breaking news
Movie News
-
జిమ్లో బిగ్బాస్ బ్యూటీ ఇనయా.. స్విమ్మింగ్ పూల్లో రకుల్ ప్రీత్ సింగ్ చిల్!
జిమ్లో చెమట్చోడుస్తున్న ఇనయా సుల్తానా..స్విమ్మింగ్ చేస్తూ చిల్ అవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్..పార్టీలో మెరిసిన విశ్వంభర్ బ్యూటీ మౌనీరాయ్..మహబలిపురంలో బిగ్బాస్ బ్యూటీ దివి..బీచ్లో డాగ్తో ఆడుకుంటోన్న బిగ్బాస్ అశ్విని శ్రీ.. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్కే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. దీంతో చాహల్తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్లో ఆక్షన్లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ను కొనుగోలు చేసింది. తన టీమ్కు కెప్టెన్గా షాన్ మార్ష్ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్ను కూడా మీ టీమ్లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి ఎంపికైంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి హనుమాన్ రెండు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డ్ సాధించింది.ఆ తర్వాత వేణు యెల్దండి తెరకెక్కించిన రూరల్ ఎమోషనల్ చిత్రం బలగం ఉత్తమ సాహిత్యం విభాగంలో అవార్డ్ దక్కించుకుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ చిత్రంలోని ఊరు పల్లెటూరు అనే పాటకు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది.సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రం బేబీకి రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్ప్లేతో దర్శకుడు సాయి రాజేశ్ను జాతీయ అవార్డు వరించింది. ఈ సినిమాలోని ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్కు ఉత్తమ సింగర్ అవార్డ్ దక్కింది. అలాగే సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపికైంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులుఉత్తమ తెలుగు చిత్రం- భగవంత్ కేసరి(అనిల్ రావిపూడి)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ- హనుమాన్ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్- హనుమాన్ఉత్తమ స్క్రీన్ప్లే- బేబీ(సాయి రాజేశ్)ఉత్తమ గాయకుడు- బేబీ (పీవీఎన్ఎస్ రోహిత్ )ఉత్తమ సాహిత్యం- కాసర్ల శ్యామ్ (బలగం)ఉత్తమ బాలనటి- సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు) -
హెబ్బా పటేల్ థాంక్యూ డియర్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, చత్రపతి శేఖర్, బలగం సుజాత, రామారావు కీలక పాత్రలు పోషించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.థాంక్యూ డియర్ కథేంటంటే..సత్య(ధనుష్ రఘుముద్రి) సినిమా డైరెక్టర్ కావాలని కష్టపడుతుంటాడు. జాను (రేఖా నిరోషా) హీరోయిన్ కావాలని సిటీకి వస్తుంది. ఓ కారణంగా ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రియ(హెబ్బా పటేల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ హత్యలతో ఈ జంటకి ఉన్న సంబంధం ఏంటన్నదే? అసలు మిగతా కథ.ఎలా ఉందంటే..ప్రస్తుత సమాజంలోని వివిధ అంశాలను తీసుకొని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించారు. కొన్ని వ్యసనాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు ఈ మూవీలో చూపించారు. అలాగే కొంతమంది చేసే అసాంఘిక చర్యల వల్ల ప్రజలలో ఎటువంటి మార్పులు వస్తాయనే విషయాన్ని చూపించే ప్రయత్నమే థాంక్యూ డియర్. కొన్ని సీన్లు నిదానంగా ఉన్నప్పటికీ ఈ కథకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.దర్శకుడు తోట శ్రీకాంత్ తాను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరపై ఆవిష్కరించారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కథనం ఆకట్టుకుంది. బీజీఎం ఫర్వాలేదనిపించినా పాటలు సినిమాకు ప్లస్గా నిలిచాయి. డబ్బింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది. అయితే డైలాగులు సినిమాలో చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ఓవరాల్గా డైరెక్టర్ తాను అనుకున్న సందేశమిచ్చాడు.ఎవరెలా చేశారంటే..హీరోగా తంత్ర ఫ్రేమ్ నటుడు ధనుష్ రఘుముద్రి తన పాత్రలో చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో తనదైన శైలిలో నటిస్తూ మెప్పించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరో హీరోయిన్ రేఖ నిరోషా కూడా ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలోని తన పాత్రతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్లో కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
సమంత చేతికి స్పెషల్ రింగ్.. గుడ్ న్యూస్ చెప్పనుందా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఇద్దరు కలిసి డిన్నర్ తర్వాత ఓకే కారులో వెళ్లడంతో ఈ జంట డేటింగ్పై మరోసారి మొదలైంది. కొద్ది రోజుల క్రితమే లండన్ వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే తాజాగా ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రెస్టారెంట్లో చిల్ అవుతూ కనిపించింది. ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్ సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్ హాట్ టాపిక్గా మారింది. మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనుందా అనే చర్చ మొదలైంది. కాగా.. సమంత.. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో నటించారు. రాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్ సీజన్- 2, సిటాడెల్: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రజినీకాంత్ కూలీ అప్డేట్.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.తాజాగా కూలీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రజినీకాంత్ పోస్టర్ను షేర్ చేస్తూ సెన్సార్ తమకు ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K— Sun Pictures (@sunpictures) August 1, 2025 -
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
ఇటీవలే రెండో బిడ్డకు జననం.. ఆస్పత్రిలో చేరిన దృశ్యం నటి..!
బాలీవుడ్ నటి ఇషితా దత్తా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్లో చాలా సినిమాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.ఈ ఏడాదిలో రెండో బిడ్డకు స్వాగతం పలికింది ముద్దుగుమ్మ. ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇషితా జూన్లో రెండో బిడ్డను తన జీవితంలో ఆహ్వానం పలికింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అయితే తాజాగా ఇషాతా దత్తా ఆస్పత్రిలో చేరింది. తన రెండు నెలల కుమారుడితో కలిసి చికిత్స పొందుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉందని ఇషితా తెలిపింది. ఇది నిజంగా కఠినమైన నెల... నేను నా నవజాత శిశువుతో ఇంట్లో ఉండాల్సిన సమయంలో... ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా అంటూ వివరించింది. మీలో చాలా మంది అనుకుంటున్నట్లు నా బరువు తగ్గడం వల్ల వచ్చిన అనారోగ్యం కాదని తెలిపింది.కాగా.. ఇషిత దత్తా -వత్సల్ సేత్ 2017లో వివాహం చేసుకున్నారు. రిష్టన్ కా సౌదాగర్ - బాజిగర్ అనే టీవీ సీరియల్ సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 19, 2023న, వారిద్దరు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. ఇషిత దత్తా చివరిసారిగా 2022లో విడుదలైన దృశ్యం- 2లో కనిపించింది.ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. -
యోగి ఆదిత్యనాథ్పై బయోపిక్.. విడుదలకు అడ్డుగా సెన్సార్ బోర్డ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి'.. దర్వకుడు రవీంద్ర గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అడ్డుచెప్పింది. దీంతో చిత్ర యూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సర్టిఫికేషన్ దరఖాస్తులను తిరస్కరించడాన్ని సెన్సార్ను తప్పుబడుతూ వారు కోర్టులో సవాలు చేశారు.'అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' చిత్రంలో యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఆయన గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో చిత్ర నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించి తమ వాదనను వినిపించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దీంతో ఇదే విధంగానే న్యాయస్థానం కూడా సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకంపై ఎలాంటి సమస్యలు లేనప్పుడు సినిమాకు అభ్యంతరాలు ఎందుకని న్యాయమూర్తులు రేవతి మోహితే డెరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. పుస్తకం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది సినిమా విడుదలకు ఎందుకు వస్తుందని న్యాయస్థానం నిలదీసింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని CBFCకి కోర్టు నోటీసు జారీ చేసింది. -
రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్
నటుడు అజిత్ ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం మినహా అన్నీ విజయం సాధించాయి. తాజాగా అజిత్ కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం కారు రేస్పై దృష్టి సారిస్తున్న అజిత్ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఈ హిట్ కాంబినేషన్ రూపొందనున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ అధినేత రాహుల్ నిర్మించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రానికి అజిత్ పారితోషికమే తీసుకోకుండా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అలాగని ఫ్రీగా నటించడం లేదు.. అజిత్, నిర్మాత రాహుల్ ఒక డీల్ చేసుకున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ డీల్ ఏమిటంటే చిత్రం విడుదలైన తరువాత ఓటీటీ, డిజిటల్ హక్కులను అజిత్కు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అజిత్ ఇప్పటివరకు ఒక్కో చిత్రానికి రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇంతకుముందు వరకు కొంత పారితోషికంతో పాటు ఒకటి రెండు ఏరియాల హక్కులను కోరే హీరోలు ఇకపై అజిత్లా ఓటీటీ, డిజిటల్ హక్కులు కోరతారేమో. -
నటిపై తండ్రే సంచలన కామెంట్.. పోలీసులకు ఫిర్యాదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్ పేరు కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తనపై తండ్రే ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ప్రిజం పబ్ యాజమాన్యం ఆమెపై కేసు పెట్టింది. బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. అయితే, అదంతా అబద్దం అంటూ ఆమె వివరణ ఇచ్చింది. రీసెంట్గా హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్ట్కు వెళ్లిన కల్పిక అక్కడ కూడా గొడవ చేసింది. సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని అతనిపై ఫైర్ అయింది. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. దీంతో ఆమె మళ్లీ వివరణ ఇచ్చింది. ప్రశాంతత కోసం రిసార్ట్కు వెళ్లినా తనకు ఎలాంటి ప్రశాంతత దక్కలేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు. మంచి డాక్టర్ను చూసి మానసిక వైద్యం కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే, తాజాగా కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.కల్పిక కొంత కాలంగా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసిందన్నారు. దీంతో ఆమెను గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామన్నారు. అయితే, అక్కడ ఉండకుండా ఆమె తిరిగి వచ్చిందని చెప్పారు. వైద్యులు సూచించిన మెడిషన్స్ కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందన్నారు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు పడుతుందన్నారు. దయచేసి ఆమెను మళ్లీ రిహాబిలిటేషన్కు తరలించాలని పోలీసులను ఆయన కోరారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. -
ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన '3BHK' సినిమా
సిద్ధార్థ్ హీరోగా నటించిన '3BHK' సినిమా సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్.. ఈ అంశం చుట్టూ 3BHK సినిమా ఉంటుంది. ఇందులో శరత్కుమార్, సిద్ధార్థ్ తండ్రికొడుకులుగా మెప్పించారు. దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తెలుగులో కాస్త నిరాశ పరిచినప్పటికీ కోలీవుడ్లో మంచి టాక్ తెచ్చుకుంది.'3BHK' సినిమా అమెజాన్ ప్రైమ్(amazon prime video)లో నేడు (ఆగష్టు 1)న సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉండటంతో ఈ వీకెండ్ కుటుంబంతో పాటు అందరూ చూడతగిన చిత్రమని చెప్పవచ్చు. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చినా.. ఫైనల్గా ఒక మంచి చిత్రాన్ని చూశామనే ఫీల్ కలుగుతుంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. -
'వీరమల్లు' పోయింది.. నిధి అగర్వాల్కు మిగిలిన ఒకే ఒక్క ఆశ ఇదే
అంతన్న డింతన్నడే గంగరాజు తరహాలో కొన్ని చిత్రాల ప్రచారం జరుగుతుంది. అయితే ఆ చిత్రాలు విడుదలైన తరువాత అంచనాలు తలకిందులవుతాయి. ఆప్రభావం హీరోహీరోయిన్లు సహా యూనిట్ అంతటిపైనా పడుతుంది. దాని నుంచి బయట పడడానికి చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నటి నిధిఅగర్వాల్ పరిస్థితి అలాగే తయారైంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిట్తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఏ ఒక్కటి ఆశించిన విజయాన్ని అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ నుంచి పిలుపువచ్చింది. అలా ఇక్కడ రవిమోహన్కు జంటగా భూమి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కోలీవుడ్లో ఒక రౌండ్ కొట్టవచ్చుననే అందరూ అనుకున్నారు. అయితే ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అవడంతో పెద్దగా నిధి అగర్వాల్కు ప్లస్ కాలేదు. ఆ తరువాత శింబుకు జంటగా ఈశ్వరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో శింబుతో ప్రేమ అంటూ ప్రచారం వైరల్ అయ్యింది. అదే సమయంలో ఈశ్వరన్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ సరసన ఒక చిత్రం చేశారు. అయినప్పటికీ నిధికి సరైన బ్రేక్ రాలేదు. ఆ తరువాత తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఈ సారి సక్సెస్ గ్యారంటీ అని ఈ అమ్మడు సంతోషపడి ఉండవచ్చు. అయితే ఈ చిత్రం విడుదల కోసం ఐదేళ్లు చూశారు. ఈ చిత్రం ఫలితం నిధి అగర్వాల్కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమెకు ఓకే ఒక్క ఆశ రాజాసాబ్. ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో నిధి అగర్వాల్ మళ్లీ అవకాశాల కోసం పోరాటం మొదలు పెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హీరో భార్య 'అనొద్దన్న సెలబ్రిటీ వైఫ్'.. మిగిలిన హీరోల భార్యలు..?
ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఇచ్చిన ఒక సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్ భార్యగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు తన స్వంత కెరీర్లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్2: ఎంపురాన్‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ, నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా వెల్లడించడం హర్షణీయం.ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్ హీరో రామచరణ్ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా.. -
సినీ కార్మికుల వేతనాల పెంపు.. గడువు కోరిన ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు
సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి గడువు కోరింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ను కలిసిన ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు రెండు రోజులు గడువు కోరారు. ఈ విషయాన్ని సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులకు కార్మిక శాఖ కమిషనర్ తెలిపారు.ఛాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ ప్రతినిధులతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ కమిషనర్ వెల్లడించారు. అంత వరకు షూటింగ్స్ ఆపవద్దని ఫెడరేషన్ ప్రతినిధులను కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాలతో చర్చల ద్వారా కార్మికుల వేతనాల సమస్య ఓ కొలొక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
'ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు'.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూఎస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కింగ్డమ్ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు. మీ సపోర్ట్తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా... మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు. మా మేనేజర్ అనురాగ్ సైతం ఏడ్చేశారు. ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది. నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా.. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది అన్నారు. యూఎస్ ఫ్యాన్స్ను తప్పకుండా కలుస్తా.. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. -
బిగ్బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్బాస్ షోకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ ప్రకటించింది.ఆగస్టు 24 నుంచి బిగ్బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్స్టార్తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..అయితే ఈ ఏడాది సీజన్కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్బాస్ 17వ సీజన్కు రూ.200 కోట్లు, 18వ సీజన్కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025 -
పాపం.. ఊర్వశి.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షల నగలు చోరీ!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల వింబుల్డన్ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లండన్లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ బ్యాగ్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊర్వశి నిరాశ వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైందని పేర్కొంది.ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ సంఘటనను వివరిస్తూ విమానాశ్రయంలో భద్రతా లోపాన్ని ప్రస్తావించింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా వింబుల్డన్కు గ్లోబల్ ఆర్టిస్ట్గా హాజరైనట్లు వెల్లడించింది. ముంబయి నుంచి గాట్విక్ చేరుకోగా.. ఎయిర్పోర్ట్లో తన బ్యాగ్ దొంగిలించారని పోస్ట్ చేసింది. బ్యాగ్తో పాటు టికెట్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. త్వరగా తన బ్యాగ్ తిరిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కానీ అక్కడి అధికారుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని వాపోయింది.కాగా.. ఈ బాలీవుడ్ ముద్దుగమ్మ సినిమాలతో పాటు ప్రత్యేక సాంగ్స్తో అభిమానులను అలరించింది. టాలీవుడ్లోనూ స్టార్ హీరోల చిత్రాల్లో మెప్పించింది. బాలయ్య, మెగాస్టార్ సినిమాల్లోనూ కనిపించింది. -
మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. జాన్వీ క్లాసికల్ డ్యాన్స్
'డెకాయిట్' సెట్లో మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్లైఫ్ మూమెంట్స్ షేర్ చేసిన హీరోయిన్ సమంతజూలై జ్ఞాపకాలని పంచుకున్న ప్రియాంక మోహన్క్లాసికల్ డ్యాన్స్తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్లంగా ఓణీలో మల్లెపూలతో శ్రీముఖి సింగారంమేకప్ లేకుండా కాయదు లోహర్ సెల్ఫీలుకృతి సనన్ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో చెల్లి నూపుర్ View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Nuupur Sannon (@nupursanon) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
'కింగ్డమ్' నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి: నిర్మాత
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. కొందరు నచ్చిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నచ్చలేదని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు సంగతి ఏంటో బయటపడుతుంది. ఇకపోతే తాజాగా హైదరాబాద్లో మూవీ సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండి అని అన్నారు.'సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది ఇలాంటివి ఏమి పట్టించుకోకండి. ప్రతి సినిమాకు కామన్ ఇవి. సినిమా అయితే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది మంచి హై ఇస్తుంది. మీకు నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. మూవీలోని టెక్నికల్ అంశాలు హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి' అని నాగవంశీ అన్నారు.(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నిర్మాతగా ఆయన తీసిన సినిమాని నాగవంశీ మెచ్చుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ పూర్తి రిజల్ట్ ఏంటనేది వీకెండ్ గడిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. 'కింగ్డమ్'లో విజువల్స్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ అన్నీ బాగానే ఉన్నాయని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. కానీ సెకండాఫ్లో ల్యాగ్ ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. అలానే హీరోహీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ కూడా మూవీలో లేకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయమై సక్సెస్ మీట్ నిర్మాతని అడగ్గా.. స్కోప్ లేకపోవడంతోనే పాటని పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!)"మీకు #Kingdom సినిమా High ఇవ్వకపోతే Phone చేసి తిట్టండి, అంత Confident గా చెప్తున్నా... Technicalities హాలీవుడ్ Standards లో ఉన్నాయి.."- #NagaVamsi pic.twitter.com/R1L5wrgqKT— Movies4u Official (@Movies4u_Officl) July 31, 2025 -
మరోసారి రాజ్ నిడిమోరుతో సామ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్టాపిక్గా మారింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గానే ఉంటోన్న సామ్.. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా మెలగడమే. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన వీరిద్దరు మరోసారి కెమెరాలకు చిక్కారు.సామ్- రాజ్ నిడిమోరు ఓకే కారులో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో మరోసారి ఈ జంట గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ తమపై వస్తున్న వార్తలపై ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఏదో ఒక సందర్భంలో వీరిద్దరు ఓకే వేదికపై తరచుగా కనిపిస్తూనే ఉన్నారు.ఈ వీడియో చూస్తుంటే ఇద్దరు కలిసి ఓ రెస్టారంట్కు డిన్నర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్లో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్తో పరిచయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Bollywood Chronicle (@bollywoodchronicle) -
బాణామతి బ్యాక్డ్రాప్లో 'చేతబడి' సినిమా
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్పై నంద కిషోర్ నిర్మిస్తున్న సినిమా 'చేతబడి'. కొత్త దర్శకుడు సూర్యాస్ ఈ మూవీని నిజజీవిత సంఘటనల ఆఘారంగా తెరకెక్కించారు. తాజాగా లుక్ రిలీజ్ చేయడంతో పాటు చిత్ర విశేషాలని దర్శకుడు మీడియాతో పంచుకున్నాడు.చేతబడి.. 16వ శతాబ్దంలో మన దేశంలో పుట్టింది. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలగం ఉండాలి. కానీ ఒక చెడు శక్తితో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన శరీరంలో ప్రతిదానికి ఓ ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుందని సూర్యాస్ తెలిపాడు.1953 గిరిడ అనే గ్రామంలో యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఈ కథని సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నామని దర్శకుడు సూర్యాస్ చెప్పుకొచ్చాడు. -
ఓటీటీకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ నెట్వర్క్. ఈ సిరీస్కు సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న ఈ వెబ్ సిరీస్ను ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి. -
'కింగ్డమ్' ఓటీటీ డీటైల్స్.. ఎప్పుడు రావొచ్చు?
