కోసం కమల్ భారీ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.సూర్య ఇంతకు ముందు కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే పాత్రలో అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్య హీరోగా అరుణ్కుమార్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా ప్రస్తుతం సూర్య తన 45వ చిత్రం షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉంటూనే తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. -
ఓటీటీలో మలయాళ ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మలయాళంలో తెరకెక్కిన ఒక ఫాంటసీ కామెడీ చిత్రం 'పడక్కలం'.. మే 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నూతన దర్శకుడు మను స్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్ నటించారు. ప్రేక్షకులకు క్లీన్ క్యాంపస్ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీని దర్శకుడు అందించాడు. కానీ, పేలవమైన కథ ఎంపిక చేసుకోవడం వల్ల సినిమాను నిరాశపరిచింది.జూన్ 10న పడక్కలం జియోహాట్స్టార్ వేదికగా విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్లు రాబట్టింది. కామెడీ పరంగా సినిమా పర్వాలేదనిపించినా... కథ ఎంపిక విషయంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పవచ్చు. అయితే, ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉంది.నలుగురు కాలేజీ అబ్బాయిల ప్రయాణమే పడక్కలం చిత్రం. వారికి కామిక్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. వారు ఊహించని సాహసయాత్రలో పాల్గొంటారు, వారి పాఠశాలలోని ఒక ప్రొఫెసర్కు ఉన్న అతీంద్రియ శక్తులతో వారి విద్యా ప్రపంచం తలకిందులు అవుతుంది. అనేక మలుపులతో వారి ప్రయాణం ఎలా ముగుస్తుంది అనేది ఈ చిత్రం. -
'టూరిస్ట్ ఫ్యామిలీ' తర్వాత యంగ్ హీరోయిన్తో మూవీ ప్లాన్ చేసిన శశికుమార్
వైవిధ్య కథాచిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న 'శశికుమార్' వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన 'అయోద్ధి' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శశికుమార్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల నటి సిమ్రాన్తో కలిసి నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం శశికుమార్ హీరోగా నటించిన ఫ్రీడమ్ చిత్రం జూలై 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈయన తొలిసారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇంతకు ముందు రూపొందిన వదంతి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వదంతి–2 రూపొందుతోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో సాగే ఈ వెబ్ సిరీస్లో నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మదురై, తిరునల్వేల్లి ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్లో తాను శశికుమార్కు జంటగా నటిస్తున్నట్లు నటి 'అపర్ణదాస్'(Aparna Das) ఇటీవల ఒక భేటీలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల బ్యూటీ 50 ఏళ్లకు పైగానే ఉన్న శశికుమార్కు జంటగా నటించనుంది. ఆమె ఇప్పటికే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించారన్నది గమనార్హం. ముఖ్యంగా తమిళంలో నటుడు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించి 'దాదా' (పాపా) సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా చిత్రం తెలుగులో జూన్ 12న విడుదల కానుంది.కాగా దీని తరువాత శశికుమార్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన మెగాఫోన్ పట్టి శ్రీకుట్రపరంపరైశ్రీ అనే వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని శశికుమార్నే ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు. -
లక్ష్యం కోసం...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ‘వార్ 2’ సినిమా టీజర్ను విడుదల చేశారు.ఈ టీజర్లో కనిపించిన ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ బాగున్నాయనే చర్చ జరిగింది. ఈ విషయంపై ‘వార్ 2’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన అనైతా ష్రాఫ్ అడజానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. సెట్స్కి ఎంట్రీ ఇవ్వగానే ఆ ఎనర్జీ టీమ్ అందరిలోకి వచ్చేస్తుంటుంది. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ పోషించినపాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. అందుకే చాలా లుక్స్ని డిజైన్ చేశాం. ఆయనపాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ని డిజైన్ చేశాం. ఓ ఉద్దేశంతో ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అనైతా ష్రాఫ్ అడజానియా చెప్పారు. -
క్రేజీ కాంబినేషన్?
హీరో రామ్చరణ్, దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకునేందుకు సన్నాహాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేసి, రామ్ చరణ్కు వినిపించారట. ఈ కథ నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మించనున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. కాగా ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు రామ్చరణ్. అలాగే దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి..‘పెద్ది’ తర్వాత రామ్చరణ్ సినిమా సుకుమార్తో ఉంటుందా? లేక త్రివిక్రమ్తోనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
షారుక్ఖాన్ తో సుకుమార్?
బాలీవుడ్ హీరో షారుక్ఖాన్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. షారుక్తో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా చర్చలుప్రారంభమయ్యాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు షారుక్ ఓకే చెబితే, దర్శకుడిగా సుకుమార్తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మైత్రీమూవీ మేకర్స్ అనుకుంటున్నారని టాక్. మరి.. సుకుమార్, షారుక్ఖాన్ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే.. ఇటీవల షారుక్ఖాన్ ను కలిశారట తమిళ దర్శకుడు వెట్రిమారన్ . ఈ నేపథ్యంలో షారుక్ఖాన్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం హిందీ చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నారు షారుక్ఖాన్ . ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. -
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.అసలేంటి వివాదం..?ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు. -
మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత
కుబేర మూవీ నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విడుదలపై ఓటీటీల ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. తాము నిర్మించిన మూవీ రిలీజ్ డేట్ను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. మా సినిమాను జూలైలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే అంగీకరించిన మొత్తంలో రూ. 10 కోట్ల రూపాయలు కోత విధిస్తామని హెచ్చరించందని నిర్మాత సునీల్ వెల్లడించారు. ఓటీటీలే సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోందని తెలిపారు.'కుబేరా' నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ' ఓటీటీ ప్లాట్ఫామ్స్ సినిమాల విడుదల తేదీని నిర్ణయిస్తున్నాయి. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదు. నేను జూలైలో కుబేరా మూవీ రిలీజ్కు ఓటీటీ సంస్థను అభ్యర్థించా. కానీ మొదట అంగీకరించిన తేదీ జూన్ 20న విడుదల చేయాలని నన్ను కోరారు. ఆ డేట్లో రిలీజ్ చేయకపోతే అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారు.' అని వెల్లడించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సంఘటనల కారణంగా పరిశ్రమ దెబ్బతింది. మేము సినిమా సర్వీస్ ప్రొవైడర్ అయిన క్యూబ్పై పూర్తిగా ఆధారపడి ఉన్నాం. శాటిలైట్ లేకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఇక బుక్మైషో ఒక గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకి పడిపోతాయి. అలా మేము వాటన్నిటిపైనే కాకుండా ఇప్పుడు ఓటీటీలపై ఆధారపడాల్సి వస్తోంది' అన్నారు.గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లను బట్టి మేము సినిమాలు తీస్తున్నామని వెల్లడించారు. మెల్లమెల్లగా వాళ్లే ఇప్పుడు పరిశ్రమకు కింగ్గా మారుతున్నారని.. సినిమా ఆడినా.. ఆడకపోయినా ఈ ముగ్గురూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. కుబేర మూవీలో కోలీవుడ్ హీరో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంజూన్ 20న విడుదల కానుంది. -
అఖిల్ పెళ్లిలో చరణ్-ఉపాసన.. మార్వెలస్ మీనాక్షి
అఖిల్ పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన ఉపాసనగ్లామరస్ లుక్తో మహేశ్ బాబు భార్య నమ్రతలుంగీతో ఊరమాస్గా మారిన వరలక్ష్మీ శరత్ కుమార్చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న సుప్రీతఒళ్లంతా తడిపేసి పోజులిచ్చిన షాలినీ పాండేబీచ్ ఒడ్డున ప్రియా వారియర్ స్వీట్ స్టిల్స్చీరలో కొంటెదనంతో చూస్తూ నభా నటేశ్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
ప్రముఖ రాజకీయ నాయకుడితో రిలేషన్.. సోనాలి బింద్రే క్లారిటీ!
