breaking news
Movie News
-
పుట్టినరోజు ప్రత్యేకం
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంతో రూపొందిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సోషియో ఫ్యాంటసీ సూపర్ నేచురల్ చిత్రంలో సుమంత్ హీరోగా నటించారు. మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.రాజశ్యామల పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. సోమవారం (ఫిబ్రవరి 9) సుమంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా కొత్త గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాలోని ముఖ్య పాత్రల్లో ప్రముఖ హీరో, హీరోయిన్లు నటించారని, వారి వివరాలను, రిలీజ్ డేట్ను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
డ్రాగన్ యాక్షన్
జోర్డాన్ లో ల్యాండ్ అయ్యారు డ్రాగన్ . హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, టొవినో థామస్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ జోర్డాన్ లొకేషన్స్ లో ప్రారంభం అయిందని తెలిసింది.దాదాపు నెల పాటు జరిగే ఈ షూటింగ్లో ప్రధానంగా మూడు యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారట ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, మే 20న ఎన్టీఆర్ బర్త్ డేకి ‘డ్రాగన్ ’ ఫస్ట్లుక్, టీజర్ రిలీజ్ కావొచ్చనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
ఆయా షేర్
‘ది ప్యారడైజ్’ సినిమా కోసం అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు జడల్. ఏ రేంజ్లో అనేది సిల్వర్ స్క్రీన్స్ పై చూడాలి. ‘దసరా’ వంటి సూపర్హిట్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నానిపై ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఈ పాటకు సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఎనిమిది భాషల్లో ఈ ఏడాదే రిలీజ్ కానుంది. -
ఓటీటీ ట్రెండింగ్లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్
గత కొన్నిరోజులుగా ఎప్స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)2005లో ఎప్స్టీన్ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్ఫ్లిక్స్లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్గా ఎప్స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన) -
'పుష్ప' తరహాలో.. చరణ్-సుక్కూ కాంబో రెడీ.. ఆమె సంగతేంటి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్లైట్లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్గా మారింది. తన కెరీర్లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ.. నటాషా స్టాంకోవిచ్ బోల్డ్ లుక్స్..!
ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్లో బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ..మరింత హాట్ హాట్గా నటి నటాషా స్టాంకోవిచ్..పాయల్ రాధాకృష్ణ స్టన్నింగ్ వీడియో..గతవైభవ మూవీ జ్ఞాపకాల్లో ఆషిక రంగనాథ్..గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
టాలీవుడ్ ఇండస్ట్రీలో అసమ్మతి.. మళ్లీ మొదలైన వివాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో కథ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో తలెత్తిన సినీ కార్మికుల వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాజాగా టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి లేఖలు రాశారు. దీంతో ముగిసిపోయిందనుకున్న సమస్య మళ్లీ అసమ్మతి సెగలకు కారణమైంది. తమ సమస్యలు ఈ నెలాఖరు లోపు పరిష్కరించాలని కోరుతూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా వీరి బాటలోనే మరో 11 యూనియన్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని యూనియన్ల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం, ఛాంబర్ పెద్దలతో చర్చించి మాకు న్యాయం చేయాలని యూనియన్ నాయకులు అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి ఒకటి నుంచి సమ్మెకు దిగుతామని టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు. -
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉపాసన తన పోస్ట్లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం. తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOUMy family is truly blessed.Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026 -
ఓటీటీకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.ఈ క్రైమ్ థ్రిల్లర్ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్ ఇన్ ఏ మెట్రో, వేకప్ సిద్, ‘మెట్రో ఇన్ దినో’ లాంటి సినిమాల్లో నటించారు. Meera's living her dream life. Will a secret turn it into a nightmare?Watch Accused, starring Konkona Sensharma and Pratibha Rannta, out 27 Feb, only on Netflix. #AccusedOnNetflix pic.twitter.com/J1Nuk2x3f1— Netflix India (@NetflixIndia) February 9, 2026 -
దృశ్యం నటి.. ఒకే ఒక్క సీరియల్తో సినిమా ఛాన్స్..!
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3 ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్ను అలరించనుంది.అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.అసలు ఎవరీ ఆశా శరత్?దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్తో మూవీస్లో అడుగుపెట్టింది.స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే సీరియల్తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది. ఈ క్యారెక్టర్తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది. మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు. -
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడి
అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడిటాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశారు. మెగాస్టార్తో తీసిన మనశంకర వరప్రసాద్గారు బ్లాక్బస్టర్గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు.తాజాగా హై టీజర్కు ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి.. తనతో కలిసి పని చేసిన సాయికృష్ణపై ప్రశంసలు కురిపించారు. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ల నాన్న డ్రీమ్ అని తెలిపారు. కానీ ఆ కల నేరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్గా ఫీలయ్యానని అనిల్ రావిపూడి అన్నారు. సాయి బాగా చేస్తాడని తెలుసు.. కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదని కొనియాడారు. ఈ సినిమాలో చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా చేశాడని అనిల్ ప్రశంసించారు. కాగా.. సాయి కృష్ణ, అనన్య శర్మ,ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ను విడుదల చేశారు. -
ఖైదీ 2 సంగతేంటి..? ఉన్నట్టా..? లేనట్టా...?
-
మరోసారి భయపెట్టబోతున్న ఆది సాయికుమార్!
‘శంబాల’ చిత్రంతో రీసెంట్గా ఆది సాయి కుమార్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మరోసారి అద్భుతమైన కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందింది అని చిత్రయూనిట్ చెబుతోంది.ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్స్ స్వాధీనం చేసుకోవడం విశేషం. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.ఈ మూవీలో ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. హారర్తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ట్రైలర్తో పాటు ఫస్ట్ లుక్ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇకపై కంటిన్యూగా అప్డేట్లను ఇస్తామని టీం చెబుతోంది. -
అప్పుడు ‘షోలే’..ఇప్పుడు ‘ధురంధర్’.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్కి వచ్చి చూశారు. మౌత్ టాక్తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్పాండే అన్నారు. ఇక సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్.. డిజిటల్ స్క్రీన్పై కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. -
బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్పుల్గా టీజర్
అనన్య శర్మ, ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో రేవంత్ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు. -
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్ఫ్లిక్లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
'నా సూపర్ పవర్ నువ్వే.. సతీమణికి కాంతార హీరో స్పెషల్ విషెస్'
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత రిషబ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గతేడాది కాంతార-2 ప్రీక్వెల్తో మరో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి.. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టిని పెళ్లాడారు. 2017లో పిబ్రవరి 9న వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు రిషబ్ శెట్టి. ట్విటర్ వేదికా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.రిషబ్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ఈరోజుతో అందమైన, ప్రేమపూర్వక వివాహానికి తొమ్మిదేళ్లు. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాల నిధి. ఇందులో ఆనందం, బాధ, నవ్వు, ఉత్సాహం ప్రతిది ఉన్నాయి. అన్నింటినీ మించి అంతులేని ప్రేమ ఉంది. ప్రేమ ప్రసరింపజేసే వెలుగు, అది తెచ్చే శాంతి, అది నింపే ఆత్మవిశ్వాసమే నన్ను ఈ రోజు ఇలా మార్చాయి. నా భార్య, నా సహచరురాలు, అదృష్ట దేవత, నా జీవితాన్ని సముద్రమంత విశాలంగా మార్చేసిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా నా సూపర్ పవర్, నన్ను నడిపించే శక్తి, నా బలానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు జీవితం మరింత బాగుంటుందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇది చూసిన రిషబ్ అభిమానులు తమ అభిమాన హీరో జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ಬಂಧ ಬೆಸೆದು, ಚಂದ ಹೊಸೆದು ಒಂದಾದ ಒಲವಿನ ದಾಂಪತ್ಯಕ್ಕಿಂದು ಒಂಭತ್ತು ತುಂಬಿದೆ. ಹಿಂದೆ ನೋಡಿದರೆ ಜೊತೆ ಕಳೆದ ಪ್ರತಿ ಗಳಿಗೆಯೂ ಸಿಹಿ ನೆನಪಿನ ನಿಕ್ಷೇಪಗಳಾಗಿವೆ. ಅಲ್ಲಿ ನಲಿವಿದೆ, ನೋವಿದೆ, ನಗುವಿದೆ, ಸರಸವಿರಸಗಳಿವೆ.. ಎಲ್ಲವನ್ನು ತೂಗುವ ಸಮರಸವಿದೆ.. ಎಲ್ಲಕ್ಕೂ ಮಿಗಿಲಾಗಿ ಕೊನೆಯಾಗದ ಒಲವಿದೆ.. ಅ ಒಲವು ಬೀರಿದ ಬೆಳಕು, ತಂದ ನೆಮ್ಮದಿ,… pic.twitter.com/lBbongYlA9— Rishab Shetty (@shetty_rishab) February 9, 2026 -
ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్?
-
ఫుల్ హ్యాపీగా సమంత- రాజ్ నిడిమోరు.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది. ఓ బేబీ మూవీ తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్ లీగ్ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్లో తన టీమ్ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ల్లో సామ్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. #TFNExclusive: #Samantha & #RajNidimoru celebrating and cheering with joy for their team 🤩#MaIntiBangaram #TeluguFilmNagar pic.twitter.com/H9nmfS2Lew— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2026 -
విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న. కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ఈవెంట్కు హాజరైన తరుణ్ భాస్కర్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.ఇదే ఈవెంట్లో తరుణ్ భాస్కర్కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్లు వేశారు.కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. -
చిరు పక్కన సారా అర్జున్.. కృతి శెట్టి కథ కంచికేనా..?
-
'గాయపడ్డ సింహం' వచ్చేసింది..
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం’ టీజర్ వచ్చేసింది. ఈ చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ టీజర్లో తరుణ్ భాస్కర్ పంచ్ డైలాగ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది. 'పెళ్లి చూపులు సినిమా యావరేజ్.. కానీ, ఓవర్ హైప్ అయింది అంతే' అంటూ ఆయన డైలాగ్ పేలుస్తాడు.దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది. -
అప్పుడు నాకు 7ఏళ్లు.. 'ఉదయ్ కిరణ్' మేనల్లుడు వీడియో విడుదల
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్ కానుంది. 25ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి ఈ హిట్ మూవీ రానుంది. ఉదయ్కిరణ్, రీమా సేన్, తనూ రాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరకెక్కించగా ఎమ్.ఎస్. రాజు నిర్మించారు. అయితే, రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్కిరణ్ మేనల్లుడు తేజ ఒక వీడియో విడుదల చేశారు.‘మనసంతా నువ్వే’ సినిమా గురించి ఉదయ్కిరణ్ మేనల్లుడు ఇలా అన్నారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.2001లో విడుదలై, బ్లాక్బస్టర్గా మనసంతా నువ్వే నిలిచింది. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఉదయ్కిరణ్కు ఇది హ్యాట్రిక్ విజయంగా నిలిచింది. ఈమూవీకి సంగీతం ఆర్.పి.పట్నాయక్ వ్యవహరించగా, పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు#ManasanthaNuvve 25 ఇయర్స్ & రి రిలీజ్ సందర్భంగా #UdayKiran మేనల్లుడు #Teja వీడియో బైట్ 👇🏽ఫిబ్రవరి 14న మళ్ళీ థియేటర్స్ లో ❤️#ManasanthaNuvve4K pic.twitter.com/NZxuDaNUk4— Gautam Yarramsetty (@mrgyvcofficial) February 9, 2026 -
మలయాళ బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ రెడీ
మలయాళ బ్లాక్బస్టర్ సినిమా 'ఆవేశం' సీక్వెల్ రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇండస్ట్రీలో వైవిధ్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ సంచలన విజయం అందుకుంది. కేవలం మలయాళంలోనే రూ.150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం అనేక రికార్డ్స్ను తిరగరాసింది. ఇందులో రౌడీ షీటర్గా ఫహద్ నటన బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసించారు. 2024లో దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ మూవీ సీక్వెల్ గురించి తాజాగా ప్రకటన వచ్చేసింది.ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఫహద్ మాట్లాడుతూ.. ఆవేశం 2 పనులు జరగుతున్నాయని ధృవీకరించారు. ఈ సీక్వెల్ 2027 లేదా 2028లో విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు జితు మాధవన్ ప్రస్తుతం సూర్యతో తన మొదటి తమిళ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అతను ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి, ఫహద్ ఫాజిల్తో ఆవేశం సీక్వెల్ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఆవేశం మూవీలో ఫహద్ ఫాజిల్తో పాటు హిప్స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు నటించారు. ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. అయితే అధికారికంగా ప్రకటన రాలేదు. -
ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
వాలంటైన్స్ వీక్ వచ్చేసింది. గతవారం చాలానే తెలుగు సినిమాలు, థియేటర్లలోకి వచ్చాయి కానీ ఒక్కటి నిలబడలేదు. ఈ వీకెండ్.. విశ్వక్ సేన్ 'ఫంకీ'తో పాటు 'కపుల్ ఫ్రెండ్లీ', 1+1 ఆఫర్ అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే సీతాపయనం, బూకి అనే డబ్బింగ్ చిత్రాలతో పాటు లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటివి రీ రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 16 వరకు కొత్త చిత్రాలు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి.ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతి హిట్స్ అయిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఈ వీకెండ్ అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు బేబీ గర్ల్ అనే మలయాళ డబ్బింగ్ మూవీ, ద కంజూరింగ్, ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్ అనే హాలీవుడ్ డబ్బింగ్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 09 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్అనగనగా ఒక రాజు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11లీడ్ చిల్డ్రన్ (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 11లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 11తలైవర్ తంబి తలైమయిల్ (తమిళ మూవీ) - ఫిబ్రవరి 12జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13అమెజాన్ ప్రైమ్క్రాస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఫిబ్రవరి 1హాట్స్టార్ప్రిడేటర్: బ్యాడ్ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఫిబ్రవరి 12ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13జీ5మన శంకరవరప్రసాద్ గారు (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 11సన్ నెక్స్ట్సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13సోనీ లివ్బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 12ఆపిల్ టీవీ ప్లస్ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్అమర్ విశ్వాస్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 11 -
వెయిట్ చేస్తా!.. ఆకట్టుకునేలా గ్లింప్స్
‘ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా’ అనే డైలాగ్తో నరేష్ స్వభావం ఏంటో అర్థమైపోతుంది. ఇంతకీ ఎవరీ నరేష్ అంటే... ‘వాట్స్ అప్ నరేష్’ చిత్రంలో హీరో అన్వేష్ మైఖేల్ చేసిన పాత్ర పేరు ఇది. ఈ చిత్రం గ్లింప్స్లో పై సంభాషణతోపాటు బ్యాక్గ్రౌండ్లో ‘లోకం తీరింతే... నువ్వే మారాలంతే’ అనే లిరిక్స్ వినిపిస్తాయి.‘కొత్తపోరడు’ తర్వాత అన్వేష్ మైఖేల్ హీరోగా, ‘బలగం’ ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సీవీ విశాల్ దర్శకత్వంలో భాగ్యలక్ష్మీ చింతా నిర్మించారు. ‘‘సాఫ్ట్వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ... ఇలా అన్ని అంశాలను జోడించి ఈ సినిమా రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
క్లైమాక్స్లో 'ఆకాశంలో ఒక తార'
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో హీరోయిన్లుగా, శ్రుతీహాసన్ ఓ కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు (సోమవారం) రాజమండ్రిలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లుపాల్గొనగా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ షెడ్యూల్తో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
మళ్లీ మనసంతా నువ్వే..