విజయ్ దేవరకొండ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో తన లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్'పై బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటి రెండు రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటనేది బయటపడుతుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్ ఏంటి? ఎప్పుడు రావొచ్చు?ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఆగస్టు 14 వరకు మరో పెద్ద మూవీ లేదు కాబట్టి.. 'కింగ్డమ్'కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ ఏ మేరకు దాన్ని క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. అలానే కలెక్షన్ కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నిర్మాణ సంస్థ ఎప్పుడో నెట్ఫ్లిక్స్ సంస్థకు విక్రయించింది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రీసెంట్ టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్ తీసే సినిమాల్ని దాదాపుగా నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. 'కింగ్డమ్' కూడా అలానే దక్కించుకుంది. అలానే ఈ చిత్రాలన్ని చాలావరకు నాలుగు వారాల గ్యాప్తోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ మూవీ కూడా అలానే రావొచ్చని తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబరు తొలివారంలో 'కింగ్డమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!) -
నాతో ఒక్క సినిమా చేయమని డైరెక్టర్ను రిక్వెస్ట్ చేశా: సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) విరూపాక్ష, బ్రో చిత్రాల తర్వాత గతేడాది మరో మూవీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీతోనే మెగా హీరో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాం సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కనపెడితే సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. మయసభ పేరుతో వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ఒక సినిమా చేయాలని మయసభ డైరెక్టర్ దేవా కట్టను రిక్వెస్ట్ చేశానని మెగా హీరో అన్నారు. తన బ్యాడ్ టైమ్లో నాతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవాకట్టా మాత్రమేనని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'దాదాపు 10 ఏళ్ల క్రితమే నా జర్నీ దేవాకట్టాతో స్టార్ట్ అయింది. మేమిద్దరం జిమ్లో కలిసేవాళ్లం. సార్ నాతో ఒక సినిమా చేయండని రిక్వెస్ట్ చేసేవాడిని. అలా చేస్తే చివరికీ రిపబ్లిక్ మూవీతో జతకట్టాం. నా బ్యాడ్ టైమ్లో నాకు వెలుగునిచ్చిన వ్యక్తి దేవాగారు. రిపబ్లిక్ సినిమా టైమ్లో నేను ఏదైతే క్లైమాక్స్ కోరుకున్నానో అదే ముందుకు తీసుకెళ్లారు దేవా కట్టా' అని తెలిపారు.కాగా.. దేవా కట్ట డైరెక్షన్లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది.A friendship tested by ambition.A rivalry that redefined leadership.A story that changed the fate of a state.#Mayasabha Trailer out now.#Mayasabha – A gripping political saga – Starts streaming from August 7th on @sonyliv@devakatta @AadhiOfficial @IamChaitanyarao pic.twitter.com/ZKMWVxqpei— Sony LIV (@SonyLIV) July 31, 2025 -
షూటింగ్ పూర్తి.. స్వయంగా భోజనాలు వడ్డించిన స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా వస్తోన్న తాజా చిత్రం సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సర్దార్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా సర్దార్–2 రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్ వచ్చింది.ఇటీవలే సర్దార్-2 మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ సభ్యులకు మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తీ స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ కార్తీ ది గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ మూవీలో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, మాళవికమోహన్, ఆషికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.Unseen 🚨😍Our man himself served briyani for the completion of the #Sardar2 shoot.@Karthi_Offl #Karthi #MrVersatileKarthi pic.twitter.com/JtxT0y5fPI— Karthi Trends (@Karthi_Trendz) July 31, 2025 -
'ఛావా' రికార్డ్ బ్రేక్ చేసిన చిన్న సినిమా
చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.ఓవరాల్గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం) -
‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. భారీ అంచనాల మధ్య నేడు(జులై 31)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కథ-కథనం పక్కకి పెడితే..విజయ్ నటనపై మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానిస్టేబుల్ సూరి పాత్రలో ఒదిగిపోయాడని, ఎమోషనల్ సన్నీవేశాల్లో అద్భుతంగా నటించారని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. విజయ్ అభిమానులు అయితే హిట్ సినిమా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా కింగ్డమ్ సినిమాపై తన రివ్యూ ఇచ్చేసింది. ‘ఇది నీకు(విజయ్), నిన్ను ప్రేమించిన వాళ్లకు ఎంత అర్థ అవుతుందో నాకు తెలుసు..‘మనం కొట్టినం’’ అని రష్మిక ఒక్క మాటతో సినిమా సూపర్ హిట్ అని చెప్పేసింది. కాగా, రష్మిక ట్వీట్పై విజయ్ స్పందించాడు. అవును ‘మనం కొట్టినం’అంటూ లవ్ సింబల్తో రిప్లై ఇచ్చాడు. I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!“MANAM KOTTINAM”🔥#Kingdom— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025 -
ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం
టాలీవుడ్లో మరో విషాదం. కొన్నిరోజుల క్రితమే అనారోగ్య సమస్యలతో నటుడు ఫిష్ వెంకట్ చనిపోయారు. ఇప్పుడు విలనీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తోటి నటీనటులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇంతకీ ఏమైంది? ఎవరీ నటుడు?(ఇదీ చదవండి: బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)పలు తెలుగు సినిమాల్లో విలన్ సహాయకుడిగా చేసిన భాను అలియాస్ బోరబండ భాను రీసెంట్గా ఓ స్నేహితుడు పిలవడంతో గండికోట వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేశాడు. అంతా పూర్తయిన కాసేపటికే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో వీళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే భాను చనిపోయాడు.భానుని అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భాను చేసే పాత్రలు విలనీ తరహాలో ఉన్నప్పటికీ ఆయన నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటాడని, అందరితో కలిసిపోతాడని సహ నటీనటులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే భాను మృతి పట్లు ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి) -
ప్రముఖ సింగర్పై వైద్యురాలి ఫిర్యాదు.. ఇన్స్టాతో పరిచయం ఆపై..
మలయాళంలో ప్రముఖ ర్యాపర్ వేదన్ (Vedan)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ వైద్యురాలి ఫిర్యాదు మేరకు తాజాగా కేసు నమోదుచేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2021 ఆగస్టు నుంచి 2023 మార్చి వరకు వివిధ ప్రదేశాలలో తనను లైంగికంగా ఉపయోగించుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు వేదన్ పరిచయం అయ్యాడని ఆమె చెప్పింది. త్రిక్కకర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్లో మాదకద్రవ్యాల కేసులో వేదన్ అరెస్టు అయి, బెయిల్పై విడుదలయిన విషయం తెలిసిందే. అతని అపార్ట్మెంట్లో గంజాయి, రూ.9 లక్షల నగదును గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై చిరుత దంతాలతో తయారైన గొలుసు కూడా అతని వద్ద ఉండటంతో అటవీ శాఖ అధికారుల నుంచి విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఇన్ని కేసులు ఉండగా ఒక వైద్యురాలు అతని ట్రాప్లో ఎలా చిక్కుకుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2019లో “Voice of the Voiceless” అనే ఆల్బమ్తో కేరళలో బాగా ప్రాచుర్యం పొందాడు. సామాజిక అంశాలపై గళమెత్తిన వ్యక్తిగా గుర్తింపు పొందిన అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. -
‘కింగ్డమ్’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్డమ్నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే , వెంకటేశ్ పీసీ, కసిరెడ్డి తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు:సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: గౌతమ్ తిన్ననూరిసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ:జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISCఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: జులై 31, 2025విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. నిజం చెప్పాలంటే ‘గీత గోవిందం’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమానే లేదు. భారీ ఆశల మధ్య గతేడాది వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో విజయ్ ఆశలన్నీ ‘కింగ్డమ్’పైనే పెట్టుకున్నాడు.డైరెక్టర్ గౌతమ్కి కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్తో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను కింగ్డమ్ అందుకుందా? విజయ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..సూరి(విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. అన్న శివ(సత్యదేవ్) అంటే ప్రాణం. ఓ కారణంతో శివ చిన్నప్పుడే తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోతాడు. అతని ఆచూకి కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో సూరి శ్రీలంకలో ఉన్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే.. శ్రీలంకలో ఓ తెగ ఉంటుంది. 70 ఏళ్ల క్రితం ఇండియా నుంచి శ్రీలంకకు పారిపోయిన తెగ అది. గోల్డ్ మాఫియా సిండికేట్ చేతిలో వారు బానిసలు. మురుగన్(వెంకటేశ్) చెప్పింది చేయడమే వాళ్ల పని. శివ ఆ గ్యాంగ్ లీడర్. అతన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడమే సూరి లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? తమ్ముడు సూరి ఇండియన్ పోలీసుల గూఢచారి అని తెలిసిన తర్వాత శివ ఏం చేశాడు? అసలు ఈ తెగ ఇండియా నుంచి శ్రీలంకకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. గుఢచారిగా వెళ్లిన సూరి.. చివరకు ఆ తెగకు దేవుడిగా ఎలా మరాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెరపై భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధహస్తుడు. ‘మళ్లీ రావా’లో ప్రేమ, విరహం, గతం-వర్తమానం మధ్య తడమాటాన్ని అద్భుతంగా చూపించాడు. జెర్సీలోని ట్రైన్ సీన్ ఒక్కటి చాలు గౌతమ్ తన కథల్లో ఎమోషన్ని ఎంత బలంగా చూపిస్తాడో చెప్పడానికి. కింగ్డమ్లో కూడా తన బలమైన ఎమోషన్పైనే గౌతమ్ ఎక్కువ దృష్టిపెట్టాడు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. గ్యాగ్ స్టర్ బ్యాక్ డ్రాప్తో అన్నదమ్ముల కథని చెప్పాడు. అయితే ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అయినా.. కథ-కథనంలో మాత్రం కొత్తదనం కొరవడింది. సినిమా చూస్తున్నంత సేపు ఇటీవల వచ్చిన రెట్రో సినిమాతో పాటు పాత చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు మన కళ్లముందు తిరుగుతాయి. కథను బలంగా చెప్పే క్రమంలో కొన్ని చోట్ల ట్రాక్ మిస్ అయ్యాడు. అయితే అనిరుధ్ నేపథ్య సంగీతం, విజయ్ నటన ఆ తప్పిదాలను కొంతవరకు కప్పిపుచ్చాయి. 1920లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ చాలా ఎమోషనల్గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ 70 ఏళ్లు ముందుకు జరిగి.. 1991లోకి వస్తుంది. చిన్నప్పుడే పారిపోయిన అన్నకోసం సూరి వెతకడం.. ఓ పోలీసు ఆఫీసర్ దృష్టిలో పడడం.. అన్న ఆచూకి చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంకకు పంపిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్లతో కథను నడిపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు మాత్రం భావోద్వేగాలనే బలంగా చూపించాడు. అన్నదమ్ములు కలిసే సీన్ ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. సముంద్రంలో వచ్చే ఛేజింగ్ సీన్, నేవి అధికారుల నుంచి బంగారం కొట్టేసే సీన్ ఫస్టాఫ్కే హైలెట్. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథ అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. పైగా కొన్ని చోట్ల కథనం ట్రాక్ తప్పుతుంది. ఆపదలో ఉన్నవారిని చివరి నిమిషంలో అయినా సరే హీరో వచ్చి ఆదుకోవడం మన తెలుగు సినిమాల సాంప్రదాయం. కానీ కింగ్డమ్లో అది ఫాలో కాకపోవడంతో.. కొంతమందికి ప్రీక్లైమాక్స్ కొత్తగా అనిపిస్తే.. చాలా మందికి ఇలా చేశారేంటి? అనిపిస్తుంది. పార్ట్ 2 కోసమే క్లైమాక్స్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సాధారణ పోలీసు కానిస్టేబుల్గా, ఆ తర్వాత పోలీసుల గూఢచారిగా, కింగ్డమ్ రాజుగా ఇలా పలు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సత్యదేవ్ పాత్ర. హీరో అన్న శివగా అద్భుతంగా నటించాడు. ఆయన పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు రెండో హీరో సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఇక మాఫీయా లీడర్ మురుగన్గా వెంకటేశ్ విలనిజం బాగా పండించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీకి పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. డాక్టర్గా రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా వరకు రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో వాటిని అంతే అందంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
బర్త్డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ఆయన తరచూ సాయం చేస్తుంటారనే విషయం తెలిసిందే. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' పేరుతో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో మంచి పనులు ఆయన చేస్తుంటారు. రైతులు, విద్యార్థులు, వైద్యం, దుస్తులు, ఆహారం ఇలా ఒక్కటేంటి లెక్కలేనన్ని సామాజిక సాయం చేయడంలో ఆయన ముందుంటారు. అయితే, తాజాగా వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు సోనూ గొప్ప మనసు చాటుకున్నారు.జులై 30న సోనూసూద్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలని ఆయన ముందుకు వచ్చారు. 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమంతో పాటు ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టకున్నట్లు ప్రకటించారు. వృద్ధులు ఒంటరిగా ఉండకుండా, ప్రేమతో, గౌరవంతో జీవించేందుకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆశ్రమాల్లో ఆరోగ్య సంరక్షణతో పాటు మంచి ఆహారం ఆపై చివరి రోజుల్లో వారికి మానసిక శాంతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అయితే, ఎక్కడ నిర్మించనున్నారనేది ఆయన తెలుపలేదు. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు గతంలో ఆయన ఒకసారి ప్రకటించారు. -
క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi)పై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్మీడియలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా స్పందించారు. తను నటించిన కొత్త సినిమా 'సార్ మేడమ్' విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్(CASTING COUCH) ఆరోపణల గురించి ఆయన్ను ప్రశ్నించగా రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఆమెపై సైబర్క్రైమ్లో తన టీమ్ పిర్యాదు చేసిందని చెప్పారు.తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్ ఆరోపణల గురించి విజయ్ ఇలా అన్నాడు.. 'చిత్రపరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవు. కానీ, ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారు. ఇలాంటి మాటలు ఇక్కడ సహజం. వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరాను. సోషల్మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థం అవుతుంది. ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుంది. ఆపై పేరు వస్తుంది. ఆమె దానిని ఆస్వాదించనివ్వండి.' అంటూ విజయ్ చెప్పారు.తనపై ఆరోపణలు చేసిన మహిళపై తన టీమ్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిందన్నారు. తాను ఏడు సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అలాంటివి తన లక్ష్యం మీద ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని బలంగా చెప్పారు.విజయ్పై వచ్చిన ఆరోపణ ఇదేకోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి (జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఇలా ఆరోపించింది. ‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. విజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. మళ్లీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది. -
హీరోయిన్లకు 'సీత' కష్టాలు
సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం.. సీతలోని సుగుణాలు నేటి మహిళలకు ఎంతో ఆదర్శమని చెప్పవచ్చు. దయ.. ధైర్యం.. ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత.. మన సీతమ్మ తల్లి! అయితే, సినీ రంగంలో ఆమె పాత్రను ఎవరు పోషించినా ఆ నటిపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. వారు ట్రోలింగ్తో పలు కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆ మధ్య శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటి నయనతార నటించడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. సాంగీక చిత్రాల్లో అందాలను విచ్చల విడిగా ఆరబోసిన ఈమె ఏంటీ సీతాదేవిగా నటించడమని విమర్శించారు. అయితే ఆ చిత్రం విడుదలయిన తరువాత సీతగా నయనతార ఒదిగిపోయారు అనే ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా బాలీవుడ్ భామ కృతీసనన్ నటించినప్పుడూ ఆమె గురించి ట్రోలింగ్ చేశారు. ఆ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఆ విమర్శల్లో అర్థం ఉందనుకుందాం. కానీ, ఇప్పుడు నటి సాయిపల్లవిపై కూడా విమర్శలు చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సహజత్వానికి ప్రాముఖ్యత నిస్తున్న నటి సాయిపల్లవి. పెదాలకు లిప్స్టిక్ వేసుకోవడానికి కూడా వద్దనే చెప్పే నటి ఈమె. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ప్రాణం పెట్టి నటించే సాయిపల్లవి బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్కు గురౌతున్నారనిపిస్తోంది. రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటి సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. సీతాదేవిగా ఆమె నటించడం రామాయణం కావ్యాన్నే అవమానపరిచినట్లు అని బాలీవుడ్లో విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఆ చిత్రంలో శూర్పణక పాత్రలో నటిస్తున్న రకుల్ప్రీత్ సింగ్తో కలిసి నటి సాయిపల్లవిపైనా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, యష్ రావణాసురుడిగా నటించిన కొన్ని సన్నివేశాలు విడుదలయిన తరువాత ట్రోలింగ్స్ అధికం అవుతున్నాయి. అయితే ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా నటి సాయిపల్లవి తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కారణం చిత్రం విడుదలైన తరువాత తన నటనే అలాంటి వారికి సమాధానం చెబుతుందనే ఆమె ధైర్యం కావచ్చు. -
బిగ్బాస్ బ్యూటీ ఇనయా గ్లామరస్.. బేబీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా స్టైలిష్ లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా చిల్..బేబీతో ఆడుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..సారా అలీ ఖాన్ బ్యూటీఫుల్ వీడియో..భర్తతో కలిసి లాస్య మంజునాథ్ ఫ్యాషన్ లుక్.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
'ఇంత బతుకు బతికి'.. బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ!
బిగ్బాస్ ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. జీవితంలో ఒక్కసారైనా బిగ్బాస్ హౌస్కు వెళ్లాలన్న కల నేరవేర్చుకోవడమే కాదు.. ఏకంగా విన్నర్గా నిలిచాడు. రైతుబిడ్డగా హోస్లోకి ఎంట్రీ ఇచ్చి.. బిగ్బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు. జై జవాన్- జై కిసాన్ అంటూ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచాడు.అయితే బిగ్బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం ప్రశాంత్కు కొద్దిగంటల్లోనే ఆవిరైంది. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు హంగామా సృష్టించారు. దీంతో బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పల్లవి ప్రశాంత్ ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఇంత బతుకు బతికి.. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని ఏడ్చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉంటది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
థియేటర్లలో మరోసారి అతడు.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్లో ఈ ఏడాది రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు మళ్లీ బిగ్ స్క్రీన్పై సందడి చేశాయి. తాజాగా మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న అతడు సినిమా థియేటర్లలో కనువిందు చేయనుంది.ఈ నేపథ్యంలోనే అతడు రీ రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. మహేశ్బాబు- త్రివిక్రమ్ కాంబోలో 2005లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని డైలాగ్స్, పాటలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మరోసారి మహేశ్ బాబు- త్రిష కెమిస్ట్రీని థియేటర్లలో చూసే ఛాన్స్ వచ్చింది. Gun & Bullet rendu chuddam Super 4K lo...vindham Dolby lo 🤌🔥Here comes the #AthaduSuper4K Trailer ▶️ https://t.co/hJrElS0H5d Releasing in theatres as a Superstar @urstrulyMahesh Birthday Special on Aug 9th♥️#AthaduHomecoming#Athadu4KOnAug9th #Athadu4K pic.twitter.com/piO9jrQGfa— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) July 30, 2025 -
'పెళ్లికి ముందే హద్దులు దాటితే'.. ఓటీటీకి సూపర్ హిట్ సినిమా
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'డా..డా'. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పాపా మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
కింగ్డమ్లో ఎవరా స్టార్ హీరో?.. విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, నాగవంశీ సమాధానాలిచ్చారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కింగ్డమ్ ట్రైలర్ చివర్లో ఓ కెమియో రోల్ను చూపించారు. ఆ రోల్లో ఉన్నది స్టార్ హీరోనా? అని అడిగారు. ఇది మీరు థియేటర్లోనే చూడాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే మీరు ఊహించినట్లే పెద్ద హీరోనే ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానులు ఇంతకీ ఎవరా హీరో అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.కాగా.. కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. Who Is That Big Hero? pic.twitter.com/w5M7x0SKMH July 30, 2025 -
సార్.. మేడమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిత్యామీనన్.. (ఫోటోలు)
-
ఎవరికోసమో మారను.. నన్ను ఎవరూ వెలేత్తి చూపొద్దు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత కింగ్డమ్పై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉండడంతో తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తానెప్పుడు ఎవరికోసమే మారనని.. ఎవరికీ భయపడనని అన్నారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నేనేప్పుడు లోపల ఏది అనిపిస్తే అదే మాట్లాడతా.. కెరీర్ ప్రారంభంలో అగ్రెసివ్గా ఉన్నా. అప్పుడు నాలో డిఫెన్స్ మెకానిజంతో ఉండేవాన్ని. ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి. అందుకే కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. మనం సినిమాల్లోనూ చూస్తుంటాం కదా.. హీరో ముందుగా పవర్ఫుల్గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్ అయిపోతాడు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుతూ..'ఇప్పుడు నా అభిమానుల ప్రేమతో నేను కూడా సాఫ్ట్ అయిపోయా. ఇప్పుడైతే నాకేలాంటి ఫియర్ లేదు. మొదట్లో నాకు కొద్దిగా భయముండేది. ఇప్పుడైతే అలాంటిదేం లేదు. నా చుట్టూ ఉండే వాతావరణం వల్లే అలాంటి ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆడియన్స్ లవ్ వల్ల ఫియర్ పోయి ప్రశాంతంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ తెలిపారు. -
'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ హారర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్లో ఇది థియేటర్లలోకి రాగా అలా నెల దాటిందో లేదో ఇప్పుడు డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.2002లో రిలీజైన '28 డేస్ లేటర్', 2007లో విడుదలైన '28 వీక్స్ లేటర్' చిత్రాలకు సీక్వెల్ '28 ఇయర్స్ లేటర్'. దీన్ని రెండు భాగాలుగా తీశారు. ఇందులోని తొలి పార్ట్ జూన్లో రిలీజైంది. కాకపోతే థియేటర్లలో అనుకున్నంతగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయింది. మరి అందుకేనేమో ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో అన్ డిమాండ్(రెంట్ విధానంలో) అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్లో రెండు తెలుగు థ్రిల్లర్స్)'28 ఇయర్స్ లేటర్' విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రేజ్ వైరస్ మహమ్మారిలా వ్యాపించేసరికి బ్రిటన్ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు.. ఓ ఐలాండ్లో బతుకుతుంటారు. మరి అక్కడికి కూడా జాంబీలు ఎలా వచ్చేశారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 'ఓపెన్హైమర్' నటుడు కిలియన్ మర్ఫీ.. జాంబీ పాత్ర చేశాడు. ఈ మూవీకి రెండో భాగం '28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్'.. వచ్చే జనవరిలో థియేటర్లలోకి రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 25కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. 3 బీహెచ్కే, తమ్ముడు, నెట్వర్క్, జిన్ ద పెట్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్ప్రైజ్ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?) -
కింగ్డమ్ ఫీవర్.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్.. ఎన్ని అడుగులో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కింగ్డమ్ ఫీవర్ నడుస్తోంది. మాస్ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు.ఈ నేపథ్యంలోనే విజయ్ అభిమానులు కింగ్డమ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్ను ఫ్యాన్స్ రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. ఇటీవలే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తిరుపతిలో 40 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్ను ఆవిష్కరించారు,. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై బజ్ను మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నటులు సత్య దేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. 'కింగ్డమ్' జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. MASSive 75ft Biggest @TheDeverakonda Cut-Out at Sudharshan 35MM, RTC X Roads❤️🔥Get Ready to Celebrate #VijayDeverakonda’s Rage in #KINGDOM 💥💥💥 #KingdomOnJuly31st pic.twitter.com/gsR0uRcThc— Vijay Deverakonda Celebrations👑 (@VDCelebrations) July 30, 2025 -
తెలియక చేశా.. నేను డబ్బు తీసుకోలేదు: ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ ప్రకాశ్ రాజ్తో పాటు మొత్తం 29 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన ఇతడు.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ కి ప్రకాశ్ రాజ్ కౌంటర్)'చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యాను. దయచేసి బెట్టింగ్ యాప్లలో ఆడకండి. కష్టపడి సంపాదించుకోండి. ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ తెలియక ప్రమోట్ చేశాను. అందులో నేను డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను' అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇదే కేసులో రానా, మంచు లక్ష్మీ సహా చాలామంది యూట్యూబర్స్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్) -
'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?