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. సల్మాన్ ఖాన్తో ఓ మూవీ సెట్లో ఎదురైన సంఘటనను ఇటీవలే వెల్లడించింది. ఆ సమయంలో అతనిపై విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. అయితే తన క్యాన్సర్ చికిత్స సమయంలో అమెరికా వచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడని కూడా చెప్పుకొచ్చింది.తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 20 ఏళ్ల క్రితం తనను ఇష్టపడ్డారన్న రూమర్స్పై బాలీవుడ్ నటి సోనాలి బింద్రే స్పందించారు. ఈ వార్తలపై సోనాలి అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి వార్తలను పట్టించుకోలేదని సోనాలి తెలిపింది. సోనాలి మాట్లాడుతూ.. 'నాపై ఇలాంటి ప్రచారం జరిగినట్లు నాకే తెలియదు. కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్ థాకరే భార్య షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరు కుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది. అలా ఇరు కుటుంబాల మధ్య నా చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే ఉందని' తెలిపింది. కాగా.. సోనాలి బింద్రే చివరిసారిగా 'ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2'లో కనిపించింది. ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఇండియన్-2 కంటే తక్కువ వసూళ్లు!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ తొలి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత పెద్దగా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల లోపే నెట్ వసూళ్లు సాధించింది.ఇక వీకెండ్ చివరి రోజు ఆదివారం కలెక్షన్లతో కలిసి నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్గా రూ.43 నికర వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే థగ్ లైఫ్ నాలుగు రోజుల్లో రూ.73 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ చేరుకుంది. ఈ సంఖ్య అంతకుముందు కమల్ హాసన్ నటించిన ఇండియన్-2 కంటే చాలా తక్కువగా నమోదైంది. గతేడాది విడులదైన ఇండియన్-2 నాలుగు రోజుల్లో రూ.113.55 కోట్ల నికర వసూళ్లు సాధించింది.అయితే థగ్ లైఫ్ వసూళ్లు తగ్గడానికి కన్నడ భాష వివాదం కూడా ఓ కారణం. బెంగళూరు ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమాను నిషేధించారు. కమల్ కామెంట్స్తో ఈ చిత్రం షెడ్యూల్ కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. కాగా.. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ రిలీజ్.. ఈసారి కూడా
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సూపర్ హిట్. 2021 డిసెంబరులో రిలీజైన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీస్తున్నారు. షూటింగ్ చాలావరకు పూర్తి చేశారు. జూన్ 10న అంటే రేపటి రోజున బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. తొలి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది.తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్లో చిన్నపాటి మార్పులు చేశారు. పొడవాటి జుత్తుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు. 'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?' అంటూ విలన్కి వార్నింగ్ ఇచ్చే ఓ డైలాగ్ కూడా ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా అనిపించాయి. అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఎప్పటిలానే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నాడు. సెప్టెంబరు 25న సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి అది తేదీకి పవన్ 'ఓజీ' కూడా రిలీజ్ కానుంది. ఇద్దరూ వస్తారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?ఈ సినిమాకు బోయపాటి దర్శకుడు కాగా.. 14 రీల్స్ సంస్థతో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 'అఖండ' నుంచి సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన బాలయ్య.. తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్నారు. తాజాగా రిలీజైన 'అఖండ 2' టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
సుష్మిత సంపాదిస్తుంటే తేరగా తింటున్నావ్.. ఇల్లు కూడా నీది కాదు!
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. సుష్మితా సేన్ (Sushmita Sen) సోదరుడు, బాలీవుడ్ నటుడు రాజీవ్ సేన్ (Rajeev Sen) కూడా అందుకు అతీతుడు కాదు. అక్క ఎలాగో పెళ్లి చేసుకోలేదు.. ఆమె బాగా సంపాదిస్తుంటే తేరగా వచ్చిందని పుష్టిగా తింటున్నావ్.. ఎంజాయ్ చేస్తున్నావ్ అని కొందరు అతడిపై నోరు పారేసుకున్నారు.అక్క సంపాదనతోనే..ఈ నెగెటివ్ కామెంట్లు రాజీవ్ కంటపడ్డాయి. అతడి కష్టాన్ని గుర్తించకపోగా ఇలా తక్కువ చేసి మాట్లాడటంతో నటుడి మనసు చివుక్కుమంది. దీంతో తన యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రోలింగ్పై స్పందించాడు. రాజీవ్ సేన్ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే మా అక్క సంపాదించే డబ్బుతోనే బతుకుతున్నానని, మా అమ్మానాన్న వల్లే ఇంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నానని చాలామంది అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.అలాగైతేనే సక్సెస్ అయినట్లా?నేనేంటో చూపించుకోవడానికి నేనేమీ సూపర్స్టార్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. నేను పది సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్లో నటించాను.. ఇంకా నా చేతిలో ఫలానా ప్రాజెక్టులున్నాయి. వాటితో మరింత సక్సెస్ అవుతా.. ఇలాంటివి చెప్తేనే, చేస్తేనే సక్సెస్ అయినట్లు కాదు. చాలామంది బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతున్నారు. రకరకాల విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అవన్నీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకుంటారా? లేదు కదా! నగల బిజినెస్నాకు జ్యువెలరీ బిజినెస్ ఉంది. అమ్మానాన్నల సహకారంతో అది విజయవంతంగా రన్ చేస్తున్నాను. నేను కాస్త ఉన్నత కుటుంబంలోనే పుట్టాను. అయినా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నగల వ్యాపారం ప్రారంభించాను. ఈ పని చాలాకాలంగా చేస్తున్నాను. ఇదే కాకుండా నటనవైపు వెళ్లాను, నిర్మాతగా కూడా ప్రాజెక్టులు చేస్తున్నా.. యూట్యూబ్ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇవన్నీ ప్యాషన్తో చేస్తున్నవే తప్ప డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ను. నా సొంత పెట్టుబడితో చాలానే సంపాదించా.. అది ఎంత మొత్తమనేది మీకు చూపించాల్సిన అవసరం లేదు.గెంటేస్తే పోతా..నేను ఉండే ఇల్లు మా అమ్మదే.. ఈ ఇల్లు నాదే అని ఎన్నడూ చెప్పలేదే! రేప్పొద్దున అమ్మ.. వెళ్లిపో అని గెంటేస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా! ఎందుకంటే నేను సంపాదించినవి మాత్రమే నా ఆస్తులు. ఇది నాది కాదు. అయినా మీరన్నట్లు మా అమ్మ సంపాదించిన విలాసవంతమైన ఇంట్లో ఉండి.. ప్రతి ఖర్చులు తనే భరిస్తూ.. మా అక్క కూడా తనే డబ్బిచ్చి ఎంజాయ్ చేయమంటే మీకేంటి సమస్య? నేనేం మీ జేబులోని డబ్బు తీయట్లేదుగా? మీరేమనుకున్నా నాకు ఫరఖ్ పడదు అని రాజీవ్ సేన్ ట్రోలర్స్కు కౌంటర్ ఇచ్చాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. కొత్త జంట చేసిన పని చూశారా? -
'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
'విరూపాక్ష' సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు.. పెద్దగా హడావుడి లేకుండానే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆదివారం అమ్మాయి ఇంటి దగ్గర ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే తోటి దర్శకులు కార్తీక్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఎంగేజ్మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు? పెళ్లి ఎప్పుడు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకడు కార్తీక్ వర్మ దండు. 'కార్తికేయ' సినిమాకు రైటర్గా పనిచేసిన అనుభవం ఉంది. అలా 2015లో 'భమ్ భోలేనాథ్' మూవీతో డైరెక్టర్గా పరిచమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మరో ప్రయత్నం చేయలేదు. చాన్నాళ్ల గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజ్తో 'విరూపాక్ష' తీశాడు. ఇది సూపర్ హిట్ అయింది.'విరూపాక్ష' హిట్ కావడంతో నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఓవైపు దర్శకుడిగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ పర్సన్ అయ్యేందుకు కార్తీక్ వర్మ సిద్ధమైపోయాడు. ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. బంధువుల అమ్మాయిలా అనిపిస్తుంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్) -
జయం రవితో రిలేషన్ రూమర్స్.. ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్!
గత కొద్ది నెలలుగా కోలీవుడ్ హీరో విడాకుల జయం రవి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో ఒకరిపై ఒకరు వరుస లేఖలతో విమర్శలు చేసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి.జయం రవి భార్య ఆర్తి సైతం తాము విడిపోవడానికి ముడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేసింది. పరోక్షంగా విడాకులకు కారణం సింగర్ కెన్నీషా అంటూ ఆరోపించింది. అయితే ఇటీవల జయం రవి, కెన్నీషా దండలు వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏకంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ వీరిద్దరు తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు పూజారులతో కలిసి తీసుకున్న ఫోటో అని తెలిసింది.అయితే కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుత కెన్నీషా గర్భంతో ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కెన్నీషా తన గర్భధారణపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. ఓ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేను గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారంటూ మాట్లాడింది. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి.. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కెన్నీషా చెప్పుకొచ్చింది. తాజాగా సింగర్ మాటలతో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టేసింది. -
అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్తో అఖిల్కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025 -
ఆస్పత్రి బెడ్పై టాలీవుడ్ బ్యూటీ.. అదే కారణమా?
