Movie News
-
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు.అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్నెస్పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్కు ఫిదా అవుతున్నారు. "Like boss, like bodyguard." 😎🔥#MassaMassa pic.twitter.com/tiFrCqMwg3— ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁 (@Mouli_Ka) June 4, 2026 -
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
-
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
-
'అంత మాట అనేశారేంటి?'.. వారణాసి, రామాయణపై మనోజ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్పేయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ మూవీతో తెలుగు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో తన హావాభావాలు, నటనతో మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్ భారీ బడ్జెట్ చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసి, రణబీర్ కపూర్-నితీష్ తివారీల 'రామాయణం చిత్రాలపై మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సినిమాలపై వస్తున్న బడ్జెట్ వార్తలను ఆయన కొట్టిపారేశారు. వీటిని భారీ బడ్జెట్ చిత్రాలు అనడం కేవలం పీఆర్ స్టంట్లో భాగమేననని మనోజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత 15 ఏళ్లుగా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయని అన్నారు. సినిమా అనేది వ్యాపారమని.. బడ్జెట్ విషయం కేవలం నిర్మాతపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రేక్షకుడికి బడ్జెట్తో పనిలేదని.. సినిమా నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలను ఉద్దేశించి మనోజ్ భాజ్పేయి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే మనోజ్ ప్రస్తుతం ‘గవర్నర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్కు హాజరైన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈ మూవీకి బజ్ లేకపోవడంతో కేవలం ఆడియన్స్లో క్రేజ్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేశారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా మనోజ్ చేసిన వ్యాఖ్యలు భారీ బడ్జెట్ చిత్రాలపై చర్చకు దారితీశాయి. కాగా.. రాజమౌళి వారణాసి రూ. 1400 కోట్లు, రణ్బీర్ కపూర్ రామాయణ రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ మాట్లాడుతూ..'అదంతా ఒక పీఆర్ ఎత్తుగడ. ఎందుకంటే గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఇది ఎంతగా వ్యాపించిందంటే కొన్నిసార్లు విమానాశ్రయంలో నన్ను కలిసే ప్రేక్షకులు కూడా సినిమా వసూళ్ల గురించి మాట్లాడతారు. ఈ డబ్బు మీ సొంత ఖాతాల్లోకి వెళ్లడం లేదు. ఒకవేళ ఇది మీ ఖాతాలోకి వెళ్తుంటే అప్పుడు సినిమా బాక్సాఫీస్ వసూళ్ల గురించి మాట్లాడండి. ప్రేక్షకుడిగా మీకు ఆ సినిమా నచ్చిందా లేదా అనే దాని గురించి మాత్రమే మాట్లాడండి అని చెప్తా. రూ.500-600 కోట్ల బడ్జెట్ చిత్రాల్లో ఒక్క రూపాయి కూడా మీకు అందడం లేదు. ఇదే విషయం ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మీకు సినిమా నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇతర విషయాలు ఆడియన్స్కు ముఖ్యం కాదు. సినిమా వ్యాపారం అనేది కేవలం నిర్మాతకు సంబంధించింది మాత్రమే' అని అన్నారు. -
'పెద్ది' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
-
అక్కినేని అఖిల్ 'లెనిన్'.. వయొలెంట్ సాంగ్ వచ్చేసింది
అక్కినేని నాగార్జున తనయుడు తనయుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కుదరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.No WAR is more VIOLENT than LOVE ❤️🔥#SoulOfLenin is out now▶️ https://t.co/caQUyeFpz1 MANODU VASTHUNNADU 🔥🔥#Lenin #LeninOnJune26th @MusicThaman Musical 🎶 🎤 @ImVagdevi ✍️ #KalyanChakravarthy@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/Cnm7pLzX5U— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2026 -
‘మొహబ్బత్’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మొహబ్బత్’.ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ని కూడా లాంచ్ చేశారు.ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. ‘సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇది పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు మ్యాక్కి మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ .. ‘నిర్మాత అఫ్రోజ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ .. ‘నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్గా ‘మొహబ్బత్’ను నిర్మిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ .. ‘‘మొహబ్బత్’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇది నాకు రెండో చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యాక్ గారు, అఫ్రోజ్ గారికి థాంక్స్’ అని అన్నారు.హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ .. ‘అఫ్రోజ్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా డైరెక్టర్ మ్యాక్ అద్భుతమైన టాలెంటెడ్. ఇలాంటి ఓ ప్రేమ కథకు సంగీతం ప్రధానం. సునీల్ కశ్యప్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. -
'ఉప్పెన కంటే ఎక్కువ.. ఆయన లేకపోతే పెద్దినే లేదు'
రామ్ చరణ్ పెద్ది సక్సెస్తో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటిక్ రావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు అభిమానులకు బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రీమియర్స్ నుంచే నాకు ఫోన్ కాల్స్ రావడం మొదలైందన్నారు. పెద్ది విజయానికి కారణం రామ్ చరణ్ మాత్రమేనన్నారు. ఉప్పెన కంటే ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీలోని పెద్ది క్యారెక్టర్ ఆదర్శమని పలువురు కొనియాడారని తెలిపారు. చరణ్ గారు పడిన కష్టాన్ని అందరూ గుర్తించారు.. చరణ్ లేకపోతే ఈ సినిమా లేదు.. థ్యాంక్ యూ చరణ్ సార్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీనే పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించగా.. శృతిహాసన్ ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రెండో రోజే ‘పెద్ది’కి భారీ షాక్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్లో విడుదల కాగానే అలా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పెద్ది చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం..జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 135 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రటించారు.అంతేకాదు వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సినీ పండితులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. సినిమాకు సంబంధించని హెచ్డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్సైట్లో ప్రత్యేక్షమైంది.సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను, డిజిటల్ టీమ్ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. @AlwaysRamCharan Peddi movie is streaming online in some site. Someone has forwarded me the link. I can’t send the link here in public. Let me know where to send so you can ask the concern to restrict the site.— Kiran Surya Nadella (@kiran_nadella) June 5, 2026 -
కేవలం సాంగ్స్, ముద్దుల కోసమేనా?.. జాన్వీ రోల్పై సింగర్ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా పెద్దికి కలిసొచ్చింది. దీంతో మొదటి రోజే సెంచరీ మార్క్ను దాటేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సింగర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓవర్గా చూపించారని ఆరోపిస్తున్నారు. కేవలం సెక్సువల్ అట్రాక్షన్ కోసమే ఆమెను సినిమాలో తీసుకున్నారని సింగర్ సుమంగళి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మేకర్స్ నిస్సహాయత వల్ల కలిగే వేదన చుట్టూ ఒక కథను అల్లారని.. కానీ జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రకు అదే గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.సుమంగళి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ..'శక్తివంతమైన పురుషులతో నిండిన ఒక గదిలో కూర్చుని నిస్సహాయత వల్ల కలిగే వేదన గురించి ఒక కథను రాశారు. వాళ్లు అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు కేవలం బలవంతపు ముద్దు పెట్టే ఒక వస్తువుగా.. పాటలు అయిపోయాక ఆమె పక్కకు పారేసే ఓ వస్తువుగా మాత్రమే చూపించారు. ఒక మనిషిని గౌరవించడం ఏమిటో వారికి కచ్చితంగా తెలుసు. కానీ ఆమె దానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని ముందే నిర్ణయించుకున్నారని ఆమె విమర్శించారు. ఈ సినిమాలో హీరోయిన్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం అంటూ అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ను షేర్ చేసింది.హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే కాదని.. ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని నెటిజన్స్ కోరుతున్నారు. సాంగ్స్, ముద్దుల కోసమే వారిని సినిమాలో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూడటాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీలోని జాన్వీ కపూర్ సీన్స్పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమతి లేకుండా హీరోయిన్ను తాకాలనుకుంటున్నానని పెద్ది చెప్పే సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ లైంగిక దాడి కిందకే వస్తాయని చాలా మంది విమర్శిస్తున్నారు. -
పెద్ది మూవీపై చిరు సంచలనం వైరల్ గా మారిన ట్వీట్
-
అభిమానుల ఓవరాక్షన్.. ఉపాసన ఆగ్రహం.!
టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున హడావుడి కనిపించింది. పెద్ది సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.రామ్ చరణ్ సతీమణి కూడా స్వయంగా థియేటర్కు వెళ్లి పెద్ది మూవీని వీక్షించింది. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన ఉపాసన అభిమానులతో కలిసి మూవీ చూసింది. అయితే అదే సమయంలో థియేటర్లో అభిమానుల అల్లరితో అసహనానికి గురైంది. అక్కడే గట్టిగా అరుస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్ లో గొడవ పెట్టుకున్న ఉపాసన ఒక్కసారిగా అంతా షాక్ | Upasana Viral Video | CVR News#peddimovierelease #upasana #ramcharan #theatre #ramcharanfans #virulshorts #trending #viral #shorts #cvrnews pic.twitter.com/scrQaV0bAW— Cvr News Telugu (@cvrtelugunews) June 4, 2026 -
‘పెద్ది’లో జాన్వీ కపూర్.. శ్రీదేవి ఒప్పుకునేదే కాదు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి రోజు రూ. 135 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ది ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని చెబుతున్నారు. కథతో సంబంధం లేకుండా కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే ఆమెను పరిమితం చేశారని విమర్శిస్తున్నాయి. అంతేకాదు దేవరతో పోలిస్తే.. ఇందులో ఆమె నటన మరింత దారణంగా ఉందని చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు, నడక..ఇవన్నీ బీగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్విని ఇలాంటి సినిమాల్లో నటించడానికి జాన్వీని అనుమతించేది కాదు అని నెటిజన్లు పోస్ట్ చేశారు.ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే జాన్వీ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో చాలా బాగా నటిందని ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్లో వచ్చి ఎమోషనల్ సన్నివేశంలోనూ జాన్వీ నటన బాగుందని చెబుతున్నారు. After watching Peddi, you can't help but feel pity for Janhvi Kapoor. Sridevi would have never allowed her to act in such B-grade films in the South.#Peddi #PeddiReview #JanhviKapoor pic.twitter.com/F2beJEGaYl— 𝐳𝐚𝐲𝐝 (@MaheshFallout) June 4, 2026There is no need to blacklash her role in #Peddi She did great her part more over some scenes & one song trimed in Movie. And 2nd Half One Emotional is Enough her potentiaI of acting & i accept but for section audience response. But there is no need to negative her #JanhviKappor pic.twitter.com/6MkV7qfuia— 𝐀kh!L Kesana (@AlwaysAkhilK) June 4, 2026 -
‘పెద్ది’లో హీరోయిన్కి అవమానం.. ఒప్పుకున్న జాన్వీ కపూర్!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలతో నిన్న(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రామ్ చరణ్ నటన, మేకింగ్, రెహమాన్ సంగీతంపై ప్రశంసలు కురిపించినప్పటికీ.. కథనం, జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. దేవర మాదిరే పెద్దిలోనూ జాన్వీ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. పలు సినిమా వెబ్సైట్స్ కూడా తమ రివ్యూల్లో జాన్వీ పాత్ర గురించి నెగెటివ్గానే రాసుకొచ్చాయి. అయితే తన గురించి నెగెటివ్గా రాస్తూ ఇన్స్టాలో పెట్టిన ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ చేయడమే ఇప్పుడు విమర్శకులకు దారి తీసింది.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘పెద్ది: భారతీయ సినీ చరిత్రలో ఒక హీరోయిన్కి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్తో రాసి ఉన్న ఓ రివ్యూ పేజీని జాన్వీ కపూర్ లైక్ కొట్టడంతో అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. విమర్శిస్తూ రాసిన రివ్యూను లైక్ చేసిందంటే.. తన పాత్రకు ప్రాధాన్యత లేదనే విషయాన్ని జాన్వీ కపూర్ కూడా ఒప్పుకుందంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తే.. మరికొంత మంది ఏమో పొరపాటును ఆమె లైక్ కొట్టిందేమోనని భావిస్తున్నారు. మొత్తంగా ఈ పోస్ట్ వైరల్ కావడం.. పెద్దిపై విమర్శలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్ను అన్లైక్ చేసింది. అయితే ఈ లోపే ఆమె లైక్ కొట్టిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్గా మారాయి.కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రలో కనిపించింది. అయితే అసలు కథలు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. నిడివి కూడా తక్కువే ఉంటుంది. నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అందుకే జాన్వీ పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఇక పెద్ది విషయానికొస్తే..టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
టెస్ట్ షూట్లోనే హీరోయిన్పై దర్శకుడి ప్రశంసలు
ఎవరికై నా ప్రశంసలు అంత సులభంగా రావు. కొందరు ముఖస్తుతి కోసం ప్రశంసలు కురిపించినా, నిజమైన ప్రశంసలు ప్రతిభతోనే వస్తాయి. అలా నటి కయదులోహర్ టెస్ట్ షూట్లోనే దర్శకుడు మారిసెల్వరాజ్ ప్రశంసలు అందుకున్నారు. బైసన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత మారిసెల్వరాజ్ ధనుష్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి మరి కొంత సమయం పడుతుండడంతో మారి ఈ మధ్యలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మంజనధి అని టైటిల్ను నిర్ణయించారు. ఇందులో తన తొలి చిత్రం పరియేరుమ్ పెరుమాళ్లో నటించిన కదిర్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. అందులో కయదులోహర్, ప్రియాంకమోహన్ ఇప్పటికే ఎంపికయ్యారు. ఇందులోని ఒక కథానాయకి పాత్రకు నటి కయదులోహర్ సరిగా నప్పుతారా అన్న సందేహం దర్శకుడు మారికి కలిగిందట. దీంతో ఆమెకు మాత్రం టెస్ట్ షూట్ నిర్వహించారట. అందులో ఆమె నటన చూసి దర్శ కుడు ఫిదా అయినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం తరువాత కయదులోహర్ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటిని మరిచిపోయారని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. అలా టెస్ట్ షూట్లోనే దర్శకుడు ప్రశంసలు అందుకోవడం ఆమెకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఈచిత్రంలో మరో కథానాయికి కూడా ఉంటుందని సమాచారం. ఇకపోతే దర్శకుడు మారినే నిర్మాతగా వ్యవహరిసు న్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్లో పెద్ది రాంచరణ్లా.. రియల్ లైఫ్లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్తో క్రీడారంగంలో హాట్ టాపిక్గా మారాడు. తాజాగా.. రోమ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్మన్గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్లోనూ అతను అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్లో కొత్త స్టార్గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
సిగ్మా స్టైల్
సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా నుంచి ‘సిగ్మా స్టైల్’ అంటూ ఈ సినిమా మ్యూజిక్ వీడియోను మలయాళ నటుడు–నిర్మాత దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ‘‘సందీప్–ఫరియాల డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ ట్యూన్, జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్తో ‘సిగ్మా స్టైల్’ పాటను ఇన్స్టంట్ చార్ట్బస్టర్గా నిలబెట్టాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
గండికోటలో...
విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల పెళ్లయి ముచ్చటగా మూడు నెలలైంది. అయితే ఈ ఇద్దరూ పెళ్లయిన తర్వాత జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకుని, షూటింగ్స్తో బిజీ అయ్యారు. ఇక ఈ ఇద్దరూ జంటగా సిల్వర్ స్క్రీన్పై ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా ‘రణబాలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తోనే విజయ్–రష్మిక బిజీగా ఉన్నారు.ఈ చిత్రం షూటింగ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోటలో జరుగుతోంది. కోట ముఖద్వారం దగ్గర, ధాన్యాగారంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఆదివారం గండికోటలో ఆరంభమైన ఈ చిత్రం షెడ్యూల్ నేటితో ముగుస్తుందని సమాచారం. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ రూపొందుతోంది.ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ స్టాలియన్ అనే బ్రీడ్కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం నేర్చుకున్నారు. ‘‘ఇది చాలా కఠినమైన ట్రైనింగ్. స్టాలియన్ బ్రీడ్ గుర్రాలను స్వారీ చేయడం అంత ఈజీ కాదు’’ అని ఆ మధ్య విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా యూనిట్ పేర్కొంది. చిత్రబృందం పేర్కొన్నట్లే... విజయ్ చాలా ప్రయత్నాలు చేసి, సక్సెస్ఫుల్గా హార్స్ రైడింగ్ చేయడం ఆ గ్లింప్స్లో కనిపించింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్ – అతుల్, కెమెరా: నీరవ్ షా. -
పొల్లాచ్చిలో ప్రారంభం
పొల్లాచ్చి వెళ్లింది చిరంజీవి అండ్ టీమ్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ యువ హీరోయిన్ అనశ్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని ఓ కాలేజీలో జరిగింది.చిరంజీవి–అనశ్వరల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.ఇందుకోసం ఆయన ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రం ప్రధాన కథాంశం కోల్కతా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో చిరంజీవి గ్యాంగ్స్టర్గా కనిపిస్తారని సమాచారం. అలాగే తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ఈ సినిమా కథకు కీలకమని, చిరంజీవి–అనశ్వర తండ్రీ కూతుళ్లుగా కనిపిస్తారని తెలిసింది. కెవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్ .ఎస్. -
మ్యాడ్ హీరో కొత్త సినిమా.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
మ్యాడ్ మూవీతో యూత్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరో రామ్ నితిన్. మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుందరకాండ ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇవాళ హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్తో ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ యర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. -
పెద్దిపై జపనీస్ ప్రేమ.. ఉద్యోగానికి సెలవులు పెట్టి మరి..!
మెగా హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజులు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. బుధవారం రాత్రి నుంచే పెద్ది హవా మొదలైంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే పాన్ ఇండియా రేంజ్లో పెద్దికి అభిమానుల ఆదరణ లభిస్తోంది.అయితే రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి జపాన్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్పై అభిమానంలో ఏకంగా జపాన్ మహిళలు హైదరాబాద్కు వచ్చేశారు. పెద్దిని చూసేందుకు రూ.2 లక్షల ఖర్చు పెట్టి మరి ఇండియాలో ల్యాండయ్యారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరి రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదించారు. పెద్ది సినిమా కేవలం ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే జపాన్ విమానం ఎక్కుతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Japan Rc fans watched #Peddi at bramarambha ❤️🔥Their love for @AlwaysRamCharan is unconditional 🥹❤️ pic.twitter.com/DZSEqfsWcb— Mr.RK (@RavikumarJSP) June 4, 2026 -
'నా బాడీ గార్డ్ను బయటికెళ్లకుండా చేశారు'.. రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పెద్ది హవా కనిపిస్తోంది. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది.అయితే పెద్ది మూవీతో మరో వ్యక్తి అనూహ్యంగా ఫేమ్లోకి వచ్చేశాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ స్పెషల్ బాడీ గార్డ్ కెవిన్. పెద్ది ఈవెంట్స్లో అతను కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆరా తీయడం మొదలెట్టారు. అంతేకాకుండా పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేయడం మరో విశేషం.ఇటీవల మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ అతని గురించి మాట్లాడారు. కెవిన్ చాలా త్వరగా పాపులర్ అయ్యాడని అన్నారు. అతన్ని మీరే ఫేమస్ చేశారని.. అందుకే నేను అతన్ని బయటికి వెళ్లనివ్వడం లేదని అన్నారు. కెవిన్ను స్వేచ్ఛగా బయటకు వెళ్లకుండా చేశారని సరదాగా మాట్లాడారు. కెవిన్ దాదాపు నాలుగేళ్లుగా మా కుటుంబంతోనే ఉంటున్నాడని తెలిపారు. వ్యక్తిగత దినచర్యలు అతనికి బాగా తెలుసని.. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తరచుగా వారితో పాటు వెళ్తుంటాడని రామ్ చరణ్ స్పష్టం చేశారు. కాగా.. కెవిన్ పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాకు చెందిన ఒక ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్నారు. కెవిన్ తనకు వస్తున్న ఆదరణ చూసి సోషల్ మీడియాలో భారతీయ అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. -
ఈ వీకెండ్ పండగే.. థియేటర్లలో పెద్ది.. ఓటీటీలో దురంధర్-2..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వీకెండ్ మొత్తం రామ్ చరణ్ పెద్ది హవా ఉండనుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు నుంచే పాజిటివ్ వస్తోంది. సూపర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతం మూడు రోజులు పెద్దికి కలిసి రానుంది.ఇక ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే ప్రీమియర్ షోతో దురంధర్ ఓటీటీలో సందడి చేయనుంది. దీంతో పాటు అగ్లీ స్టోరీ, కేడీ ది డెవిల్ లాంటి సినిమాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఈ ఫ్రైడే పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు సైతం స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ 29 (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూన్ 05 మెక్సికో 86 (స్పానిష్ సినిమా) - జూన్ 05 ఆఫీస్ రొమాన్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 05 టీచ్ యూ ఏ లెసన్ (కొరియన్ సిరీస్) - జూన్ 05 ద మార్క్డ్ ఉమన్ (స్పానిష్ సినిమా) - జూన్ 05స్కార్లెట్ (హాలీవుడ్ మూవీ)- జూన్ 06 యూఎస్ఏ 94 (పోర్చుగీస్ చిత్రం) - జూన్ 07జియో హాట్స్టార్ ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05అమెజాన్ ప్రైమ్ ద పిరమిడ్ స్కీమ్ (హిందీ సిరీస్) - జూన్ 05 పీటర్(కన్నడ సినిమా)- జూన్ 05జీ5 పేట్రియాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 05 కేడీ ద డెవిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05 బ్రౌన్ (హిందీ సిరీస్) - జూన్ 05సోనీ లివ్ గుల్లాక్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05సన్ నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ అశోక (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 05ఆహాఅగ్లీ స్టోరీ(తెలుగు సినిమా)- జూన్ 5ఆపిల్ టీవీకేప్ ఫియర్(హాలీవుడ్ సినిమా)- జూన్ 05 -
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ బుల్లితెర నటి సంభావనా సేథ్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ఆమె తాజాగా కవల బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమెకు ఓ పాప, బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తల్లిదండ్రులుగా మారే ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సంభావనకు శుభాకాంక్షల చెబుతున్నారు.నటి తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ సంవత్సరం మహా దీపావళి ముందుగానే వచ్చింది. లక్ష్మీదేవి, గణేశుడు ఇద్దరూ మా ఇంటికి వచ్చేశారు. ఈ సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. హర హర మహాదేవ్' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. కాగా.. నటి సంభావన సేథ్.. నటుడు-రచయిత అవినాష్ ద్వివేదిని పెళ్లాడారు.కాగా.. గతంలో సంభావనా సరోగసీ ద్వారా బిడ్డను ఆశిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక ఒత్తిడి గురించి సంభావన మాట్లాడింది. ఈ ప్రక్రియలో భాగంగా మూడు నెలల పాటు 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు సంభావన, అవినాష్ల వివాహం జూలై 14, 2016న జరిగింది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) -
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓవర్సీస్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా విదేశాల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. మే 14వ తేదీ నుంచే ఓవర్సీస్లో అందుబాటులోకి వచ్చేసింది.దీంతో ఇండియా ఫ్యాన్స్ సైతం దురంధర్-2 ఓటీటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దురంధర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచే జియో హాట్స్టార్ వేదికగా ప్రీమియర్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. దురంధర్-2 కథేంటంటే?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
పెద్దిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది మాటనే వినిపిస్తోంది. బుధవారం రాత్రి మొదలైన హడావుడి తొలి రోజే మరింత ఊపందుకుంది. పెద్ది మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పెద్దిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్తో పాటు ఉపాసన కూడా వీక్షించారు.తాజాగా పెద్ది మూవీని యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వీక్షించారు. హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో వీక్షించిన సందీప్ రెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. థియేటర్ నుంచి బయటికి వస్తున్న సందీప్ను అక్కడే ఉన్న కొందరు అభిమానులు సినిమా ఎలా ఉంది? అని అడిగారు. దీనికి సందీప్ రెడ్డి బదులిస్తూ.. బాగుంది అని రిప్లై ఇచ్చారు. కాగా.. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన పెద్దికి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి స్పిరిట్ టైటిల్ ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Sensational director Sandeep Reddy Vanga snapped at AMB Cinemas, Hyderabad after watching the special screening of Ram Charan's #Peddi!#SandeepReddyVanga #RamCharan #PeddiMovie #AMBCinemas pic.twitter.com/r1dmMAovhq— SR PROMOTIONS (@SRPROMOTIONS29) June 4, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..!
రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ మహిళ అభిమాని ఏకంగా థియేటర్లోనే డ్యాన్స్ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.‘పెద్ది’ రిలీజ్.. థియేటర్లో డాన్సులతో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్.మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీమియర్లతోనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో పేపర్ల వర్షం, ఈలలు, డ్యాన్స్లతో అభిమానులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.అయితే అందరి దృష్టిని… pic.twitter.com/eMWVbzWkvN— Tupaki (@tupaki_official) June 4, 2026 -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, సీబీఎఫ్సీ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆయన ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.పహ్లాజ్ నిహలానీ తన కెరీర్లో 'ఆంఖేన్', 'అందాజ్', 'తలాష్', 'రంగీలా రాజా', 'జూలీ 2' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా పనిచేశారు. సెన్సార్షిప్, ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో ఆయన ఉన్న సమయంలో, తీసుకున్న అనేక నిర్ణయాలు చిత్ర పరిశ్రమలో చర్చలకు దారితీశాయి. నిహలానీ నిర్మాతగా వివిధ జానర్లకు చెందిన అనేక కమర్షియల్ హిందీ చిత్రాలు నిర్మించారు. హిందీ చిత్ర పరిశ్రమకు దశాబ్దాల పాటు ఆయన సేవలందించారు. ఆయనకు భార్య నీతా, ముగ్గురు కుమారులు విశాల్, దీపేశ్, చిరాగ్ ఉన్నారు. -
రష్మిక రెమ్యునరేషన్ రూ. 15 కోట్లు!
సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇక గుడ్బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్ చిత్రంతో కమర్షియల్గా సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా కేరీర్కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్ఖాన్కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. రష్మిక ఇప్పుడు కాక్–టెయిల్–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్ చేసినట్లే అవుతుంది. -
‘పెద్ది’పై చిరంజీవి రివ్యూ.. గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది చిత్రం థియేటర్స్లో సందడి చేస్తోంది. నిన్న(జూన్ 3) రాత్రి ప్రీమియర్ షో నుంచే మెగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్స్కి పోటెత్తారు. ఒక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సినిమా చూసి..సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు సినిమాపై స్పందించాడు. ఎక్స్ వేదిగా ‘పెద్ది’పై తనదైన శైలీలో రివ్యూ ఇస్తూ.. ‘తండ్రిగా, నటుడిగా చరణ్ చూసి గర్వంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(చదవండి: పెద్ది మూవీ రివ్యూ)‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీష్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబుకి అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన రెహమాన్కి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్ను అత్యద్భుతంగా మలిచిన, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన కొల్లా అవినాష్, తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలికి ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. పెద్ది సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. -
Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. బ్లాక్ బస్టర్
-
‘పెద్ది’ గాడి మాస్ ఎంట్రీ.. థియేటర్స్లో పేపర్లు ఎగరేసిన ఉపాసన
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం పెద్ది థియేటర్స్లో సందడి చేస్తోంది. రిలీజ్కి ఒక్క రోజు ముందు అంటే నిన్న(జూన్ 3) రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మెగా అభిమానులంతా థియేటర్స్కి పోటెత్తారు. ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా నిన్న రాత్రే సినిమా చూశారు. హైదరాబాద్ బాలానగర్లో ఉన్న విమల్ థియేటర్స్లో అభిమానుల మధ్య ఉపాసన తన స్నేహితులతో కలిసి సినిమా వీక్షించారు. పెద్ది పాత్ర ఎంట్రీ కాగానే ఫ్యాన్స్తో కలిసి పేపర్లు ఎగరేస్తూ, ఆనందంతో గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక మెగా అభిమానులు అయితే రాత్రి నుంచే నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సినిమా చూసిన వారిలో చాలా మంది చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. రెహమాన్ బీజీఎంపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్ మొత్తంలో ఇప్పుడు పెద్ది గురించే చర్చ కొనసాగుతోంది. మరి కలెక్షన్ల పరంగా పెద్ది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. Upasana garu is throwing papers for RC’s entry ❤️ #Peddi #Ramcharan #Upasana pic.twitter.com/9g6Ng33eES— justin telugu (@JustinTelu59343) June 3, 2026 -
సింగ్ గీతంలో నాది బలమైన పాత్ర
‘‘సింగీతం శ్రీనివాస్గారి సినిమాల్లో మహిళల పాత్రలు బలంగా ఉంటాయి. ‘సింగ్ గీతం’లో నాది కూడా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర’’ అని అహల్య బమ్రూ తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ హీరో హీరోయిన్లుగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా అహల్య బమ్రూ మాట్లాడుతూ– ‘‘మాది పుదుచ్చేరి. ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ వంటి భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను. నేను ఎప్పుడూ నటిని అవ్వాలని అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్గారు నా కంటెంట్ చూసి ‘సింగ్ గీతం’ గురించి చెప్పారు. నా ఆడిషన్ కూడా ఇన్స్టా్రగామ్ ద్వారానే ఇచ్చాను. 94 ఏళ్ల వయసులో మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం సింగీతంగారికే సాధ్యం. నిర్మాతగానే కాదు.. క్రియేటివ్ ్ర΄ాసెస్లో కూడా నాగ్ అశ్విన్గారు కీలక ΄ాత్ర ΄ోషించారు. తెలుగులో మహేశ్బాబుగారు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : పెద్దినటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులునిర్మాత: సతీష్ కిలారుసమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్రచన-దర్శకత్వం: బుచ్చిబాబుసంగీతం: ఏఆర్ రెహమాన్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: జూన్ 4, 2026గ్లింప్స్తోనే అంచనాలు పెంచేసిన చిత్రం ‘పెద్ది’. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అదించిన తెలుగు చిత్రం ఇదే కావడం మరో ప్రత్యేకం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలకు, ఆసక్తికి దీటుగా ఈ చిత్రం ఉందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూ(Peddi Review)లో చూద్దాం.కథేంటంటే..1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్), రామ్ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే...గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఓ ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ఓ ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్తో తెరపై ఎంట్రీ ఇచ్చి, కుస్తీతో ఆకట్టుకొని, అథ్లెట్గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. మూడు విభిన్నమైన క్రీడల్నీ తీసుకున్న బుచ్చి బాబు.. వీటి మధ్యలో ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహకందేలా సాగడమే ఇక్కడ కొంతవరకు మైనస్. అయితే రామ్ చరణ్ నటన, రెహమాన్ నేపథ్య సంగీతం ఆ మైనస్ని కొంతవరకు కప్పిపుచ్చాయనే చెప్పాలి.2016లో కథ ప్రారంభం అవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్కి కేవలం 2 ఓలింపిక్స్ పథకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై సీరియస్ అవ్వడం.. వచ్చే పోటీల్లోపు మెరికాల్లాంటి కుర్రాళ్లను తయారు చెయమని ఆదేశించడం.. ఓ అధికారి(బోమన్ ఇరానీ) విజయనగరం రావడం.. అక్కడ పెద్ది పేరు విని..అతని గురించి తెలుసుకునేందుకు ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరి వ్యక్తి పెద్దికి భారీ ఎలివేషన్ ఇస్తూ.. స్టోరీని ప్రారంభిస్తాడు. అయితే కేజీయఫ్ తర్వాత ఇలా హీరో కథని ఎలివేషన్ ఇస్తూ, ముక్కలు ముక్కలుగా చెప్పడం రొటీన్గా మారింది. అందుకే పెద్ది ప్రారంభం అంత ఆసక్తికరంగా అనిపించదు. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్లో సిక్సర్ కొడతాడో.. అప్పటి నుంచి కథనం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెబుతూనే.. మరోవైపు అప్పల సూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి.. అసలు సంఘర్షణ ఏంటనేది మొదటి నుంచే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అయితే అచ్చీయమ్మగా జాన్వీ ఎంట్రీ, ఎన్నికల ప్రచారం.. ముద్దు సీన్.. ఇవేవి అంతగా ఆకట్టుకోవు. అసలు కథకు ఈమె పాత్రకు సంబంధమే ఉండదు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమెషనల్గా సాగుతాయి. పోలీస్ స్టేషన్ సీన్తో హీరో మెయిన్ ట్రాక్ ఎక్కుతాడు. ఇంటర్వెల్ సీన్ ని దర్శకుడు చక్కగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు.. సెకండాఫ్ని మాత్రం వాటిని పట్టించుకోకుండా చెప్పాల్సిన పాయింట్పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ అన్ని ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే కీలక మలుపు రావడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఢిల్లీ ఎపిసోడ్.. ప్రమోషన్స్లో చెప్పినంత గొప్పగా ఏమి ఉండదు. కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం హృదయాలను హత్తుకుంటుంది. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్ విషయంలో దర్శకుడు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా తెరపై సహజంగానే కనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథనం ఎమోషనల్గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఇది. క్రికెటర్గా, కుస్తీ ఆటగాడిగా, అథ్లెట్గా మూడు విభిన్నమైన పాత్రలతో కనిపించిన చరణ్..ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రతో జగపతి బాబు ఒదిగిపోయాడు. అయితే ప్రమోషన్స్లో ఇచ్చినంత ఎలివేషన్స్ మాత్రం సినిమాలో లేవు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకు శివరాజ్కుమార్ న్యాయం చేశాడు. ఇక అచ్చియమ్మగా జాన్వీ కపూర్ తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథకి ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. హీరోయిన్ అన్నాక కథకు కొంత లింకు చేయాలి అన్నట్లుగా.. కొంతవరకు అలా చూపించారంతే. రామ్ బుజ్జిగా దివ్యేందుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'. ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ. -
పెద్ది రిలీజ్ వేళ.. శ్రీవారి సేవలో బుచ్చిబాబు ఫ్యామిలీ
పెద్ది రిలీజ్ వేళ బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ది కోసం రామ్ చరణ్తో సహా తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూన్ 3 రాత్రి నుంచే పెద్ది ప్రీమియర్స్ షోలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
ఓటీటీకి డకాయిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. డకాయిట్ హిందీ వర్షన్ జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్లో హిందీ వర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.డకాయిట్ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.pyaar mein badla ya pyaar se badla 💔#DacoitOnPrime, In Hindi, June 5@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 #SupriyaYarlagadda @Deonidas #ZaynMarieKhan @bhaskarla_sai @atul_kulkarni #BheemsCeciroleo @abburiravi @AnnapurnaStdios @AsianSuniel #SSCreations @sonymusicindia pic.twitter.com/zNvGM3KtJ0— prime video IN (@PrimeVideoIN) June 3, 2026 -
పెద్ది ప్రీమియర్ షో.. ఉపాసన ఏ థియేటర్లో చూడనుందంటే?
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెద్ది పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమా చూసేందుకు మెగా ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోయాయి.ఈ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల రానుంది. బాలానగర్లో విమల్ 70ఎంఎం థియేటర్లో ఆమె పెద్దిని వీక్షించనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్కు ఉపాసనతో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా హాజరు కానున్నారు. పెద్ది కోసం గ్రాండ్గా సెలబ్రిటీ ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం పెద్దిని వీక్షించనున్నారు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
విజయ్ దేవరకొండ రణబాలి.. గండికోటలో గుర్రపు స్వారీ..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ రణబాలి. ఈ మూవీని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ కథ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే కర్నూల్, నంద్యాల జిల్లాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ జరిగింది.ప్రస్తుతం రణబాలి షూటింగ్ కడప జిల్లాలోని గండకోటలో జరుగుతోంది. రాయలసీమ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా కోట ముఖద్వారం వద్ద, ధాన్యాగారంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Grand Canyon of India Gandikota Maa Rayalaseema Ela anipinchindi anna @TheDeverakonda ❤️#VijayDevaraKonda #Ranabali https://t.co/NVMZTfLF9a pic.twitter.com/ALGkWAr9Fb— Narasimha NTR 🦚 (@NarasimhaNTR_) June 2, 2026 -
పెద్ది ఫస్ట్ రివ్యూ.. అంచనాలు పెంచేసిన సమంత
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సనా కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం ఈ రోజు(జూన్ 3) రాత్రికే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే అప్పుడే రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. అందులో వాస్తవం ఉందో తెలియదు కానీ.. సినిమా సూపర్, రామ్ చరణ్ నటన అదిరిపోయిందంటూ ఎక్స్లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. క్రీడాకారుడిగా రామ్ చరణ్ నటన అదరగొట్టేశాడని సెన్సార్ సభ్యులు అన్నారట. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింటని చెప్పారట. అంతేకాదు జాన్వీ కపూర్, జగపతి బాబు నటనపై కూడా ప్రశంసలు కురిపించారట.#Peddi అందరూ రామ్ చరణ్ గురించే మాట్లాడుతున్నారు..అయితే ఓ సీన్ లోజాన్వి ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తుంది..విజిల్స్ వేయిస్తుంది— devipriya (@sairaaj44) June 3, 2026మరోవైపు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్పై ప్రశంసలు కురిపిస్తూ..పెద్దిపై హైప్ క్రియేట్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో సమంంత మాట్లాడుతూ.. 'నేను పెద్ది సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఇది పెద్ది టైమ్. చరణ్ ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరచబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. నాకు ఈ సినిమాలో బ్లాక్బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం టీమ్కు ఆల్ ది బెస్ట్' అంటూ తన శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్తో పాటు పలువు టాలీవుడ్ హీరోలు కూడా పెద్ది టీమ్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేశారు. INSIDE REPORTS:#PEDDI seems to be a film that will connect more strongly with South Indian audiences. The emotions, setting, and mass moments feel very rooted, making it a proper big-screen experience. 🔥— Cɪɴᴇ Hᴜɴɢᴀᴍᴀ (@Cinehungamaa) June 3, 2026 -
అల్లు అర్జున్- లోకేశ్ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ లుక్ తోడేలును తలపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో అల్లు అర్జున్ నెగెటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగానే బన్నీ మరో సినిమా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో మూవీని(AA23) చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. -
థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!
పెద్ది మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే భారీస్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్కు ఒక్క రోజు ముందే థియేటర్లలో పెద్ది పండుగ వాతావరణం నెలకొంది. దీంతో హైదరాబాద్లో నగరంలో ప్రముఖ థియేటర్ల వద్ద అభిమాన హీరో రామ్ చరణ్ కటౌట్స్తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయితే రామ్ చరణ్ విగ్రహం కాస్తా ట్రోలింగ్కు గురైంది. అస్సలు రామ్ చరణ్లా లేదంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ్ చరణ్లా లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం విమర్శించారు. విగ్రహంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన అభిమాన సంఘం తమ పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం.. రామ్ చరణ్ విగ్రహంతో మా ప్రేమ, అభిమానం, భక్తిని ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాం అని క్లారిటీ ఇచ్చారు.ఆ విగ్రహం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు జోజు జార్జ్లా ఉందని కొందరు ట్రోల్స్ చేశారు. మరికొందరు నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం? అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి.. రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026 -
ముచ్చటగా మూడోసారి.. ప్రియురాలితో అమిర్ ఖాన్ పెళ్లి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆరు పదుల వయసులో తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లాడనున్నారు. అయితే ఈ పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈనెల జూన్ 5న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అమిర్ ఖాన్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ఇటీవలే తమ బంధాన్ని అఫీషియల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరు ఇప్పటికే తమ పెళ్లికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వీరి పెళ్లికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యే అవకాశముందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈ జంట ఇరు కుటుంబాల మద్దతుతోనే పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.కాగా.. ఆమిర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత కిరణ్ రావుతో 2021లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్తో డేటింగ్లో ఉన్న అమిర్ ఖాన్.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జూలై 5న జరిగిన రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోనున్నారు. గతేడాది ముంబయిలో జరిగిన ఒక బర్త్డే వేడుకల్లో తన ప్రియురాలు గౌరీని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గౌరీ స్ప్రాట్కు ఇప్పటికే క్విన్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
Madhuvidhu: ఈ పెళ్ళి కుదరదు.. ఆ హనిమూన్ అవ్వదు... ఎలా?
పెళ్ళి అనేది కొన్ని కుటుంబాలతో పాటు తరాలను కలుపుతుంది. అందుకే అంటారు మన పెద్ద వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు తరాలు చూసి సంబంధం కలుపుకోమని. అలా అనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పెళ్ళి సాంప్రదాయాలను పద్ధతిగా పాటిస్తుంటారు. పద్ధతిగానే కాదు కొంతమంది మూర్ఖంగా కూడా పాటిస్తుంటారు. ఆ అంశంతోనే రూపుదిద్దుకున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా మధవిధు.జై విష్ణు, బిబిన్ మోహన్ అందించిన కథకు విష్ణు ఆనంద్ తెర కెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పాలి. మధువిదు సినిమా మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.ఆంజిల్ ముట్టిల్ కుటుంబంలో పెద్దవాడైన అమృతరాజ్ ఓ కేప్ నడుపుతూ ఉంటాడు. వయసు పైబడినా ఇంకా అమృతరాజ్ కు పెళ్ళవదు. అందుకే అమృతరాజ్ తన పెళ్ళి కోసం తెగ ఆరాటపడుతూ ఉంటాడు. అమృతరాజ్ ఇంట్లో తమ్ముడితో సహా తన తండ్రి, తాతతోపాటు బాబాయ్ ఉంటారు. అమృతరాజ్ తల్లి చిన్నపుడే చనిపోతుంది. ఒక్క ఆడ దిక్కులేని ఈ కుటుంబానికి ఊళ్ళో వాళ్ళు అనే మాటల వల్ల పెళ్ళి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. ఆంజిల్ ముట్టిల్ కుటుంబానికి తరతరాల నుండి ఏదో ఆడశాపం ఉందని వినికిడి. దీంతో బాగా దిగాలు పడిన అమృతరాజ్ ఎట్టకేలకు స్నేహ అనే అమ్మాయిని ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి అందరితో కలిసి స్నేహ వాళ్లింటికి వెళతారు. పేరుకు అమృతరాజ్ పెళ్ళి చూపులైనా అమృతరాజ్ తండ్రి స్నేహ అత్తను గుర్తుపట్టి, ఇష్టపడి తరువాత ఎవరికీ చెప్పకుండా లేచిపోయి పెళ్ళి చేసుకుంటాడు. ఇక అక్కడి నుండి అమృతరాజ్ వెళ్ళి కథ మళ్ళీ మొదటికొస్తుంది. దీంతో మళ్ళీ అమృతరాజ్ నానా తంటాలు పడుతూ స్నేహ వాళ్ళ నాన్నను పెళ్ళి కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో స్నేహ చెల్లెలు సోఫీ పెళ్ళి ఖాయమవుతుంది. కాని రేపు పెళ్ళి అనగా అబ్బాయి తనకు ఇష్టం లేదని సోఫీ అమృతరాజ్ కి మాత్రం తెలియచేస్తుంది. మరి సోఫీ పెళ్ళి ఆపించి తన పెళ్ళి జరిగేలా అమృతరాజ్ చేయగలడా లేదా అన్నది మాత్రం మధువిధు సినిమాలోనే చూడాలి. అవడడానికి ఇది మళయాళ సినిమా అయినా సోనీలివ్ ఓటిటి వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. సినిమా ఆద్యంతం నవ్వులతో సరదాగా సాగిపోతుంది. మస్ట వాచ్ ఫర్ ది వీకెండ్.– హరికృష్ణ ఇంటూరు -
మీ అభిమానం సల్లగుండా.. పెద్ది కోసం రూ.2 లక్షల ఖర్చు..!