'అర్జున్ రెడ్డి', 'గీతగీవిందం' సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'కింగ్డమ్' చేశాడు. దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. అందుకు తగ్గట్లే మూవీపై హైప్ రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్స్లోనూ అది క్లియర్గా కనిపిస్తోంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.శ్రీలంక బ్యాక్ డ్రాప్లో తీసిన 'కింగ్డమ్' సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్తో క్లారిటీ ఇచ్చేశారు. అనిరుధ్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవి కూడా మూవీపై కాస్త అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకుగానూ విజయ్ రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి తర్వాత అనిరుధ్కి రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. 'కింగ్డమ్' చిత్రానికి మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్పుకొచ్చారు. వీటిలో ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్లో హిట్ టాక్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు 'కింగ్డమ్'దే హవా.(ఇదీ చదవండి: 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?) -
63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?
సినిమా సెలబ్రిటీల మధ్య డేటింగ్, ప్రేమ, పెళ్లి లాంటివి చాలా సాధారణంగా వినిపిస్తుంటయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మిగతా వాటి సంగతేమో గానీ ఇప్పుడు 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమలో పడిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా హీరోహీరోయిన్? ఏంటి సంగతి?టాప్ గన్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్.. ఆరోసారి ప్రేమలో పడ్డాడనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకే మూడుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు కూడా ఇచ్చేసిన ఇతడు.. తర్వాత ఒకామెతో రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 37 ఏళ్ల అనా డీ అర్మాస్తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా టామ్ క్రూజ్, అనా డి అర్మాస్తో కలిసి ఉంటున్నారని సమాచారం. ఈ పుకార్లను నిజం చేస్తూ తాజాగా వెర్మోంట్లో ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. వెర్మోంట్ ఏరియాలో అర్మాస్కి ఓ ఇల్లు ఉంది. అందులోనే టామ్, అర్మాస్ కలిసి ఉన్నారని హాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)టామ్ క్రూజ్ ఇప్పటికే మూడసార్లు పెళ్లి చేసుకున్నాడు. 1987లో మిమీ రోజర్స్ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. మొదటగా విడిపోయిన 1990లోనే నికోల్ కిడ్మన్ని వివాహమాడాడు. పదకొండేళ్లు కాపురం చేసిన తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్.. 2006లో కేట్ హోమ్స్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హీథర్ లాక్లియర్తో, సింగర్ చెర్తో కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ మెంటైన్ చేశాడు.ఇప్పుడు అనా డి అర్మాస్తో ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. టామ్ మాత్రమే కాదు అర్మాస్ కూడా గతంలో ఓసారి పెళ్లి చేసుకుంది. 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్తో ఒక్కటి కాగా.. రెండేళ్లకే అతడికి విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి పెళ్లి చేసుకోని అర్మాస్.. ఇప్పుడు టామ్తో చెట్టాపట్టేలేసుకుని తిరుగుతోంది. రీసెంట్గా ఒయాసిస్ మ్యూజిక్ ఈవెంట్కి వీళ్లిద్దరూ కలిసి హాజరయ్యారు. మరి ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు) -
'కాంతార' రిషభ్ శెట్టి మరో తెలుగు సినిమా
'కాంతార' మూవీతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ చేస్తున్న ఇతడు.. తర్వాత ప్రశాంత్ వర్మ తీసే 'జై హనుమాన్' చేస్తాడు. దీని తర్వాత ఓ హిందీ మూవీ లైన్లో ఉంది. ఇప్పుడు వీటితో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ తీసే సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)18వ శతాబ్దంలో భారత్లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లో ఓ తిరుగుబాటుదారుడి కథతో ఈ సినిమాని తీయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలోనూ దీన్ని ఒకేసారి తీస్తారు. అనంతరం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు) -
'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది చెబుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీలో విలన్గా చేసిన వెంకటేశ్ అలియాస్ వెంకీ మాత్రం ఇడ్లీ కొట్టుతో ఫేమస్ అయ్యాడు. నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించాడు. అయితేనేం ఇతడికి గుర్తింపు తెచ్చింది ఏది అటే ఇడ్లీనే. ఇప్పటికీ ఆ షాపులో అప్పుడప్పుడు సేల్ చేస్తుంటాడు. ఇంతకీ ఎవరీ వెంకటేశ్? ఏంటా ఇడ్లీ స్టోరీ?కేరళకు చెందిన వెంకటేశ్ వీపీ. ఓ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అయితే అంతకు ముందు బతుకు తెరువు కోసం.. త్రివేంద్రంలో రోడ్ సైడ్ ఓ ఇడ్లీ స్టాల్ నడిపేవాడు. ప్రత్యేకించి ఇడ్లీలు మాత్రమే రకరకాల వెరైటీలు దొరుకుతాయి. రీల్స్ వల్ల ఈ 'సుడా సుడా ఇడ్లీ' స్టాల్ బాగానే ఫేమస్ అయింది. ఓవైపు నటుడిగా పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నా సరే తన ఇడ్లీ కొట్టుని మాత్రం మర్చిపోలేదు.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)ఇప్పటికీ సినిమా షూటింగ్స్ లేని టైంలో వెంకటేశ్.. తన స్టాల్లో కస్టమర్లకు ఇడ్లీలు సర్వింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా 'కింగ్డమ్' మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగ్గా.. అందరి స్పీచ్లు ఏమో గానీ వెంకటేశ్ వీపీ తనదైన మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్లో తొలి సినిమా ఇది. అయితేనేం తెలుగులో మాట్లాడుతూ అదరగొట్టేశాడు. అనిరుధ్, విజయ్ దేవరకొండ కూడా ఇతడు మాట్లాడుతుంటే నవ్వుతూ చప్పట్లు కొట్టారు.అలా మనోడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇతడికి చెందిన ఇడ్లీ కొట్టు గురించి బయటకొచ్చింది. గతంలో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలని మన నెటిజన్లు చూస్తున్నారు. ఇతడిని మెచ్చుకుంటున్నారు. మరి 'కింగ్డమ్' మూవీతో ఇతడి దశ తిరుగుతుందేమో చూడాలి? ఒకవేళ లక్ కలిసొస్తే మాత్రం టాలీవుడ్లో సెటిలైపోవచ్చు.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by Techie Travelogue (@techie_travelogue) -
పృథ్వీరాజ్ సుకుమారన్ సతీమణికి వేధింపులు
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సతీమణి, నిర్మాత సుప్రియ మేనన్ వేధింపులకు గురౌతున్నట్లు పేర్కొన్నారు. ఏడేళ్లుగా తనను ఒక మహిళ వేధిస్తున్నట్లు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసుకొని తనను టార్గెట్ చేస్తూ నిత్యం అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నట్లు సుప్రియ తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వేధింపుల గురించి సుప్రియ మీనన్ ఇలా చెప్పారు. '2018 నుంచి ఆన్లైన్ ట్రోల్స్, వేధింపులను ఎదుర్కొంటున్నాను. నన్ను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్లో చాలా ఖాతాలను క్రియేట్ చేసుకున్న ఒక మహిళ పదేపదే నన్ను ట్యాగ్ చేస్తూ వేధిస్తుంది. ఆమె పేరు క్రిస్టినాల్డో. ఆమె నా గురించి చేసిన ప్రతి పోస్టు చాలా అసహ్యకరమైన రీతిలో ఉంటుంది. ఆమె ఖాతను నేను పదేపదే బ్లాక్ చేస్తున్నప్పటికీ మరో కొత్త నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంది. ఆమె ఎవరనేది నాకు చాలా సంవత్సరాల క్రితమే తెలిసింది. కానీ ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు కాబట్టి వదిలేశాను. ఇదే అదునుగా తీసుకున్న ఆమె నాపై విషం చిమ్ముతూనే ఉంది. చివరకు మరణించిన నా తండ్రిని లక్ష్యంగా చేసుకుని నీచమైన కామెంట్లు చేయడం ప్రారంభించింది. అందుకే ఆమె గురించి బయటకు చెప్పాల్సి వచ్చింది.' అమెరికాలో నివాసం ఉంటున్న ఆమె ఒక నర్సు అని తెలుస్తోంది. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సుప్రియ ఉన్నట్లు సమాచారం.సుప్రియా మేనన్ ఒకప్పుడు ఆమె జర్నలిస్టుగా పనిచేసేవారు. పృథ్వీరాజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే, తన సతీమణి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చాలాసార్లు పృథ్వీరాజ్ చెప్పారు. వీరికో పాప (అలంకృతా మేనన్) ఉంది. పృథ్వీరాజ్ తండ్రి పరమేశ్వరన్ సుకుమారన్, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ ఇలా అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారే.. అందుకే మలయాళంలో వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. -
చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్కి కౌంటర్స్ ఇస్తూనే ఉంటారు. రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'పై రెచ్చిపోయారు. పవన్ చేతకానితనం వల్లే ఈ మూవీ ఆలస్యమైందని, ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్కి వచ్చుంటే రెండేళ్ల క్రితమే ఈ చిత్రం రిలీజ్ అయ్యేండేది కదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ ఇలా రెచ్చిపోయారు.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్)'మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడుతాం. చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? ఎవరికి అమ్ముతున్నారు. ఇంతకు ముందు ఏఎన్నార్, ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయంటే ఎదురుచూసేవాళ్లం. కానీ మీరు చేస్తున్నది నమ్మకద్రోహం కాదా?''బాహుబలి లాంటి సినిమా రాజమౌళి తీస్తే అది ఎలా ఆడింది? ట్రెండ్ సెట్ చేసింది. అదే మేము చేస్తున్నామని చెప్పి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు. ఎలాంటి దోపిడి చేస్తున్నారు? ఎవరిని దోపిడి చేస్తున్నారు? మీ అభిమానుల్నే కదా! మీ సినిమాలో ఆ రేంజు వీఎఫ్ఎక్స్ ఉన్నాయా? కథ ఉందా? నిజాయతీ ఉందా? నాలుగైదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది. మీ చేతకాని తనంతో కదా?''కథల్ని మార్చి, అందులో మీ రాజకీయ సిద్ధాంతాల్ని రుద్ది, దాన్ని ఓ సినిమాగా చేయాలని వచ్చి.. ఇంత కష్టపడ్డాం, ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం అని అంటున్నారు. ఈ పదిరోజులు ప్రమోషన్లకు వచ్చినట్లు షూటింగ్స్కి నిజాయితీగా వచ్చుంటే రెండేళ్ల ముందే రిలీజయ్యేది కదా ఈ సినిమా!''మహేశ్ బాబు-జూ.ఎన్టీఆర్ గతంలో ఓ వేదికపై ఉన్నప్పుడు ఏం చెప్పారు వాళ్లు ఫ్యాన్స్కి? మేమిద్దరం ఫ్రెండ్సే.. మేం మేం బాగానే ఉంటాం. మా కోసం మీరు కొట్టుకోవద్దు అని అన్నారు. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు.. తిరిగి కొట్టమంటాడా? నిన్ను చొక్కా చించుకుని ప్రేమించేవాళ్లు.. నిన్ను ప్రేమిస్తుంటే వాళ్లని నీ సైనికులు అనుకుంటున్నావా? ఇది నాన్సెన్స్. పవన్ ఫ్యాన్స్కి బాడీ పార్ట్స్ తప్పితే వేరేది తెలియదు. వాళ్లని నువ్వు కరెక్ట్గా ఉండమని చెప్పవు. కానీ వేరే ఎవడైనా ట్రోల్ చేస్తే మాత్రం గట్టిగా ట్రోల్ చేయమంటావా? అసలు మనసాక్షి లేని ఇలాంటి వాళ్లతో ఏం మాట్లాడతాం. ఇది కోపం కాదు నా ఆవేదన''నువ్వు ఏదో ఒక ప్రయత్నం చేసి.. అది జనాలకు నచ్చకపోతే నేను అర్థం చేసుకుంటా. ఒకవేళ ఫ్లాప్ అయితే అది ప్రయోగం అనుకోవచ్చు. కానీ నీ అహంకారం వల్లే సినిమా ఐదేళ్లకు వచ్చింది. ఒక డైరెక్టర్ అనుకున్న పరిస్థితిని మీరు కల్పించారా? ఎవరిని మోసం చేస్తావు? ఒక నిజాయితీ ఉండాలి కదా. నీకు సిగ్గు అనిపించడం లేదా? ఇలాంటి ద్రోహానికి రూల్స్ లేవు కాబట్టి తప్పించుకుంటున్నారు. నేను పాలిటిక్స్ మాట్లాడుతాను కానీ నా సినిమాల్లో మాట్లాడను. అది వేరు ఇది వేరు కదా. చివరికి ఎవరిని కోల్పోతున్నావు? నిన్ను ప్రేమించేవాళ్లనే దోపిడి చేయడం కరెక్ట్ కాదు' అని ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట తీవ్ర విషాదం) -
దేశంలో సంచలనం సృష్టించిన కేసుపై సినిమా ప్రకటన
మేఘాలయ హనీమూన్ మర్డర్పై సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు గురించి త్వరలో వెండితెరపై చూపించనున్నారు. ఈ మేరకు 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో సినిమా తీస్తున్నట్లు బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ప్రకటించారు. ఇప్పటికే అందుకు కావాల్సిన అనుమతులు కూడా రాజా రఘువంశీ కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నామని ఆయన తెలిపారు.తన సోదరుడి మృతి గురించి సినిమా తీసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సచిన్ పేర్కొన్నారు. ఇందులో తప్పు ఎవరది అనేది ప్రపంచం తెలుసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు చేసేందుకు మరోకరు ముందుకు రాకూడదనే ఆలోచనతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యమని దర్శకుడు నింబావత్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని కూడా ఆయన అన్నారు. ఇండోర్, మేఘాలయలోనే సినిమా అంతా తెరకెక్కిస్తామన్నారు.మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ స్టోరీ ఏంటి..?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తన ప్రియుడు రాజ్ కుష్వాహతో కలిసి భర్తను హత్య చేసింది. రఘువంశీ మరణం తర్వాత ఆమె ప్రియుడు ఏమీ తెలియనట్లుగా అంత్యక్రియలకు వెళ్లి మృతుడి తండ్రిని ఓదార్చాడు. -
'పాయల్ రాజ్పుత్' ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్' (67) కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన జులై 28న మరణించారు. అయితే, కాస్త ఆలస్యంగా ఆ విషయాన్ని పాయల్ తన సోషల్మీడియా ద్వారా తెలిపింది. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డారని ఇదే ఏడాదిలో ఆమె చెప్పిన విషయం తెలిసిందే. తండ్రి మరణంపై ఆమె చాలా ఎమోషనల్ అయింది. క్యాన్సర్తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, తన నాన్నను కాపాడే పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆమె పేర్కొంది. క్షమించండి నాన్న అంటూ పాయల్ ఒక పోస్ట్ చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు.పాయల్ రాజ్పుత్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ... ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్పుత్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మెసేజ్లు పెడుతున్నారు. హీరోయిన్ లక్ష్మిరాయ్, నిర్మాత ఎస్కేఎన్ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్ట్లు పెట్టారు. ఇలాంటి సమయంలో మరింత బలంగా ఉండాలని కోరారు.పాయల్ రాజ్పుత్ ‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెంకటలచ్చిమి" అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇషా కోపికర్ తెలుగులో చంద్రలేఖ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి ఆశ్చర్యపరిచేలా పలు వ్యాఖ్చలు చేసింది. 1998లో వారిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమా ఒక సంచలనం. ఇందులో లేఖ పాత్రలో ఇష కొప్పికర్ నటించింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను తాజాగా ఆమె పంచుకుంది.'నాగార్జున గురించి ఈ విషయం చెబితే ఆయన అభిమానులు ఎవరూ నమ్మరు. చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో నన్ను నాగార్జున చాలాసార్లు చెంపదెబ్బ కొట్టాడు. తెలుగులో ఈ సినిమా రెండోది. ఇందులో నన్ను నాగార్జున కొట్టే సీన్ ఒకటుంది. కానీ, ఆయన నా చెంప మీద మెల్లిగా కొట్టడంతో ఆ సీన్ సరిగ్గా రాలేదు. షూటింగ్ సమయంలో సీన్ కరెక్ట్గా రాకపోతే నాకు నచ్చదు. దీంతో నిజంగానే బలంగా కొట్టమని నేనే నాగార్జునను కోరాను. అందుకు ఆయన ఒప్పుకోలేదు. బలవంతం చేయడంతో ఆయన తప్పని పరిస్థితిలో కొట్టాడు. అయితే, ఆ సీన్కు అవసరమైన కోపాన్ని నేను చూపించలేకపోయాను. అవుట్పుట్ సరిగ్గా రాలేదు. సీన్ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో పలుమార్లు రీటేక్ తీసుకున్నాం. దీంతో నన్ను 14 సార్లు నాగార్జున చెంపదెబ్బ కొట్టారు.' అని ఆమె నవ్వుతూ చెప్పింది.'చెంపదెబ్బలు తిన్న తర్వాత నా మొఖం వాచిపోయింది. ఆయన చేతి గుర్తులు నా మొఖంపై చాలా సమయం పాటు ఉండిపోయాయి. ఆ సమయంలో నాగార్జున కూడా చాలా బాధపడ్డారు. వెంటనే వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. నేను వద్దని వారించాను. సీన్ కోసం నేను డిమాండ్ చేయడం వల్లనే కదా అలా చేశావ్..' అని ఆమె గుర్తుచేసుకుంది.చంద్రలేఖ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. ఇషా కోపికర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఏకంగా 80కి పైగా చిత్రాల్లో నటించింది. చివరిగా అయలాన్లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బీజేపీలో క్రియాశీలంగా ఆమె ఉంది. -
కోలీవుడ్లో ఫుల్ బిజీగా మన తెలుగమ్మాయి
నటి బిందు మాధవి. ఈ పేరు పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పలు భాషల్లో, చిత్రాల్లో కథానాయికిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పదహారు అణాల తెలుగు అమ్మాయి. తెలుగు బిగ్బాస్ విన్నర్ అయిన బిందు మాధవి.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. కళగు, కేడీ బిల్లా కిలాడి రంగా, తమిళుక్కు ఎన్ ఒండ్రు అళిక్కవుమ్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అలా 2019 వరకు వరుసగా చిత్రాలు చేసిన బిందు మాధవి ఆ తరువాత కారణాలు ఏమైనా వెండి తెరపై కనిపించలేదు. అలాంటిది మళ్లీ 2024లో మాయన్ చిత్రంతో ఒక రకంగా రీ ఎంట్రీ అయ్యారనే చెప్పవచ్చు. ప్రస్తుతం బ్లాక్ మెయిల్, యారుక్కుమ్ అంజాల్ పగైవనుక్కు అరుళ్వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. అందులో ఒకటి బ్లాక్ మెయిల్. జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఎం.మారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా బ్లాక్ మెయిల్ చిత్రంలో నటించిన అనుభవం గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ప్రతి కళాకారుడు కళాకారుని తమ జీవితాల్లో ఒక మార్పు తీసుకువచ్చే తరుణం కోసం ఎదురుచూస్తూనే ఉంటారన్నారు అదేవిధంగా మహిళలు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందడం కోసం సవాళతలను ఎదుర్కొంటారన్నారు. అలా దర్శకుడు ఎం మారన్ బ్లాక్మెయిల్ కథను చెప్పగానే అది తనకు బాగా కనెక్ట్ అయిన భావన కలిగిందన్నారు. అది తన కోసమే ఎదురుచూస్తున్న పాత్రగా భావించానన్నారు. దర్శకుడు రాసిన బలమైన , భావోద్వేగాలతో కూడిన ఆ పాత్ర తనలో బాధ్యతను పెంచిందన్నారు. ముఖ్యంగా పలు కథాపాత్రలతో కలిసి తన పాత్ర ఉంటుందన్నారు. జీవీ ప్రకాష్ లాంటి అద్భుతమైన నటనను ప్రదర్శించే నటుడుతో కలిసి పనిచేయటం మంచి అనుభవంగా పేర్కొన్నారు. నటి తేజు అశ్విని ,శ్రీకాంత్ తదితర నటీనటులందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారన్నారు భావోద్రేకాలతో కూడిన ఉత్సాహబహితమైన థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందని నటి బిందు మాధవి పేర్కొన్నారు. -
చలో టాంజానియా
మహేశ్బాబు టాంజానియా వెళ్లనున్నారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్ఎస్ఎమ్బీ 29’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ చిత్రీకరణను తొలుత కెన్యాలో ప్లాన్ చేశారు మేకర్స్.కానీ, ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా, సౌతాఫ్రికాలో చిత్రీకరణను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారట రాజమౌళి. ఆగస్టు రెండో వారంలో చిత్రయూనిట్ టాంజానియా వెళ్లనున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ఇదిలా ఉంటే... ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్పై వర్క్ చేస్తున్నారు రాజమౌళి. ఇందుకోసం రాజమౌళి ఓ ప్రత్యేకమైన స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారట. అలాగే టాంజానియాలో చిత్రీకరించబోయే యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. -
రాజా సాబ్తో పూరి సాబ్
హీరో ప్రభాస్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్ నిరంజన్’(2009) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రానుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు ప్రభాస్ కానీ, అటు పూరి జగన్నాథ్ కానీ ఎక్కడా స్పందించ లేదు. ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుసపాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాల్లో నటిస్తున్నారు.ఇక విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. కాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్నగర్లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్లోకి పూరి జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్, పూరి, చార్మీ కలిసి మాట్లాడుకుంటున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.రాజా సాబ్తో పూరి సాబ్ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. పుట్టినరోజు ప్రత్యేకం... ‘ది రాజా సాబ్’ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(జూలై 29) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్రం నుంచి సంజయ్ దత్ ప్రత్యేక ΄ోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. -
తెలుగు ట్రాన్స్ లేటర్గా నిత్యామీనన్.. స్టేజీపై నవ్వులే నవ్వులు!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సార్ మేడమ్'. రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్య, భర్తలుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ సేతుపతితో పాటు నిత్యామీనన్, డైరెక్టర్ పాండిరాజ్ కూడా హాజరయ్యారు.(ఇది చదవండి: 'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!)ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలుగు ట్రాన్స్లేట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. డైరెక్టర్ పాండిరాజ్ తమిళంలో మాట్లాడగా.. ఆ వ్యాఖ్యలను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసింది. 'సార్ మేడమ్ సినిమా చాలా మంచి లవ్ స్టోరీ.. భార్య, భర్తల మధ్య జరిగే గొడవ.. కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ చాలా బాగా నటించారు.. వీళ్ల కన్నా బెటర్గా ఎవరూ చేయలేరు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్' అంటూ డైరెక్టర్ పాండిరాజ్ మాటలకు ట్రాన్స్లేటర్గా నిత్యామీనన్ అందరికీ నవ్వులు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు. -
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా.. అమిర్ ఖాన్ నిర్మించారు. గతనెల 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలైన అమిర్ ఖాన్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఓటీటీకి ఇచ్చేది లేదన్న అమిర్..అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోనని అమిర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ముందుగానే ప్రకటించినట్లు యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రూ. 100 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చని తెలిపారు. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ అధికారిక యూట్యూబ్ ఛానల్.. ఆమిర్ ఖాన్ టాకీస్: జనతా కా థియేటర్లో రూ. 100కు అందుబాటులో ఉండనుంది. -
ఓటీటీకి మౌనీ రాయ్ స్పై థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్తో పాటు క్రేజీ కంటెంట్తో ఓటీటీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త జానర్లతో వస్తోన్న వెబ్ సిరీస్లు ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. స్పై జానర్లో వస్తోన్న సలాకార్ అనే ఓటీటీలో సందడి చేయనుంది.దేశ భద్రత కోసం ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన స్పై మాస్టర్ కథగా ఈ వెబ్ సిరీస్ను ఫరూక్ కబీర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేస్తూ.. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సలకార్ వెబ్ సిరీస్ను హిందీతో పాట దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ వెబ్ సిరీస్లో మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రల్లో నటించారు. -
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. పవర్హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)కాగా.. కూలీ ట్రైలర్ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. విజయ్ దేవరకొండ మదర్ ఎమోషనల్!