బిగ్బాస్ విన్నర్, టాలీవుడ్ నటి సనా మక్బుల్ (Sana Makbul) ఆస్పత్రిపాలైంది. ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ ఆశ్నా కంచ్వాలా.. సనా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మై స్ట్రాంగ్ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉన్నాను అని రాసుకొచ్చింది.సినిమాసనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగా నిలిచింది. ఇటీవల ఆమె తన కాలేయ వ్యాధి గురించి బయటపెట్టింది. 2020 నుంచి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన శరీరంలోని కణాలు కాలేయంపై దాడి చేస్తాయి. దీని కారణంగా తను ఆస్పత్రిపాలైనట్లు కనిపిస్తోంది. చదవండి: రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో -
ఏంటి మీ గోల?.. డౌట్స్ ఉంటే ట్రైలర్ చూడండి..!
ఇటీవల టాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అందరికంటే కాస్తా భిన్నంగా చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తమ్ముడు' మేకర్స్ అదే అలానే ట్రై చేశారు. గతంలో మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేందుకు కొత్తగా ట్రై చేశారు. తాజాగా ట్రైలర్ అపేడేట్ ఇచ్చేందుకు మరోసారి అదే స్టైల్నే ఫాలో అయ్యారు. హీరోయిన్లు హడావుడి చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ అంతే' అంటూ వర్ష బొల్లమ్మ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అయితే మేము చెప్తాం అంటూ అక్కడే ఉన్న హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ అసలు మీరిద్దరు ఎవరు? అని ప్రశ్నిస్తుంది. వేరే సినిమాలో నటించి.. తమ్ముడు అనుకున్నారా? అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయిస్తుంది. చివర్లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి.. ఏంటి మీ గోల? మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి అని అనడంతో వీడియో ముగుస్తుంది.టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు ట్రైలర్ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
మహేశ్-రాజమౌళి సినిమా.. నో చెప్పిన స్టార్ హీరో?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ భాషల్లోనూ హీరోలు తెలుగు సినిమాల్లో, మన దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్స్ చాలామంది తమిళ, మలయాళ హీరోలని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి, మహేశ్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని అడగ్గా నో చెప్పాడట. ఇంతకీ ఎవరతడు? ఏంటి సంగతి?'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేశ్తో సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవగా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మూవీ మొదలుపెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి.. ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నారనే విషయం లీకైంది. కానీ రాజమౌళి అస్సలు రెస్పాండ్ కాలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)ఇప్పుడు కూడా సడన్గా తమిళ హీరో విక్రమ్.. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ చేశాడంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ని సంప్రదించగా, తనకు ప్రతినాయకుడి రోల్స్ చేయడం ఇష్టం లేదని జక్కన్నతో ఇతడు చెప్పాడట. దీంతో మరో ఆప్షన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ని ఎంపిక చేశాడని అంటున్నారు. గతంలో ప్రభాస్ 'సలార్'లో పృథ్వీరాజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబుకి విలనీగా చేస్తున్నాడనమాట.ఇదే సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ రెండు మూడు రోజుల క్రితం వినిపించింది. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఇది సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?) -
దుబాయ్ ట్రిప్లో సమంత.. ఆమెతో పాటే అతను కూడా!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం దుబాయ్లో చిల్ అవుతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన నెటిజన్స్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఫోటోల్లో మరో వ్యక్తి కనిపించడంతో మరోసారి చర్చకు దారితీసింది. షూటింగ్ చేస్తూ సమంత కనిపించగా.. అందులో ఉన్నది కచ్చితంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కామెంట్స్ పెడుతున్నారు. సామ్ ఫోటోలను కూడా అతనే తీశాడని రాసుకొస్తున్నారు.ఈ ఫోటోలు వైరల్ కావడంతో అబుదాబి సెలవులకు బాయ్ఫ్రెండ్తో కలిసి సమంత చిల్ అవుతున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొన్ని నెలలుగా సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో ఆ వార్తలు తెగ వైరలయ్యాయి. ఇటీవల రాజ్ భార్య భార్య శ్యామలి దే సైతం సమంతతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని ఉద్దేశించి పోస్ట్ రాశారు. అయితే తమ రిలేషన్పై ఇప్పటి వరకు సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు.ఇటీవల విడుదలైన సమంత నిర్మించిన శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. అంతకుముందు సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2','సిటాడెల్: హనీ బన్నీ'వెబ్ సిరీస్ల్లో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు నెట్ఫ్లిక్స్ రానున్నా 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' కోసం జతకట్టారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?
తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో తీశారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకే స్టార్ డైరెక్టర్ గానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈయన.. దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్ట్తో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్నిరోజులకే దాన్ని పక్కనబెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే 'గుంటూరు కారం'. మహేశ్ అభిమానులకు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'గుంటూరు కారం' గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్తో మైథలాజికల్ కథతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్.. దీన్ని పక్కనబెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేశ్తో సినిమాలు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి చేసినా సరే టాలీవుడ్కే పరిమితమయ్యే మూవీస్ అవుతాయేమో?త్రివిక్రమ్తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలామంది డైరెక్టర్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో టాప్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?
ఓటీటీలోకి మరో మంచి సినిమా రాబోతుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని, రూ.150 కోట్ల మేర వసూళ్లు సాధించింది. చాన్నాళ్ల హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్.. కాస్త బూస్టప్ ఇచ్చింది. తర్వాత తెలుగులోనూ రిలీజ్ చేశారు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ వైరల్ అవుతోంది.జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా 'కేసరి చాప్టర్ 2'. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. కోర్టు రూమ్ డ్రామాగా తీసిన ఈ మూవీని తొలుత హిందీలో ఏప్రిల్ 18న రిలీజ్ చేయగా మంచి టాక్ వచ్చింది. నెల తర్వాత అంటే మే 23న తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయగా ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో జూన్ 13 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)కేసరి 2 విషయానికొస్తే.. 1919లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరాడు.కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి జనరల్ డయ్యర్పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు లాయర్ నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
కూతురికి రూ. 250 కోట్లు గిఫ్ట్గా ఇచ్చిన స్టార్ హీరో దంపతులు
తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కాదని చెప్పవచ్చు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల (Ranbir Kapoor, Alia Bhatt) ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాశారు. ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేపించుకోకుండా కూతురు, అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.ఆ ఇంటితో రణబీర్ అనుబంధంవాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే, దానిని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. మరో రెండు నెలల్లో గృహప్రవేశం చేయనున్నారు.రణబీర్కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు.. దానిని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు. అయితే, తనకు కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. దాంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్లో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సిద్ధ వైద్యం వల్లే ప్రముఖ నటుడు మృతి?
కోలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ (Tamil actor Rajesh) (75) ఇటీవలే కన్నుమూశారు. మే 29న ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మరణించారు. చలనచిత్రపరిశ్రమలో 50 ఏళ్లకు పైగా రాణించిన ఆయన ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని కల కన్నాడు. కానీ, అది నెరవరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే అధునాతన వైద్యాన్ని కాదని సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే రాజేశ్ చనిపోయాడని ప్రచారం జరిగింది. సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే?ఆస్పత్రిలో చేరడానికి ముందు సిద్ధ వైద్యుడితో నటుడు గంటల తరబడి గడిపాడని రాజేశ్ సోదరుడు చేసిన కామెంట్లతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంపై నటుడు రాజేశ్ కూతురు దివ్య స్పందించింది. మా నాన్న ట్రీట్మెంట్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇంతటితో ఆపండి. ఈ వదంతులు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. దయచేసి ఈ సమయంలో మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయండి.నిజమెంత?మా నాన్న సిద్ధ వైద్యమే కావాలని.. మరొకటి వద్దని మొండిగా వ్యవహరించాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే ఓ సిద్ధ వైద్యుడు మా నాన్నను రెగ్యులర్గా చెక్ చేస్తుండేవాడు. ఆరోజు నాన్న శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని సిద్ధ వైద్యుడే గమనించి చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ దారిలోనే కన్నుమూశాడు. దయచేసి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.ఎవరీ రాజేశ్?రాజేశ్ తమిళనాడు వాసి. దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో రాజేశ్ సినీప్రస్థానం మొదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు, రుద్రుడు సినిమాల్లో నటించారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించారు . 1985లో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అలరించారు. కార్తిగై దీపం సీరియల్లో యాక్ట్ చేశారు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా! చదవండి: అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..! -
ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
మరో వారం వచ్చేసింది. లెక్క ప్రకారం ఈ వీకెండ్లో రావాల్సిన 'హరిహర వీరమల్లు' వాయిదా పడటంతో థియేటర్లన్నీ ఖాళీగానే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోకి ఏకంగా 20కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని చూడదగ్గవి ఉండటం విశేషం. (ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సమంత 'శుభం', ఎలెవన్ అనే తెలుగు మూవీస్తో పాటు 'జింఖానా' అనే డబ్బింగ్ సినిమాతో పాటు 'రానా నాయుడు' సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (జూన్ 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్ద క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 09ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10ట్రైన్ రెక్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 10అనీలా (పోలీష్ సిరీస్) - జూన్ 11ఛీర్ టూ లైఫ్ (పోర్చుగీస్ మూవీ) - జూన్ 11కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 11అవర్ టైమ్స్ (స్పానిష్ సినిమా) - జూన్ 11టైటాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 11ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13ఆహాఎలెవన్ (తెలుగు సినిమా) - జూన్ 13అమెజాన్ ప్రైమ్ద ట్రైటర్స్ (హిందీ రియాలిటీ షో) - జూన్ 12ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్) - జూన్ 13హాట్స్టార్పడక్కలమ్ (మలయాళ సినిమా) - జూన్ 10ద రియల్ హౌస్వైవ్స్ ఆఫ్ మియామి సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12శుభం (తెలుగు మూవీ) - జూన్ 13అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 15సోనీ లివ్జింఖానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 13ఆపిల్ ప్లస్ టీవీఎకో వ్యాలీ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 13నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13మనోరమ మ్యాక్స్కర్ణిక (మలయాల సినిమా) - జూన్ 09(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. 'ప్రేమతో.. జీ తెలుగు'!
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంఘమంలో నిలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి.. సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్ ఫిల్మ్లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో.. జరిగే పెళ్లి తంతును కళ్లకి కట్టినట్లు చూపించారు. బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం పెళ్లి బుట్ట మొదలైన సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగువారి హృదయాలను హత్తుకుంటోంది.ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. 'ప్రేమతో.. జీ తెలుగు' క్యాంపెయిన్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జీ తెలుగు ఎప్పుడు ముందుంటుంది. మన వివాహ పద్ధతిలోని సౌందర్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపించే ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు సంస్కృతి, విలువలు, ఆచారాలను ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం రీబ్రాండింగ్ మాత్రమే కాదు, ప్రేక్షకులతో జీ తెలుగు అనుబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులు జీ తెలుగు నూతన ప్రయాణాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. -
అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా?
అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. గతేడాది చివర్లో నాగార్జున (Nagarjuna Akkineni) పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో జరిగింది. ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి.. జైనబ్తో జరిపించాడు. ఈ రెండు కూడా ప్రేమ పెళ్లిళ్లు కావడం విశేషం. జూన్ 6న పెద్ద హడావుడి లేకుండా తన ఇంట్లోనే పెళ్లి జరిపించాడు నాగ్. కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ఏర్పాటు చేశాడు. రెండు రోజుల గ్యాప్తో రిసెప్షన్జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరిగింది. మహేశ్బాబు, రామ్ చరణ్, నిఖిల్, సూర్య, యశ్, నాని, కిచ్చా సుదీప్, దిల్ రాజు, సుకుమార్, బుచ్చిబాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ ఫంక్షన్కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో మీరో విషయం గమనించారా? అఖిల్ (Akhil Akkineni) దాదాపు అన్ని ఫోటోల్లోనూ జైనబ్ చేయి పట్టుకునే కనిపించాడు. అఖిల్-జైనబ్ ఫ్యామిలీ ఫోటోఅన్ని ఫోటోల్లోనూ..ఆమె చేతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. సినీతారలే కాదు, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా భార్య చేతిని వదల్లేదు. అటు జైనబ్ కూడా అంతే..! ఇది చూసిన అభిమానులు ఈ కొత్త జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ చేయి వదలకూడదని చెప్తున్నారు. ఒక ఫోటోలో అయితే అఖిల్ అటు అత్త చేతిని, ఇటు భార్య చేతిని పట్టుకుని ఆనందంగా కనిపించాడు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే కొట్టొచ్చినట్లు కనిపించే రంగుల జోలికి వెళ్లకుండా పెళ్లికి తెలుపు, రిసెప్షన్కు గోధుమ రంగు దుస్తులు ధరించారు. ఎవరీ జైనబ్?ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమె సోదరుడు జైన్ రవ్జీ.. జెడ్ఆర్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. జైనబ్.. పెయింటింగ్ ఆర్టిస్ట్. అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా ఈమె వయసు 39 ఏళ్లని తెలుస్తోంది. The Akkineni Family extends a heartfelt welcome to the beloved Victory @VenkyMama GaruYour presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/QDgglYEOSG— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025The Akkineni Family extends a heartfelt welcome to the beloved Natural Star @NameisNani & @actor_Nikhil.Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/O2ZzJuf9SJ— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025 చదవండి: ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్ -
సర్దార్ 2 సినిమా పూర్తి..
కోలీవుడ్ నటుడు కార్తీ కథానాయకుడుగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణన్ తన ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఇంతకుముందు నిర్మించిన చిత్రం సర్దార్. కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న చిత్రం సర్దార్–2. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తుండగా నటుడు ఎస్జే సూర్య, మాళవికమోహన్, ఆషికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, జార్జ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రం టీజర్ను ఇటీవల విడుదల చేశారు.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉన్న ఆ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సర్దార్ చిత్రానికి మించి ఉంటుందని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలోనూ ఎక్కడ రాజీపడకుండా ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది బ్రహ్మాండమైన యాక్షన్ అడ్వెంచర్ కథాచిత్రంగా ఉంటుందని కార్తీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం సర్దార్–2 చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
సాయం చేయాలంటూ 'మంచు మనోజ్' ట్వీట్
భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్.. తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే, తాజాగా రెండురోజుల ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్ ఒక పోస్ట్ చేశారు. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్లు తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్ కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే.సాయం చేయాలంటూ మంచు మనోజ్ ఇలా ట్వీట్ చేశారు. ' రెండురోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలాబాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ, ఆమెను కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను. ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనదే.' అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాను షేర్ చేశారు. అయితే, చాలామంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, వారి బ్యాంక్ వర్క్ చేయడం లేదని కొందరు స్క్రీన్ షాట్స్ పంపడంతో.. మంచు మనోజ్ మరోక బ్యాంక్ ఖాతా నంబర్ను షేర్ చేశారు. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రూ. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం మనోజ్ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్ సోషల్మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు.Thank you all for the immediate response.As most of you are facing problem while transferring, Here are the new bank details.Please do extend your help for this little one suffering with this acute heart problem she doesn't deserve 🙏CURRENT ACCOUNT YELLA NAVYA SRIACCOUNT… https://t.co/nwV0PthPLm— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 8, 2025 -