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్ కానుంది. ఉదయ్కిరణ్, రీమా సేన్, తనూ రాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఎమ్.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది.ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్. -
సంక్రాంతికి సోగ్గాళ్లు
‘‘వాసివాడి తస్సాదియ్యా... వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి’’ అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు ‘ఎక్స్’లోపోస్ట్ చేశారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016). ఈ చిత్రంలో నాగార్జున ‘వాసివాడి తస్సాదియ్యా...’ అంటూ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే డైలాగ్ వచ్చేట్లు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు కాబట్టి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి కొత్త చిత్రం రాబోతోందని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని స్పష్టమవుతోంది.ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటికే వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) సినిమాలు సంక్రాంతికే విడుదలై, సూపర్హిట్స్గా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇటీవలే నాగార్జునను కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథతోనే కొత్త సీక్వెల్ తెరకెక్కనుందనీ, జూన్లో షూటింగ్ ఆరంభిస్తారనీ తెలిసింది. ‘బంగార్రాజు’లో నాగార్జున–నాగచైతన్య నటించారు. వచ్చే సంక్రాంతికి రానున్న చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించనున్నారని భోగట్టా. -
యాక్షన్ టీజర్ రెడీ
హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘స్వయంభు’లో పోరాట యోధుడిగా నిఖిల్ ఏ స్థాయిలో నటించారో మరో మూడు రోజుల్లో టీజర్తో శాంపిల్ చూపించడానికి రెడీ అయింది యూనిట్.నిఖిల్ హీరోగా సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన చిత్రం ‘స్వయంభు’. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ బుధవారం విడుదల కానుంది. ‘‘పవర్ఫుల్పాన్ ఇండియా విజన్తో వస్తున్న చిత్రం ‘స్వయంభు’. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా మా సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
'స్పిరిట్' నుంచి తప్పుకొన్న ప్రకాశ్ రాజ్! ఏమైంది?
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ వంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మొదలైంది. త్వరలో విదేశాలకు కూడా వెళ్లనున్నారు. కొన్నిరోజుల క్రితమే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అంతకు ముందు న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలి అంచనాలని పెంచేశారు. ఇప్పుడీ చిత్రం నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమా నుంచి కొన్నాళ్ల క్రితం ఆడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. ఇందులో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు వాయిస్ ద్వారా అర్థమైంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కాగా వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ప్రకాశ్ రాజ్.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణమని మాట్లాడుకుంటున్నారు. సందీప్ వర్కింగ్ స్టైల్ గానీ సినిమా తీసే విధానం మిగతా దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వచ్చిందో గానీ ప్రకాశ్ రాజ్ తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది. మరి ఇదే నిజమైతే ఇతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి? -
హైదరాబాద్లో సమావేశమైన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.టాలీవుడ్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. అందుకే ఫ్యాన్స్ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది. -
స్టార్ హీరోయిన్ సీమంతం.. సందడిగా సెలబ్రిటీలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్కపూర్ త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్.. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కొడుకు (వాయు)ను స్వాగతించారు. గతేడాది నవంబర్లో సోనమ్ తన బేబీ బంప్ను రివీల్ చేస్తూ రెండవ గర్భధారణను ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ ఆనందాన్ని బంధువులు, సన్నిహితులతో పంచుకుంటూ ముంబైలోని తమ నివాసంలో బేబీ షవర్(సీమంతం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. కరీనా కపూర్ , అనిల్ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, భూమి పెడ్నేకర్, షబానా అజ్మీ ఈ కార్యక్రమంలో సందడిగా కనిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరే కూడా సోనమ్ నివాసంలో కనిపించారు. తరువాత, అనుపమ్ ఖేర్, మసాబా గుప్తా, కునాల్ రావల్, సంజయ్ కపూర్ ఇతరులు కూడా వచ్చారు. Mothering glow, Sonam 🤍✨#SonamKapoor pic.twitter.com/2ARGdBSXnh— 𝙰𝚍𝚊𝚛𝚜𝚑 (@_Adarsh______) February 2, 2026#KareenaKapoorKhan arrived looking stunning as ever for #SonamKapoor's baby shower. ♥️#FilmfareLens pic.twitter.com/jfSHD1Gvs2— Filmfare (@filmfare) February 8, 2026 -
అర్ధరాత్రి రజనీతో బైక్ రైడ్.. అనిరుధ్ తండ్రి మమ్మల్ని అడ్డుకుని!
దక్షిణాదిన ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్కుమార్ ఈసారి చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.బైక్పై తిరిగాంఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్, నేను బైక్పై చెన్నై అంతా తిరిగాం. నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.జీవితంలో అనేక కష్టాలుఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్పై తిరుగుతూ ఉంటే సడన్గా ఒక కారు మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. సీక్రెట్ షికారు అనుకుని..అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్ భార్య, నిర్మాత, సింగర్ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్ రవిచందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నాడు.చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము -
పవన్ కల్యాణ్కు జోడీగా స్టార్ హీరోయిన్.. వివాదం ఎందుకు?
సినీ నటుడు పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ గురించి నిర్మాత రామ్ తాళ్లూరి కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. పవన్ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’ మార్చి 26న విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత తదుపరి ఆయన చేయనున్నది సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమానే కావడం విశేషం. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక గురించి మరోసారి విమర్శలు వస్తున్నాయి.‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్ను పవన్కు జోడీగా సురేందర్ రెడ్డి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇమాన్వీ ఎంపికను తప్పుబడుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫౌజీ మూవీలో ఇమాన్వీని తీసుకుంటున్నట్లు ప్రకటన వచ్చిన సమయంలో కూడా ఇలాంటి వివాదమే రేగింది. తన మూలాలు పాకిస్థాన్కు చెంది ఉన్నాయని మరికొందరు గుర్తు చేస్తున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్తో ఉన్న సంబంధాలన్నీ కూడా భారత్ తెంచుకుంది. పాకిస్థాన్ నటులు, సినిమాలపై కూడా నిషేధం విధించాలనే డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్ మూవీకి ఇమాన్వీని తీసుకోనున్నారని వార్తలు రావడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ఇమాన్వీ ఎంపిక అంశం గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.నాది పాకిస్థాన్ కాదుఫౌజీ సినిమా సమయంలో కూడా ఇమాన్వీ ప్రాంతీయత గురించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాను పాకిస్థానిని కాదని, భారతీయ అమెరికన్ని అని గర్వంగా చెప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు తన మూలాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ' పాకిస్థాన్తో నా కుటుంబం సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని కొందరు నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. నేను చాలా క్లియర్గా హిందీతో పాటు తెలుగు, గుజరాతీ మాట్లాడగలనని గర్వంగా చెబుతాను. నేను పుట్టింది లాస్ ఏంజెలిస్లో.. చాలా ఏళ్ల క్రితమే నా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు ఎప్పుడో అమెరికన్ సిటిజన్స్గా గుర్తింపు పొందారు. నేను చదివింది కూడా అమెరికాలోనే.. సినిమాలపై ఆసక్తితో నా చదువు పూర్తయ్యాక కొరియోగ్రాఫర్గా కెరీర్ని ప్రారంభించాను. ఫైనల్గా భారతీయ చిత్రపరిశ్రమలో అవకాశాల్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది.' అంటూ గతంలో ఇమాన్వీ తన గురించి క్లారిటీ ఇచ్చింది. -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. భయపెడుతోన్న ట్రైలర్
ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత, శివ కంఠనేని ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. అమరావతికి ఆహ్వానం ట్రైలర్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏంట్రా ఈ ఊరు మనుషులే కనపడట్లేదు అనే డైలాగ్తో ప్రారంభమైంది. ఈ గ్రామంలో జరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్లో సీన్స్ ఆడియన్స్ను భయపెట్టేస్తున్నాయి. దెయ్యాల కాన్సెప్ట్తోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
రోజుకు 15 సార్లు వాంతులు.. నరకం చూశా: సుప్రిత
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో హల్ చేసిన ఈ బ్యూటీ..ఇకపై వెండితెరపై సందడి చేయబోతుంది. ఆమె హీరోయిన్గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది సుప్రిత. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు..తన మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.ఒత్తిడితో ఎక్కువ తీసేశా.. ఆ మధ్య నేను కాస్త బరువు పెరిగా. అందరూ నన్ను లావు అయ్యావు అనడంతో ఒత్తిడికి లోనయ్యా. నేను ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇంకాస్త ఎక్కువే తింటాను. అలా తినడంతో బరువు పెరిగిపోయా. దీంతో వెంటనే తగ్గాలని ఒక పూట తినడం ప్రారంభించా. ప్రతి రోజు 12-15 గంటల పాటు ఏం తినకుండా ఉండేదాన్ని. ఒక పూట మాత్రం ఏదైనా తీనేదాన్ని. ఎక్కువగా బిర్యానీలు తీనడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చేరాను. అక్కడ దాదాపు 15 రోజుల పాటు నరకం చూశా. మంచి నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. 20 రోజుల పాటు అన్నమే తినలేదు. రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి. ఒకనొక దశలో నేను బతకనేమో అనుకున్నా. నా వల్ల అమ్మతో పాటు స్టాఫ్ అంతా ఇబ్బంది పడింది. ఆస్పత్రిలో వారిని చూసి నాకే బాధకలిగింది. ఈ నరకం భరించడం కంటే..ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి చంపేస్తే బాగుండు అనుకున్నా. కానీ దేవుడి దయతో కోలుకున్నా. ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను’ అని సుప్రీతి చెప్పుకొచ్చింది.ఆ ఇద్దరికి సిస్టర్గా నటించలేనుఇక ఇదే ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు హీరోయిన్గా మాత్రమే కొనసాగాలని లేదని.. మంచి స్క్రిప్ట్ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ చేస్తానని చెప్పింది. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్కు సిస్టర్గా నటించే అవకాశం వస్తే వదులుకోను. ఈ ఇద్దరనే కాదు.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, అఖిల్ తప్ప వేరే ఏ హీరోకి అయినా సిస్టర్గా నటిస్తా. విజయ్ దేవరకొండ, అఖిల్ అంటే నాకు చాలా ఇష్టం. పదో తరగతి పాస్ అయితే అఖిల్తో డిన్నర్కి తీసుకెళ్తా అని అమ్మ మాట ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు. అఖిల్, విజయ్ నేరుగా కనిపిస్తే..షాకులో ఉండిపోతానేమో’ అని సుప్రిత చెప్పుకొచ్చింది. -
దురంధర్కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. అలా జరిగి ఉంటే దురంధర్కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.థియేటర్స్ మరింత అవసరం..ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.గతేడాది చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.మరింత భారీ వసూళ్లు..మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు. -
వైఎస్ జగన్ను కలిసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్
వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ కలిశారు. చెన్నైలో జరిగిన సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలు కార్తీ, సూర్య వైఎస్ జగన్ను ఆత్మీయంగా పలకరించారు. పెళ్లి వేడుకలో హీరోలు కార్తీ, సూర్యతో వైఎస్ జగన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు అటు రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చలకు దారి తీసింది. View this post on Instagram A post shared by Sakshi (@sakshinews) -
పూజా హెగ్డే మోనికా సాంగ్.. ఐదేళ్ల బుడ్డోడు అదుర్స్..!
గతేడాది సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ మూవీలో పూజా హెగ్డే ఓ ప్రత్యేక సాంగ్కో మెరిసింది. మోనికా అంటూ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతలా ఈ సాంగ్ సినీ ప్రియులను మెప్పించింది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్స్తో మెప్పించాడు.అయితే తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మూవీ ఈవెంట్లో మోనికా సాంగ్కు చిచ్చరపిడుగులా అదరగొట్టేశాడు. ఈ బుడ్డోడి స్టెప్పులు చూసిన నెటిజన్స్ పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్ను మించిపోయేలా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అబ్బాయి ఎనర్జీ చూసి ఫిదా అయిపోతున్నారు.కాగా.. రజినీకాంత్ నటించిన కూలీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. Yaara nee 🤯🔥 pic.twitter.com/YH1heMRynH— OTT Trackers (@OTT_Trackers) February 8, 2026 -
13 ఏళ్ల మిర్చి .. అనుష్క సినిమాల్లో.. శేఖర్ కమ్ముల హీరోయిన్ ఎక్కడ?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి. 2013 ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ను ఓ రేంజ్లో ఊపేసింది. కొరటాల శివ డైరెక్షన్లో ఈ మూవీ రెబల్ స్టార్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించింది. గుంటూరు పల్నాడు ప్రాంతంలో జరిగే ప్రతీకార నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటించగా..మరో హీరోయిన్గా రిచా గంగోపాధ్యాయ మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై సరిగ్గా నేటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.అనుష్క ఇంకా సినీ ఇండస్ట్రీలోనే..అనుష్క ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. గతేడాది ఘాటి మూవీతో అభిమానులను మెప్పించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో తెరెకెక్కించారు.రిచా గంగోపాధ్యాయ ఎక్కడ? రానా హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ లీడర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రీచా గంగోపాధ్యాయ. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రవితేజ సరసన మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లోనూ రీచా మెప్పించింది. ఆ తర్వాతనే మిర్చి సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది.అయితే హీరోయిన్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ అందుకున్నా సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నేళ్లకే ఇండస్ట్రీకి టాటా చెప్పేసింది. 2013లో చివరిసారిగా భాయ్ సినిమాలో కనిపించింది. ా తర్వాత రీచా టాలీవుడ్ సినిమాలకు దూరమైంది.అమెరికన్తో పెళ్లి..ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మిర్చి బ్యూటీ.. ఆ తర్వాత తన ఫ్రెండ్, అమెరికాలోని పోర్ట్లాండ్కు చెందిన జో లాంగేల్లాను పెళ్లాడింది. 2021లో వీరిద్దరికీ ఓ బాబు కూడా జన్మించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా గతంలో తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పూర్తిగా సినిమాలకు దూరమైన రిచా.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) -
హీరోగా అనిల్ రావిపూడి.. అడ్వాన్స్గా అమెరికన్ డాలర్..!