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కింగ్డమ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్కు విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అనిరుధ్ రవిచందర్ కింగ్డమ్ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం విజయ్ కెరీర్లో కచ్చితంగా మైల్ స్టోన్గా నిలుస్తుందని అన్నారు. మీరందరూ సినిమాను ఇష్టపడతారని ఆశిస్తున్నానని అనిరుధ్ మాట్లాడారు. అదే సమయంలో అక్కడే విజయ్ మదర్ మాధవి భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడి చిత్రం సూపర్ హిట్ కావాలని దేవుడిని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
షూటింగ్ కోసం వెళ్తే.. ముద్దు పెట్టుకోవాలని ఉందన్నాడు: నటి
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆరిస్టుల వరకు ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు. అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకూ గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చాలా మంది ఈ వేధింపులపై తిరగబడుతున్నారు. తమను వేధించిన వారిపై కేసులు పెట్టడమే కాకుండా మీడియా ముఖంగా వారి బాగోతాలను బటయపెడుతున్నారు. తాజాగా మరో నటి, ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ఫేంజెన్నిఫర్ మిస్త్రీ(Jennifer Mistry ) కూడా ఓ నిర్మాతతో తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తే..గదిలోకి రమ్మని వేధించాడని, అంతేకాకుండా తన గురించి పచ్చిగా మాట్లాడని చెప్పింది.తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో మిసెస్ రోషన్ సోధీ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్న జెన్నిఫర్ మిస్త్రీ. ఆ షో నిర్మాత అసిత్ కుమార్ మోదీ( Asit Kumarr Modi ) వల్ల ఎంతో మానసిక క్షోభను అనుభవించిందట. 2018లో షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణితో గొడవ జరిగింది. అతనిపై ఫిర్యాదు చేద్దామని నిర్మాత అసిత్ కుమార్ మోదీ దగ్గరకు వెళ్లాను. కానీ అక్కడ ఆయన స్పదన చూసి షాకయ్యాను. నా ఫిర్యాదు పట్టించుకోకుండా ‘నువ్వు చాలా సెక్సీగా ఉన్నావ్’ అన్నారు. అలాగే 2019లో షూటింగ్ కోసం సింగపూర్ వెళ్తే.. అసిత్ నన్ను గదిలోకి రమ్మన్నాడు. తనతో గదిలోకి వచ్చి విస్కీ తాగాలని బలవంతం చేశాడు. కానీ నేను పట్టించుకోలేదు. దీంతో అతను మోనికా భడోరియా (బావ్రీ) దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడారు. ఆ మరుసటి రోజు మేమంతా కాఫీ తాగుతుంటే..అతను నా దగ్గరకు వచ్చి నీ పెదాలు చాలా సెక్సీగా ఉన్నాయి. నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంది’ అని అన్నాడు. ఆయన మాటలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ అవి నాపై తీవ్ర ప్రభావం చూపాయి’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మిస్త్రీ చెప్పుకొచ్చింది. -
జాన్వీ కపూర్ వారెవ్వా.. మృణాల్ డోలు ప్రాక్టీస్
డోలు వాయించడం నేర్చుకుంటున్న మృణాల్అతిలోక సుందరిలా మెరిసిపోతున్న జాన్వీఫిట్నెస్ ఛాలెంజ్లో సమంత సూపర్ హిట్తాజ్ మహల్ని సందర్శించిన ప్రియమణి, అనన్యపట్టుచీరలో బుట్టబొమ్మలా ఐశ్వర్యా రాజేశ్మత్స్య కన్యలా మాయ చేస్తున్న ఫరియా అబ్దుల్లాఫ్రూట్స్లా డ్రస్సింగ్ చేసుకున్న రెజీనా కసాండ్రా View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Take 20 (@take20health) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్లో రెండు తెలుగు థ్రిల్లర్స్
ప్రతివారంలానే ఈసారి కూడా ఓటీటీల్లోకి దాదాపు 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో తమ్ముడు, 3 బీహెచ్కే లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్స్ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రాలేంటి? ఎందులోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.కొన్నిరోజుల క్రితం తమిళ హారర్ ఫాంటసీ సినిమా 'జిన్ ద పెట్'.. సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆగస్టు 01 నుంచి తెలుగులోనూ చూడొచ్చని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్ట్ పెట్టింది. చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)'జిన్ ద పెట్' విషయానికొస్తే.. జిన్ అనే దెయ్యం ఉన్న పెట్టెని శక్తి(ముగెన్ రావ్).. తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని వల్ల తన ఫ్యామిలీ కష్టాలపాలవుతుందని అనుకుంటాడు. కానీ బాక్స్లోని దెయ్యం వీళ్లకు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం సంగతేంటి? వీళ్లకు ఎందుకు సాయం చేస్తుందనేది మిగతా స్టోరీ.'నెట్వర్క్' అనే టెక్నో థ్రిల్లర్ సిరీస్.. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ్ , శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించారు. మనకు రోజువారీ ఫోన్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఒకవేళ మన ఫోన్లో సిగ్నల్ రోజంతా మిస్ అయితే? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలా నలుగురికి జరిగితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో తీసిన తెలుగు సిరీస్ ఇది. థ్రిల్లర్స్ కావాలనుకునేవాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
'కింగ్డమ్ మూవీ.. నా లైఫ్లో ఫస్ట్ క్యారవాన్ సినిమా'
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కింగ్డమ్ మూవీ మేకర్స్ హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్కు హాజరైన కింగ్డమ్ నటుడు వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించడం తన అదృష్టమని అన్నారు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్యారవాన్ దొరికిన చిత్రం కింగ్డమ్ మాత్రమేనని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేశ్ కింగడమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వెంకటేశ్ మాట్లాడుతూ..'హలో హైదరాబాద్.. ఇలాంటి పెద్ద క్రౌడ్ను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైమ్. నాది కేరళ.. నాపేరు వెంకటేశ్.. మలయాళ ఇండస్ట్రీలో ఒక సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత చిన్నపాత్రలు, తమిళ సినిమాలో హీరో.. ఈరోజు కింగ్డమ్. ఈ రోజు క్షణాలకు నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈ జర్నీ పట్ల నాకు సంతోషంగా ఉంది. నాగవంశీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా లైఫ్లో క్యారవాన్ డోర్ దొరికిన మొదటి చిత్రం. ఇదే నాకు పెద్ద విషయం. మళ్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో పనిచేయాలి. భవిష్యత్తులో హీరోగా చేయాలి' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఆ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సంజయ్ దత్ బర్త్ డే కావడంతో స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ పోస్టర్లో సంజయ్ దత్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. దక్షిణాది సినిమాలతో సంజయ్ దత్ బిజీగా ఉన్న సంజయ్ దత్.. బాలీవుడ్లోనూ 'బాఘి 4', 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్- 2' ఆగస్టు 1 న థియేటర్లలోకి రిలీజ్ కానుంది.Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba - @DuttSanjay a very Happy Birthday 💥💥Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/PFgPzOnqea— The RajaSaab (@rajasaabmovie) July 29, 2025 -
సమంత క్రేజీ ఛాలెంజ్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్లలో చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. అంటే షూటింగ్స్, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిరోజూ జిమ్కి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. గతంలో చాలాసార్లు జిమ్ వీడియోలు పోస్ట్ చేసేది. 100 కిలోలకు పైనే బరువులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్లో పాల్గొంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.'టేక్ 20 హెల్త్' పేరుతో పాడ్ కాస్ట్ సిరీస్ చేస్తున్న సమంత.. ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి వీడియోలు పోస్ట్ చేస్తోంది. తాజాగా 'డెడ్ హ్యాంగ్' ఛాలెంజ్ పూర్తి చేసింది. అంటే 90 సెకన్ల పాటు ఓ రాడ్కి వేలాడాల్సి ఉంటుంది. ఇందులో సమంతతో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొన్నారు. వీళ్లంతా దాన్ని పూర్తి చేశారు కూడా.(ఇదీ చదవండి: 'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!)'మీరు ఎలా కనిపిస్తున్నారనేది ముఖ్యం కాదు. మీ వారసత్వం ఏంటనేది కూడా ముఖ్యం కాదు. సెల్ఫీలు షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారనేదే ముఖ్యం' అని సామ్ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ వీడియో సమంత లుక్ చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత బక్కగా అయిపోయిందేంటి అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ పరంగా సమంత చేతిలో కొత్త సినిమాలేం చేయట్లేదు. 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ లైన్లో ఉంది గానీ ఇది ఆగిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్గా నిర్మాతగా చేసిన తొలి మూవీ 'శుభం' రిలీజైంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. త్వరలో నిర్మాత కమ్ హీరోయిన్ గా ఓ మూవీ మొదలుపెట్టనుందని, నందిని రెడ్డి దర్శకురాలు అని టాక్ నడుస్తోంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. అలానే దర్శకుడు రాజ్తో సమంత డేటింగ్లో ఉందనే పుకార్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్) View this post on Instagram A post shared by Take 20 (@take20health) -
ఆంధ్రా గో బ్యాక్.. ఫిలిం ఛాంబర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకుని పోయేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాశం యాదగిరి గొడవకు దిగారు, ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది.ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చిన తెలంగాణ వాదులు.. ఛాంబర్లో సినారె ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. -
'భోళా..' దెబ్బకొట్టినా మణిశర్మ కొడుక్కి బంపరాఫర్!
ప్రస్తుతం దర్శక నిర్మాతలందరూ పాన్ ఇండియా సినిమాలు వెంటపడుతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ వైపే చూస్తున్నారు. దాదాపు వీళ్లలో ఎవరో ఒకరు కావాలని పట్టుబడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీ కోసం మణిశర్మ కొడుక్కి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా?టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబుతో పాటు స్టార్ హీరోల సినిమాలకు ఈయన మ్యూజిక్ ఇచ్చారు. కానీ ట్రెండ్ మారడంతో ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి. మణిశర్మ వారసుడు మహతి స్వరసాగర్ కూడా మ్యూజిక్ డైరెక్టరే. 2015 నుంచి ఆడపాదడపా దక్షిణాదిలో మూవీస్ చేస్తున్నారు. ఛలో, భీష్మ చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అలా చిరంజీవితో 'భోళా శంకర్'కి మ్యూజిక్ ఇచ్చే అవకాశం దక్కింది.(ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్)కానీ 'భోళా..' పాటలు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ పెద్దగా ఇంప్రెసివ్గా లేకపోవడం, మూవీ కూడా ఫ్లాప్ కావడంతో మహతికి తర్వాత పెద్ద ప్రాజెక్టులేం రాలేదు. అలాంటిది ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కోసం మహతి స్వరసాగర్ని తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ త్వరలో దీనిపై క్లారిటీ రావొచ్చు. ఓ రకంగా చూస్తే మహతికి ఇది గోల్డెన్ ఛాన్సే. తన సంగీతంతో మెప్పిస్తే మాత్రం మంచి గుర్తింపు గ్యారంటీ.పూరీ-సేతుపతి ప్రాజెక్ట్ విషయానికొస్తే ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. సంయుక్త హీరోయిన్గా చేస్తోంది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిల్యూర్స్తో డీలా పడిన పూరీ జగన్నాథ్.. వీలైనంత వేగంగా సేతుపతి మూవీని పూర్తి చేసి డైరెక్టర్గా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అలానే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్) -
ఓటీటీలో 'సిద్ధార్థ్ ' సినిమా.. అఫీషియల్ ప్రకటన
సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా '3BHK' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శ్రీగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 7న విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్లో బాగా ఆకర్షించింది. కథ కాస్త నెమ్మదిగా రన్ అవుతుందని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శరత్కుమార్, దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు తదితరులు నటించారు.థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్న '3 బీహెచ్కే'.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగష్టు 1 నుంచి సింప్లీ సౌత్(Simply South) ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. తమిళ్, తెలుగులో విడుదల కానుంది. కానీ, భారత్లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా చూసే ఛాన్స్ లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉన్నవారికి మాత్రమే ఆ అవకాశం ఉంది. అయితే, అదేరోజున అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం భారత్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఆ తేదీన రాకుంటే.. ఆగష్టు 8న తప్పకుండా విడుదల కావచ్చని టాక్ ఉంది.నేటి సమాజంలో సొంతిల్లు ఉండాలని అందరికీ కోరిక ఉంటుంది. దానిని ఒక గౌరవంగా అనుకుంటాం కూడా.. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ కలను సాధించుకోవడం అంత సులువు కాదని చెప్పవచ్చు. సొంత ఇంటి కోసం వారు చేసే త్యాగాలు, కష్టాలు ఇలా ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఎంతో భావోద్వేంగా వారి ప్రయాణం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తోనే '3BHK' చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కాస్త నెమ్మదిగా సాగినా.. సినిమా అందరికీ నచ్చుతుంది. -
డేవిడ్ వార్నర్కి రాజమౌళి స్పెషల్ గిఫ్ట్
డేవిడ్ వార్నర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే పేరుకే ఆస్ట్రేలియా క్రికెటర్ గానీ తెలుగు సినిమాలంటే మామూలు ప్రేమ కాదు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ఆడినప్పటి నుంచి ఈ ప్రేమ మొదలైంది. ఇక లాక్ డౌన్లో అప్పటి టాలీవుడ్ హిట్ సాంగ్స్ అన్నింటికీ రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసి తెగ వైరల్ అయిపోయాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్)ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతానికి వార్నర్ క్రికెట్ ఆడట్లేదు. కొన్నాళ్ల క్రితమే అంతర్జాతీయ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఈ క్రమంలోనే గతంలో తీసుకున్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. 'హాయ్ వార్నర్, మహిస్మతి రాజులా మారాల్సిన సమయం ఆసన్నమైంది. రాయల్ హెల్మెట్ నీకు పంపిస్తా' అని చెప్పారు. స్పందించిన వార్నర్.. 'యెస్ ప్లీజ్ సర్' అని రిప్లై ఇచ్చాడు.గతంలో రాజమౌళి-వార్నర్ కలిసి ఓ ప్రమోషనల్ యాడ్లో నటించారు. అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కొనసాగుతున్నట్లు ఉంది. ఇప్పుడు వార్నర్కి రాజమౌళి గిఫ్ట్ ఇస్తానని మాట ఇవ్వడం లాంటివి చూస్తుంటే రీ రిలీజ్ సందర్భంగా అంతర్జాతీయంగానూ 'బాహుబలి'ని ప్రమోట్ చేసేందుకు వార్నర్తో కలిసి పెద్ద ప్లానే వేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబరులో 'బాహుబలి' రెండు భాగాల్ని కలిపి ఓ పార్ట్గా రీ రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
అనిరుధ్ ఫైనల్ సంగీత కచేరి.. వివరాలు ఇవే
సంగీత దర్శకుడిగా దక్షిణాదిని దున్నేస్తున్న రాక్స్టార్ అనిరుధ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ , జైలర్–2 చిత్రంతో పాటు కింగ్డమ్ ప్రాజెక్ట్కు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కింగ్డమ్, కూలీ చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్లాయి. రాక్స్టార్ అనిరుధ్ మరో పక్క సంగీత కచేరీలతోనూ దుమ్ము రేపుతున్నారు. ఈయన ఇప్పటికే పలు దేశాలలో హుకుమ్ చెన్నై ఇసై(సంగీతం) పేరుతో సంగీత కచేరీలను నిర్వహించారు. ఫైనల్గా ఆగస్టు 23వ తేదీన చెన్నైలో సంగీత కచేరీని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనిరుధ్ జైలర్ చిత్రంలో రజనీకాంత్ చెప్పిన హుకుమ్ అనే డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అదే పేరుతో అనిరుధ్ హుకుమ్ చెన్నై ఇసై పేరుతో సంగీత కచేరీలను నిర్వహిస్తున్నారు. చెన్నై అభిమానుల కోరిక మేరకు ఇప్పుడు స్థానిక సముద్ర తీరంలోని కూవంరూర్ ప్రాంతంలో ఉన్న మార్గ్ స్వర్ణభూమి ప్రాంతంలో భారీ ఎత్తున సంగీత కచేరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది ఇంత వరకూ చెన్నై సంగీత ప్రియులు కనీవినీ ఎరుగనటువంటి రీతిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంగీత కచేరీకి సంబంధించిన పనులు ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయని అనిరుధ్ తెలిపారు. అదే విధంగా ఆగస్టు 4వ తేదీ నుంచి టిక్కెట్ల విక్రయం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
ప్రెగ్నెన్సీతో మెగా కోడలు.. కొత్త సినిమా టీజర్ రిలీజ్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. మొన్నీమధ్య భర్త వరుణ్ తేజ్తో కలిసి పుట్టబోయే బిడ్డ కోసం దుబాయిలో షాపింగ్ కూడా చేసొచ్చారు. అలానే లావణ్య బేబీ బంప్తో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరే ఇదంతా పక్కనబెడితే ఈమె నటించిన లేటెస్ట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: మరోసారి హంగామా చేసిన నటి కల్పిక)టీజర్ బట్టి చూస్తుంటే ఇది భార్యభర్తల స్టోరీతో తీసిన ఫన్నీ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. భార్యగా లావణ్య, భర్తగా దేవ్ మోహన్ నటించారు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే మనం ఇక కలిసుండలేం అని భర్త అంటే, అతడిని ఇంట్లోనే కట్టిపడేసి ఏం చేసిందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఇందులో లావణ్య, దేవ్ మోహన్తో పాటు వీటీవీ గణేశ్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ తదితరులు నటించారు.తాతినేని సత్య చాలాకాలం తర్వాత తెలుగులో ఈ సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. ప్రస్తుతానికైతే టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్తో పాటు మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో? ఇప్పటికైతే లావణ్య త్రిపాఠి చేతిలో ఉన్న తెలుగు సినిమా ఇదొక్కటే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి బిడ్డ పుట్టిన తర్వాత తెలుగులో మూవీస్ చేస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్) -
మరోసారి హంగామా చేసిన నటి కల్పిక
దాదాపు నెలరోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్లో అర్థరాత్రి నటి కల్పిక హంగామా చేసింది. ఈ విషయమై ఆమెపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి కల్పిక.. హైదరాబాద్ సమీపంలో మొయినాబాద్లో ఉన్న ఓ రిసార్ట్లో హడావుడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్కి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా వచ్చిన కల్పిక.. రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ తాళాల్ని మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం లాంటివి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా)అయితే తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని కల్పిక.. ఈ వివాదంపై స్పందించింది. ఓ వీడియోని కూడా రికార్డ్ చేసింది. రిసార్టులో సెల్ఫోన్ సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే తనతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడని చెప్పుకొచ్చింది. ఎంత నిదానంగా చెప్పినా వినకపోవడంతో, మేనేజర్తో గొడవకు దిగాల్సి వచ్చిందని చెప్పింది.గత కొన్నాళ్లుగా కల్పిక సరిగా సినిమాలు చేయడమే లేదు. అలాంటిది ఇప్పుడు వరస వివాదాల్లో నిలిచి ఈమె వార్తల్లో నిలిచింది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకే చేస్తుందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే త్వరలో ప్రారంభమయ్యే బిగ్బాస్ కొత్త సీజన్లో కల్పిక కూడా ఓ కంటెస్టెంట్గా ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. అందుకేనా ఈ హడావుడి అంతా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్) -
కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్
'కింగ్డమ్' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ చేశారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలానే 'రగిలే రగిలే' అని సాగే ఓ పాటని పాడాడు. ఇప్పుడు ఆ గీతానికి సంబంధించిన లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఈ సాంగ్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా)ఈ మూవీ అంతా అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ యాక్షన్ స్టోరీతో తీశారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్తో ఆ క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు కాగా, సత్యదేవ్ అన్నగా నటించాడు. దాదాపు శ్రీలంకలోనే సినిమా అంతా చిత్రీకరించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రిలీజ్ చేసిన 'రగిలే రగిలే' పాట బహుశా క్లైమాక్స్లో ఉండొచ్చనిపిస్తోంది. (ఇదీ చదవండి: అల్లు అరవింద్కు 'మహావతార్ నరసింహా' వరం) -
రవితేజ థియేటర్ ప్రారంభం.. ఫస్ట్ సినిమా ఏదంటే..?