కొత్త పయనం
సుప్రజ్, సంగీర్తనా విపిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పయనం’. చందు రామ్ దర్శకత్వంలో ఛాయా చిత్రాలు పతాకంపై స్వర్ణ కమల నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సంగీత దర్శకుడు–నటుడు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్ చేయగా, కొరియోగ్రాఫర్ రఘు క్లాప్ ఇచ్చారు.ఈ సందర్భంగా చందు రామ్ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలో కనిపిస్తారు. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసే అంశాలెన్నో ఉన్నాయి’’ అన్నారు. ‘‘నేటి తరం ప్రేక్షకులు మెచ్చే వైవిధ్యమైన చిత్రమిది’’ అన్నారు స్వర్ణ కమల. రఘు కుంచె ఆమని, మైమ్ మధు, మెహబూబ్ భాషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: షోయబ్. -
ఆలోచన రేకెత్తించే హనీ
‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతోపాటు నేటి సమాజపు తీరు తెన్నులపై ఆలోచనలు రేకెత్తిస్తుంది’’ అని తన తాజా చిత్రం ‘హనీ’ గురించి దర్శకుడు కరుణ కుమార్ పేర్కొన్నారు. ‘పలాసా’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘మట్కా’ తర్వాత కరుణ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సినిమా ‘హనీ’.‘‘చిల్లింగ్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దాదాపు ఎనభై శాతం టాకీ పూర్తయ్యింది. నటీనటుల ప్రతిభకు ఈ సబ్జెక్ట్ ఓ సవాల్’’ అని చిత్రబృందం పేర్కొంది. శేఖర్ మాస్టర్, రవి పీట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద ప్రధాన తారాగణం. -
రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన
ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల ఆధిపత్యం నడుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది సదరు సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని గురించి నిర్మాతలు పెద్దగా ఓపెన్ అయింది లేదు. కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న 'కుబేర' నిర్మాత సునీల్ నారంగ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించి తన అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకుడు. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ కాస్త హైప్ తీసుకొచ్చాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఓటీటీల ఆధిపత్యం గురించి చెప్పుకొచ్చారు. 'మేం 'కుబేర' చిత్రానికి జూలైలో రిలీజ్ చేస్తామని అడిగాం. కానీ ప్రైమ్ వాడు మాత్రం జూన్ 20న విడుదల చేయండి లేదంటే ఓటీటీ డీల్ నుంచి రూ.10 కోట్లు కట్ చేస్తామని అన్నాడు' అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యూబ్ సిస్టమ్, బుక్ మై షో, ఓటీటీల ఆధిపత్యం నడుస్తోందని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. అలానే 140 కోట్ల మంది జనాభాలో 40-50 మంది హీరోలు మాత్రమే ఉన్నారని.. దీంతో వాళ్లు దేవుళ్లతో సమానం అని చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఈయన శనివారం సాయంత్రం ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రానికల్లా రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా కొనసాగడం కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
అక్కినేని అఖిల్.. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ రిసెప్షన్ జరిగింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహ నాగ్ ఇంట్లో జరగ్గా.. రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యాడు. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.నాగ్ చిన్న కొడుకు అఖిల్కి గతంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత కొన్నాళ్లకు జైనబ్తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబరులో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
మంచు అనే పేరు చెప్పగానే ప్రస్తుతానికి 'కన్నప్ప' సినిమా లేదంటే వాళ్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి. ఇప్పటికైతే ఏం జరగట్లేదు. మంచు విష్ణు.. తను హీరోగా నటించి భారీ బడ్జెట్తో నిర్మించిన 'కన్నప్ప'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. ఈ గొడవల్లో ఎక్కడా కనిపించని మంచు లక్ష్మీ.. తాజాగా ఓ ప్రెస్ మీట్లో ప్రత్యక్షమైంది. తాను కన్నప్ప చిత్రంలో నటించకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరు(సరదాగా). ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)మీ సోదరులకి.. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవటానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అని సమాధానమిచ్చింది. గత కొన్ని నెలల నుంచి మంచు కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పెద్దగా మాట్లాడని మంచు లక్ష్మీ.. మంచు మనోజ్కి మాత్రం అండగా ఉంది.కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన మంచు లక్ష్మీ.. ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'ద ట్రైటర్స్' అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధమైంది. తాజాగా హైదరాబాద్లో కనిపించిన ఈమె.. మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది. ఈ ఈవెంట్లోనే స్పందిస్తూ 'కన్నప్ప'లో నటించకపోవడానికి కారణం కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
'చిన్ననాటి కల నెరవేరింది.. అత్తారింటికి దారేది నటుడు పోస్ట్'!
అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న స్టార్ నటుడు బోమన్ ఇరానీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో ది మెహతా బాయ్స్ సినిమాతో డైరెక్టర్గా మారిన ఆయన.. తాజాగా నటిస్తోన్న చిత్రం 'తన్వి ది గ్రేట్'. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో నటి శుభంగి దత్ టైటిల్ రోల్లో నటించింది. ఈ చిత్రాన్ని ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 18న థియేటర్లో సందడి చేయనుంది.ఇక బోమన్ ఇరానీ సినిమాల సంగతి పక్కనపడితే.. ఆయన వ్యక్తిగతంగానూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తన చిన్ననాటి కల నేరిందని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రత్యేక పుట్టినరోజున నా కలను సాకారం చేసిన తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెంచ్ ఓపెన్ చూడాలనుకున్న తన కలను నేరవేర్చినందుకు తన భార్య జెనోబియా, కుమారులు దనేశ్, కయోజ్ ఇరానీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్ప్రైజ్ను వారంతా కలిసి తన పుట్టినరోజుకు ప్లాన్ చేసి మరి బహుమతిగా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
క్యాన్సర్తో పోరాటం.. ఆ స్టార్ హీరో సపోర్ట్ మరిచిపోలేను: సోనాలి బింద్రే
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఆ సినిమాతో ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆ తర్వాత కూడా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆ సమయంలో తనకు ఓ స్టార్ హీరో పూర్తి మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో తెలుసుకుందామా?2018లో సోనాలి బింద్రేకు క్యాన్సర్ రావడంతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ సమయంలో తన చికిత్స గురించి పదే పదే ఆరా తీశారని తెలిపింది. నేను చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చాడని సోనాలి వెల్లడించింది. తనకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.. అంతేకాదు వారితో కూడా మాట్లాడాలని సల్మాన్ అడిగారని తెలిపింది.అయితే ఇటీవల 'హమ్ సాత్ సాత్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ తీరుపై సోనాలి విమర్శలు చేసింది. తనను కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపింది. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లమని వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే సోనాలి బింద్రే 'ది బ్రోకెన్ న్యూస్' రెండో సీజన్లో కనిపించింది. -
ప్రేక్షకుల వెంట పరిగెత్తిన స్టార్ హీరో.. ఎవరూ గుర్తుపట్టలేదు!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవలే హౌస్ఫుల్-5 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హౌస్ఫుల్ సూపర్ హిట్ సిరీస్లో వచ్చిన ఐదో చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నటించిన అక్షయ్ కుమార్ ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి థియేటర్ వద్దకు వెళ్లాడు.ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ రోజు నేను కిల్లర్ మాస్క్ ధరించి బాంద్రాలో హౌస్ఫుల్ 5 థియేటర్ నుంచి బయటికి వస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశా. ఈ అనుభవం చాలా హ్యాపీగా అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే అక్షయ్ కుమార్ను ఏ ఒక్క అభిమాని కూడా గుర్తు పట్టకపోవడం విశేషం. ఇది చూసిన నెటిజన్స్ ఇలా చేయడం అక్షయ్కి మాత్రమే సాధ్యమని అంటున్నారు.కాగా.. జూన్ 6న విడుదలైన హౌస్ఫుల్-5 మూవీ దేశీయ బాక్సాఫీస్ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ. 24 కోట్లు రాబట్టిన ఈ మూవీ..రెండో రోజున దాదాపు రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) Whaaat this is so funny. He is so cute and funny 😍How could the people there not notice? I knew @akshaykumar sir by his walk, voice, physical structure, clothes, bracelet on his wrist and even his smell. I wish the people there knew how lucky they were 😱🥹#AkshayKumar : "… pic.twitter.com/tkkiPAE9Ej— Emine Gelinci ʰᵒᵘˢᵉᶠᵘˡˡ⁵ 🧡🔥 Forever Akkian (@Akkian_Emine87) June 8, 2025 #AkshayKumar instagram post lmao. Akki sir asking how's his movie to public. Unka chhodo me bata deta hu mast movie me must watch just go for it.😂🔥or @akshaykumar sir aapki team badlo jinko kesa mike use karna chahiye wo bhi nahi pata.#Housefull5 #Housefull5Review pic.twitter.com/mKUU9NYX1F— axay patel 🔥🔥 (@akkiDhoni2) June 8, 2025 -