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది సందడి మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా పెద్ది మానియా కనిపిస్తోంది. టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్స్లో పెద్ది దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలోనూ ప్రీ బుకింగ్స్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మూవీపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.ఈ సినిమాకు ఫ్యాన్స్ కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్లోనూ ఉన్నారు. పెద్ది కోసం ఏకంగా విదేశాల నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టారు. జపాన్లోని టోక్యోకు చెందిన ఇద్దరు జపనీస్ మహిళ అభిమానులు భాగ్యనగరానికి చేరుకున్నారు. పెద్దిని చూసేందుకు దాదాపు రూ.2 లక్షల ఖర్చు చేసి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరు పెద్ది సినిమాను 3 రోజుల్లో 10 సార్లు చూడాలన్నదే ఆశయమని చెబుతున్నారు. తెలుగు భాష రాకపోయినా కేవలం అభిమానంలో జపాన్ నుంచి ఇండియాకు రావడమంటే మాటలు కాదు. ఇది చూసిన కొందరు ఖరీదైన అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. -
రణ్వీర్ సింగ్కు బిగ్ రిలీఫ్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై విధించిన నాన్ కో ఆపరేషన్(సహాయ నిరాకరణ) ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రర్న్ సినీ ఎంప్లాయిస్ యూనియన్(ఎఫ్డబ్ల్యూఐసీఈ) ప్రకటించింది. ఈ విషయాన్ని ఎఫ్డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ ప్రకటించారు. సినీ కార్మికుల సంఘాలు, నిర్మాతల మండలి అభ్యర్థన మేరకు రణవీర్ సింగ్పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రణ్వీర్ లీగల్ నోటీసులు పంపిన అనంతరం అతనిపై నిషేధం తొలగించారు.మొదట డాన్-3 మూవీ విషయంలో తలెత్తిన వివాదంతో రణ్వీర్ సింగ్పై నిషేధం విధించారు. ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ సింగ్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో వివాదం మొదలైంది. తనపై నిషేధాన్ని తొలగించాలని రణ్వీర్ కోరాడని ఫెడరేషన్ ముఖ్య సలహాదారు, ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ వెల్లడించారు. ఈ వివాదంపై డాన్-3 మేకర్స్తోనే చర్చించుకోవాలని రణ్వీర్కు చెప్పామని తెలిపారు. ఈ విషయంలో అతని నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అయితే రణ్వీర్ సింగ్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరమైన మార్గాల ద్వారానే స్పందిస్తామని కూడా ఫెడరేషన్ తెలిపింది.మరోవైపు ఏ కళాకారుడిపైనా నిషేధం విధించే అధికారం ఫెడరేషన్కు లేదని ఎఫ్డబ్ల్యూఐసీఈ ముఖ్య సలహాదారు అశోక్ పండిట్ అన్నారు. దయచేసి నిషేధం అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆయన మీడియాను కోరారు. ఒక వ్యక్తితో కలిసి పనిచేయవద్దని తన సభ్యులకు కేవలం సలహా మాత్రమే ఇవ్వగలదని తెలిపారు. ఎవరినీ వారి వృత్తిని కొనసాగించకుండా నిరోధించలేదని స్పష్టం చేశారు. రణ్వీర్ సింగ్ పంపిన నోటీసును ఫెడరేషన్ న్యాయ బృందం పరిశీలిస్తోందని.. దీనికి న్యాయ మార్గాల ద్వారా స్పందిస్తామని పండిట్ వెల్లడించారు. ఎఫ్డబ్ల్యూఐసీఈ చర్చలకు సిద్ధంగా ఉందని.. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రణ్వీర్ సింగ్ కూడా చర్చలో పాల్గొంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఇకనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో వేచి చూడాల్సిందే.The Federation of Western India Cine Employees (FWICE) announces withdrawal of non-cooperation directive against Actor Ranveer Singh pic.twitter.com/aYsVPCQq0B— ANI (@ANI) June 3, 2026 -
పెద్ది ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్ ట్విస్ట్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్లో చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.అయితే 4డీఎక్స్ ఫార్మాట్లో పెద్దిని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్ వర్షన్లో చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. -
‘పెద్ది’ విజయం.. వీరికి చాలా కీలకం
మరికొన్ని గంటల్లో పెద్ది(Peddi) మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పెద్దితో టాలీవుడ్కి పెద్ద విజయం వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విజయంపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. కొంతమందికి అయితే ఈ సినిమా విజయం చాలా అవసరం. వారిలో మొదటి వరులో ఉన్నది హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాతో వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది. ఇప్పుడు రామ్ చరణ్ ఆశలన్నీ పెద్ది పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయంపైనే చరణ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెద్ది సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ తీసుకొస్తే.. పాన్ ఇండియా మార్కెట్లో చరణ్ వ్యాల్యూ పెరిగిపోతుంది. అతని పారితోషికం పెరగాలన్నా.. పాన్ ఇండియా స్టార్స్తో పోటీలో నిలవాలన్నా పెద్ది విజయం చరణ్కు చాలా అవసరం.ఇక దర్శకుడు బుచ్చిబాబుకు కూడా పెద్ది హిట్ అత్యంత కీలకమనే చెప్పాలి. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు. రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం బుచ్చిబాబు అదృష్టం అని చెప్పాలి. అయితే ఈ సినిమా విజయం సాధిస్తేనే బుచ్చిబాబు కెరీర్ బాగుంటుంది. తర్వాత కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు వస్తాయి. బోల్తా పడితే మాత్రం ఆ నింద ఎక్కువగా బుచ్చిబాబుపైనే పడుతుంది. ఆయన కెరీర్కి ఈ సినిమా చాలా కీలకం.వీరితో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్కి కూడా పెద్ది హిట్ చాలా అవసరం. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా..తొలి సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. తెరపై కనిపించింది కూడా చాలా తక్కువే. పెద్దిలో అచ్చియమ్మ పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలనుకోంటోంది. సినిమా హిట్ అయితేనే ఆమె పాత్రకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్మాత వెంకట సతీష్కి కూడా పెద్ది విజయం చాలా కీలకం. ఆయన నిర్మాతగా చేసిన తొలి సినిమా ఇది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఓ రకంగా ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. చరణ్ సినిమా కాబట్టి హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్తో పాటు నిర్మాతగా మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇలా భారీ ఆశలతో వస్తున్న పెద్ది సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. -
త్రిషకు మెగా కోడలి సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
హీరోయిన్ త్రిషకు మెగా ఫ్యామిలీ సర్ప్రైజ్ ఇచ్చింది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన నుంచి ప్రత్యేక బహుమతిని అందుకుంది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ పొందింది. అత్తమ్మాస్ కిచెన్ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియాలో పంచుకుంది. థ్యాంక్ యూ ఉపాసన.. ది సమ్మర్ స్పెషల్ గిఫ్ట్.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది.కాగా.. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ ఈ వంటకాలు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచారు. ఇందులో కేసరి, పొంగల్, ఉప్మా, రసం లాంటి వంటకాలు ఉండనున్నాయి. అత్తమ్మాస్ కిచెన్లో పులిహోర వంటకం ఎక్కువగా ఫేమస్ అయింది. త్రిషకు పంపిన గిఫ్ట్ హ్యాంపర్లో రుచికరమైన ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు కూడా ఉన్నాయి. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఇక త్రిష విషయానికొస్తే.. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోనుందని రూమర్స్ కూడా వస్తున్నాయి. వాటన్నింటికీ త్రిష సైతం తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తూనే ఉంది. ఇటీవల నా కుక్కకు మాత్రమే వ్యక్తగత విషయాల్లో అనుమతి ఇస్తానని రూమర్స్ను ఉద్దేశించి పోస్ట్ చేసింది. -
నాట్ అధ్యక్షుడిగా టాలీవుడ్ నిర్మాత
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (ఎన్.ఎ.టి.ఎస్) నూతన అధ్యక్షుడిగా టాలీవుడ్ నిర్మాత(ఇటీవల వచ్చిన నిలవే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు) రాజ్ అల్లాడ ఎన్నికయ్యారు. 2026–2028కి గాను నూతన కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి ‘ఎన్.ఎ.టి.ఎస్’లో వాలంటీర్గా సేవలందిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలుమార్లు బోర్డ్ మెంబర్గా చేశారు. సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తపన వల్ల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ, వైస్ ప్రెసిడెంట్గా (ప్రోగ్రామ్స్) రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్గా (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్) అనుదీప్ అర్లా, వైస్ ప్రెసిడెంట్గా (సర్వీసెస్) రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భానులంక, జాయింట్ ట్రెజరర్గా వెంకట శాఖమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఆ ఊరిలో పాటల రూపంలో మాట్లాడతారు.. అదే ‘సింగ్ గీతం’
‘‘సింగ్ గీతం’ పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్. కుబేరపురం అనే ఒక ఫిక్షనల్ గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరిలో అందరూ పాటల రూపంలో ఎందుకు మాట్లాడతారు? అనేది థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిందే. ఇలాంటి జానర్లో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు’’ అని శాలిని కొండెపుడి తెలిపారు.లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శాలిని కొండెపుడి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మై డియర్ దొంగ, జయమ్మ పంచాయితీ, శుభం’ వంటి చిత్రాలు చేశాను.‘సింగ్ గీతం’లో నా పాత్ర నెగటివ్ షేడ్లో ఉంటుంది. తాను అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వంతో పాటు తాను నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. సింగీతం, నాగ్ అశ్విన్గార్ల విజన్తో పాటు వారి సెన్సిబిలిటీస్ కూడా ఈ మూవీలో కనిపిస్తాయి. సింగీతంగారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్గారు మాటలను పాటలుగా అద్భుతంగా మార్చారు. నాగ్ అశ్విన్గారు నిర్మించిన ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా కోసం కథ రాస్తున్నాను. ఈ మూవీకి నేనే దర్శకత్వం వహిస్తాను’’ అని తెలిపారు. -
ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘నా కెరీర్లో 38 చిత్రాలకు సంగీతం అందించిన దర్శకుడిగా నా పుట్టినరోజున ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ వారి నుంచి మెమొంటో అందుకున్నాను... ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. నేను తీసిన ‘వేదవ్యాస్’ సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలి పారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వేదవ్యాస్’. ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్ హీరోగా, కొరియన్ నటి జూన్ హ్యూంజీ హీరోయిన్గా, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ విలన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు.నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాప రెడ్డి నిర్మించిన ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో ‘వేదవ్యాస్’ మూవీ మేకింగ్ వీడియోను లాంచ్ చేశారు.అచ్చిరెడ్డి మాట్లాడుతూ–‘‘నాలుగైదు ఏళ్లుగా ‘వేదవ్యాస్’ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ వచ్చాం’’ అని పేర్కొన్నారు. ‘‘వేదవ్యాస్’ ఔట్పుట్ చాలా బాగా వచ్చింది’’ అని చె΄్పారు కొమ్మూరి ప్రతాపరెడ్డి. ఈ వేడుకల్లో నటులు మురళీమోహన్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, అలీ, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, దామోదర ప్రసాద్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
సీఎం విజయ్తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సినీ హీరో విజయ్ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు. ‘కరుప్పు’ కథను మొదట విజయ్కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది. -
ప్రముఖ ఆలయంలో తనికెళ్ల భరణి పూజలు
టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి నారపల్లి దివ్యనగర్లోని శివ పంచాయతన సమేత హనుమదాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం గురించి తెలుసుకున్న తనికెళ్ల భరణి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
కేజీఎఫ్ హీరో గొప్ప మనసు.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్..!
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో ప్రస్తుతం టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతూ మోహన్దాస్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జూన్లో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న రామాయణలోనూ యశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ యశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఒక అభిమాని సునీల్కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతనిలో ధైర్యం నింపారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అభిమాన హీరో మాట్లాడడంతో క్యాన్సర్ బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. యశ్ ఆత్మీయ సంభాషణ అతనిలో కొత్త భరోసాను తీసుకొచ్చింది.క్యాన్సర్తో పోరాడుతున్న సునీల్ శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు కావడం విశేషం. అతనికి చికిత్స సమయంలో అండగా ఉంటానని కూడా యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎంత బిజీగా ఉన్నా తన అభిమానితో వీడియో కాల్ చేసి మాట్లాడటంతో యశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
టాలీవుడ్ కొత్త సినిమా.. రెండు వారాల్లోనే యూట్యూబ్లో ప్రత్యక్షం
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా ఇచ్చి ఇలా వెళ్తున్నాయి. థియేటర్ నుంచే మాయం కాగానే సడన్గా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. రిలీజైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలు కేవలం వారాల్లోపే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే యూట్యూబ్లోకి వచ్చేసింది. ఉచితంగానే ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. సుదర్శన్, భద్రం, సాయి కృష్ణ తల్లాడ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం అరేయ్ ఆపండ్రా. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమా కి ఎస్.ఎస్ వెంకటేశ్ సంగీతమందించారు. -
నర్సుగా కంగనా రనౌత్.. భారత్ భాగ్య విధాత ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్సీన్ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్లోనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఏపీలో టికెట్ ధరల పెంపు.. తెలంగాణలో పెద్ది పరిస్థితేంటి?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది ప్రీమియర్స్కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే ప్రీయమర్ షోలు షురూ కానున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ది మూవీపై అంచనాలు ఓ రేంజ్కు దూసుకెళ్లాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.125 పెంచుకునేలా జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. దీంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ఇక తెలంగాణ విషయానికొస్తే పెద్ది టికెట్ ధరల పెంచేందుకు అనుమతులు రానట్టేనని తెలుస్తోంది. టికెట్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. రేపటిలోగా ఎలాంటి ప్రకటన రాకపోతే సాధారణ రేట్లతోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని పెద్ది టీమ్ భావిస్తోంది. దీంతో రేపటి నుంచే తెలంగాణలో పెద్ది మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభించే అవకాశముంది. మరోవైపు పెద్ది ప్రీమియర్స్ సైతం తెలంగాణలో లేనట్టేనని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. -
పుష్పరాజ్ మైండ్లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు
‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ‘పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రామ్చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 4న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..‘పెద్ది’ ఎలా మొదలైంది?నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్ నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. ఉప్పెన తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.ఇది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా కదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?ఇందులో హీరో క్రికెట్తో పాటు మరో రెండు ఆటలు కూడా ఆడతాడు. దాని కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం.క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్ ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.పెద్ది విజయం ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కదా?ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.‘పెద్ది’ కథ ముందు ఎన్టీఆర్ కోసం రాసుకున్నారా?లేదు. ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం తయారు చేసిన కథ.చరణ్ ని అంత ఈజీగా ఎలా కన్విన్స్ చేశారు?అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను. చరణ్ ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశాం.జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉంటుంది?జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.శివరాజ్ కుమార్, జగపతి బాబు పాత్రల గురించి చెప్పండిఇందులో శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్ఫుల్గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.రెండో సినిమాకే రూ. 350 కోట్ల బడ్జెట్.. ఎలా అనిపిస్తోంది?ఇది చరణ్ గారి వల్లే సాధ్యమైంది. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే కథకు కావాల్సినవి జరగకపోవచ్చు.ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారని విన్నాం?లేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం.ఏఆర్ రెహమాన్ గారి గురించి?నాకు రోజా, బొంబాయి.. రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు ‘పది కేజీఎఫ్లతో సమానం’ అన్నారు. మరి పెద్ది గురించి?పుష్పరాజ్ మైండ్లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు(నవ్వుతూ..)షూటింగ్ సమయంలో చరణ్కు చాలా గాయాలయ్యాయని విన్నాం?అవును. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ).చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి?పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మైండ్బ్లోయింగ్గా అనిపించింది.క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది ఎలా ఉంటుంది?ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్ట్రార్డినరీగా ఉందని చెప్పారు.చిరంజీవి గారు సినిమా చూశారా?-ఇంకా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్గా ఉంటుంది. చాలా ఎమోషనల్గా ఉంటుంది. కమర్షియల్గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. -
‘పెద్ది’ ట్రైలర్కు యావరేజ్ టాక్, కారణం ఇదే : బుచ్చిబాబు
పెద్ది సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అంచనాలు పెంచుతూనే ఉంది. రామ్ చరణ్ లుక్ రిలీజ్, గ్లింప్స్తో పాటు పాటలు కూడా ఆ అంచనాలు భారీగా పెంచాయి. అయితే ట్రైలర్ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్కు మిశ్రమ స్పందన లభించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్మీట్లో బుచ్చిబాబు దగ్గర ప్రస్తావించాడు ఓ విలేకరి. దానికి బుచ్చిబాబు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.‘కథను ఎక్కువగా చెబితే అసలు విషయం తెలిసిపోతుంది. అందుకే ట్రైలర్ని అలా కట్ చేశాం. అసలు కంటెంట్ని తీసుకోలేదు కాబట్టి.. ట్రైలర్లో చెప్పాల్సినంత చెప్పలేకపోయాం. అయితే ఒకప్పుడు ఘన విజయం సాధించిన చిత్రాల ట్రైలర్లన్నీ యావరేజ్ టాకే సంపాదించుకున్నాయి(నవ్వుతూ..). ఈ లెక్కన పెద్ది కూడా సరైన దారిలోనే వెళ్తుందేమో అనిపిస్తుంది’ అని బుచ్చిబాబు అన్నారు. ఇక రిలీజ్ దగ్గరపడుతున్నకొద్ది తనకు టెన్షన్ ఎక్కువైపోయిందన్నారు. మరికొన్ని గంటల్లో(జూన్ 4) ప్రేక్షకుల ముందుకు రానుందని, హిట్ టాక్ వస్తే హ్యాపీగా ఫీలవుతానని బుచ్చిబాబు చెప్పారు. ఇక తన కొత్త సినిమాల గురించి చెబుతూ..అల్రెడీ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. మూడో సినిమా ఎన్టీఆర్తోనే చేస్తారా అని అడగ్గా.. ‘ఆయన టైమ్ ఇవ్వాలనే కానీ క్షణాల్లో వెళ్లి కథ చెబుతా’ అన్నారు. -
'అకౌంట్లో 84 రూపాయలు.. ఆటో ఛార్జీకి కూడా డబ్బుల్లేవ్'
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ దురంధర్. ఈ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ఈ మూవీస్ ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాల ద్వారా ఎంతోమంది నటులు ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని వారు కూడా దురంధర్ మూవీతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ మూవీతో ఫేమస్ అయిన నటుడు గౌరవ్ గెరా తన లైఫ్ గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.ముంబయిలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని గౌరవ్ గెరా వెల్లడించారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఎదురైనట్లు వివరించారు. తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 84 మాత్రమే ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు. ఆటో ఛార్జీకి కూడా డబ్బులు చెల్లించలేక రోజు చాలా దూరం నడిచి వెళ్లేవాడినని తెలిపారు. 'ధురందర్: ది రివెంజ్ సూపర్ హిట్ కొట్టినా.. ఆ కష్టకాలం తనను ఎలా ఒదిగి ఉండేలా చేసిందన్నారు.తన తండ్రి మద్దతుగా నిలిచారని గౌరవ్ గెరా గుర్తు చేసుకున్నారు. మా నాన్న జీతం తీసుకునే ఉద్యోగి.. ఆయన ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయని.. వాటిలో రూ. 2,000 పంపిస్తున్నాను.. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని రాసి ఉండేదని గెరా తెలిపారు. కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తనకు ఎప్పుడూ పెద్ద భారంలా అనిపించలేదన్నారు. ఆటోకు డబ్బులు లేనప్పుడు.. తాను నడిచి వెళ్లడానికే ఇష్టపడేవాడినని తెలిపారు. తాను ఎప్పుడు తీసుకునేవాడిగా కాకుండా.. ఇచ్చేవాడిగా ఉండాలనుకున్నానని పేర్కొన్నారు.కాగా.. ధురంధర్ ఫిల్మ్ సిరీస్లో గౌరవ్ గేరా.. మహమ్మద్ ఆలం (ఆలం భాయ్)గా నటించారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్, మానవ్ గోహిల్, డానిష్ పండోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ సినిమాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. -
ఒకేసారి 8 సినిమాలు.. దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు
సాధారణంగా ఒక సంగీత దర్శకుడి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉంటేనే గొప్ప విషయం. కానీ, తన అద్భుతమైన టాలెంట్తో ఏకంగా 8 సినిమాలకు ఒకేసారి సంగీతం అందిస్తూ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి దారి తీస్తున్నారు ప్రముఖ సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. వెంకటేష్. గతంలో ఎన్నో చిత్రాలకు తన అద్భుతమైన సౌండ్ డిజైనింగ్తో ప్రాణం పోసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. ఒకేసారి విభిన్న జానర్స్లో తెరకెక్కుతున్న చిత్రాలకు ఆయన ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆయన చేతిలో ది ఫైనల్ కాల్,హనుమ,అపరిచిత దారి,చెట్టు మీద దెయ్యం నాకేం భయం,నడికట్టు,సువార్తపురం స్టూడెంట్స్(VS -1), స్పిరిట్,ప్రేమ తీరం చిత్రాలు ఉన్నాయి.బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడమే నా లక్ష్యం ఈ అరుదైన లైనప్ పై సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "నాపై నమ్మకంతో ఏకకాలంలో ఇన్ని సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క దర్శక నిర్మాతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా ప్రతి చిత్రానికీ 100% బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాను. మంచి కంటెంట్, సినిమా మీద ప్యాషన్తో వచ్చే ప్రతి ఫిల్మ్ మేకర్కు మా స్టూడియో ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది. వారికి అత్యుత్తమ టోటల్ ఆడియోగ్రఫీ సేవలను అందిస్తాం" అని ఆయన భరోసా ఇచ్చారు. -
పెళ్లి వేడుకలో దీపిక- రణ్వీర్ సింగ్ జంట.. పిక్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తమ బంధువుల పెళ్లి వేడుకలో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీపికా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. రణవీర్ ఎరుపు రంగు కుర్తా పైజామాలో కనిపించగా.. దీపిక కలర్ఫుల్ సంప్రదాయ చీరలో మెరిసింది. ఇది రణ్వీర్ సింగ్ కజిన్ వెడ్డింగ్ అని తెలుస్తోంది. దీపిక- రణ్వీర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఇటీవలే తమ కుమార్తె దువాతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు 2024లో దువాకు స్వాగతం పలికారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపిక అట్లీ దర్శకత్వం వహిస్తోన్న 'రాకా' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు, రణ్వీర్ సింగ్ సైతం కల్యాణి ప్రియదర్శన్తో కలిసి జాంబీ అడ్వెంచర్ చిత్రం 'ప్రళయ్'లో నటించనున్నారు. అయితే 'డాన్ 3' నుంచి రణ్వీర్ తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఇటీవలే దురంధర్ చిత్రాలతో బ్లాక్బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. Glimpses of #DeepVeer at Ranveer's cousins wedding 😍✨️🧿Emo babies 🥹 pic.twitter.com/CjmGcKy1n2— Versatile Fan (@versatilefan) June 2, 2026 -
రామ్ చరణ్ కంటికి గాయం.. చిరంజీవి ఏమన్నారంటే..: బుచ్చిబాబు
‘పెద్ది’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ పలు సార్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అవన్నీ బయటకు రాలేదు కానీ..కంటికి గాయమైన విషయం మాత్రం క్షణాల్లో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడు ఆందోళ చెందారు. చివరకు చిరంజీవి స్పందిస్తూ.. చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆందోళన చెందాడట. అంతేకాదు ఈ విషయం చిరంజీవికి తెలిస్తే ఎంత తిడతాడేమోనని భయపడ్డాడట. కానీ చిరంజీవి మాత్రం ఒక్కమాట కూడా అనలేదని బుచ్చిబాబు చెప్పాడు.తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రామ్ చరణ్ కంటికి గాయం ఎలా గాయం అయిందో వివరించాడు. ‘ఫైట్ సీన్ షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. కింద ఉన్న ఫైటర్ ఒక్కసారిగా లేవడంతో పైన ఉన్న చరణ్ కంటికి దెబ్బతాకింది. చాలా రక్తం పడిపోయింది. భయపడిపోయా. ఈ విషయం చిరంజీవి తెలిస్తే ఎంత తిడతాడేమోనని టెన్షన్ పడ్డా. భయంతోనే చిరంజీవికి కాల్ చేసి మాట్లాడా. అయితే ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా ‘ఆ వీడియో ఉంటే పంపు బుచ్చిబాబు’ అన్నాడు. అది విని నేనే షాకయ్యా’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. -
ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. కాక్టెయిల్-2 ట్రైలర్ చూశారా?
రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా కాక్టెయిల్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ ఫుల్ రొమాంటిక్గా కనిపిస్తున్నాయి. ఇద్దరితో షాహిద్ కపూర్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..!
విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె బర్త్ డే రోజే ఫలితాలు రావడం మరింత కలిసొచ్చింది. విజయ్ గెలుస్తాడన్న ధీమాతో త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ సీఎం అయ్యాక కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్గా శారీలో కనిపించింది. వీరిద్దరిపై ఎన్నికల ముందు నుంచే డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్దిద్దరు జంటగా వెళ్లి అజిత్ కుమార్ను పరామర్శించారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. నా విషయాల్లో నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే అంటూ డాగ్ ఫోటోను షేర్ చేసింది. ఇది చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్ను ఉద్దేశించే అలా పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది.అంతేకాకుండా త్రిష తన మ్యాజికల్ మే అని మే నెల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోల వరుసలో పుట్టినరోజు క్షణాలు, పువ్వులు, సెల్ఫీలు, వ్యక్తిగత స్నాప్షాట్లు, ఆమె పెంపుడు కుక్క చిత్రాలు ఉన్నాయి. "మ్యాజికల్ మే నెల నుంచి మరికొన్ని చిత్రాలు.. వీటిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. -
ముంబయి వీధుల్లో అడుక్కుంటోన్న నటి.. అసలేమైంది?
సినీ రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగంలో క్రేజ్తో కావాల్సినంత డబ్బు కూడా వస్తుంది. అయితే ఈ రంగం అందరికీ కలిసిరావడం అనేది చాలా తక్కువే. కొందరు తక్కువ టైమ్లో స్టార్గా ఎదిగితే.. మరికొందరికీ కొన్ని ఏళ్లు పడుతుంది. కానీ సినిమా వాళ్ల లైఫ్ కూడా పూలపాన్పు అనుకుంటే పొరపాటే అవుతుంది. సినిమా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చి కనుమరుగైన వారు కూడా ఉన్నారు. మరికొందరేతే దారుణ పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ముంబయిలో జరిగింది.ప్రముఖ భోజ్పురి నటి మితాలీ శర్మ.. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడల్గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎదిగింది. కట్ చేస్తే.. ఆమె ప్రస్తుతం ముంబయి వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో చేసేదేమి లేక జీవన పోరాటం మొదలెట్టింది. ముంబయిలోని లోఖండ్వాలా వీధుల్లో అత్యంత దీనస్థితిలో భిక్షాటన చేస్తూ మిథాలీ కనిపించింది.ఒకప్పుడు తెరపై మెప్పించిన నటిని వీధిలో అలాంటి స్థితిలో చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మితాలీకి తన కుటుంబంతో సంబంధాలు క్రమంగా తెగిపోయాయి. పనిలేకపోవడం, మరోవైపు కుటుంబ మద్దతు లేకపోవడంతో ఆమె ఒంటరితనానికి గురైంది. నిరంతర వైఫల్యాలు, తిరస్కరణలు ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. అత్యంత దీనస్థితిలో ఉన్న మితాలీని గుర్తించిన పోలీసులు ఆమెను సంరక్షించారు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన తర్వాత మిథాలీకి ఆహారం అందించారు. ఆమెకు వెంటనే అవసరమైన వైద్య చికిత్స అందించారు. ఆమె మానసిక పరిస్థితి క్షీణించండ వల్ల.. ప్రస్తుతం ఆమెను ఒక మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిథాలీ చూస్తుంటే చిత్ర పరిశ్రమలో నటీనటుల పరిస్థితికి అద్దం పడుతోంది. గ్లామర్ ప్రపంచం అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు.. వెండితెర వెనక జీవితం కూడా చూడాలని అంటున్నారు. This is Bhojpuri actress Mitali Sharma.Now, she was found begging on the streets of Mumbai. She asked the police for food and was later admitted to a mental healthcare centre.Mitali had reportedly left her home and moved to Mumbai to follow her dream of becoming an actress.… pic.twitter.com/ZPkyVAfiEk— Nalini Unagar (@NalinisKitchen) May 31, 2026 -
‘హిరణ్యకశ్యప’ పై త్రివిక్రమ్కి ఫోన్ చేశా..అందుకే తప్పుకున్నా : గుణశేఖర్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన కలల ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే సినీ సర్కిల్లో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యాడని.. అందుకే గుణశేఖర్ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాదు హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్లపై గుణశేఖర్ స్పందించారు. బడ్జెట్ ఎక్కువతుందనే కారణంతోనే సినిమా నుంచి తప్పుకున్నానని.. త్రివిక్రమ్తో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నాడు. అంతేకాదు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదని స్పష్టం చేశాడు. ఈ రూమర్స్కు చెక్ పెట్టేందుకు తానే స్వయంగా త్రివిక్రమ్కు ఫోన్ చేసినట్లు తెలిపారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారనే పుకార్లు నా వరకు వచ్చాయి. దీంతో వెంటనే నేను త్రివిక్రమ్కి ఫోన్ చేసి అడిగాను. దానికి ఆయన స్పందిస్తూ.. కేవలం రైటింగ్ (కథ,మాటలు) విభాగంలో మాత్రమే తాను ఉన్నానని.. దర్శకత్వం వహించే ఆలోచన లేదని చెప్పాడు’ అని గుణశేఖర్ అన్నారు. ఇక తాను ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కూడా వివరించాడు.ఈ నిమాను నిర్మించేందుకు మొదట ఫాక్స్ స్టూడియోస్, డిస్నీ వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ కథను అనుకున్న రీతిలో వెండితెరపై చూపించాలంటే దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ అవసరమవుతుందని లెక్కలు తేలాయి. అప్పుడు డిస్నీ లాంటి సంస్థలు కూడా వెనక్కు తగ్గాయి. బడ్జెట్ పరిమితులు, ఆచరణాత్మక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని వచ్చింది అని గుణశేఖర్ స్పష్టం చేశాడు. -
సింగర్ సునీత తనయుడి ప్రేమ కథలో ‘కొత్త మలుపు’
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది.హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అన్నారు.గాయని సునీత మాట్లాడుతూ, ‘ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం” అన్నారు.హీరో ఆకాష్ మాట్లాడుతూ..‘ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’అన్నారు.హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, ‘నా కెరీర్లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి’ అని చెప్పారు. -
'45 రోజుల కఠిన శిక్షణ'.. నిఖిల్ స్వయంభూ వీడియో చూశారా?
నిఖిల్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ . ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.అయితే ఇవాళ నిఖిల్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీలో యోధుడిగా కనిపించేందుకు నిఖిల్ ఎంతలా కష్టపడ్డారో చూపించే వీడియోను రిలీజ్ చేశారు. యోధుడిలా మారేందుకు 45 రోజులు చాలా కఠినమైన శిక్షణ.. వియత్నాం పోరాట రోజులను పుట్టినరోజు కానుకగా చూపించినందుకు టీమ్ స్వయంభూకి ధన్యవాదాలు.. కష్టపడకుండా ఫలితం రాదు.. అంటూ నిఖిల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. త్వరలోనే స్వయంభూ థియేటర్లలోకి వస్తుందంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను మీరు కూడా చూసేయండి. Yes It was a BRUTAL 45 Days of Training. Thanks to Team Swayambhu for Showcasing those vietnam struggle days as a Birthday Gift 💥🤗🥰 No PAIN No GAIN.. #Swayambhu blasting theatres"VERY SOON " pic.twitter.com/iKKzMI2rPj— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2026 -
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. -
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్వన్గా ట్రెండింగ్..!
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్ఫ్లిక్స్లో నంబర్వన్ ప్లేస్లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కర అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు.లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
రామ్ చరణ్ పెద్ది.. టికెట్ బుకింగ్స్ షురూ.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సూపర్ కాదు.. ఏకంగా బ్లాక్బస్టర్ కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.టికెట్ బుకింగ్స్ ఓపెన్..ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేవలం ఏపీలో మాత్రమే ధరల పెంపునకు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలతో ఫస్ట్ డే టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 ఉండగా.. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. -
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. దీంతో పాస్లు పొందిన ఫ్యాన్స్ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే ఐదున్నర గంటలకే గేట్లు మూసేయడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.దీంతో పెద్ది సినిమా రిలీజ్ ఈవెంట్ వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. పాసులు ఉన్నవారిని అనుమతించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ పాసులు తీసుకుని వివిధ జిల్లాల నుంచి అభిమానులు విజయవాడ చేరుకున్నారు. తిరుపతి, నెల్లూరు వంటి సుదూరప్రాంతాల నుంచి ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. స్టేడియం ఫుల్ అయిపోందంటూ పోలీసులు అభిమానులను అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులతో అభిమానుల వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. -
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. వినోదం ఇక మాక్సిమమ్..!
హైదరాబాద్ సినీ ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ ప్రియుల కల తీరనుంది. ఐమ్యాక్స్ థియేటర్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. నగరంలోని సుదర్శన్ థియేటర్లో ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు కానుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.ఇప్పటి వరకు భాగనగరంలో ఒక్క ఐమ్యాక్స్ థియేటర్ కూడా అందుబాటులో లేదు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ఏర్పాటు సినీ ప్రియుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఈ ఏడాదిలోనే ఐమ్యాక్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. MAX PICTUREMAX SOUNDMAX IMMERSIONIntroducing, IMAX 🔥Coming soon only at AMB Classic Victory, Hyderabad 🌟@IMAX @SureshProdns#IMAX #HomecomingwithAMBClassicVictory pic.twitter.com/OcuQfibz7N— AMB Cinemas (@amb_cinemas) June 1, 2026 -
అమ్మపై ప్రేమతో... లక్షల మొక్కలు నాటిన పోకిరి నటుడు
పోకిరి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో టాలీవుడ్ నటుడు షాయాజీ షిండి. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన డైలాగ్స్, మేనరిజంతో ఫ్యాన్స్ను తెగ నవ్వించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వెండితెరపై పవర్ఫుల్ విలన్గా.. కమెడియన్గా మెప్పించారు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజసేవలో పాటుపడుతున్నారు షాయాజీ షిండే. పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు 6.5 లక్షల చెట్లతో ఒక చిన్న అడవినే సృష్టించాడు. షాయాజీ షిండే నిజ జీవితంలో ఒక అద్భుతమైన హీరో అనిపించుకుంటున్నారు. ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తూ లక్షలాది మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. తన తల్లిపై ప్రేమతో మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు. అమ్మ చనిపోయినప్పుడు ఆమె బరువుకు సమానంగా విత్తనాలు నాటినట్లు తెలిపారు. అవే ఇప్పుడు లక్షల మొక్కలై నాకు తోడుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అల్లు అర్జున్ రాకా.. మలయాళ బ్యూటీకి జాక్పాట్...!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. ఇప్పటికే రిలీజైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ నటిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న ఫెమినా.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఆయన నటించిన హ్యాపి నేను చూసిన మొదటి చిత్రమని వెల్లడించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో భాగం కావడం కల నిజమైనట్లుగా ఉందని పేర్కొన్నారు, ఇటీవల డిస్కో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే రాకా టీమ్ నుంచే ఫోన్ వచ్చిందని పంచుకున్నన్నారు. కాగా.. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఫెమినా 2021లో నెట్ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. -
మీరు మాత్రం ఆ పని చేయొద్దు: తాప్సీ వార్నింగ్
సౌత్లో స్టార్ స్టేటస్ అందుకుని నార్త్లో సెటిలైపోయిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా తన ఫోకస్ అంతా బాలీవుడ్పైనే పెట్టింది. వరుసగా హిందీ సినిమాలే చేస్తోంది. తాజాగా తాప్సీ తాను గతంలో ఓ తప్పు చేశానని, అలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని సుతిమెత్తగా హెచ్చరిస్తోంది.ఫ్లాట్గా ఉండే నడుము కోసం..ఈమేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాప్సీ ఓ పోస్ట్ పెట్టింది. 'నాకు నాజూకైన నడుము కావాలని చిన్నప్పటినుంచే అనుకునేదాన్ని. కొంచెం కూడా పొట్ట పైకి కనిపించకూడదని కోరుకునేదాన్ని. అంతా ఓకే కానీ, నడుము కింది భాగంలో కొవ్వు పేరుకుపోయి ఉండేది. ఈ లోయర్ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వచ్చిందనేది అస్సలు అర్థమయ్యేది కాదు. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువ వ్యాయామాలు చేశాను. సామర్థ్యానికి మించి వ్యాయామం చేసినప్పుడు నా శరీరం మెదడుకు హెచ్చరికలు పంపేది.అది కొవ్వు మాత్రమే కాదుశరీరం నుంచి నీరు బయటకు వచ్చేయడానికి బదులు దాన్ని నిల్వ ఉంచుకోవడం మొదలుపెడుతుంది. బెల్లీ ఫ్యాట్ అంటే అక్కడ కొవ్వు పేరుకుపోవడం మాత్రమే కాదు, కొందరిలో కొవ్వుకు బదులుగా నీళ్లు నిల్వ ఉంటాయి. వర్కవుట్స్ ఎక్కువ చేస్తే ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కాదు కదా.. మరింత పెరుగుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని చెప్తున్నాను.శరీరాన్ని హింసించకండిప్రతి మహిళకు భిన్నమైన శరీరం ఉంటుంది. హార్మోన్ల మార్పుల వల్ల మన శరీరం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. దాన్ని మీరు ఒప్పుకునే తీరాలి. నన్ను నేను చాలా టార్చర్ పెట్టుకున్న తర్వాత ఆలస్యంగా ఈ విషయం అర్థం చేసుకున్నాను. మా డాక్టర్ ఏం చెప్పిందంటే.. పొట్ట కింద కొద్దిగా కొవ్వు, నీరు నిల్వ ఉండటం అవసరమని తెలిపింది. ఆరోగ్యానికి మంచిదేఅక్కడున్న అవయవాలకు అవి రక్షణగా పని చేస్తాయంది. కాబట్టి ప్రతి మహిళకు లోయర్ బెల్లీ ఫ్యాట్ ఉండటం మంచిదే! సోషల్ మీడియాలో దిగే ఫోటోల కోసం మీ శరీరాన్ని మీరు హింసించుకోకండి. కొంచెం కొవ్వు ఆరోగ్యానికి మంచిదేనని భావించండి' అని రాసుకొచ్చింది. తాప్సీ చివరగా 'అస్సి' సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో రెండు మూవీస్ చేస్తోంది.చదవండి: నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి -
నా EX లు.. మళ్ళీ కలుద్దాం అంటున్నారు, మా నాన్నతో గొడవలు అందుకే..!
-
నా ఎదుగుదలను చూసి చేతబడి చేశారు నేనేం చేసానంటే..!
-
‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్ పాత్రలో చరణ్ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్ షూటింగ్లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్కి కంటెంట్ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
ఎల్సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్కమ్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ కనగరాజ్.. ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్ డీసీ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. Welcome to the universe @iam_RaviMohan sir 🤗🤗❤️❤️ #Benz @offl_Lawrence @nivinofficial @iamsamyuktha_ @Dir_Lokesh @PassionStudios_ @TheRoute @GSquadOffl @Sudhans2017 @Jagadishbliss @bakkiyaraj_k @SaiAbhyankkar pic.twitter.com/kxF51Vtb9Z— Lokesh Kanagaraj (@Dir_Lokesh) May 31, 2026 -
'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను'.. శ్రీనివాస మంగాపురం యాక్షన్ గ్లింప్స్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం' అనే డైలాగ్తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్ ఫైట్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జయకృష్ణ ఎంట్రీ మూవీతోనే యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. -
హీరోయిన్గా మారిన ‘రాను బొంబాయికి రాను’ భామ!
‘రాను బొంబాయికి రాను’ ఫోక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. లిరిక్స్ కంటే ఎక్కువగా రామ్ రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ ఒక్క పాటతో లిఖిత..తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరైంది. ఈ పాట తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్ ఆల్బమ్స్తో అలరించిన లిఖిత..ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్కి పరిచయం చేయబోతున్నాడు. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ‘సాV3’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది’ అన్నారు.దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ‘సాV3’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు. -
ఆయన బతికుంటే నా లైఫ్ మారిపోయేది: నటి హేమ ఎమోషనల్
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దుస్థితిని చూసి అందరూ షాకయ్యారు. ముళ్లకంపలతో నిండి ఉన్న ఆ సమాధి వద్ద శుభ్రం చేసేందుకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఓ యాంకర్ పోస్ట్ చేసిన వీడియో చూసిన వెంటనే తన టీమ్తో కలిసి చెవేళ్లకు చేరుకుని క్లీనింగ్ చేపట్టారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం దాసరిని గుర్తు చేసుకున్నారు. మే 30న దాసరి వర్ధంతి కావడంతో నటి హేమ సైతం నివాళులర్పించారు. ఆ వీడియో చూసి నాకు చాలా బాధ కలిగిందన్నారు. ఈ రోజు గురువుగారి వర్ధంతి అని నా మైండ్లో కూడా లేదని తెలిపింది. కానీ ఆ వీడియో చూసి మరో నలుగురిని పోగేసుకుని ఇక్కడికి వచ్చానని తెలిపారు. మా గురువు గారు మా చేతనే ఆయన సమాధిని శుభ్రం చేయించుకున్నారు.మా గురువు గారే బతికి ఉంటే నా లైఫ్ మరోలా ఉండేదని హేమ ఎమోషనలయ్యారు. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు నా మీద ఉంటాయని హేమ ఆనందం వ్యక్తం చేశారు. గురువు గారే నన్ను మర్చిపోయారా అని.. మమ్మల్ని పిలిపించుకున్నట్లు అనిపించిందని తెలిపారు. ఈ రోజు నుంచే నేను సినిమాల్లో బిజీగా ఉండాలని.. గొప్ప రాజకీయ నాయకురాలిని అవ్వాలని నన్ను ఆశీర్వదించాలని దాసరిని కోరుకున్నారు. -
అప్పుడు ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా : శివరాజ్కుమార్
మరో నాలుగు రోజుల్లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ ప్రమోషన్స్లో చిత్రబృందం చెబుతున్న విషయాలతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. చరణ్కు అవార్డుకు రావడం పక్కా అంటున్నారు. అలాగే క్లైమాక్స్ కన్నీళ్లును పెట్టిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ‘పెద్ది’ తనకు చాలా స్పెషల్ చిత్రం అంటున్నాడు. కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పేశాడట. కానీ మధ్యలో మళ్లీ ఈ సినిమా వదిలేద్దాం అనుకున్నాడట ఈ స్టార్ హీరో. తనకు బదులుగా వేరే వ్యక్తిని తీసుకోమని చెబితే.. బుచ్చిబాబు వినలేదని.. తాను వచ్చేవరకు షూటింగ్ చేయకుండా ఆపేశాడని చెప్పాడు శివరాజ్ కుమార్.నటించలేనని చెప్పా.. శివరాజ్ కుమార్ 2024లో క్యాన్స్ర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్లి వచ్చాడు. అయితే క్యాన్సర్ బారిన పడేకంటే ముందే శివరాజ్ కుమార్ పెద్ది సినిమా ఒప్పుకున్నాడట. తనకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. కానీ బుచ్చిబాబు అందుకు ఒప్పుకోలేదని..తాను వచ్చేవరకు ఎదురు చూశారని శివరాజ్ కుమార్ చెప్పాడు. తాజాగా చెన్నైలో నిర్వహించి పెద్ది ఈవెంట్లో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘, బుచ్చి బాబు నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ నచ్చింది. ఆ రోజు నేను రామ్ చరణ్తో కూడా మాట్లాడాను. ఆ తర్వాత, దురదృష్టవశాత్తు, నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది, నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా.నా కోసం ఎదురు చూశారు..నా నిర్ణయాన్ని చిత్రబృందానికి తెలియజేశా. గౌర్నాయుడు(పెద్దిలో శివరాజ్కుమార్ పోషించిన పాత్ర) పాత్రకి వేరే నటుడిని తీసుకోమని వారికి చెప్పా. కానీ నిర్మాతలు, దర్శకుడు నన్ను వెళ్లనివ్వలేదు. బుచ్చిబాబు వచ్చి ‘మాకు మీరే కావాలి సార్’ అన్నాడు. నా కోసం చాలా కాలం ఎదురు చూశారు. వారికి కృతజ్ఞతలు. పెద్ది నాకు స్పెషల్ మూవీ’ అని శివరాజ్ కుమార్ అన్నాడు. -
అది చాలా కష్టం.. కానీ రామ్ చరణ్ సాధించాడు: ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్
మెగా హీరో రామ్ చరణ్పై పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్కు హాజరైన చెర్రీపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ రామ్ చరణ్ అది సాధించి చూపించాడని రెహమాన్ అన్నారు. తండ్రి పేరును నిలబెట్టే కొడుకులా రామ్ చరణ్ నిలిచాడని కొనియాడారు. చరణ్లాగే నా కుమారుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్కు సిద్ధమైంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే పెద్ది ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ సైతం ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేసింది. జూన్ 3 వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్. -
యూత్ఫుల్ ‘రిస్క్’.. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ
‘సంపంగి, 6 టీన్స్’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించి, సంగీతం అందించడంతో పాటు నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్లో చూడాలని నిర్ణయించుకున్నాను. యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది’’ అన్నారు. ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్గానూ మా మూవీ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది’’ అని చెప్పారు. ‘‘మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలింస్ చేస్తూ ఇక్కడివరకు వచ్చాను. ‘రిస్క్’ తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది’’ అని సందీప్ అశ్వ పేర్కొన్నారు. -
'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్
టాలీవుడ్ హీరో నాగచైతన్య తన సతీమణి శోభితకు స్పెషల్ విషెల్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. తనతో ఉన్న మధురమైన క్షణాలను ఫోటోలను ఇన్స్టాలో పంచుకున్నారు. హ్యాపీ బర్త్ డే మై లేడీ శోభిత.. నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం దొరికినందుకు చాలా కృతజ్ఞుడిని అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చైతూ ఫ్యాన్స్ సైతం శోభితకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహా వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. వీరి పెళ్లి కోసం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగానే వేదికను ఏర్పాటు చేశారు. హీరో వెంకటేశ్తో పాటు పలువురు టాలీవుడ్ సినీ తారలు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
'ఎల్లప్పుడు నువ్వే నా హీరో'.. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణను ఆయన తనయుడు మహేశ్బాబు గుర్తు చేసుకున్నారు. ఇవాళ కృష్ణ జయంతి కావడంతో నాన్నతో దిగిన ఫోటోను మహేశ్ బాబు పోస్ట్ చేశారు. నా జీవితంలో ఎల్లప్పుడు మీరే నా హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సైతం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ చిత్రానికి వారణాసి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. Forever my hero….Happy Birthday Nanna ♥️♥️♥️ pic.twitter.com/7ATfMvAEMx— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2026 -
అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. వీడియో వైరల్..!
కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్తలో అజిత్ అభిమానులు, కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుబాయ్లో ఉన్న అజిత్ వెంటనే చెన్నై చేరుకున్నారు. ఆమె కడచూపు కోసం అభిమానులు పెద్దఎత్తున అజిత్ ఇంటికి వచ్చారు.తమిళనాడు సీఎం విజయ్ కూడా అజిత్ తల్లి మోహిని పార్ధివదేహానికి నివాళులర్పించారు. దండ చేతిలో పట్టుకుని నేరుగా అజిత్ ఇంటికి వెళ్లిన విజయ్.. అక్కడే ఉన్న అజిత్ను ఓదార్చారు. సీఎంతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు. సీఎం విజయ్తో పాటే త్రిష కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. AK receives CM Vijay & Trisha! pic.twitter.com/AM9UExLtCe— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2026 -
చీరలో రమ్మన్నాడు.. చెప్పుతో కొడతా అని చెప్పా: మిర్చి మాధవి
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ చేదు వాస్తవం. అవకాశాల పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడంటే భయంతో అలాంటి విషయాలు బయటకు చెప్పలేదు కానీ..ఇప్పుడు మాత్రం బహిరంగంగా మాట్లాడుతున్నారు. దురుసుగా ప్రవర్తిస్తే.. పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే ఇందులో అమ్మాయిల తప్పు కూడా ఉంటుంది అంటోంది నటి మిర్చి మాధవి. స్వలాభం కోసం కొంతమంది అమ్మాయి అలాంటి పనులు చేస్తున్నారని చెబుతోంది. ఒకవైపు బుల్లితెర మరోవైపు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న మాధవి.. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వెల్లడించింది.ఇంటికి వచ్చాడు.. నా కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సార్లు నేను కూడా క్యాస్టింగ్ కౌచ్కి గురయ్యాను. ఓ సారి డైరెక్టర్ని అని ఒకడు ఫోన్ చేశాడు. మెయిన్ లీడ్గా చేయాలి.. ఇంటికొచ్చి మాట్లాడతానన్నాడు. సరే రమ్మని చెప్పాను. అప్పుడు నేను దిల్సుఖ్ నగర్లో ఉండేదాన్ని. నా భర్త గచ్చిబౌలిలో ఉద్యోగం చేసేవాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఈ డైరెక్టర్ సాయంత్రం 4 గంటలకు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో నేను, అమ్మ, ఇంకో అమ్మాయి మాత్రమే ఉన్నాం.ఆడిషన్ చేస్తున్నాడేమో అనుకున్నా.. ఆయన వచ్చేసరిని నేను డ్రెస్లో ఉన్నాను. చీర కట్టుకొని రమ్మని చెప్పాడు. ఆడిషన్స్ కోసం కావొచ్చ అనుకొని.. చీరకట్టుకొని వచ్చి ఆయన ముందు నిలబడ్డా. కాసేపటి తర్వాత ఇది కాదు వేరే చీర మార్చుకొని రమ్మన్నాడు. ఓకే అని చెప్పి..మరో చీరలో వచ్చాడు. అతను అలా చూసి..కాస్త నీ నడుము చూపించు అన్నాడు. అప్పుడు అర్థం అయింది వాడు ఎందుకు వచ్చాడో. వెంటనే కోపంతో ‘లేరా.. చెప్పు తీసుకుని కొడతా, బయటకు పో’ అని గట్టిగా చెప్పా. వాడు భయపడి వెళ్లిపోయాడు. ఒకవేళ వాడు తలుపేసి ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి? అని చాలా భయపడి పోయా. ఈ విషయం అమ్మకు చెబితే.. ‘వాడిని గదిలోనే ఉంచి తాళం వేయాల్సింది. పోలీసులకు ఫిర్యాదు చేసేదాన్ని’ అని చెప్పింది. నేనే ఎలాంటి ఫిర్యాదులు వద్దని చెప్పా’ ఇలాంటి చేదు ఘటనలు ఒకటి రెండు సార్లు జరిగాయి’ అని మాధవి చెప్పుకొచ్చింది. -
విలన్ రోల్కి సై అంటున్న స్టార్ హీరోలు!
సిల్వర్ స్క్రీన్పై హీరో అంటే ప్రేక్షకుల ఊహల్లో మంచివాడు... నిజాయతీపరుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథల్లోనూ, హీరోల క్యారెక్టరైజేషన్స్లోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే హీరో క్యారెక్టరైజేషన్లో గ్రే షేడ్స్ ఉన్నా, ఆడియన్స్ ఓకే చెప్పి, థియేటర్స్లో విజిల్స్ వేస్తున్నారు. మెల్లగా విలనిజమ్కు క్రేజ్ పెరిగింది. అందుకే కొందరు హీరోలు, తమ స్టార్ హీరో ఇమేజ్ను సైతం పక్కన పెట్టి విలన్ రోల్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరికొంతమంది హీరోలైతే తాము హీరోగా నటిస్తున్న సినిమాలోనే విలన్ రోల్లోనూ నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్స్కు సైతం స్వాగ్, స్టైల్ను జోడిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ప్రజెంట్ టాలీవుడ్లో ఊపందుకుంది. ఇలా కథానాయకుడే.. ఖల్ నాయకుడయ్యాడు... అదేనండీ.... ‘ఖల్ నాయక్’ సినిమాలో సంజయ్ దత్ రోల్ గుర్తు చేసుకోండి... విలనిజమ్ మామూలుగా ఉండదు. అలా ఖల్ నాయక్ స్థాయి విలనిజమ్ని చూపించనున్న హీరోలపై ఓ లుక్ వేయండి.లూగర్ఎన్టీఆర్ హీరోగా సూపర్హిట్. విలన్గానూ సూపర్హిట్. ‘జైలవకుశ, వార్ 2, టెంపర్’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఆడియన్స్ను మెప్పించింది. తాజాగా మరోసారి విలన్ రోల్ చేసేందుకు రెడీ అయ్యారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ దేశభక్తి చిత్రం ‘డ్రాగన్’. డ్రగ్స్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దేశభక్తి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబై కేంద్రంగా పనిచేసే ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, కలకత్తా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే వార్స్ నేపథ్యంతో ‘డ్రాగన్’ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని, ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ లూగర్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విలన్గా లూగర్ కనిపిస్తారు’’ అని ఇటీవల ప్రశాంత్ నీల్ ఓ సందర్భంగా చెప్పారు. ఇలా ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్న విషయం ఖరారైపోయింది. అయితే ఈ చిత్రం నుంచి రెండు డిఫరెంట్ లుక్స్లో ఎన్టీఆర్ కనిపిస్తున్న ఫోటోలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ఏమైనా ద్వి΄ాత్రాభినయం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’లో లూగర్ ఉన్నట్లే, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలోనూ ఓ పవర్ఫుల్ వ్యక్తి ఉంటారని, అతని పేరే డ్రాగన్ అని, ఈ రోల్ను కూడా ఎన్టీఆర్నే చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పైగా ఈ ‘డ్రాగన్’ సినిమా 1947, 1967 కాలమానాల్లో కథ జరుగుతుందని ప్రశాంత్ నీల్ చెప్పడం, ఎన్టీఆర్ ద్వి΄ాత్రాభినయం చేస్తున్నారన్న వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్, సిద్ధార్థ్ గు΄్తా, గురుసోమసుందరం, అశుతోష్ రానా, ఖుష్భూ, రాజీవ్ కనకాల, శత్రు, బీజు మీనన్, అలెగ్జాండర్ మిజేవ్, భీమల్ జీత్ ఓబెరాయ్, ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్స్లో రిలీజ్ కానుంది.పునర్జన్మల నేపథ్యంతో ‘రాకా’‘ఆర్య 2’ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్లో చిన్న΄ాటి నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. అయితే తొలిసారిగా అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో విలన్ రోల్ చేయనున్నారని తెలిసింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని, తండ్రి–ఇద్దరు కొడుకులు ΄ాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూడు రోల్స్లో ఒకటి విలన్ రోల్ అట. ఇంకా ఈ ‘రాకా’ చిత్రం పునర్జన్మల నేపథ్యంతో సాగుతుందని, ఓ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ను అట్లీ తీసుకువెళ్తున్నారని టాక్. ఈ ‘రాకా’ చిత్రంలో దీపికా పదుకొనె ఓ ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్స్గా జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే, ఇదే చిత్రంలోని ఓ పవర్ఫుల్ ΄ాత్రలో రమ్యకృష్ణ యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కావొచ్చు.తండ్రీకొడుకుల కథయశ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. తండ్రీకొడుకుల అనుబంధం, పగ నేపథ్యంతో ‘టాక్సిక్’ సినిమా కథ సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంగా యశ్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రాయ, టికెట్.. అంటూ రెండు విభిన్నమైన ఫస్ట్లుక్స్ బయటకు వచ్చాయి. ఈ రెండూ ΄ాత్రల్లోనూ యశ్నే కనిపించారు. దీంతో ‘టాక్సిక్’ సినిమాలో రాయ, టికెట్లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారని, ఈ యశ్ డ్యూయోల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ రెండు ΄ాత్రల్లో ఒక ΄ాత్ర విలన్ రోల్ అట. అది రాయనా? లేక టికెట్నా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నమాట. ఇక ‘టాక్సిక్’ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రధాన కథాంశం 1940–1970 నేపథ్యంతో సాగుతుందని తెలిసింది. గోవా నేపథ్యంతో కథ సాగుతుందట. గోవా ΄ోర్టు కేంద్రంగా జరిగే డ్రగ్స్– ఆయుధాల అక్రమరవాణా, ఈ క్రమంలో గ్యాంగ్స్టర్స్ మధ్య గొడవలు, అధిపత్య పోరు..వంటి అంశాల నేపథ్యంతో ‘టాక్సిక్’ సినిమా కథ సాగుతుంది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమాఖురేషీ,తారా సుతారియా, రుక్మిణీ వసంత్, అక్షయ్ ఓబెరాయ్, సుదేవ్ నాయర్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్, మాన్స్టర్మైండ్ క్రియేషన్స్ పతాకంపై యశ్, వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్) చిత్రం ఈ జూన్ 4న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు మేకర్స్. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ‘టాక్సిక్’ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది.ఫుల్ ఫామ్యాక్టర్గా మంచు మనోజ్ ఫుల్ ఫామ్లోకి వచ్చారు. ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్గానూ సినిమాలు చేస్తున్నారు. చె΄్పాలంటే..మంచు మనోజ్ విలన్గా హిట్ కమ్బ్యాక్ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’, తేజా సజ్జా ‘మిరాయ్’ చిత్రాల్లో మంచు మనోజ్ చేసిన నెగటివ్ షేడ్ రోల్స్ ఆడియన్స్ను అలరించాయి. దీంతో మరో విలన్ రోల్కు మంచు మనోజ్ సై అన్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై నేపథ్యంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలోనే మంచు మనోజ్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మంచు మనోజ్ చేయనున్నది ఈ సినిమాలోని విలన్ రోల్ అని తెలిసింది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక మంచు మనోజ్ హీరోగా నటించిన ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఈ దసరా రిలీజ్కు సిద్ధమైంది. ఆయన హీరోగా ‘వడ్డీకాసులవాడ, రక్షక్’ సినిమాల ప్రకటనలు వచ్చాయి.కుంభ!అతని కల ఒక ప్రళయం. అతను ఎవరంటే..కుంభ. ఇతని అడ్రస్ ‘వారణాసి’ సినిమా. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న భారీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రగా, రాముడిగా కనిపించనున్నారు మహేశ్బాబు. మందాకినిగా ప్రియాంకా చో్ర΄ా, రణ కుంభ ΄ాత్రలో మలయాళ నటుడు, దర్శక – నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ‘వారణాసి’లో కుంభ విలన్ రోల్. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన విలన్గా కుంభ ΄ాత్ర అని, ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చె΄్పారు. మరి..రణ కుంభ వెండితెరపై ఏ స్థాయి విలనిజం చూపిస్తారనేది వచ్చే ఏడాది ఏప్రిల్ 7న తెలిసి΄ోతుంది. ఎందుకంటే..‘వారణాసి’ సినిమా ఆ రోజే విడుదల కానుంది. అలాగే ప్రభాస్ సలార్ సినిమాలోని వరద అనే ఓ పవర్ఫుల్ ΄ాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్ 2’లో ఈ వరద క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ‘సలార్’ సినిమాకు ప్రశాంత్నీల్ దర్శకుడు. 2027 చివర్లో ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ్ర΄ారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.బాలీవుడ్ హీరోలూ విలన్లుగా...బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్’. ‘పఠాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్తో షారుక్ ఖాన్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో షారుక్ ఖాన్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో మెయిన్ విలన్ రోల్ను అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు. పూర్తి స్థాయి విలన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్న తొలి సినిమా ఇదే అని బాలీవుడ్ సమాచారం. షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్న ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ కానుంది. అలాగే మరో సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం విలన్స్ లిస్ట్లో చేరారు. సైఫ్అలీఖాన్ హీరోగా చేసిన తాజా హిందీ చిత్రం ‘హైవాన్’లో అక్షయ్ కుమార్ విలన్ రోల్ చేశారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళ హిట్ మూవీ ‘ఒప్పం’కు హిందీ రీమేక్గా రూపొందిందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. ఇంకా మరో సీనియర్ హీరో సంజయ్ దత్ సౌత్లో విలన్గా బిజీ అయి΄ోయారు. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో విలన్గా చేసిన సంజయ్ ప్రస్తుతంæ తెలుగు హీరో సాయిదుర్గా తేజ్ చేసిన ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలోనూ విలన్గా చేస్తున్నారని తెలిసింది. మరోవైపు బాలీవుడ్ యువ హీరోలు సైతం విలన్గా మారేందుకు సిద్ధం అవుతున్నారు. ‘యానిమల్’ సినిమాలో రణ్బీర్ కపూర్ ఎలాంటి హీరోయిక్ పెర్ఫార్మెన్స్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్: ది ΄ార్క్’ చిత్రంలో విలన్గానూ రణ్బీర్ కపూర్ కనిపిస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా రణ్బీర్ కన్ఫార్మ్ చేశారు. ‘యానిమల్: ది ΄ార్క్’ సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్పైకి వెళ్తుందని తెలిసింది. అలాగే రామ్చరణ్ హీరోగా నటించిన పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ విలేజ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో బాలీవుడ్ యువ నటుడు దివ్యేందు శర్మ విలన్ రోల్ చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవది విలన్ రోల్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇలా విలన్ రోల్ వైపు మక్కువ చూపిస్తున్న బాలీవుడ్ హీరోలు మరికొంతమంది ఉన్నారు.సీనియర్ ప్రతినాయకులు సుప్రీమ్ యాక్సిన్‘అభయ్, సిగప్పు రోజక్కల్, వాయనాడ్ తంబన్’ వంటి చిత్రాల్లో విలన్గా వెండితెరపై నెక్ట్స్ లెవల్ యాక్టింగ్ చేశారు కమల్హాసన్. కానీ ఆ తర్వాత ఎందుకో కానీ చాలా కాలం కమల్హాసన్ విలన్ రోల్ చేయలేదు. అయితే ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ కోసం విలన్ రోల్ చేసేందుకు కమల్ హాసన్ను ఒప్పించారు దర్శకుడు నాగ్అశ్విన్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ఆల్రెడీ ‘కల్కి2898 ఏడీ’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో భైరవ‡ అండ్ కర్ణగా వెండితెరపై కనిపించారు ప్రభాస్. ఈ చిత్రంలోనే సుప్రీమ్ యాక్సిన్ అనే పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు కమల్హాసన్. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణలో కమల్హాసన్ ΄ాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్లో విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి.శికంజా మాలిక్వెండితెరపై మోహన్బాబు విలన్ రోల్లోనూ ఎంత పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తారో ప్రత్యేకించి చెపక్కర్లేదు. అయితే కొంతగ్యాప్ తర్వాత మోహన్బాబు మళ్లీ విలన్ గెటప్స్లోకి వచ్చారు. ‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ΄్యారడైజ్’. ఈ చిత్రంలో జడల్ అనే ΄ాత్రలో నాని నటిస్తుండగా, విలన్ శికంజా మాలిక్గా మోహన్బాబు నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ‘ది ప్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్స్లో రిలీజ్ కానుంది. అలాగే ‘శ్రీనివాసా మంగాపురం’ చిత్రంలో వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు మోహన్బాబు. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తీసిన అజయ్భూపతి దర్శకత్వం వహిస్తున్న విలేజ్ యాక్షన్ లవ్స్టోరీ సినిమా ఇది. ఈ ‘శ్రీనివాసా మంగాపురం’ చిత్రంలో తెలుగులో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, రాషా తడానీ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో శ్రీనుగా జయకృష్ణ, మంగగా రాషా నటిస్తారు. మంగ తండ్రి వెంకటప్పయ్యగా మోహన్బాబు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.చేతబడిసీనియర్ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలిసిందే. హీరోగా, విలన్గా కెరీర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతకాలం వెండితెర విలనిజంకు దూరంగా ఉన్న జేడీ చక్రవర్తి, ‘గాయపడ్డ సింహం’తో వెండి తెరపై విలన్గా నటించారు. తరుణ్భాస్కర్, శ్రీవిష్ణు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఇందులో ధర్మ అనే ΄ాత్రలో నటించారు జేడీ చక్రవర్తి. అలాగే ఆయన ‘చేతబడి’ అనే ఓ సినిమాకు కమిటయ్యారు. ఇందులో హీరోగా, విలన్గా జేడీ చక్రవర్తియే నటిస్తారు. ఈ సినిమాను గురించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. సూర్యాస్ కథ అందిస్తున్న ఈ సినిమాను, మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించనున్నారు. -
కోలీవుడ్లో మళ్లీ బిజీ అయిపోయిన తెలుగింటి ఆడపడుచు
నటి ఐశ్వర్యరాజేశ్ ఆరణాల తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమెను ముందుగా ఆదరించింది తమిళ సినిమానే. కాక్కా ముట్టై చిత్రానికి ముందు వరకు తనుకంటూ గుర్తింపు కోసం పోరాడిన ఐశ్వర్య రాజేశ్, ఆ చిత్రం తరువాత ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో ముంచెత్తింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆ మధ్య ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలును అందుకున్నారు. అక్కడ వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అలా తెలుగులో చిత్రాలు చేయడంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ వచ్చింది. కాగా ఇప్పుడు ఇక్కడ మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రను పోషిస్తున్న అండర్–18 అనే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు కిచ్చా సుదీప్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు కార్తీక్ పెరుమాళ్స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ఆర్ ప్రొడక్షన్న్స్ పతాకంపై బి.జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ను ప్రారంభించనున్నట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కోసం చాలా కాలం ఎదురుచూసినందుకు దక్కిన అవకాశం ఈ చిత్రం అని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. -
రణ్వీర్ సింగ్ని కాదు... ఎఫ్డబ్య్లూఐసీఈని బ్యాన్ చేయండి
‘‘డాన్ 3’ సినిమా వివాదంలో రణ్వీర్ సింగ్కు మద్దతుగా నిలిచారు దర్శక–నిర్మాత రామ్గోపాల్ వర్మ. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికి మూడు వారాల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ తప్పుకోవడంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ ఆరోపించారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎం΄్లాయీస్’ (ఎఫ్డబ్య్లూఐసీఈ) యూనియన్కు రణ్వీర్పై ఫర్హాన్ ఫిర్యాదు చేశారు.ఈ విషయమై చర్చించేందుకు ‘ఎఫ్డబ్లూఐసీఈ’ ప్రతినిధులు రణ్వీర్ సింగ్కు మూడుసార్లు నోటీసులు పంపారు. అయితే సరైన స్పందన లేక΄ోవడంతో దాదాపు మూడేళ్ల పాటు రణ్వీర్æసినిమాల చిత్రీకరణలో పాల్గొనకూడదని, ఎఫ్డబ్య్లూఐసీఈ తీర్మానించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రామ్గోపాల్ వర్మ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన సుధీర్ఘ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘రణ్వీర్ సింగ్ని కాదు ఎఫ్డబ్ల్యూఐసీఈని నిషేధించండి. ఎఫ్డబ్ల్యూఐసీఈ అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థ కాదు. చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి కొందరు వ్యక్తులు ప్రైవేటుగా సమావేశమై, ఒక ఎజెండాతో ఈ తీర్పును ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారు. ‘ధురంధర్’ సినిమాతో రణ్వీర్ సింగ్ సాధించిన భారీ క్రేజ్ చూసి భయపడుతున్న కొందరు నటులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నట్లున్నారు. నిర్మాత ప్రీ ప్రోడక్షన్ వర్క్స్లో నష్టం జరిగిందని చెబుతున్నారు. భారతదేశంలో చాలా వ్యాపారాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇలాంటి సివిల్ వివాదాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ వారిలో ఒకరు లేదా ఇద్దరూ కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు న్యాయమూర్తి ఆ విషయాన్ని తేలుస్తారు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే... ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ వివాదంలోకి అనవసరంగా తలదూర్చవద్దు’’ అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు రామ్గోపాల్ వర్మ. -
మహేష్ బాబాయ్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ డెబ్యూ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. సినిమా కంటెంట్, ఎమోషన్ అన్నింటినీ దగ్గరుండి గమనించి, తన ఫీడ్బ్యాక్ ఇచ్చాడని జయకృష్ణ స్వయంగా వెల్లడించాడు. మహేష్ ఇచ్చిన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని జయకృష్ణ చెబుతున్నాడు. శ్రీనివాస మంగాపురం గురించి జయకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లోతైన ఎమోషన్ కలిగిన సినిమా. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన కథ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది. తాతయ్య ఆశీస్సులు నాతో ఉంటాయి‘‘తాతయ్య కృష్ణగారు నాకు దేవుడితో సమానం. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందర్నీ కలవడం హ్యాపీగా ఉంది. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు). అలాగే మా బాబాయ్ మహేశ్బాబుకి నేను డైహార్డ్ ఫ్యాన్ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ను లాంచ్ చేసి, ఫీడ్బ్యాక్ ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న మా బాబాయ్కి థ్యాంక్స్. ఈ సందర్భంగా మా నాన్న రమేశ్బాబుగారిని తలచుకుంటున్నాను. మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేశ్బాబుగారితో ‘రాజకుమారుడు’ చేశారు దత్తుగారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్న ఆయనకు రుణపడి ఉంటాను.కిరణ్, అజయ్ భూపతి, రాషా, రాఘవేంద్ర రావు, జయకృష్ణ, అశ్వినీదత్, ఆదిశేషగిరి రావు ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ‘‘ఈ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు రాషా. ‘‘కృష్ణగారు నిజమైన సూపర్స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆ కృష్ణగారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. జయకృష్ణ పెద్ద హీరో అవుతాడని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. ‘‘కృష్ణగారిలాగే జయకృష్ణ కూడా తన ప్రతిభను చూపించాడు’’ అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. ‘‘జయకృష్ణ న్యూయార్క్లో ఫిల్మ్ కోర్సు చదివాడు. ఈ సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు ఆదిశేషగిరి రావు. ‘‘శ్రీనివాస మంగాపురం’ అని పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం’’ అన్నారు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్ర రావు. -
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామర్.. చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..!