మాస్మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏషియన్ సినిమాస్ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్లో లగ్జరీ మల్టీఫ్లెక్స్ను ఆయన నిర్మించారు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. తాజాగా రవితేజ్ కూడా ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో మల్టీఫ్లెక్స్ను ఏర్పాటు చేశారు. జులై 31న ప్రారంభోత్సవం జరగనుంది.ART (ఏషియన్ రవితేజ) మల్టీఫ్లెక్స్లో తొలి సినిమా 'కింగ్డమ్' ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈస్ట్ హైదరాబాద్ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్గా ART నిలవనుంది. సుమారు 60 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్.. ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించే విధంగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయింది.రవితేజ థియేటర్లో 'కింగ్డమ్' తొలి సినిమా కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్లో భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యముడు విజయం సాధించాలి: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రతి ఏడాది వందల చిత్రాలొస్తున్నా, అందులో కొంతమందికి మాత్రమే సక్సెస్ వస్తోంది. చిన్న సినిమాలు ఈ మధ్య అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. జగదీష్ ఆమంచి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షక. శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్లో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలను కే మ్యూజిక్ సీఈఓ ప్రియాంక, బెక్కెం వేణుగోపాల్, మల్లిక విడుదల చేశారు. ఈ సందర్భంగా జగదీష్ ఆమంచి మాట్లాడుతూ–‘‘ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఈ పాయింట్తో ‘యముడు’ తీశాం’’ అని పేర్కొన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కెమెరామెన్ విష్ణు, శ్రావణి శెట్టి, మల్లిక, ఆకాష్, భవానీ రాకేష్, స్క్రీన్ ప్లే రైటర్ శివ కోరారు. -
కబడ్డీ నేపథ్యంలో...
విజయ రామరాజు, సిజారోజ్ జోడీగా నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించారు. ఈ సినిమా టీజర్ని డైరెక్టర్ హను రాఘవపూడి విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ–‘‘12 ఏళ్ల వయసులో అర్జున్ చక్రవర్తిగారి వద్దకు నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్లినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు.ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. అలా ఆ కథే నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. ఈ సినిమాకి 46 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అని తెలిపారు. విజయ రామరాజు మాట్లాడుతూ– ‘‘నేను ఏడాదిన్నర పాటు ప్రో కబడ్డీ టీమ్స్తో ప్రయాణం చేసి, కబడ్డీ నేర్చుకుని ఈ సినిమా చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించాను’’ అన్నారు శ్రీని గుబ్బల. ఈ కార్యక్రమంలో సిజ్జా రోజ్, సంగీత దర్శకుడు విగ్నేష్ భాస్కరన్, కెమెరామెన్ జగదీష్, నటుడు దుర్గేష్ మాట్లాడారు. -
'ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం'.. ఫ్యాన్స్ను తలచుకుని విజయ్ దేవరకొండ ఎమోషనల్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్విహంచారు. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మరో రెండు రోజుల్లో థియేటర్లో కలుస్తాం. ఓవైపు టెన్షన్గా.. మరోవైపు హ్యాపీగా ఉంది. ఈ రోజు సినిమా కంటే మీ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు దేవుడిచ్చిన వరం. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మీ ప్రేమలో మార్పు ఉండదు. ఈ రోజు దాదాపు 2000 మంది ఫాన్స్ను కలిశా. అన్నా ఈసారి మనం కొడుతున్నాం అన్నా.. మనం హిట్ కొడుతున్నాం.. టాప్లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం ఓన్ చేసుకుంటేనే వస్తుంది. ఎవరో కుంభమేళాకి వెళ్లి నా పోస్టర్తో మునిగి నేను హిట్ కొట్టాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతన్ని కలుస్తా. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ కానీ.. మీరు గౌరవించే సినిమాలే చేస్తా. వ్యక్తిగతంగా మీ అందరికీ నా వంతుగా ఏదో ఒక మంచి పని చేస్తా. ఈ రెండూ నా బాధ్యతలు' అని ఫ్యాన్స్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. Trailer వచ్చాక చాలా మంచి Response వచ్చింది...వాళ్ళ DP లు చూస్తే... Superstar... Icon Star...Tiger...మీ అందరినీ నేను కలవకపోవచ్చు కానీ..మీందరికి ఏదొక Positive Contribution చేసే పోతా..#VijayDeverakonda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/OAGAgfBUWe— Suresh PRO (@SureshPRO_) July 28, 2025 -
జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 ట్రైలర్ చూశారా?
సినీ ప్రియుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న విజువల్ వండర్ అవతార్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2022లో విడుదలైన అవతార్-2.. ది వే ఆఫ్ వాటర్ సైతం ప్రేక్షకులను అలరించింది. ఈ అవతార్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. దీంతో ఈ ఏడాదిలో మరో సినిమాతో జేమ్స్ కామెరూన్ రెడీ అయిపోయారు. అవతార్ సిరీస్లో భాగంగా అవతార్.. ఫైర్ అండ్ యాష్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అవతార్ పార్ట్-3 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ట్రైలర్ చూస్తుంటే మరింత మరో అద్భుతమైన విజువల్ వండర్గా రికార్డ్ సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. -
'ఎప్పటికీ నేను మీ బక్కోడు'.. తెలుగులో అనిరుధ్ అదిరిపోయే స్పీచ్!
విజయ్ దేవరకొండ వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఇక రిలీజ్కు మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ఈవెంట్కు కింగ్డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో మాట్లాడి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.అనిరుధ్ మాట్లాడుతూ..'ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. గత 12 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను మీ కొడుకులా చూసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్నే.. అలాగే మీ బక్కోడు..' అంటూ తెలుగులో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Once again Proved Telugu audience >>>> Any industry 🥵🥵🔥🔥#VijayDeverakomda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/S6eUwfUqLq— Srinivas (@srinivasrtfan) July 28, 2025 -
మరో ఓటీటీకి సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025 -
రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కూలీ'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోనికా సాంగ్తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా.. ఇటీవలే విడుదలైన పవర్ హౌస్ సాంగ్ రజినీకాంత్ ఫ్యాన్స్ను, ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL— Sun Pictures (@sunpictures) July 28, 2025 -
బుల్లితెరపై తొలిసారి రంగస్థలం మూవీ.. దాదాపు ఏడేళ్ల తర్వాత!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం రంగస్థలం. ఈ మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాశ్రాజ్ కీలక పాత్రలు పోషించారు.అయితే రంగస్థలం విడుదలై ఇప్పటికే ఏడేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగులో బుల్లితెరపై అలరించిన ఈ సినిమా.. ఇప్పటివరకు హిందీ మాత్రం రాలేదు. తాజాగా రంగస్థలం సినిమాను ఏడేళ్ల తర్వాత హిందీలో బుల్లితెరపై సందడి చేయనుంది. ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు గోల్ట్ మైన్స్ ఛానెల్లో రంగస్థలం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ట్విటర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో బాలీవుడ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #Rangasthalam (Hindi) | 24th August Sunday 8:00 PM | Tv Par Pehli Baar | Primere Only On #Goldmines TV Channel#RangasthalamHindi #rangasthalammovie @AlwaysRamCharan @Samanthaprabhu2 #JagapathiBabu #AnasuyaBharadwaj @prakashraaj #RamCharan #samantharuthprabhu pic.twitter.com/4OebzT3gJs— Goldmines Telefilms (@GTelefilms) July 28, 2025 -
మేడపై 'మసూద' బ్యూటీ.. అనసూయ కళ్లు చూశారా?
కళ్లతో మాయ చేస్తున్న యాంకర్ అనసూయమేడపై 'మసూద' బ్యూటీ బాంధవి వయ్యారాలుగ్లామర్తో రచ్చ లేపుతున్న తమన్నా భాటియావర్షా కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈషా రెబ్బాఅవకాశాల కోసం తెగ కష్టపడుతున్న నభా నటేశ్బొద్దుగమ్మ అరియానా గ్లామరస్ డ్యాన్స్ప్రగ్యా జైస్వాల్ రొమాంటిక్ పోజులు.. చూస్తే అంతే View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) -
మాంచెస్టర్లో ఇంగ్లాండ్ ప్లేయర్ల హైడ్రామా.. బెన్ స్టోక్స్పై అమితాబ్ సెటైర్లు!
టీమిండియా నాలుగో టెస్ట్ మ్యాచ్పై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో చివర్లో జరిగిన హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా అమితాబ్ రియాక్ట్ అయ్యారు. ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్కు తనదైన శైలిలో క్యాప్షన్ రాసుకొచ్చారు. అరే.. మనోడు తెల్లోడికి టీకా ఇచ్చిపడేశాడు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టంట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఈ పోస్ట్ రీపోస్ట్ చేస్తున్నారు.అయితే ఫోర్ట్ టెస్ట్లో జడేజా, సుందర్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రాకు అంగీకరించాలని జడేజాను కోరాడు. కానీ జడేజా, సుందర్ మ్యాచ్ను ముగించేందుకు నిరాకరించారు. అప్పటికీ ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారత బ్యాట్స్మెన్ డ్రాకు నిరాకరించారు. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ను తిరస్కరించాక.. జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో టెస్ట్ డ్రాగా ముగించారు. మ్యాచ్ చివర్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన హంగామాతో సోషల్ మీడియాలో ట్రోల్ పెద్దఎత్తున వైరలయ్యాయి. కాగా.. ఈ మ్యాచ్లో జడేజా 107 పరుగులు సాధించగా.. వాషింగ్టన్ సుందర్ 101 రన్స్తో నాటౌట్గా నిలిచారు.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ సెక్షన్ 84 అనే చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో నిమ్రత్ కౌర్, డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ పార్ట్-2లో నటించనున్నారు. Take !?? अरे गोरे को टिका (tika - sorry tayka diya ) दिया रे !!🤣 https://t.co/1ybakYvNFM— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2025 -
తమన్-సిద్ శ్రీరామ్ 'మల్లిక గంధ' సాంగ్ రిలీజ్
'టిల్లు' సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న సిద్ధు చేస్తున్న లేటెస్ట్ సినిమా 'తెలుగు కదా'. స్టైలిష్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబరు 17న మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఇప్పుడు మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజ్ చేశారు. 'మల్లిక గంధ' అంటూ సాగే పాటని సిద్ శ్రీరామ్ పాడాడు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా కల్యాణి.. అలరించేలా 'లోకా' టీజర్)తమన్ స్వరపరిచిన ఈ మెలోడీ ఓవైపు వినసొంపుగా ఉంటూనే బీట్ కూడా వినబడుతోంది. సిద్ధు-రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందించాడు. చూస్తుంటే తమన్ స్వరపరిచిన తొలిపాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
నీతో పరిచయానికి ఏడేళ్లు.. ఆ బంధాన్ని గుర్తు చేసుకున్న హీరోయిన్ మాజీ ప్రియుడు!