వైట్ షర్ట్లో జవాల్కర్ హొయలు.. దేవకన్యలా జాక్వెలిన్
షర్ట్ సైడ్ చేసి రెచ్చగొట్టేస్తున్న ప్రియాంక జవాల్కర్దేవకన్యలా మారిపోయి అందాల చందమామల జాక్వెలిన్పట్టుచీరలో బుట్టబొమ్మలా మీనాక్షి చౌదరిబ్లర్రీ పోజుల్లో 'డ్రాగన్' ఫేమ్ కాయదు లోహర్చీరలో కేక పుట్టిస్తున్న కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్మెడలో హారంతో మాయ చేసేలా చూస్తున్న రుహానీ శర్మఎల్లో డ్రస్సులో మంట పుట్టించేస్తున్న నందిని రాయ్ View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం.. మా ఇద్దరి కెరీర్ ముగిసింది: రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తీవ్ర విషాదం మిగిల్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాలీవుడ్ను కుదిపేసింది. అతని మరణం తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను పోలీసులు సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమెతో తమ్ముడైన షోయిక్ చక్రవర్తిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో వారిద్దరి జీవితం అనేక మలుపులు తిరిగింది.తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన రియా చక్రవర్తి..సుశాంత్ మరణం తర్వాత తాను, తన తమ్ముడు అనుభవించిన బాధను పంచుకుంది. సుశాంత్ మృతి తర్వాత మాపై ఆరోపణలు రావడంతో మా ఇద్దరి కెరీర్ ఒక్కసారిగా తలకిందులైందని వెల్లడించింది. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయని తెలిపింది.రియా మాట్లాడుతూ.. "సుశాంత్ మరణం తర్వాత మేము ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. ఆ సంఘటనతో మా ఇద్దరి కెరీర్లు ముగిశాయి. నాకు నటనాపరంగా ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అంతేకాకుండా నా తమ్ముడు షోయిక్ క్యాట్ పరీక్షలో 96 పర్సంటైల్ పొందాడు. కానీ అదే సమయంలో నాతో పాటు అతను అరెస్టు అయ్యాడు. జైలు నుంచి నా తమ్ముడు తిరిగి వచ్చాక మొదటి త్రైమాసిక పరీక్షలు మిస్సయ్యాడు. దీంతో అతని ఎంబీఏ కెరీర్ భవిష్యత్తును కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్లో ఉద్యోగం పొందడం చాలా కష్టమైంది. ఎందుకంటే నా తమ్ముడిని నియమించుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొద్దిరోజులు మా జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాలేదు. ఆ తర్వాత ఛాప్టర్-2 డ్రిప్ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాలనే ఆలోచన తనకు, షోయిక్కు వచ్చిందని.. దాన్నే కెరీర్గా ఎంచుకున్నామని " అని తాము ఎదుర్కొన్న బాధలను వివరించింది.అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్ నటనలో మళ్లీ అడుగుపెట్టింది. ఆమె ఇటీవలే రోడీస్లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్కాస్ట్ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. -
నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి
కుంకుమ్ భాగ్య సీరియల్ ఫేమ్ పూజా బెనర్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తాను రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పలు సీరియల్స్తో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామకు ఇప్పటికే సనా అనే మూడేళ్ల కూతురు ఉన్నారు. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను అందరితో పంచుకోవడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు నలుగురు కుటుంబ సభ్యులం అయ్యామంటూ శనివారం తన జీవితంలోకి మరో బిడ్డకు ఆహ్వానం పలికింది బాలీవుడ్ బ్యూటీ.అనేక టీవీ సీరియల్స్తో తన నటనకు పేరుగాంచిన పూజా బెనర్జీ ప్రముఖ స్విమ్మర్, ఒలింపియన్ సందీప్ సెజ్వాల్ను వివాహం చేసుకుంది. పూజ ఈ రోజు ఉదయం మగబిడ్డను ప్రసవించింది.. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామని ఆమె భర్త సందీప్ తెలిపారు. కాగా.. కొత్త ఏడాది ప్రారంభంలో తాను గర్భం ధరించినట్లు అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత తన బేబీ బంప్ ఫోటోషూట్ను షేర్ చేసింది.పూజా బెనర్జీ బాలీవుడ్లో చంద్ర నందిని, దిల్ హి తో హై, కసౌతి జిందగీ కే 2, కుంకుమ్ భాగ్య, బడే అచ్చే లగ్తే హై 2 లాంటి ప్రముఖ సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా పూజా కొన్ని వెబ్ సిరీసుల్లో కూడా భాగమైంది. కెహ్నే కో హమ్సఫర్ హై అనే షోలో నటనతో పూజా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చివరిసారిగా 2023లో వచ్చిన బడే అచ్చే లగ్తే హై -2 సీరియల్లో కనిపించింది. ఆ తర్వాత పూజ నటనకు దూరంగా ఉంది. తాజాగా ఆమె రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో నటనకు కొద్ది రోజులు విరామం తీసుకోనుంది. -
పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా జూలైలో రిలీజ్ ఉండొచ్చు. మార్కెట్లో చూసుకుంటే ఈ సినిమాపై అసలు బజ్ లేదు. మొన్నీమధ్య అంటే శుక్రవారం మచిలీపట్నంలో మూవీ ఈవెంట్ జరగ్గా.. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఓ విషయాన్ని మర్చిపోయిన ఈమె.. ఓ రకంగా మూవీ పరువు తీసేసిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?పవన్ 'హరిహర..' సినిమా నుంచి ఇదివరకే రెండు మూడు పాటలు రిలీజయ్యాయి కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్ని యాంకరింగ్ చేసిన ఉదయభాను, డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని.. ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి.. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అని ఏమీ తెలియనట్టుగా అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏం అనాలో తెలీక బిక్కమొహం వేశాడు.(ఇదీ చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..)ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ పాడిన 'మాట వినాలి' అనే పాటనే తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్కి యాంకరింగ్ చేస్తున్న ఉదయభానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడిక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ.. పాట గురించి చెప్పుకొచ్చారు. అలానే ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంటసేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు.అప్పుడెప్పుడో 2020లో మొదలైన ఈ సినిమా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ముగించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఎక్కడలేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీమ్ అంటోంది గానీ మూవీ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు) -
థియేటర్ల సంఖ్య తగ్గుతున్నా.. తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోంది: రానా
టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వచ్చిన సీజన్కు అద్భుతమైన స్పందన రావడంతో సీజన్-2 తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. థియేటర్లు తగ్గుతున్న కాలంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బాహుబలి, పుష్ప , ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు.రానా మాట్లాడుతూ..'ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా థియేటర్లు తగ్గుతున్నాయి. ఏడేమినిదేళ్ల క్రితం ఉన్న థియేటర్ల సంఖ్య ఇప్పుడు మూడు రెట్లు తగ్గిపోయాయి. దీనికి కారణం వినోదం అందించేందుకు చాలా ఎక్కువ మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో ఓటీటీ, యూట్యూబ్, మీ మొబైల్ ఫోన్ కూడా భాగమైంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ సినిమా ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కనిపెడుతూనే ఉంది. ఇటీవల రిలీజైన కోర్ట్ మూవీ చిన్న సినిమా అయినా థియేటర్ల వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి రోజుల్లో కూడా కోర్ట్ మూవీ కథ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమం ఇతర వాటితో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో సినిమా షూటింగ్లకు అయ్యే ఖర్చు ముంబయి, ఢిల్లీతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. అది కూడా ఒక అడ్వాంటేజ్.' అని అన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో బంధుప్రీతి గురించి మాట్లాడుతూ.. ఏదేమైనా చివరికి మీరు కెమెరా ముందు నిలబడాలి, నటించాలి కదా' అని తెలిపారు. -
కమల్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ వద్ద థగ్ లైఫ్ కష్టాలు!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'థగ్ లైఫ్' 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2', రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు. -
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.అమితాబ్తో పాట షూటింగ్బచ్చన్ సర్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ (Amitabh Bachchan) సర్ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సర్ దగ్గర కారవాన్ ఉంది. కానీ చాలామంది షూట్ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.చెట్టు వెనకాల..నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సర్ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కల్కి 2898 ఏడీలో..కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్ (హెవీ మేకప్) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్ హాసన్ యాస్కిన్గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనుంది. చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్ -
'అఖండ 2' అప్డేట్తో పాటు NBK111.. మొదలైన తాండవం
నందమూరి బాలకృష్ణ 'అఖండ' తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2' నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు. జూన్ 9న సాయిత్రం 6.03గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్యతో సినిమా ప్రకటించాడు NBK111పేరుతో ఒక పోస్టర్ను విడుదల చేశారు.2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్గా పార్ట్ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్బంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదేరోజున పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ2 పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దసరా బరిలో ఈ రెండు పోటీలో ఉంటాయా..? అనే విషయం తెలియాలంటే అఖండ2 టీజర్తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025 -
చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే భయం!