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టేస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ ఏడాది కూడా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్గారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా టాలీవుడ్లో సంక్రాంతి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి.అయితే తాజాగా ఓ మూవీ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర అనుభవం ఎదురైంది. టాలీవుడ్ కమెడియన్ అలీ.. అనిల్ రావిపూడి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అనిల్ రావిపూడి హీరోగా చేస్తే అడ్వాన్స్ ఇస్తానని అలీ అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఈవెంట్లో అనిల్కు అడ్వాన్స్గా అమెరికన్ డాలర్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హీరోగా #AnilRavipudi... అమెరికా డాలర్ను అడ్వాన్స్గా ఇచ్చిన నటుడు #Ali pic.twitter.com/w6EfHjFXSq— TeluguOne (@Theteluguone) February 7, 2026 -
నన్ను అలా అన్నందుకు బాధలేదు.. కానీ..: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశాన్ని ఓ విదేశీ జర్నలిస్ట్ అలా అని పిలవడం చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఒక దేశంలో ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైనప్పుడు అక్కడి స్థానిక అభిమానుల నుండి తనకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. విమానంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారని తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తనను జాగ్రత్తగా హోటల్కు తీసుకెళ్లారని వెల్లడించారు. ఇటీవల టీమ్ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.అమితాబ్ మాట్లాడుతూ.. "ఒక దేశం నన్ను ఫిల్మ్ ఫెస్టివల్కు ఆహ్వానించింది(ఆ దేశం పేరు వెల్లడించను). దీనికి నేను వెళ్లడానికి అంగీకరించా. ఆ దేశానికి వెళ్లినప్పుడు విమానంలో ఓ వార్తాపత్రికను చూశా. అందులో నా సినిమాలలో ఒక చిత్రం ఉంది. ఆ దేశ భాష అర్థం కాక అందులో ఏమి రాశారని నేను ఎయిర్ హోస్టెస్ను అడిగా. అది ఒక భారతీయ సినిమా పోస్టర్ అని.. ఆ దేశానికి చెందిన నటుడు ఇక్కడికి వస్తున్నాడని పత్రికలో రాశారని ఆమె చెప్పింది" అని అన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ తనను అభిమానుల గుంపు చుట్టుముట్టడంతో ఆశ్చర్యపోయానని వెల్లడించారు.ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఈ దేశంలో మన సినిమాల పట్ల ఉన్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయా. విమానం దిగిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ వరకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడ్డా. పరిస్థితి ఎంత గందరగోళంగా మారిందంటే పోలీసులు వచ్చి నన్ను కారులో ఎక్కించి నా హోటల్కు తీసుకుని వెళ్లారు. నా జీవితంలో మొదటిసారిగా నా ఇమ్మిగ్రేషన్ హోటల్లో జరిగిందని' అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు.విదేశీ జర్నలిస్ట్ కామెంట్స్..అయితే తనకు ఆత్మీయ స్వాగతం లభించినప్పటికీ.. ఓ విదేశీ జర్నలిస్ట్ తనపై రాసిన కథనం చూసి బాధపడ్డానని తెలిపారు. మూడవ ప్రపంచ దేశానికి చెందిన ఈ మూడో రకం నటుడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారని కథనంలో రాసుకొచ్చాడని వెల్లడించారు. అయితే తనను మూడో రకం నటుడు అన్నందుకు బాధలేదని.. నా భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశం అని పిలవడం బాధ కలిగించిందని తెలిపారు.అందుకే తాజాగా తనకెదురైన అనుభవాన్ని క్రికెట్తో ముడిపెట్టి ట్వీట్ చేశారు. అండర్-19 క్రికెట్ ఇండియా.. ప్రపంచ ఛాంపియన్స్గా నిలిచారు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా వరల్డ్లోనే మొదటి స్థానంలో ఉన్నాం.. మనం మూడో ప్రపంచం కాదు.. మనం మొదటి ప్రపంచం.. భారత్ మాతా కీ జై అంటూ పోస్ట్ చేశారు. అంధులు, స్త్రీలు, పురుషులు, ఇప్పుడు 19ఏళ్ల వయస్సు క్రికెటర్స్ కూడా ఈ విషయాన్ని నిరూపించారని ట్విటర్లో పంచుకున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించింది. T 5649 - U19 Cricket INDIA .. WORLD CHAMPIONS !ठोक दिया दुश्मन को !!Blind , Women's , Mens Cricket ALL world Champions .. we are NUMBER 1 .. ONE .. on top , FIRST in World ..We are NOT 3rd World .. we are FIRST World !!BHARAT MATA KI JAI 🇮🇳 🇮🇳🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) February 7, 2026 -
అమ్మ కూతురి పెళ్లిలో రఘువరన్ బీటెక్.. ఫోటోలు వైరల్
ప్రముఖ నటి శరణ్య కూతురు రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో కోలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. హీరో కార్తీ, ధనుశ్తో పాటు పలువురు నటులు రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా.. శరణ్య పొన్నవన్.. ధనుశ్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ధనుశ్కు అమ్మగా కనిపించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతే కాకుండా శరణ్య రఘువరన్ బీటెక్తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. Karthi at Saranya Ponvannan’s daughter marriage reception.💥pic.twitter.com/aWA2Ag3hN4— Christopher Kanagaraj (@Chrissuccess) February 7, 2026 .@dhanushkraja sir at Saranya Ponvannan Daughter Wedding Function! @theSreyas pic.twitter.com/Z3egrQzMTI— Chowdrey (@Chowdrey_Pro) February 7, 2026 -
మైక్ తీసుకోగానే బూతులు.. కానీ ఇప్పుడు: హీరోపై నాగవంశీ కామెంట్స్
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్.. ఇప్పడున్న విశ్వక్ సేన్ వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్ను చూస్తుంటే అనుదీప్ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు. Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు. - @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026 -
ఓటీటీలో 'రాజాసాబ్'.. మారుతిపై దారుణమైన ట్రోలింగ్
ప్రభాస్ 'రాజాసాబ్' ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో చూసినప్పుడే ఈ సినిమాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్గా రిలీజైన మరింత ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు మారుతిని అయితే నెటిజన్లు వదలట్లేదు. పూర్తిగా ఆడేసుకుంటున్నారు. మూవీలో ఎన్నెన్ని తప్పులున్నాయో ఎత్తిచూపుతూ మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ మూవీ 'రాజాసాబ్'. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్కి ముందు సినిమా గురించి చాలా విషయాలు చెప్పిన మారుతి.. ఏకంగా తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. అయితే అదే అతడికి బూమ్రాంగ్ అయింది. మూవీ సరిగా తీయలేదనే కోపంతో ప్రభాస్ అభిమానులు.. వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పెట్టి మారుతిని ఇబ్బంది పెట్టినట్లు అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పుడైతే ట్విటర్లో ట్యాగ్ చేసి మరీ మారుతిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.'రాజాసాబ్' విషయంలో చాలామంది చేస్తున్న కంప్లైంట్ డూప్. స్టార్ హీరోలు చాలామందికి డూప్ ఉపయోగిస్తుంటారు. ఈ చిత్రంలో డూప్ అనే సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ప్రభాస్ ఫేస్ మార్పింగ్ గురించి స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అలానే సినిమాలో ప్రభాస్ బస్ జర్నీ చేసే సీన్లో.. తొలుత గడ్డం ఉండటం, బస్ దిగేసరికి గడ్డం ట్రిమ్ అయిపోవడం, బస్సే మారిపోవడం గురించి సెటైర్లు వేస్తున్నారు.మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా సంజయ్ దత్ పాత్ర సొంతమవుతుంది కదా? మరి పారిపోవడంలో లాజిక్ ఏంటని నెటిజన్లు అడుగుతున్నారు. ప్రభాస్ నానమ్మ మహారాణి అయితే ఇప్పటివరకు ఎలా బతికి ఉంది? ఇంతకీ ఆమె వయసెంత? లాంటి లాజిక్స్ కూడా వేస్తున్నారు. అలానే కోట్ల రూపాయలతో పాటు మహాల్ ఉన్న సంజయ్ దత్ పాత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర దగ్గర రూ.3 లక్షలు కొట్టేయడం ఏంటని అంటున్నారు. ఇలా ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో లాజిక్స్ లేని సీన్లపై మారుతిని విమర్శిస్తున్నారు. -
తెలుగు తెరపై కొత్తందం
ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్ వేద్దాం.లక్కీ చాన్స్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్కు అయినా లక్కీ చాన్స్ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్ ఇమాన్వీ ఇస్మాయిల్కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తొలి సినిమాయే ప్రభాస్ వంటి టాప్ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్ పరంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.వెల్కమ్ జోయా రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ చిత్రం 2023లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్కు వస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘స్పిరిట్’ కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్ రెడ్డివంగాయే ‘స్పిరిట్’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సీతా పయనం యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్ రోల్ చేశారు.ఆకాశంలో ఒక తార ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ శ్రుతీహాసన్ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు.శ్రీను–మంగల లవ్స్టోరీ బాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ అయిన రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో రానున్న ఇంటెన్స్ లవ్స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్స్టార్ కృష్ణ, మహేశ్బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ లవ్స్టోరీ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్ లుక్పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. సి. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ స్వరకర్త.లెగసీ ‘లెగసీ’ అనే ΄పొలిటికల్ మూవీతో టాలీవుడ్కి వస్తున్నారు కన్నడ హీరోయిన్ ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్ టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్ సిటీ, మాస్టర్ పీస్’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు అమ్మాయి హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ వంటి అంశాలపై అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నందిని (నందిని రోల్ను ఐశ్వర్యా రాయ్ చేయగా, ఈ రోల్ యంగ్గా ఉన్నప్పటి సీన్స్లో సారా అర్జున్ నటించారు) పాత్రలో నటించి, యంగ్ యాక్టర్గా పాపులర్ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదలైన ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్ యాక్టర్గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్ పరిచయం అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్ ఓ లీడ్ రోల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్గా హిందీలో సారా అర్జున్కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.⇒ ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మాళవికా మోహనన్ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్లో మాళవిక పేరు ఫైనలైజ్ కాలేదు. ఈ చాన్స్ శ్రుతీహాసన్కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్ రాక కాస్త ఆలస్యమైంది. ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
సీతా పరశురామ్ ఐపీఎస్
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. ‘సామజవరగమన’ (2023) వంటి హిట్ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన ద్వితీయ సినిమా ఇది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురామ్గా రెబా మోనికా జాన్ నటించారు. శనివారం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ‘మృత్యుంజయ్’లో రెబా మోనికా జాన్ తనదైన నటనతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సీతా పయనం ట్రైలర్: లిఫ్ట్ అడిగితే ఓకే అన్నా..
‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను... ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్తో ‘సీతా పయనం’ మూవీ ట్రైలర్ ఆరంభం అయింది. హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా ఇతర పాత్రలుపోషించారు.శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘‘మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్... ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన చిత్రం ‘సీతా పయనం’. కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ ఇది’’ అని మేకర్స్ తెలిపారు. -
ధనుష్-సాయిపల్లవి-శ్రీలీల సినిమా షురూ
ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ 55’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి శనివారం క్లాప్ కొట్టారు. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్బార్ ఫిల్మ్స్ ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘మారి 2’ (2018) చిత్రంలో ధనుష్, సాయిపల్లవి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ‘డీ 55’తో ఈ జోడీ రిపీట్ అవుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ మూవీ ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి ‘డీ 55’ రెండో సినిమా. పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. -
జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు అదే స్టైల్లో రావడంతో ఆయన మరోలా తీయరా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు తీరిపోయే సమయం వచ్చినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఫుల్ కలర్ ఫుల్గా ఉండబోతోందట. ఈసారి గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదని ఓ టాక్ నడుస్తోంది. అంటే ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్ను ఎంచుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నబడ్డ విషయం తెలిసిందే. బయట ఒకటి రెండు సార్లు ఆయనను చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ సినిమాలో మాత్రం ఆయన గెటప్ ఓ లెవెల్లో ఉందని అంటున్నారు. చూసిన వాళ్లు అదిరిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 కూడా లైన్లో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డ్రాగన్ను గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ కాకుండా కొత్త స్టైల్లో తీస్తున్నందుకు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. -
చెన్నైలో మంచు లక్ష్మికి చేదు అనుభవం
టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మికి చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈమె.. గ్రీన్ పార్క్ అనే హోటల్కి వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది తనతో రూడ్గా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.చెన్నైలోని ఈ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్న మంచు లక్ష్మి.. తనతో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్లింది. కానీ కెమెరామ్యాన్ని మాత్రం లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చింది. చిన్న కెమెరాకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పుకొచ్చింది. దీని వల్ల చాలా అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు హాస్పిటాలిటీ ఇలా ఉండనేకూడదంటూ పేర్కొంది.గత కొన్నాళ్లుగా యాక్టింగ్ బాగా తగ్గించేసిన మంచు లక్ష్మి.. అడపాదడపా మాత్రమే ఒకటి రెండు మూవీస్ చేస్తోంది. గతేడాది 'దక్ష' అనే చిత్రంతో వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. అలానే ఓటీటీ రియాలటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది కానీ విజేత కాలేకపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.Extremely disappointed with the experience at Green Park Hotels Chennai.No rule was shown to me in writing, and no solution was offered, not even allowing a small camera with one person. This is not what hospitality should look like. pic.twitter.com/TeZRsFkyTu— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 7, 2026 -
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్బస్టర్ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. ధురంధర్: ద రివేంజ్ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్ఇదిలా ఉంటే ధురంధర్ సినిమా సెట్లో రణ్వీర్ సింగ్ ఏకంగా మూడు కేరవాన్స్ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్లో షూట్ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్ డిమాండ్ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్ కోసం రణ్వీర్ సింగ్ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్ -
వేశ్యతో కిరాయి హంతకుడి ప్రేమాయణం.. కాక్రోచ్ సెన్సార్ పూర్తి
అవార్డు విన్నర్ దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బలమైన సామాజిక థీమ్తో కూడిన చిత్రం ‘కాక్రోచ్’. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణలు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ మంజూరు చేసింది.‘సమాజంలోని చీకటి మూలలను, అవినీతి, భ్రష్టుత్వాన్ని కఠినంగా చిత్రీకరించిన ఈ చిత్రం... అడ్డురోడ్లపై జీవనం సాగించే వేశ్యకు, ఒక కిరాయి హంతకుడికి మధ్య ఏర్పడిన స్వచ్ఛమైన ప్రేమ, స్నేహాన్ని చూపిస్తుంది. సమాజం చీత్కరించే మురికి మనుషుల మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ద్వంద్వ విలువలు, విలువల ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తూ... కాక్రోచ్ను చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే సమాజ మనస్తత్వాన్ని ఈ చిత్రం ఎండగట్టనుంది’ అని దర్శకుడు తెలిపారు. సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి. బాపిరాజు పత్రికా ప్రకటన ద్వారా కోరారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ , మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్, మల్లిక, ఎఫ్ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్బీ రమణ, ఆర్కే సింగ్, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్, రేలారే రఘు బృందం, జానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. -
సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో గొడవపై బాబు మోహన్ క్లారిటీ
-
ఓటీటీలోకి ‘వరప్రసాద్గారు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ సంక్రాంతికి టాలీవుడ్లో దాదాపు ఐదు సినిమాలు రిలీజ్ అయితే..వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ‘మన శంకర వరప్రసాద్గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్స్లో రిలీజ్ అయింది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ని రాబట్టింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే దాదాపు రూ. 300 కోట్ల వరకు కలెక్షన్స్ని రాబట్టింది. మొత్తంగా రూ. 375 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్లో రికార్డు బద్దలు కొట్టిన ఈ చిత్రం..త్వరలోనే డిజిటల్ స్క్రీన్పై సందడి చేయనుంది. రిలీజ్కి ముందే ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ని ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రాన్ని, ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి ప్రసారం చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 అధికారికంగా వెల్లడించింది. మరి డిజిటల్ స్క్రీన్పై ఈ చిత్రం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
Koti: నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
-
ఇండస్ట్రీకి కొత్త హీరో దొరికాడు.. బిగ్ బాస్లో లాగా, సినిమాలో కూడా...
-
కొత్త క్రష్ మలయాళ బ్యూటీ రియా శిబు
-
Premalu Movie: రూ. 3 కోట్లతో.. రూ. 130 కోట్లు సీక్వెల్ లేనట్టేనా..?
-
రాజాసాబ్ రీమిక్స్ సాంగ్ కోసం.. రూ. 20 కోట్లా...?
-
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్రెడ్డి స్టూడెంట్లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్లో కట్స్, ఎడిటింగ్, సంగీతం సూపర్ అంటూనే హీరోయిన్ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్ అంటున్నారు.సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ కథానాయికగా నటిస్తుంది. రాజ్ అల్లాడ, గిరిధర్రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్కు మంచి ఆదరణ రావడంతో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శ్రేయాసి సేన్కు మంచి గుర్తింపు వస్తుంది. -
రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చిన విక్రాంత్ మాస్సే
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సినిమాలకు గుడ్బై చెబుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే, తాజాగా ఇదే అంశం గురించి ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. తన రిటైర్మెంట్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మరోసారి వెల్లడించారు. ‘12th ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత కూడా వరసుగా పలు ప్రాజెక్ట్స్లలో పనిచేశారు.ఎక్కువ పని ఒత్తిడి కారణంగా తాను సినిమాలకు గుడ్బై చెబుతున్నట్లు పేర్కొన్నానని ఆయన అన్నారు. కానీ, తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని తక్కువ పదాలలో చెప్పేసరికి చాలామంది మరోలా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కొంత కాలం విరామం తీసుకుందామనుకున్నానని విక్రాంత్ మాస్సే చెప్పారు. శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని గుర్తుచేశారు. రోజులో సుమారు 16 గంటలు పని చేయడం చాలా కష్టంగా అనిపించడం వల్ల జీవితంలో చాలా అలసిపోయానన్నారు. దీంతో కాస్త బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ, తాను సినిమా పరిశ్రమ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని అందులో నిజం లేదని విక్రాంత్ పేర్కొన్నారు.బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్తో కెరీర్ ప్రారంభించిన విక్రాంత్.. 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్ అవార్డ్తో పాటు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా గుర్తింపు పొందారు. విక్రాంత్, షీతల్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించగా అతడికి వర్దన్ అని నామకరణం చేశారు. -
చాలామంది మోసం చేశారు.. నా బుర్రకే ఎక్కలేదు: అర్జున్
యాక్షన్ కింగ్, నటుడు, దర్శకుడు అర్జున్ సర్జాకు తెలుగులో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. మా పల్లెలో గోపాలుడు మూవీతో తెలుగు వారికి పరిచయం అయిన అర్జున్.. తన కెరీర్లో సుమారు 180కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, తన 46 ఏళ్ల సినీ జీవితంలో చాలామంది తనను మోసం చేశారని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.తన పిల్లల కోసం పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని అర్జున్ ఇలా చెప్పారు. 'నేను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నన్ను చాలామంది మోసం చేశారు. ఇప్పుడు వారి పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఇండస్ట్రీలో నా చుట్టూ ఉండే వాళ్లే.. నాకు ఏమీ తెలియని వయసులో మోసం చేశారు. చిన్న వయసులోనే డబ్బు వస్తోంది.. కానీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అప్పుడు తెలియలేదు. నా వాళ్లే నన్ను మిస్- యూజ్ చేశారు. ఆరోజుల్లో నేను సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు భారీగా ఆస్తులు ఉండేవి. పెట్టుబడుల ఎక్కడ పెట్టాలో శోభన్ బాబు గారు చాలాసార్లు నాకు చెప్పారు. నాతో ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. పెట్టుబడులు పెట్టాలని డబ్బు ఎక్కడ వృథాగా పోతుందో చూసుకోమని నాతో చెప్పేవారు. కానీ, ఆ సమయంలో నా బుర్రకు ఎక్కలేదు. ఆయనతో ఒక సినిమాలో కలిసి పనిచేశాను. కేవలం ఒక్క మూవీతోనే మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మా అనుబంధం చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆయన మాట వినిఉంటే బాగుండేది' అని ఇప్పుడు అనిపిస్తుందని అర్జున్ గుర్తు చేసుకున్నారు.తెలుగులో కూతురు ఎంట్రీకర్ణాటకలోని మైసూర్ సమీపంలోని మధుగిరిలో జన్మించిన అర్జున్.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తనదైన యాక్షన్ స్టైల్తో ప్రత్యేక గుర్తింపు పొందారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘సీతా పయనం’ వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ‘సేవగన్’తో 1992లోనే డైరెక్టర్గా మారిన ఆర్జున్.. తెలుగులో ‘సీతాపయనం’తో తొలిసారి దర్శకత్వం వహించారు. టాలీవుడ్లోనే తన కూతురు రాణించాలని ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. -
ఒకే తేదీన అమ్మ, అత్తమ్మ.. బాధలో మెహర్ రమేశ్
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి అత్తమ్మ పద్మావతి చనిపోయారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ డైరెక్టర్.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారని బాధపడుతూ ఈ సంగతి పంచుకున్నాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటోలు కూడా పంచుకున్నాడు.'ఇన్నాళ్లు మా అమ్మ ని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ 'పద్మావతి' శివైక్యం చెందారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు.. 2003 ఫిబ్రవరి 7వ తేదీన పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్.. తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని కన్నడలో రీమేక్ చేసి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన మెహర్ రమేశ్.. 'కంత్రి' మూవీతో టాలీవుడ్లో ప్రయాణం మొదలుపెట్టాడు. తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ అంటూ పలు చిత్రాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. గత కొన్నాళ్లుగా అయితే బయట కూడా మెహర్ రమేశ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు విషాద వార్తని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Meher Raamesh (@meherramesh) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా రాజాసాబ్, పరాశక్తి, నీలకంఠ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటితో పాటు మరో రెండు తెలుగు మూవీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలు ఇప్పుడు ఎందులో చూడొచ్చు? అసలు వాటి సంగతేంటి? అనేది చూద్దాం.తెలుగులో పలు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.. 'మాతృ' అనే సినిమా చేశాడు. గతేడాది ఆగస్టులో రిలీజైంది. పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎవరికీ తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది. 'మాతృ' విషయానికొస్తే.. ఓ నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు కిడ్నాప్కి గురవుతుంటారు. దీని వెనక ఎవరున్నారా అని పోలీసులు తెగ వెతుకుతుంటారు. అయితే ఈ కిడ్నాప్లకి ఓ ప్రొఫెసర్కి సంబంధముంటుంది. అమ్మ అనే పిలుపు వినగానే ఆ ప్రొఫెసర్ ఎందుకు అదోలా మారిపోతున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఇకపోతే గతేడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'వైభవం'. రుత్విక్ హీరో కాగా సాత్విక్ దర్శకుడు. అందరూ కొత్తవాళ్లు కావడంతో ఇదో మూవీ ఉందనే సంగతి కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. వైభవ్ అనే కుర్రాడు తన ఉద్యోగం వదులుకొని సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు.. తన బాల్య మిత్రులు తనకు తిరిగి కనిపిస్తారు. తన స్నేహితుడికి వచ్చిన ఒక పెద్ద సమస్యని వైభవ్, అతడి మిత్రులు తమదైన శైలిలో ఎలా ఎదుర్కున్నారు అనేది స్టోరీ. -
బ్యాక్ టు బాలీవుడ్?
బ్యాక్ టు బాలీవుడ్ అంటున్నారట హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ‘వైట్ టైగర్, లవ్ ఎగైన్, హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్, జడ్జ్మెంట్ డే ’వంటి వరుస ఇంగ్లిష్ చిత్రాల తర్వాత ఇటీవల తెలుగు మూవీ ‘వారణాసి’ ఒప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. అయితే హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ చిత్రం రానుంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు హృతిక్ రోషన్. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని అనుకుంటున్నారు.ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో భాగంగానే ప్రియాంకా చోప్రాను సంప్రదించగా, ఆమె ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని భోగట్టా. ‘క్రిష్ 3, క్రిష్ 4’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా నటించారు. దీంతో ‘క్రిష్ 4’లో కూడా ఆమె నటిస్తే బాగుంటుందని హృతిక్ రోషన్ భావిస్తున్నారట. ‘క్రిష్ 4’ చిత్రానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 2019లో వచ్చిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం తర్వాత ప్రియాంకా చోప్రా హిందీలో అంగీకరించే చిత్రం ఇదే అవుతుంది. మరి... ‘క్రిష్ 4’తో ప్రియాంక బ్యాక్ టు బాలీవుడ్ అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
పవర్ఫుల్ అబ్దాలి
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది.ఈ సినిమాలో అబ్దాలిగా ‘ఫైటర్’ మూవీ ఫేమ్ రిషబ్ సాహ్నీ చేస్తున్న లుక్ని రిలీజ్ చేశారు. ‘‘ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి అనే పవర్ఫుల్ పాత్రను చేస్తున్నారు రిషబ్ సాహ్నీ. 1750 బ్యాక్డ్రాప్లోని ఈ చిత్రంలో భారత్లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను ఈ పాత్రలో చూపించనున్నాం. ఈ నెల 15న టీజర్ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ఇది సీరియస్ మేటర్
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ ఖరారైంది. ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది ఈ సినిమా క్యాప్షన్. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని యూనిట్ పేర్కొంది. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసి, టీజర్ను ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం స్వీకర్ అగస్తీ. -
జోడీ రిపీట్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రష్మికా మందన్నా జోడీ రిపీట్ కానుందని సమాచారం. హోమీ అడజానియా దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రంలో కృతీ సనన్ మరో హీరోయిన్గా చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అయితే తాజాగా మరో రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది.హిందీలో ‘బదాయి హో, మైదాన్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అమిత్ శర్మ ఓ రొమాంటిక్ కామెడీ కథను రెడీ చేసి, షాహిద్ కపూర్కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట షాహిద్. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇదే నిజమైతే షాహిద్, రష్మికల జోడీ సిల్వర్ స్క్రీన్పై రిపీట్ అవుతుంది. జియో స్టూడియోస్తో కలిసి సునీల్ ఖేతర్ పాల్ ఈ సినిమాను నిర్మించనున్నారట.మరోవైపు ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణతో రష్మికా మందన్నా బిజీగా ఉన్నారు. ఇంకా విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మైసా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు రష్మికా మందన్నా. ఇలా వరుస చిత్రాలతో రష్మిక బిజీ బిజీగా ఉన్నారు. -
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు. -
అర్జున్ రెడ్డి బ్యూటీ బోల్డ్ లుక్.. థాయ్లాండ్లో శ్వేతామీనన్ చిల్..!
భర్తతో ప్రియాంక చోప్రా రొమాంటిక్ పిక్స్..అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే బోల్డ్ లుక్స్..థాయ్లాండ్లో చిల్ అవుతోన్న శ్వేతామీనన్..పాట పాడుతూ హీరోయిన్ మాధవి చిల్..బాలీవుడ్ బుల్లితెర భామ మౌనీ రాయ్ లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
బ్లడ్ రోజెస్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్కి సంబంధం ఉందని వార్తల్లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు. ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా హోమ్ మినిస్టర్ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.ఎలా ఉందంటే..ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్తో ఈ సినిమా బ్లడ్ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్కు అంతగా నచ్చదు.డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్ ఆడియన్స్ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే రోటీన్ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.ఎవరెలా చేశారంటే..ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. -
'ఏడేళ్లప్పుడు ఆ ఒక్క సంఘటన.. ఆ దెబ్బకు మారిపోయా'
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్గా మారడానికి కారణాలను పంచుకుంది.తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
రూరల్ బ్యాక్డ్రాప్ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. -
జపాన్లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్ వైడ్గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.అయితే జపాన్లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది.ఇటీవల జపాన్లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..ఆర్ఆర్ఆర్ - రూ.139.73 కోట్లుముత్తు - రూ.23.39 కోట్లుబాహుబలి 2: ది కన్క్లూజన్ - రూ.17.61 కోట్లు3 ఇడియట్స్- రూ.9.81 కోట్లుఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లుది లంచ్బాక్స్- రూ.8.66 కోట్లుసాహో- రూ.7.56 కోట్లుమగధీర- రూ.7.51 కోట్లుఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లుపుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ
బిగ్బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. రేటింగ్: 2.75/3 -
యశ్ టాక్సిక్.. భారీ ధరకు తెలుగు రాష్ట్రాల రైట్స్..!
శాండల్వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్- 2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ను భారీ డీల్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్గా రికార్డ్ సృష్టించనుంది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్ అని టాలీవుడ్లో చర్చ మొదలైంది.ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్ఫుల్ స్టార్గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను అందించడానికి థ్రిల్గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం' అని అన్నారు.ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. The chaos is beginning to unfold. Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCReleaseIntoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th @TheNameIsYash#Nayanthara@humasqureshi… pic.twitter.com/1uB4RbQ9sg— KVN Productions (@KvnProductions) February 6, 2026 -
హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ రివ్యూ
టైటిల్: హనీనటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రినిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డిరచన, దర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: అజయ్ అరసాడసినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 6, 2025కథేంటంటే..ఆనంద్(నవీన్ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసంతో దుర్మార్గపు, అమానవీయ చర్యలకు పాల్పడే మనుషులు ఉన్నారు. క్షుద్రపూజల కోసం సొంత మనుషులనే చంపుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ‘హనీ’. .‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూఢనమ్మకాల పిచ్చితో కట్టుకున్న భార్యని, కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసే ఓ చీకటి మనిషి కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో టచ్ చేసిన పిల్లి మాయ కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని గుర్తొస్తాయి. ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.కొండగుహలో ఓ తెగ క్షుద్ర దేవతను ఆరాధించే ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాంటి క్షుద్రపూజలే హీరో ఆఫీస్లో చేయడంతో అతన్ని చితక్కొట్టి.. బయటకు పంపిస్తారు. ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. అతనికున్న పిచ్చితో కూతురు, భార్య పడే ఇబ్బందులు ఎమోషనల్కు గురి చేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి ఊరి బయట ఉన్న ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పిల్లి మాయ సేకరణ సీన్ థ్రిల్లింగ్కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ద్వితియార్థం కథని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల కంటి చూపుతోనే భయపెట్టాడు. లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన హృదయాలను హత్తుకుంటుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. సారంగపాణిగా రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 3/5 -
డ్యాన్స్తో అదరగొట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..!
హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది పరాశక్తితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ మార్చి 26వ థియేటర్లలో సందడి చేయనుంది.ఇదిలా ఉంచితే శ్రీలీల తాజాగా హైదరాబాద్లోని ఓ మాల్ ఓపెనింగ్కు హాజరైంది. ఈ సందర్భంగా తన టాలెంటన్ను బయటపెట్టింది. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్లోని దేక్లేంగే సాలా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల స్టెప్పులకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు.Actress #SreeLeela performs to #DekhLengeSaala from #UstaadBagathSingh at a shop opening! pic.twitter.com/Ilm1dpRLWL— idlebrain jeevi (@idlebrainjeevi) February 6, 2026 -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
ప్రేమకు వయసుతో పని లేదన్న నటి! భర్త చనిపోయాక..
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లితెర నటి సుజానే బెర్నెర్ట్. లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది. సుజానె భర్త, నటుడు అఖిల్ మిశ్రా 2023లో మరణించాడు. ఆ తర్వాత బాధలో కూరుకుపోయిన ఆమెకు అర్జున్ హర్దాస్ అనే వ్యక్తి బాసటగా నిలిచాడు.రెండేళ్ల ప్రేమఢిల్లీకి చెందిన ఇతడి సాన్నిహిత్యంలో త్వరగానే బాధ నుంచి బయటపడింది సుజానె. వీరిద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అలా రెండేళ్లుగా కలిసుంటున్నారు. ఈ విషయం గురించి సుజానె మాట్లాడుతూ.. ప్రేమకు వయసుతో పనేంటి? ఈ ఫలానా వయసువరకే ప్రేమలో పడొచ్చు అని ఎక్కడా రాసిలేదే.. స్వచ్ఛమైన ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.ప్రేమికుల రోజు కోసం వెయిటింగ్ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. నాకు ఎప్పుడెప్పుడు కానుకలు ఇవ్వాలా? అని తాపత్రయపడుతున్నాడు. అలా అని ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకోవడం లేదు. కేవలం మా ఆనందాన్ని పంచుకుంటామంతే! అని చెప్పుకొచ్చింది. సుజానె (Suzanne Bernert)- అఖిల్ మిశ్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. 2023లో అఖిల్ మిశ్రా కన్నుమూశాడు. ఆ తర్వాత పరిచయమైన అర్జున్తో సుజానె ప్రేమలో పడగా అప్పటినుంచి వీరిద్దరూ కలిసుంటున్నారు. సీరియల్స్, సినిమాసుజానె.. ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్, యే రిష్తా క్యా కెహ్లాతా హై, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. వెండితెరపై నో ప్రాబ్లమ్, లవ్ రెసిపీ, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తీర్పు వంటి పలు సినిమాలు చేసింది. చివరగా యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను పోషించింది. View this post on Instagram A post shared by Suzanne Bernert (@suzannebernert) చదవండి: హీరోకి వాచ్ గిఫ్ట్ ఇచ్చిన పుష్ప నటుడు -
ఓటీటీలో స్వలింగ సంపర్కుల స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. Between rituals of loss and moments of connection, a new sense of belonging emergesWatch Sabar Bonda (Cactus Pears), Sundance Film Festival award winner, now on Netflix#SabarBondaOnNetflix @LotusVisualPro @bhushaan_manoj @suraaj_suman pic.twitter.com/egLzFRgDmv— Netflix India (@NetflixIndia) February 6, 2026 -
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్.. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..!
గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్గా మారింది.చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.కాగా.. కేరళలోని త్రిసూర్కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్కు గురి చేస్తోంది. -
యాటిట్యూడ్ స్టార్కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
‘శ్రీ చిదంబరంగారు’ మూవీ రివ్యూ
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రాజమండ్రి సమీప గ్రామంలో ఉండే సోలమన్(వంశీ తుమ్మల)కి మెల్లకన్ను ఉంటుంది.దీంతో ఊర్లోవాళ్లంతా అతనికి చిదంబరం అని పేరు పెట్టి హేళన చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడు స్కూల్కి వెళ్లడమే మానేస్తాడు. అంతేకాదు తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్లజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మేస్త్రీ పనికి వెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా(సంధ్య వశిష్ట)కి చిదంబరం అంటే చాలా ఇష్టం. కానీ, తనకున్న లోపం కారణంగా లీలా తనను ఇష్టపడదనే భయంతో చిందబరం..ఆమెకు దూరంగా ఉంటుంటాడు. ఒక చిన్న అపార్థం కారణంగా లీలా తనను తిరస్కరించిందని భావించి సోలమన్.. ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చిదంబరం తనను అపార్థం చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాత లీలా ఏం చేసింది? కళ్లజోడు వెనుకాల బతికే పోలమన్.. చివరకు ఆ కళ్లజోడుని తీసి..ధైర్యంగా ఆ ప్రపంచాన్ని ఎలా చూశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బలంగా మార్చుకుంటే.. ధైర్యంగా జీవించొచ్చు అని సాటిచెప్పే కథ ఇది. దర్శకుడు వినయ్ రత్నం సింపుల్ పాయింట్ని ఎంచుకొన్ని దానికి బలమైన ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శారీరకలోపం ఉన్నవాళ్లని సమాజం ఎలా అవమానిస్తుంది? వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.మెల్లకన్ను కారణంగా సోలమన్కి స్కూల్లో జరిగిన అవమానాన్ని చూపిస్తూ.. చాలా ఎమోషనల్గా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. సోలమన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పరిచయం చేసి.. ఆ తర్వాత అసలు కథను ప్రారంభించాడు. లీలా-సోలోమన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒకవైపు లీలా-సోలోమన్ల లవ్స్టోరీని నడిపిస్తూనే..మరోవైపు గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి ప్రజల జీవనశైలీని చాలా సహజంగా చూపించారు. ఇంటర్వెల్ సీన్తో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సోలమన్ తనకున్న లోపాన్ని సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నం చూట్టూనే కథనం తిరుగుతుంది. మతం పేరుతో చేసే మోసాలను కూడా ఈ సినిమా చక్కగా చూపించారు. అయితే ఆయా సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే హీరోలో వచ్చే మార్పుకు గల కారణం కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్గా నటించిన వంశీ తుమ్మల, సంధ్యకి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించారు. మెల్లకన్ను ఉన్న యువకుడి పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. ఇక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి లీలాగా సంధ్య వశిష్ట తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. చందు-రవి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా సహజంగా ఉంటుంది. ఎం.ఎం.కీరవాణి ఆలపించిన ‘వెళ్లే దారిలోన’ పాట ఆకట్టుకునేలా ఉంటుంది. అక్షయ్ రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరి పచ్చదనాన్ని తెరపై మరింత అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
హీరోయిన్గా అర్జున్ కూతురు.. ‘సీతా పయనం’ ఎప్పుడంటే..?
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి, త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు. -
నా కొడుకు భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడా? ఏదీ బిల్లు తీసుకురా..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం "సంకీ". సాజిద్ నజియావాలా నిర్మించిన ఈ సినిమా 2025లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ, ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. దీనికి హీరో అహాన్ శెట్టియే కారణమంటూ రూమర్స్ మొదలయ్యాయి. అతడి మితిమీరిన ఖర్చుపై అసహనం వ్యక్తం చేసిన నిర్మాత సినిమాను అర్ధాంతరంగా ఆపేశాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ను సునీల్ శెట్టి ఖండించాడు. బిల్లు చూపించండిఆయన మాట్లాడుతూ.. నా కొడుక్కి అతడి పరిమితులేంటో తెలుసు. దాన్ని దాటి ఎప్పుడూ ఖర్చు చేయడదు. ఇదంతా ఉట్టి ప్రచారమే.. ఒకవేళ అహాన్ భారీగా ఖర్చు చేస్తున్నాడంటే నిర్మాత అందుకు సంబంధించిన బిల్లును తీసుకురమ్మనండి. దాని సంగతేంటో నేనూ చూస్తాను. వారి బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి అవతలివారిపై నిందలు వేయడం సమంజసం కాదు. ఇది మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు అహాన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంటి నుంచే భోజనంనేను సెట్కు వెళ్లినప్పుడు కూడా నా భోజనం, నీళ్లు నేనే తెచ్చుకుంటాను. నా సిబ్బందిని సెట్లో పెట్టిన ఆహారమే తినమని చెప్తాను. ఒకవేళ బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానంటే ఆ బిల్లు నేనే కడతాను, నిర్మాత కాదు! నా సిబ్బందే కాదు అహాన్ స్టాఫ్ (మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, ఇతరత్రా) కూడా ఇదే పాటిస్తారు. వాడు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చాడు. అలాంటివాడిపై కావాలనే ఇలాంటి నిందలేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహాన్ శెట్టి 2021లో వచ్చిన తడప్ సినిమాతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. అతడు నటించిన రెండో చిత్రమే సంకీ. కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. అహాన్ చివరగా బోర్డర్ 2 సినిమాలో నటించాడు. -
'యుఫోరియా' మూవీ రివ్యూ.. గుణశేఖర్ మెప్పించారా?
టైటిల్: యుఫోరియానటీనటులు: భూమిక, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మేనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, నాజర్, రవి ప్రకాశ్, నవీన రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్నిర్మాతలు: నీలిమ గుణ, యుక్తా ముఖి, రాగిణి గుణరచన-దర్శకత్వం: గుణశేఖర్సంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్ఎడిటర్: ప్రవీణ్ పూడివిడుదల తేది: ఫిబ్రవరి 06, 2026తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో గుణశేఖర్ పేరు ఉంటుంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఒక్కడు, రుద్రమదేవి, రామాయణం వంటి చిత్రాలతో చరిత్రాత్మక, సామాజిక, యాక్షన్ జానర్లలో తన ప్రత్యేక ముద్ర వేశారు. అయితే, గత కొన్నేళ్లుగా గుణశేఖర్కు సరైన విజయం దక్కలేదు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్తో 'యుఫోరియా' మూవీని తెరకెక్కించారు. యువతరం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించారు.కథచైత్ర (సారా అర్జున్) చదువులో టాపర్.. ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి కూడా .. ఒకరోజు తన స్నేహితురాలు పిలుపుమేరకు ఓ పబ్కు వెళ్తుంది. అక్కడ చైత్రకు పరిచయమైన ఐదుగురు కుర్రాళ్లలో వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) ఆమెపై కన్నేస్తాడు. డ్రగ్స్ మత్తులో ఉన్న వారందరూ చైత్రను నమ్మించి కారులో తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. చైత్ర ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.అయితే, చైత్రను అత్యాచారం చేసిన ఐదుగురు కుర్రాళ్ల బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటుంది. వారిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. ఇలాంటి క్లిస్టసమయంలో కమిషనర్ జయదేవ్ కేసును ఎలా ఛేదించారు..? ఈ కేసులో నేను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) ఎంట్రీ ఇస్తుంది.. ఇంతకీ ఈ నేరంతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? తనకు శిక్ష విధించాలని హైకోర్టును ఎందుకు కోరుతుంది..? ఈ కేసుని డీల్ చేస్తున్న సిటీ కమిషనర్ జయదేవ్కు వింధ్య చేసిన సాయం ఏంటి..? తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వింధ్య ఎలాంటి సాహసం చేసింది..? తెలియాలంటే యుఫోరియా మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..2022 మే 28న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో 17 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్రేప్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనలో 6 మంది యువకులు (వారిలో 5 మంది మైనర్లు) పాల్గొన్నారు. ఈ ఘటనతో పాటు మరికొన్ని కీలక సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా కథను వెండితెరపై చూపించారని అర్థమౌతుంది. నేటి యువతరం విచ్చలివిడిగా తమ ఆనందం కోసం మాదకద్రవ్యాలకు బానిసలై ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారో ఈ మూవీలో చూపించారు. ఈ క్రమంలో తమ కన్నవాళ్ల జీవితాలు కూడా నరకంగా మారుతున్నాయని ఈ కుర్రాళ్ల కథ చెబుతుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు మనం రెగ్యులర్గా న్యూస్లో చూసిన విధంగానే పలు అత్యాచార సంఘటనలు కళ్ల ముందు కదులుతాయి. మైనర్ల మీద అత్యాచారం అనే ఘటనలు విన్న ప్రతిసారి మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇలాంటి సీన్స్ పదేపదే కనిపించడంతో మూవీలో ఉన్న ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అనిపించదు. సినిమా ప్రారంభంలోనే చైత్రపై వికాశ్ గ్యాంగ్ చేసిన అత్యాచార ఘటన చాలా భయాందోళనగా కనిపిస్తుంది. ఈ కేసులో వెంటనే కదలిక రావడం ఆపై భూమిక తెరపైకి కనిపించడం వంటి సీన్లు కథపై పట్టును కోల్పోనియదు. కమిషనర్ జయదేవ్ విచారణ శైలి మెప్పిస్తుంది. సమాజంలో ఇలాంటి కేసులో నిత్యం జరుగుతూనే ఉంటాయి.అలాంటి సమయంలో పోలీసులు కేసును ఎలా ఛేదిస్తారనేది ఆసక్తిగా చూపించారు. మైనర్లపై అత్యాచారం సంఘటనల్లో పోక్సో చట్టం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు. చైత్ర కేసులో కొడుకు చేసిన తప్పుకు తల్లిగా భూమిక అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందో అందరినీ కదిలిస్తుంది. కొడుకు చేసిన తప్పు వల్ల ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుమారుడు చేసిన తప్పును తనపై వేసుకుని కోర్టు మెట్లు ఎక్కుతుంది. ఇలాంటి సీన్లు అన్నీ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. అయితే, సెకండాఫ్లో కథ కాస్త గాడితప్పింది. కొడుకు, తల్లి మధ్య చూపించిన బంధం బాగున్నప్పటికీ దానిని సరైన రీతిలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చూపించలేదనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే.. 'యుఫోరియా' కథలో ప్రధాన బలం సారా అర్జున్దే అని చెప్పాలి. చైత్రగా ఆమె చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో మెప్పించింది. అత్యాచార బాధితురాలు సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతుందో తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆపై వింధ్య వేములపల్లిగా భూమిక అదరగొట్టింది. చైత్ర తర్వాత భూమిక లీడ్రోల్లో కనిపిస్తుంది. కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు శిక్ష పడాల్సిందేనని న్యాయవ్యవస్థ పట్ల ఉండాల్సిన గౌరవాన్ని చూపుతూ... మరోపైపు కొడుకు జీవితం గురించి తల్లడిల్లిపోయే ఒక తల్లిగా భూమిక జీవించింది. వికాశ్ పాత్రలో విఘ్నే, జయదేవ్ పాత్రలో గౌతమ్ మేనన్ తమ పరిదిమేరకు మెప్పించారు. కాల భైరవ సంగీతం బాగుంది. నేటి యువతరం చూడాల్సిన సినిమాగా 'యుఫోరియా' కథ ఉంటుంది. సినిమాలో చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ సమాజానికి చాలా అవసరమైన మూవీని గుణశేఖర్ తీశారని చెప్పొచ్చు. -
అభిమానానికి ధన్యవాదాలు: శివకార్తికేయన్
ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ కమర్షియల్గా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్తో కూడిన చిన్న చిత్రాలకు తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తూ చేయూతనిస్తున్నారు. శివ కార్తికేయన్ తాజాగా కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. చేతిలో ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు కమలహాసన్ నిర్మించనున్న మరో ప్రాజెక్ట్ ఉంది. వాటిలో ఏది ముందు సెట్స్పైకి వెళుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచ్చిలోని కుమారస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివ కార్తికేయన్ మీడియాతో ముచ్చటించారు. 14 ఏళ్ల సినిమా జీవితం తనకు చాలా అందించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలతో పాటు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు వాటన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా కుటుంబంపై అలాంటి అభిమానాన్ని కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తిరుచ్చిలో కుమారస్వామి ఆలయంలో దిగిన ఫొటోలను ఆయన సతీమణి ఆర్తి ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు: ఆనంద్ దేవరకొండ
‘‘నటీనటులకు తొలి సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అలాగే యూనిట్ కష్టం కూడా తెలుసు. అందుకే ‘శ్రీ చిదంబరంగారు’ ఈవెంట్కి వచ్చాను. ఈ మూవీ టీజర్ ఎంతో నచ్చింది. హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు. జనాలకు నమ్మకం కూడా ఇవ్వాలి. ఈ సినిమా ఇంటెన్షన్ అదే. ఈ మూవీలో హీరో పాత్ర చేయడం చాలా కష్టం. కానీ, వంశీని చూశాక ఎంతో కన్విన్సింగ్గా అనిపించింది.ఇలాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీని వంశీ నంది పాటి నేడు విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఆనంద్ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల అతిథులుగా హాజరై, ‘శ్రీ చిదంబరం గారు’ సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు. వంశీ నంది పాటి మాట్లాడుతూ– ‘‘ఇన్సెక్యూరిటీని దాటి జీవితంలో ఎలా ఎదగాలి అనేది ఈ చిత్రకథ. అన్నీ కోల్పోయాం అనుకునేవాళ్లకు స్ఫూర్తి, ధైర్యం నింపే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘హీరో కావాలనే నా కల ‘శ్రీ చిదంబరంగారు’తో నెరవేరింది’’ అన్నారు వంశీ తుమ్మల. -
ప్రేక్షకుల డబ్బుకి విలువ ఇస్తాను: గుణశేఖర్
‘‘లాఠీ’ (1992) చిత్రంతో చిత్ర పరిశ్రమకి వచ్చాను. ‘యుఫోరియా’ నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్తో ఉన్నాను. నేను ప్రేక్షక దేవుళ్లని నమ్ముతాను. వారి సమయం, డబ్బు, విజ్ఞతకు విలువ ఇస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని ‘యుఫోరియా’ తీశాను. ఈ మూవీ వల్ల వారి టైమ్, మనీ... ఏదీ వృథా కాదు’’ అని డైరెక్టర్ గుణశేఖర్ తెలి పారు. భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ నటించిన చిత్రం ‘యుఫోరియా’.గుణశేఖర్ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. ఈ మూవీ నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో గుణశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి భూమిక బ్యాక్ బోన్. వింధ్య వేములపల్లి పాత్రలో తను జీవించింది’’ అన్నారు. భూమిక మాట్లాడుతూ– ‘‘యుఫోరియా’ సినిమా చూశాను. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి నా పాత్ర గురించే ఆలోచించాను (భావోద్వోగంతో)’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమా అందరి మనసుల్ని తాకుతుందని భావిస్తున్నాను’’ అని నీలిమ గుణ చెప్పారు. -
తెలుగు సినిమా నాటి నుంచి నేటి దాకా...
తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఇప్పటికి 94 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. దానినే కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా దినోత్సవం’ (తెలుగు సినిమా డే)గా సినీ పరిశ్రమ, సంస్థలు చేస్తున్నారు. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం ఆరంభమైంది. అంతకు ముందు మాటలు, పాటలు ఏమీ లేకుండా బొమ్మలు మాత్రం కదిలే మూగ సినిమాలు వచ్చేవి. భాషతో ప్రమేయం లేని సినిమాలు గనక అవి భాషా, ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి, అందరినీ ఆకర్షించేవి. 1931 మార్చి 14న హిందీ, ఉర్దూల సమ్మిశ్రమ భాషలో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలైంది. అక్కడ నుంచి క్రమంగా వివిధ భారతీయ భాషల్లో మాటలున్న సినిమాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే తీశారు! నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, తెలుగు త్యాగరాయ కీర్తనలు వినిపించింది ఆ ‘కాళిదాస్’ సినిమాలోనే! అది 1931 అక్టోబర్ 31న మద్రాసులో విడుదలైంది. ఆ వెనువెంటనే మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఈసారి ఏకంగా 10 రీళ్ళ పూర్తి నిడివి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ‘‘100% సంపూర్ణ తెలుగు టాకీ’’గా ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే జరిగాయి. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకు వచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 94 ఏళ్ళు పూర్తయ్యాయి. మన ‘భక్త ప్రహ్లాద’ రూ. 18 వేలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, ప్రసిద్ధ సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఆ సినిమా తీశారు. అప్పటికే తెలుగునాట నాటక రచయితగా ప్రసిద్ధుడైన చందాల కేశవదాసు ఆ సినిమాలో పాటలు అందించారు. తొలి తెలుగు సినీ గేయరచయితగా కీర్తి గడించారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలా బాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోని కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అటుపైన విజయవాడ (శ్రీమా రుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న రిలీజైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం, పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఎందరో మహామహుల జీవితకృషి కారణంగా ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటింది. ఇటీవలి ‘ఆర్.ఆర్.ఆర్’తో అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డు అందుకొనే దాకా ఎదిగింది. అలనాటి ‘మల్లీశ్వరి’, ఆ మధ్య ‘శంకరాభరణం’ నుంచి నిన్నటి ‘బాహుబలి’ మీదుగా రానున్న రాజమౌళి – మహేశ్బాబుల ‘వారణాసి’ దాకా మన తెలుగు సినిమా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. -
కలర్ఫుల్ శారీలో బిగ్బాస్ దివి అందాలు.. జిమ్లో వరలక్ష్మీ శరత్కుమార్..!
జిమ్లో చిల్ అవుతోన్న వరలక్ష్మీ శరత్కుమార్..స్విమింగ్ పూల్లో నటాషా స్టాంకోవిచ్ చిల్...పింక్ శారీలో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్..బ్లూ డ్రెస్లో బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ హోయలు..ట్రేడిషనల్ డ్రెస్లో సురేఖవాణి కూతురు సుప్రీత అందాలు.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pragyaa Kapoor (@pragyakapoor_) -
'మూడేళ్లుగా వేధింపులు.. తట్టుకోలేకపోతున్నా': నటి ఆవేదన
'లవ్ టుడే', 'మామన్నన్' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె తన వాయిస్ ఇచ్చింది. తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, 2.0, నవాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది.అయితే తాజాగా తాను వేధింపులకు గురైనట్లు రవీనా వెల్లడించింది. సోషల్ మీడియాలో మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. "ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్నా.. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. మూడేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా స్నేహితులుస, కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.కాగా...రవీనా రవి జవాన్ సినిమాలో దీపికా పదుకోన్కు తెలుగు వాయిస్ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్.మాళవిక మోహన్,శ్రీనిధి శెట్టి, అమలా పాల్,రాశీ ఖన్నా,కాజల్ అగర్వాల్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్ చెప్పింది. View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) -
యానిమల్ సినిమా.. ఒప్పుకోవాలంటే భయమేసింది: హీరో
సందీప్రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్సింగ్గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్. రణ్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.భయపడ్డా..ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్లో రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్బీర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలే చేశాను. యానిమల్ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్విజయ్ పాత్ర భయంకరంగా ఉంటుంది. అది బాగా నచ్చిందికాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకొచ్చాడు.ఎప్పుడో ఫిక్సయ్యా..సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్బీర్కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్బీర్ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్కు సీక్వెల్గా యానిమల్ పార్కింగ్ 2028లో రానుంది. -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06 సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06 ట్రాన్స్ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06 యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06అమెజాన్ ప్రైమ్ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06 ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06 వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06జియో హాట్స్టార్ ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06జీ5 షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06 పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07సన్ నెక్స్ట్ నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06సోనీ లివ్ జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06టెంట్ కోట్టాకోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06హెచ్బీవో మ్యాక్స్బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06ముబీ..లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06హులు..స్పిట్స్విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06 -
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. A missing baby girl. An attendant on the run. A truth darker than the crime.Nivin Pauly, Lijomol, and Sangeeth Pratap headline this high-tension thriller.Watch #BabyGirl, streaming from 12th February, only on Sony LIV.@NivinOfficial pic.twitter.com/WnyS2vnXHG— Sony LIV (@SonyLIV) February 5, 2026 -
ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..!
ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Visuals of Mega Power Star @AlwaysRamCharan and #UpasanaKonidela as they take the #MegaTwins home!📸🫶#RamCharan #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/bkTROvEsgC— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2026 -
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్బాస్ అమర్దీప్
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026 -
'ఆ స్ట్రెస్ ఏంటో నాకు కూడా తెలుసు'.. నిహారిక ఆసక్తికర కామెంట్స్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరంగారు.ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా టీమ్పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్తో పాటు నటులపై కొనియాడారు. మరి ముఖ్యంగా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా నిర్మించడం అనేది అంత సులభం కాదని అన్నారు. కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమా నా వీపు మీద వేసుకున్నందుకు.. ఒక నిర్మాతకు ఉండే స్ట్రెస్ ఎలాంటిదో నాకు కూడా తెలుసన్నారు. మీలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని నా నమ్మకమని అన్నారు. ఎవరికైనా సరే మొదటి సినిమా ఫీలింగ్ అనేది లైఫ్లో ఎప్పటికీ రాదని మూవీ టీమ్ను ఉద్దేశించి మాట్లాడారు. కమిటీ కుర్రాళ్లు నా వీపు మీద వేసుకున్నందుకు.. నాకు తెలుసు ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేది#VamsiTummala #SandhyaVasishta #Gopinath #VinayRatnam pic.twitter.com/86RQYx2iTc— Filmy Focus (@FilmyFocus) February 4, 2026 -
'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు
'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్ దేశం చప్పట్లు కొడుతోంది.నిజాయితీజనవరి 11న చెన్నైలోని టీ నగర్లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.ఘనంగా సన్మానంఅప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశాడు.అందుకే పాదపూజ చేశా..బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. సినిమాఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్.పార్తీబన్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్ వెబ్ సిరీస్లోనూ కనిపించాడు. தங்கத்தின் மதிப்பு ஏற ஏற, மனிதத்தின் மரியாதை குறைந்துகொண்டே போய், ஒரு கிராம் ஒரு லட்ச ரூபாயை நெருங்கும்போது, லட்சக்கணக்கான உயிர்கள் கொல்லப்படுவது உறுதியாகிவிடும்.வருடத்தில் 360 நாளாவது உழைக்கும் துப்புரவு பணியாளர் திருமதி பத்மா அவர்கள், குப்பையில் கிடந்த 360 கிராம் நகையை… pic.twitter.com/tTRtd6gLWP— Radhakrishnan Parthiban (@rparthiepan) February 4, 2026 చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్ ఎమోషనల్ -
యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్పై కేసు
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్ అశోక్కుమార్ తప్పబడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. పాటలో చంద్రహాస్ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన చంద్రహాస్ కౌంటర్గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో అశోక్కుమార్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.'తప్పుడు' ప్రయాణంపిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." సైకాలజీ ఏం చెబుతోంది?సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం. "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'స్టార్డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది. -
శింబు కొత్త చిత్రం షురూ!
లిటిల్ స్టార్ నుంచి లిటిల్ సూపర్స్టార్ వరకు ఎదిగిన నటుడు శింబు. ఈయన నటించే నూతన చిత్రం ప్రారంభం కాబోతోందంటేనే అభిమానులకు పండగ. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా బాధ పడరు. శింబు కొత్త చిత్రంలో నటించడమే చాలు అభిమానులకు. కాగా ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కమలహాసన్తో కలసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్స్ లైఫ్ చిత్రం డిజాస్టర్గా మారింది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ అనే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ రేర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరసన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా శింబు కథానాయకుడిగా నటించనున్న చిత్రం షురూ అయ్యింది. దీన్ని డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు తెరకెక్కించనున్నారు. వరుస విజయాలతో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు గాంచిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంగళవారం శింబు పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం శింబు నటిస్తున్న అరసన్ చిత్రం పూర్తి అయిన తరువాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని మీడియాకు విడుదల చేసిన ప్రకనటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కొద్ది రోజులు ఆగండి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని దర్శకుడు అశ్వద్ మారిముత్తు ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. కాగా తన 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న శింబుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన అభిమానులు అయితే పుల్ ఖుషీ అవుతున్నారు. -
బంగారంలా మెరిసిపోతున్న కాజోల్.. పొట్టి డ్రెస్లో జ్యోతి పూర్వాజ్ అందాలు..!
బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన వితికా శేరు..పొట్టి డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ హోయలు..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ కాజోల్..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్ శ్రీలీల..టాలీవుడ్ నటి సాహితి దాసరి లేటేస్ట్ పిక్స్.. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) -
ఓటీటీకి మనశంకర వరప్రసాద్గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. -
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల
సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు. -
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్.. నానితో పోటీ పడాల్సిందే..!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్ సింగ్తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
దురంధర్-2 క్రేజ్.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా?
గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.ఆ రికార్డ్స్ గల్లంతేనా?ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది. -
మెగా ఫ్యాన్స్కు షాక్.. పెద్ది మూవీ రిలీజ్ వాయిదా
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.పెద్ది మూవీ కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్-2 వల్లేనా?అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. #PEDDI will see you on 30th APRIL, 2026 💪🏻🔥@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @vriddhicinemas @VenkataSKilaru @MythriOfficial @SukumarWritings @PeddiMovieOffl pic.twitter.com/TTfrxi773W— Ram Charan (@AlwaysRamCharan) February 4, 2026 -
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్ను అలరించాయి.అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.love met chaos and chose to arrive on your screens 👀#NaariNaariNadumaMurariOnPrime, Watch Now https://t.co/JCx7tvOlqr@ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh @Composer_Vishal @dopyuvraj @gnanashekarvs @ramjowrites @brahmakadali… pic.twitter.com/KxGZsv5EGZ— prime video IN (@PrimeVideoIN) February 3, 2026 -
పెద్దమ్మ తల్లి ఆలయంలో ఛార్మి, పూరి పూజలు.. వీడియో వైరల్
జూబ్లీహిల్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శించుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం వీరిద్దరు బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ సేతుపతి బర్త్డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్ఫుల్గా కనిపించాడు.కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. Director #PuriJagannadh & #CharmyKaur Spotted At Shri Peddamma Talli Temple pic.twitter.com/ofas8ZxFfC— idlebrain.com (@idlebraindotcom) February 4, 2026 -
'పిల్లలందరికీ తండ్రులే హీరోలురా'.. ఆసక్తిగా గ్లింప్స్
బిజినెస్మేన్గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్ శరవణన్గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
అందుకే పిల్లలు వద్దనుకున్నా: నటి
ఓ వయసుకు రాగానే పెళ్లి చేసుకోవం, పిల్లల్ని కనడం అనేది ఒక రూల్లా అయిపోయింది. కానీ, పెళ్లయ్యాక తప్పకుండా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదంటోంది మలయాళ నటి లీనా. బాధ్యతగా ఉంటామనుకుంటే తప్ప పిల్లల జోలికి వెళ్లకూడదని చెప్తోంది. లీనా మాట్లాడుతూ.. సంతానం వద్దని నేను బలంగా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని కనడానికి ముందు వాళ్లను ఎలా చూసుకోవాలి? ఎలా పెంచాలి? అన్న ప్లానింగ్ ఉండాలి. బాధ్యత అవసరంతల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచాలి. పెళ్లవగానే పిల్లల్ని కనాలంటారు. దానికి నేను వ్యతిరేకం. చిన్న వయసులోనే పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కిడ్న్ను హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ కూడా ఆ వయసులో ఉండదు. నా చిన్నప్పుడు పేరెంట్స్ నన్ను సరిగా పెంచలేదని అనుకుంటూ ఉండేదాన్ని. నాపై ఇంకాస్త ఫోకస్ చేయాల్సిందని ఫీలయ్యేదాన్ని. కొన్నిసార్లు స్వేచ్ఛ కోసం పోరాడేదాన్ని. సంతానం వద్దనుకున్నా..మరికొన్నిసార్లు నా పనులన్నీ నన్నే చేసుకోమంటున్నారని కోప్పడేదాన్ని. ఒక్కోసారేమో నాకు ఎవరూ సపోర్ట్ చేయలేడం లేదు, ప్రతిసారి ఒంటరిగా వదిలేస్తున్నారని బాధపడేదాన్ని. ఇలా ఎప్పుడూ ఏదో ఒకరకమైన విచారంలో బతికేదాన్ని. నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే పిల్లల్ని కనాలన్న ఆలోచన కూడా రానివ్వడం లేదు. పైగా నేను ఎంచుకుంది యాక్టింగ్ కెరీర్. కెరీర్ఇక్కడ కుటుంబం, కెరీర్.. రెండూ చూసుకోవడం అంటే కష్టం. తల్లిదండ్రులిద్దరూ కెరీర్ అని పరుగులు పెడితే పిల్లల్నెవరు చూసుకుంటారు. అందుకే పిల్లల్ని ప్లాన్ చేయలేదు అని చెప్తోంది. మలయాళంలో అనేక సినిమాలు చేసిన లీనా తెలుగులో డాక్టర్ చక్రవర్తి మూవీలో కనిపించింది. షైతాన్ అనే తెలుగు వెబ్ సిరీస్లోనూ అలరించింది. కాగా లీనా 2004లో అభిలాష్ కుమార్ను పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. తర్వాత గగన్యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్ను వివాహం చేసుకుంది.చదవండి: అందువల్లే 4 ఏళ్లు సినిమాలకు బ్రేక్: మాధవన్ -
'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?
ఈ మధ్య కాలంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. గత డిసెంబరులో రిలీజైనప్పుడు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇందులో నటించిన రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్.. ఇలా అందరికీ మంచి పేరు వచ్చింది. హీరోయిన్గా చేసిన సారా అర్జున్ కూడా ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె.. చిరంజీవి కూతురిగా నటించే బంపరాఫర్ కొట్టేసిందట.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు)ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో హిట్ కొట్టిన చిరంజీవి.. త్వరలో 'విశ్వంభర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు బాబీతో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. గతేడాదే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలో ఎవరెవరు నటిస్తారనే వివరాలు బయటకొస్తున్నాయి.ఇందులో చిరుకి జోడీ ప్రియమణిని ఎంపిక చేశారని.. మోహన్ లాల్ కీలక పాత్ర కోసం తీసుకున్నారని.. విలన్గా బాలీవుడ్ దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ కనిపించబోతున్నారని అంటున్నారు. అలానే కీలకమైన హీరో కూతురి పాత్ర కోసం 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ని ఫైనల్ చేశారని మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది కానీ సారా ఫైనల్ అయినట్లు ఉంది. సారా నటించిన తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఠాకుర్) -
యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ
ఈ మధ్యన తెలుగు సినిమాల్లోని పాటల్లో బూతు సాహిత్యం ఎక్కువవుతోంది. సోషల్ మీడియాలో ఉపయోగించే కొన్ని పదాల్ని.. రచయితల ట్రెండింగ్ పేరిట యదేచ్ఛగా వాడేస్తున్నారు. తాజాగా యాటిట్యూడ్ స్టార్ అనబడే హీరో చంద్రహాస్.. అందరూ చూస్తుండగా ఏకంగా స్టేజీపైనే బూతు పాట పాడాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పాట విని జేడీ చక్రవర్తి చప్పట్లు కొట్టాడని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే విషయమై జేడీ స్పందించాడు. చంద్రహాస్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.'చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు షాక్లో ఉన్నా. ఏం పాడుతున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. కానీ తన పాటని నేను ఎంజాయ్ చేస్తున్నట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారు. అసలు నేనా పని చేయలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఈవెంట్లలో గెస్టులు.. స్టేజీపై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగా పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్లే అతడి పాటని సరిగా పట్టించుకోలేదు. నా పక్కనున్న అమ్మాయికి తెలుగు అర్థంకాక పాప చప్పట్లు కొట్టింది. అది చూసిన చాలామంది నేను కూడా చప్పట్లు కొట్టాననుకున్నారు. నేను బూతులు మాట్లాడను. నా ముందు ఎవరు మాట్లాడినా సహించను'(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత)'ఓసారి సెట్లో బూతులు మాట్లాడాడని ఓ దర్శకుడిని కొట్టా. నా పక్కన అమ్మాయికి అతడు బూతులు పాడుతున్నాడని చెబితే చప్పట్లు కొట్టడం ఆపేసి షాకైంది. పాట టైంలో జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అప్పుడే లేచి వెళిపోదామనుకున్నాను. కానీ పూజా బేడీ.. అలా చేయొద్దని నన్ను వారించింది. అందుకే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. చంద్రహాస్ అలా చేయడాన్ని సమర్థించను. ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే అది వాళ్ల భ్రమ మాత్రమే' అని జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చాడు.టీవీ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. గతంలో వచ్చిన 'రామ్నగర్ బన్నీ' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే యాటిట్యూడ్ చూపించడం, చిత్రమైన హావభావాలతో యాటిట్యూడ్ స్టార్గా అందరూ ట్రోల్ చేశారు. ఆ పదాన్నే తన పేరుకి ముందు తగిలించుకున్నాడు. తొలి మూవీ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' చిత్రంతో వస్తున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్) -
ఘోర ప్రమాదం.. 'జబర్దస్త్' కమెడియన్ కన్నుమూత
యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షో, 'జబర్దస్త్' కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మినారాయణ.. రెండు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ క్రమంలోనే 'జబర్దస్త్' కమెడియన్స్ నవీన్, బాబీ తదితరులు ఇతడి మృతిపై మిస్ యూ పోస్టులు పెడుతున్నారు. యాంకర్ సుమ కూడా బాబీ ఇంటికి వెళ్లి, అతడి మృతదేహానికి నివాళులు అర్పించింది. ఇంతకీ అసలేమైంది? ఎప్పుడీ ప్రమాదం జరిగింది?(ఇదీ చదవండి: కొడుకు చనిపోయిన నెలకే టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)సోమవారం రాత్రి కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్స్.. ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఐ విశ్వం చెప్పిన ప్రకారం.. కొవ్వూరుకు చెందిన ముగ్గురు యువకులు బైక్పై రాజమండ్రిలో సినిమా చూసేందుకు వెళ్తున్నారు. మరోవైపు రాజమండ్రి క్వారీ మార్కెట్కు చెందిన ఆనపు లక్ష్మీనారాయణ మోటార్ సైకిల్ ఎదురుగా వచ్చేసరికి రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఆనపు లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ఒకటి రెండు రోజుల క్రితమే ఇతడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇంతలోనే విషాదం జరిగిపోయింది.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
రాజమౌళినా మజాకా.. 2 సీన్ల కోసం మహేశ్కి 6 నెలలు ట్రైనింగ్
మహేశ్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి రన్నింగ్. ఇతడు చేసిన ఏ సినిమా చూసినా మిగతా వాళ్లతో పోలిస్తే మహేశ్ కాస్త డిఫరెంట్గా పరుగెత్తుతాడు. అయినా సరే ఇది అభిమానులకు బాగానే నచ్చేసింది. ఎవరైనా మహేశ్ గెటప్ వేయాలన్నా సరే అతడి రన్నింగ్ స్టైల్నే ఫాలో అయిపోతుంటారు. అలాంటిది కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత మహేశ్.. ఈ విషయంలో కొత్తగా కనిపించనున్నాడు. లేదు రాజమౌళి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చి మరీ మార్చేశాడు. దీని గురించి స్వయంగా మహేశ్ బాబే చెప్పాడు.మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వారణాసి'. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టినప్పటికీ.. గతేడాది నవంబరులో టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియోతో రివీల్ చేశారు. ప్రస్తుతం, గతం, భవిష్యత్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో మహేశ్.. శ్రీ రాముడి పాత్రలోనూ కాసేపు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా కోసమే తన రన్నింగ్ స్టైల్ కూడా మార్చుకున్నానని మహేశ్ చెప్పాడు.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై రాజమౌళి క్లారిటీ)రాముడి పాత్ర కోసం ఆహార్యం మెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు ఏడాది ప్రిపరేషన్ చేశాం. 2-3 నెలలు కలరీ యుద్ధవిద్య కూడా నేర్చుకున్నాను. అలానే రాజమౌళి.. నా రన్నింగ్ టెక్నిక్ మార్చాలని అన్నాడు. దీనికోసం ఏకంగా 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నాం. కాకపోతే 2 సీన్లు మాత్రమే తీశారు. అలాంటి నిబద్ధత 'వారణాసి' కోసం నేను చూపించాను అని మహేశ్ బాబు.. తాజాగా రిలీజ్ చేసిన 'వారణాసి' ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్నికొన్నిరోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి కొడుకు కార్తికేయ.. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ఇప్పటివరకు పాన్ ఇండియా వరకే తమ మూవీస్ రిలీజ్ చేసిన జక్కన్న.. 'వారణాసి'తో గ్లోబల్ వైడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.(ఇదీ చదవండి: చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు) -
చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
2026 మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చిన చిరంజీవి.. చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన హిట్ కొట్టారు. జనవరి చివరి రోజున చిరు మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలలు(మగబిడ్డ, ఆడబిడ్డ) పుట్టారు. రెండు మూడు రోజుల క్రితం ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. అదే టైంలో చిరు గతంలో 'మెగా వారసుడి' అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. వీటిపై మెగాకోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ)మెగా కుటుంబంలో ఇప్పటి జనరేషన్లో దాదాపు అందరూ అమ్మాయిలే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన చిరు.. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్న కొందరు.. ఆడపిల్లలు, మహిళలని చిరంజీవి చులకనగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లావణ్య.. ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదని ఒక యూజర్కి గట్టిగా ఇచ్చిపడేసింది.'సాధారణంగా ఇలాంటి ట్వీట్లని పట్టించుకోకుండా వదిలేస్తాను. ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలోని మహిళలని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో.. ఈ విమర్శలు చేసేవారికి అసలు అవగాహన లేదు. చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలామందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని లావణ్య ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ చేసిన కాసేపటికే.. సదరు యూజర్ తన ట్వీట్ డిలీట్ చేశాడు.(ఇదీ చదవండి: 2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?) -
2026పై నెట్ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్లా?
ఇప్పుడు ఓటీటీ జమానా నడుస్తోంది. ఏ సినిమాని థియేటర్లో చూడాలి? దేన్ని ఓటీటీలో చూడాలని ముందే ఫిక్సయిపోతున్నారు. చిన్న మూవీస్ని చాలా వరకు ఓటీటీల్లోనే చూసేందుకు బాగా అలవాటు పడిపోయారు. అందుకే తెలుగు చిన్న చిత్రాల పరిస్థితి దారణంగా తయారైంది. మరోవైపు ఆయా ఓటీటీ సంస్థలు కూడా ఒరిజినల్ కంటెంట్తో రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో, తమిళంలో పేరున్న చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ సంస్థ.. ఈ ఏడాది దాదాపు 30 వరకు ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్లతో రాబోతుంది. ముంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన ఈ సంస్థ.. 2026లో వచ్చే తమ అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి బయటపెట్టింది.(ఇదీ చదవండి: మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ)ఆనంద్ దేవరకొండ 'తక్షకుడు', సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' లాంటి సినిమాలతో పాటు చాలానే మూవీస్, వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్బింగ్తో రాబోతున్నాయి. హిందీలో మీడియం రేంజ్ స్టార్స్ అందరూ కూడా వీటిలో నటించడం విశేషం. ఇంతకీ ఏ సినిమాలు, సిరీస్లు.. నెట్ఫ్లిక్స్లో ఈ ఏడాది రాబోతున్నాయంటే?తక్షకుడు (తెలుగు సినిమా) - ఆనంద్ దేవరకొండసూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - సందీప్ కిషన్మేడిన్ కొరియా (తమిళ సినిమా) - ప్రియాంక మోహన్లవ్ (తమిళ సిరీస్) - ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ఫ్యామిలీ బిజినెస్ (హిందీ సిరీస్) - అనిల్ కపూర్, విజయ్ వర్మహమ్ హిందుస్థానీ (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, ప్రతీక్ గాంధీహలో బచ్చోన్ (హిందీ సిరీస్) - వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్కొహ్రా సీజన్ 2 (హిందీ సిరీస్) - మోనా సింగ్, బరుణ్ సోబ్తితలాష్: ఏ మదర్స్ సెర్చ్(హిందీ సిరీస్) - పరిణీతి చోప్రాఇక్కా (హిందీ సినిమా) - సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నామిస్ మ్యాచ్డ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - ప్రజక్తా కోలీ, రోహిత్ షరాఫ్ముసాఫిర్ కేఫే (హిందీ సిరీస్) - విక్రాంత్ మస్సే, వేదికా పింటోలస్ట్ స్టోరీస్ 3 (హిందీ సిరీస్) - రాధిక ఆప్టే, కొంకన్ సేన్ శర్మటోస్టర్ (హిందీ మూవీ) - రాజ్ కుమార్ రావ్, సన్యా మల్హోత్రామా బెహన్ (హిందీ సినిమా) - మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రిచుంబక్ (హిందీ సిరీస్) - నీనా గుప్తాద గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్ 5 (కామెడీ షో) - కపిల్ శర్మమామ్లా లీగల్ హై సీజన్ 2 (హిందీ సిరీస్) - రవి కిషన్గాంధారి (హిందీ సినిమా) - తాప్సీ, ఇష్వాక్ సింగ్గ్లోరీ (హిందీ సిరీస్) - దివ్యేందు, పులకిత్ సామ్రాట్గోస్కోర్ పండిట్ (హిందీ సినిమా) - మనోజ్ బాజ్పాయ్, శ్రద్ధాదాస్లెగసీ (తమిళ సిరీస్) - మాధవన్, అభిషేక్ బెనర్జీకర్తవ్య (హిందీ సినిమా) - సైఫ్ అలీఖాన్, రషిక దుగల్ఆపరేషన్ సఫేద్ సాగర్ (హిందీ సిరీస్) - సిద్ధార్థ్లాకప్ (రియాలిటీ సిరీస్) - ఏక్తా కపూర్, శోభా కపూర్దిండోరా 2 (హిందీ సిరీస్) - భువన్ బామ్, రోహిత్హే దిల్ సున్ రహా హై (హిందీ సిరీస్) - కపిల్ శర్మదేశీ బ్లింగ్ (హిందీ రియాలిటీ షో) - కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాశ్అక్యూజ్డ్ (హిందీ సిరీస్) -కొంకన్ సేన్ శర్మ, ప్రతిభ రత్న(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్) -
మహేశ్తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్పై క్లారిటీ
'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'వారణాసి'. 2024లో షూటింగ్ మొదలైనప్పటికీ.. గతేడాది నవంబరులోనే అన్ని విషయాలు బయటపెట్టారు. టైటిల్తో సహా మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు. దానికోసం భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి.. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇందులోనే రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ అంటూ వస్తున్న రూమర్స్పైనా క్లారిటీ ఇచ్చేశారు.15 ఏళ్ల క్రితమే మహేశ్ బాబు, మీరు కలిసి పనిచేయాలనుకున్నారు? మరి దానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి.. '2010లో నేను-మహేశ్ మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాం. కాకపోతే నాకున్న మూడు కమిట్మెంట్స్ పూర్తి చేసి వస్తానని మాటిచ్చాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టేసింది. రెండేళ్లలో బాహుబలి తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టేసింది. కొవిడ్ వల్ల 'ఆర్ఆర్ఆర్' చాలా ఆలస్యమైపోయింది. అందుకే మహేశ్ బాబుతో చేయడానికి ఇన్నేళ్లు పట్టేసింది' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజమౌళి.. మేం ఆలోచించుకున్న తర్వాత సీక్వెల్ వద్దని డిసైడ్ అయ్యాం. దాదాపు 3 గంటల నిడివితోనే మూవీ థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అలానే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్.. ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటాడు. స్టోరీ విషయంలో ప్రేక్షకుడు తల పక్కకు తిప్పకుండా ఉండేలా మూవీని తీస్తున్నాం. అదే అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నాడు. 'వారణాసి'లో రామాయణం సీన్స్ ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి వెల్లడించాడు. 'నా సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత నుంచి స్ఫూర్తి పొందినవే. కానీ ఈసారి స్ఫూర్తి కాకుండా 'రామాయణం' ఓ భాగాన్ని 'వారణాసి'లో చూపించే అవకాశం దొరికింది' అని జక్కన్న అన్నాడు.మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారులు కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటివరకు విడుదల తేదీపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అంటే ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ బల్లగుద్ది చెప్పింది.(ఇదీ చదవండి: సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్) -
యాసలందు అన్నియాసలూ భేషు
రోల్ డిమాండ్ చేస్తే నోరు తిరగని యాస నేర్చుకుని మరీ డైలాగులు చెప్పేస్తారు స్టార్స్. రామ్చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. అఖిల్, వరుణ్ తేజ్ రాయలసీమలో సంభాషణలు చెప్పారు. విజయ్ దేవరకొండ అయితే ఈస్ట్ గోదావరి, రాయలసీమ యాసలు నేర్చుకున్నారు. హీరోలేనా? హీరోయిన్ కావ్యా థాపర్ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు. ఈ ఉత్తరాది బ్యూటీ ఈ యాస నేర్చుకుని మరీ తెలంగాణ అమ్మాయిలా మారిపోయారు. ‘యాసలందు అన్ని యాసలూ భేషు’ అన్నట్లుగా ఈ స్టార్స్ ఏయే సినిమాల్లో ఏయే యాసలో మాట్లాడారో తెలుసుకుందాంసేసేయాల... ‘ఓటే పని చేసే నాకి, ఒకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేలమీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్చరణ్ పలికిన సంభాషణలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక, థియేటర్లో వింటున్నప్పుడు ఈలలు, గోలలు పక్కా. ‘పెద్ది’ సినిమాలో చేస్తున్నప్పాత్రకి అనుగుణంగా రామ్చరణ్ ఉత్తరాంధ్ర యాస మాట్లాడారు. గుబురు గడ్డం, ఒత్తయిన జుట్టు, మాస్ లుక్తో రామ్చరణ్ హీరోగా ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరో యిన్గా నటిస్తు న్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న రిలీజ్ కానుంది.సామి సాచ్చిగా...‘‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈతూరి నవ్వించేకి వస్తుండా..’ అంటూ వరుణ్ తేజ్ తన కెరీర్లోని 15వ సినిమాను ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను ఖరారు చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కనకరాజుప్పాత్రలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఈ చిత్రం రాయలసీమలోని అనంతపురం బ్యాక్డ్రాప్లో సాగుతుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు వరుణ్ తేజ్. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ప్రధానప్పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండో–కొరియన్ బ్యాక్డ్రాప్లో సాగే హారర్ కామెడీ సినిమా ఇది. ఈస్ట్ గోదావరి... రాయలసీమ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ పీరియాడికల్ చిత్రాలే. ‘రణబాలి’ సినిమా కోసం రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్న విజయ్ దేవరకొండ, ‘రౌడీ జనార్ధన’ చిత్రం కోసం ఈస్ట్ గోదావరి యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఇలా ఒకే సమయంలో రెండు భిన్నమైన యాసలతో కూడిన క్యారెక్టర్స్లో విజయ్ దేవరకొండ నటిస్తుండటం విశేషం. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పరిపాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ కీలకప్పాత్రల్లో నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. 1980 దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. ఏంది మీ లొల్లి...‘పండగ పూట మా బాబుకి బియ్యమిచ్చి నాలుగు ముక్కలు తిందమంటే ఏంది మీ లొల్లి..., ఏయ్ పండగ కాబట్టే కక్క ముక్క వండినం... చెప్పురంకుల్’ అంటూ తెలంగాణ యాసలో రెచ్చిపోయారు కావ్యా థాపర్. ‘నేను రెడీ’ చిత్రం కోసమే కావ్య ఇలా తెలంగాణ మాట్లాడటానికి రెడీ అయ్యారు. ‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక, కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘నేను రెడీ’ వేసవిలో రిలీజ్ కానుంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ఇంటెన్స్ లవ్స్టోరీ ‘లెనిన్’ కోసం అక్కినేని అఖిల్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెబుతున్నారు. ఈ సినిమా ప్రధాన కథనం రాయలసీమ ్రపాంతంలోని చిత్తూరు నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇంకా రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కోసం ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండ ఈతూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోన్నించి వస్తాది’ అంటూ రాయలసీమ యాసలో సాయిధరమ్ తేజ్ సంభాషణలు పలికారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రూటెడ్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ‘డెకాయిట్’ సినిమా కోసం అడివి శేష్ రాయలసీమ యాసలో, ‘భోగి’ సినిమా కోసం తెలంగాణ యాసలో శర్వానంద్, ‘క్రేజీ కల్యాణం’ కోసం అనుపమా పరమేశ్వరన్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతున్నట్లుగా తెలిసింది. వీరే కాదు... తమ కొత్త సినిమాల కోసం విభిన్న యాసల్లో డైలాగ్స్ చెబుతున్న నటీనటులు మరికొంతమంది ఉన్నారు. -
ఐదు భాషల్లో పళ్లి చట్టంబి
‘2018’ మూవీ ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లి చట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కాగా మంగళవారం కయాదు లోహర్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘1950, 1960 దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ ‘పళ్లి చట్టంబి’. భారీ బడ్జెట్తో రూ పొందుతోన్న ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో టొవినో థామస్ కనిపించనున్నారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత కయాదు లోహర్కి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ మా సినిమాకి ప్లస్ కానుంది.ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ‘పళ్లి చట్టంబి’ మోషన్ పోస్టర్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని మేకర్స్ తెలి΄ారు. విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: టిజో టోమీ, సంగీతం: జేక్స్ బిజోయ్, అసోసియేట్ ప్రోడ్యూసర్స్: మేఘ శ్యామ్, తంజీర్. -
వన్స్ మోర్
చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ... ఇలా ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో సూపర్ హిట్గా నిలిచిన మూవీస్ని ‘వన్స్ మోర్’ అంటూ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. ఈ కారణంగా తమ సినిమాలను మరోసారి విడుదల చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు.హీరోల పుట్టినరోజు కావచ్చు... లేదా ఆ సినిమాకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు.. అదీ కాకుంటే ఆ సినిమాకి ఆడియన్స్లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్... ఇలా సందర్భాలను బట్టి తమ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండటంతో ఆయా హీరోల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మరోసారి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగానే రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే వసూలు చేస్తున్నాయి. పైగా గత చిత్రాలను 4కె క్వాలిటీకి మార్చి అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధనుష్ నటించిన ‘3’ సినిమా, రామ్చరణ్ నటించిన ‘ఆరెంజ్’, రాఘవ లారెన్స్ ‘కాంచన’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, ‘ఏమాయ చేసావె’, ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ వంటి అరడజను సినిమాలు రీ రిలీజ్కి ముస్తాబవుతున్నాయి. ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం.పదమూడేళ్ల తర్వాత... ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘3’. ఆయన సతీమణి ఐశ్వర్య (ఐశ్వర్యా రజనీకాంత్) ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. ప్రభు, భానుప్రియ, రోహిణి ఇతర పాత్రలు పోషించారు. కె. విమలాగీత, ధనుష్ నిర్మించిన ఈ సినిమా 2012 మార్చి 30న విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా హిట్గా నిలిచింది. ప్రధానంగా ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రత్యేకించి.. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి...’ పాట యూత్ని ఉర్రూతలూగించింది. ‘కొలవెరి డి...’ పాటతో రిలీజ్కు ముందే ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ అదే స్థాయిలో ఓపెనింగ్స్ని రాబట్టింది. తొలి భాగం అందమైన ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్లో మాత్రం విషాదాంత ప్రేమ కథగా మిగిలింది. ఈ చిత్రంలో రామ్ పాత్రలో ధనుష్, జనని పాత్రలో శ్రుతీహాసన్ అద్భుతంగా నటించారు. తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా పదమూడేళ్ల తర్వాత ఈ నెల 6న మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది.పదిహేనేళ్ల తర్వాత... ‘మగధీర’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆరెంజ్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు. ప్రకాశ్రాజ్, షాజాన్ పదంసీ, ప్రభు, బ్రహ్మానందం, శ్రీనివాస్ అవసరాల, మధురిమ, మంజుల, సంజయ్, సమీర్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్, సంచిత, నాగబాబు ఇతర పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ సినిమా 2010 నవంబరు 26న విడుదలైంది. ‘మగధీర’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు రామ్చరణ్. ఆ మూవీ తర్వాత పూర్తి లవర్ బాయ్ లుక్లో నటించిన చిత్రం ‘ఆరెంజ్’.