బాలీవుడ్ నటి, ప్రపంచసుందరి సుస్మితాన్ సేన్ పేరు అందరికీ సుపరిచితమే. బాలీవుడ్లో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన సుస్మితా ఆర్య అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఆ తర్వాత తాలి అనే వెబ్ సిరీస్తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ అయిన సుస్మితా సేన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం విఫలమైంది. చాలామందితో డేటింగ్ చేసిన ఆమె.. ఎవరినీ కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్లో పడ్డప్పటికీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేకపోయింది. ఆ తర్వాత మోడల్ రోహ్మన్ షాతో ప్రేమలో పడింది. కానీ వీరిద్దరు ప్రేమ మూడేళ్లు కూడా నిలవలేదు. 2018లో మొదలైన వీరి పరిచయం మూడేళ్లకే బ్రేకప్ అయింది. అయినప్పటికీ వీరిద్దరు ఫ్రెండ్స్గానే కొనసాగుతున్నారు.ఈ సందర్భంగా మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేటికి మన పరిచయానికి ఏడేళ్లు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సుస్మితా సేన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశారు. జీవితంలో అనే విషయాలను నీ వద్ద నేర్చుకున్నానని పోస్ట్లో రాసుకొచ్చారు. నీతో పరిచయం తర్వాత నా జీవితం చాలా మారిపోయిందని ఇన్స్టాలో పంచుకున్నారు.రోహ్మన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మన స్నేహానికి నేటికి 7 సంవత్సరాలు. కొన్ని కథలు వాటి శీర్షికలను మించిపోతాయి. కానీ వాటి అర్థం ఉండదు. నేను మీకు చెస్ నేర్పించాను. కానీ మీరు నన్ను కనికరం లేకుండా ఓడించారు. మీరు నాకు ఈత నేర్పించారు. నా లైఫ్లో బెస్ట్ హెయిర్ కట్స్ చేసినందుకు నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను. మేము మా పాత్రలు, భయాలు, బలాలను కూడా మార్చుకున్నాం. నీ ప్రేమకు, నీ నిశ్శబ్ద స్నేహానికి కృతజ్ఞతలు సుస్మితా సేన్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుష్మితా సేన్తో ఉన్న ఫోటోలు ఇద్దరు ఒకే జాకెట్ ధరించి కనిపించారు. View this post on Instagram A post shared by rohman shawl (@rohmanshawl) -
ఇంట్రెస్టింగ్గా 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో వరస సినిమాలు చేస్తున్నాడు. హీరో రానాతో పాటు 'కాంత' అనే మూవీని నిర్మిస్తున్న దుల్కర్.. అందులో హీరోగానూ చేస్తున్నాడు. 1950-60ల్లో ఓ హీరో-డైరెక్టర్ మధ్య జరిగే ఇగో క్లాష్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు తెలుగులోనే 'ఆకాశంలో ఒక తార' చిత్రంలోనూ నటిస్తున్నాడు. సోమవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమాలో దుల్కర్ హీరో కాగా పవన్ సాధినేని దర్శకుడు. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నాడు. గ్లింప్స్లో అలానే దుల్కర్ని ఓ సాధారణ కుర్రాడిగా చూపించారు. బ్యూటీఫుల్ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ పల్లెటూరికి చెందిన కుర్రాడు.. అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కల ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే స్టోరీ అని కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చాయి. టీజర్, ట్రైలర్ వస్తే ఇది నిజమా కాదా అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
'కోట్ల రూపాయల అభిమానం.. చనిపోయే ముందు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చింది'
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. సంజయ్ దత్కు కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు.. దక్షిణాదిలోనూ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో ది రాజాసాబ్, అఖండ-2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్లో దురంధర్, కన్నడలో కెడి - ది డెవిల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు సంజయ్ దత్.అయితే తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సంజయ్ దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ అభిమాని తనకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిందని వెల్లడించారు. ఓ మహిళా అభిమాని తాను చనిపోయేముందు తన ఆస్తినంతా నా పేరుమీద రాసిందని పంచుకున్నారు. అయితే ఆ డబ్బుతో తాను ఏమి చేశాడో కూడా వెల్లడించారు. ఆ ఆస్తి మొత్తాన్ని మహిళ కుటుంబానికి తిరిగి ఇచ్చానని సంజయ్ దత్ తెలిపారు.కాగా..సంజయ్ దత్ 1981లో రాకీ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత విధాత, నామ్, సాజన్, ఖల్ నాయక్, వాస్తవ్ లాంటి చిత్రాలలో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ సినిమాల్లో అలరిస్తున్నారు. -
సూపర్ హీరోగా కల్యాణి.. అలరించేలా 'లోకా' టీజర్
ఇప్పటివరకు పలు భాషల్లో సూపర్ హీరో తరహా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ని లీడ్ రోల్లో పెట్టి ఇలాంటి మూవీని మలయాళంలో తీశారు. అదే 'లోకా'. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)'హలో', 'చిత్రలహరి' లాంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన కల్యాణి ప్రియదర్శన్.. తర్వాత పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది. మిడ్ రేంజ్ మూవీస్లో నటిస్తూ కెరీర్ పరంగా బాగానే ఉంది. అయితే ఈమెని పెట్టి సూపర్ హీరో జానర్ మూవీ తీయడం విశేషం. 'లోకా'ని తెలుగులోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కల్యాణికి జోడిగా 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
అమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు.. ఎందుకు వచ్చారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో అభిమానులను అలరించారు. గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2018లో రిలీజైన సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.అయితే సినిమాల సంగతి పక్కనపెడితే.. అమిర్ ఖాన్ ఇంటికి ఐపీఎస్ అధికారులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అమిర్ ఇంటికి ఐపీఎస్ అధికారులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారని ఆరా తీస్తున్నారు. అంతమంది ఐపీఎస్ అధికారులు రావడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ టీమ్ స్పందించింది. ఐపీఎస్ అధికారుల ఆకస్మికంగా అమిర్ ఇంటికి రావడంపై కచ్చితమైన వివరాలు తెలియవని అమిర్ టీమ్ తెలిపింది. మేము కూడా అమిర్ ఖాన్ సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఐపీఎస్ శిక్షణార్థులు ఆమిర్ ఖాన్తో సమావేశం అయ్యారని సమాచారం. వారందరికీ హీరో తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆ బృందంలోని ఒక సభ్యుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
విజయ్ దేవరకొండతో ఫ్యాన్స్ మీట్.. బిర్యానీతో పాటు సెల్ఫీలు
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన అభిమానులతో కొంత సమయం పాటు సరదాగ గడిపారు. తను నటించిన కొత్త సినిమా కింగ్డమ్ విడుదల సందర్భంగా వారందరినీ కలుసుకున్నారు. అందుకు వేదికగా హైదరాబాద్లోని సారథి స్టూడియో నిలిచింది. తమ అభిమాన హీరోను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్లో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులే పాల్గొన్నారు. వాస్తవంగా ఆయన్ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతారని తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ కూడా వారిని ఎంతమాత్రం నిరూత్సాహపరచలేదు. అక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ అందరితో ఫోటోలు దిగారు. వారందరూ కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా.. చికెన్తో పాటు బగారా అన్నం రెడీ చేపించారు. తమ పట్ల విజయ్ చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అయ్యారు. నేడు (జులై 28) కింగ్డమ్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. సాయింత్రం 5గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విజయ్ ఫ్యాన్స్ పాల్గొననున్నారు.‘కింగ్డమ్’ చిత్రం జులై 31న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటి వరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.ఫోటో షూట్ అయ్యాక ఫ్యాన్ కీ అన్నంపెట్టడం🫡👌🏻అన్నదానం కీ మించింది ఏది లేదు🥹❤️ఫుడ్ టెస్ట్ అదిరింది సూపర్ థాంక్స్ @TheDeverakonda అన్న❤️🫂#KingDom #VijayDeverakonda pic.twitter.com/LwCYRikqIn— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) July 28, 2025 -
దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్
దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. 'మహానటి', 'సీతారామం' చిత్రాల దెబ్బకు స్ట్రెయిట్ తెలుగు హీరోల కంటే బోలెడంత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే చేసిన సినిమా 'కాంత'. ప్రముఖ హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. తాజాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ.. 'అర్జున్ చక్రవర్తి' టీజర్ రిలీజ్)గతంలో 'మహానటి' సినిమాలో శివాజీ గణేషన్గా దుల్కర్ సల్మాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు 'కాంత' మూవీలోనూ 1960ల్లో ఉంటే ఓ స్టార్ హీరోగా నటించాడు. టీజర్ బట్టి చూస్తే..దుల్కర్ ఓ స్టార్ హీరో. సముద్రఖని ఓ దర్శకుడు. వీళ్లిద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి మెలిసి ఉంటారు. కానీ తర్వాత గొడవలు వచ్చి విడిపోతారు. అలాంటిది సముద్రఖని తీసే 'శాంత' అనే హారర్ మూవీలో దుల్కర్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లు. ఇక ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దుల్కర్-సముద్రఖని మధ్య ఏం జరిగింది? అనేదే సినిమాలా అనిపిస్తుంది.టీజర్ చూస్తుంటేనే సమ్థింగ్ డిఫరెంట్ మూవీలా ఉండబోతుందనే ఫీల్ వచ్చింది. ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. సెప్టెంబరు 12న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చూస్తుంటే దుల్కర్ మరో హిట్ కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. టీజర్ రిలీజ్
స్పోర్ట్స్ డ్రామాలు సరిగా తీయాలే గానీ మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. అలా గతంలో వచ్చిన 'జెర్సీ', 'భాగ్ మిల్కా భాగ్' తదితర చిత్రాల తరహాలో ఇప్పుడు తెలుగులో ఓ మూవీని తెరకెక్కించారు. అదే 'అర్జున్ చక్రవర్తి'. కబడ్డీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్ర టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా)1985,87,89 ప్రాంతంలో భారత్ తరఫున ఆడి గుర్తింపు దక్కని ఓ కబడ్డీ ప్లేయర్ స్టోరీతో ఈ సినిమాని తీసినట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. టీజర్ చూస్తుంటే స్టోరీతో పాటు విజువల్స్ ఇంప్రెసివ్గా అనిపించాయి. లీడ్ యాక్టర్గా చేసిన విజయ్ రామరాజు ఆకట్టుకున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతానికి టీజర్ మాత్రమే విడుదల చేశారు. త్వరలో మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.కేవలం నిమిషం టీజర్తోనే 'అర్జున్ చక్రవర్తి' ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. భావోద్వేగాలు, బలమైన కథ, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
హన్సిక డివోర్స్ లో నిజమెంత..!
-
'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రాబోయే సినిమాల్లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనితో పాటు విజయ్ సేతుపతి 'సార్ మేడమ్', ఉసురే లాంటి డబ్బింగ్ చిత్రాలు.. సన్ ఆఫ్ సర్దార్ 2 అనే హిందీ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. నితిన్ 'తమ్ముడు' ఈ వీకెండ్లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికైతే ఇదొక్కటే స్ట్రెయిట్ తెలుగు మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. దీనితో పాటు బకైటి అనే హిందీ సిరీస్ కొంతలో కొంత ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. మరి శుక్రవారంనాడు సడన్గా ఓటీటీల్లో కొత్త మూవీస్ స్ట్రీమింగ్ అవుతాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీల్లో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 28 నుంచి ఆగస్టు 03 వరకు)నెట్ఫ్లిక్స్ఇరాన్ చెఫ్ థాయ్ లాంట్ వర్సెస్ ఆసియా (రియాలిటీ సిరీస్) - జూలై 28ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ మూవీ) - జూలై 29WWE: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29కన్వర్జేషన్స్ విత్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 30అన్ స్పీకబుల్ సిన్స్ (స్పానిష్ సిరీస్) - జూలై 30యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ సినిమా) - జూలై 31గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్) - జూలై 31లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31మార్క్డ్ (జులు సిరీస్) - జూలై 31తమ్ముడు (తెలుగు సినిమా) - ఆగస్టు 01అమెజాన్ ప్రైమ్లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 28చెక్ (తెలుగు సినిమా) - జూలై 28హాట్స్టార్అడ్డా ఎక్స్ట్రీమ్ బాటిల్ (రియాలిటీ సిరీస్) - జూలై 28క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 29బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 28పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్) - ఆగస్టు 02సన్ నెక్స్ట్సురభిల సుందర స్వప్నం (మలయాళ సినిమా) - ఆగస్టు 01ఆపిల్ ప్లస్ టీవీచీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01స్టిల్ వాటర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01జీ5బకైటి (హిందీ సిరీస్) - ఆగస్టు 01(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!) -
ఓటీటీలో క్రిష్ ప్రాజెక్ట్.. 'అరేబియా కడలి' రిలీజ్పై ప్రకటన
'అరేబియా కడలి' వెబ్ సిరీస్ విడుదలపై ప్రకటన వచ్చేసింది. అమెజాన్ ఒరిజినల్ సిరీస్లో భాగంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ఆ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సత్యదేవ్, ఆనంది జంటగా నటించారు. ఈ సిరీస్లో రెండు గ్రామాల మత్స్యకారులు ఇతర దేశాల జలాల్లోకి పొరపాటున వెళ్లి, అక్కడ బంధీ అవ్వడం ఆపై వారు ఎలా తిరిగొచ్చారనేది కథాంశం. ఈ వెబ్ సిరీస్కు క్రిష్ జాగర్లమూడి రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించారు.'అరేబియా కడలి' వెబ్ సిరీస్ ఆగష్టు 8న విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం తండేల్ కాన్సెప్ట్లా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్తో సినిమా తెరకెక్కించారని సమాచారం.time and tide wait for none, neither does their fate 🌊#ArabiaKadaliOnPrime, New Series, August 8@ActorSatyaDev @anandhiactress @DirKrish @DirectorSuryaVV @NagavelliV @firstframe_ent pic.twitter.com/5ACNKK4XHG— prime video IN (@PrimeVideoIN) July 28, 2025 -
పిల్లలకు 'లింగ, యాత్ర' పేర్లు ఎందుకు పెట్టానంటే: ధనుష్
ప్రతిభ ఉంటే చాలు ఎలాంటి రంగంలోనైనా సరే రాణించవచ్చని జాతీయ నటుడు ధనుష్ నిరూపించాడు. చూడగానే ఆకట్టుకునే రంగు అతనిలో లేదు. అందుకే మొదటి సినిమాతోనే తీవ్రంగా ట్రోలింగ్కు గురయ్యాడు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయితే ఏంటి..?, ఓటమి సమయంలో ఎలా నిలబడాలో తనకు తెలుసు. అసలు నటనంటే ఏంటో తెలీదు. కానీ, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. ధనుష్ బలం ఏంటో మొదట గుర్తించింది తన తండ్రే.. నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వెంకటేష్ ప్రభు కస్తూరిరాజా ఎవరు..? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు తక్కువ. అది ఆయన స్క్రీన్నేమ్. చెఫ్ కావాలని ధనుష్ కోరుకున్నాడు. కానీ, తండ్రి కస్తూరి రాజాకు మాత్రం కుమారుడిని హీరో చేయాలని బలమైన కోరిక ఉంది. దీంతో తండ్రి మాటను కాదనలేక 'తుల్లువదో ఇలమై' (Thulluvadho Ilamai) సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. 2002 మే 10న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, హీరో ఏంటి ఇలా ఉన్నాడంటూ ధనుష్పై విమర్శలు వచ్చాయి. కేవలం కథలో బలం ఉంది కాబట్టి సినిమా ఆడిందని ధనుష్కు ఎంతమాత్రం నటన రాదంటూ విమర్శించారు. అయితే, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని ఆయన బలంగా ముందుకు సాగాడు. ఎక్కడ మాటల పడ్డాడో అక్కడే తనను మెచ్చుకునేలా నిలబడాలని రెండో సినిమాపై గురి పెట్టాడు.ధనుష్ నటించిన రెండో సినిమా 'కాదల్ కొండెయిన్'.. తన అన్నయ్య సెల్వ రాఘవన్ తెరకెక్కించాడు. ఈ సినిమా కోలీవుడ్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ధనుష్ నటనకు తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. మొదటి సినిమాను విమర్శించిన వారే ధనుష్ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ విజయం వెనుక ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ శ్రమ ఎక్కువ ఉంది. ధునుష్ నుంచి మంచి నటనని రాబట్టుకునేందుకు ఒక్కోసారి ధనుష్ని రాఘవన్ కొట్టేవారట. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పారు. అన్నయ్య వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ పలుమార్లు ఆయన పంచుకున్నారు. ఇదే చిత్రాన్ని అల్లరి నరేశ్ హీరోగా తెలుగులో ‘నేను’గా తెరకెక్కించారు.వరుసగా రెండు విజయాలు దక్కడంతో ధనుష్ పేరు వైరల్ అయిపోయింది. కోలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్లోనూ ఛాన్సులు దక్కించుకున్నారు. బాలీవుడ్లో రంజనా, షబితాబ్ వంటి సినిమాలతో ప్రశంసలు అందుకున్నారు. ఆపై హాలీవుడ్లో 'ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'తో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు వారికి 'రఘువరన్ బీటెక్' డబ్బింగ్ మూవీతో గుర్తింపు పొందారు. ఇలా అంతర్జాతీయ స్థాయికి ధనుష్ చేరుకున్నారు. టాలీవుడ్లో ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల ఏకంగా సార్, కుబేర వంటి డైరెక్ట్ చిత్రాలతో తెలుగులో నటించారు. ధనుష్ అంటే కేవలం నటుడు మాత్రమే అనకుంటే పొరపాటే.. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత కూడా.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ‘వై దిస్ కొలవెరి’ పాటను కేవలం ఐదు నిమిషాల్లో రాశారు.కొత్త చరిత్రను లిఖించిన ధనుష్ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు . సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను ధనుష్ లిఖించాడు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ (అసురన్) ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు.ధనుష్ పిల్లల పేర్లు 'యాత్ర- లింగ' వెనుక స్టోరీధనుష్ రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య (రజనీకాంత్ కుమార్తె)తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ధనుష్ని ఆమె ఇంటర్య్వూ చేశారు. అక్కడి నుంచి మొదలైన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అయితే, కొంత కాలం క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ధనుష్ మొదటి నుంచి శివభక్తుడు కావడంతో తన పిల్లలకు లింగ, యాత్ర అని పేర్లు పెట్టుకున్నారు. షూటింగుల నుంచి కాస్త తీరిక దొరికినప్పుడల్లా ఆయన ఎక్కువ శైవక్షేత్రాలకు వెళ్తుంటారు. తనను నడిపించేది శివయ్యే అంటూ ఆయన పలుమార్లు చెప్పుకున్నారు. ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం వంటి ఆలయాలకు తరుచూ వెళ్లడం ఆయనకు ఇష్టం. చాలా సార్లు గిరిప్రదక్షణ కూడా చేసినట్లు ధనుష్ చెప్పారు. అలాగే తను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు సొంతూరులోని (తేనీ జిల్లా - మల్లింగాపురం) ఉన్న కస్తూరీ మంగమ్మ ఆలయానికీ ఆయన వెళ్లడం విశేషం. -
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
జయసుధ (Jayasudha) తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు వంటి ప్రముఖులతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లిగా, అత్తగా సహాయక పాత్రలు పోషిస్తోంది. వెండితెరపై తిరుగులేని నటిగా కీర్తి గడించిన ఈమె జీవితాన్ని 2017లో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది. అదే ఆమె భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య! ఈ ఘటనతో ఆమె కొంతకాలంపాటు డిప్రెషన్కు వెళ్లిపోయింది.అదే నాన్న బాధనితిన్ అలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాన్ని అతడి తనయుడు, నటుడు నిహార్ కపూర్ (Nihar Kapoor) వెల్లడించాడు. నిహార్ కపూర్ మాట్లాడుతూ.. నాన్నకు చిన్నవయసులోనే డయాబెటిస్ వచ్చింది. అయితే ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. జిమ్కు వెళ్లేవాడు. అయితే నాన్న నిర్మాతగా తీసిన సినిమాలు కొన్ని ఆడాయి. కొన్ని ఫెయిలయ్యాయి. అసలేవి చేసినా సక్సెస్ అవడం లేదు. ఓ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మధ్యలోనే ఆగిపోయింది. నాశనం చేస్తున్నానా?మరో సినిమా బాలీవుడ్ నిర్మాత ఎత్తుకుపోయాడు.. ఇలా చాలా విషయాలు ఆయన్ని ఎంతగానో బాధపెట్టాయి. నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్లో ఉన్నవారికి.. నా వల్ల నా చుట్టూ ఉన్నవాళ్లు బాధపడతారు. వారి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను వంటి ఆలోచనలు వస్తాయి. నాన్న విషయంలో అదే జరిగింది. ఏళ్ల తరబడి డిప్రెషన్లో ఉన్నారు. 10 ఏళ్లుగా అదే మాటచనిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. చచ్చిపోతానని దాదాపు 10 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఒకరోజు ముంబైలో తన బంగ్లాపై నుంచి దూకాడు. నిజానికి ఇది జరగడానికి ముందే ఓ ఫంక్షన్కు వెళ్లాలని కొత్త బట్టలు కొన్నాడు. అంతలోనే ప్రాణం తీసుకున్నాడు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి అమ్మకు చాలా సమయం పట్టింది అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. నిహార్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాలో నటించాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్! -
హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
తమిళగ వెట్రి కళగం నేత, సినీ నటుడు విజయ్ నివాసంతో పాటు సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపై చెన్నై విమానాశ్రయంలో కూడా బాంబులు ఉన్నట్టుగా బెదిరింపుల కాల్స్ వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. సీఎం స్టాలిన్, విజయ్ నివాసాలతో పాటు విమానశ్రయం వద్ద సెక్యూరిటీ పెంచారు. భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే, వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.విజయ్ నివాసం పరిసరాలలో, సీఎం నివాసం పరిసరాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో సోదాల అనంతరం భద్రతను పెంచారు. ఇప్పటికే విమానాశ్రయానికి పలుమార్లు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. హీరో విజయ్కు ఇప్పటికే రెండుసార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అజిత్, రజనీకాంత్ వంటి స్టార్స్ కూడా గతంలో ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత నేపంథ్యంలో వచ్చిన సమాచారంపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కామాఖ్య ప్రారంభం
సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రల్లో నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాకు చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, కెమెరా: రమేశ్ కుశేందర్ రెడ్డి. -
జెట్ స్పీడ్తో..!
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగాఅనిల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్తో జరుగుతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి–నయనతారపాల్గొనగా ఓపాటను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితోపాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే వెంకటేశ్పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి–వెంకటేశ్లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
యాక్షన్ స్టార్ట్
గోండు తెగల నేపథ్యంలో రష్మికా మందన్నా లీడ్ రోల్లో ‘మైసా’ చిత్రం ఆరంభమైంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్తపాత్రను రష్మిక చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈపాన్ ఇండియా మూవీని అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.ఆదివారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అతిథిగాపాల్గొన్న దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేసి, తొలి షాట్కు గౌరవ దర్శకత్వం చేశారు. ‘‘హై ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
మాస్ కథకి సై?
హీరో నాగచైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రానుందా? అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానమే ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగచైతన్యకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారని, అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది.అలాగే తనకు ‘మజిలీ’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్వాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగచైతన్య. మరి... ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో నాగచైతన్య సినిమా ముందుగా సెట్స్కు వెళ్తుంది? లేకపోతే ఈ ఇద్దరు దర్శకులతో నాగచైతన్య సమాంతరంగా రెండు సినిమాలూ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు నాగచైతన్య. ఇది నాగచైతన్య కెరీర్లోని 24వ చిత్రం. దీంతో నాగచైతన్య కెరీర్లోని 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారు అవుతారో అనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్లో నెలకొంది. -
కాంతిలా వచ్చావు...
‘‘ఎన్న సుగమ్ ఎన్న సుగమ్ ఉళ్ల.... ఇత్తనై నాళ్ ఎంగిరుంద పుళ్ల... ఇరుళ తేడుమ్ వెళక్కిల్ల... ఒళియా వంద ఎనక్కుళ్ల...’ (ఎంత సుఖం ఎంత సుఖం లోపల... ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ పోరి... చీకటిని వెతికే దీపం లేదు... కాంతిలా వచ్చావు నాలోపలికి) అంటూ సాగుతుంది ‘ఇడ్లీ కడై’లోనిపాట. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్తో విడుదల కానుంది.ఇందులో ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్గా నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించారు. ఆదివారం ‘ఎన్న సుగమ్...’పాటను విడుదల చేశారు. ధనుష్, నిత్యామీనన్ కాంబినేషన్లో ఈపాట సాగుతుంది. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. -
చిరంజీవి 'విశ్వంభర' ప్లాన్ ఛేంజ్!
రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు' ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఈ సినిమా సంగతి కాసేపు పక్కనబెడితే చిరంజీవి 'విశ్వంభర' గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి వింటుంటే అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్న ప్లాన్లో మార్పులు జరుగుతున్నట్లు ఉన్నాయి. ఇంతకీ ఏంటి విషయం? 'విశ్వంభర' ఎప్పుడు థియేటర్లలోకి రావొచ్చు?కొన్నిరోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన వశిష్ఠ.. చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. స్టోరీ ఏంటో చెప్పేయడంతో పాటు గ్రాఫిక్స్ లాంటి వాటి గురించి కూడా మాట్లాడారు. అలానే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ ఉండొచ్చనట్లు హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ షూటింగ్ శనివారంతో పూర్తయింది. దీంతో ఫ్యాన్స్.. 'విశ్వంభర' త్వరలో రిలీజ్ అయిపోతుందేమోనని సంతోషపడుతున్నారు. కానీ ప్లాన్ మారినట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా'కి హిట్ టాక్.. కలెక్షన్ ఎంతంటే?)షూటింగ్ పూర్తయినా సరే వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అవన్నీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'హరిహర వీరమల్లు' విషయంలో మేజర్ కంప్లైంట్ గ్రాఫిక్సే. మరీ నాసిరకంగా ఉండటంతో తొలిరోజు నుంచి ఇప్పటికీ దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ 'విశ్వంభర' టీమ్ చూస్తూనే ఉంటుంది. కాబట్టి కచ్చితంగా గ్రాఫిక్స్ విషయంలో అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ చేయడం బెటర్ అని అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మూవీ రిలీజ్ డిసెంబరులోనే!'విశ్వంభర' విషయానికొస్తే.. 14 లోకాలు అవతల ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చేందుకు హీరో చేసే ప్రయత్నమే సినిమా స్టోరీ. ఇందులో చిరుకు జోడీగా త్రిష నటిస్తుండగా.. ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా పలు పాత్రలు చేశారు. కీరవాణి సంగీత దర్శకుడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి) -
క్రైమ్ థ్రిల్లర్గా వరుణ్ సందేశ్ మూవీ.. గ్రాండ్గా ప్రారంభం!