పాపులర్ కమెడియన్ జానీ లివర్ (Johny Lever) కూతురు జామీ లివర్ (Jamie Lever) హిందీలో అనేక సినిమాలు చేసింది. గతేడాది ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె తన బాల్యంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. నాకు పదేళ్లుంటాయనుకుంటా. స్కూల్ అయిపోగానే వెళ్లి కారులో కూర్చున్నాను. మా డ్రైవర్ నా సోదరుడు జెస్సీ కోసం బయట ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి మా కారు దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్ తీసి లోపలకు వస్తే నా పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను.మమ్మల్ని కాపాడాల్సిన వ్యక్తే..డోర్ లాక్ చేసి తనను చూడనట్లే ఉన్నాను. దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడు. బస్ కండక్టర్ కూడా మాతో పద్ధతిగా ప్రవర్తించేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా తాకాలని చూసేవాడు. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి? ఇవన్నీ చూశాక అబ్బాయిలను నా జీవితంలోకి ఆహ్వానించాలంటేనే భయమేసింది. 20'sలో కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్ చేశాను. నాకు జరిగిన అనుభవాలను అమ్మ సుజాతకు, నాన్న జానీ లివర్కు కూడా చెప్పుకోలేదు అని తెలిపింది.చదవండి: పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్ నారంగ్ -
ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ డార్క్ కామెడీ మూవీ... 'సొప్పన సుందరి' ఎలా ఉందంటే?
టైటిల్: సొప్పన సుందరినటీనటులు: ఐశ్వర్య రాజేశ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్, కరుణాకరన్ తదితరులుడైరెక్టర్: ఎస్జీ ఛార్లెస్ఓటీటీ ప్లాట్ఫామ్: జియో హాట్స్టార్'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన బ్యూటీ 'ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'సొప్పన సుందరి' కథేంటంటే..అహల్య (ఐశ్వర్య రాజేశ్) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.ఎలా ఉందంటే..వీకెండ్ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్ స్టేషన్కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.పోలీసుల చేతికి కారు వెళ్లడంతో.. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్లెస్గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్ అవుతుంది. అందుకే డైరెక్టర్ ఎలాంటి లాజిక్ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు. కక్లైమాక్స్లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి. -
'కన్నప్ప' వేడుకలో ప్రభాస్పై మోహన్బాబు వ్యాఖ్యలు
విష్ణు మంచు నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి నటుడు మోహన్బాబు పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా..? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం..' అని అన్నాడు. దటీజ్ ప్రభాస్. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది.' అని ఆయన అన్నారు. కన్నప్ప సినిమాను థియేటర్స్లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను స్వయం కృషితోనే పైకొచ్చానని పేర్కొన్నారు. జీవితంలో భయం అనేది ఉండకూడదని ఆయన సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నానని అన్నారు. మోహన్బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతున్నానని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. ఈ సినిమాలో నా మిత్రుడు ప్రభాస్కు (Prabhas) నటించాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము అడిగిన వెంటనే నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ప్రభాస్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఈ కాలంలో స్నేహానికి విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఉదాహరణ అని చెబుతున్నాను. వ్యక్తిగా ఆయన్ను అందరూ ప్రేమించండి.'అని చెప్పుకొచ్చారు. -
డబ్బింగ్ డన్
హీరో అక్కినేని నాగార్జున ‘కుబేర’ సినిమాలోని తనపాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, జిమ్ సర్భ్ కీలకపాత్రపోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా తనపాత్రకి సంబంధించిన డబ్బింగ్ని నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని ప్రకటించి, డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, పుస్కూర్ రామ్మోహన్ రావు కలసి మాట్లాడుతున్న ఫొటోలని మేకర్స్ షేర్ చేశారు.‘‘ఈపాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో గేమ్ ఛేంజర్గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్కి మంచి స్పందన వచ్చింది. పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర...’ వంటిపాటలు టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మాఫియా డాన్గా ప్రభాస్!
ప్రభాస్ మాఫియా డాన్పాత్రలో కనిపించనున్నారా? అంటే... వార్తల్లో ఉన్న ప్రకారం ‘స్పిరిట్’ సినిమాలో ఈపాత్రలో కనిపిస్తారట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీపర్పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్లా కనిపిస్తారని సమాచారం.ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... ‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్లో త్రీ షేడ్స్ ఉంటాయట. వాటిలో ఒకటిపోలీసాఫీసర్ క్యారెక్టర్ అని, మరొకటి మాఫియా డాన్ అని భోగట్టా. మరి... ఇంకోపాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ చిత్రంలో ప్రభాస్పాత్రలో త్రీ షేడ్స్ ఉంటాయా? అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
చాప్టర్ వన్... చంద్ర
హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ నటించనున్న కొత్త సినిమాకు ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. డొమినిక్ అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ సినిమాపోస్టర్ను విడుదల చేసి, ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఈ సూపర్ హీరో ఫ్యాంటసీ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. కాగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ గెస్ట్ రోల్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మహేశ్ సినిమాలో..?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్లోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్నగర్ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మేరకు మాధవన్తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.మరి... ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తోపాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్. -
సూపర్ హీరోలు వస్తున్నారోచ్
ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్... ఇలా హాలీవుడ్ సూపర్ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ కూడా వస్తున్నారోచ్. వెండితెరపై ఆడియన్స్ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్ వావ్ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్ హీరో వివరాలపై ఓ లుక్ వేయండి.విశ్వంభర ప్రపంచంలో... ‘విశ్వంభర’ సినిమాలో సూపర్ హీరో మాదిరి యాక్షన్ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్ హీరోలా యాక్షన్ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్ సెంటిమెంట్తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్ కనిపిస్తారని తెలిసింది.వచ్చే ఏడాది స్టార్ట్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ సూపర్ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్ కనగరాజ్ కథలోని సూపర్ హీరోగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సూపర్ హీరో సినిమాను ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సూపర్ హీరో కథ చెప్పారని, లోకేశ్తో తాను ఈ సూపర్ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని ఆమిర్ ఖాన్ చెప్పారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆమిర్ ఖాన్. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్ కనగరాజ్. ఇలా... ఆమిర్–లోకేశ్ల ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.ఆన్ ద వే! సిల్వర్ స్క్రీన్పై రవితేజను ఓ సూపర్ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్’ డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్ హీరో స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్ శంకర్. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్ శంకర్ ఫైనల్ నరేషన్ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కల్యాణ్ శంకర్తో సూపర్ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే కల్యాణ్ శంకర్–రవితేజల సూపర్ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సో... సూపర్ హీరో ఆన్ ద వే అన్నమాట.సరికొత్త ప్రపంచంలోకి... ఆడియన్స్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్ నేతృత్వంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్ ΄్లాన్ అని భోగట్టా.ఇటు అధీర... అటు మహాకాళి! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా కొన్ని సూపర్ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో పవర్స్ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సూపర్ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ యూనివర్స్లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్ సూపర్ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్ లీడ్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్ వర్మ షో రన్నర్గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్వర్మ. ఈపోస్టర్పై మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్ అని ఉండటం విశేషం.పీపుల్స్ సూపర్ హీరో పీపుల్స్ సూపర్ హీరోగా చెప్పుకునే శక్తిమాన్ సరికొత్త పవర్స్తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్గా రణ్వీర్ సింగ్ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్వీర్ సింగ్ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్లో వినిపించింది. మరి... శక్తి మాన్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.సూపర్ యోధ ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్’ గ్లింప్స్ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్తోపాటు కొన్ని మైథలాజికల్ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.మల్టీవర్స్ మన్మథన్ మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘మల్టీవర్స్ మన్మథన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్ చంద్ర శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్ ఈ సినిమాకు కో రైటర్స్గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్ ఫస్ట్ మల్టీవర్స్ సూపర్ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో నివిన్ పౌలీ ‘ఎక్స్’పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్ రైజింగ్’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కల నిజమైంది నటుడిగా ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్. తాను చిన్నప్పట్నుంచి సూపర్ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్ హీరోస్ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. మిథున్ మాన్యువేల్ థామస్ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్. ఈ కోవలో మరికొంతమంది సూపర్ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు -
'రూ. 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని హీరోకు రూ. 13 కోట్లు ఇచ్చారు'
తెలుగు రాష్ట్రాల్లో సినిమా బంద్ అంశంపై నూతనంగా ఎన్నికైన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శి శ్రీధర్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలు తమకు దేవుళ్లు లాంటి వారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు కలిసి పెద్ద వివాధంగా మార్చారని, త్వరలోనే వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. థియేటర్స్ బంద్ అనేది తమ నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రకటన ఫిల్మ్ ఛాంబర్ చేయలేదన్నారు.పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని శ్రీధర్ వాపోయారు. ప్రస్తుతం ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్ థియేటర్ల పరిస్థితి మనుగడ కష్టంగా తయారైందని ఆయన అన్నారు. హీరోలందరికీ స్టార్ హోదా రావడానికి కారణం ఎవరు..? వారు ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక రకంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హీరోలు కూడా అని ఆయన అన్నారు.రూ.10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమా కోసం రూ.30 లక్షలు నిర్మాతలు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఒక సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ రూ. 2కోట్లు. కానీ, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని ఆయన వాపోయారు. అయితే, శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు 'జాక్' సినిమా గురించి అంటూ నెటిజన్లు ఆపాదిస్తున్నారు. ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ రూ. 13 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని, సినిమా డిజాస్టర్ కావడంతో ఆ చిత్ర నిర్మాతకు కొంత తిరిగిచ్చేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సినిమా పేరు చెప్పకపోవడంతో నెటిజన్లు మాత్రం వరుణ్ తేజ్, నితిన్ అంటూ ఎవరికితోచిన పేరు వారు చెప్పుకుంటూ పోతున్నారు.అయితే, అధ్యక్షుడు సునీల్ నారంగ్.. హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు తమకు లేదని చెప్పుకొచ్చారు. కానీ, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేది తమ కోరిక అంటూ పేర్కొన్నారు. థియేటర్ల బంద్ వార్త విన్న తర్వాత తాను కూడా ఆశ్చర్యానికి లోనయ్యా అన్నారు. థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనే వారు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలామంది ఓనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. సింగిల్ థియటర్స్ యాజమాన్యం కోరుతున్న పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందని సునీల్ నారంగ్ చెప్పారు. -
అమెరికా నుంచి భారత్కు వచ్చి తుదిశ్వాస విడిచిన నటి
అలనాటి నటి విజయభాను (68) ఇక లేరు. అమెరికాలో స్థిరపడిన ఆమె ఏప్రిల్ నెలలో భారత్కు వచ్చారు. అయితే, అదే నెల 24న తీవ్రమైన ఎండల వల్ల ఆమెకు వడదెబ్బ సోకడంతో మరణించారు. ఆమె ఆకస్మిక మృతి పట్ల జయప్రద, సుమన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా నటి విజయభాను(Vijaya Bhanu) గురించి తన సోదరి డా. సింధూరి అమెరికా నుంచే పలు విషయాలను పంచుకున్నారు. ' మా అక్క ప్రేరణ వల్ల నేను కూడా అమెరికా వచ్చి స్థిరపడ్డాను. చాలామందికి ఆమె సాయం చేశారు. ఆమె జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆమె జీవితంపై ఒక పుస్తకం రచించాలని కోరుకుంటున్నాను. జయప్రద అంటే మా అక్కకు చాలా ఇష్టం. చెన్నైలో జరిగిన మా అక్క దశదినకర్మకు కూడా ఆమె హాజరయ్యారు. భారత గడ్డపైనే తనువు చాలించాలని మా అక్కకు ఉన్న చివరి కోరిక.. ఇలా అనుకోకుండానే ఆమె ఆకాంక్ష తీరింది. కానీ, ఆమె లేని లోటు మాకు ఎవరూ పూడ్చలేరు.' అని ఆమె చెప్పుకొచ్చారు.అనంతపురం జిల్లాకు చెందిన విజయభాను సినిమా ఛాన్సుల కోసం చెన్నైకి వెళ్లి తన సత్తా చాటారు. 70వ దశకంలో అప్పటి టాప్ హీరోల సినిమాల్లో నటించారు. ఆరోజుల్లో రాజబాబు - విజయభాను జంటకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించిన విజయభాను కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే ఒక అమెరికన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాఓ స్థిరపడ్డారు. లాస్ ఏంజెల్స్ లో 'శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్' పేరుతో నృత్య కళాశాల స్థ్థాపించిన ఆమె వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. అమెరికాలో ఏదైనా సాయం కోసం వెళ్లిన తెలుగు వారికి ఆమె ఎంతో అండగా నిలబడ్డారని చెప్పుకుంటారు.1979లో విడుదలైన 'ఇది కథ కాదు' సినిమాకు గాను ఆమెకు నంది అవార్డు దక్కింది. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కలిసి పోటీపడి ఆమె నటించారు. కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో నటించిన జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కగా.. ఉత్తమ సహాయ నటిగా విజయభానుకు దక్కింది. ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలో కూడా ఆమె మెప్పించారు. -
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
హిందీ బిగ్ బాస్ 18 ఫేమ్ ఎడిన్ రోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నానంటూ షాక్ ఇచ్చింది. మోడల్గా కెరీర్ను ప్రారంభించిన ఎడిన్ రోజ్ హిందీలో రెండు సినిమాలు చేసింది. ఆపై తెలుగులో రవితేజ నటించిన 'రావణాసుర' చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం నయనతార నిర్మిస్తున్న కొత్త సినిమా LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అయితే, తాజాగా ఫిల్మిగ్యాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ 18తో భారీగా పాపులారిటీ తెచ్చుకున్న ఎడిన్ రోజ్, క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్తో తనకున్న అనుబంధాన్ని ఇలా చెప్పుకొచ్చింది. 'నా మనసులో, నేను ఇప్పటికే అతనిని ( శ్రేయాస్ అయ్యర్) వివాహం చేసుకున్నాను. నేను అతని పిల్లలకు తల్లిని అని నేను నమ్ముతున్నాను. అతను నాకు నచ్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అతను మంచి హైట్తో పాటు చామని ఛాయ రంగులో ఉంటాడు. ఎప్పుడూ తను గడ్డంతో కనిపిస్తూ మంచి కండలతో ఉంటాడు.భవిష్యత్లో భారత జట్టుకు కెప్టెన్ తప్పకుండా అవుతాడు. నా తండ్రిలాగే శ్రేయాస్ కూడా దక్షిణ భారతీయుడు.' అంటూ సంతోషంతో చెప్పుకొచ్చింది. తన తండ్రి ఒక తమిళయన్ అని చెప్పిన ఈ బ్యూటీ.. శ్రేయాస్ అయ్యర్ కూడా తమిళయన్ అంటూ పేర్కొంది. అయితే, ప్రస్తుతం వారు ముంబైలో స్థిరపడ్డారని చెప్పుకొచ్చింది. అయితే, ఇలా మనుసులో అనేసుకుంటే పెళ్లిళ్లు కావంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట అంటే తనకు చాలా ఇష్టమని ఎడిన్ రోజ్ చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఆదర్శ దంపతులు అంటూ పేర్కొంది. 'వారు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తారు. వారు చాలా పరిపూర్ణ జంట, చాలా అందంగా ఉండాలని కోరుకుంటాను. వారికి ఎప్పుడూ చెడు జరగకూడదని నేను ఆశిస్తున్నాను. వారు ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.' అని కోరుకుంది. View this post on Instagram A post shared by Edin Rose (@itsedinrose) -
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కన్నప్ప'కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్డిస్క్ మాయం కావడంతో మూవీ టీమ్ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా 'కన్నప్ప' మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని వారు ఆరోపిస్తున్నారు.కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, గుంటూరులో నేడు (శనివారం) జరగనున్న కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం.' అని శ్రీధర్ హెచ్చరించారు.ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించారు. -
'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్ కోసం మరో సినిమా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్లోనే సూపర్హిట్ చిత్రంగా నిలిచిన 'తొలిప్రేమ' (Tholiprema) 1998 జూన్ 24న విడుదలైంది. ఇప్పుడు మరోసారి రిలీజ్ కానుంది. ఈమేరకు ఒక పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించగా ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. జీవీజీ రాజు నిర్మాత. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్రాజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు రీరిలీజ్ అయింది. 'తొలిప్రేమ' విడుదలై 25 ఏళ్లు సందర్భంగా 2023లో చివరిసారిగా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ నటించిన కొత్త సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందడంతో తెరపైకి తొలిప్రేమ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 14న తొలిప్రేమ రీరిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ అవుతుంది. దానిని నిర్మాత ఎస్కేఎన్ కూడా షేర్ చేశారు. -
ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్ విడుదల
అందమైన ప్రేమకథతో వస్తున్న చిత్రం '8 వసంతాలు'.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్ను విడుదల చేశారు. మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.