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక΄ోయింది. కానీ, ఈ మూవీ బుల్లితెరపై మాత్రం సూపర్హిట్గా నిలిచింది. ప్రత్యేకించి హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ మూవీలోని పాటలు యూత్ని ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ పాత్రలో రామ్చరణ్, జాను క్యారెక్టర్లో జెనీలియా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ నెల 7న ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటం విశేషం. పద్నాలుగేళ్ల తర్వాత... ‘ముని’ సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టారు రాఘవ లారెన్స్. ఆ సినిమాకి సీక్వెల్గా ఆయన లీడ్ రోల్లో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. ఈ సినిమాలో రాయ్లక్ష్మి హీరోయిన్గా నటించారు. శరత్కుమార్, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ ఇతర పాత్రల్లో నటించారు. రాఘవ లారెన్స్, ఎన్. రాధ నిర్మించిన ఈ సినిమా 2011 జూలై 15న విడుదలైంది. ఈ సినిమాని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి భయపెట్టింది. ముఖ్యంగా రాఘవ లారెన్స్, శరత్ కుమార్ నటన హైలెట్గా నిలిచింది. ప్రత్యేకించి శరత్కుమార్ ఈ మూవీలో హిజ్రా పాత్రలో అద్భుతంగా నటించారు. రాయ్లక్ష్మి తనదైన గ్లామర్తో కుర్రకారుని అలరించారు. కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే పాటలో లారెన్స్ నటన, హావభావాలు అద్భుతంగా పండించారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పద్నాలుగేళ్ల తర్వాత ‘కాంచన’ చిత్రాన్ని ఈ నెల 13న మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా... రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్పై కనిపించనుంది. ఈ లవ్స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021 సెప్టెంబరు 24న విడుదలైంది. శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది.తెలంగాణ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా...’ పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. అందమైన ప్రేమకథా చిత్రంగా రూ పొందిన ‘లవ్ స్టోరి’ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ నెల 14న మళ్లీ విడుదల చేస్తోంది చిత్రయూనిట్. సో... నాలుగున్నరేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరోసారి అలరించనున్నారన్న మాట. పదిహేనేళ్ల తర్వాత... కార్తీక్, జెస్సీలు తమ ప్రేమకథతో వెండితెరపై ప్రేక్షకులను మాయ చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా మరోసారి మాయ చేసేందుకు వస్తున్నారు ఈ ప్రేమికులు. నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. కృష్ణుడు, తాన్య, సురేఖా వాణి, సంజయ్ స్వరూప్, దేవన్, లక్ష్మి, త్రిష అలెక్స్ ఇతర పాత్రలు పోషించారు. ఇందిరా ప్రోడక్షన్స్పై మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ నిర్మించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది.లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఈ మూవీలో కార్తీక్ పాత్రలో నాగచైతన్య, జెస్సీగా సమంత తమదైన నటనతో ఆకట్టుకున్నారు. తన రెండవ సినిమాతోనే నాగచైతన్య తన నటనలో పరిణితి చూపించారనే ప్రశంసలు దక్కాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన శైలిలో ఈ అందమైన ప్రేమకథని తెరపైకి తీసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మనోజ్ పరమహంస విజువల్స్ కూడా అద్భుతంగా నిలిచాయి. చివరి సన్నివేశంలో త్రిష, శింబు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదిహేనేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఈ మూవీ రీ రిలీజ్ అవుతోంది. 24 ఏళ్ల తర్వాత... ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రీమా సేన్ హీరోయిన్గా నటించారు. తనూ రాయ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి, శివ పార్వతి, బ్రహ్మానందం, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల ఇతర పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్షన్స్పై ఎంఎస్ రాజు ఈ మూవీ నిర్మించారు. అంతేకాదు... ఈ చిత్రానికి ఆయనే కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో వేణుగా ఉదయ్ కిరణ్, రేణు పాత్రలో రీమా సేన్ కనిపిస్తారు.బాల్య స్నేహితులైన వీరి మధ్య ప్రేమని ఎంతో అందంగా, అద్భుతంగా తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, నేపథ్య సంగీతం ఎంతో ప్లస్ అయ్యాయి. 2001 అక్టోబరు 19న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ప్రత్యేకించి యువతరం ఈ మూవీని విపరీతంగా చూశారు. 24 ఏళ్ల తర్వాత ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నారు. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఇప్పటికే మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కాగా ఇంకొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
కంటెంట్ బాగా నచ్చింది: రవితేజ
‘‘సుమతీ శతకం’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇందులోని కంటెంట్ బాగా నచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలి. అమర్దీప్ భవిష్యత్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటు న్నాను’’ అని హీరో రవితేజ తెలిపారు. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ని చూసిన రవితేజ... ‘సుమతీ శతకం’ యూనిట్కి అభినందనలు తెలిపారు. -
రాజమౌళి, మహేష్ బాబు ‘వారణాసి’ రెండు భాగాలుగా?
బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు. ఐమ్యాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా రాణించారు. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం కేరళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభివర్ణించారు1980- 1990లలో మలయాళ సినిమాకు వెంకటేశ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్పీ వెంకటేశ్ ఒకరు. మలయాళ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1980వ దశకంలో అత్యంత ఫేమస్ అయ్యారు. తన సూపర్ హిట్ పాటలతో, సినిమాల భావోద్వేగ లోతును పెంచే శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్గా మారారు. రాజవింటే మకన్, జానీ వాకర్, పైతృకం, సోపానం, హైవే వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు వెంకటేశ్ సంగీతం అందించారు. -
రామ్ చరణ్ దంపతులకు ట్విన్స్.. అభిమానులకు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్స్..!
మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10) -
రష్మిక- విజయ్ పెళ్లి తేదీపై కన్ఫ్యూజన్.. కన్ఫామ్ చేసినట్టేనా?
టాలీవుడ్లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్ వరకు ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా? అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్పోర్ట్లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.గత డిసెంబర్లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ప్యాలెస్లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
నేరుగా ఓటీటీకి ఆనంద్ దేవరకొండ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్క్లాస్ మెలొడీస్ సూపర్హిట్గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.కాగా.. ఈ మూవీలో లపతా లేడీస్ ఫేమ్ నీతాన్షీ గోయెల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026 -
పడుకుని పోజులిచ్చిన మీనాక్షి.. బ్లాక్ డ్రస్లో మాళవిక
కింద పడుకుని పోజులిచ్చేసిన మీనాక్షి చౌదరిబ్లాక్ డ్రస్లో రచ్చ లేపుతున్న మాళవిక మోహనన్క్యూట్ అండ్ స్వీట్ లుక్స్లో అనన్య నాగళ్లముంబై జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్తెగ నవ్వేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sai Dhanshika (@saidhanshika) -
ఈ హీరోల టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!
టాలీవుడ్లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్ని నమ్ముకోకుండా రైటింగ్పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.అడివి శేష్నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్కి ముందు, తర్వాత కూడా శేష్కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.(ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్కే వచ్చింది.సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?) -
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్పై స్టాలిన్ నటి ప్రశంసలు
మెగాస్టార్ మూవీపై నటి ఖుష్బు సుందర్ ప్రశంసలు కురిపించారు. లాజిక్ లేదు.. కేవలం మ్యాజిక్ మాత్రమేనంటూ కొనియాడారు. మనశంకర వరప్రసాద్గారు సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. మరింతకాలం మమ్మల్ని అలరిస్తూ ఉండటానికి మీకు మరింత ఉత్సాహం, శక్తి, మంచి ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. అమ్మ ఆశీస్సులు.. ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి సార్ అంటూ ఖుష్బు ట్వీట్ చేశారు. ఈ మూవీలో నటించిన వెంకటేశ్ గురించి ఓకే మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన అందం, గాంభీర్యంతో అలరించిన నయనతార నటనకు ఫిదా అయ్యానంటూ ఖుష్బు పోస్ట్ చేసింది.కాగా.. కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి అక్క పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ త్రిష హీరోయిన్గా కనిపించింది. కాగా.. మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. What an entertainment. #ManaShankaraVaraPrasadGaru . I loved it. No logic, only magic. My heartiest congratulations to the director, @AnilRavipudi who has proved to be a super duper entertainment king. Proud to see @KChiruTweets gaaru giving his best to the people who love… pic.twitter.com/7sZfZySpDP— KhushbuSundar (@khushsundar) February 2, 2026 -
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.అసలేం జరిగిందంటే..చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026 -
సినిమా ప్రమోషనా.. బూతు కచేరీనా?.. ఇంత బరి తెగించాలా?
ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్స్తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు మేకర్స్.అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Attitude Star Chandrahas Singing Performance 🤯pic.twitter.com/C24OQSnpEG— cinee worldd (@Cinee_Worldd) February 2, 2026 -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్స్టర్గా ఎలా అవతరించాడు? భారత్పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?
2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
బ్లాక్బస్టర్ సిరీస్.. ఇప్పుడు మళ్లీ యానిమేషన్లోనూ
ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. 2016 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. ఐదు సీజన్లుగా వచ్చింది. నాలుగు సీజన్లకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ రెండు నెలల క్రితం రిలీజైన చివరిదైన ఐదో సీజన్కి మిశ్రమ స్పందన వచ్చింది. ఏదైతేనేం సిరీస్ని ముగించేశారు. అయితే ఇదే సిరీస్లోని పాత్రలని తీసుకుని యానిమేషన్ సిరీస్ రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ ఎప్పుడో కూడా ప్రకటించేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)1984-89 మధ్య కాలంలో హాకిన్స్ అనే ఊరిలో జరిగిన వింత సంఘటనలు, వింత ప్రాణులని ఐదారుగురు పిల్లలు, మరికొందరు కుర్రాళ్లు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వాటిని ఎలా అంతం చేశారు? అనే స్టోరీతో 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ తీశారు. ఇప్పుడు యానిమేషన్ సిరీస్ విషయానికొచ్చేసరికి దాదాపు అదే కాన్సెప్ట్ తీసుకున్నారు. పాత్రలు పాతవే ఉన్నప్పటికీ.. వాటికి డబ్బింగ్ చెప్పిన యాక్టర్స్ మారిపోయారు. ఏప్రిల్ 23 నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. చూస్తుంటే.. మేకర్స్ ఈ సిరీస్ని ఇప్పట్లో వదిలేలా లేరుగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది) -
Niharika : గుండె లోతుల్లో ఏదో తెలియని బాధ..
-
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)విలన్ రహమాన్ డకాయిట్ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'శృతి హాసన్ వల్లనే మా పాప ప్రాణాలతో ఉంది'
సినీ నటి శృతి హాసన్ పలు సేవా కార్యక్రమాలతో అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధానంగా పిల్లల ఆరోగ్యం, HIV/AIDS బాధితుల సంక్షేమంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలను ఆదుకుంటుంది. "Charity Closet" ద్వారా నిధులు సేకరించి, అవసరమైన వారికి అందజేస్తుంది. శృతి హాసన్ ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయిస్తుంది. ప్రతి సంవత్సరం తన వ్యక్తిగత దుస్తులు, ఆభరణాలు అభిమానులకు విక్రయించిన డబ్బుతో పేదలకు సాయం చేస్తుంది. తాజాగా అరుదైన జబ్బుతో బాధపడుతున్న మూడేళ్ల ఆజ్వి అనే చిన్నారి ప్రాణాలను రక్షించింది. ఇదే విషయాన్ని చెబుతు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఒక పోస్ట్ చేశారు.'ఆజ్వి' అరుదైన 'ఎంఎస్ఎమ్డి' (MSMD - మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే జన్యు సంబంధిత వ్యాధితో 2023లో జన్మించింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉందని వైద్యులు చెప్పారు. అందుకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు. సరైన సమయంలో ఆపరేషన్ చేయకపోతే పాప బతకడం కష్టమని వ్యైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె బరువెక్కింది. చారటీ సాయం కోసం వెతుకుతున్న సమయంలో వారి జీవితంలో వెలుగులు నింపేందుకు శృతి హాసన్ వచ్చింది. తనకు తెలిసిన ప్రముఖ వైద్యులు ధరణి, దివ్యలను ఆ కుటుంబానికి పరిచయం చేసింది. ఆపై దేశంలోని అత్యుత్తమ స్పెషలిస్టుల ద్వారా పాపకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు ఆర్థిక సాయం కూడా చేసింది. గతేడాదిలో జరిగిన ఆపరేషన్ తర్వాత ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది. తాజాగా శృతి హాసన్తో అజ్వి గడిపిన క్షణాలను తల్లిదండ్రులు పంచుకున్నారు. శృతి హాసన్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప వ్యక్తి అంటూ వారు ప్రశంసించారు. ఈరోజు తమ పాప అజ్వి బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే అని కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by 𝑺𝒓𝒊𝒓𝒂𝒎 (@sriramshruti) -
మైకేల్ జాక్సన్గా మేనల్లుడు.. బయోపిక్ ట్రైలర్
మైకేల్ జాక్సన్ను కొన్ని దశాబ్దాల పాటు 'పాప్ రారాజు'గా పిలుచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సూపర్స్టార్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. కానీ, జాక్సన్ లెగసీని ఆయన కుటుంబం నుంచి ఎవరూ కొనసాగించలేదు. అయితే, మైకేల్ జాక్సన్ బయోపిక్ను ప్రపంచానికి చూపించాలని ఆయన మేనల్లుడు జాఫర్ ముందుకొచ్చారు. తాజాగా ఆ మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు.మైకేల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మైకేల్ జాక్సన్గా ఆయన మేనల్లుడు జాఫర్ కనిపించనున్నారు. ఆయన మరణించిన 16 ఏళ్ల తర్వాత ఈ మూవీ రానుంది. మైకేల్ బాల్య నుంచి సూపర్స్టార్గా ఎదిగిన ప్రయాణాన్ని ఈ మూవీలో చూపించనున్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం వరల్డ్వైడ్ రూ. 10 వేల కోట్లు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు 400 కోట్లకు పైగానే ఫ్యాన్స్ ఉన్నారని అంచనా ఉంది.