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వన్ వే టికెట్'. ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జొరిగే శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన కుష్బూ చౌదరి కనిపించనుంది.తాజాగా ఈ మూవీ గ్రాండ్గా ప్రారంభమైంది. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ .. ‘మా వరుణ్ సందేశ్ చిత్ర ప్రారంభోత్సవానికి రావడం నాకు ఆనందంగా ఉంది. వరుణ్ సందేశ్ వైభోగం ఒకప్పుడు నేను చాలా చూశా. మా డార్లింగ్ వరుణ్ సందేశ్కు ఓ హిట్ అవ్వాలన్నదే నా కల. ఈ ‘టికెట్’ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. 'వన్ వే టికెట్ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో కొత్త పాత్రను పోషించబోతోన్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా సినిమాకు కార్తీక్ మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నాం' అని అన్నారు. ఈ వన్ వే టికెట్ మూలీ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుందని దర్శకుడు పళని స్వామి తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మనోజ్ నందం, సుధాకర్, రామ్ తిరుపతి ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా కార్తిక్ పనిచేస్తున్నారు. -
ఓటీటీలోకి తెలంగాణ ప్రేమకథ.. ట్రైలర్ రిలీజ్
'మై విలేజ్ షో' పేరుతో యూట్యూబ్లో గుర్తింపు తెచ్చుకున్న టీమ్.. ఇప్పుడు సినీ అరంగేట్రానికి సిద్ధమైంది. అయితే థియేటర్లో కాకుండా ఓటీటీలో సందడి చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ వివరాల్ని కూడా వెల్లడించారు. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: బిగ్బాస్ సోనియా సీమంతం వేడుక)అనిల్, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'. శివకృష్ణ దర్శకుడు. ఆగస్టు 8 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. గతంలో యూట్యూబ్లో 'విలేజ్ షో' టీమ్ అంతా ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలనే తీశారు. ఇప్పుడు సిరీస్ కోసం ఆ తరహా కథనే ఎంచుకున్నారు.పల్లెటూరిలో ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు.. ఓ అమ్మాయితో లేచిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి తిప్పలు పడ్డాడు? చివరకు ఆ అమ్మాయితో ఒక్కటయ్యాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్, అందున రూరల్ స్టోరీతో తీసిన సిరీస్ కాబట్టి క్లిక్ కావొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ) -
నిహారిక నైట్ పార్టీ.. ఆవుల శాలలో 'కల్కి' హీరోయిన్
ఫ్రెండ్స్తో నైట్ పార్టీ చేసుకున్న నిహారిక కొణిదెలఆవుల శాలలో అక్కతో కలిసి హీరోయిన్ దిశా పటానీపొట్టి స్కర్ట్లో హాట్ బ్యూటీ బిగ్బాస్ రీతూ చౌదరిసింపుల్ డ్రస్సులో కళ్లద్దాలతో కాయదు లోహర్ఎర్రని చీరలో మత్తెక్కించేలా నిధి అగర్వాల్ ఫన్నీ పోజుల్లో శ్రుతి హాసన్ వయ్యారాలు View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
'బాహుబలి' పళని 'వన్ బై ఫోర్' రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా 'వన్ బై ఫోర్'. టెంపర్ వంశీ, ఆర్ఎక్స్ 100 కరణ్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమాకు 'బాహుబలి'కి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన పళని దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. వన్ బై ఫోర్.. ఓ యాక్షన్ క్రైమ్ డ్రామా. నోరు జారితే జరిగే పరిణామాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్పే కథే ఈ సినిమా. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాతలు చెప్పారు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?) -
కింగ్డమ్ ట్రైలర్.. కాంతార స్టైల్లో ఉన్న స్టార్ హీరో ఎవరు?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 31న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. శనివారం జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు.కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే జూలై 31 వరకు వేచి చూడాల్సిందే.కాగా.. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అంటే ఒక భాషలో తీసిన సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇతర భాషలకు చెందిన నటీనటులు.. తెలుగు ఇండస్ట్రీలోకి బోలెడంత మంది వస్తూనే ఉన్నారు. తాజాగా 'కింగ్డమ్' మూవీతో మలయాళం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్లో హైలైట్ అవ్వడంతోనే ఈ డిస్కషన్ వచ్చింది. ఇంతకీ ఎవరితడు?'కింగ్డమ్' మూవీ అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్లో శ్రీలంకలో జరిగే స్టోరీతో తెరకెక్కుతోంది. ట్రైలర్తోనే కథేంటి అనేది ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్తో పాటు విలన్గా కనిపించిన ఓ నటుడు కూడా హైలైట్ అయ్యాడు. అతడి పేరు వెంకటేశ్ వీపీ. ట్రైలర్లో రెండు షాట్స్లోనే కనిపించాడు. ఇతడెవరా అని చూస్తే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు అని తెలిసింది. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు.(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)వెంకటేశ్.. మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశాడు. ఒడియన్, వెలిపాడింటే పుస్తకం, తట్టుంపురత్ అచ్యుతన్ తదితర మూవీస్లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో విలన్గా చేశాడు. ఈ మూవీతోనే 'కింగ్డమ్' ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే టాలీవుడ్కి మరో కొత్త విలన్ దొరికాడేమో అనిపిస్తుంది.మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. అనిరుధ్ సంగీతమందించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించాడు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే ప్రకటించారు. కాకపోతే తొలి భాగం ఫలితం బట్టి అది ఆధారపడి ఉంటుందేమో?(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీ సినిమా రివ్యూ) -
కుమార్తె గ్రాడ్యుయేషన్... ఏఆర్ రెహమాన్ పోస్ట్ వైరల్!
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పట్టభద్రురాలైందని వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో తన విద్య పూర్తి చేసుకుందని తెలిపారు. హాస్పిటాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ కోర్సులో రహీమా మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ఆనందంగా వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.కాగా.. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో తన వండర్మెంట్ టూర్లో బిజీగా ఉన్నారు. మరోవైపు రెహమాన్కు సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. ఈ జంటకు రహీమాతో పాటు ఖతీజా, అమీన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బానుతో విడిపోయారు. గతేడాది నవంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
కింగ్డమ్పై రష్మిక ట్వీట్.. ముద్దు పేరేంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
గతేడాది పుష్ప-2తో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపించనుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కింగ్డమ్ ట్రైలర్ను విజయ్ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.Rushhielu ❤️Enjoy this one - #Kingdom 🤗— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2025 -
చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్
'ఆడపిల్లనమ్మా' పాటతో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ.. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాల్లో ఫోక్ సాంగ్స్ పాడుతూ కాస్త బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె తన చెల్లికి దగ్గరుండి నిశ్చితార్థం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెల్లి-మరిదికి శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా రివ్యూ)తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడింది.18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మధుప్రియ.. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన చెల్లి శ్రుతిప్రియకి సుమంత్ పటేల్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయింది. చెల్లికి త్వరలో పెళ్లి కానుండటం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు) -
OTT: 2025లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్, షోస్ లివే..!
2025లో ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...బ్లాక్ వారెంట్... వావ్ కంటెంట్...ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో రిలీజైన్ బ్లాక్ వారెంట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్ థ్రిల్లర్ ఇప్పటివరకు లైమ్లైట్లోనే ఉంది. ఈ సిరీస్లో జహాన్ కపూర్, రాహుల్ భట్ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.పాతాళ్లోక్...సూపర్ క్లిక్జైదీప్, అహ్లవత్ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్ లోక్ సీజన్ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్ థ్రిల్లర్ గా నిలిచింది. హై ప్రొఫైల్ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.రియలిస్టిక్ షేడ్స్తో...బ్లాక్ వైట్ అండ్ గ్రే.. లవ్కిల్స్నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్ సునీల్ మహాబల్, హేమల్ ఎ ఠక్కర్ లు రూపొందించారు.సైకలాజికల్ థ్రిల్...ఖాఫ్...ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాఫ్ కూడా సక్సెస్ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సిరీస్లో... మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్ఫుల్గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి. -
తండ్రైన ఛావా నటుడు.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ తండ్రైనట్లు ప్రకటించారు. ఈనెల 24న బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది మే నెలలో తన భార్య రుచిరా గర్భంతో ఉన్నారని శుభవార్త చెప్పారు. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు. ఈ విషయం తెలుసుకున్న 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సే అభినందనలు తెలిపారు. మీ చిన్నారిని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ తెలిపారు.కాగా.. వినీత్ కుమార్ సింగ్ ముక్కాబాజ్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈ ఏడాది ఛావా మూవీతో బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో చందోగమాత్య కవి కలష్ పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్బాజ్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. View this post on Instagram A post shared by Viineet Kumar Siingh (@vineet_ksofficial) -
'మహావతార్ నరసింహ' థియేటర్స్ హౌస్ఫుల్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడులైంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివర్స్లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. కానీ, మొదటిరోజునే మంచి టాక్ రావడంతో మెల్లిగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంటుంది.యానిమేటెడ్ రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. 'మహావతార్ నరసింహ' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మహావతార్ నరసింహ'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్ కథను, అశ్విన్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్ శ్యామ్ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
అది వారి వ్యక్తిగత విషయం.. మనకు అవసరం లేదు: కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్కు జంటగా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్.. మెహర్ అనే పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. అలాంటి వారిని మనం జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు. ఇది కేవలం జెండర్కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు. -
మళ్లీ థియేటర్లలోకి ధనుష్ రొమాంటిక్ మూవీ
ధనుష్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ మిస్టర్ కార్తీక్ మళ్లీ థియేటర్స్లోకి రాబోతుంది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా జులై 28న మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. . ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.రిచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీ రాఘవ దర్శకత్వం వహించారు. ‘మయక్కమ్ ఎన్న’ టైటిల్లో2016లో తమిళ్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మిస్టర్ కార్తీక్ పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హీరో–హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల తమిళంలో మళ్లీ విడుదల చేయగా, మంచి విజయం దక్కింది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని కాడబోయిన బాబురావు పేర్కొన్నారు. -
కొన్నేళ్లుగా ఈ ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయి.. ఎన్నో జ్ఞాపకాలు: రష్మిక
రష్మిక- విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నారనే వార్తలు గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అటు విజయ్ కానీ, రష్మిక కానీ నేరుగా స్పందించలేదు. అలా అని ఆ వార్తను ఖండించనూ లేదు. పైగా అప్పుడప్పుడు ఇద్దరు కలిసి పార్టీస్కి, వెకేషన్స్కి వెళ్లడం.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రేమలో ఉన్నది నిజమనే అంతా నమ్ముతున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచేస్తుంది.తాజాగా రష్మిక డియర్ కామ్రెడ్ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం రిలీజై ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా షూటింగ్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..‘ఆరేళ్ల డియర్ కామ్రేడ్.. ఎంతో ప్రేమ, ఆనందం, పాజిటివిటీ నింపిన చిత్రమిది. ఈ ఫోటోలు చాలా ఏళ్ల క్రితం తీసినవి. ఇప్పటికీ నా ముబైల్లో అలాగే దాచుకున్నా. వాటిని తిరిగి చూస్తుంటే.. ఆ మదుర క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మనకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది’ అంటూ రష్మిక విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక, విజయ్ల మధ్య ప్రేమ చిగురించిందని టాలీవుడ్ టాక్. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్గా మిగిలిపోయింది. సినిమా మేకింగ్, గ్రాఫిక్స్ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది. రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్లోని లీలామహల్, వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ థియేటర్స్ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు.'లీలామహల్' నుంచి వీరమల్లు ఔట్విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రీసెంట్గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు. జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24న ఇక్కడ సినిమా చూశారు. ప్రీమియర్తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. కానీ, రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి 'జూనియర్' సినిమాను ప్రదర్శించారు. వీకెండ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది. ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు. ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ చేయవచ్చు. కానీ, మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం.. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ 'వీరమల్లు'కు వుంది. కానీ, అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు. ఇలా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్, జూనియర్ చిత్రాలను ప్రదర్శించడం విశేషం. ఒక స్టార్ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ అవుతుంది. వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ అభిమానులతో కాన్ఫిరెన్స్ కాల్స్ మాట్లాడారు. అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. -
'కింగ్డమ్' ట్రైలర్ ఈవెంట్లో విజయ్, భాగ్యశ్రీ.. భారీగా ఫ్యాన్స్ (ఫోటోలు)
-
ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.- చందు డొంకాన -
'నేను చేసిన తప్పు మీరు చేయకండి.. నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు'
తమిళ నటుడు పొన్నాంబళం.. తెలుగులో ఘరానా మొగుడు (1992)లో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పాందారు. ముఖ్యంగా ప్రతి నాయకుడి పాత్రలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. తమిళంలో రజనీకాంత్ , కమలహాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ,నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించాడు. అలాంటి నటుడు ఇటీవల అనారోగ్యానికి గురై కఠినమైన వైద్య చికిత్సలు పొందుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యను ఎదుర్కొన్న పొన్నాంబళం వైద్య చికిత్సలకు కూడా డబ్బు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. దీంతో సహాయం కోసం అభ్యర్థించడంతో పలువురు నటులు ఆయన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు. ముఖ్యంగా చిరంజీవి, రాధిక శరత్ కుమార్, ధనుష్ , రజనీకాంత్ వంటి స్టార్స్ పొన్నాంబళం వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. కాగా పొన్నాంబళం ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నాలుగేళ్లలో 750కి పైగా ఇంజెక్షన్లు చేయించుకున్నట్లు చెప్పారు. రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి తన ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్ చేసేవారని చెప్పారు. తనకు వచ్చిన ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని తెలిపారు. తను ఎక్కువగా మద్యం సేవించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెప్పారన్నారు. అయితే, చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం ఆపేశానన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్ని వాపోయారు. అయితే మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నానని, ఆ సమయంలో చాలా బాధ అనుభవించానని పొన్నంబళం పేర్కొన్నారు. మద్యం ఎప్పటికీ హనికరం అంటూ జీవితంలో తాను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఆయన అభ్యర్థించారు. -
విచిత్రమైన షరతు!
ఇండస్ట్రీకి ‘నో డేటింగ్’ కండిషన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, అభిమానులు గుడి కట్టేంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది.నిధి నిజానికి హైదరాబాద్లోనే 1992 ఆగస్టు 17న పుట్టింది. చిన్నతనం కూడా అక్కడే గడిచింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది. అందుకే హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సునాయాసంగా మాట్లాడగలుగుతుంది.తన తొలి సినిమా ‘మైఖేల్ మున్నా’ కోసం, ఏ హీరోయిన్ ఒప్పుకోని షరతును అంగీకరించింది. సినిమాలో నటిస్తున్నంతవరకూ ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాజ్ పెట్టారు. ‘‘అప్పట్లో కెరీర్ కావాలి, డబ్బులు అవసరం. కాబట్టి సరేనన్నాను’’ అని నవ్వుతూ చెబుతుంది నిధి.తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. కాని తమిళంలో శింబు, ఉదయనిధి స్టాలిన్, జయం రవిలతో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్తో ‘రాజాసాబ్’ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది.పూజా హెగ్డే తర్వాత, నాగ చైతన్య, అఖిల్– అన్నదమ్ములు ఇద్దరితోనూ నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ నిధి.ఫిబ్రవరి 14, వాలెంటైన్ ్స డే రోజున తమిళనాడులో అభిమానులు ఆమె విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, గుడి కట్టినట్టు వార్తలు, ఫొటోలు వెలుగులోకి రావడం చూసి, షాక్ అయిందట!హైదరాబాద్లోని బషీర్బాగ్లో నిధి అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఉంది. ‘హైదరాబాద్ మించిన ఫన్ ప్లేస్ ప్రపంచంలో లేదనిపిస్తుంది’ అని అంటుంది నిధి. అంతేకాదు, నగరంలో దాదాపు 15 వేల మంది బంధువులు ఉన్నారట!బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలనే కోరిక. కాని, ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ఫేస్బుక్లో అందమైన ఫోటోలు పెడుతూ, ఎవరైనా దర్శకుడు కాంటాక్ట్ చేస్తాడేమో అని ఎదురు చూసేది. ఆ ఆశే ఆమెను మోడలింగ్, అందాల పోటీల వైపు తీసుకెళ్లింది. తర్వాత హీరోయిన్ గా మారింది.కాలేజీలో ఓ అబ్బాయి ‘నీవు చాలా అందంగా ఉన్నావు’ అన్నాడు. వెంటనే చేతిలో ఉన్న యాపిల్ అతని మీదకు విసిరి, ‘నన్ను అంత మాట అంటావా!’ అంటూ అరిచిందట! ఇప్పుడు అభిమానులు పొగుడుతున్నప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటుందట! -
బిజీ బిజీగా...