ఇట్స్ మై డ్రీమ్ అంటోన్న అనన్య నాగళ్ల..చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..కాశీలో బిగ్బాస్ బ్యూటీ అశ్వినీ శ్రీ పూజలు..మంచుకొండల్లో హీరోయిన్ శ్రీలీల చిల్.. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ పోజులు.. View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Archana Ravichandran (@iam_archanaravichandran) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) -
బలగం నటి.. ఇంత గ్లామరస్గా మారిపోయిందేంటి?
ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన మూవీ బలగం. తెలంగాణ పల్లె సెంటిమెంట్తో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వేణు యెల్దండి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పల్లెటూరి సంప్రదాయాలను, రక్త సంబంధాలను ఒక్కసారిగా మళ్లీ గుర్తుకు తెచ్చింది. అచ్చ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ద్వారా పలువురు నటీనటులు ఫేమస్ అయ్యారు.అలా ఈ మూవీ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నవారిలో రూపాలక్ష్మి ఒకరు. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను అందరూ తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు. హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. యితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. బలగం తర్వాత రూపలక్ష్మి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో బిజీగా మారిపోయింది.తాజాగా రూపాలక్ష్మి ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత గ్లామరస్గా కనిపించింది. అసలు బలగం నటి రూపానేనా అన్నంతలా మారిపోయింది. కారు నడుపుకుంటూ వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యూ జర్నీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్రామ్లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. View this post on Instagram A post shared by Rupa Lakshmi Vaishnava Sri (@rupalakshmi23) -
9 రోజుల్లో రూ. 40 కోట్ల కలెక్షన్స్.. మరాఠీ సినిమా ఊచకోత!
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. కంటెంట్ సంగతి ఎలా ఉన్న సరే.. రిలీజ్ ముందు వరకు‘ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అంటూ ప్రచారం చేసి మరీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. అదే మరాఠి చిత్రం ‘దేవూల్ బంద్ 2’.స్నేహల్ తార్డే, మోహన్ జోషిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మౌత్ టాక్తోనే మొదటి వీకెండ్లో రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే రూ. 40.80 కోట్లు(గ్రాస్) వసూలు చేసి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మరాఠి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.దేవూల్ బంద్ 2 కథేంటంటే.. మహిళ రైతు సంగీత పేగుడే(స్నేహల్)కు వరుస కష్టాలు వస్తుంటాయి. తన బాధలను తీర్చమని నిత్యం దేవుడిని వేడుకుంటుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై పక్కనే ఉన్న పుట్టపై రాయి విసిరేస్తుంది. వెంటనే అందులో నుంచి శ్రీస్వామి సమర్థ్ దర్శనమిస్తాడు. ఆమెతో కలిసి గ్రామానికి కూడా వెళ్తాడు. దేవుడు రాకతో సంగీత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.#DeoolBand2 Movie 9 Days Box-office update :🔹Maharashtra : 39.77 Cr🔹Goa : 45 Lakhs🔹Karnataka : 35 Lakhs🔹Gujarat : 21 Lakhs🔹Rest : 2 LakhsTotal Domestic : 40.80 CroresTotal India Gross — 40.80 CroresTotal India Net — 34.37 CroresDistributor Share… pic.twitter.com/OGnzHdwAhb— Jerin Georgekutty (@jerinGeorgekut2) May 30, 2026 -
మూడోసారి సేవ్ ది టైగర్స్.. ట్రైలర్తోనే నవ్వులే నవ్వులు..!
మగాళ్ల బాధలను కామెడీ కోణంలో ప్రేక్షకులకు రుచి చూపించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రిలీజైన రెండు సీజన్స్ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి పరిస్థితిని కళ్లకు అద్దం కట్టినట్లు చూపించారు. దీంతో ఈ కామెడీ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. రెండు సీజన్స్ సినీ ప్రియులను మస్తు ఎంటర్టైన్ చేశాయి.ఇప్పుడు మూడో సీజన్ కూడా సరికొత్తగా మీ ముందుకొస్తోంది. తాజాగా ఈ సేవ్ ది టైగర్స్-3 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే నవ్వుల వర్షం కురుస్తోంది. ఎవడ్రా చెప్పింది ‘పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి అనే అభినవ్ గోమఠం డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్ జూన్లోనే జియోహాట్స్టార్లో సందడి చేయనుంది.అభినవ్ గోమఠం. ప్రియదర్శి, చైతన్యకృష్ణ పండించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. ఈ వెబ్ సిరీస్ జూన్ 19 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్-3 ట్రైలర్ చూసేయండి. -
వాట్ ఏ మూవీ.. రూ.7 కోట్లతో ఏకంగా రూ.950 కోట్లా..!
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ వసూళ్లు రాబట్టడం చాలా కష్టంగా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలు సైతం డిజాస్టర్స్గా మిగిలిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. అలాంటి టైమ్లో ఓ చిన్న సినిమా ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం 26 ఏళ్ల యూట్యూబర్ రూపొందించిన ఈ హారర్ మూవీ క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది.2026లో హాలీవుడ్ చరిత్రలో ఊహించని విజయం సాధించిన మూవీ అబ్సెషన్ టేకోవర్. ఈ సినిమాకు కర్రీ బార్కర్ దర్శకత్వం వహించగా.. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కేవలం రూ.7 కోట్ల బడ్జెట్తో మాత్రమే తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 950 కోట్లు వసూలు చేసింది. అంటే తన బడ్జెట్ కంటే వందరెట్లు అధికంగా ఆదాయం రాబట్టింది. 'అబ్సెషన్' ఒక సినిమాటిక్ యూనివర్స్, భారీ విజువల్స్, అతి పెద్ద ఫ్రాంచైజీ, సూపర్స్టార్స్ లేకపోయినా ఈ ఘనత సాధించింది.ఈ వసూళ్లతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రశ్నిస్తోంది. బాలీవుడ్లో పెద్దపెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద తేలిపోతున్నాయి. స్టార్స్ ఉన్నప్పటికీ వంద కోట్లు వసూల్లు రావడమే గగనంగా మారిపోయింది. హిందీలో ఒక్క దురంధర్ మినహాయిస్తే ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దీన్ని బట్టి చూస్తుంటే బడ్జెట్, పెద్ద పెద్ద స్టార్స్ కంటే కంటెంట్ ముఖ్యమని సగటు సినీ ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డ్రింకర్ సాయి’
ధర్మ మహేష్ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ మహేశ్ హీరోగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనే ట్యాగ్లైన్తో తెరకెక్కిన ఈ చిత్రం 2024 డిసెంబర్లో థియేటర్స్లో విడుదలై యావరేజ్ టాక్ సంపాదించుకుంది. కానీ దాదాపు ఏడాదిన్నర ఓటీటీలోకి వచ్చి.. ఇక్కడ మంచి టాక్తో దూసుకెళ్తోంది. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది.ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలను, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో నేచురల్గా నటించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతోంది. అలాగే ఈ చిత్రంతో బెస్ట్ డెబ్యూ యాక్టర్గా దుబాయ్లో జరిగిన గామా అవార్డ్ అందుకున్నారు ధర్మ మహేష్. హీరోయిన్గా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమెకు ధర్మ మహేష్తో ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అలాగే రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలపరిచారు. -
చాలామందితో ఫిజికల్ రిలేషన్.. నా పార్ట్నర్స్కు ముందే తెలుసు: నటి షాకింగ్ కామెంట్స్
ప్రముఖ నటి షహానా గోస్వామి తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆమె గుర్తు పట్టేస్తారు. హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. 2008లో 'రాక్ ఆన్!' చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఫిరాక్', 'మిడ్నైట్స్ చిల్డ్రన్', 'డెస్పాచ్' వంటి చిత్రాలలో కూడా నటించారు. ఆమె చివరిసారి 'సంతోష్' అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీని 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యుకు హాజరైన 40 ఏళ్ల ముద్దుగుమ్మ రిలేషన్, ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను రిలేషన్షిప్లో ఎల్లప్పుడు ఓపెన్గానే ఉన్నానని షహానా వెల్లడించారు. తాను ఇతరులతో కూడా శారీరకంగా సన్నిహితంగా ఉంటాననే విషయం.. తనతో రిలేషన్లో ఉన్న వ్యక్తులకు పూర్తిగా తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సంబంధాలను కొనసాగించే విధానంలో పారదర్శకత చాలా ముఖ్యమని.. అందుకే నా రిలేషన్స్లో ఎలాంటి రహస్యాలు ఉండవని ఆమె కుండబద్దలు కొట్టారు.ప్రస్తుతం తనకు భాగస్వామి ఎవరు లేరని కూడా గోస్వామి వెల్లడించారు. తన జీవితంలోని సంబంధాలు సాంప్రదాయమనే ముద్ర కాకుండా.. ప్రేమ, స్నేహం మీద నిర్మించబడ్డాయని తెలిపారు. తన రిలేషన్స్ సంప్రదాయాలను అనుసరించకపోయినా.. అవి సాధారణమైనవి కావని అన్నారు.ప్రేమ అనేది నిర్బంధంగా ఉండకూడదనేది తన నమ్మకమని గోస్వామి అన్నారు. తాను భావోద్వేగ స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తానని తెలిపారు. సంబంధాలు అనేవి కట్టుబాట్లలోకి బలవంతంగా నెట్టబడకుండా సహజంగా అభివృద్ధి చెందాలని తాను నమ్ముతున్నానని ఆమె అన్నారు. ప్రేమ స్వేచ్ఛగా ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తానని వెల్లడించారు. ఈ ఆలోచన తాను ఎంచుకునే సంబంధాలను.. అలాగే కాలక్రమేణా అవి అభివృద్ధి చెందే విధానాన్ని కూడా ప్రభావితం చేసిందని షహానా అభిప్రాయం వ్యక్తం చేశారు.మిలింద్ సోమన్తో డేటింగ్..బ్రేకప్గతంలో మిలింద్ సోమన్తో రిలేషన్, విడిపోవడంపై కూడా షహానా గోస్వామి స్పందించారు. మోడల్ మిలింద్ సోమన్తో తన సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను టీనేజర్గా ఉన్నప్పుడు అతన్ని సినిమాల్లో చూసి ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. చివరికి ఆన్లైన్లో అతని కాంటాక్ట్ వివరాలను కనుగొన్నానని వెల్లడించింది. కాగా.. వీరిద్దరు డేటింగ్ ప్రారంభించడానికి ముందు, దాదాపు ఆరు సంవత్సరాల పాటు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారని తెలిసింది. అయితే మిలింద్, షహానాల రిలేషన్కు 2013లో ఎండ్ కార్డ్ పడింది. -
దారుణ స్థితిలో దాసరి సమాధి.. రంగంలోకి మంచు మనోజ్..!
టాలీవుడ్ దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు కోసం హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఆయన సమాధి చుట్టు అడవిలా మారిపోవడంతో రంగంలోకి దిగారు. తన టీమ్తో కలిసి దాసరి సమాధి వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ కూడా తమ టీమ్ను పంపింది. దాసరి వర్ధంతి సందర్భంగా ముళ్ల పొదలను, చెట్లను తొలగించారు. తెలుగు సినిమాకు విశేష సేవలందించిన దిగ్గజ దర్శక, నటుడి సమాధి ఈ స్థితిలో ఉండడంపై సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే చేవేళ్లలోని ఆయన సమాధి చుట్టూ చెట్లు మొలిచి ఉన్నాయని ఓ యాంకర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేసి, ఎందరికో లైఫ్ ఇచ్చిన దాసరి నారాయణరావు సమాధి ఈ స్థితిలో ఉండటం బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన మంచు మనోజ్ తన టీమ్తో కలిసి సమాధి వద్ద క్లీనింగ్ పనులు చేపట్టారు. ఈ సమాధి పునరుద్ధరణ పనుల్లో గీతా ఆర్ట్స్ సైతం పాల్గొంది. ఇవాళ దాసరి వర్ధంతి కావడంతో ఆయనకు నివాళులర్పించారు మంచు మనోజ్. View this post on Instagram A post shared by gouthaminaidu (@anchor_gouthami) దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన మంచు మనోజ్, గీతా ఆర్ట్స్మంచు మనోజ్ అనుచరులు అక్కడికి చేరుకుని క్లీనింగ్ పనులు ప్రారంభించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ సంస్థ కూడా వెంటనే రంగంలోకి దిగి, తమ టీమ్ను పంపి సమాధి పునరుద్ధరణ పనులను వేగవంతం చేసింది.. #Dasarinarayana #Manchumanoj pic.twitter.com/07E6iAzTl8— Telugu Stride (@TeluguStride) May 30, 2026 -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేస్తుంటాయి. వీటిలో ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లాంటి మూవీస్ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగానే ప్రతివారం బోలెడ్ చిత్రాలు, సిరీస్లు రానే వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన లేటేస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'రాఖ్'. ఈ వెబ్ సిరీస్కు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను పంచుకున్నారు. ఇందులో ఫజల్ పోలీస్ యూనిఫాంలో కనిపించగా.. అతనిముందు ఓ శవం ఉన్న కొత్త పోస్టర్ను ఈ సిరీస్పై ఆసక్తిని మరింత పెంచేసింది. పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటపడతాయి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.'రాఖ్' అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్. ఇద్దరు టీనేజర్లు అదృశ్యం కావడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ సంఘటన ఒక అన్యోన్యమైన కుటుంబాన్ని తీవ్రంగా, మానసిక వేదనకు గురిచేస్తుంది. అంతేకాకుండా మొత్తం నగరాన్ని ఆందోళనకు గురవుతుంది. ఈ కేసును చేధనే లక్ష్యంగా దర్యాప్తు కోణంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు ఆయుష్ త్రివేది డైలాగ్స్ అందించగా.. ఎండెమోల్ షైన్ ఇండియా బ్యానర్పై దీపక్ ధర్, రిషి నేగి, మృణాలిని జైన్, శ్యామ్ రాఠీ నిర్మించారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మా నాన్నతో నాకున్న గొడవలు చెపుకోవాలంటేనే..!
-
రిలీజ్కి ముందు ‘పెద్ది’ మేకర్స్ కీలక నిర్ణయం!
పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలనుకున్నారు. ఈ మేరకు హైకోర్టుకు తమ విజ్ఞప్తిని తెలియజేయడంతో..దానికి ధర్మాసనం అనుమతించింది. జూన్ 4న విడుదలవుతున్న పెద్ది సినిమా టికెట్ ధరలను 7 రోజులపాటు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ అధికారులకు నిర్మాణ సంస్థ వినతిపత్రం అందించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈనెల 15న వినతిపత్రం ఇచ్చి, 25న మరోసారి విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా తాము కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఇలాంటి అంశంలోనే ఇదే హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణ తీసుకుందని గుర్తుచేశారు. కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అయితే పిటిషన్ ఉపసంహరణకు పిటిషనర్ కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో టికెట్స్ ధరల పెంపు ఉండకపోవచ్చునని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నాన్న కొడతాడేమోనని అబద్ధం చెప్పా: రామ్చరణ్
పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్చరణ్ చాలానే కష్టపడ్డాడు. మొన్నటివరకు సెట్స్లో కష్టపడితే ఇప్పుడు ప్రమోషన్స్ కోసం పరుగులు పెడుతున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తాను అబద్ధం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. రామ్చరణ్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. లోకజ్ఞానం లేకుండానే పెరిగాను. నాన్నతో సెట్కు వెళ్లాలంటే భయంఅజ్ఞానంతో ఉండటం కూడా ఒక అదృష్టమైతే అందుకు నేనే ఉదాహరణ. మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండేదే కాదు. సినిమా మ్యాగజైన్లు, అవార్డులు అన్నీ నాన్న ఆఫీసులోనే ఉండేవి. ఎప్పుడైనా ఆ మ్యాగజైన్లు కనిపిస్తే.. వాటిని ముట్టుకోవాలన్నా సరే భయమేసేది. నాన్న ఎంత గొప్ప నటుడు అనేది నాకు తెలిసేది కాదు. నాన్నతో షూటింగ్ సెట్కు వెళ్లాలన్నా భయంగానే ఉండేది. ఆయన పిలిస్తే తప్ప తన వెంట వెళ్లేవాడిని కాదు.అబద్ధం చెప్పా..నాకు యాక్టింగ్ అంటే ఆసక్తి ఉన్నప్పటికినీ దాన్ని పైకి చెప్పేంత ధైర్యం లేదు. నాకు 17 ఏళ్ల వయసున్నప్పుడు అనుకుంటా.. ఏమవ్వాలనుకుంటున్నావు? అని నాన్న అడిగాడు. ఆయన మెప్పు పొందేందుకు మెకానికల్ ఇంజనీర్ అవుతానని అబద్ధం చెప్పాను. నటుడిని అవుతానంటే బుద్ధిగా చదువుకోక హీరో అవుతావా? అని ఎక్కడ కొడతారో అని భయపడ్డాను. కానీ, కరెక్ట్ సమయం వచ్చిందని ఆయనకు అనిపించినప్పుడు తనే పిలిచి మరీ సినిమాలు చేయమన్నాడు అని రామ్చరణ్ చెప్పుకొచ్చాడు. రామ్చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది జూన్ 4న విడుదలవుతోంది.చదవండి: హీరో అజిత్ తల్లి కన్నుమూత -
యషిక ఆనంద్ బోల్డ్ లుక్స్.. ఆర్జీవీ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు..!
ఆర్జీవీ హీరోయిన్ ఆరాధ్య స్టన్నింగ్ లుక్స్..సాగర తీరాన బాలీవుడ్ భామ నోరా ఫతేహీ..హీరోయిన్ యషిక ఆనంద్ బోల్డ్ గ్లామర్..రెడ్ శారీలో ఫరియా అబ్దుల్లా అందాలు.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Aaradhya🦋 (@iamaaradhyadevi) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్'. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23 నుంచే కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్లో ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రకంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కాస్తా నిరాశపరిచింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. -
టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్ట్లో బిగ్ రిలీఫ్ లభించింది. వ్యక్తిగత గోప్యతను కాపాడాలంటూ పిటిషన్ వేయగా.. చైతుకు అనుకూలంగా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం..నాగచైతన్యకు అనుకూలంగా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా.. పలు అశ్లీల వెబ్సైట్లు, కొన్ని డిజిటల్ ప్లాట్ఫారమ్లలో నాగచైతన్య పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్నారని సీనియర్ లాయర్ వైభవ్ గగ్గర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగచైతన్య పోలికలతో ఉన్న అనధికారిక వస్తువుల విక్రయం, ఏఐ-జనరేటెడ్ కంటెంట్ను ఆన్లైన్లో విచ్చలవిడిగా వాడుతున్నారని ధర్మాసనానికి వివరించారు. నాగచైతన్య వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న పోస్టులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, వాయిస్, ఫొటోలు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. -
ప్రముఖ సినీ జంట గుడ్ న్యూస్.. పెళ్లైన నాలుగేళ్లకు..!
ప్రముఖ బాలీవుడ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరతో పాటు సినిమాల్లో రాణిస్తోన్న ఆదిత్య సీల్- అనుష్క రంజన్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ దంపతులు ప్రగ్నెన్సీని ప్రకటించారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక క్షణం కోసం వందేళ్లుగా వేచి ఉన్నామని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.ఆదిత్య, అనుష్క జంట ప్రెగ్నెన్సీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో నటి బేబీ బంప్ ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ జంటకు అనన్య పాండే, మౌనీ రాయ్, సోనాక్షి సిన్హా, వాణి కపూర్, మనీష్ మల్హోత్రా, నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్, రాకుల్ ప్రీత్ సింగ్, కుశాల్ టాండన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.కాగా.. ఆదిత్య, అనుష్క మొదటిసారి వారి కుటుంబం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆ తర్లాత వీరి మొదటి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. అనుష్క పుట్టినరోజున పారిస్లో ఆదిత్య ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే, ఆదిత్య చివరిగా అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Aditya Seal (@adityaseal) -
పెద్ది మేకర్స్ దూకుడు.. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు..!
రామ్ చరణ్ పెద్ది మేకర్స్ రిలీజ్కు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ పైరసీ, లీక్ విషయంలో మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్లు కాకుండా చర్యలకు మార్గం సుగమమైంది.తాజాగా పెద్దిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు దిగింది. ఈ సినిమాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్లు పెద్ది టీమ్ దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులకు మేకర్స్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సోషల్ మీడియా కార్యకలాపాలపై పెద్ది మూవీ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
పెళ్లికి ముందే లవ్.. గీతాకి అన్ని తెలుసు
-
ఐఎండీబీ టాప్లో ఊహించని పేరు.. విజయ్, ఎన్టీఆర్, షారూక్ కూడా అతని వెనకే..!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ సెలబ్రిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రతి నెల, వారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ వారంలో పాపులర్ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ వెల్లడించింది. అయితే ఈసారి ఎవరు ఊహించని నటుడు నంబర్ స్థానంలో నిలిచారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూక్ ఖాన్ను సైతం వెనక్కి నెట్టిన ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. అతను ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ వారంలో టాప్లో నిలిచిన నటుడు యుధ్వీర్ అహ్లావత్. అతను ఇటీవలే కర్తవ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. ఈ లిస్ట్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, తలపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్లాల్ లాంటి స్టార్లను అధిగమించి ఏకంగా నంబర్వన్ ప్లేస్ కొట్టేశాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు యుధ్వీర్ అహ్లావత్.. ఐఎండీబీ ర్యాంక్తో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. యుధ్వీర్ కర్తవ్య మూవీలో 16 ఏళ్ల హర్యానా బాలుడు హర్పాల్ పాత్ర పోషించారు.బాలుడి పాత్రలో కనిపించడంతో యుధ్వీర్ అంతా చిన్నపిల్లాడని భావించారు. కర్తవ్యను చూస్తున్న ప్రేక్షకులు యుధ్వీర్ను ఒక బాలనటుడిగా గుర్తించారు. కానీ అతని వయసు అక్షరాలా 33 సంవత్సరాలు. అతను దాదాపు దశాబ్ద కాలంగా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఐఎండీబీ టాప్ ర్యాంక్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. Catch who is trending on IMDb’s Popular Indian Celebrities list of the week! 🌟 See the complete list on the IMDb app, available on iOS and Android. 🍿This list is powered by ‘Popular Indian Celebrities’: a weekly IMDb feature that showcases the Indian stars trending… pic.twitter.com/DHQRD5dVed— IMDb India (@IMDb_in) May 27, 2026 -
దర్శకధీరుడికి షాక్.. వారణాసికి తప్పని లీక్ల బెడద
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. అప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అదే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి లీక్ల బెడద తప్పడం లేదు. ఒడిశాలో జరిగిన తొలి షెడ్యూల్ చిత్రీకరణ టైమ్లో కొన్ని సీన్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా కీలకమైన ఉగ్రభట్టి గుహ సన్నివేశానికి సంబంధించిన భారీ సెట్ స్టిల్స్ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. దీంతో మన దర్శకధీరుడిని సైతం లీక్ల కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఫోటోలు లీక్ కావడంపై మేకర్స్ నిరాశకు గురయ్యారు. ఇకనుంచి భద్రతను కట్టుదిట్ట చేసేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. #Varanasi On Sets Is Just Another Level 💥💥💥 pic.twitter.com/va9BkiAF4c— Freak4Flims (@Freak4Flims) May 28, 2026 -
'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. అర్జున్ సినిమా కావడంతో టాలీవుడ్లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజారామన్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. ఆయన సతీమణి నీలవేణి(అభిరామి), కూతురు నీల(ప్రీతి ముకుందన్)తో పాటు కుటుంబ సభ్యులంతా మార్షన్ ఆర్ట్స్లో నిపుణులు. ఒకపక్క కరాటే శిక్షణ ఇస్తూనే మరోపక్క మెడికల్ షాపు రన్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటారు. తనతో దురుసుగా ప్రవర్తించే మగాళ్లను చితకబాదుతూ.. తల్లితో తింట్లు తింటుంది నీల. కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నీలవేణి ప్లాన్ చేస్తుండగా.. అనుకోకుండా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్తో శత్రుత్వం ఏర్పడుతుంది. వారి వెనుక బడా వ్యాపారవేత్త వరుణ్ దయాల(జాన్ కొక్కెన్) ఉంటాడు. ఓ ఇల్లీగల్ బిజినెస్ డీల్ కోసం అతను మంత్రికి లంచంగా ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లు చేరాల్సిన చోటుకి చేరకుండా పరోక్షంగా రాజారామన్ ఫ్యామిలీ అడ్డుకుంటుంది. దీంతో వరుణ్ దయాల మనుషులు కూడా రాజా రామన్ ఫ్యామిలీని చంపేందుకు ప్లాన్ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి రాజారామన్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? రూ. 1000 కోట్ల లంచం వెనుక ఉన్న రూ. 7000 కోట్ల ఇల్లీగల్ బిజినెస్ ఏంటి? ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షన్ ఆర్ట్స్ శిక్షణతో అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని రాజా రామన్ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సమాజంలో అన్యాయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే సందేశం ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత పెద్దగా బోర్ కొట్టదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్లెస్గా అనిపిస్తాయి. అలాగే కథనం చాలా వరకు ఊహకందేలా సాగుతుంది. అయితే కొన్ని కథల విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసినా.. దాన్ని తెరపై ఎలా ప్రజెంట్ చేస్తాడనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుడిలో కలుగుతుంది. తాను ఊహించినట్లుగానే ఆయా సన్నివేశాలు సాగితే.. కథతో మరింత కనెక్ట్ అవుతాడు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఊహించినట్లుగానే కథనం సాగినా.. ఆసక్తి మాత్రం తగ్గదు. బోర్ కొడుతుందని ప్రేక్షకుడు ఫీలయ్యేలోపు ఓ భారీ యాక్షన్ సీన్తో పాటు ప్రతి పాత్రకు ఎలివేషన్ ఇచ్చి కథతో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు. స్క్రీన్ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.సినిమా ప్రారంభంలో రాజారామన్ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు రాజారామన్ ఫ్యామిలీ స్టోరీని, మరోవైపు రౌడీ వ్యాపారవేత్త వరుణ్ దయాల్ రూ. 7000 కోట్ల బిజినెస్ డీల్ని చూపిస్తూ కథనం నడిపించి ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ రెండు కథలకు మధ్య సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు ఊహించినా.. ఎలా ముడిపెడతాడనే ఆసక్తి మాత్రం ఫస్టాఫ్ అంతా కొనసాగుతుంది. ఫ్యామిలీ సీన్లు రొటీన్గానే ఉన్నా.. ప్రతీ ముకుందన్ చేసే యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్కి ముందు ఇంట్లో అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి చేసే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్లాస్ట్ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో అర్జున్ ఫ్యామిలీ.. రౌడీలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఉంటుంది. కథనం ఊహకందేలా సాగినా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ముగింపు రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేసిన యాక్షన్ సినిమా ఇది. రాజారామన్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. కొన్ని చోట్ల వింటేజ్ అర్జున్ని చూస్తారు. ఇక ఇన్నాళ్లు కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం అయిన ప్రీతి ముకుందన్, అభిరామి.. ఇందులో యాక్షన్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన హై-ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు సినిమాకు కొత్తదనం తెచ్చాయని చెప్పొచ్చు. వరుణ్ దయాల్గా జాన్ కొక్కేన్, అబ్రహాంగా అర్జున్ చిదంబరం, కిరుబకరన్గా పవన్ కృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
విజయ్కు భార్యపై ఎంత ప్రేమో.. వీడియో వైరల్
హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. ఆన్స్క్రీన్పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ ది బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ప్రేమ విషయాన్ని వీలైనంతవరకు సీక్రెట్గా ఉంచారు. అదే సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామంటూ కొన్ని హింట్లు కూడా వదిలారు. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం అని కాకుండా డైరెక్ట్గా పెళ్లి వార్త చెప్పి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. జంటగా..ఈ పెళ్లిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభిమానుల్ని, తన ఊరి ప్రజలను భాగం చేయడం విశేషం! ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మార్చిలో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ విరోష్ జోడీ ప్రస్తుతం 'రణబాలి' సినిమాలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్స్ మధ్య గ్యాప్ దొరికినప్పుడు ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ విమానాశ్రయంలో కనిపించారు.భార్యపై ఎంత ప్రేమో!ఈ సందర్భంగా సింపుల్ టీ షర్ట్లో కనిపించిన విజయ్ మెడలో ఒక చైన్, లాకెట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ లాకెట్ R అక్షరంలో ఉంది. దీంతో రష్మిక మందన్నాకు గుర్తుగా R పెండెంట్ ధరించాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినిమాల విషయానికి వస్తే.. విజయ్ చేతిలో 'రణబాలి' కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. అటు రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ మూవీ 'కాక్టైల్' జూన్ 19న విడుదలవుతోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మైసా మూవీ ఉంది. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) చదవండి: కరుప్పు రిజెక్ట్ చేసిన విజయ్కు థాంక్స్.. ఎందుకో తెలుసా? -
‘కాటాలన్’ కథ విని ఆశ్చర్యపోయా.. ఆ సీన్స్ మెస్మరైజ్ చేస్తాయి: సునీల్
‘‘పుష్ప’ సినిమా తర్వాత నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్లో పడింది. ఏ భాష నుంచి ఎప్పుడు, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో తెలియడం లేదు (నవ్వుతూ). ‘కాటాలన్’ సినిమాలో నేను మారి అనే కీలక పాత్ర చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు సునీల్ తెలిపారు. ఆంటోనీ వర్గీస్, దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, సునీల్, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిక్, హనన్ షా, రాపర్ బేబీ జీన్ కీలక పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘కాటాలన్’. పాల్ జార్జ్ దర్శకత్వంలో షరీఫ్ మొహమ్మద్ నిర్మించిన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేడు విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సునీల్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ పాల్గారు ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి’’ అన్నారు కబీర్ దుహాన్ సింగ్. ‘‘మార్కో’ తర్వాత ‘కాటాలన్’ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఆజాద్ పేర్కొన్నారు. -
ఆ ఆరు సినిమాల్లో ‘పెద్ది’ మొదటి స్థానంలో ఉంటుది: జగపతి బాబు
‘‘లెజెండ్’ మూవీ తర్వాత చాలా సినిమాలు చేశాను. అయితే వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు చిత్రాలు ఉంటాయి. ఆ జాబితాలో ‘పెద్ది’ చిత్రంలో నేను చేసిన అప్పలసూరి పాత్ర మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు జగపతిబాబు తెలిపారు. రామ్చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్తో కలిసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి పాత్ర లుక్ని డిజైన్ చేశారు బుచ్చిబాబు. ఈ సినిమా మొత్తం జగపతిబాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఒక సవాల్గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ‘పెద్ది’ మరో ఎత్తు. ప్రస్తుతం సోనీ లివ్ కోసం ‘బ్లాక్ అండ్ వైట్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
త్వరలోనే హీరో అర్జున్ దాస్ పెళ్లి?
సౌత్లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్తో విలన్గా, హీరోగా పలు కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంది
-
సనాతన ధర్మం, మైథలాజికల్ టచ్తో శ్రద్ధాదాస్ ‘త్రికాల’
టాలీవుడ్లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్పీ(LLP) ప్రపంచవ్యాప్తంగా మే 28న విడుదల చేస్తోంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…‘ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు.నిర్మాతలు మాట్లాడుతూ…‘మైథలాజికల్ టచ్తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. -
మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి...‘ధురంధర్’ ప్రొడక్షన్ డిజైనర్పై కేసు
చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆడిషన్ల పేరుతో, షూటింగ్ లొకేషన్స్లో, వర్కింగ్ కండిషన్స్లో మహిళా నటీనటులు మాత్రమే కాదు టెక్నీషియన్లు కూడా నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్’మూవీకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన ఓ యువతిని ఆ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సైనీ జోహ్రే లైంగిక వేధింపులకు గురి చేశాడు. పని పేరుతో హోటల్కి పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాజాగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.మత్తుమందు ఇచ్చి.. యువతి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది సెప్టెంబర్ 10న సినిమాకు సంబంధించిన చర్చల కోసం సైనీ ఆమెను ఛండీగడ్లోని హోటల్కి రమ్మని చెప్పాడు. టీమ్ మీటింగ్ అనుకొని రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె అక్కడకు వెళ్లింది. గదిలోకి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు. ప్లాన్ ప్రకారం సైనీ జోహ్రే ఆమెను మాత్రమే ఆహ్వానించాడు. ఆమె రాగానే వైన్లో మత్తుమందు కలిపి తాగమని బలవంతం చేశాడు. ఆమె అది సేవించగానే తలతిరిగినట్లుగా అనిపించింది. అదే సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవరించాడు.(చదవండి: చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు)కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులుతనకు అనారోగ్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. బాత్రూంకి వెళ్లి వాంతులు చేసుకున్నా. అక్కడ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లనీయకుండా బలవంతం చేశాడు. రాత్రంతా అక్కడే ఉన్నా. మరసటి రోజు ఉదయమే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత ఈ విషయం బయటకు చెప్తే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులు రోజు రోజుకి ఎక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నా’ అని సదరు యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ చానల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 27లో ‘మూవీ మిస్టరీ-యూ7 జెడ్’ యూట్యూబ్ చానల్ కార్యాలయం ఉంది. ఆ చానల్లో సినీ హీరో చిరంజీవిని తివ్ర అనారోగ్యానికి గురైనట్లు చూపించడమే కాకుండా బట్టతల, బరువు తగ్గిపోయినట్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రసారం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. సంబంధిత స్క్రీన్ షాట్లు, వీడియోలు సమర్పిస్తూ చానల్ నిర్వాహకులను గుర్తించి పరువు నష్టం కలిగించేలా ఉన్న కంటెంట్ను తొలగించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కోర్టు అనుమతితో పోలీసులు సంబంధిత యూట్యూబ్ చానల్ నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇక చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇటీవల తన 158వ సినిమాను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
త్రిష నలుపు దుస్తులు ధరిస్తే హిట్ పక్కా..ఇదిగో సాక్ష్యం!
గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారిన నటి త్రిష. ఒక పక్క ఈ బ్యూటీ తమిళంలో అజిత్ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థక్ లైఫ్ చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ అపజయం పాలవడం, ఆ తరువాత నటుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్తో కలిసి ట్రోలింగ్లకు గురవడం వంటి విషయాలతో చాలా తలనొప్పికి గురైన త్రిష, ఎప్పుడైతే విజయ్ ఎన్నికల్లో గెలవడంతో పాటు పార్టీని ఒంటి చేతితో గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి త్రిష ఆనందంతో తుళ్లి పడుతున్నారనే చెప్పాలి. అదేవిధంగా నటి మంచి విజయాన్ని చూసి చాలా కాలం కావడంతో విచారంలో ఉన్న త్రిషకు కరుప్పు చిత్రం రూపంలో మంచి విజయం వరించింది. దీంతో ఈ బ్యూటీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఆమె తన అభిమాని వల్ల ఇంకా సంతోషానికి లోనవుతున్నారప్పుడు. సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రం గత 15వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం గురించి పక్కన పెడితే త్రిష అభిమానులు తెగ సంబర పడుతున్నాయి. ఆమె అభిమాని ఒకరు త్రిషతో విజయ్ నటించిన ఢిల్లీ, అజిత్ నటించిన మంగాత్తా, సూర్య నటించిన ఆరు చిత్రాలు ఈ ముగ్గురు హీరోలకు చాలా మైలు రాయిగా నిలిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించారని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయన్నారు. అందువల్ల త్రిషను కరుప్పు స్టార్ ( బ్లాక్ స్టార్) అని పిలవవచ్చు అని ఆ అభిమాని చేసి పోస్ట్ త్రిష వరకు చేరింది. ఆయన పోస్ట్ను చూసి న త్రిష ఎంతగానో సంతోషపడి ఇది చాలా అందంగా ఉంటుంది. ధన్యవాదా లు అని పేర్కొని చిరునవ్వుతో కూడిన పలు ఎమోజీలను ఎక్స్ మీడి యాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆయా షేర్... రికార్డ్
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ వంటి హిట్ మూవీ నిర్మించిన సుధాకర్ చెరుకూరి ‘ది ప్యారడైస్’ని నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి నాని ఇంట్రో సాంగ్గా విడుదలైన తొలిపాట ‘ఆయా షేర్...’ కి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈపాటని అడ్డుల జంగిరెడ్డి, అర్జున్ చాందీపాడగా, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈపాట తెలుగు వెర్షన్ 150 ప్లస్ మిలియన్ల వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్ సాధించినట్లు పేర్కొని, నాని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.‘‘నాని కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్బస్టర్గా ‘ఆయా షేర్...’ నిలిచింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ వేదికలను షేక్ చేస్తూ ఈపాట ఒక కల్చరల్ ఫెనామినల్గా మారింది’’ అని చిత్రబృందం తెలిపింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ సాయి. -
భావోద్వేగాల వదలనే...
‘‘చెన్నై లవ్ స్టోరీ’లోని ‘వదలనే...’పాటనుపాండిచ్చేరిలో షూట్ చేశాం. ఒక అందమైన గుడి దగ్గర నాకు, గౌరికి సీన్ చెప్పారు డైరెక్టర్ రవి. ఆ సమయంలో మా ముగ్గురికీ కళ్లు చెమర్చాయి. అంత భావోద్వేగానికి గురయ్యాం. మణిశర్మగారు అన్నిపాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారు’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆయన హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయిరాజేశ్ కథను అందించిన ఈ చిత్రాన్ని రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్, ఎస్కేఎన్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘వదలనే..’ అంటూ సాగే సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈపాటను విడుదల చేశారు.‘‘వదలనే...’ నా కెరీర్లో బెస్ట్ సాంగ్గా మిగిలిపోతుంది’’ అన్నారు రవి నంబూరి. ‘‘వదలనే...’ ఓ గొప్పపాటగా నిలిచిపోతుంది’’ అని సాయి రాజేశ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, కెమెరామేన్ డేనియల్ విశ్వాస్ మాట్లాడారు. ఈ వేడుకలో పలువురు సంగీతదర్శకులుపాల్గొన్నారు. -
ఆడపులులం మేము
ఆడపిల్ల కదా... సిల్వర్ స్క్రీన్పై ఆడుతూపాడుతూ గ్లామరస్గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్ని పక్కన పెట్టి, సిల్వర్ స్క్రీన్పై డిష్యుం డిష్యుంకి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయికలు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్లోకి ఎంటరవుతున్నారు. దీపికా పదుకోన్ వంటి సీనియర్ హీరోయిన్ మాత్రమే కాదు... రష్మికా మందన్నా, సంయుక్త, ఆలియా భట్, కృతీ సనన్... ఇలా పలువురు యంగ్ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కోసం గుర్రపు స్వారీ, కత్తి సాము, గన్ షూట్ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఈ హీరోయిన్లు ఏయే చిత్రాల్లో పవర్ఫుల్గా కనిపించనున్నారో తెలుసుకుందాం...‘మైసా’ కోసం మార్షల్ ఆర్ట్స్ఒకపాత్ర ఒప్పుకుంటే ఆపాత్రలానే మారిపోవాలనుకుంటారు రష్మికా మందన్నా. ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ‘మైసా’ సినిమాలోని మైసాపాత్ర కోసం ఈ బ్యూటీ తీసుకున్న ఓ రిస్క్ 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం. నిజానికి ఈ సన్నివేశాన్ని డూప్తో చేయిద్దామని యూనిట్ అన్నప్పటికీ ‘నో నో’ అంటూ, తానే చేశారు. ఇంకా ఈ సినిమా కోసం బోలెడన్ని రిస్కీ ఫైట్స్ చేస్తున్నారామె. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం రష్మిక థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ప్రత్యేకంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్లో కఠోర శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు 8 గంటలపాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగింది. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, అధునాతన స్టంట్ టెక్నిక్స్ వంటివి నేర్చుకున్నారు. ఆ ట్రైనింగ్ పూర్తయ్యాక కేరళలో తీసిన యాక్షన్ సీక్వెన్స్లో భాగంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైసా అనే గిరిజన గోండు యువతిపాత్రలో కనిపించనున్నారు రష్మిక. ఈ షెడ్యూల్ కోసమే రష్మిక బ్యాంకాక్లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ ఏడాదే విడుదల కానుంది.కత్తి సాముకి సైక్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు సంయుక్త. అనడమే కాదు... ఆ పని చేశారు కూడా. ‘స్వయంభు’ సినిమాలో చేసిన యోధురాలిపాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి సాములో శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ పర్యవేక్షణలో ఆమె ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతే కాదు... ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించే రోజు షూటింగ్కు దాదాపు నాలుగైదు గంటల ముందు ప్రాక్టీస్ సెషన్స్లోపాల్గొన్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దట్టమైన అడవుల నేపథ్యంలో చిత్రీకరించారు. అందువల్ల శిక్షణను కూడా అదే తరహా వాతావరణంలో, కొండలు గుట్టలు వంటి కఠినమైన భూభాగాలకు అలవాటు పడేలా నిర్వహించారు. ఇక ఈ భారీపాన్ ఇండియన్ మూవీలోనిపాత్ర కోసం హీరో నిఖిల్ సిద్ధార్థ్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ఇరవై ఏళ్లయింది దీపికా పదుకోన్ సినిమాల్లోకి వచ్చి. ఇన్నేళ్లల్లో గ్లామరస్ క్యారెక్టర్స్తోపాటు పూర్తిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. అలాగే ‘పఠాన్, జవాన్, ఫైటర్’ వంటి సినిమాల్లో యాక్షన్ రోల్స్ చేశారు. ‘ఫైటర్’ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. తాజాగా చేస్తున్న ‘కింగ్’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు కానీ... స్టంట్ రిహార్శల్స్ చేశారట. ఈ చిత్రంలో ఒకేసారి ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ చేసే యాక్షన్ సీన్ ఉందని సమాచారం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ని సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారని టాక్. ఈ భారీ ఫైట్లో షారుక్, దీపిక, సుహానాపాల్గొన్నారట. ఒక నటి 20 ఏళ్ల తర్వాత కూడా ఉత్సాహంగా యాక్షన్ రోల్స్ ఒప్పుకోవడం, రిహార్సల్స్ చేసి మరీ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాలోనూ దీపికా పదుకోన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ‘కింగ్’ సినిమాకి ముందే ట్రైనింగ్ తీసుకుని, యాక్షన్ సీన్స్ చేశారు దీపికా పదుకోన్. అయితే గర్భవతి కావడంతో ‘రాకా’లోని యాక్షన్ సీన్స్ని ఆమెకు బదులు డూప్తో చేయించాలనుకుంటున్నారట. కాగా ‘కింగ్’ సినిమా కోసం యువ నటి సుహానా కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...సుహానా... షూట్కి రెడీ‘రెడీ టు షూట్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి రావడం రావడమే సుహానా ఖాన్ ‘కింగ్’ చిత్రంతో తుపాకీతో ఎంట్రీ ఇస్తున్నారు. మామూలుగా ‘స్టార్ కిడ్స్’పై ఎన్ని అంచనాలు ఉంటాయో షారుక్ ఖాన్ తనయగా సుహానా మీద అన్నీ ఉన్నాయి. 2023లో చేసిన ‘ది ఆర్చీస్’ సుహానాకి తొలి సినిమా. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. సో... ‘కింగ్’ వంటి భారీ యాక్షన్ సినిమాతో సుహానా వెండితెరపైకి వస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఒక క్రూరమైన, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని హంతకుడిపాత్రలో కనిపిస్తారట. ఆయనపాత్ర రెండు టైమ్లైన్స్లో ఉంటుందని సమాచారం.ఒకటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అని టాక్. ఈ చిత్రంలో షారుక్ శిష్యురాలిపాత్రను సుహానా చేస్తున్నారు. షారుక్ దగ్గర యాక్షన్ ట్రైనింగ్ తీసుకునేలా ఈపాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఇది పూర్తిగా యాక్షన్ క్యారెక్టర్ కావడంతో ‘కింగ్’ షూటింగ్ ఆరంభించే ముందు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ శిక్షకుల వద్ద మార్షల్ ఆర్ట్స్, గన్ షూట్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు సుహానా. ఈ షూటింగ్ లొకేషన్లో కుమార్తెకు షారుక్ కూడా కొన్ని యాక్షన్ మెళకువలు నేర్పిస్తున్నారట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘కింగ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఫైట్కే కాదు... పాటకూ ట్రైనింగ్స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు... బ్రెయిన్తో ఆలోచించి, ప్రత్యర్థిని ట్రాప్ చేయాలి, బాడీ పవర్ని ఉపయోగించి రఫ్ఫాడించాలి. సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగల్లా కనిపించే ఆలియా భట్, శార్వరి ఈ స్పై క్యారెక్టర్ చేశారు. ఆ సినిమానే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ఆల్ఫా’. బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలింస్ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ హీరో ఓరియంటెడ్ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్ఫుల్ స్పై ఏజెంట్లుగా ఒదిగిపోవడానికి ఆలియా, శార్వరి ఫిట్నెస్తోపాటు మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.జిమ్లో ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తూ, పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉన్న వీడియోలను ఆలియా షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. విశేషం ఏంటంటే... ఫైట్స్కి మాత్రమే కాదు... ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం కూడా ఆలియా, శార్వరి కఠినమైన వర్కౌట్స్ చేశారట. ఈపాట డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కువ స్టామినాని డిమాండ్ చేయడంతో ఈ వర్కౌట్స్ చేశారని తెలిసింది. ఇద్దరూపాల్గొన్న ఫైట్స్, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా ఉంటాయని బాలీవుడ్ టాక్. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏజెంట్గా ఫైట్ఆలియా, శార్వరిలానే వామికా గబ్బి కూడా స్పై క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై తుపాకీ ఎక్కు పెట్టి, ఏజెంట్గా సిల్వర్ స్క్రీన్పై విజృంభించడానికి వామికా శిక్షణ తీసుకున్నారు. ‘జీ 2’ సినిమా కోçసమే వామికా గబ్బి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్లోకి ఎంటరయ్యారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’కి (2018) సీక్వెల్గా ‘జీ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ గోపి 116పాత్ర చేశారు శేష్. సీక్వెల్లోనూ ఈపాత్ర చేస్తున్నారు. ఏజెంట్ మహాలక్ష్మి నాగిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులోని యాక్షన్ సీన్స్, స్పై మిషన్స్, ఫిట్నెస్కి సంబంధించి వామికా గబ్బి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం యూరప్లో చిత్రీకరించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుందని తెలిసింది. ఇక 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా వామికా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పంజాబీ, హిందీ మలయాళం వంటి భాషల్లో నటించిన వామికా ‘జీ 2’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’లో ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపించిన వామిక ‘జీ 2’లో పూర్తి భిన్నంగా చాలా పవర్ఫుల్గా కనిపించనున్నారు. ఈపాన్ ఇండియన్ స్పై యాక్షన్ మూవీ పలు భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.ఇంటర్పోల్ ఆఫీసర్గా ట్రైనింగ్గ్లామరస్, డీ గ్లామరస్, ట్రెడిషనల్... ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అంటారు కృతీ సనన్. ‘ఆది పురుష్’లో సీతగా కనిపించిన ఈ బ్యూటీ ‘మిమీ’లో సరోగేట్ మదర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘కాక్టెయిల్ 2’లో గ్లామరస్గా కనిపించనున్నారు. ఇప్పుడు తనలోని పూర్తి స్థాయి యాక్షన్ నటిని ఆవిష్కరించుకోవడానికి కృతి కసరత్తులు చేస్తున్నారట. మరి... ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్ అలాంటిది. బాలీవుడ్ భారీ మాస్ సినిమాల్లో ఒకటైన ‘డాన్’ సిరీస్లో నటించే చాన్స్ కృతీకి దక్కిందని సమాచారం. ‘డాన్, డాన్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చేయనున్న విషయం తెలిసిందే.రెండు భాగాల్లో డాన్గా షారుక్ ఖాన్, ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాగా ప్రియాంకా చోప్రా నటించారు. అయితే మూడో భాగంలో రణ్వీర్ సింగ్ని డాన్పాత్రకు తీసుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ, ఈ సినిమా నుంచి రణ్వీర్ తప్పుకున్నారు. ఇక షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అనే తరుణంలో సరిగ్గా మూడు వారాల ముందు రణ్వీర్ తప్పుకున్నారట. ఈ విషయంలో రణ్వీర్–ఫర్హాన్ మధ్య వివాదం నెలకొంది. ముందు నటిస్తానని చెప్పి, తర్వాత తప్పుకోవడంతో రణ్వీర్కి సహాయ సహకారాలు అందించకూడదని ముంబైకి చెందిన ‘ఫిల్మ్ బాడీ’ నిర్ణయించుకుంది.అలాగే నష్టపరిహారం కింద రణ్వీర్ తనకు రూ. 45 కోట్లు ఇవ్వాలని ఫర్హాన్ డిమాండ్ చేస్తున్నారు. మరి... ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది కాలమే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాపాత్రకు కృతీ సనన్ని ఎంపిక చేశారని భోగట్టా. ‘డాన్’ సిరీస్లో ఈపాత్రకు యాక్షన్ సీన్స్ ఉన్నట్లే మూడో భాగంలోనూ ఉంటాయి. దాంతో కృతీ సనన్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్త వినిపిస్తోంది.అయితే కృతీ సనన్ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఫర్హాన్ అక్తర్ ఆఫీస్ వద్ద కృతి పలుమార్లు కనిపించడంతో ‘డాన్ 3’ చర్చల్లోపాల్గొనడానికే అని ప్రచారంలో ఉన్న వార్తకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ సినిమాని 2023లోనే ప్రకటించారు ఫర్హాన్. అయితే ఇప్పటివరకూ షూటింగ్ ఆరంభించలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ తారలే కాదు... మరికొంత మంది కూడా క్యారెక్టర్ డిమాండ్ మేరకు కసరత్తులు చేసి, సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండాపాత్రల్లో ఒదిగిపోతున్న ఈ కథానాయికలను అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
త్వరలో సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి. త్వరలో విడుదల కాబోతున్న ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, త్వరలో ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని చెబుతున్నారు.సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు. -
హనుమంతుడిలా రామ్ చరణ్.. ‘పెద్ది’లో అదే పెద్ద మలుపు!
‘‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. రాత్రిపూట ఆ మ్యాచ్ ఎపిసోడ్ షూట్ చేశాం. స్క్రీన్పై చూసినప్పుడు అది కేవలం క్రికెట్ మ్యాచ్లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది’ అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డీవోపీ రత్నవేలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఇమాజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి, విజువల్గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం.⇢ రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దాన్ని పీరియడ్ సినిమాలకు రిఫరెన్స్గా తీసుకుంటారు. పెద్ది సినిమాకి వస్తే 40 సంవత్సరాల క్రితం విజయనగరంలో ప్రజలు ఒక కలర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటి ఫీలింగ్ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.⇢ ఈ సినిమాలో కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ గారు కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్పై వర్క్ చేశారు. ప్రతి మజిల్ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్లా కనిపించారు. మీరు టీజర్, ట్రైలర్లో చూస్తే ఆయన బాడీలోని ప్రతి మజిల్ కూడా చాలా డీటైల్గా కనిపిస్తుంది.⇢ ఇందులో హనుమంతుడి రిఫరెన్స్తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. అది మీరు థియేటర్లో చూసినప్పుడు గూస్బంప్స్ వస్తాయి. అందులో రామ్ చరణ్లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రను చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. ‘పెద్ది’ పాత్ర విషయానికి వస్తే, చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.⇢ ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. అది ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులని కదిలిస్తుంది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు.⇢ నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. ఏడాదికి ఒక సినిమానే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అదే సినిమా పూర్తయ్యే వరకు చేస్తాను. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చినా చేయలేదు. నాకు ఈ కథ చాలా నచ్చింది. చరణ్ గారు బుచ్చిబాబు అందరం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాం.⇢ ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ నేను లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం ఫిల్మ్ నెగటివ్ను వాడాం. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్ను ఉపయోగించాను. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించడం జరిగింది. అది జర్నీలో ఉన్న రియలిజం చూపించడానికి అది ఉయోగించాం.⇢ శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్ పీరియన్స్. అక్కడో వాటర్ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. అక్కడ చూసిన రైల్వే ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. అలాగే అక్కడ టన్నెల్ కూడా ఉంది. ఇందులో ట్రావెలింగ్ చేసే సీక్వెన్స్లు, కొండ ప్రాంతాలు, వాటర్ఫాల్స్, టన్నెల్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.⇢ నేను చేసే ప్రతి సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఉంటాను. డీఐలో కూడా కూర్చుంటాను. ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్లో విడుదలైతే ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అమెరికా, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసం నేను అంత కష్టపడుతుంటాను. ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్స్లో విడుదల అవుతుంది. విజువల్ గా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.⇢ రెహమాన్ గారితో ఇది నాకు మూడో సినిమా. ఇంతకుముందు ‘రోబో’, ‘లింగా’ చిత్రాలకు కలిసి పని చేశాం. అంతకుముందు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ‘బొంబాయి’ సినిమాకు కూడా పనిచేశాను. రెహమాన్ గారు జీనియస్. ఈ సినిమాకి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.⇢ నేను నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తాను. అలాగే రీ-రికార్డింగ్కి కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడు దర్శకుడికి చాలా హెల్ప్ అవుతుంది. బుచ్చిబాబు గారు నాకు ఈ సినిమా కోసం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ⇢ ఈ సినిమాకి మా అబ్బాయి కూడా పని చేశాడు. తను కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకున్నాడు. నాలాగే తనకూ సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. ‘పెద్ది’కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇందులో ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. అందులోని ఒక పోర్షన్ను తానే చాలా అద్భుతంగా షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు డీవోపీగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కథ కోసం చూస్తున్నాడు. -
అనన్య పాండే వింత డ్యాన్స్.. ట్రోలింగ్పై స్పందించిన చంకీ పాండే
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే డ్యాన్స్ వీడియో ఒకటి గత రెండు రోజులుగా నెట్టింట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన కొత్త మూవీ ‘చాంద్ మేరా దిల్’సినిమాలోని వీడియో అది. అందులో అనన్య సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆ డ్యాన్స్ చూస్తే భరతనాట్యంలా అనిపించినప్పటికీ.. స్టెప్పులు మాత్రం ఇబ్బందికరంగా,వింతగా ఉండడంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అలా స్టెప్పులేని భరతనాట్యాన్ని అవమానపరిచిందంటూ అనన్యపై ఫైర్ అవుతున్నారు.‘ట్రెడిషనల్ భరతనాట్యం వర్సెస్ బాలీవుడ్ నాట్యం’ అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసి.. అనన్యను విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ వీడియోపై అనన్య పాండే తండ్రి, ప్రముఖ నటుడు చంకీ పాండే స్పందించాడు. చిన్న క్లిప్పు చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని, సినిమా చూసి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాక స్పందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సినిమాలో భరతనాట్యాన్ని ప్రదర్శించలేదని, అది కల్చరర్ ఈవెంట్లలో విద్యార్థులు ప్రదర్శించే ఫ్యూజన్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ లాంటిదని చంకీ పాండే వివరణ ఇచ్చారు. చాలా మంది అపార్థం చేసుకొని తన కూతురిని విమర్శిస్తున్నారని ఆయన .పేర్కొన్నారు.‘చాంద్ మేరా దిల్’ విషయానికొస్తే.. లక్ష్య్, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి వివేక్ సోనీ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలేజీలోనే ప్రేమించుకున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాక వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా కథ. హైదరాబాద్ నేపథ్యంలోనే కథనం సాగుతుంది. Bollywood rarely creates originals these days, but somehow always finds a way to ruin the originals that already exist.#BharatNatayam #AnanyaPandey pic.twitter.com/fwukikOkhi— MK Sharma ✍️ (@EmediaManoj) May 25, 2026 -
‘నేనెవరు?’.. మే 29న తెలుస్తుంది
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నేనెవరు?’. చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘నువ్వేకావాలి’, ‘ప్రేమించు’ వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్, రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది. మే 29న థియేటర్లలో విడుదల కానున్న “నేనెవరు?” చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. -
‘ఎల్లమ్మ’ స్పెషల్ వీడియో.. దేవిశ్రీ సొంతూరులో జాతర చూశారా?
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే సినిమా టైటిల్తో పాటు హీరోగా దేవిశ్రీని పరిచయం చేస్తూ రిలీజ్ చేసి గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రత్యేక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ సొంతూరు వెదురుపాక, అక్కడ అమ్మవారి జాతర విశేషాలను పంచుకున్నాడు.తాను చెన్నైలో పెరిగినప్పటికీ.. నాన్నగారి సొంతూరు వెదురుపాక(తూర్పు గోదావరి జిల్లా) కు తరచూ వచ్చేవాడినని దేవి గుర్తు చేసుకున్నాడు. తమ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు వీడియో ద్వారా పంచుకున్నాడు. వెదురుపాక గ్రామ సంస్కృతి, అక్కడి జానపద కళల గురించి వివరిస్తూ.. ఆకారణంగానే తాను ‘ఎల్లమ్మ’ కథకి ఎస్ చెప్పానని ఆయన అన్నారు. ఈ వీడియోలో పల్లెటూరి వాతావరణాన్ని, పోలేరమ్మ, ఎల్లమ్మ జాతరను, శివసత్తుల పూనకాలు, సాంప్రదాయ పులి వేషాలు, డప్పు వాయిద్యాలను చూపించారు. అంతేకాదు ఊరి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. డ్యాన్స్ కూడా చేశాడు. -
మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసిన హీరో.. వీడియో వైరల్
మంచు మనోజ్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నాడు. నిర్వాహకుల అభ్యర్థన మేరకు రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ‘మాతృదేవోభవ’ అనాథాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమానికి కావాల్సిన టేబుళ్లు, కుర్చీలను విరాళంగా అందజేశారు. అంతేకాదు అక్కడున్నవారందరికీ కొత్త దుస్తులను కూడా పంపిణీ చేశాడు. అలాగే ఓ మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు మనోజ్. సెలెబ్రెటీని అనే ఫీలింగ్ లేకుండా సామాన్య వ్యక్తిగా వెళ్లి.. అతనికి కటింగ్ చేశాడు. ఈ సందర్భంగా అతని పేరు కూడా అడిగి తెలుసుకున్నాడు. అతనికి పేరు తప్ప ఇంకేమి గుర్తు లేదని నిర్వాహకులు చెప్పడంతో.. ‘పేరు చాలా బాగుంది’ అంటూ కటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కాగా, మనోజ్ ఇప్పటికే ఈ మధ్యే తన సతీమణితో కలసి ఐక్య అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానంతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సొంత డబ్బుతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయబోతున్నట్లు ప్రకటించారు. Manchu Manoj Emotional Service 😍 | Helping Orphans on Roadside Viral Video#ManchuManoj #TeluguNews #ViralVideo #Humanity #HelpingHands #SocialService #HeartTouching #InspiringStory #GoodDeeds #Orphans #TeluguCinema #BRKNews pic.twitter.com/W9vzabUkzb— BRKNews (@BRKTelugu_1) May 26, 2026 -
‘సింగిల్ రాజు’ కథ ఆసక్తికరంగా ఉంది: వేణు ఊడుగుల
విశ్వాస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’. ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక–నిర్మాత వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా హాజరై టైటిల్ పోస్టర్, గ్లింప్స్ను విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కథ చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలి’’ అని తెలిపారు. ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ–‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నలు కష్టపడ్డారు. ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్టైనర్గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘వర్మ, మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్న చిత్రమిది’’ అన్నారు విశ్వాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయితేజ కుందారపు, నితీష్. -
పెద్ది సినిమాకి ముందే ఎందుకిలా! ఎగ్జిబిటర్లతో చిరంజీవి భేటీ..
-
నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది: శివ రాజ్కుమార్
‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేయడం ఇష్టం. ‘పెద్ది’ సినిమాలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే’’ అని చెప్పారు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్. హీరో రామ్చరణ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్వేందు, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ మాట్లాడుతూ– ‘‘పెద్ది’ కథ విన్న తర్వాత, ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించి, ఈ సినిమా చేశాను. ఇందులో ఓ కోచ్ తరహా పాత్రలో నటించాను. కథలో గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటాయి. ఈ పాత్రను బుచ్చిబాబు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. పెద్ది–గౌర్నాయుడు పాత్రల మధ్య అనుభందం ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రల మధ్య నెలకొన్న ఎమోషన్కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం ‘గుమ్మడి నర్సయ్య’, ‘జైలర్ 2’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్లో సమంత
సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్' అని ప్రశంసించింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్లో సమంత తన స్టంట్స్తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. -
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..పర్పుల్ కలర్ డ్రెస్ టాలీవుడ్ నటి బిందు మాధవి సమ్మర్ పోజులు..లైట్ కలర్ శారీలో ఆదితి గౌతమ్ మతిపొగొట్టే అందాలు..సిస్టమ్ టీమ్తో జ్యోతిక చిల్..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by @natasastankovic__ -
మెగాస్టార్ చెంతకు పర్సంటేజీ వివాదం.. అసలేం జరగనుంది?
టాలీవుడ్ పర్సెంటేజ్ వివాదం మరింత రసవత్తరంగా మారింది. ఈ సమస్య చివరికీ మెగాస్టార్ వరకు చేసింది. ఈ వివాదం మరింత ముదరడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతస సంఘం చిరంజీవిని కలిశారు. దాదాపు గంటసేపు వీరితో చిరంజీవి సమావేశంలో కానున్నారు. ఎగ్జిబిటర్స్తో, గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీపై అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ రోజు తెలంగాణ ఎక్జిబిటర్స్, నిర్మాత కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల నియమించిన కమిటీ నుంచి అన్ని వివరాలు చిరంజీవి తెలుసుకున్నారని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండు మూడు రోజుల్లో అఫిషియల్గా చెబుతామని తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య..: ఎగ్జిబిటర్ శ్రీధర్..ఇది ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య అని.. పెద్ది మూవీ గురించి కాదని ఎగ్జిబిటర్ శ్రీధర్ వెల్లడించారు. చిరంజీవి రెస్పాన్స్ బాగుందని అన్నారు. అన్ని వివరాలు మెగాస్టార్ అడిగి తెలుసుకున్నారని వివరించారు. సింగిల్ స్రీన్ థియేటర్స్ పడుతున్న సమస్యలు ఇన్ని ఉన్నాయా అని చిరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని శ్రీధర్ అన్నారు. -
'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్బంప్స్ స్పీచ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Reiterates... "Ee Cinema Raasi Pettukondi" 🔥#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/OOAdD59WHI— Trends RamCharan ™ (@TweetRamCharan) May 25, 2026 -
దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..!
టాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. -
పెళ్లి కంటే ఆ పని చేయడం వందరెట్లు బెటర్: టాలీవుడ్ హీరోయిన్
స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. -
పెద్ది ఐటమ్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తోంది..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్ తన డ్యాన్స్తో ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
సీఎం విజయ్కు స్టార్ హీరో విజ్ఞప్తి.. అదేంటంటే?
కోలీవుడ్ హీరో విజయ్ సీఎం అయ్యాక సినీ పరిశ్రమ ఆయనపై గంపెడాశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి సీఎంకు విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ ఫ్లాట్ఫామ్ ప్రారంభించాలని విజయ్ను కోరారు. ఓటీటీ ప్లాట్ఫారాన్ని ప్రారంభిస్తే అది తమకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.విజయ్ సీఎం అయ్యాక విశాల్ సైతం ఇండస్ట్రీ ఇబ్బందులను వివరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని నియమించడాన్ని తప్పుబట్టారు. సినిమా శాఖను సీఎం వద్దే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితేనే న్యాయం చేయగలడని అన్నారు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్ సినీతారలు సంబురాలు చేసుకున్నారు. -
మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్!
ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలను విడుదల చేసిన ఉదయనిధి స్టాలిన్ ఆ తర్వాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి (2012) మంచి విజయాన్ని సాధించింది. అదే చివరి సినిమాఆ తర్వాత వరుసగా చిత్రాలను చేస్తూ వచ్చిన ఈయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. ఉదయనిది స్టాలిన్ చివరిగా నటించిన చిత్రం మామన్నన్. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఉదయనిధి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. రీఎంట్రీ?ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. రాజకీయ నేపథ్యంలో సాగే కథాచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్ జెయింట్ మూవీస్ మూవీస్ సంస్థ నిర్వహణ బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బనిధి స్టాలిన్ చేపట్టిన విషయం తెలిసిందే. -
మంచులో ప్రేమ
హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ ప్రదేశాలకు వెళితే ఆ హాయే వేరు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేకి ఆ చాన్స్ దక్కింది. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఓ చల్లని ప్రదేశంలో జరిగింది. మంచు, చిరు జల్లుల మధ్య ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ని పూర్తి చేసింది యూనిట్. ఆ ఫొటోలను విడుదల చేశారు. చిరు జల్లుల నుంచి తప్పించుకోవడానికి గొడుగు, చలి తట్టుకోవడానికి వింటర్ అవుట్ఫిట్స్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు దుల్కర్, పూజ. అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రవి నెలకుడితి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి.