విలక్షణ నటుడు సాయి కుమార్ వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు. నటుడిగానూ యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాను. ఈ ఏడాదితో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం సంతోషంగా ఉంది.ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ ‘సంబరాల యేటిగట్టు’, నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, ‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాది రాజా’, కోన వెంకట్గారితో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డిగారితో ఓ చిత్రం, మా అబ్బాయి ఆదితో కలిసి ‘ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమాలు చేస్తున్నాను. కన్నడలో ‘చౌకీదార్’, ‘సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర’, శివ రాజ్కుమార్గారి సినిమాలో నటిస్తున్నా. తమిళ్లో ‘డీజిల్’, విక్రమ్ ప్రభుతో ఓ చిత్రం చేస్తున్నాను. దేవా కట్టా ‘మయసభ’, క్రిష్ ‘కన్యా శుల్కం’ వంటి వెబ్ సిరీస్లలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను: శ్రుతీహాసన్
‘‘కూలీ’ చిత్రంలో నేను చేసిన పాత్ర వ్యక్తిగతంగా, ఒక అమ్మాయిగా నాకు బాగా కనెక్ట్ అయింది. నా పాత్రలో మంచి భావోద్వేగం ఉంది. అమ్మాయిలు నా పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్, అద్భుతమైన యాక్షన్, మంచి కథ, భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని శ్రుతీహాసన్ తెలిపారు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు.కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. డి. సురేష్బాబు, ‘దిల్’ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ పంచుకున్న విశేషాలు. ⇒ నేనో మ్యూజిక్ ఆల్బమ్ కోసం లోకేశ్ కనగరాజ్గారిని కలిశాను. ఆ ఆల్బమ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన సర్ప్రైజింగ్గా ‘కూలీ’లోని నా పాత్ర గురించి చెప్పారు. ఆయన సినిమాలంటే డార్క్, గన్స్, యాక్షన్తో ముడిపడి ఉంటాయి.కానీ, ‘కూలీ’లో ఆయన చెప్పిన స్ట్రాంగ్ ఉమన్ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్గారి అమ్మాయిగా కనిపిస్తాను. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్... ఇలా చాలామంది స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరచి΄ోలేని అనుభూతి. ఇంతమంది సూపర్ స్టార్స్తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం ప్రతి ఆర్టిస్ట్కి దొరకదు... నాకు దొరికింది. అందుకే ‘కూలీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.⇒ నాన్నగారితో (కమల్హాసన్) ఆయనకు ఉన్న స్నేహం గురించి, అప్పటి వర్కింగ్ స్టైల్ గురించి ‘కూలీ’ సెట్స్లో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు రజనీకాంత్గారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. నాగార్జునగారు తొలిసారి విలన్ పాత్ర చేశారు. తెలుగు ప్రేక్షకులందరూ ఆయన పాత్ర చూసి, చాలా సర్ప్రైజ్ అవుతారు. ఆమిర్ ఖాన్గారితో పని చేయడం స్పెషల్ ఎక్స్పీరియన్స్. లోకేశ్ కనగరాజ్ క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ⇒ ‘కూలీ’ సినిమా పూర్తిగా చూడలేదు. నా డబ్బింగ్ వెర్షన్తోపాటు ఇంకొన్నిపోర్షన్స్ చూశాను... చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగడానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదమే అని భావిస్తున్నాను. నేను భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించలేదు... పనిని ఎంజాయ్ చేశాను. నాకు వచ్చిన ప్రాజెక్టుకి ఎంతవరకు న్యాయం చేయాలనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ ఒక మ్యుజిషియన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులోనూ కొన్ని కథలు విన్నాను... త్వరలోనే నా కొత్త సినిమా ప్రకటన ఉంటుంది. -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
'చైనా పీస్' టీజర్ రిలీజ్.. మెచ్చుకున్న సందీప్ కిషన్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేసిన సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకుడు. స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే ఫొటోలు, వీడియోలు రాగా.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. హీరో సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొని మూవీని ప్రశంసించారు. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు)కొత్త ఫిలిం మేకర్స్, కొత్తవాళ్లు నటించినప్పుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ళ ఆలోచనని చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నానని సందీప్ కిషన్ అన్నాడు. ఈ సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలు కని దానికి 100 శాతం కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని హీరో నిహాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
పూల డ్రస్సులో తమన్నా.. నితిన్ భార్య స్పెషల్ పోస్ట్
ర్యాంప్ వాక్ కోసం పూల డ్రస్సులో తమన్నాపెళ్లయి ఐదేళ్లు.. నితిన్ భార్య షాలిని స్పెషల్ పోస్ట్పియానో వాయిస్తూ తన్మయత్వంలో సమంతవరలక్ష్మి వ్రతం బిజీలో యంగ్ బ్యూటీ శాన్వి మేఘనహాట్నెస్కే కేరాఫ్ అడ్రస్లా ప్రియాంక జవాల్కర్వయసుతో పాటే పెరుగుతున్న ప్రియమణి గ్లామర్డిజైనర్ ఔట్ఫిట్లో మృణాల్ ఠాకుర్ వయ్యారాలు View this post on Instagram A post shared by Rahul Mishra (@rahulmishra_7) View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) -
బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే అందుకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రీసెంట్గానే భర్త వరుణ్ తేజ్తో కలిసి దుబాయి వెళ్లిన లావణ్య.. బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఈమె బేబీ బంప్తో కెమెరా కంటికి కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)ఇకపోతే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్తో మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి.. అతడితోనే ప్రేమలో పడింది. దాదాపు ఆరేడేళ్ల పాటు వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే లో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పుట్టబోయే బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.లావణ్య త్రిపాఠి విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈమె 'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా తదితర సినిమాలు లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'సతీ లీలావతి', తనళ్ అనే సినిమాలు ఉన్నాయి. వీటి షూటింగ్ అయితే లావణ్య పూర్తి చేసినట్లు ఉంది. త్వరలో ఇవి రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్తో పార్టీ!) -
రూ.200 కోట్ల క్లబ్లో ‘సైయారా’.. ఖాన్స్ రికార్డ్స్ బద్దలు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు. విడుదలై వారం రోజులు దాటినా..జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది.అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. ఈ నెల 18న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్లో మాత్రమే విడుదలైంది. తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఎనిమిది రోజుల్లో రూ. 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్. ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టడం లేదు.(చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ) ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్ (164 కోట్లు), అజయ్ దేవ్గన్ రైడ్ 2 (173 కోట్ల) చిత్రాలకు మించిన కలెక్షన్స్ని రాబట్టి.. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్గా రికార్డెకెక్కింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది. సైయారా కథ విషయానికొస్తే..వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్ని ప్రేమించి, ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు. ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్లోనే ఉంటుంది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ (అహన్ పాండే) వస్తాడు. తానో సింగర్. అవకాశాల కోసం తిరుగుతుంటారు. వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు. అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ. -
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్తో పార్టీ!
ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' సినిమా బిజీలో ఉన్నాడు. వచ్చే నెల 14న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్ విడుదల చేయగా.. స్పందన బాగానే వచ్చింది. తారక్ అభిమానులకు యాక్షన్ మూవీ చూడబోతున్నామని అంచనాలు పెంచేసుకున్నారు. మరోవైపు ఇతడి ఇంట్లో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)అయితే ఈ ఫొటోలు ఎన్టీఆర్కి చెందిన జూబ్లీహిల్స్ ఇంటివి అని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఇక్కడ రెనోవేషన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం.. స్నేహితులతో కలిసి సింపుల్గా ఈ ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్తగా అమర్చిన వాల్ ఫ్రేమ్స్, షాండిలీయర్స్, బెడ్ రూమ్స్ లాంటివి ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి. చూస్తుంటే తారక్ ఇంటి కోసం కాస్త గట్టిగానే ఖర్చు చేసినట్లు కనిపిస్తున్నాడు.'వార్ 2' రిలీజ్కి రెడీ కాగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు నెల్సన్.. ఎన్టీఆర్తో సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు 'దేవర 2' కూడా లైన్లో ఉంది. మరి వీటిలో ఏది ముందు ఏది తర్వాత వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ
సీనియర్ నటుడు శరత్ బాబు కొడుకు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'దక్ష'. హారర్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీకి వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా శుక్రవారం(జూలై 25) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె పద్ధతిలో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. 'దక్ష' స్టోరీ విషయానికొస్తే.. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. మరి చివరకు ఏమైంది? ఎవరు బతికారు అనేదే మిగతా స్టోరీ.ఈ మూవీనే కాదు ఈ వారం చాలా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు కూడా ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో 'రోంత్' అనే పోలీస్ డ్రామా హాట్స్టార్లో.. షో టైమ్, మార్గన్ మూవీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో.. సోలో బాయ్, సారథి చిత్రాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోంత్, షో టైమ్, మార్గన్ కచ్చితంగా చూసే లిస్టులో ఉంటాయి. (ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
ఆ హీరోయిన్ ప్రేమలో సిద్దు..!
-
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఇప్పటికే షో టైమ్, మార్గన్, సారథి తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు బిగ్బాస్ గౌతమ్ మూవీ కూడా కేవలం మూడు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడూ చూద్దాం.ప్రస్తుతం చిన్న సినిమాలని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మరీ బాగుంది అనే టాక్ వస్తే తప్పితే థియేటర్లకు వెళ్లి వాటిని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయినా సరే యంగ్ హీరోలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ.. ఈనెల 4న 'సోలో బాయ్' చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గానీ స్టార్ నటీనటులు లేకపోవడంతో ఒకటి రెండు రోజులకే బిగ్ స్క్రీన్ నుంచి మాయమైపోయింది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)ఇప్పుడు ఆహా ఓటీటీలోకి శుక్రవారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండా సడన్ అందుబాటులోకి వచ్చింది. వీలుంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. బిగ్బాస్ 7, 8 సీజన్లలో పాల్గొన్న గౌతమ్ కృష్ణ.. అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ ఇది కాస్తోకూస్తో సందడి చేసింది.'సోలోబాయ్' విషయానికొస్తే.. కృష్ణమూర్తి(గౌతమ్ కృష్ణ) మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ(రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. ఓ సందర్భంలో ఆమె బ్రేకప్ చెప్పడంతో మందుకు బానిసైపోతాడు. తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ మాములు మనిషిగా మారి ఉద్యోగంలో చేరతాడు. అక్కడ శ్రుతి(శ్వేత అవస్తి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సాఫీగా సాగుతుందన్న సమయంలో తండ్రి మరణిస్తాడు. మరోవైపు ఆర్థిక పరిస్థితుల వల్ల భార్య శ్రుతి విడాకులు ఇస్తుంది. ఓ పక్క తండ్రి చావు, మరోవైపు భార్య విడాకులు.. వీటన్నింటిని తట్టుకొని కృష్ణ మూర్తి మిలియనీర్గా ఎలా ఎదిగాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
తిరుమలలో ఒకప్పటి హీరోయిన్.. గుర్తుపట్టారా?
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. తమదైన యాక్టింగ్తో అలరిస్తూ ఉంటారు. ఈమె కూడా అలానే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడేమో సీరియల్స్ చేస్తోంది. మరి ఈ హింట్స్ బట్టి ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు నిరోషా. ఇప్పటి జనరేషన్కి అయితే అస్సలు తెలియకపోవచ్చు. కానీ 90ల్లో తెలుగు సినిమాలు చూసిన వాళ్లు మాత్రం ఈమెని ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో ముద్దుల మామయ్య, నారీనారీ నడుమ మురారి, సింధూర పువ్వు, స్టూవర్టుపూరం పోలీస్ స్టేషన్ తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. తర్వాత తర్వాత మూవీస్ చేసింది గానీ హిట్స్ అందుకోలేకపోయింది. తెలుగులో చివరగా 2019లో వచ్చిన 'నువ్వు తోపు రా' అనే మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?)ఈమె వ్యక్తిగత విషయాలకొస్తే.. శ్రీలంకలోని కొలంబోలో పుట్టి పెరిగింది. కానీ తమిళ సినిమాలతో నటిగా మారింది. 1988 నుంచి ఇప్పటివరకు నటిస్తూనే ఉంది. కాకపోతే సినిమాలు చాలావరకు తగ్గించేసింది. గతేడాది రిలీజైన రజినీకాంత్ 'లాల్ సలామ్'లోనూ ఈమె నటించింది. గతంలో తెలుగులో పలు సీరియల్స్ కూడా ఈమె చేసింది. ప్రస్తుతం తమిళంలో సీరియల్స్ చేస్తోంది.1995లో నటుడు రాంకీని ఈమె పెళ్లి చేసుకుంది. అతడు కూడా తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో కనిపించాడు. గతేడాది రిలీజైన 'లక్కీ భాస్కర్'లో హీరో సహాయపడే ఆంటోని పాత్ర చేసింది ఈయనే. ఇక నిరోషాకు ఒకప్పటి హీరోయిన్, నటి రాధిక బంధువు అవుతుంది. తాజాగా ఈమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఒకప్పటి హీరయిన్ నిరోషా కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్) -
ఎన్టీఆర్కే ఎక్కువ.. 'వార్ 2'కి రెమ్యునరేషన్ ఎంత?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే 'దేవర' సినిమా దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ 'వార్ 2'. ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. మరోవైపు హీరోలు చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ అనేది కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్)పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్లోని 'వార్ 2'లో భాగమయ్యాడు. అయితే తారక్ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్లోనూ నెగిటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గానీ తెలియదు. అయితే ప్రస్తుతం తారక్కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరి కంటే ఇతడికే ఎక్కువగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.'వార్ 2'లో నటించినందుకు గానూ ఎన్టీఆర్కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. హృతిక్ రోషన్కి రూ.45 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన కియారా అడ్వాణీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిబట్టి చూస్తుంటే హృతిక్పై అటు ట్రైలర్లోనే కాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు) -
సినీ నిర్మాత, హీరోను చెప్పుతో కొట్టిన నటి.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు, నిర్మాత మాన్ సింగ్ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. 'సో లాంగ్ వ్యాలీ' అనే హిందీ చిత్రాన్ని మాన్ సింగ్ దర్శత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా ఉన్నారు. ఆపై ఇదే చిత్రంలో కీలక పాత్రలో నటించారు. జులై 25న చిత్ర యూనిట్తో కలిసి ముంబైలోని సినీపోలిస్ థియేటర్కు మాన్ సింగ్ వచ్చారు. ఆ సమయంలో నటి రుచి గుజ్జర్ ఆవేశంతో తనకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాలంటూ చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నిర్మాత, నటుడు మాన్ సింగ్ తనకు రూ. 25 లక్షలు బాకీ ఉన్నాడని రుచి గుజ్జర్ పేర్కొంది. ఆ డబ్బు ఇవ్వాలంటూ అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఈ క్రమంలో చెప్పు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నం చేయగా.. ఆమెను నిలువరించేందుకు చిత్ర సహ నిర్మాత కరణ్ అడ్డుపడ్డాడు. ఆ చిత్ర నిర్మాతలు గాడిదలపై కూర్చున్నట్లు చిత్రీకరించబడిని కొన్ని ప్లకార్డులను ఆమె ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా కాలంగా తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని మాన్ సింగ్పై పోలీసులకు రుచి గుజ్జర్ ఫిర్యాదు చేసింది. మ్యూజిక్ ఆల్బమ్లకు సంబంధించి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ఆమె ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.నటి రుచి గుజ్జర్ ప్రధానంగా మోడలింగ్, మ్యూజిక్ వీడియోల ద్వారా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. కొన్ని ప్రైవేట్ వీడియో సాంగ్స్లో నటించిన ఆమెకు పాపులారిటీ వచ్చింది. 2023 మిస్ హర్యానాగా నిలిచిన ఈ బ్యూటీ ఈ ఏడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. View this post on Instagram A post shared by Bollywood News (@bolly_newssss) View this post on Instagram A post shared by SpotlightBollywood (@spotlightbolly) -
ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ కావడంతో ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ ఇచ్చింది. -
హీరోను వదిలేసి నన్ను మాత్రమే 'ఐరన్ లెగ్' అన్నారు: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రుతిహాసన్కు తొలి విజయం దక్కింది టాలీవుడ్లోనే. తెలుగులో తన మూడో చిత్రంగా వచ్చిన 'గబ్బర్ సింగ్' ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. అయితే, ఈ సినిమాకు ముందు అమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఛాన్సులు రావేమో అనుకుంటున్న సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ నుంచి పిలుపు రావడం ఆపై భారీ హిట్ అందుకోవడం జరిగిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను ఐరన్ లెగ్ అని మాట్లాడిన వారందరూ ఆ సమయంలో ఒక విషయాన్ని గుర్తించలేదని శ్రుతిహాసన్ చెప్పారు.'తెలుగు పరిశ్రమలో నేను నటించిన మొదటి రెండు చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో నాపై ఐరన్ లెగ్ ట్యాగ్ వేశారు. కానీ, ఆ రెండు చిత్రాల్లో నేను నటించింది ఒకే హీరోతోనే అనే విషయాన్ని అప్పుడు ప్రజలు గుర్తించలేదు. నన్ను మాత్రం ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలాంటప్పుడు ఐరన్ లెగ్ అని హెళన చేయడం ఎందుకు..? నావి ఐరన్ లెగ్స్, గోల్డెన్ లెగ్స్ కాదు... నా కాళ్లు నాకు వదిలేయండి. అలా ఎవరినీ హెళన చేస్తూ విమర్శలు చేయకండి' అంటూ శ్రుతిహాసన్ పేర్కొంది.శ్రుతిహాసన్ తెలుగులో వరుసగా 'సిద్ధార్థ్'తో అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో నటించారు. అయితే, అవి భారీ డిజాస్టర్గా మిగిలిపోయాయి. ఆ తర్వాతి ఏడాదిలోనే గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి ఆమె లైఫ్ మారిపోయింది. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, రజనీకాంత్ సినిమా 'కూలీ'లో శ్రుతిహాసన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఆగస్ట్ 14న విడుదల కానున్న ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. -
'సోలో లైఫే సో బెటర్'.. పెళ్లిపై నిత్యా మీనన్ కామెంట్
అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. నటుల్లోనే కాకుండా నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్(Nithya Menen) ఒకరు. రీసెంట్గా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. ఆమె వయసు ఇప్పుడు 37 ఏళ్లు.. అంటే మరో మూడేళ్లలో 40ని టచ్ చేస్తారన్నమాట. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానానికి చేరుకున్న ఈ మలయాళీ భామ బహుభాషా నటి అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతలా ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే తిరుచిట్ర ఫలం (తిరు) చిత్రంలో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా విజయ్సేతుపతికి జంటగా నటించిన తలైవన్ తలైవి చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను మూడు నెలల వయసు నుంచే తన బామ్మ వద్ద పెరిగానని చెప్పారు. అలా చిన్న వయసులోనే ఒంటరి తనం అలవాటు అయ్యిందన్నారు. ప్రేమలో పడ్డ ప్రతిసారి అది సంతోషాన్ని కాకుండా బాధాకరమైన అనుభవాన్నే మిగిల్చిందని చెప్పారు. ప్రస్తుతం సినిమా జీవితంపైనే పూర్తిగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. అలాగని జీవితంలో పెళ్లే చేసుకోననే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆత్మార్థమైన ప్రేమ లభిస్తే అప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయితే ప్రస్తుతం తనకు ఈ సోలో లైఫే బెటర్గా ఉందని, ఈ జీవితాన్నే ఆస్వాదిస్తూ జీవిస్తున్నానని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తర్వాత ఈమె ధనుస్కు జంటగా నటించిన ఇడ్లీ కడై చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని గతంలోనే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో పెళ్లి జరిగినా.. జరగకపోయినా పెద్దగా మార్పు ఉండదన్నారు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. -
ఆగస్టులో సుందరకాండ
నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ’ చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్కుమార్ హీరోయిన్లు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. జూలై 25న నారా రోహిత్ బర్త్డే సందర్భంగా ‘సుందరకాండ’ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘ఈ చిత్రంలో హీరో జీవితంలోని వివిధ దశల్లోని రెండు ప్రేమకథలను చూపిస్తున్నాం. శ్రీదేవితో మొదటి ప్రేమ, వృతి వాఘానితో కలిసి రెండో ప్రేమకథని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
విశ్వంభరకు బై బై
‘విశ్వంభర’ సినిమా షూటింగ్కు చిరంజీవి బై బై చెప్పారు. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.తాజాగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్లో చిరంజీవి, బాలీవుడ్ నటి మౌనీ రాయ్ పాల్గొనగా చిత్రీకరించిన ఓ స్పెషల్ సాంగ్తో ‘విశ్వంభర’ సినిమా చిత్రీకరణ ముగిసింది. చిరంజీవి, మౌనీ రాయ్లతో పాటు వంద మంది డ్యాన్సర్స్ ఈ పాటలో పాల్గొన్నారు. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇక ఈ ‘విశ్వంభర’ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఈ పని పూర్తి కాగానే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై ఓ స్పష్టత వస్తుంది. ఈ సినిమా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
సెప్టెంబరులో సెట్స్కి...
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా (‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్కాస్ట్ వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ‘స్పిరిట్’ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని విజయ్ దేవరకొండ కోరగా.. ‘‘సెప్టెంబరు నుంచి ‘స్పిరిట్’ సెట్స్కి వెళుతుంది. షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్గా పూర్తి చేస్తాం’’ అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానమిచ్చారు సందీప్ రెడ్డి.ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటిస్తారు. భద్రకాళి పిక్చర్స్ ప్రోడక్షన్స్, టీ–సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, మురాద్ ఖేతానీ ఈ చిత్ర నిర్మాతలు. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం తొమ్మిది భాషల్లో విడుదల కానుంది. -
వరల్డ్ ఫ్రెండ్షిప్ డే.. రష్మికతో ప్రముఖ సంస్థ ఒప్పందం..!
ప్రపంచవ్యాప్తంగా తొలిసారి స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ స్నాప్చాట్ ప్రత్యేక బహుమతి ప్రకటించింది. ఈ మేరకు హీరోయిన్ రష్మిక మందన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా భారతీయ స్నాప్చాట్ యూజర్లకు ప్రత్యేకమైన స్ట్రీక్ రిస్టోర్ను బహుమతిగా ఇవ్వనుంది. జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు ఇండియన్స్కు ఉచితంగా ఐదు ప్రత్యేక స్ట్రీక్లను పొందేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం స్నాప్చాట్ 'బెస్టీస్ బిట్మోజీ లెన్స్'ను కూడా ప్రారంభిస్తోంది. కాగా.. ఇటీవల ముంబయిలో జరిగిన 'స్నాప్ విత్ స్టార్స్' అనే క్లోజ్డ్ డోర్ ఈవెంట్లో ఇటీవల రష్మిక తన కొత్త పెర్ఫ్యూ మ్ బ్రాండ్ 'డియర్ డైరీ'ని ఆవిష్కరించింది. నా స్నేహితులే నా సర్వస్వం, వారే నా నిజ జీవిత డైరీ అని హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. నా కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'డియర్ డైరీ'తో నేను ఒక మధురమైన జ్ఞాపకం, అనుభూతిని పొందాలనుకున్నట్లు తెలిపారు. స్నేహితుల దినోత్సవానికి సంబంధించి స్నాప్చాట్తో ఈ భాగస్వామ్యం చాలా పరిపూర్ణంగా అనిపిస్తోందని వెల్లడించింది. ఎందుకంటే ఇది మనమందరం రోజులో జరిగే క్షణాలను, కథలను పంచుకునే వేదిక స్నాప్చాట్, 'డియర్ డైరీ' రెండూ మనం ఎప్పటికీ మర్చిపోలేనివని పేర్కొంది.పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక డియర్ డైరీ అనే కొత్త ఫర్ఫ్యూమ్ బ్రాండ్ను ప్రారంభించింది. ఇటీవలే పర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇది ఓ బ్రాండో.. లేదంటే ఫెర్ఫ్యూమో కాదని.. ఇది తనలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధరల విషయానికొస్తే రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి.