breaking news
Movie News
-
నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ఆయన కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వృద్ధాప్యం కారణంగా చికిత్స కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో హైదరాబాద్ మధురానగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత శివాజీకి ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాట్లాడి ధైర్యం చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో నటి.. కారు టైర్ పంక్చర్ కావడంతో..
తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదంలో బుల్లితెర నటి దేవి ప్రియ(38) ప్రమాదానికి గురయ్యారు. ఆమె కేవలం సీరియల్స్లలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నై నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు థేని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరంబలూర్ వద్ద తన కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేశ్(38) రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్న క్రమంలో అటువైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి దేవిప్రియ కారును బలంగా ఢీకొంది. దీంతో కారు డ్రైవర్ ముత్తుగణేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆమె సహాయకుడు దివాకర్ (36) తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు పెరంబలూర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
బోయపాటి శ్రీను కొత్త సినిమా.. స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంటుంది. కానీ, రీసెంట్గా వీరి నుంచి వచ్చిన ‘అఖండ-2’ ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. భారీ బడ్జెట్ చిత్రాలను చేసేందుకు ఇష్టపడే బోయపాటికి బలమైన మార్కెట్ ఉన్న హీరో దొరకాలి. ఒక సమయంలో అల్లు అర్జున్తో ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది వర్కౌట్ కాలేదు. దీంతో బోయపాటి తన మనసుమార్చుకుని రానా దగ్గుబాటితో ఒక సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది.ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, బోయపాటి తన రాబోయే చిత్రంలో ప్రధాన పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదించాడని తెలుస్తోంది. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని భావిస్తున్నప్పటికీ, ఇరువైపుల నుండి ఇంకా అధికారికంగా ధృవీకరణ రాలేదు. తన మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్తో రానాను మెప్పించే ప్రయత్నంలో బోయపాటి ఉన్నట్లు సమాచారం. కమర్షియల్ యాక్షన్ చిత్రాల వైపు ఆసక్తి చూపిస్తున్న రానా కూడా.. ఈ ప్రాజెక్ట్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.బోయపాటి శ్రీను కొద్దిరోజుల క్రితం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అట్లీ మూవీ షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ను కలిసి కథ కూడా చెప్పారట. బోయపాటి చెప్పిన కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమాను లాక్ చేశాడు. ఆ వెంటనే పుష్ప-3 ఎటూ ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తి కావలంటే కనీసం 4ఏళ్లు పడుతుంది. అందుకే బోయపాటి మరో కథను రెడీ చేసి రానాకు వినిపించారని తెలుస్తోంది. -
మనశంకర వరప్రసాద్గారు మరో రికార్డ్.. అదేంటంటే?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా మనశంకర వరప్రసాద్గారు మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 109 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణం సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. హీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. 50 DAYS. 109 CENTRES. 🔥Thousands of celebrations 🥳Lakhs of whistles 😍Countless goosebumps ❤️🔥Megastar @KChiruTweets’s ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #ManaShankaraVaraPrasadGaru completes a sensational 50-day theatrical run, rewriting box office history 💥💥💥#MSG… pic.twitter.com/qFr1Pazn3k— Shine Screens (@Shine_Screens) March 2, 2026 -
'అది చూసి నేనే షాకయ్యా'.. తనికెళ్ల భరణి వీడియో రిలీజ్
సోషల్ మీడియా గురించి టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడారు. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మీరంతా షాక్ అని ఒకరు థంబ్నెయిల్ రాసుకొచ్చారు. నిజంగా అది చూశాకా నేనే షాకయ్యా.. ఇంటిముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వుకున్నామని తెలిపారు.ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు.. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టేస్తున్నారని తనికెళ్ల భరణి అన్నారు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్తానని.. ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదని.. భవిష్యత్తులో చేయనని తెలిపారు. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారని వెల్లడించారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు.. స్పందించవద్దని తనికెళ్ల భరణి కోరారు. సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026 -
రాకాస అందర్నీ నవ్విస్తుంది: సంగీత్ శోభన్
సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వం వహించిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో సంగీత్ శోభన్ మాట్లాడుతూ– ‘‘రాకాస’ సినిమా కొత్తగా ఉంటుంది. అందర్నీ నవ్విస్తుంది. ప్రేక్షకులు ఖర్చుచేసే టికెట్ డబ్బులకు న్యాయం చేసేలా ఉంటుంది.నిహారిక, మానసగార్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో సంగీత్ యాక్టర్గా మరింత షైన్ అవుతాడు. థియేటర్స్కు వచ్చిన ఆడియన్స్ ను నిరాశపరచం’’ అని చెప్పారు నిహారిక కొణిదెల. ‘‘ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశాం. ప్రేక్షకులు మా సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు మానస శర్మ. ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు కంటెంట్ హెడ్ దివ్య, సంగీత దర్శకుడు అనుదీప్, నటీనటులు రోహిణి, గెటప్ శ్రీను మాట్లాడారు. -
తెలుగు సినిమాలు చేయమని నేనే చెప్పా: రాధికా శరత్కుమార్
తెలుగు సినిమాల్లో నటించమని తానే సలహా ఇచ్చానని సీనియర్ హీరోయిన్ రాధిక అన్నారు. వరలక్ష్మి చేసిన తొలి సినిమా చూసినప్పుడే మంచి నటి అవుతుందనుకున్నామని తెలిపారు. వరలక్ష్మీ శరత్కుమార్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సరస్వతి ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తెలుగు ఆడియన్స్ నిన్ను బాగా ఆదరిస్తారని చెప్పానని రాధిక వెల్లడించారు.రాధిక శరత్కుమార్ మాట్లాడుతూ.. 'తను అద్భుతమైన నటి. ఆమెకు నేను ఒక సలహా ఇచ్చాను. ఇది కొందరికీ తప్పుగా అనిపించొచ్చు. కానీ వరలక్ష్మికి తెలుగు సినిమాలు చేయమని చెప్పా. వాళ్లు నిన్ను చాలా గౌరవిస్తారని చెప్పా. నేను కూడా తెలుగులో చాలా సినిమాలు చేశా. తెలుగు సినిమా నిన్ను గొప్పస్థాయికి తీసుకెళ్తుంది. నీకు తగిన క్యారెక్టర్స్ తెలుగులోనే వస్తాయని తనతో చెప్పానని' అన్నారు. కాగా.. వరలక్ష్మీ శరత్కుమార్ నటిస్తూ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. వరలక్ష్మీ సోదరి పూజా శరత్కుమార్ ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు సినిమాలు చేయమని వరలక్ష్మికి చెప్పాను..తమిళ సినిమా కంటే తెలుగు సినిమా గొప్పది..Proud to be a TELUGIAN 🥺💙pic.twitter.com/fd2PAxQjEK— Hari SaaHo (@HariSaaho19) March 1, 2026 -
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
దుబాయ్లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్లోనే ఉండిపోయింది. To everyone concerned about our safety, thank you. 🙏 We are safe in Dubai. The family is safe. Aside from occasional distant sounds, life continues with calm and order.In tense times, what stands out is the quiet efficiency and brilliant preparedness on the ground. Grateful…— Vishnu Manchu (@iVishnuManchu) March 2, 2026 -
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది.తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.When grit finds its voice 🔥When grace finds its moves 🤩#Peddi Second Single #RaiRaiRaaRaa (Telugu) Out Now❤️🔥▶️https://t.co/yrdKeTtKJ9#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/dHIWPRp8hR— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026 -
దుబాయ్లో మెగా డాటర్ శ్రీజ.. సోషల్మీడియాలో పోస్ట్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు ఉన్న భారతీయులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో దుబాయ్లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్ చేశారు.దుబాయ్లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్ట్ చేసింది. అక్కడి పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్లు చేస్తూ తమ క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. దుబాయ్లో ప్రస్తుతం శాంతియుతంగానే ఉందన్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్ చేశారు. శ్రీజ ఈ పోస్ట్ చేయడంతో ఆమె తన తన పిల్లలతో కలిసి దుబాయ్లో స్థిరపడినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) -
హిట్ సినిమా దర్శకుడిపై నటి ఫిర్యాదు
మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం వివాదంలో చిక్కుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళం టౌన్ సౌత్ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మలయాళ నటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయబడిందని పోలీసులు తెలిపారు. 2022లో కొచ్చి నగరంలోని ఒక అపార్ట్మెంట్లో డైరెక్టర్ తనతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. శ్రీ చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74, 75 (లైంగిక వేధింపుల నేరాలు) కింద అభియోగాలు మోపారు.2024లో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో దేశవ్యాప్తంగా చిదంబరం విపరీతమైన గుర్తింపు పొందారు. ఈ మూవీతో సినీ రంగంలో ప్రముఖ యువ దర్శకులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. 2021లో ‘జాన్.ఈ.మ్యాన్’ అనే చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. -
'మనశంకర వరప్రసాద్గారు'కి 50రోజులు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్గారు' 50రోజులు పూర్తి చేసుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి ఆల్టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. 50రోజులు పూర్తి కావడంతో తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ను విడుదల చేశారు.'మనశంకర వరప్రసాద్గారు' 109 సెంటర్స్లో 50రోజులు పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ (97), తెలంగాణ (5), కర్ణాటక (6), ఒరిస్సా(1) సెంటర్లలో విజయవంతంగా ఈ మూవీ రన్ అవుతుంది. అయితే, అనిల్ రావిపూడి- వెంకటేష్ కాంబినేషన్లో 2025 పొంగల్ కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ రికార్డ్ను 'మనశంకర వరప్రసాద్గారు' దాటేసింది.'మనశంకర వరప్రసాద్గారు' ఫైనల్ కలెక్షన్స్'మనశంకర వరప్రసాద్గారు' కేవలం 25రోజుల్లోనే రూ. 375 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత నుంచి వారు కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇండస్ట్రీ అంచన ప్రకారం ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ రూ. 395 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచనా వుంది. ఈ మూవీ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినట్లు సమాచారం. -
‘ది బ్లఫ్’పై మహేశ్ బాబు ట్వీట్.. రిప్లైలో ‘వారణాసి’ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక!
ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై, మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పటికే రాజమౌళితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్బాబు కూడా ఈస ఇనిమాపై రివ్యూ ఇచ్చాడు. ‘‘ది బ్లఫ్.. యాక్షన్, ఎమోషన్స్కు అన్నీ ఉన్న సినిమా. ప్రియాంక యాక్టింగ్ అదిరిపోయింది. అన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. ఈ చిత్రంలో భాగమైన వారందరికీ నా అభినందనలు’ అని మహేశ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కి ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చింది.దీనికి ప్రియాంక స్పందిస్తూ పెట్టిన రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది. ‘థాంక్యూ మై ఫ్రెండ్.. .. త్వరలోనే అంటార్కిటికాలో కలుద్దాం’ అని ఆమె కామెంట్ చేసింది. దీంతో ‘వారణాసి’ తర్వాత షెడ్యూల్ అక్కడ జరగనుందని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మందాకిని అనే పాత్రని ప్రియాంక పోషిస్తోంది. Thank you my friend 🙏🏽 🏴☠️See you soon in Antarctica. ⭐️ @urstrulyMahesh https://t.co/HpBfRPbMEg— PRIYANKA (@priyankachopra) March 1, 2026 -
అప్పటి నుంచి మా నాన్న డబ్బులు తీసుకోవట్లేదు : నిహారిక
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి, 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించారు. తొలి సినిమానే సూపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్స్తో పాటు బోలెడు అవార్డులను తెచ్చిపెట్టింది. కాస్త గ్యాప్ తీసుకొని రెండో చిత్రంగా ‘రాకాస’ అనే హారర్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమా టీజర్ని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. తన సినీ జర్నీ గురించి నిహారిక ఆసక్తికర విషయాలను పంచుకుంది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండానే చిత్రాలను నిర్మిస్తున్నానని నిహారిక చెప్పింది.‘నేను యాంకర్గా 2015లో ఢీ జూనియర్ షో చేశా. అప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పటి నుంచే మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం ఆపేశా. తండ్రిగా ఆయన నాకు అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తాడు. అది ఆయనకు నాపై ఉన్న ప్రేమ మాత్రమే. అందుకే తీసుకుంటాను. అంతేకాని సినిమాలను నిర్మించేంత డబ్బులను మా నాన్న నుంచి తీసుకోలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.సొంత బ్యానర్లో ఎందుకు నటించడం లేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నాకు ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. నేనే నటించాలి అనే కండీషన్ పెట్టను. ముందు కథ వింటాను. దానికి సెట్ అయ్యే నటీనటులను మాత్రమే తీసుకుంటాం.అంతేకానీ.. ఈ సినిమాలో నన్నే హీరోయిన్గా పెట్టుకోవాలని అని కండీషన్ పెట్టను. ఒకవేళ వాళ్లు చెప్పే కథకు నేనే సెట్ అవుతాను అనుకుంటే కచ్చితంగా నటిస్తాను. ఇప్పటి వరకు మాత్రం నా దగ్గరకు అలాంటి కథలు రాలేదు. అందుకే నటించలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.ఇక సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లోవాళ్ల రియాక్షన్ ఏంటి అని మరో రిపోర్టర్ అడగగా.. ‘నేను ముందుగా డాక్టర్ అవుదాం అనుకున్నా. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే..వద్దని చెప్పారు. అందులో ఉండే మంచి, చెడులను వివరించారు. మా బంధువులలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా ‘వద్దు..కష్టంగా ఉంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లోకి వస్తానని చెప్పా. అప్పుడు కూడా ఇంట్లోవాళ్లు.. ఇండస్ట్రీలో ఉండే మంచి, చెడులను వివరించారు. ఆ తర్వాత నీ ఇష్టం అని మాత్రమే చెప్పారు. డాక్టర్ కంటే యాక్టర్ అవ్వడమే కాస్త ఈజీ అనిపించింది. అందుకే సినిమాల్లోకి వచ్చేశా’ అని నిహారిక చెప్పుకొచ్చింది. -
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోజా.. టీజర్ అదిరింది!
తమిళం,తెలుగు తదితర భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి రోజా. రాజకీయ రంగప్రవేశం చేసిన తరువాత ఆమె నటనకు దూరంగా ఉన్నారు. కాగా ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించారు. అలా నటి రోజా ప్రధాన పాత్రను పోషిస్తున్న అన్బే డయానా(Anbe DianaAnbe Diana) చిత్రంలో జమ చిత్రం ఫేమ్ పారిఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. నటి రమ్యా రంగనాథన్ నాయకిగా నటిస్తున్నారు. నటుడు చేతన్, యూట్యూబర్ పరితాపంగళ్ గోపి,ఇస్మత్భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు గుడ్నైట్,లవర్,టూరిస్ట్ ప్యామిలీ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న 7వ చిత్రం ఇది. కాగా పెరంబూర్ నేపధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇది చైన్నెని మరో కోణంలో ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రేమ , వినోదం, మత విభేదాలు వంటి అంశాలతో కథ, కథనాలు కొత్తగా ఉంటాయని చెప్పారు.ఉత్తర చైన్నెలోని ఒక మిడిల్క్లాస్ కుటుంబంలో జరిగే ఘటనల ఇతి వృత్తంతో సాగే ఈ చిత్రానికి అబ్బే డయానా అనే టైటిల్ను నిర్ణయించారు. ఆ కుటుబానికి చెందిన యువకుడు ఆంగ్లో ఇండియన్ యువతిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ఆసక్తిగా చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా చిత్ర టీజర్ను విడుదల చేశారు. టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కాగా చిత్ర ట్రైలర్, ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ కెలిస్ట్ చాయాగ్రహణం అందిస్తున్నారు. -
వాస్తవ ఘటనలతో టూ మచ్
ప్రియా భవానీ శంకర్, ఎం. ఎస్. భాస్కర్, తంబి రామయ్య, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హాట్ స్పాట్ 2 మచ్’. 2024లో ఆహాలో విడుదలైన ‘హాట్ స్పాట్’కి రెండో భాగంగా ‘హాట్ స్పాట్ 2 మచ్’ రూపొందింది.వాస్తవ ఘటనలతో తొలి భాగం రూపొందింది. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని, విభిన్న కథాంశాలతో రెండో భాగాన్ని తెరకెక్కించారు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. మోజ్విత్ – మొవిహాన్ సమర్పణలో అనిల్ రెడ్డి .ఎం, ముని చంద్రారెడ్డి. ఎన్, ఇందుకుమార్ .ఎం నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. -
టీజర్ బాగుంది: మంచు మనోజ్
‘‘రుక్మిణి’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న నిరంజన్కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. ఈ మూవీ టీజర్ బాగుంది. డైరెక్షన్, కెమెరా వర్క్, మ్యూజిక్... అన్నీ బాగున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని హీరో మంచు మనోజ్ తెలిపారు. నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ జస్పర్, దీప్తీ శ్రీరంగం ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రుక్మిణి’. సింహాచలం గుడుపూరి దర్శకత్వం వహించారు.నేలబల్లి కుమారి సమర్పణలో నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ని మంచు మనోజ్ విడుదల చేశారు. గంగాధర్ రావు మాట్లాడుతూ– ‘‘మోహన్బాబుగారి సినిమాలకు అప్రెంటిస్గా వర్క్ చేయడంతో నా కెరీర్ మొదలైంది. మంచి కథతో సింహాచలం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. సింహాచలం మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ కథతో రూపొందించిన చిత్రం ‘రుక్మిణి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్. -
అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా సరస్వతి: రాధిక
‘‘సరస్వతి’లాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ కథను వరలక్ష్మి చెప్పడం నాకు గర్వంగా ఉంది. మౌనంగా ఉన్న చాలామంది అమ్మాయిలకు ధైర్యాన్నిచ్చే సినిమా ఇది. వరలక్ష్మి చేసిన తొలి సినిమా చూసినప్పుడే మంచి నటి అవుతుందనుకున్నాం. అప్పుడే తనకి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టమని చెప్పాను. నేను నా బెస్ట్ సినిమాలన్నీ తెలుగులోనే చేశాను’’ అని రాధికా శరత్కుమార్ అన్నారు. వరలక్ష్మీ శరత్కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సరస్వతి’. వరలక్ష్మీ సోదరి పూజా శరత్కుమార్ ఈ సినిమాకు మరో నిర్మాత.ఈ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శరత్కుమార్ మాట్లాడుతూ– ‘‘నటిగా వరలక్ష్మి విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఎలా నడుచుకోవాలనే విషయాలను మాత్రం తనకు చిన్నప్పటుంచి చెప్తుండేవాడిని. స్త్రీలను గౌరవించడం మనందరి కర్తవ్యం. ‘సరస్వతి’ మంచి సబ్జెక్ట్. పూజకి ప్రోడక్షన్లో మంచి స్కిల్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర అర్థవంతంగా ఉంటుంది. ప్రోడక్షన్ పరంగా ఈ సినిమాను పూజ చాలా కంట్రోల్ చేసింది. మా నాన్నగారిని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను.నా భర్త సపోర్ట్తోనే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైమ్ మా సినిమాను చూసిన వారు, ఇందులోని ట్విస్ట్ను రివీల్ చేయొద్దని కోరుతున్నా’’ అన్నారు వరలక్ష్మి. ‘‘మనసులో నిలిచిపోయే కథ ఇది’’ అన్నారు ప్రియమణి. ‘‘మా సినిమాను ఆడియన్స్ థియేటర్స్కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు పూజా శరత్కుమార్. ‘‘సరస్వతి’ మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని తెలిపారు సిమ్రాన్, స్వప్నా దత్.‘‘నటిస్తూ, డైరెక్షన్ చేయడమనేది పెద్ద చాలెంజ్. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పారు దర్శకురాలు బి. నందినీ రెడ్డి. ‘‘స్వరస్వతి’లాంటి మంచి సినిమాను వరలక్ష్మి చేయడం ఆనందాన్నిచ్చింది’’ అని చె΄్పారు ఆమె భర్త నికోలాయ్ సచ్దేవ్. నటుడు సప్తగిరి, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు. -
విజయ్, రష్మికల రిసెప్షన్.. ఫ్యాన్స్కు విజ్ఞప్తి
విజయ్ దేవరకొండ , రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్పూర్లో కొద్దిమంది సమక్షంలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలు రాజకీయ నాయకుల కోసం హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా కొద్దిమంది మాత్రమే పాల్గొననున్నారు. తాజాగా విరోష్ జోడి తమ ఫ్యాన్స్కు, ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 4న సాయంత్రం జరిగే రిసెప్షన్ వేడుకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆహ్వానం అందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా ఇతరులు ఈ వేడకకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రకటనలో పేర్కొన్నారు.విజయ్, రష్మిక రిసెప్షన్ కోసం సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ల ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దని, వచ్చి ఇబ్బందుల పాలు కావద్దని విరోష్ జంట కోరింది. మీ క్షేమమే మాకు ముఖ్యమని, మీరు ఎక్కడున్నా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు టీమ్ తెలిపింది. -
వరలక్ష్మి నటించడం శరత్కు ఇష్టం లేదు.. నిర్మాతకు వార్నింగ్ ఇచ్చేవాడు: రాధిక
ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి,తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా..విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి..మెప్పించింది. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించింది. అయితే కూతురు సినిమాల్లోకి రావడం మొదట్లో శరత్కుమార్కి ఏమాత్రం నచ్చలేదట. యాక్టింగ్ వదంటూ ఆమెపై సీరియస్ కూడా అయ్యాడట. ఒకానొక దశలో ఆమెకు చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఈ విషయాలన్నీ శరత్ కుమార్ సతీమణి రాధికా చెప్పారు. వరలక్ష్మీ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘సరస్వతి’.ఈ నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధికా మాట్లాడుతూ.. ‘వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్ వ్యతిరేకించారు. ‘ఎలా నటిస్తావ్? నువ్వు యాక్ట్ చేయకూడదు’ అంటూ సీరియస్ అయ్యేవారు. ‘మా కుమార్తెను నటిగా ఎంపిక చేయొద్దు’ అంటూ నిర్మాతలకూ ముందే చెప్పేవారు. ఈ విషయాలన్నింటినీ తన తల్లితో కలిసి వరలక్ష్మి ఓ రోజు నాతో పంచుకుంది. దీనిపై నిర్ణయం తీసుకోలేనని చెప్పి.. సినిమా సెట్స్లో ఉన్న శరత్ వద్దకు వారిని తీసుకెళ్లా. అప్పుడు ఆయన.. నమితతో కలిసి ఓ సాంగ్కు డ్యాన్స్ చేస్తున్నారు. నమితతో సినిమా పాట అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి(నవ్వుతూ..). మమ్మల్ని చూడగానే ఆయన కారవాన్లోకి వెళ్లిపోయారు. తర్వాత వరలక్ష్మి నటించేందుకు అంగీకరించారు. వరలక్ష్మి తొలి సినిమా (పోడా పోడి)ని చూడగానే.. తను గొప్ప నటి అవుతుందని చెప్పా. తెలుగు సినిమాపై దృష్టి పెట్టమని వరలక్ష్మికి సలహా ఇచ్చా. ఆమె అదే ఫాలో అయింది. ఇప్పుడు వరలక్ష్మీని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని రాధిక అన్నారు. -
యశ్ టాక్సిక్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కేజీఎఫ్ హీరో, కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్. ఇటీవలే టీజర్, గ్లింప్స్ చేయగా అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ గ్లింప్స్ మరింత బోల్డ్గా ఉండటంతో చాలా విమర్శలు వచ్చాయి. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మార్చి 8న టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు గీతు మోహన్దాస్ దర్శకత్వం వహించారు.కాగా.. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని కన్నడ, ఆంగ్లంలో ఓకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం కూడా రిలీజ్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్ కామెంట్స్ వైరల్
కోలీవుడ్ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్- సంగీత విడాకులు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఓ నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందని, అందుకే విడాకులు ఇప్పించాలంటూ సంగీత కోర్టుని ఆశ్రయించింది. దీంతో సంగీత ఆరోపిస్తున్న నటి త్రిషనే అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సందర్భంగా త్రిష, విజయ్ కలిసి కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లిన ఫోటోలు, తిరుప్పాచ్చి, గిల్లి వంటి సినిమాల ప్రమోషన్ సమయంలో చేసిన వ్యాఖ్యలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. దీంతో పాటు పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.వీడియోలో ఏముంది?త్రిష గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఇలా మాట్లాడింది. ‘మీ పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. ఎందుకంటే.. సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి దొరకకపోతే పెళ్లి జరగకపోయినా నాకు అభ్యంతరం లేదు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం చేసే నిర్ణయం కాదు. జీవితాంతం కలిసి ఉండగలిగే వ్యక్తిని నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటే మళ్లీ విడాకుల కోసం వెళ్లాలనుకోవడం లేదు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోను. నా స్నేహితుల్లో చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని, అఇష్టంగా జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ, నేను అలాంటిది జీవితాన్ని కోరుకోవడం లేదు. సరైన వ్యక్తి కోసం వేచి ఉంటాను. అలాగే.. ఇష్టంలేని వ్యక్తితో కలిసి బతకడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. నేను ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. కానీ, నాకు జీవిత భాగస్వామి కావాలి. నచ్చిన వాడితో నా జీవితాన్ని పంచుకోవాలి. అలాంటి వ్యక్తి కావాలి’ అని త్రిష అన్నారు. "I know a lot of persons, my friends who are in an unhappy marriage. I don't want that. I would rather wait and do it with the right person" pic.twitter.com/HWitHecwGw— Trollywood 𝕏 (@TrollywoodX) February 28, 2026 -
ముందుగానే అంచనా వేశారు.. ఎస్కేప్ అయ్యారు.!
ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా జోర్డాన్ దేశంలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్,మాస్ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు.తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ టీమ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన టీమ్ ముందుగానే ఇండియాకొచ్చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ మార్చి మొదటి వరకు కొనసాగాల్సి ఉంది. కానీ కాస్తా తొందరగానే అక్కడి పరిస్థితులు అంచనా వేసిన డ్రాగన్ టీమ్ ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీంతో ఈ దాడుల నుంచి ఎన్టీఆర్- నీల్ టీమ్ తృటిలో తప్పించుకుంది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్తో పాటు యూనిట్ సభ్యులు చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని టాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. -
దుబాయ్లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యుద్ధం అనేది మానవత్వాన్ని ఎప్పటికీ చూపదని అన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎవరూ కూడా సరిదిద్దలేరని పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో దుబాయ్లో చిక్కుకుపోయిన అమాయక ప్రజలం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంచు మనోజ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రపంచమంతా శాంతించాలని కోరుకుంటున్నట్లు ఫోటోను షేర్ చేశారు.కాగా.. ఇరాన్పై దాడి తర్వాత దుబాయ్ మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ మిస్సైల్స్తో దుబాయ్పై దాడులు మొదలెట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం దుబాయ్లో ఉన్నానని మిస్సైల్స్ పడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం దుబాయ్లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి ఆక్కడే చిక్కుకున్నారు. War has never elevated our humanity.When innocent lives suffer and fear replaces normalcy, no justification can make it right.Praying for the safety of innocent people in Dubai and everywhere affected by violence.#WorldWar3#Peace #humanity#Dubai #dubaiattack pic.twitter.com/nCBfkptaSy— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 1, 2026 -
నిర్మాతగా రామ్ చరణ్.. స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ స్వయంభు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్స్తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వయంభుతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభు తర్వాత ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వా కార్తికేయ-3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడారు. కాగా..స్వయంభు చిత్రంలో సంయుక్తమీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగాయ.. రవి బస్రూర్ సంగీతమందించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ రామ్ చరణ్ - ఇండియా హౌస్ మూవీ ప్రొడ్యూసర్ #RamCharan #Nikhil #Swayambhu #Peddi pic.twitter.com/R9Q4rjvKkn— NAVEEN CHERRY 😎🤏 (@naveenpari2) February 28, 2026 -
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్కు ఇన్స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
మూగజీవాల ఎమోషన్స్ చూపించే లక్కీ.. ఓటీటీ మూవీ రివ్యూ
టైటిల్.. లక్కీ ది సూపర్ స్టార్ఓటీటీ.. జియో హాట్స్టార్నటీనటులు.. జీవీ ప్రకాశ్ కుమార్, అనస్వర రాజన్, మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులుదర్శకుడు.. ఉదయ్ మహేశ్ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు ఆ చిత్రాలను రిపీటెడ్గా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఓటీటీ చిత్రాలు అంతలా సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇటీవలే డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైన లక్కీ మూవీ.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ లక్కీ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.లక్కీ కథేంటంటే..జీవీ ప్రకాశ్కుమార్ మేనకోడలు ఆటిజంతో బాధపడుతూ ఉంటుంది. ఈ సమస్యపై డాక్టర్ను సంప్రదించగా మరో పిల్లాడిని కనండి అంటూ దంపతులకు ఉచిత సలహా ఇస్తాడు. అయితే తన మేనకోడలి ఆటిజంతో బాధపడటం చూసి జీవీ ప్రకాశ్ పాపకోసం ఏదో ఒకటి చేయాలని తపనతో ఉంటాడు. అలా ఓ రోజు రోడ్డుపై ఆపదలో ఉన్న ఓ కుక్కపిల్ల కనిపిస్తుంది. ఆ సమయంలో కుక్కపిల్లను రక్షించిన జీవీ ప్రకాశ్.. తన తీసుకెళ్లి తన మేనకోడలికి ఇస్తాడు. ఆ తర్వాత ఆటిజంతో బాధపడుతున్న పాప లైఫ్ మారిపోతుంది. కానీ ఓ గొడవ కారణంగా కుక్కపిల్ల కిడ్నాప్కు గురవుతుంది. ఆ తర్వాత ఏ జరిగింది? అసలు కుక్కపిల్లను జీవీ ప్రకాశ్ తిరిగి తీసుకొచ్చాడా? మళ్లీ తన మేడకోడలిని మామూలుగా మార్చాడా? అన్నదే అసలు కథ.ఎలా ఉందంటే.. లక్కీ ఈ టైటిల్ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది అదృష్టమే. అలా అదృష్టం కలిసొచ్చి తల్లి చెంతకు కుక్కపిల్ల చెరిన కథే ఈ లక్కీ. ఈ కథ ప్రారంభంలోనే డైరెక్టర్ విజన్ ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఈ కథలో ఫుల్ ఎమోషన్ ఉండబోతుందని ప్రేక్షకులకు ముందే హింట్ ఇచ్చేశాడు. తన బిడ్డకు ఆపద వస్తే మనుషులు ఎంత బాధపడతారో.. అలాగే మూగజీవాలు కూడా అంతకంటే ఎక్కువగా బాధపడతాయనేదే ఈ లక్కీ మూవీ కాన్సెప్ట్.వీధి కుక్కతో కథను మొదలెట్టిన డైరెక్టర్ చివరికీ వరకు అదే క్యారెక్టర్తో ప్రేక్షకుడిని ముందుకు తీసుకెళ్లాడు. మనుషులు, మూగజీవాలకు ఎమోషన్స్ ఓకేలా ఉంటాయని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు తన బిడ్డ ఆటిజం బాధను చూడలేక తల్లిదండ్రులు.. తన బిడ్డ ఏమైపోయిందోనని ఎదురు చూసే వీధి కుక్క ఎమోషన్స్ చూపించిన విధానం ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.ఇక సెకండాఫ్లో తప్పిపోయిన లక్కీ (కుక్క పిల్ల) చుట్టే తిరుగుతుంది. జీవీ ప్రకాశ్తో గొడవ కారణంగా ఆ కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతికి చిక్కుతుంది. లక్కీ వల్లనే తనకు పొలిటికల్గా కలిసొచ్చిందని నమ్మిన అతను ఆ కుక్కపిల్లను పెంచుకుంటాడు. ఆ తర్వాత కుక్కపిల్ల కోసం అనస్వర రాజన్తో కలిసి జీవీ ప్రకాశ్ ప్లాన్స్ వేయడం.. అవీ కాస్తా మిస్ఫైర్ కావడం చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కేవలం ఓ కుక్కపిల్ల కోసం ఇంతలా చేస్తారా అన్న ఫీలింగ్ ఆడియన్స్కు కలుగుతుంది. మనిషి స్వార్థం దేనికైనా తెగిస్తుందనే మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. మధ్యలో మూగజీవాల ఫీలింగ్స్ను బయటికి చూపించి ప్రేక్షకుడిని ఆలోచించేలా చేశాడు. ఓవరాల్గా చూస్తే మనిషికి.. మూగజీవాలకు మధ్య ఎమోషనల్ డ్రామానే ఈ లక్కీ. ఈ వీకెండ్లో పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లక్కీ. ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ వన్ మ్యాన్ షో చేశాడు. తన పాత్రలో అదరగొట్టేశాడు. ఛాంపియన్ బ్యూటీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తమ పాత్రలో పరిధిలో మెప్పించారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
విరోష్ వెడ్డింగ్.. పాన్ ఇండియా ఫ్యాన్స్కు కొత్త జంట సర్ప్రైజ్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.తాజాగా అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మార్చి 1వ తేదీన ఆదివారం మిఠాయిలు పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆలయాల వద్ద అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.❤️ pic.twitter.com/zXPGxIxHz7— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026 -
రిలీజ్కి ముందే సినిమా లీక్.. నిర్మాతకు బ్లాక్మెయిల్!
సినిమా పరిశ్రమలో పైరసీ అనేది దశాబ్దాలుగా పరిష్కారం కాని కీలక సమస్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రకంగా సినిమా బయటకు వచ్చేస్తుంది. ఇలా థియేటర్లో బొమ్మ పడుతుందో లేదో అలా పైరసీ కాపీ నెట్టింట్లోకి వచ్చేస్తూ.. నిర్మాతలకు కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే పైరసీ కాస్త తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. నిన్న రిలీజ్ అయిన తన కొత్త సినిమా డిసెంబర్లోనే లీక్ అయిందని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. షూటింగ్ పూర్తి కాకముందే సినిమా లీక్ అయిందట. అందుకే హడావుడిగా షూటింగ్ పూర్తి చేసి..త్వరగా రిలీజ్ చేయాల్సిన వచ్చిందని శ్రీవిష్ణు చెప్పాడు.ఆయన హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(ఫిబ్రవరి 27) రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడు పైరసీ విషయాన్ని వెల్లడించాడు.ఎలా జరిగిందో తెలియదు‘మా సినిమాను సడెన్గా రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే.. డిసెంబర్లో ఈ సినిమాను లీక్ చేశారు. ఎలా జరిగిందో తెలియదు. ఓ రోజు ఉదయం నిర్మాత ఫోన్ చేసి చెప్పడంతో షాక్ అయ్యాడు. దానిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా టీమ్ అంతా షాక్లో ఉండిపోయాం. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది బయటకు చెబితే వేరే విధంగా వెళ్తుంది. రీల్ రీల్ కోసం కూడా మా నిర్మాతని బ్లాక్ మెయిల్ చేశారు. రిలీజ్కి ముందు రోజు వరకు బ్లాక్ మెయిల్ చేశారు. అయినా కూడా నిర్మాత ధైర్యంగా నిలబడి ఈ సినిమాను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్కి మాకు కేవలం 10 రోజులు మాత్రమే దొరికింది. మొత్తానికి పైరసీ బయటకు రాకుండా చేసి ఈ సినిమాను రిలీజ్ చేశాం’ అని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.వాట్సాప్ చూసి షాకయ్యా : నిర్మాత నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఓ రోజు నాకు తెలిసిన పర్సన్ నాన్ స్టాఫ్గా కాల్ చేస్తున్నాడు. ఆ రోజు ఆదివారం. ఉదయం 9 గంటలకు నేను ఫోన్ లిఫ్ట్ చేశా. వాట్సాప్ చూస్కో అని చెప్పాడు. చూస్తే.. సినిమా పస్టాఫ్ అంతా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు.చాలా టెన్షన్ పడ్డా. నా కూతురు పెళ్లి చేయాలి. కొడుకుని సెట్ చేయాలి. ఇదంతా నా కళ్లముందు గిర్రున తిరిగింది. కాసేపటికి గుండె నిబ్బరం చేసుకొని హైదరాబాద్లో ఉన్న నా కొడుకుకి ఫోన్ చేసి చెప్పా. ఎలా జరిగిందో ఆరా తీస్తే.. మా యూనిట్ నుంచే వెళ్లినట్లు తెలిసింది. లాక్ వేసుకోకపోవడంతో ఈ లీకేజీ జరిగింది. ఎవరు పంపారో తెలియదు కానీ.. పెద్ద డ్యామేజ్ జరిగింది. ఫోన్ నెంబర్ల ద్వారా ఎక్కడెక్కడ నుంచి వచ్చిందో తెలుసుకొని.. డిలీట్ చేయించాం. ఈలోపు ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశాం. చెన్నై నుంచి లీక్ అయిన విషయం తెలిసి.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని అన్నారు. -
ఘట్టమనేని జయకృష్ణ సినిమాలో మోహన్ బాబు.. లుక్ అదిరింది!
‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ నటి రాషా తడాని తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఈ పోస్టర్లో మోహన్ బాబు సాధారణ తెల్లటి కుర్తా-ధోతీ ధరించి పవర్ ఫుల్గా, గంభీరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మోహన్ బాబు నటించినట్లు తెలుస్తుంది. చాలాకాలం తర్వాత మోహన్ బాబు మళ్లీ ఇలాంటి పాత్రలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోనూ మోహన్ బాబు విలన్గా నటిస్తున్నాడు. Introducing the Legendary @themohanbabu garu as “VENKATAPPAYA NAIDU” from #SrinivasaMangapuram❤️🔥Brace yourselves for his towering performance in a role carved with power and pride💥An @DirAjayBhupathi Film 🔥 pic.twitter.com/JvGBr9JGg4— Chandamama Kathalu Pictures (@CKPicturesoffl) February 28, 2026 -
విజయ్, రష్మికలకు సర్ప్రైజ్ గిఫ్ట్
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న నూతనంగా పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు రణబాలి మూవీ నుంచి స్పెషల్ వీడియోను విడుదల చేసి మేకర్స్ సర్ప్రైజ్ చేశారు. ఏందయ్య సామీ అంటూ సాగే ఒక గీతాన్ని ప్రోమోగా వదిలారు. సింగర్స్ శ్వేతా మోహన్, అజయ్ గోగవాలే ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాటలో కొత్తగా పెళ్లైన దంపతులుగా విజయ్, రష్మికలు కనిపిస్తున్నారు. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రణబాలి చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జ్యోతిష్యుడు చెప్పిందే నిజమైంది: స్టార్ హీరోయిన్
నటి అమలాపాల్ గుర్తుందా ? ఆమెను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. కారణం అంతగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన నటి ఈ బ్యూటీ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రముఖ నటులతో జతకట్టిన అమలాపాల్, అంతకంటే ఎక్కువగా వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్నారు. ఈమె ప్రేమ, పెళ్లి అంతా సంచలనమే. స్టార్గా రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. రెండేళ్లు తిరక్కుండానే విడాకులు పొందారు. ఆ తర్వాత అమలాపాల్ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. అదేవిధంగా నిర్మాతగానూ రంగ ప్రవేశం చేశారు. అలా కొద్ది కాలం తర్వాత మరో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యారు. తన రెండవ పెళ్లి గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటానని అనుకోలేదన్నారు. జీవితం నిస్సారంగా సాగిపోతున్న తరుణంలో ఒక జ్యోతిష్కుడిని కలిశానన్నారు. ఆయన తనకు 32 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతుందని చెప్పాడన్నారు. జ్యోతిష్యుడు చెప్పిన కొద్దిరోజుల తర్వాత జగత్ అనే వ్యక్తిని గోవాలో కలుసుకున్నానన్నారు. మొదట్లో తాము డేటింగ్ చేశామని, అలా గర్భం దాల్చినట్లు చెప్పుకొచ్చారు. అప్పటికీ కూడా తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదన్నారు. అయితే గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే కదా! అనిపించడం వల్ల జగత్తో తన వివాహం జరిగిందని ఆమె అన్నారు. ఈమె చివరగా నటించిన మలయాళ చిత్రం ది గోట్ చిత్రం 2024లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో చిత్రంలో నటించలేదు. అయినా ఈ అమ్ముడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నారు. -
విరోష్... ఓ రికార్డ్
బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్ బ్రేక్ చేయడం కామన్. అయితే ఇప్పుడు ‘విరోష్’ (విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్’ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్ని కూడా షేర్ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్ దక్కాయి. దీంతో ‘విరోష్’ వివాహ ఫొటోలు రికార్డ్ సాధించాయి. బాలీవుడ్ కపుల్ పిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్ దక్కించుకున్న రికార్డ్ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్ని తాజాగా విరోష్ ఫొటోలు బ్రేక్ చేశాయి. షేర్ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్–కియారాల రికార్డ్ని 18.5 మిలియన్ల లైక్స్తో ‘విరోష్’ పెళ్లి ఫొటోలు బ్రేక్ చేశాయి. ఈ నంబర్ ఇంతటితో ఆగలేదు... లైక్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి విజయ్–రష్మికల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.ఉదయ్పూర్ టు హైదరాబాద్: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్ కపుల్లా కనిపించిన విజయ్–రష్మిక శుక్రవారం ఎయిర్పోర్టులో క్యూట్గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్ చేరుకుంది. కాగా ఎయిర్పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఫ్యాన్స్ అభిమానం చాటుకోగా... ‘విరోష్’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రధానికి ఆహ్వానం... వైరల్భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్గా మారాయి. -
ఓ మాట అనుకుందామా!
సుహాసినీ మణిరత్నం, వినోద్ కుమార్, ఇంద్రజ కీలక పాత్రల్లో, శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రా జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓ మాట అనుకుందామా!’. భీమ్జీ దర్శకత్వంలో మాస్టర్ కనిష్క్ మహాబలాహ్ సమర్పణలో పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ని సుహాసినీ మణిరత్నం, వినోద్ కుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మేం మంచి పాత్రలు చేస్తున్నాం. ఈ చిత్రం మంచి విజయం సాధించి, టీమ్కి మంచి పేరు తీసుకురావాలి’’ అని పేర్కొన్నారు.భీమ్జీ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఓ మాట అనుకుందామా!’. సరికొత్త ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా బ్యానర్ నుంచి ‘ఓ మాట అనుకుందామా!’ వంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుకిృత్ కేఎస్, సంగీతం: అలోష్య పీటర్–వినోద్ యజమాన్య. -
తండ్రీ, కొడుకుల ఎమోషనల్ కథ.. సన్ ఆఫ్ మూవీ రివ్యూ
టైటిల్: సన్ ఆఫ్దర్శకుడు.. బత్తుల సతీష్ నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్మెంట్ టైమ్కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.ఎలా ఉందంటే..తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్కి వస్తుంది.కోర్ట్లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.ఎవరెలా చేశారంటే..సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్ను మెప్పించాయి.తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
హైదరాబాద్లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026 -
ప్రభాస్ స్పిరిట్ మూవీ.. విలన్ యాక్షన్ మోడ్ లుక్ చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రానికి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ స్టార్స్ నటిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు.తాజాగా విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. నోటిలో సిగరెట్ పెట్టుకుని హై యాక్షన్ మోడ్లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ రోల్ పవర్ఫుల్గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపిచనుంది.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మాఫియా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రణయ్రెడ్డి వంగా, భూషణ్కుమార్, క్రిషన్కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ థియేటర్లలో సందడి చేయనుంది. A mystery buried in shadows and eyes that remember the darkest secrets.In Cinemas across the World on March 5th, 2027.#OneBadHabit@InSpiritMode#Prabhas @imvangasandeep @tripti_dimri23 #AishwaryaDesai @rameemusic @sureshsrajan #BhushanKumar @vangapranay #KrishanKumar… pic.twitter.com/jTPiaB2OXw— Vivek Anand Oberoi (@vivekoberoi) February 27, 2026 -
విజయ్తో పెళ్లి.. ముందే చెప్పిన రష్మిక.. వీడియో వైరల్..!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్గా ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అత్యంత ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్పూర్లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్షిప్ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు.అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.గతంలో ఓ మూవీ ఈవెంట్కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 2024 లోనే అర్థం చేసుకోవాల్సింది మనం We did a mistake 😭😭😭😭😭😭#RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/tryvGuCGsF— Swaasthi (@swaasthi) February 26, 2026 -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్కు బిగ్ రిలీఫ్
ది కేరళ స్టోరీ-2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు రిలీజ్కు మార్గం సుగమమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తివేయడంతో ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా.. గతంలో రిలీజైన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్గా 'కేరళ స్టోరీ 2' ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాపై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్పూర్లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్తో వీరిద్దరు తమ వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు. -
‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్ సిరీస్ రివ్యూ
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. తల్లిదండ్రులు, పిల్లలపై తాము పెంచుకునేది, పంచుకునేది ప్రేమ మాత్రమే. కాని పరిగెడుతున్న కాలంతో పోటీ పడతూ మారుతున్న ఈ సమాజంలో అదే ప్రేమ కాస్త తడబడుతూ తమ పిల్లలపై భయాన్ని కలుగజేస్తోంది. కన్న పిల్లల పై బాధ్యత తో కూడా ఆప్యాయత ఉండాలి కాని అనుమానంతో కూడిన భయం ఉండకూడదు అని చెప్పే సిరీస్ ఈ D/o ప్రసాదరావు కనుబడుటలేదు. నిజానికి పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్ ఇది. వాస్తవ ఘటనలపై అల్లుకుని అత్యంత వాస్తవికంగా తీసిన ఈ సిరీస్ టీనేజ్ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లితండ్రులకు ఈ సిరీస్ ఓ కనువిప్పులాంటిది అని చెప్పవచ్చు. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓ సారి చూద్దాం. ఊళ్ళో కిరాణ కొట్టు నడుపుకుంటున్నప్రసాదరావు కూతురు స్వాతి పట్టణంలోని ఉద్యోగం చేయడం కోసం భవాని హాస్టల్ లో చేరుతుంది. ప్రసాదరావుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ. అందుకే 20ఏళ్ళ నుండి ఎక్కడకూ పంపని కూతురుని మొట్టమొదటిసారిగా కూతురు కోసం పట్టణంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం కోసం కష్టంగా ఒప్పుకుంటాడు. అకస్మాత్తుగా స్వాతి కనిపించకుండా పోతుంది. కూతురుని వెతుక్కుంటూ ప్రసాదరావు హైదరాబాద్ కు వస్తాడు. కాని అనూహ్యంగా పోలీస్ విచారణలో స్వాతి చావుకు తన తండ్రి ప్రసాదరావే కారణమని తెలుస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న స్వాతి తండ్రి ప్రసాదరావు స్వాతి చావుకు కారణమెలా అయ్యాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే జీ5లో స్ట్రీమ్ అవుతున్న D/o ప్రసాదరావు కనుబడుటలేదు చూడాల్సిందే.వాస్తవ ఘటనలను ప్రతిబింబించేలా, పదునైన సంభాషణలతో లోతైన భావాలతో చాలా హృద్యంగా చిత్రీకరించాడు దర్శకుడు. అంతేకాదు సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకందనిది. జీ5 ఓటిటి వేదికగా D/o ప్రసాదరావు కనుబడుటలేదు సిరీస్ మొత్తం 6 భాగాలలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ మొత్తం చూశాక ఆడపిల్లలున్న తండ్రులు మాత్రం తమ ఆడబిడ్డపై అనుమానం కాదు అనుబంధం ముఖ్యమని ఖచ్చితంగా భావిస్తారు. వర్త్ టు వాచ్ ఫర్ ది ఫాదర్స్ హూ హ్యావ్ డాటర్స్. -
కిరణ్ అబ్బవరం కుమారుడి కేశఖండన వేడుక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. హీరోయిన్ రహస్య గోరఖ్ను పెళ్లాడగా.. వీరిద్దరికి పండంటి బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. గతేడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గతేడాది క, కె-ర్యాంప్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్తో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.కిరణ్ అబ్బవరం తన కుమారుడు హనుఅబ్బవరం పుట్టి వెంట్రుకలు కార్యక్రమంలో తన గ్రామ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే అందమైన సందేశం ఇచ్చారు.👌@Kiran_Abbavaram #chennailovestory ♥️ pic.twitter.com/4rpBfu9d8w— Kakinada Talkies (@Kkdtalkies) February 26, 2026 -
రొమాంటిక్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి: భాగ్యశ్రీ
కెరీర్ ఎంత స్పీడులో ఉన్నా సరే పెళ్లవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్. కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్లయ్యాకే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తోంది.కాలక్షేపం కోసం..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ... సమాజాన్ని ప్రతిబింబించేవే సినిమాలు. 90'sలో జనాలకు వినోదం అంటే సినిమానే గుర్తొచ్చేది. కుటుంబంతో కలిసి సమయం కేటాయించడానికి, కాలక్షేపం చేయడానికి సినిమాకు వెళ్లేవారు. ఇప్పుడన్నీ మారిపోయాయి. చిన్న కుటుంబాలే ఎక్కువయ్యాయి. వినోదం కోసం అనేక మాధ్యమాలు వచ్చాయి. జనాలకు ఆప్షన్స్ ఎక్కువయ్యాయి.బలవంతంగా ఇరికించొద్దుఅదే సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యంగా మారింది. సినిమాల్లోనూ జానర్స్ వచ్చాయి. వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అయితే మోడ్రన్ సినిమాల్లో సహజత్వం కోసం రొమాంటిక్ సన్నివేశాలను బలవంతంగా చొప్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా పిల్లలతో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి క్లోజప్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పుకొచ్చింది.సినిమాఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన భాగ్యశ్రీ.. ప్రభాస్ 'రాధేశ్యామ్'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు హిందీ సినిమాల్లో నటించి వెండితెరపై చిన్న బ్రేక్ తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజా శివాజీ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ మే1న విడుదల కానుంది.చదవండి: అదో చెత్త సినిమా.. ఇంత వెక్కిరించాలా?: నటుడు -
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: విష్ణు విన్యాసంనటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులునిర్మాత: సుమంత్ నాయుడు జిరచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావుసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026వరస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఆ మధ్య సీరియస్ కంటెంట్ చిత్రాలు చేసినప్పటికీ..అవి బెడిసి కొట్టాయి. దీంతో తనకు అచ్చొచ్చి కామెడీ జానర్లోనే సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అదే జోష్లో ఇప్పుడు విష్ణు విన్యాసం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత సినిమాల మాదిరే విష్ణు విన్యాసం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్ లెక్చరర్. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్రూమ్ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తదేమి కాదు. రాజేంద్ర ప్రసాద్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మొదలు మొన్నటి ప్రియదర్శి ‘సారంగపాణి’ వరకు జాతకం కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న హీరోయిన్ సమస్య కూడా పాతదే. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఆ పాయింట్ టచ్ చేశారు. ఇలా పాత కాన్సెప్ట్ని ఎంచుకొని.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా సీన్లను రాసుకొని జెంజీ బ్యాచ్ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు యధునాథ్ మారుతీ రావు. కథ, కథనం కంటే శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అతనితో పలికించిన వన్ లైన్ పంచులు సినిమాకు ప్లస్ అయ్యాయి. కానీ కథకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఆ కామెడీని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. హీరోయిన్కి ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుగా చూపిస్తూ సినిమాను ప్రారంభించారు. ఆ తర్వాత పెళ్లి చూపుల సీన్తో హీరోని పరిచయం చేశారు. హీరోకి జాతకాల పిచ్చి ఉండడం.. ప్రతి పనికి గురువు(శ్రినివాస్ రెడ్డి)గారి అనుమతి తీసుకోవడం..ఇందంతా కొంతవరకు నవ్విస్తుంది. ఇక కాలేజీలో హీరోహీరోయిన్లు కలిసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్ వింతగా ప్రవర్తించడం.. దానికి తోడు శ్రీవిష్ణు వేసే వన్లైనర్ పంచ్లు.. కొంతమేర ఎంటర్టైన్ చేస్తాయి. హీరోయిన్ సమస్య ఏంటనేది ఇంటర్వెల్ వరకు చెప్పకపోవడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆ సమస్య తెలిసిన తర్వాత మాత్రం ఉన్న కాస్త ఆసక్తి కూడా తగ్గిపోతుంది. సోషల్ మీడియాలోని మీమ్స్ వాడుకొని విష్ణు కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో అది కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్ట్రాక్తో పాటు శ్రీవిష్ణు చేసే కామెడీ అంతా కూడా ఆర్గానిక్గా అనిపిస్తుంది. కథలో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నం చేయకుండా..కేవలం సంభాషణలతోనే నవ్వించే ప్రయత్నం చేశారు. అవి జెంజీ బ్యాచ్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఎవరెలా చేశారంటే..ఎప్పటిమాదిరే శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఆయన హవాభావాలు, సంభాషణలు అన్నీ కొంతవరకు నవ్విస్తాయి. మనీషా పాత్రకి నయన సారిక న్యాయం చేసింది. కమెడియన్ సత్య కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఆయనను సరిగా వాడుకోలేకపోయారనిపించింది. మురళీ శర్మ, గోపరాజు రమణ రెగ్యులర్ పాత్రల్లో కనిపించారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రధన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ మిగతా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సినిమా నిడివి తక్కువగా ఉండడం(2:07 గంటలు) ప్లస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
హోంబలే ఫిల్మ్స్ బిగ్ ప్లాన్.. బరిలోకి దిగిన నిర్మాతలు
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్కు పరిమితమైన ఈ బ్యానర్ ఇప్పడు అంతర్జాతీయ మార్కెట్పై కన్నేసింది. 2012లో విజయ్ కిరగందూర్, చలువే గౌడ నేతృత్వంలో మొదలైన ఈ సంస్థ పునీత్ రాజ్కుమార్తో తొలి సినిమా తెరకెక్కించి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఆ తర్వాత కేజీఎఫ్తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది.తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఒక పోస్ట్ చేసింది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవంగా అక్కడ బలమైన మార్కెట్ ఉన్నప్పటికీ సరైన డిస్ట్రిబ్యూషన్ లేదని పరిశ్రమకు చెందిన వారే అంటుంటారు. ఇలాంటి సమయంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నడంతో అంచనాలు పెరిగాయి. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు ఓవర్సీల్లో భారీ సంఖ్యలో విడుదలయ్యే ఛాన్స్ రానుంది.హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ ఇప్పటికే పలు చిత్రాలను భారత్లో పంపిణీ చేసింది. మహావతార నరసింహ, మిరాయ్, L2: ఎంపురాన్ వంటి చిత్రాలను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి విజయం సాధించింది. కాగా ,ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో కాంతార ప్రీక్వెల్తో పాటు సలార్ 2, కేజీఎఫ్-3, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లు ఉన్నాయి. Cinema connects hearts beyond every distance.From India to the world, our stories travel far and wide.With gratitude and quiet excitement, Hombale Films steps into Overseas Distribution carrying the spirit of Indian cinema beyond borders, across industries, and into hearts… pic.twitter.com/zxKE79FdFL— Hombale Films (@hombalefilms) February 27, 2026 -
ప్రధాని మోదీని కలిసిన 'విరోష్' జోడీ
-
మీనా, వినీత్ నటించిన థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ వచ్చేసింది
ప్రముఖ నటి మీనా, నటుడు వినీత్ కీలక పాత్రల్లో నటించిన రోస్లిన్(Roslin) వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్గా దర్శకుడు సుమేష్ నందకుమార్ తెరకెక్కించారు. ‘దృశ్యం’ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా సుమేష్ పనిచేశారు. అందుకే ఈ సిరీస్పై అంచనాలు పెరిగాయి.రోస్లిన్(Roslin) వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్స్టార్లో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ,మలయాళం, మరాఠీ, బెంగాళీలో స్ట్రీమింగ్ అవుతుంది. రోస్లిన్ టైటిల్ పాత్రలో సంజన దిపు అనే అమ్మాయి నటించింది. మలయాళ హిట్ సినిమా మూథోన్తో మెప్పించిన సంజన.. మలయాళ పరిశ్రమలో గుర్తింపు పొందింది. నటుడు వినీత్ చాలా కాలం తర్వాత ఒక వెబ్ సిరీస్ కోసం కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. -
తెలుగు పరిశ్రమపై తాప్సీ ప్రశంసలు
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధానపాత్రలో నటించిన అస్సీ మూవీ తాజాగా విడుదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తెలుగులో తన కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ కొంత కాలంగా టాలీవుడ్ పరిశ్రమ పట్ల చేస్తున్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. సౌత్ఇండస్ట్రీలో హీరోయిన్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్ బ్రా ధరించాలని ఇక్కడి ఫిల్మ్మేకర్స్ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించింది. అయితే, ఆమె ఇప్పుడు యూటర్న్ తీసుకొని తెలుగు పరిశ్రమపై ప్రశంసలు కురింపించింది.తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ.. 'చష్మే బద్దూర్' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్ ఇమేజ్ని అక్కడ క్రియేట్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమపై మక్కువను చాటుకుంది. తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని ఆమె గుర్తు చేసుకుంది. అయితే, తెలుగులో మాదిరి తమిళ పరిశ్రమలో అలాంటివి తక్కువగా కనిపిస్తాయని ఆమె పేర్కొంది. టాలీవుడ్ నుంచి తనకు మంచి పాత్రలే దక్కడంతో తెలుగు వారు తనను బాగా అభిమానిస్తారని చెప్పింది. తన విలువను పెంచిన సినిమాలన్నీ కూడా తెలుగు నుంచే ఉన్నాయని తెలిపింది. తన కెరీర్కు టాలీవుడ్ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ఝుమ్మంది నాదం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2022లో చివరిగా ‘మిషన్ ఇంపాజిబుల్’లో మెరిసింది. -
ట్రంప్ వ్యూహం.. వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్ బిగ్ డీల్కు బ్రేక్..
వార్నర్ బ్రదర్స్, నెట్ఫ్లిక్స్ మధ్య కుదిరిన భారీ డీల్కు బ్రేక్ పడింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు కొద్దిరోజుల క్రితం ఆసక్తి చూపిన నెట్ఫ్లిక్స్ (Netflix).. ఇప్పుడు వెనక్కు తగ్గింది. ఈ నిర్ణయంతో మీడియా దిగ్గజంగా ఎదగాలనుకున్న నెట్ఫ్లిక్స్ ఆశలకు గండి పడింది.నెట్ఫ్లిక్స్- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య కుదిరిన డీల్కు అంతరాయం కలిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం రచించారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ రంగంలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్ను చేజిక్కించుకునేందుకు 108.4 బిలియన్ డాలర్ల బిడ్ను పారామౌంట్ వేసింది. ఈ బిడ్ వెనక ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ఉన్నట్లు అక్కడి మీడియా కథనం రాసింది.వార్నర్ బ్రదర్స్ సంస్థతో నెట్ఫ్లిక్స్ కుదుర్చుకున్న 72 బిలియన్ డాలర్ల ( రూ.6.48 లక్షల కోట్లు) ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ ట్రంప్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన హ్యూహం వల్లే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన డీల్ బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వార్నర్ బ్రదర్స్ను సులువుగా పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థ దక్కించుకునే ఛాన్స్ ఉంది. -
పెళ్లి వేళ.. రష్మిక, విజయ్ విద్యార్హతలు వైరల్.. ఎవరెంత చదువుకున్నారు?
టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక భార్యభర్తలయ్యారు. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో వీరి వివాహం జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ఫోటోలను అటు రష్మిక, ఇటు విజయ్ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రష్మిక, విజయ్లకు సంబంధించిన మరో విషయంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు? వీళ్ల ఎడ్యుకేషన్ ఎలా సాగింది? తదితర వివరాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.విజయ్ ఏం చదువుకున్నాడు?విజయ్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అనంతపురం జిల్లా పుట్టపర్తిలోనే సాగింది. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో బోర్డింగ్ విద్యార్థిగా తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకున్న విజయ్, అబిడ్స్లోని భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బీకాం (B.Com) డిగ్రీని పూర్తి చేశాడు. ఆ తర్వాత చదువు ఆపేసి.. ప్యాషన్ వైపు అడుగులు వేశాడు. థియేటర్ ఆర్ట్స్ ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు.చదువులోనూ రష్మిక ‘స్టారే’రష్మిక నటిగానే కాకుండా చదవులోనూ ‘స్టార్’గానే కొనసాగింది. ఆమె పాఠశాల విద్య మొత్తం కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వెళ్లిన రష్మిక, అక్కడ ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. కేవలం ఒకే సబ్జెక్టులో కాకుండా, రష్మిక సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్లో ట్రిపుల్ మేజర్ డిగ్రీని పూర్తి చేయడం గమనార్హం.మొత్తంగా విజయ్, రష్మిక ఇద్దరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ.. డిగ్రీల పరంగా చూస్తే మాత్రం విజయ్ కంటే రష్మికనే కాస్త ముందంజలో ఉంది. ఆమె సైకాలజీ, జర్నలిజం లాంటి కీలక రంగాలలో డిగ్రీ పట్టాపొందింది. -
చిరంజీవి కూడా తన డ్యాన్స్లు కాపీ కొట్టాడు.. ఆ పాప్ కింగ్ ఓ హిస్టరీ!
‘‘గోళీమార్...మార్ మార్ మార్...’’ అంటూ దొంగ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్స్లతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాడు అని గుర్తు చేయడం ఇప్పుడు అవసరం. ఎందుకంటే.. ఆ పాటలో చిరు డ్యాన్స్కు స్ఫూర్తి ని అందించిన మరో డ్యాన్సర్ జీవితం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది కాబట్టి. ఓ మూడున్నర దశాబ్ధాల క్రితం మైఖేల్ జాక్సన్ అనే పేరు వింటేనే కుర్రకారు వేర్రెత్తినట్టు ఊగిపోయేవారు. కాళ్లలో ఎముకలున్నాయా లేవా అన్నంత చాకచక్యంగా నృత్యాలు చేసిన మైఖేల్ జాక్సన్ సృష్టించిన రికార్డ్స్, సాధించిన సక్సెస్లు సాధారణమైనవి కావు. 2009లో 50ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించిన అమెరికా వాసి మైఖేల్ ఎన్ని గొప్ప విజయాలు సాధించాడో అన్ని వివాదాలకూ కేంద్రబిందువయ్యాడు.కొత్తగా చర్మాన్ని పునఃసృష్టించుకున్నాడు అనే దగ్గర నుంచి చిన్నారులపై లైంగిక అకృత్యాలకు పాల్పడ్డాడు దాకా మైఖేల్ను చుట్టుముట్టిన తీవ్రమైన వివాదాలు బహుశా ప్రపంచంలోనే ఏ సెలబ్రిటీ కూడా ఎదుర్కుని ఉండడు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి మైఖేల్ జీవితం ఇప్పుడు తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ప్రపంచ ప్రేక్షకులకు మైఖేల్ జీవితం కళ్లకు కట్టనుంది. అనేక అడ్డంకులను దాటుకున్న తర్వాత మైఖేల్ పేరిట ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 24న థియేటర్లలో , ఐమ్యాక్స్ తెరపై విడుదల కానుంది, జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ పాప్ మ్యూజిక్ ఐకాన్ గా ప్రధాన పాత్రలో నటించడం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నాడు. లయన్స్ గేట్ ఈ చిత్రాన్ని దేశీయంగా పంపిణీ చేస్తుండగా, యూనివర్సల్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ను నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో మైఖేల్ జాక్సన్ బయోపిక్ గురించి చిత్ర దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తన ఆలోచనల్ని పంచుకున్నారు.‘‘ మైఖేల్ లాంటి వ్యక్తి జీవితం గురించి సినిమా తీయడం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం, ఒక నల్లజాతి కళాకారుడిగా మాత్రమే తనను పరిగణించడాన్ని అతను ఎలా నిరాకరించాడో చూశాను. దర్శకుడిగా నా కెరీర్పై మైఖేల్ పెనుప్రభావాన్ని చూపాడు. ’’ అని లయన్స్ గేట్ విడుదల చేసిన ఓ వీడియోలో ఫుక్వా చెప్పారు. ‘‘మైఖేల్ జీవితమంతా ప్రజలకు తన స్వరం ద్వారా ఆనందాన్ని పంచాడు. అందుకే అతను తన జీవితం కంటే ఎంతో ఉన్నతుడు . అంత ఉన్నతమైన జీవితాన్ని సినిమాటిక్ మార్గంలో చూపడం నాకు అంత సులభం కాలేదు.’’ అన్నారాయన. ‘‘తనతో పాటు వెనక్కి తిరిగి వెళ్లి కొంచెం దూరం ప్రయాణం చేయకపోతే ఓ మనిషిగా మైఖేల్ జాక్సన్ ను ఎవరైనా అర్థం చేసుకోగలరని అనుకోను. అతను తన కుటుంబం పట్ల తనకున్న ప్రేమకు సంగీతం పట్ల తనకున్న ప్రేమకు మధ్య పోరాడాడు.’’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు పుక్వా.సంగీత ప్రయాణం కోసం తన కుటుంబాన్ని జాక్సన్ విడిచిపెట్టడంతో మొదలై 1979 లో జాక్సన్ తన మొదటి సోలో ఆల్బమ్ ఆఫ్ ది వాల్ విడుదల చేయడంతో తొలి చిత్రం ముగుస్తుందని హాలీవుడ్ రిపోర్టర్ అంచనా. ఆ తర్వాత జాక్సన్ 2009 మరణానికి ముందు అతని మిగిలిన కెరీర్ ఇతరత్రా సంఘటనలపై రెండవ చిత్రం రానుందని కూడా తెలుస్తోంది.ఈ మైఖేల్ చిత్రం తాజా ట్రైలర్ను ఈ నెల ప్రారంభంలో విడుదల చేశారు. జాక్సన్ తండ్రి జో జాక్సన్ పాత్రలో మైఖేల్ కోల్మన్ డొమింగో, అతని తల్లి కేథరీన్ గా నియా లాంగ్ నటించారు. తారాగణంలో మైల్స్ టెల్లర్, లారా హారియర్, కాట్ గ్రాహం, లారెంజ్ టేట్, డెరెక్ లూక్ ఉన్నారు. గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా జాన్ మెక్క్లైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు, దీనికి జాన్ లోగన్ స్క్రిప్ట్ అందించారు. -
వసూళ్లు చూసి ధైర్యం వచ్చింది: సుహాస్
‘‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్ నంబర్లు కూడా కనబడకపోవడంతో భయం వేసింది. కానీ, ‘హే బల్వంత్’ మూవీ వసూళ్లు చూశాక ధైర్యం వచ్చింది. ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి’’ అని హీరో సుహాస్ పేర్కొన్నారు. గోపీ అచ్చెర దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన చిత్రం ‘హే బల్వంత్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 20న విడుదల చేశారు. గురువారం నిర్వహించిన ‘థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ ఈవెంట్’లో బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో వచ్చిన తొలి సక్సెస్ ఇది. మంచి సినిమా తీశారంటూ ప్రేక్షకులు అభినందించడం సంతృప్తినిచ్చింది’’ అని తెలిపారు.‘‘మా మూవీ చూసిన అందరూ యూనిట్పై ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు గోపీ అచ్చెర. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘హే బల్వంత్’కి బ్రేక్ ఈవెన్ కావడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాని దాదాపు 10 క్లోట బడ్జెట్తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్నీ కలిపి పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్లో మంచి వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో లాభాల్లోకి వెళతాం. నంది అవార్డ్స్ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్ గురించి నేను ఈ మధ్య తప్పుగా మాట్లాడాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐయామ్ సారీ’’ అని చెప్పారు. నటి, యాంకర్ స్రవంతి చొక్కారపు, లావణ్య రెడ్డి, మహీ రెడ్డి తదితరులుపాల్గొన్నారు. -
హాయిగా నవ్వుకోవచ్చు: శ్రీ విష్ణు
‘‘విష్ణు విన్యాసం’ చిత్రంలో నేను చేసిన విష్ణుపాత్ర ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు కొత్త. విష్ణు చాలా నమ్మకాల్ని ఫాలో అవుతుంటాడు. ఈపాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ప్రేక్షకులు రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఈ వీకెండ్కి థియేటర్కి వెళ్లి, హ్యాపీగా టైమ్పాస్ చేసి రావొచ్చు’’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. హేమ, షాలిని సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీ విష్ణు విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ యదునాథ్ మారుతి ‘విష్ణు విన్యాసం’ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ కొత్తయినప్పటికీ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ చిత్రంలో నేను లెక్చరర్గా కనిపిస్తాను. నా సహ లెక్చరర్గా సత్య కనిపిస్తాడు. మా మధ్య సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. ఇందులో వీరి వీరి గుమ్మడి పండు అనే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ ఎపిసోడ్కి థియేటర్ మొత్తం నవ్వులతో బ్లాస్ట్ అవుతుంది. ఈ మూవీలో నేను చేసిన విష్ణు క్యారెక్టర్కి కొన్ని రూల్స్ ఉంటాయి. చాలా నమ్మకాలని ఫాలో అవుతుంటాడు. వ్యక్తిగతంగా నేను జాతకాలను, గ్రహాలను పూర్తి స్థాయిలో ఫాలో కాను. కానీ, చిన్నప్పటి నుంచి అందరితోపాటు అలవాటు చేసుకున్న కొన్నింటిని మాత్రం ఫాలో అవుతాను.⇒ నయన్ సారికపాత్రని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రెండు మూడు పేజీల సీన్ని తను సింగిల్ టేక్లో చేసింది. రథన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం సురేష్ బొబ్బిలిగారితో చేయించాం. అది కూడా అద్భుతంగా వచ్చింది. నా సినిమాలన్నీ ఓటీటీ డీల్స్ పూర్తవడం... నిర్మాతలు హ్యాపీగా ఉండడం చాలా ఆనందాన్నిస్తోంది. నిర్మాతలు పెట్టే డబ్బులు వెనక్కి వస్తే చాలనుకుంటాను. ఈ చిత్ర నిర్మాతలు సుబ్రమణ్యం, సుమంత్గార్లు ఔట్పుట్ విషయంలో హ్యాపీగా ఉన్నారు. మేం అనుకున్న బడ్జెట్లో ఓ పదిహేను శాతం తక్కువలోనే సినిమాని పూర్తి చేశాం. ⇒ కామెడీ చేయడం, నవ్వించడం కష్టం. అయితే దాదాపు సిచ్యువేషనల్ కామెడీస్ చేస్తున్నాం కాబట్టి వర్కౌట్ అవుతున్నాయి. నేను చేసేవన్నీ దాదాపు మన చుట్టూ ఉండే కథలే... మనకు తెలిసినపాత్రలే. మిడిల్ క్లాస్ స్టోరీ సెటప్. ఇలాంటి సినిమాలను 60, 70 రోజుల్లో చేసుకోవచ్చు. అందుకే నా సినిమాలు ఫాస్ట్గా అవుతున్నాయని భావిస్తున్నా. నేను నటించిన ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజ్ కానుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ 80 శాతం పూర్తయింది. రామ్ అబ్బరాజుతో చేయనున్న సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. సితార బ్యానర్లో సన్నీ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ఉంది. -
కలర్పుల్ డ్రెస్సుల్లో మృణాల్ ఠాకూర్.. ట్రెండీ లుక్లో దుషారా విజయన్!
డిఫరెంట్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..బీచ్లో టాలీవుడ్ నటి అభినయ చిల్..మెరూన్ డ్రెస్సులో హీరోయిన్ సదా అందాలు..ట్రెండీ లుక్లో కోలీవుడ్ బ్యూటీ దుషారా విజయన్..పట్టు పరికిణిలో విమలా రామన్ హోయలు.. View this post on Instagram A post shared by Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) -
అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్.. వెంకీతో పాటు ఎవరంటే?
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఏకంగా మెగాస్టార్తోనే మ్యాజిక్ క్రియేట్ చేశాడు. మనశంకర వరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ మల్టీస్టారర్ మూవీ 2026 సంక్రాంతి విన్నర్గా నిలిచింది.అయితే ఈ సినిమా హిట్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాను కూడా ప్రకటించారు. మరోసారి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్తో జతకట్టనున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ కొట్టి వీరిద్దరు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ ట్వీట్ చేశారు. మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. వెంకీమామతో.. "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కల్యాణ్రామ్తో కలిసి..2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం అంటూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబో మల్టీస్టారర్ మూవీ కోసం వెంకీమామ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Back again with my director @AnilRavipudi for #VenkyAnil5 🤗🤗🤗Every time we team up, it feels like coming back home full of fun, positivity, and pure entertainment! ❤️Glad to have @NANDAMURIKALYAN join this journey making it special for all of us.. పండగకి కలుద్దాం!!… https://t.co/mCqMXCW10x— Venkatesh Daggubati (@VenkyMama) February 26, 2026 -
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్లో శిరీష్- నయనిక గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March. We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026 -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒక్కరోజే ఏకంగా 11 చిత్రాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ మూవీపైనే ఆడియన్స్లో కాస్తా బజ్ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్ థ్రిల్లర్ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27జియో హాట్స్టార్ రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27 బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28 బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5 డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27 తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27 క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అబార్ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27 అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహా సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్ హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27 నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఆపిల్ టీవీ ప్లస్ మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27 -
ఒక రోజు రష్మికను చాలా మిస్ అయ్యా.. పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ విజయ్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ భర్త విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా. మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి. ప్రతిరోజు పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు. విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.'ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్..టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు'.. శివాజీకి అర్జున్ రెడ్డి నటి కౌంటర్..!
హీరోయిన్స్ దుస్తులను ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదం సృష్టించాయి. ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ సంఘటన తర్వాత ఓ మూవీ ఈవెంట్లో శివాజీ మాట్లాడారు. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో రెండు పదాలు వాడారు. అప్పట్లో ఈ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా శివాజీ చేసిన కామెంట్స్పై టాలీవుడ్ నటి అదితి మైకల్ స్పందించింది. శివాజీ సినిమాలు చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని అని తెలిపింది. ఒక అమ్మాయి డ్రెస్ గురించి మీరు మాట్లాడుతుంటే భయమేస్తోందని వెల్లడించింది. అప్పుడు మీ సినిమాల్లో హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు.. అప్పుడు మీరెందుకు చెప్పలేదని శివాజీని ప్రశ్నించింది. అప్పుడు మనకెందుకని.. మీరు మీ పని చేసుకుని వెళ్లిపోయారు కదా.. అప్పుడు వాళ్లను ఎందుకు ఆపలేదని నిలదీసింది.ఇలాంటి దుస్తులు వేసుకోవడం నాకిష్టమని.. ఇదే నాకు ఫుడ్ పెడుతోందని అదితి తెలిపింది. అలాగని నేను బికినీ వేసుకుని రోడ్డుమీదకి వెళ్లట్లేదు కదా అని పేర్కొంది. ఒకసారి నేను అమీ తుమీ ప్రమోషన్స్కు బస్సులో వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి ఏకంగా నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడని వెల్లడించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ అమ్మాయిల రుద్దడం ఆపేయండని శివాజీకి అదితి కౌంటరిచ్చింది. మేము ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. కొందరైతే మీ లో దుస్తులు బయటికి కనిపిస్తున్నాయని సరిగా వేసుకోండని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదితి మ్యాకల్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో మరోసారి చర్చకు దారితీశాయి. కాగా.. అదితి.. టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత అమీ తుమీ, ఏకం, 24 కిస్సెస్, రాధ, షాదీ ముబారక్ లాంటి చిత్రాల్లో నటించింది. మొదట వెబ్సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన అదితి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. “మీ మూవీస్లోనే హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు. అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు..నాకు ఇష్టం ఇలాంటి బట్టలు వేసుకోవడం.. నాకు FOOD పెడుతోంది.. అలా అని నేను BIKINI రోడ్ మీద వేసుకొని వెళ్లట్లేదు కదా.”- Aditi Myakal to Actor #Sivaji pic.twitter.com/t9lnKwO5LP— Whynot Cinemas (@whynotcinemass_) February 26, 2026 -
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!
స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్మెన్ థియేటర్లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026 -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లో ఉదయ్పూర్లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ
-
గ్రాండ్గా విజయ్-రష్మిక పెళ్లి.. అతిథుల నోరూరించే స్పెషల్ వంటకాలు ఇవే.. !
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఇంతలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న ఈ పెళ్లిలో అతిథులు సందడి చేశారు. వీరి పెళ్లి వేడుక గురించే టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అసలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి వంటకాలు వడ్డించారో మనం కూడా ఓ లుక్కేద్దాం.ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు.. ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు విరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. విరోష్ వెడ్డింగ్లో కొడవ స్పెషల్ కర్రీ హైలెట్గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్ విషయానికొస్తే గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలె బాత్, మైసూర్ పాక్ అతిథులకు రుచి చూపించారు. -
హైకోర్టులో ‘ది కేరళ 2’ చిత్రానికి భారీ షాక్
సంచలనం సృష్టించిన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్గా వస్తున్న 'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు (ఫిబ్రవరి 26) విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.అసలేం జరిగింది?2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు సినిమాను వీక్షించిన హైకోర్టు.. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. -
విజయ్ దేవరకొండకు రష్మిక ఎంత కట్నం ఇస్తుందో తెలుసా?
-
కొడవ సంప్రదాయంలో ‘విరోష్’ వివాహం.. పెళ్లి ప్రత్యేకతలు ఇవే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడుమూళ్లు వేశాడు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్ ఈ పెళ్లికి వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు. తొలుత తెలుగు హిందూ పద్దతిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక కుటుంబ మూలలను గౌరవిస్తూ కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకోబోతున్నారు.కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?రష్మికది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన కొడవ సామాజిక వర్గం. అక్కడి వారి పెళ్లి సంప్రదాయ భారతీయ వివాహాలన్నింటిలోకి చాలా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతుని వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. ఈ పెళ్లిళ్లలో హిందూ సంప్రదాయాల్లో కనిపించే పురోహితులు (బ్రాహ్మణులు), అగ్ని సాక్షి (హోమం) వంటివి ఉండవు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుందట.పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి, సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు'కుప్య' (నల్లని కోటు), 'చేలే' (నడుముకు కట్టే పట్టీ) మరియు 'పీచే కత్తి' (చిన్న కత్తి) ధరిస్తాడు. పెళ్లి కూతురు వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కొడవ చీరను ధరిస్తుంది.పెళ్లి వేదిక వద్దకు వరుడు వచ్చే ముందు, అడ్డుగా ఉన్న అరటి చెట్టు కాండాలను నరకడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీక.వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్నప్పుడు, కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి వారిని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు. కేవలం పెద్దల దీవెనలే ప్రధానం. వధువుకి ఒడి బియ్యానికి బదులు ఒక చిన్న నాణేల మూట అందిస్తారట.ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.పెళ్లి తర్వాత వధువు తన అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు గంగా పూజ జరుగుతుంది. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకుంటారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టం ఇది. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా, కొడవ పెళ్లిళ్లలో మాంసాహారం (ముఖ్యంగా పంది మాంసం), మద్యం తప్పనిసరిగా వడ్డిస్తారు.కొడవ భాష మాట్లాడుతూ.. తన సంప్రదాయ బట్టల్లో రష్మిక#RashmikaMandana #Virosh #VijayDevarakonda pic.twitter.com/ZNNrxCCYgl— Milagro Movies (@MilagroMovies) February 26, 2026 -
ట్రెండింగ్లో నాని జడలు ఆయా షేర్ తో అరాచకం
-
విజయ్-రష్మిక పెళ్లి.. ప్రధాని స్పెషల్ విషెస్
-
ఆగస్టులో భోగి
ఆగస్టులో ‘భోగి’ సినిమా థియేటర్స్లోకి రానుంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘భోగి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960 కాలంలో మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగే సినిమా ఇది.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్లో స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. కాగా, బుధవారం ‘భోగి’ సినిమా నుంచి శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి, ఈ సినిమాను ఆగస్టు 28న రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమా కోసం శర్వానంద్ సరికొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
భారతీయ సినిమా ప్రయాణంలో ఇది కీలక ఘట్టం: నాగార్జున
‘‘ప్రపంచ స్థాయి కథలను చెప్పాలనుకునే భారతీయ దర్శకుల కలలకు అత్యాధునిక సాంకేతిక వసతులు కొరతగా ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఆ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఎపిక్ అడ్వెంచర్ నుంచి సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకు ఎన్నో కథలను సులభంగా తెరకెక్కించవచ్చు. భారతీయ సినిమా ప్రయాణంలో ఇది ఒక కీలక ఘట్టం’’ అని నాగార్జున అన్నారు. ‘అవతార్, అవెంజర్స్’ వంటి హాలీవుడ్ సినిమాల మేకింగ్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు ఆ చిత్రాల ఫిల్మ్ మేకర్స్. ఈ టెక్నాలజీ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అందుబాటులోకి వచ్చింది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, శోభు యార్లగడ్డ మిహిరా విజువల్ ల్యాబ్స్ కలిసి ‘ఎ అండ్ ఎమ్ మోక్యాప్ ల్యాబ్’ ను స్టార్ట్ చేశారు. ‘అవెంజర్స్ ఎండ్గేమ్, స్పైడర్ మేన్: నో వే హోమ్’ వంటి చిత్రాలకు వర్క్ చేసిన యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ కంపెనీ భాగస్వామ్యమైంది. మోషన్ క్యాప్చర్ ల్యాబ్ను లాంచ్ చేసిన అనంతరం రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఎ అండ్ ఎమ్’ సంస్థ అద్భుతమైన టెక్నాలజీని అందిస్తుంది. ‘వారణాసి’ సినిమా చిత్రీకరణలో ఈ టెక్నాలజీని వినియోగించి, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం... అద్భుతంగా వచ్చాయి. అంతర్జాతీయ సినీ నిర్మాణ సంస్థలకు భారత్ నుంచి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వర్క్ చేయడానికి వెళ్తున్నారు.అయితే ఆ ఆధునాతన సౌకర్యాలు మాత్రం మనకు అందుబాటులో ఉండటం లేదు. ‘ఈగ, ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ సినిమాల చిత్రీకరణ అప్పుడు ఇండియాలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అందుబాటులో ఉండి ఉంటే... ఈ సినిమాలను ఇంకా బాగా ఎలా చేయవచ్చు? అని ఆలోచించేవాడిని. ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ వారి ఆలోచనా ధోరణిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లవచ్చు’’ అని చెప్పారు. ‘‘మిహిరా ల్యాబ్స్ లక్ష్యం ఎప్పుడూ ఇండియన్ ఫిల్మ్ మేకర్లకు అంతర్జాతీయ ప్రమాణాల టూల్స్ అందించడమే’’ అన్నారు శోభు యార్లగడ్డ.‘‘ఈ టెక్నాలజీ సదుపాయంతో వర్చ్యువల్ ఎన్విరాన్మెంట్లో కెమెరా బ్లాకింగ్, లెన్స్ ఎంపిక, కెమెరా మూవ్మెంట్స్, ఫ్రేమ్ రేట్స్ వంటి అంశాలను ముందుగానే పరీక్షించవచ్చు. దీనివల్ల టెక్నికల్, లాజిస్టి కల్ అవసరాలను ముందే అంచనా వేసి, లైవ్ షూట్లో సమయం, ఖర్చును తగ్గించుకోవచ్చు’’ అన్నారు అన్నపూర్ణ స్టూడియోస్ సీటీవో సీవీ రావు. ‘‘భారతీయ కథలు ఇప్పుడు ప్రపంచ స్థాయి సాంకేతికతతో మరింత గొప్పగా రూపుదిద్దుకోనున్నాయి’’ అని చెప్పారు యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ అధ్యక్షుడు అండ్ సీటీఓ బ్రెట్ ఇన్సన్. భారతీయ సినిమా రంగంలో 50 సంవత్సరాల లెగసీని పూర్తి చేసిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ని ప్రారంభించింది. -
బిగ్బాస్ బ్యూటీ దివి షాపింగ్.. శారీలో నివేదా థామస్ అందాలు..!
చార్మినార్ షాపింగ్లో బిగ్బాస్ బ్యూటీ దివి..బ్లూ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్..బ్లాక్ శారీలో నివేదా థామస్ హోయలు...డిఫరెంట్ డ్రెస్సులతో బాలీవుడ్ భామ దిశాపటానీ..రెడ్ రోజ్లా మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అక్కినేని నాగచైతన్య వృషకర్మ.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విరూపాక్ష గ్లింప్ల్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. వచ్చేనెల ఐదో తేదీన వృషకర్మ గ్లింప్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు నాగచైతన్య ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. When sinister energy awakens, A warrior is chosen. #VrushakarmaGlimpse on MARCH 5th, 2026 ❤️🔥The much anticipated world of #VRUSHAKARMA opens in all its fury, fire, and fear 💥💥💥Yuvasamrat @Chay_akkineni like never before in @karthikdandu86’s vision 🔥 @Meenakshiioffl… pic.twitter.com/k7Rk4uoVEx— Annapurna Studios (@AnnapurnaStdios) February 25, 2026 -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్కు రామ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to launch the first single of #Mrithyunjay - #EeZindagi ❤️🔥The trailer also looked intriguing..Looking forward to seeing @sreevishnuoffl in @hussainshakiran ‘s thriller. Wishing them all the very best for Mrithyunjay coming on March 6th! ❤️Check the song out now!… pic.twitter.com/uSjXSaPIfY— RAm POthineni (@ramsayz) February 25, 2026 -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. -
పెళ్లిలో అల్లు అర్జున్ సతీమణి సందడి.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పెళ్లికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి pic.twitter.com/fKmHCFaLYs— Telangana365 (@Telangana365) February 25, 2026 -
మరో ఓటీటీకి టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. ఈసినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈనెల 27 నుంచి సన్ నెక్ట్స్లో ప్రసారం కానుందని వెల్లడించారు.తాజాగా మరో ఓటీటీలోనూ హనీ సందడి చేయనుందని నవీన్చంద్ర తెలిపారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. దీంతో ఓకే రోజు రెండు ఓటీటీల్లో హనీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్తో పాటు డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద కీలక పాత్రలలో కనిపించారు. Hi Nenu Mee Naveen Chandra..Ela Unnaru? naaku Telusu Meeru Naa Nundi Maro Exciting & Thrilling Movie Kosam Waiting Ani.. Andhuke Ippatidhaka Meeru Experience Cheyani Movie Ni Meeku Chupinchabothunam..27th Feb Nundi..Mee Amazon Prime Lo..Get Ready 🔴 🐈⬛ #HoneyMovie Will Stream… pic.twitter.com/qBjf3CgjS9— Actor Naveen Chandra (@Naveenc212) February 25, 2026 -
రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి!
సినిమాలు, పనులు ఎప్పుడూ ఉండేవే.. కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. కల్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆ శుభఘడియలు ముంచుకొచ్చాక ఎవరూ దాన్ని వాయిదా వేయలేరు. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా విషయంలో ఇదే జరుగుతోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ దాన్ని బయటకు చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు.ఇప్పుడు ఆ ఆటకు ముగింపు పలుకుతూ భార్యాభర్తలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 26న విరోష్ (విజయ్- రష్మిక) పెళ్లి జరగనుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి.. వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను రష్మికకు బహుకరించి తన ప్రేమను చాటుకున్నట్లుృ తెలుస్తోంది. మరి విరోష్ లవ్ స్టోరీ ఎప్పుడు? ఎలా? మొదలైందో ఓసారి చూసేద్దాం..2018లోనే పెళ్లిగీత గోవిందం.. 2018లో వచ్చిన ఈ సినిమాలో తొలిసారి విజయ్- రష్మిక జంటగా నటించారు. ఆన్ స్క్రీన్లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా పెళ్లి సీన్లో నటించడం రష్మికకు మూడోసారి కానీ విజయ్కు మాత్రం అదే తొలిసారి కావడం విశేషం! ఈ చిత్రంతోనే వీరి మధ్య పరిచయం మొదలైంది. డియర్ కామ్రేడ్ మూవీతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందుకే ఈ మూవీ తమకెంతో స్పెషల్ అంటుంటారు. కానీ ప్రేమలో ఉన్నామని మాత్రం నేరుగా ఎన్నడూ చెప్పలేదు. అందరి ముందు..కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు కూడా జంటగా ఫోటోలు షేర్ చేసిందీ లేదు. అయితే ఇద్దరూ కలిసే ఉన్నట్లుగా హింట్లు మాత్రం వదిలేవారు. పుష్ప సినిమా సమయంలో విజయ్ను డార్లింగ్ ఫ్రెండ్ అని అభివర్ణించింది రష్. ఇంటర్వ్యూలలో కూడా అతడు తన ఫేవరెట్ అని వెల్లడించింది. ది గర్ల్ఫ్రెండ్ ఈవెంట్లో తొలిసారి విజయ్.. అందరిముందు రష్మిక చేయిని ముద్దాడాడు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గయింది.ఆ ఒక్క మాటతో..జయాపజయాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. పలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్.. కింగ్డమ్తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చిన్నపిల్లలా సంబరపడిపోయింది నేషనల్ క్రష్. మనం హిట్ కొట్టాం అని మురిసిపోయింది. తన ప్రేమ విజయ్ దగ్గరే ఆగిపోలేదు, అతడి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్స్కు వెళ్లేందుకు ఏనాడూ నో చెప్పలేదు. అటు విజయ్ తల్లితోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తనకు అమ్మ తర్వాత అమ్మతో సమానం అన్నప్పుడే ఆమె తెలుగింటి కోడలైపోయింది.పెళ్లి పత్రికలోనూ..విజయ్- రష్మికల ప్రేమను చూసిన అభిమానులు వీరికి విరోష్ (#Viorsh) అనే ట్యాగ్ ఇచ్చారు. అలానే పిలవడం మొదలుపెట్టారు. అభిమానులు ఇచ్చిన విరోష్ అనే పేరు ఈ లవ్బర్డ్స్కు సైతం నచ్చడంతో పెళ్లి పత్రికలోనూ అదే పేరు అచ్చువేయించారు. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న ఈ విరోష్ జంటకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్!!చదవండి: పెళ్లి వేళ.. రష్మిక వ్యాఖ్యలు వైరల్ -
బుల్లితెరపై మనశంకరవరప్రసాద్గారు.. ప్రీమియర్ ఎప్పుడంటే?
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను అలరిస్తోంది.తాజాగా ఈ సినిమా టీవీల్లోనూ రానుంది. ఈనెల 28న టెలివిజన్ ప్రేక్షకులను అలరించనుంది. జీ తెలుగు ఛానెల్లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అఫీషియల్గా అఫీషియల్గా ప్రకటించింది. మెగా పండగ అంటూ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ ప్రకటనతో టీవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా చూస్తూ Contest లో పాల్గొంటూ Mega Surprise Gifts ని పొందండిDon't miss World Television Premiere #ManaShankaraVaraPrasadGaru On Feb 28th, Sat at 5:30 PM On #ZeeTeluguStreaming Now On #Zee5#ZeeTeluguSpotlight #MegaCallAndWinContest #MegaPandagaOnZeeTelugu… pic.twitter.com/tXMT2igxRk— ZEE TELUGU (@ZeeTVTelugu) February 25, 2026 -
ఇందులో ప్రాపగండా ఎక్కడుంది..? దురంధర్పై సీనియర్ నటుడు రివ్యూ
దురంధర్ మూవీతో రణ్వీర్ సింగ్ బాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఛావా, కాంతార-2 చిత్రాల వసూళ్లను అధిగమించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేశారు. దీనిపై ప్రాపగండా చిత్రమని ముద్రవేశారు.తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా మాట్లాడారు. దురంధర్ ఓ మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కొనియాడారు. సాంకేతికత పరంగానూ ప్రేక్షకులను మెప్పించిందన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్లో చాలా వాస్తవిక పద్ధతిలో రూపొందించారని అన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి రణ్వీర్ సింగ్ అని అభివర్ణించారు. ఈ సినిమాను ఒక సంపూర్ణ కళాఖండమని అభివర్ణించారు. ఇందులో ఎలా ప్రాపగండా లేదని.. సినిమాను సినిమాగానే చూడాలని శతృఘ్న సిన్హా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ధురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా మెప్పించారు. ప్రస్తుతం ధురంధర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. Wow! Just happened to see the most talked about film an absolute masterpiece 'Dhurandhar'. What 'propaganda' film??? A film is a film is a film. It's a great film, gripping interesting & full of entertainment, made with sincerity. The sets too have been created beautifully in…— Shatrughan Sinha (@ShatruganSinha) February 25, 2026 -
పదేళ్ల తర్వాత దొరికిన అరుదైన గిఫ్ట్ ఆ సినిమానే: తాప్సీ
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే అస్సీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించగా.. మలయాళ నటి కని కుస్రుతి కీలక పాత్రలో మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవల ఓ ఛానెల్తో మాట్లాడిన ఆమె.. సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ తన కెరీర్ గురించి మాట్లాడింది. షారూఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో ఆఫర్ రావడంపై స్పందించింది. డంకీ లాంటి భారీ కమర్షియల్ చిత్రంలో అవకాశం రావడం మంది నటులకు కష్టమని తెలిపింది. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం తన కెరీర్లో అరుదైన క్షణమని వెల్లడించింది. సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఆ పాత్ర అవసరమని.. అందుకే తనకు వచ్చిందని ఆమె అన్నారు.తాప్సీ పన్ను మాట్లాడుతూ..'డంకీ లాంటి అవకాశాలు తనకు మాత్రమే కాదు. పరిశ్రమలోని చాలా మంది నటులకు కూడా కష్టమే. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించడం నా కెరీర్లో అరుదైన క్షణం. చాలా సంవత్సరాల నాకు లభించిన సినిమా డంకీ. దశాబ్దానికి పైగా సినిమాల్లో నటించిన తర్వాత అందుకున్న బహుమతి డంకీ. నాలాంటి వారికి డంకీ లాంటి సినిమా దొరకడం కష్టం. అస్సీ, గాంధారి లాంటి సినిమాలు చేయడం వల్లే డంకీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలు నాకు పరిశ్రమలో గుర్తింపు తీసుకొచ్చాయని' పంచుకుంది. తన కెరీర్ను మాస్ ఎంటర్టైనర్లతో ప్రారంభించానని తెలిపింది. దక్షిణాదిలో నా కెరీర్ను మాస్ చిత్రాలతో ప్రారంభించా.. ఆ తర్వాత నా హిందీ సినిమా అరంగేట్రం డేవిడ్ ధావన్తో జరిగిందని పేర్కొంది.కాగా.. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్లో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
రామ్, భాగ్యశ్రీకి... బ్రేకప్ చెప్పారా..?
-
విజయ్, రష్మిక సంగీత్ వీడియో వైరల్.. క్రికెట్ బ్యాట్పై పెళ్లి డేట్!
రష్మిక, విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలలో పెళ్లి సందడి మొదలైంది. మోహందీ, సంగీత్ సందడి కూడా జరిగిపోయింది. సంగీత్లో విజయ్, రష్మిక కలిసి నటించిన చిత్రాల్లోని క్యూట్ ఫోటోలతో కలర్పుల్గా డెకరేషన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో అధికారికంగా షేర్ చేయాలని కోరుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు సంగీత్లో ఇరుకుటుంబ సభ్యులు సరదగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ను కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని విజయ్ దేవరకొండ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశాడు. అందులో క్రికెట్ బ్యాట్, సిల్వర్ మెడల్పై ఫిబ్రవరి 26 అని రాసి పెళ్లిడేట్ని డిఫరెంట్గా ప్రకటించారు. From the #Virosh Premier league! #VijayDeverakonda pic.twitter.com/ghf7F7TMDF— Hourly Vijay Deverakonda (@HourlyDVS) February 24, 2026ఈ రోజు హల్దీ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయ్పూర్లోని మెమెంటోస్ హోటల్ జరిగే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే అతిథులు హాజరుకానున్నారు. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు.We need those original pictures @iamRashmika please 🥹❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz— Rahul (@The_pathbreaker) February 24, 2026 -
చలో జార్జియా
హీరో మహేశ్బాబు జార్జియాకి ప్రయాణం అయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ‘వారణాసి’ తాజా షెడ్యూల్ కోసమే మహేశ్బాబు విదేశీ బాటపట్టారు. మంగళవారం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన జార్జియాకి బయలుదేరారు.అక్కడ జరగనున్న కీలక షెడ్యూల్ కోసం మహేశ్ వెళ్లారు. ఆయనకి సెండాఫ్ ఇచ్చేందుకు భార్య నమ్రత, కుమార్తె సితార ఎయిర్పోర్ట్కు వెళ్లారు. మహేశ్కి వారు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, సన్గ్లాసెస్, టోపీ... ఇలా స్టైలిష్గా ఉన్న మహేశ్ని చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక మహేశ్బాబు–రాజమౌళి కాంబోలో రానున్న ‘వారణాసి’ మూవీపై అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ బజ్ నెలకొంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
జాతీ మతం కంటే మనిషి ముఖ్యం
బ్రిటిష్ అకాడెమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రం ‘బూంగ్’ తెర వెనుక కథ మానవత్వాన్ని చాటుతోంది. ఈ సినిమా దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి మణిపూర్లో మెయితి తెగకు చెందినామె. ముఖ్య పాత్ర పోషించిన బాలనటుడు గుగున్ కుకీ తెగకు చెందినవాడు. అయితే సినిమాలో అతను మెయితీ తెగకు చెందిన పిల్లాడిగా నటించాడు. సినిమా షూట్ ముగిశాక మొదలైన మణిపూర్ అల్లర్లలో మెయితీల దాడి నుంచి గుగున్ కుటుంబాన్నిలక్ష్మీ ప్రియాదేవి కాపాడింది. ఢిల్లీకి వలస వచ్చిన గుగున్ ప్రస్తుతం ఆరవ తరగతి పరీక్షలకు కూచుంటున్నాడు. 2023కు ముందు మతం, జాతీ తేడా లేకుండా ఉన్న తాము ఇప్పుడెందుకు ఇలా ఉన్నామని ప్రశ్నిస్తున్నారు వారు.మణిపురి భాషలో తీసిన ‘బూంగ్’ సినిమా ట్రైలర్ను చూసినా అది మనల్ని ఆకట్టుకుంటుంది. అందులో కనిపించే తల్లీకొడుకులు మనకు ఏదో లోతైన కథ చెప్తున్నారనిపిస్తుంది. ఆ సినిమాలో తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లి ఉంటాడు. స్కూల్ చదువులో ఉన్న కుమారుడు తండ్రి కోసం బయల్దేరడమే ‘బూంగ్’ సినిమా. మణిపురి దర్శకురాలు లక్ష్మీ ప్రియాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘బ్రిటిష్ అకాడెమీ’ అవార్డ్స్లో మొదటిసారి మన దేశానికి అవార్డు సం పాదించిపెట్టింది. ఇది రికార్డు. ఈ కథ ఇక్కడ ముగిసినా ఈ సినిమా వెనుక ఉన్న కథ మాత్రం మనసుల్ని కదిలించేలా ఉంది.మెయితీ–కుకీమణిపూర్లో రెండు బలమైన జాతులు ఉన్నాయి. మెయితీ– కుకీ. ఇంఫాల్ లోయలో మెయితీలది పై చేయి అయితే కొండ ప్రాంతాలలో కుకీలది పై చేయి. లక్ష్మీ ప్రియాదేవి తీసిన ‘బూంగ్’ సినిమాలో కథ మెయితీ కుటుంబానిది. అయితే అందుకు కావలసిన బాల నటుడు కుకీ కుటుంబం నుంచి దొరికాడు. అతని పేరే గుగున్ కిప్జెన్. 2023లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కిప్జెన్కు 11 ఏళ్లు. సినిమా షూటింగ్ ముగిశాక మే 3, 2023న హటాత్తుగా మణిపూర్లో అల్లర్లు మొదలయ్యాయి. మెయితీలు పైచేయిగా ఉండే ఇంఫాల్లో కుకీల మీద దాడులు జరుగుతున్నాయి.అప్పుడు కిప్జెన్ కుటుంబం ఇంఫాల్లోని కానన్వెంగ్ అనే ప్రాంతంలో ఉంది. మే4న మెయితీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో స్వయంగా మెయితీ తెగకు చెందిన లక్ష్మీ ప్రియాదేవి రంగంలో దిగి కిప్జెన్ కుటుంబాన్ని ఆ ప్రాంతం నుంచి దాటించింది. కిప్జెన్ కుటుంబం పోట్ట చేత్తో పట్టుకుని అస్సాం రైఫిల్స్ శిబిరానికి చేరి తల దాచుకుంది. అక్కడ కొన్నాళ్లు ఉన్నాక కుకీలు ఎక్కువ ఉండే కాంగ్ పోక్పి జిల్లాకు తరలి వెళ్లింది.ఇంఫాల్లో ఉన్న సొంత ఇంటిని కిప్జెన్ వదిలి పెట్టేశాడు. అతని స్కూల్లో అతను తిరిగి చదవలేడు. ఏ మెయితీ పిల్లాడి పాత్ర తాను పోషించాడు ఆ మెయితీల వల్లే కష్టాల్లోకి వెళ్లిపోయాడు. ఇతనిలాగే కుకీల వల్ల మెయితీ కుటుంబాలు, పిల్లలు అవస్థ పడ్డాయి. ఇరు వర్గాల ఘర్షణల్లో పై పై లెక్కల ప్రకారం 260 మంది చనిపోతే 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.ఢిల్లీకి చేరి...కొండ ప్రాంతానికి చేరినా కిప్జెన్ కుటుంబం సురక్షితంగా లేదు. అల్లర్లు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో కిప్జెన్ చదువు కోసం కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లాలనుకుంది. అదీ అంత సులభంగా జరగలేదు. మిలటరీ కాన్వాయ్లో ఒక బస్సులో కొన్ని కుటుంబాలతో పాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఢిల్లీకి చేరారు. 2025 జనవరి నుంచి కిప్జెన్ కుటుంబం ఢిల్లీలోనే ఉంది. మణిపూర్లో అల్లర్లు పూర్తిగా తగ్గితే తప్ప వెనక్కు వెళ్లమని చెబుతోంది. కొత్త వాతావరణంలో కిప్జెన్ బడి బాట పట్టాడు. ప్రస్తుతం 6వ తరగతి పరీక్షకు కూచుంటున్నాడు. అతడు నటించిన సినిమా దేశ దేశాల్లో ఎంతో పేరు సం పాదిస్తున్నా ఆ సంతోషం అంతా అనుభవించలేకపోతున్నాడు. వలస జీవితం ఎంత దుర్భరమో అనుభవించినవారికే తెలుసు.దివ్యశక్తి ప్రతిఒక్కరిలో...బ్రిటిష్ అకాడెమీ అవార్డు పోందాక లక్ష్మీ ప్రియా దేవి తన ఉపన్యాసం ఇలా చేసింది– ‘మేమంతా ఎంతో బాగుండేవాళ్లం. ఆ మునుపటి శాంతి మణిపూర్కి తిరిగి రావాలి. చెదిరిపోయిన పిల్లలంతా తిరిగి తమ గూళ్లకు చేరుకుని ఆనందంగా గడ పాలి. ఎన్ని ఘర్షణలు జరిగినా మనిషిలో క్షమ అనే దివ్యశక్తి మనిషికి మాత్రమే సొంతం. ఆ క్షమతో మానవత్వాన్ని నిలబెట్టాలి’ అందామె. దేశంలో అందరికీ గౌరవంగా, సమానంగా బతికే హక్కు ఉంది. ఎవరికంటే ఎవరూ ఎక్కువ కాదు... తక్కువ కాదు. దాడులు, ప్రతి దాడులు, ద్వేషాలు పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచివి కావు. మానవత్వమే మనిషి ప్రథమ గుణం కావాలి... ఇదే ఇప్పుడు ‘బూంగ్’ సినిమా విజేతలు లోకానికి ఇస్తున్న సందేశం. -
రాజమౌళిగారి సినిమాలో చేయడం నా కల: నయన్ సారిక
‘‘నటనకు స్కోప్ ఉన్నపాత్రలే చేయాలనుకుంటున్నాను. ‘గం గం గణేశా, ఆయ్, క’ వంటి చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేశాను. నయన్... నటించిందంటే ఆ సినిమా బాగుంటుందని ప్రేక్షకులు అనుకోవాలన్నదే నా లక్ష్యం. దర్శకుడు రాజమౌళిగారి సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేయాలన్నది నా డ్రీమ్’’ అని చెప్పారు హీరోయిన్ నయన్ సారిక. శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యధునాథ్ మారుతీరావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో నయన్ సారిక మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం మహారాష్ట్ర. నాకు చిన్నప్పట్నుంచి నటి కావాలని ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత యాక్టర్ అయ్యాను. ఒకవేళ నేను యాక్టర్ను కాకపోయి ఉంటే లాయర్ని అయ్యేదాన్ని. ఇక ‘విష్ణు విన్యాసం’ సినిమా విషయానికొస్తే... ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న మనీషా క్యారెక్టర్లో నటించాను.ఇద్దరు లెక్చరర్స్ మధ్య జరిగే ప్రేమకథతో ఈ సినిమా మొదలవుతుంది. మనీషా తన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొన్న అమ్మాయి.. హాయిగా బతకాలని ఆశపడే అమ్మాయి. మరి... మనీషా సమస్యలు ఏంటి? ఆమె కోరుకున్నది ఆమెకు లభించిందా? లేదా అనేది మాత్రం థియేటర్స్లో చూడాల్సిందే. రెయిన్ సీక్వెన్స్లో నటించడం సవాలుగా అనిపించింది. ఈ చిత్రదర్శకుడు మంచి క్లారిటీ ఉన్న ఫిల్మ్మేకర్. సినిమాకు కావాల్సిన ప్రతిదీ నిర్మాత సమకూర్చారు. నేను నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. కన్నడ యాక్టర్ గణేష్తో ఓ సినిమా చేస్తున్నాను’’ అని తెలిపారు. -
కలల ప్రయాణం
తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బాకి దక్షిణ కొరియాకు వెళ్లాలన్నది పెద్ద కల. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్ ఫ్లిక్స్లో విడుదల కానుంది. ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ దక్షిణ కొరియా నటుడుపార్క్ హ్యే–జిన్,నో హో–జిన్ ఈ సినిమాలోని ప్రధానపాత్రల్లో నటించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వంలో రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.ఈ చిత్రవిశేషాల గురించి ప్రియాంక చెబుతూ– ‘‘మేడ్ ఇన్ కొరియా’ కథ విన్నప్పుడే శెన్బాపాత్రతో నాకు బలమైన అనుబంధం ఏర్పడింది. ఇంత అద్భుతమైనపాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఆ స్ఫూర్తితోనే ఈ కథ తయారు చేశాను. మనసుల్ని హత్తుకునే స్లైస్ ఆఫ్ లైఫ్ చిత్రం ఇది.భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న కథలను ప్రోత్సహించిన నెట్ఫ్లిక్స్కు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు ఆర్ఏ కార్తీక్. ‘‘దక్షిణాది కథలపై మా దృష్టిని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్కృతిలోపాతుకుపోయిన కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్. -
‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా సెన్సార్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా కోర్టులు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు కోర్టు తెలిపింది. ఈ నెల 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న చిత్రమిది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. ఫిబ్రవరి 25 తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
Ram Role: ఇటు మహేశ్.. అటు రణబీర్ ఎవరు పర్ఫెక్ట్?
-
శ్రీ విష్ణు కన్ఫ్యూజన్ సాంగ్ విడుదల
శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ను విడుదల చేశారు. దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన ఈ మూవీని హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఇందులో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు రథన్ సంగీతం అందించారు. -
‘ఓకేరా నీ ఇష్టం’.. ఈ మాట భయపెడుతోంది : నానిపై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్తో వచ్చిన ఆ చిత్రం..బాక్సాఫీస్ని షేక్ చేసింది. శ్రీకాంత్ తొలి సినిమానే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని తన రెండో సినిమా కూడా నానితోనే ప్లాన్ చేశాడు. అదే ‘ది ప్యారడైజ్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. నాని బర్త్డే(ఫిబ్రవరి 24) సందర్భంగా ఈ రోజు ‘ఆయా షేర్’ అనే సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela ) నానికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఎక్స్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.‘నాని(Nani) అన్న..‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని అన్న ప్రతిసారి నాకు ‘శ్రీకాంత్ నిన్ను నమ్ముతున్నాను’ అన్నట్లుగా వినిపించేది. ఆ నమ్మకం నన్ను ప్రతిసారి భయపెట్టేసింది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం ప్రతి సెకను నా రక్తాన్నా, ఆత్మను ధారపోశాను. నేను నీ సినిమా రూల్స్ని బ్రేక్ చేశాను. మీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్ మార్చేశాను. మీ సినిమా రిలీజ్ డేట్ ప్లానింగ్ని కూడా బ్రేక్ చేశాను. చివరకు మీ వర్కింగ్ స్టైల్ని కూడా మార్చేశాను. ఇలా మీరు పెట్టిన ప్రతి నియమాన్ని నేను ఉల్లంఘించాను. అయినా సరే నువ్వు నాపై చూపిస్తున్న ఆ నమ్మకం నన్ను మరింత బాధ్యతగా పని చేసేలా చేసింది. నువ్వు నమ్మినంతగా నన్ను ఇంకెవరు నమ్మలేదు అన్న. సినిమా కోసం నేను జడలు వేసుకోవాలి అంటే.. ఓకేరా నీ ఇష్టం అన్నావు. టాటూ వేసుకోవాలని చెబితే నీ ఇష్టం అన్నావు. ప్రతిరోజు లెక్కలేనన్ని రీటేకులతో నిన్ను టార్చర్ చేసినా.. సింపుల్గా ‘ఓకేరా నీ ఇష్టం’ అన్నావు. నీతో ఎప్పుడు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేదు కానీ..‘నువ్వు ఎప్పుడూ ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని ఎందుకు అంటావు అనే దానికి సమాధానం కోసం నా జీవితంలో ప్రతి సెకను నిరంతరం వెతుకుతున్నాను. బహుశా ‘ది ప్యారడైజ్’(The Paradise) సినిమాతో ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో. నన్ను నమ్మిన నా ధరణికి(దసరాలో నాని పాత్ర పేరు) నన్ను మళ్లీ నమ్ముతున్న నా జడల్కి( ది ప్యారడైస్లో నాని పాత్ర పేరు)కి హ్యాప్తీ బర్త్డే. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను నాని అన్న’ అని శ్రీకాంత్ ఓదెల రాసుకొచ్చాడు. ‘ది ప్యారడైజ్’ మూవీ ఆగస్ట్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. Nani Anna,Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.I broke your every rule of cinema.I broke your working days pattern...I broke your release date… pic.twitter.com/p7Z1pFKrx8— Srikanth Odela (@odela_srikanth) February 24, 2026 -
నాని- సుజీత్ కొత్త సినిమా టైటిల్ ఇదే (వీడియో)
టాలీవుడ్ నటుడు నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. రీసెంట్గా ఓజీతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు సుజీత్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్ను ఫిక్స్ చేసి ఒక వీడియోను విడుదల చేశారు. వీడు నంబర్ వన్ చెఫ్ కాదు.. గ్యాంగ్స్టర్ అంటూ నాని పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు. తన తొలి సినిమా ‘రన్ రాజా రన్’ స్టైల్లో ఈ మూవీ ఉంటుందని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనిమస్ ప్రొడక్షన్స్పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు.‘ది ప్యారడైజ్’ సినిమా పూర్తికాగానే బ్లడీ రోమియో సినిమా పట్టాలెక్కనుంది. ఇది తన మార్క్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో సుజీత్ చెప్పారు. డార్క్ హ్యూమర్తో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా క్లిష్టతరంగా ఉండనుందంటూనే సాంకేతికంగా మరోస్ధాయికి చేరుకుంటుందన్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూరప్లో చిత్రీకరణ చేసుకోనుందని క్లారిటీ ఇచ్చారు. -
మత రాజకీయాలు చెల్లవు.. కరూర్ ఘటనకు కారణం తెలుసు : విజయ్
తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజిల్ గుర్తు విప్లవం సృష్టించడం ఖాయమని టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ పిలిపునిచ్చారు. ఆపై కరూర్ ఘటన గురించి విజయ్ మాట్లాడారు. మనఃసాక్షి లేకుండా కరూరు ఘటనలో తనపై నిందలు వేశారని, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అందరికీ తెలుసునని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో ఆయన కొంత సేపు ప్రసంగాన్ని ఆపేసి మౌనంగా ఉండటంతో కార్యకర్తలు తలైవా.... తలైవా... అంటూ నినాదాలు చేశారు. అనంతరం క్షమాపణలు చెప్పుకుంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. మతాలకు అతీతంగా తమ పార్టీ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కొంత మంది మతాలను అడుపెట్టుకొని ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని చూస్తుంటారన్నారు. ఇక్కడ కొంత మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఉంటేనే మంచిదని హితవు పలికారు. -
ఎవరూ పట్టించుకోలేదు.. అంజలి వీడియో వైరల్
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అర్జున్, మమ్ముట్టి, కాజల్, సాయిపల్లవి, అంజలి, నివేదా థామస్ వంటి స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న అంజలికి ఆ కార్యక్రమంలో ఇబ్బందికరమైన అనుభవం ఎదురైందని తెలుస్తోంది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. అవార్డ్ అందుకునేందుకు కొచ్చి విమానాశ్రయంలో ఆమె దిగారు. అయితే, ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఫిల్మ్ఫేర్ యూనిట్ నుంచి ఎయిర్పోర్టుకు ఎవరూ రాలేదట. దాదాపు ఆమె 40 నిమిషాల పాటు వేచి ఉన్నారని తెలుస్తోంది. నిర్వాహకుల సమన్వయ లోపం పట్ల అంజలి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అంజలితో ఉన్న వ్యక్తి ఒకరు చెబుతున్న వీడియో వైరల్ అవుతుంది.సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela ) కూడా ఫిల్మ్ఫేర్ ఈవెంట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి రెండు అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఫిల్మ్ఫేర్ టీమ్ విఫలమైందని ఆమె తెలిపింది. తొలిసారి అవార్డ్స్ అందుకునేందుకు వచ్చిన వారిని స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం తనను చాలా బాధించిందని నిహారిక ఒక పోస్ట్ చేసింది. మొదటిసారి వేదికపై వచ్చిన వారికి కనీసం ఒక నిమిషమైన టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. తను నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఫిల్మ్ఫేర్లో ఉత్తమ పరిచయ దర్శకుడు (యదు వంశీ) ఉత్తమ పరిచయ నటుడు (సందీప్ సరోజ్) అవార్డ్స్ అందుకుంది. Actress #Anjali faced issue while heading to filmfare awards. After half an hour after arriving at the airport, the car did not come to pick her up.#FilmfareAward #Filmfare2026 pic.twitter.com/AjgdYQtF8S— Australian Telugu Films (@AuTelugu_Films) February 23, 2026 -
మణిరత్నం దర్శకత్వంలో సాయి పల్లవి.. హీరో ఎవరో తెలుసా?
తాజాగా కోలీవుడ్లో ఓ రేర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం గురించి పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అదే మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నటి సాయిపల్లవి జంటగా నటించబోతున్నారన్నది. ఇటీవల థగ్లైఫ్ చిత్రంతో అపజయాన్ని పొందిన మణిరత్నం తాజాగా ఒక ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కాగా ఇందులో నటుడు ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటుడు విజయ్సేతుపతి, నటి సాయిపల్లవి నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మెడ్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించనున్నుట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం నటుడు విజయ్సేతుపతి మార్కెట్ నావల్ అనే చిత్రంలోనూ, నటి సాయిపల్లవి రామాయణ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరిద్దరూ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్దం అవుతారని సమాచారం. కాగా నటి సాయిపల్లవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న విసయం తెలిసిందే. ఈమె తమిళంలో ధనుష్కు జంటగా ఒక చిత్రంలో నటించనున్నారు. అదే విధంగా తెలుగులోనూ కొత్త చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక నటుడు విజయ్సేతుపతి చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. అలాంటిది త్వరలో మణిరత్నం దర్శకత్వంలో ఈ క్రేజీ జంట నటించబోవడం విశేషమే అవుతుంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. -
ఫ్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. మొదలైన కల్కి
ప్రభాస్- దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీకి సీక్వెల్గా ‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్ మొదలైంది.‘కల్కి 2898 ఏడీ 2’ షూటింగ్లో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మార్చి మొదటివారంలో ప్రభాస్ కూడా ఈ చిత్రీకరణలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. అయితే, కమల్హాసన్ మార్చి తర్వాత సెట్లోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఇక్కడ దాదాపు నెల రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ కర్ణ, భైరవ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అశ్వత్థామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్గా కమల్ నటిస్తున్నారు. అయితే, పార్ట్-1లో దీపిక పదుకొణె చేసిన సుమతి పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రకటన రావాల్సి ఉంది. -
రుబరూ రెడీ
అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జోడీగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ యాక్షన్ లవ్స్టోరీతో కెమెరామెన్ షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని ‘రుబరూ...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.‘‘డెకాయిట్’ మూవీ కథాంశం ప్రధానంగా యాక్షన్ చుట్టూ తిరిగినప్పటికీ ‘రుబారూ..’ సాంగ్ మాత్రం మంచి ఎమోషనల్ టచ్తో కొత్త ఫీల్ని ఇస్తుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీని హైలెట్ చేస్తూ, వారి జర్నీని ప్రజెంట్ చేసే పాట ఇది’’ అని యూనిట్ పేర్కొంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించి ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. -
బ్యాక్ టు హైదరాబాద్
జోర్డాన్ నుంచి ‘డ్రాగన్ ’ మూవీ టీమ్ తిరిగొచ్చింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మలయాళ నటుడు టొవినో థామస్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల జోర్డాన్ లో మొదలైన ‘డ్రాగన్ ’ షెడ్యూల్ ముగిసింది.దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ అండ్ టీమ్ హైదరాబాద్ చేరుకున్నారు. జోర్డాన్ లో ప్రధానంగా రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. అయితే తదుపరి షూటింగ్ షెడ్యూల్ కోసం టీమ్ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదట. ఈ నెలాఖరులోనే హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ప్రారంభం కానుందట. ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటారని ఫిల్మ్నగర్ సమాచారం. ‘డ్రాగన్ ’ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. -
చరిత్ర సృష్టించిన బూంగ్
భారతీయ చిత్రం ‘బూంగ్’ చరిత్ర సృష్టించింది. లండన్ లో జరిగిన 79వ ‘బాఫ్టా’ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల ప్రదానోత్సవంలో ‘బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ విభాగంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే ‘బాఫ్టా’లో తొలి అవార్డు సాధించిన మణిపుర్ సినిమా కూడా ఇదే. ఈ విభాగంలో ‘జూటోపియా 2’, ‘లిలో – స్టిచ్’, ‘ఆర్కో’ వంటి హాలీవుడ్ చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నప్పటికీ ‘బూంగ్’ అవార్డును గెలుచుకోవడం విశేషం.బూంగ్ కథ ఏంటంటే...గుగున్ కిప్జెన్ టైటిల్ రోల్లో, బాలా హిజామ్ కీలక పాత్రలో నటించిన మణిçపుర్ చిత్రం ‘బూంగ్’. లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఫర్హాన్ అక్తర్, వికేష్ భూతాని, అలాన్ మెక్ అలెక్స్, రితేష్ సిధ్వాని, షుజాత్ వ్యాపారి నిర్మించారు. ఈ సినిమాని 2024లో కెనడాలో జరిగిన 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి ప్రదర్శించారు. 2025 సెప్టెంబరు 19న ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేశారు. తన తల్లిదండ్రులు మందాకిని, జాయ్కుమార్లను కలిపేందుకు బూంగ్ అనే పాఠశాల విద్యార్థి తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు వరకు చేసిన సాహసోపేతమైన భావోద్వేగ ప్రయాణంతో ఈ మూవీ సాగుతుంది. మణిపుర్లో శాంతి నెలకొనాలి: లక్ష్మీప్రియా దేవి ‘బాఫ్టా’ అవార్డు స్వీకరించిన అనంతరం భావోద్వేగంతో మాట్లాడారు లక్ష్మీప్రియా. ‘‘మేం ఎంతో కష్టపడుతూ ఓ పర్వతం ఎక్కుతున్నది ఫస్ట్ ప్లేస్ కోసమని మేం ఈ వేదికపైకి వచ్చాక అర్థం అయింది. మా చిన్న సినిమాపై ఇంతటి ప్రేమను వ్యక్తం చేసిన జ్యూరీ సభ్యులకు, బాఫ్టాకు థ్యాంక్స్. భారతదేశంలోని మణిçపుర్ నా మాతృభూమి. అక్కడ తిరిగి శాంతి నెలకొనాలని దేవుణ్ణిప్రార్థిస్తున్నానని చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా, మణిపూర్లోని పిల్లలందరూ వారి ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ప్రధాని మోదీ ప్రశంస‘‘బూంగ్’ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఆనందమైన క్షణాలు ఇవి. ముఖ్యంగా మణిపూర్కు. అలాగే దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభ హైలైట్ అవుతుంది’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోది ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అలాగే పలువురు భారత సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఆలియా సందడి‘బాఫ్టా’ అవార్డ్స్లో బాలీవుడ్ నటి ఆలియా భట్ సందడి చేశారు. ‘బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్’ విభాగంలో ‘సెంటిమెంటల్ వేల్యూ’ యూనిట్కు అవార్డు అందించారు. ఈ అవార్డ్స్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా బెస్ట్ ఫిల్మ్గా నిలవడంతో పాటు అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర దర్శకుడు పాల్థామస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. రాబర్ట్ అరమాయో (ఐ స్వయిర్ సినిమాకు) ఉత్తమ నటుడిగా నిలవగా, జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచి (‘హామ్నెట్’ చిత్రానికిగాను).. బాఫ్టా లీడ్ యాక్ట్రస్ అవార్డు గెలుచుకున్న తొలి ఐరిస్ మహిళగా రికార్డు సాధించారు. -
సెలబ్రేషన్స్కు రెడీ.. విజయ్- రష్మిక పెళ్లి సందడి షురూ..!
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అఫీషియల్గా తన పెళ్లిని అనౌన్స్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే విరోష్ జంట ఒక్కటి కానుందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ గ్రాండ్ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ఉదయపూర్లో మెహందీ వేడుకతో రష్మిక-విజయ్ పెళ్లి సందడి మొదలు కానుంది.ఆ తర్వాత ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ సందడి కొనసాగనుంది. ఈ వేడుకలు ఉదయపూర్లోని విలాసవంతమైన ఐటీసీ మెమెంటోస్ జరుగుతాయి. ఈ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొననున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది. విజయ్ - రష్మిక వారి కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సోమవారం ఉదయమే ఉదయ్పూర్ చేరుకున్నారు. కొన్నేళ్లుగా తమ రిలేషన్ను సీక్రెట్గా కొనసాగించిన ఈ జంట చివరికీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ దేవరకొండనే స్వయంగా తన పెళ్లిని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వివాహం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. -
రియల్ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం కాక్రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు. -
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. ఈ చిత్రం తాజాగా బాప్టా అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. గతేడాది సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ గతంలో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లోనూ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డులకు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 13 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే వంటి కీలక విభాగాలలో నామినేట్ అయింది. View this post on Instagram A post shared by JioHotstar International (@jiohotstarinternational) -
Ram Charan: మళ్లీ బుచ్చిబాబుతోనే..!
-
రాధిక శరత్కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్.. పెళ్లిపై విజయ్ ఎమోషనల్
-
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్ తర్వాత సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026 -
'అతన్ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు'.. డైరెక్టర్కు స్ట్రాంగ్ కౌంటర్
సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం ఈ మూవీపై విమర్శలు చేశారు. కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో ఆయన మాట్లాడారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్తా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో ది కేరళ స్టోరీ-2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ స్పందించారు. అనురాగ్కు అన్నింటితో సమస్యలేనని కామాఖ్య నారాయణ ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదేమోనని అన్నారు.కామాఖ్య నారాయణ్ మాట్లాడుతూ..'బహుశా అనురాగ్ మానసిక పరిస్థితి బాగాలేదనుకుంటున్నా. ఆయనకు అన్నింటితో సమస్యే. సమాజంలో ఒక వర్గం ప్రజలతో.. నెట్ఫ్లిక్స్తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీతోనూ ఆయనకు ఇబ్బందులే. అనురాగ్ తాను తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సన్నివేశాలను చూపించారు. ఈ ఆధునిక సమాజంలో ఊహకు కూడా అందని వాటిని కూడా చిత్రీకరించారు. ప్రేక్షకులు ఆయన మాటలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని' అన్నారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రవితేజ నా డాన్స్ క్లాస్ మెట్.. సూపర్ జర్నీ నాది
-
విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి తొలిసారి స్పందించారు. తమ బంధం గురించి అభిమానులు పెట్టిన 'విరోష్' పేరును గౌరవిస్తున్నట్లు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ తమలో ఒక భాగం అంటూ.. వారి కోరిక మేరకు పెళ్లి కార్యక్రమానికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, వారిద్దరి వయసు గురించి కొందరు కామెంట్లు చేస్తుండగా... అభిమానులే కౌంటర్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ లేదనే విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ (36), రష్మిక(30)ల మధ్య సుమారు ఆరేళ్ల గ్యాప్ ఉంది. విజయ్ 1989లో జన్మించగా.. రష్మిక 1996లో జన్మించారు. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే పెద్దగా ఏజ్ గ్యాప్ కనిపించదు. దీంతో వారిద్దరిది సరైన జోడీ అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి సుమారు రూ. 80 కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. తను ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. రష్మికకు సంబంధించి సుమారు రూ. 70 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తను ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.గీత గోవిందం మూవీతో పరిచయమైన ఈ జోడీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆపై ‘డియర్ కామ్రేడ్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పుడు వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వారి వివాహానికి వేదిక కానుంది. హైదరాబాద్లో మార్చి 4న వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరగనుంది. -
హీరోయిన్ కోసం ప్రభాస్ స్పెషల్ ట్రీట్
డార్లింగ్ ప్రభాస్ భోజనప్రియుడు. ఇంటి భోజనాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. తను తినడమే కాదు చుట్టూ ఉన్నవారికి సైతం ఫుడ్డు పెట్టి చంపేస్తాడు. ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే ఇంటి నుంచి తెప్పించి మరీ తోటి నటీనటులకు, చిత్రయూనిట్కు భోజనం తినిపిస్తాడు. కొన్నిసార్లు అందరి కోసం ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాడు. అలా ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా చెన్నై నుంచి ముంబైకి భోజనం తెప్పించాడు.హీరోయిన్ కోసం స్పెషల్ ఫుడ్తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వికి ఇలాగే ఫుడ్ ట్రీట్ ఇచ్చాడు. స్టార్టర్ దగ్గరినుంచి బిర్యానీ, స్వీట్స్ వరకు.. అన్నింటినీ పార్శిల్ చేసి పంపించాడు. వాటిన్నింటినీ టేబుల్ ముందు పెట్టుకున్న ఇమాన్వి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇంత రుచికరమైన భోజనం పంపింనందుకు ప్రభాస్కు కృతజ్ఞతలు చెప్పింది.సినిమాఫౌజీ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 దసరాకి విడుదల కానుంది.చదవండి: బాఫ్టా అవార్డులు.. తొలిసారి భారత్ మూవీకి అవార్డ్ -
అజిత్ను కలిసిన మంజువారియర్
నటుడు అజిత్ ఇప్పుడు కార్ రేస్లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొన్న ఈయన త్వరలో మరో కార్ రేస్లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం దుబాయ్లో శిక్షణ తీసుకుంటున్న అజిత్ను ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మంజువారియర్ అజిత్ను కలిశారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ మలయాళ సంచలన నటి ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత అజిత్ హీరోగా నటించిన తుణివు చిత్రంలో నాయకిగా నటించారు. అదేవిధంగా రజనీకాంత్కు జంటగా వేట్టయన్ చిత్రంలోనూ నటించారు. ప్రస్తుతం మిస్టర్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. అజిత్ ఇంతకు ముందు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. త్వరలో తన నూతన చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో మోహన్లాల్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా క్రేజీ స్టార్ శ్రీలీల ఈ చిత్రంలో నటింనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో మంజువారియర్ మరో ముఖ్యపాత్రలో నటించనున్నారా? అనే ప్రశ్నకు తావిచ్చే విధంగా ఆమె అజిత్ను కలసిని సంఘటన చెబుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అజిత్ నటించనున్న 64వ చిత్రం ఆయన ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా చాలా ఫ్రెష్గా ఉంటుందని దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ పేర్కొన్నారు. -
ధోతీ-స్టైల్లో స్టార్ హీరోయిన్.. డ్రెస్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మారథాన్లో సందడిగా కనిపించింది. ఆపై తన కొత్త సినిమా ది బ్లఫ్ ప్రెస్ టూర్లో పాల్గొని అందరి చూపు తనవైపు తిప్పుకుంది. హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ది బ్లప్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా ఒక సముద్రపు దొంగ పాత్రలో నటించింది. క్రూరమైన హింసాత్మక గతాన్ని వదిలేసి తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే ఒక మహిళ చేసే పోరాటమే ఈ సినిమా అసలు కథ.ది బ్లఫ్ మూవీ ప్రెస్ టూర్లో సరికొత్త డ్రెస్లో ప్రియాంక చోప్రా పాల్గొంది. ఖరీదైన ధోతీ-స్టైల్ దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ దుస్తులను జిమ్మెర్మాన్ బ్రాండ్ నుండి తయారు చేశారు. లూనా డ్రేప్డ్ హరేమ్ ప్యాంట్స్ ధర రూ. 1.43 లక్షలు, కోఆర్డినేటింగ్ సిల్క్ శాటిన్ షిఫాన్ టాప్ ధర రూ.77వేలు. మొత్తం ధర సుమారు రూ. 2.20 లక్షలు అని తెలుస్తోంది. లో-బ్యాక్ డిజైన్తో చేసిన ఈ ధోతీ డ్రెస్ చాలామందిని ఆకట్టుకుంది.రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఇందులో ప్రియాంక చోప్రా మందాకిని అనే ప్రధాన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. వారణాసి మూవీతో హాలీవుడ్ నుంచి ఆమె తిరిగి ఇండియన్ సినిమాకు వస్తుంది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రియాంక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
చిరంజీవికి సన్మానం.. గ్రాండ్ పార్టీలో సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకరవరప్రసాద్గారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయాన్ని అందుకున్న చిరంజీవి, చిత్ర యూనిట్ను కాకినాడ పోర్ట్ ఛైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లో జరిగిన ఈ పార్టీలో చిత్ర నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటితోపాటు, దర్శకుడు అనిల్ రావిపూడి, కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వి.వి.వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయడు తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. Blockbuster celebrations continue for #MSG ✨Megastar #Chiranjeevi garu was felicitated at an exclusive gathering hosted by Shri K.V Rao, attended by eminent personalities including K. Raghavendra Rao, Ashwini Dutt, Anil Ravipudi, Bobby Kolli and several distinguished guests. pic.twitter.com/TP4gfApmg3— Ravanam Swami naidu (@swaminaidu_r) February 22, 2026 -
ఆరా ఆఫ్ ఉస్తాద్
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్సింగ్’. శ్రీలీల, రాశీ ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’పాట లిరికల్ వీడియో లాంచ్ ఈవెంట్ను యూనిట్ నిర్వహించింది.ఈ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్గారి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘గబ్బర్ సింగ్’ సినిమాలోని ‘ఆకాశం అమ్మాయైతే..’పాటకు నేను, దేవీ, హరీష్గార్లు కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు మళ్లీ ఈపాటతో మీ ముందుకు వచ్చాం’’ అని తెలి΄ారు చంద్రబోస్. ‘‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ నాకు ప్రత్యేకమైనపాట. మైత్రీ మూవీ మేకర్స్ నా హోమ్ బ్యానర్ వంటిది. ఈ నిర్మాతలకు సినిమా అంటే ఎంతో తపన’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. -
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్స్టాగ్రామ్లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్
పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి. -
రుక్మిణి వసంత్ స్టైల్.. కాజల్ అగర్వాల్ అదే గ్లామర్
ముద్దుగా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్వయసు పెరుగుతున్నా అదే గ్లామర్తో కాజల్పార్టీలో చిల్ అయిపోతున్న 'ధురంధర్' ఆయేషాచీరలో అందంగా మాయ చేస్తున్న శ్రీలీలజపాన్ ట్రిప్ వేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్అల్లు వారి పార్టీలో మిహీక-శ్రీలీల చిల్ మోడ్ View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
'ది కేరళ స్టోరీ-2' డబ్బు కోసం చిచ్చు పెడుతున్నారు: ప్రముఖ దర్శకుడు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వివాదస్పదంగా మారింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు.ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)కథేంటి?తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్) -
‘జై బోలో తెలంగాణ’ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
మీరా నందన్.. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ, 'జై బోలో తెలంగాణ' హీరోయిన్ అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. 2011లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో తెలంగాణ యువకుడిని ప్రేమించే ఆంధ్రా అమ్మాయిగా మీనా నందన్ నటించి, మెప్పించింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఆ సినిమా రిలీజ్ తర్వాత మీరా నందన్కి వరుస అవకాశాలు వచ్చాయి. మీరా నందన్ మాత్రం చాలా సెలక్టివ్గా సినిమాలు చేసింది.కొన్నాళ్ల తర్వాత మలాయళంలో కొన్ని టీవీ షోస్ కూడా చేసింది. సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్గానూ చేసింది.2008లో ‘ముల్లా’ అనే మూవీతో హీరోయన్గా మారింది. ‘వాల్మీకి’ అనే సినిమాతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత తమిళ్లో వరుస అవకాశాలు వచ్చాయి. 'జై బోలో తెలంగాణ' తర్వాత తెలుగులోనూ వరుస చాన్స్లు వచ్చాయి. కానీ మీరానందన్ ఆసక్తి చూపించలేదు. అంతేకాదు కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే 2014లో 2024లో తన బాయ్ఫ్రెండ్, అకౌంటెంట్ శ్రీజుని వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చి, తన మకాంను దుబాయ్కి మార్చింది. ప్రస్తుతం ఆమె అక్కడ ఒక ప్రముఖ మలయాళ రేడియో స్టేషన్లో రేడియో జాకీ పనిచేస్తున్నారు. రేడియో రంగంపై ఉన్న ఆసక్తితోనే ఆమె సినిమాలను పక్కన పెట్టి ఈ వృత్తిని ఎంచుకున్నట్లు సమాచారం.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ట్రావెల్ ఫోటోలను, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినా, తనదైన శైలిలో అభిమానులకు చేరువగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Meera Nandhaa (@nandan_meera) -
సమంత నుంచి సర్ప్రైజ్.. పోస్ట్ వైరల్
సమంత.. టాలీవుడ్లో ఈ పేరు వినిపించి చాలాకాలమైపోయింది. ఆరేడేళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసి హీరోయిన్గా స్టార్డమ్ అనుభవించిన ఈమె.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో పూర్తిగా మూవీస్ చేయడం తగ్గించేసింది. మూడేళ్ల క్రితం అంటే 2023లో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చేసింది. ఇదేం పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.నటిగా అలరించిన సమంత.. ట్రలాలా పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించింది. 'శుభం' అనే సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈమెనే నిర్మాత కమ్ లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ చిత్రం ఒకటుందని ఆడియెన్స్కి గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి అందరికీ సామ్.. సర్ప్రైజ్ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్.. పాతిరాత్రి రివ్యూ)నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చాన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న సామ్.. 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్లలో ఒకటైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. అయితే గతేడాది వీళ్ల ప్రేమ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సామ్ ఏమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో అనుకుంటే.. 'మా ఇంటి బంగారం' సినిమాని రెడీ చేసింది.నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. ఓ సంప్రదాయ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. అలానే ఆపద వచ్చినప్పుడు యాక్షన్తో అదరగొట్టే పాత్రలోనూ కనిపించనుండటం విశేషం. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన టీజర్తో స్టోరీ ఏంటో చూచాయిగా క్లారిటీ వచ్చింది. ట్రైలర్ వస్తే అసలు కథేంటో తెలుస్తుంది. మరి ఈ మూవీతో సమంత కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్
పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్ఫేర్కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్ను హద్దుల్లేని నా అభిమానుల ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.కాగా..కేరళలోని కొచ్చిన్లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో ఐకాన్స్టార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. Thank you, Filmfare, for this wonderful honour. It’s my absolute pleasure to receive it in a land where I am loved in such a unique way. I’m humbled by everyone’s blessings, and I dedicate this award to all my fans for their infinite love. 🖤 pic.twitter.com/EYPdC9BJl9— Allu Arjun (@alluarjun) February 22, 2026 -
కుర్రాడైనా ఓకే.. రొమాన్స్కి రెడీ అంటున్న నడివయసు హీరోయిన్లు
పెద్ద వయసు హీరోలు, పిన్న వయసు హీరోయిన్లు అనేది మన దేశ సినీ తెరపై కనిపించడం అత్యంత సర్వసాధారణ విషయం. అయితే తనకన్నా చిన్న వయసు హీరోతో పెద్ద వయసు హీరోయిన్ నటించడం, రొమాంటిక్ సీన్లను పండించడం అనేది చాలా అరుదు. హాలీవుడ్ చిత్రాల్లో బాగా పాప్యులరైన ఈ తరహా స్క్రీన్ రొమాన్స్ ఇటీవలి కాలంలో మన సినిమాల్లోనూ తరచు కనిపిస్తోంది. కనిపించినప్పుడల్లా కొంత చర్చనీయాంశంగా, వార్తాంశంగా మారుతున్నప్పటికీ నడివయసు హీరోయిన్స్ పట్టించుకోవడం లేదు.తమకన్నా 10 నుంచి– 25 ఏళ్ల వరకు తక్కువ ఉన్న వయసున్న హీరోలతో తెరపై జత కడుతున్నారు. అభిషేక్ బచ్చన్ భార్య, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కన్నా 9ఏళ్లు చిన్నవాడైన రణ్బీర్ కపూర్ తో ఏ దిల్ హై ముష్కిల్ అంటూ రొమాన్స్ చేసింది. అయితే ఈ సినిమా కవి హదయాన్ని ప్రేక్షకులు అర్ధం చేసుకున్నారు కానీ బచ్చన్ కుటుంబం మాత్రం దీన్ని జీర్ణించుకోవడం బహుత్ ముష్కిల్ అంటూ ఆక్షేపించిందని వార్తలు వచ్చాయి.సైఫ్ అలీఖాన్ శ్రీమతి కపూర్ వంశ వారసురాలు కరీనా కపూర్ కి అండ్ కా అనే సినిమాలో అర్జున్ కపూర్తో పండించిన డేరింగ్ రొమాన్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. అర్జున్ కపూర్ ఆమె కన్నా 20ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం. అలాగే బ్రదర్స్ సినిమాలోనూ తనకన్నా 10ఏళ్ల చిన్నవాడైన సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీ కట్టడం ద్వారా కరీనా అలాంటి సాహసాలకు తాను వెనుకాడేది లేదని తేల్చి చెప్పింది.టాలీవుడ్ ప్రిన్స్తో కలిసి వారణాసి ద్వారా టాలీవుడ్కి వస్తున్న ప్రియాంక చోప్రా తన కన్నా నాలుగేళ్లు చిన్నవాళ్లయిన హీరో రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ ఇద్దరితోనూ వేర్వేరు సినిమాల్లో సందడి చేసింది. ఇలా 5ఏళ్ల లోపు చిన్నవాళ్లతో నటించిన వారిలో రాణిముఖర్జీ(షాహిద్ కపూర్తో) శృతిహాసన్(గిరీష్ కుమార్తో) కొంకణా సేన్ శర్మ(రణబీర్ కపూర్తో)...ఇలా జాబితా ఎక్కువగానే ఉంది.వీళ్లందరూ ఒకెత్తయితే ఫిఫ్టీ ప్లస్ లో కూడా సింగిల్గా ఉంటూ ప్రేక్షకులను తరగని గ్లామర్తో కట్టిపడేస్తున్న టబు తన కన్నా వయసులో ఏకంగా పాతికేళ్లు చిన్నవాడైన ఇషాన్ ఖట్టర్తో రొమాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమెకు అతడు ‘ సూటబుల్ బాయ్’ అనే దర్శక నిర్మాతల అభిప్రాయం ఎలా ఉన్నా ఈ సినిమా విమర్శకుల నోళ్లకు బాగానే పనిచెప్పింది.వృద్ధ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లను చూపడానికి, చూడడానికి అలవాటు పడింది దక్షిణాది చిత్ర పరిశ్రమ. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ వయస్కుడైన హీరో తో హీరోయిన్లు నటించడం వరకూ కొంచెం మార్పు కనిపిస్తోంది. ఇక తమకన్నా వయసులో బాగా చిన్నవారి పక్కన నటించడం అనేది మన సౌత్లో ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.పెళ్లికైనా, ప్రేమకైనా మగవాళ్ల వయసు మహిళల కన్నా ఎక్కువ ఉండాలనే సంప్రదాయం నుంచే సినిమా పాత్రలు కూడా పురుడు పోసుకున్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న సామాజిక పరిస్థితులతో పాటు సినిమా పాత్రల తీరుతెన్నులు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మరోవైపు నడివయసులోనూ యువతులకు థీటుగా గ్లామరస్గా కనిపించే హీరోయిన్లు పెరగడం కూడా దీనికి దోహదం చేస్తోంది. -
'సెట్లో అందరూ చూస్తుండగా దారుణంగా'.. సౌత్పై తాప్సీ బోల్డ్ కామెంట్స్
హీరోయిన్ తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా అస్సీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా తాప్సీ పన్ను ప్రమోషన్స్కు హాజరైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది ముద్దుగుమ్మ. సౌత్లో షూటింగ్ సమయంలో ప్యాడెడ్ బ్రా వేసుకోమని చెప్పేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది. షూట్లో అందరి ముందూ అలాంటి మాటలు చెప్తే ఎలా అసౌకర్యంగా ఉంటాయో ఒక మహిళగా నాకు తెలుసన్నారు. ఏదైనా సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు అందరూ గమనిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందోనని ఓపెన్గా మాట్లాడింది. తాజాగా తాప్సీ చేసిన కామెంట్స్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.నాభిపైనే మోజుఎందుకు..?అంతేకాకుండా సౌత్ సినిమాల్లో పాటల్లో నాభిపై అంతగా మోజు ఎందుకని తాప్సీ ప్రశ్నించింది. అసలు అక్కడే ఎందుకు ఫోకస్ పెడతారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. హిందీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్లో నాభిపై ఫోకస్ ఉండదని నేను చెప్పడం లేదు.. కానీ సౌత్ సినిమాల్లో ఉన్నంతగా మాత్రం ఉండదని తాప్సీ తన మనసులో మాటను బయటపెట్టేసింది.కాగా.. గతంలో కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, కొబ్బరికాయలు వేసే సంప్రదాయంపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్తో వార్తల్లో నిలిచింది ముద్దుగుమ్మ.తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన అస్సీ ఫిబ్రవరి 20న విడుదలైంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్రూమ్ డ్రామాను థియేటర్స్లో చూడాలని ఆమె కోరింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించగా.. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కనిపించింది.Opens Up About an Embarrassing On-Set ExperienceIn the South, they often asked me to wear a padded bra. It was embarrassing during song shoots when everyone noticed the difference.:- Actress #TaapseePannu#ASSIMoviepic.twitter.com/cWNFXiusRC— Milagro Movies (@MilagroMovies) February 22, 2026 -
మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా: రకుల్ ప్రీత్ సింగ్
పద్దెనిమిది ఏళ్లకే కన్నడ సినిమా గిల్లి ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ సరసన ధృవ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా కన్నడ, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది.సినిమాలతో బిజీగా ఉండగానే 2024లో తను ప్రేమించిన జాక్కీ భగ్నానీని పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి వేడుక గోవాలో గ్రాండ్గా జరిగింది. తాజాగా వీరి పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తి కావడంతో భర్తకు విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. తన భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. నేను కలలు కన్నదంతా నీకోసమేనని ట్వీట్లో రాసుకొచ్చింది. తన భర్తకు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి వీడియోను షేర్ చేసింది. రకుల్ తన ట్వీట్లో రాస్తూ..'నా జీవిత భాగస్వామికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను కలలు కన్నది నీకోసమే. నీతో ఉండటం నాకు ఒక ఇల్లులా అనిపిస్తుంది. నువ్వే నా ఓదార్పు, నా ప్రాణ స్నేహితుడు.. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తి. నువ్వు చూపించే ఉత్సాహం, అభిరుచి గురించి నేను చాలా గర్వపడుతున్నా. నీ దయ, బలం ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తాయి. నా జీవితాన్ని నవ్వు, ప్రేమ, సాహసంతో నింపినందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా సంవత్సరాలు కలిసి అందమైన జ్ఞాపకాలను మనం సృష్టించుకోవాలి. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు మ్యారేజ్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది దేదే ప్యార్ దే-2, మేరే హస్బెండ్ కీ బీవీ చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం రామాయణ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. Happy 2nd anniversary to the love of my life @jackkybhagnani ! ❤️❤️You are everything I ever dreamt of and more. Being with you feels like home; you are my comfort, my best friend, and the most gentle person I know. I am so proud of the man you are and the drive and passion with… pic.twitter.com/vn0p4onxtT— Rakul Singh (@Rakulpreet) February 21, 2026 -
'అందుకే బాలీవుడ్ వదిలేయాల్సి వచ్చింది.. కానీ'.. వారణాసి బ్యూటీ
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్లో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్ మూవీ కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం ది బ్లఫ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆమె నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ది బ్లఫ్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక హాలీవుడ్కి వెళ్లడంపై మాట్లాడింది. నేను బాలీవుడ్ను వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగానే ఫీలయ్యానని పేర్కొంది. అందువల్లే హాలీవుడ్లో అడుగుపెట్టాల్సి వచ్చిదంని వెల్లడించింది. ఇండియన్ సినిమాల్లో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని.. వారణాసిలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా తెలిపింది.ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..' నేను హిందీ చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు చాలా కారణాల వల్ల పరిమితంగా భావించా. నా కెరీర్ మరింత విస్తరించాలనుకున్నా. అందుకే హాలీవుడ్లో పనిచేశా. కానీ బాలీవుడ్ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. పరిమితమైన అవకాశాలే రావడంతో ప్రాజెక్టుల విషయంలో కొంత ఒత్తిడికి గురయ్యా. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్లోకి అడుగుపెట్టా. నాకు భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు రాజమౌళి సార్తో వారణాసి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది. -
ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..తెలుగులో అత్యధికంగా ఈ సినిమాకే..!
సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కేరళలో అట్టహాసంగా ప్రారంభమైంది. 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం కొచ్చిలో జరిగింది. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప-2) అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ విభాగంలో తేజ సజ్జా(హనుమాన్) అవార్డ్ స్వీకరించారు. అదే ఏడాదికిగానూ ఉత్తమనటిగా నివేదా థామస్(35-చిన్న కథ కాదు) అవార్డ్ అందుకుంది. 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలవగా.. సుకుమార్కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఈ వేడుకను కేరళ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విత్ కేరళ టూరిజం పేరుతో కొచ్చిలోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరిగింది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన సినీ తారలకు అవార్డులు అందించారు. Winners selfie 🤩Allu Arjun and Teja Sajja capture a special moment together after their big win at the #70thFilmfareAwardsSouthwithKeralaTourism.❤️Destination Partner: @KeralaTourism Special Partner: @KamarFilmfactry Co-Powered By: @TTKPRESTIGELTD sensodentk.india… pic.twitter.com/LVPMYwYbFF— Filmfare (@filmfare) February 21, 202670వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతల పూర్తి జాబితా(తెలుగు)ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజా సజ్జా (హను-మాన్)ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ సహాయనటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ యాక్టర్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ అండ్ మోనిక (పుష్ప 2)ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం) -
'కుడి కన్ను ఫోకస్ చేయమని చెప్పింది.. ఆ సీన్ చేశాక షాకయ్యా'
హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్కుమార్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం సరస్వతి. ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తన కూతురి కోసం ఈ క్రూరమైన ప్రపంచానికి ఎలా ఎదుర్కొందన్న కాన్సెప్ట్తో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. నటి వరలక్ష్మీ శరత్కుమార్ గురించి మాట్లాడారు. సావిత్రి, ఊర్వశి శారద లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ అని కొనియాడారు. క్రాక్ మూవీలో జయమ్మ క్యారెక్టర్ చూసి ఇలా ఉంటుందా అని.. మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ వాళ్లంతా కూడా షాకయ్యారని వెల్లడించారు. ఆ సీన్ చేసే సమయంలో ఒక చిన్న ఎక్స్ప్రేషన్ ఉందని వరలక్ష్మీకి చెప్పానని తెలిపారు. వెంటనే ఆమె కుడి కన్నుకు కెమెరా పెట్టండని నాతో చెప్పింది.. ఆ షాట్ చెప్పగానే ఆమె కుడి కంటి నుంచి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేశాయని గోపిచంద్ అన్నారు. అది చూసి నేను కూడా షాకయ్యానని వెల్లడించారు. అంతా ఎక్స్ట్రార్డినరీ ఫర్మామెన్స్ వరలక్ష్మీదేనని ప్రశంసించారు. అంతేకాకుండా బాలయ్యతో వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు నాలుగు పేజీల డైలాగ్స్ ఇచ్చామని గోపీచంద్ తెలిపారు. రెండున్నర్ర రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం.. కానీ మూడు గంటల్లోనే సీన్ అయిపోయిందన్నారు. ఈ సీన్ను సింగిల్ షాట్లోనే పూర్తి చేసిందని వరలక్ష్మీపై ప్రశంసలు కురిపించారు. వరలక్ష్మి పెర్ఫార్మెన్స్ చూసి ఊర్వశి శారద గారిని చూసినట్లు ఉందని బాలయ్య అన్నారని తెలిపారు. -
ప్రభాస్ ఆల్టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇటీవల కపుర్ ఫ్రెండ్లీ టీమ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్.కపుల్ ఫ్రెండ్లీ టీమ్కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ గురించి మాట్లాడారు. నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి అని తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే చిత్రమన్నారు.తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఫేమ్ తీసుకొచ్చింది. -
'ఇండియాకు రప్పించే వరకు నిద్రపోను'..అన్వేశ్కు స్ట్రాంగ్ వార్నింగ్
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేశ్కు నటి కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిన్ను ఇండియాకు రప్పించేవరకు తాను నిద్ర పోయేదని లేదన్నారు. మరో రెండు రోజుల్లో నీపై లుక్ అవుట్ నోటీసులు ఇప్పిస్తానని కరాటే కల్యాణి హెచ్చరించారు. ఇప్పటికే హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారంటూ సినీనటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ ఛానెల్ 'అన్వేషణ' అకౌంట్ బ్లాక్ వ్యవహారంపై కరాటే కల్యాణి స్పందించారు.ఇటీవల యూట్యూబర్ నా అన్వేశ్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ మెటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది. మన దేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో తన సోషల్ మీడియా అకౌంట్లలో అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పటికే పలువురి ఫిర్యాదులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించారు. వాటిల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కంటెంట్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై ఇన్స్టా మాతృ సంస్థ మెటాను సంప్రదించారు. అన్వేష్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.మెటా సైతం అన్వేష్ ఇన్స్టా అకౌంట్లను పరిశీలించింది. అనంతరం, అతడి అకౌంట్లపై నిషేదం విధించింది. గతంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది.అన్వేష్కు రెండు రోజుల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేయిస్తాం: కరాటే కల్యాణియూట్యూబ్ ఛానెల్ 'అన్వేషణ' అకౌంట్ బ్లాక్ వ్యవహారంపై కరాటే కల్యాణి ఘాటుగా స్పందించారు. 1.3 మిలియన్ల సబ్స్ట్రైబర్లు ఉన్న వ్యాపారాన్ని ఎవరూ వదులుకోరని, తప్పు ఒప్పుకుంటే అకౌంట్ పునరుద్ధరించవచ్చని పోలీసులు… pic.twitter.com/raJIVQUU5P— ChotaNews App (@ChotaNewsApp) February 21, 2026 -
ఫైట్ సెట్
శర్వానంద్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లోప్రారంభమైంది. ఓ భారీ సెట్లో శర్వానంద్ పాల్గొంటుండగా స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యేవరకు ఈ షూట్లోనే శర్వానంద్ పాల్గొంటారు. ‘‘1960 నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ సరికొత్త మేకోవర్లో కనిపిస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
అతనంటే విపరీతమైన క్రష్!
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమాయకపు ఆకాంక్షగా, ‘సరైనోడు’లో పవర్ఫుల్ ఎమ్మెల్యేగా మనల్ని మెప్పించిన ఈ మలయాళ కుట్టి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ రహస్యాలను ఇప్పుడు మనతో పంచుకుంటోంది క్యాథరిన్ ట్రెసా. ఆ విశేషాలు...⇒ చిన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అంటే విపరీతమైన క్రష్. ఆయన టీవీలో కనిపిస్తేనే అన్నం తినేదాన్నని అమ్మ ఇప్పటికీ ఆటపట్టిస్తుంది. అలా ఎందుకు చేసేదాన్నో ఇప్పటికీ నాకు మిస్టరీనే.⇒ నేను మలయాళీ క్రిస్టియన్ . పుట్టి పెరిగింది దుబాయ్లో. కాలేజీ రోజుల్లో బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాను. అక్కడే నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కన్నడ సినిమా ‘శంకర్ ఐపీఎస్’ అవకాశం నా కెరీర్కు కొత్త మలుపును ఇచ్చింది.⇒ సినిమాల్లోకి రాకముందు నేను ప్రొఫెషనల్ స్థాయిలో ఐస్ స్కేటింగ్ చేసేదాన్ని. మంచు మీద వేగంగా బ్యాలెన్ ్స చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వెకేషన్ కు వెళ్తే స్కేటింగ్ షూస్ నా బకెట్లిస్ట్లో తప్పకుండా ఉంటాయి.⇒ సంగీతం నాకు మెడిటేషన్ లాంటిది. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పియానో వాయిస్తాను. నేను క్వాలిఫైడ్ పియానిస్ట్ని.⇒ తెలుగులో ‘చమ్మక్ చల్లో’తో ఎంట్రీ ఇచ్చాను. కాని, నిజమైన బ్రేక్ ఇచ్చింది ‘ఇద్దరమ్మాయిలతో’. ‘సరైనోడు’లో ఎమ్మెల్యే పాత్ర నా ఆల్టైమ్ ఫేవరెట్.⇒ కేరళలో ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను ఏనుగుపై నుంచి కింద పడిపోయాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుంచి ఏనుగులంటే ప్రేమ ఉన్నా, వాటి దగ్గరికి వెళ్లాలంటే భయం.⇒ ఒక గంట ఖాళీ దొరికినా బిజినెస్ మ్యాగజైన్స్ చదువుతాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ వుమన్ గా మారేదాన్ని. నా ఆర్థిక నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను.⇒ పాత ఫొటోలను ఆల్బమ్స్గా చేసి దాచుకోవడం నా అలవాటు. డిజిటల్ యుగంలో ఉన్నా, ప్రింట్ ఫొటోలే నా సెంటిమెంట్.⇒ నా జీవితంలో అతిపెద్ద బాధ నా తమ్ముడు క్రిస్టోఫర్ మరణం. ఎనిమిదేళ్ల క్రితం తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ లోటు తీరనిది.⇒ స్వీట్స్ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా తాపేశ్వరం మడతకాజా, మైసూర్ పాక్. అలాగే ‘లిక్విడ్ డైట్’ మీద నాకు మంచి కంట్రోల్ ఉంది. బాడీని డీటాక్స్ చేయడానికి వారంలో ఒకరోజు కేవలం కొబ్బరి నీళ్లు, గ్రీన్ జ్యూస్లతోనే ఉంటాను. అదే నా గ్లామర్ రహస్యం.⇒ నా డ్రీమ్ మ్యాన్ పొడవుగా, ఫిట్గా ఉండాలి. ముఖ్యంగా మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి.⇒ గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటాను. అందుకే అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది. నా కెరీర్లో ఇంకా మంచి కామెడీ సినిమాలు చేయాలని ఉంది. -
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైన “మన శంకర వరప్రసాద్ గారు”
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. థియేటర్స్ రన్ విజయవంతమైన తర్వాత ఓటిటి ప్లాట్ఫారమ్లో కూడా ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధమైంది. జీ తెలుగు వారు ఈ ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 కి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జీ సంస్థ ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు. -
నానికి హీరోయిన్గా బోల్డ్ బ్యూటీ?
టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ప్రస్తుతం 'ప్యారడైజ్'తో బిజీగా ఉన్నాడు. మరోవైపు 'ఓజీ' సుజీత్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీని ప్రారంభించబోతున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని లైన్లో ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా మంచి ఫామ్లో ఉన్న నాని.. ఇప్పుడు ఓ బోల్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడట.(ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు)పలు హిందీ చిత్రాల్లో నటించిన తృప్తి దిమ్రికి.. సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' మూవీ ఓవర్నైట్ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో వరస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సందీప్ వంగా తీస్తున్న 'స్పిరిట్'లో ప్రభాస్కి జోడీగా చేస్తోంది. మరి మెయిన్ లీడ్ లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఇదలా ఉండగానే ఇప్పుడు నాని చేయబోయే ఓ మూవీ కోసం తృప్తిని హీరోయిన్గా అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తృప్తి.. టాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే కావొచ్చు.గత కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్పై దృష్టి పెట్టిన నాని.. అందుకు తగ్గట్లే బాలీవుడ్లో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'ప్యారడైజ్'లోనూ ఓ కీలక పాత్ర కోసం రాఘవ్ జ్యూయెల్ అనే నటుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తృప్తి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో?(ఇదీ చదవండి: 18 ఏళ్లప్పుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా) -
18 ఏళ్లప్పుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
'కేజీఎఫ్' పేరు చెప్పగానే ప్రశాంత్ నీల్, యష్తో పాటు రవి బస్రూర్ అనే పేరు కూడా కచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈయన ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. తర్వాత 'సలార్' పలు చిత్రాలకు సంగీతమందించి బాగానే పేరు తెచ్చుకున్నాడు. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ 'కల్ట్'. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. తాజాగా టీజర్ లాంచ్ జరగ్గా.. ఈ వేడుకలో పాల్గొన్న రవి బస్రూర్ తన గతం గురించి మరోసారి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.(ఇదీ చదవండి: గోల్డ్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్.. రవి బస్రూర్ ఎమోషనల్)'విశ్వక్ సేన్ ప్రవర్తనకు ఫిదా అయిపోయా. 25 ఏళ్లుగా సంగీతమందిస్తున్నాను. అందరూ నన్నే గుర్తిసే విశ్వక్.. నా జర్నీని గుర్తించారు. ఇతడి కోసం నేనెప్పుడూ ఉంటాను. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. రెండోసారి ఓ వ్యక్తి నన్ను కాపాడాడు. నాకు కీ బోర్డ్ కొనివ్వడంతో పాటు రూ.35 వేలు ఇచ్చాడు. ఆయన పేరు రవి. అందుకే నా పేరు ముందు ఆయన పేరుని జోడించాను' అని రవి బస్రూర్ చెప్పుకొచ్చాడు.గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి మాట్లాడిన రవి బస్రూర్.. తన అసలు పేరు కిరణ్ అని, కానీ రవి బస్రూర్ అని పిలిస్తే చాలా సంతోషిస్తానని అన్నాడు. ఎనిమిదో తరగతిలో ఫెయిల్ అయిన తనని ప్రశాంత్ నీల్ నమ్మి అవకాశమిచ్చాడని, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని కూడా చెప్పుకొచ్చాడు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు అయినప్పటికీ.. బంగార ఆభరణాలు తయారు చేసే వృత్తి కూడా నేర్చుకున్నాడు. లాక్డౌన్ టైంలో ఈ పనిచేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.(ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు) -
ఊర్వశి షాకింగ్ లుక్.. పెళ్లి వేడుక కోసం అందంగా ప్రగ్యా!
పెళ్లి సీజన్ హడావుడి.. అందంగా ప్రగ్యా జైస్వాల్వీకెండ్ పార్టీ మూడ్లో బిగ్బాస్ రీతూ చౌదరిజాకెట్ లేకుండా పోజులిచ్చిన ఊర్వశి రౌతేలాపసుపు చీరలో ముద్దుగుమ్మలా ప్రియాంక మోహన్జిమ్లో కష్టపడిపోతున్న హీరోయిన్ నందితా శ్వేత'డ్రాగన్' జ్ఞాపకాలని పంచుకున్న కాయదు లోహర్ View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) -
‘కిల్లర్’లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ గ్రాండ్గా ఉన్నాయి: అనిల్ రావిపూడి
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ చిత్ర టీజర్ గ్రాండ్గా విడుదలైంది. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.టీజర్ విడుదల చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "పూర్వాజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమాలోని కొన్ని సీక్వెన్స్ చూశాను, చాలా బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ను కలిపి చాలా గ్రాండ్గా తెరకెక్కించారు. ముఖ్యంగా జ్యోతి గారి ట్రాన్స్ఫర్మేషన్ తోపాటు యాక్షన్ సీన్స్ షాకింగ్గా ఉన్నాయి. రియల్ లైఫ్ భార్యాభర్తలు రీల్ లైఫ్లో ఎలా మెప్పించారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది," అని చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు.దర్శక-నిర్మాత పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే గొప్ప మనసుతో టీజర్ను లాంచ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన పాజిటివిటీ తమ టీమ్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. -
గోల్డ్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్.. రవి బస్రూర్ ఎమోషనల్
హీరో విశ్వక్సేన్కు ఈ మధ్య ఏదీ కలిసిరావట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన లైలా, ఈయేడు ఫిబ్రవరిలో వచ్చిన ఫంకీ.. రెండు చిత్రాలు తీవ్ర నిరాశపర్చాయి. దీంతో ఈసారి తన డైరెక్షన్లోనే ఓ సినిమా చేశాడు. అదే కల్ట్. శనివారం నాడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.కల్ట్ టీజర్ రిలీజ్టీజర్ ఫుల్ వయొలెంట్గా ఉంది. కల్ట్ అనే చోటుకు వెళ్లిన వారందరికీ లోపల ఉన్న ఒక బొమ్మ గేమ్స్ పెడుతోంది. అందులో ఓడిపోయినవారు గేమ్లోనే కాదు ఏకంగా ఈ భూమిపై నుంచే ఎలిమినేట్ అవుతారు. స్క్విడ్ గేమ్ సిరీస్ను గుర్తు చేస్తున్న ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. అతడి మ్యూజిక్కు ఫిదా అయిన విశ్వక్సేన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఊహించని బహుమతి ఇచ్చాడు. ఖరీదైన కానుకవిశ్వక్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరో కన్ను రవి బస్రూర్ సర్. ఇంత మంచి మ్యూజిక్ నా మూవీకి దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. అలాంటిది నాకు మంచి మ్యూజిక్ అందించారు. అందుకు కృతజ్ఞతగా రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుమతిగా ఇస్తున్నాను. ఇది నా ఫేవరెట్ గిఫ్ట్. ఎందుకంటే ఇది నేను రెండేళ్లు వెయిట్ చేసి మరీ తెప్పించుకున్న వాచ్. మళ్లీ నేనెప్పుడైనా సినిమా చేయమని అడిగితే ఈ వాచ్ చూసైనా ఓకే చేయాలి అన్నాడు. ఆ వెంటనే వాచ్ను రవి బస్రూర్ చేతికి తొడిగి తన సంతోషాన్ని చాటుకున్నాడు.రవి బస్రూర్ ఎమోషనల్అనంతరం రవి బస్రూర్ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఎల్లప్పుడూ మంచి సంగీతం అందించాలనే కృషి చేస్తూ వచ్చాను. ఇన్నేళ్లకాలంలో ఒకడు నాలోని అసలైన మ్యూజిక్ డైరెక్టర్ను గుర్తించాడు. ఇది కేవలం వాచ్ కాదు, సంగీత దర్శకులకు దక్కిన గౌరవం అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను. చివరి శ్వాస వరకు..ఈ జీవితమే నాకు వద్దని చనిపోదామనుకున్నాను. రెండుసార్లు ఎలాగోలా బతికేశాను. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీబోర్డు కొనుక్కోమని రూ.35 వేలు ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటినుంచి నా పేరు రవి బస్రూర్గా మారింది. చివరి శ్వాస వరకు ఈ పేరు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ నా జర్నీని, ప్రతిభను గుర్తించాడు. అతడిని కూడా ఎన్నటికీ మర్చిపోలేను అని రవి బస్రూర్ ఎమోషనలయ్యాడు.కల్ట్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేను మెచ్యూర్ అయ్యానని ఒప్పుకోను.. హీరో చంద్రహాస్
హీరోగా రెండు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అయినా సరే వరస వివాదాలతో వార్తల్లో నిలిచాడు చంద్రహాస్. ఈ నెల ప్రారంభంలో 'బరాబర్ ప్రేమిస్తా' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఇదొక సినిమా ఉందని కూడా తెలియనంతగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దీని రిలీజ్ టైంలోనే 'గుంజీ గుంజీ' అనే బూతు పాట పాడి వివాదానికి కారణమయ్యాడు. ఓ జర్నలిస్టుకి వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. తన గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు.ఇప్పటికీ తాను ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదని చెప్పిన చంద్రహాస్.. అప్పట్లో ఏ మాత్రం కోపం వచ్చినా సరే ఎవరనేది చూడకుండా చేయెత్తి కొట్టేసేవాడినని చెప్పుకొచ్చాడు. అలానే ప్రదీప్ రంగనాథన్ తీసిన 'డ్రాగన్' సినిమా తన బయోపిక్ అని అన్నాడు. అందులో చూపించినట్లే.. తాను కూడా నిజజీవితంలో చివరి సెమిస్టర్లో ఒకేసారి 26 సబ్జెక్టులు క్లియర్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)అప్పట్లో తన తండ్రి స్పైడర్ మ్యాన్ డ్రస్ కొనిస్తే.. దాన్ని వేసుకుని కింద ఇంటిలో ఉన్న పిల్లలకు చూపిస్తే.. డ్రస్ వేసుకుంటే సరిపోదు. స్పైడర్ మ్యాన్లా ఎగరాలి అని చెప్పేసరికి రెండో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశానని కూడా చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. అవకాశం లభిస్తే దర్శకులతో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాతో పనిచేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ ఈ వీడియో బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చంద్రహాస్ విషయానికొస్తే టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు. తొలుత 'రామ్నగర్ బన్నీ' అనే మూవీ చేశాడు. 2024లో ఇది థియేటర్లలోకి వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీని ప్రమోషన్ల టైంలోనే కాస్త వింతగా ప్రవర్తించడం, మాట్లాడటంతో యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. ఈ పేరుని తనకు ట్యాగ్గా పెట్టేసుకున్న చంద్రహాస్.. తొలి రెండు మూవీస్కి అదే ట్యాగ్ వేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్
గతవారం 'ఫంకీ' సినిమాతో వచ్చిన విశ్వక్ సేన్.. ఘోరమైన ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఊహించిన దానికంటే ఫెయిల్యూర్గా నిలిచింది. ఇంతలోనే మరో మూవీతో వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సుహాస్కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?)టీజర్ బట్టి చూస్తే ఓ ముగ్గురు కుర్రాళ్లు.. గోవాకి వెళ్తారు. కానీ పబ్లోకి వెళ్లేందుకు ఎంట్రీ దొరకదు. దీంతో 'కల్ట్' అనే చోటుకి వెళ్తారు. ఈ గేమ్లో భాగంగా స్క్రీన్ పై ఓ బొమ్మ కనిపిస్తుంది. లోపల ఉన్నవాళ్లందరికీ కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. అందులో ఫెయిలైన వాళ్లు ఎలిమినేట్ అవుతుంటారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే చంపేయడం. మరి ఈ 'కల్ట్' సంగతేంటి? ఇందులో విశ్వక్ పాత్ర ఏంటనేది తెలియాలంటే ట్రైలర్, మూవీ వచ్చేవరకు ఆగాల్సిందే. టీజర్ చూడగానే చాలామంది 'స్క్విడ్ గేమ్' సిరీస్ గుర్తుకురావడం గ్యారంటీ. ఎందుకంటే అందులోనూ ఇలానే గేమ్లో ఎలిమినేట్ అయితే చంపేస్తుంటారు.(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ సంపర్కరాలిగా నటించనుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమా కాదా అనేది సదరు మూవీ రిలీజైతే కానీ తెలియదు. అయితే దీనికంటే ముందే ఇప్పుడు ఇదే తరహా కాన్సెప్ట్తో తీసిన ఓ హిందీ చిత్రం.. నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇదివరకే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ సినిమా.. 'చథా పచ్చ తెలుగు రివ్యూ)ప్రముఖ నటి కొంకనా సేన్, 'లాపతా లేడీస్' ఫేమ్ ప్రతిభ రత్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అక్యూజ్డ్'. నెట్ఫ్లిక్స్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం.. సదరు ఓటీటీలోకే వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్లోకి రానుంది. ఇందులో లీడ్ పెయిర్.. లెస్బియన్ కపుల్ పాత్రల్లో నటించడం విశేషం. ఇదో హాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది.విదేశాల్లో జీవించే ప్రధాన పాత్రధారుల్లో ఒకరు(కొంకనా సేన్).. ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తుంటుంది. అయితే ఈమెపై షాకింగ్ ఆరోపణలు వస్తాయి. ఆస్పత్రిలోని చాలామంది లైంగికంగా వేధిస్తుందని రూమర్స్ బయటకొస్తాయి. దీంతో ఈమె రిలేషన్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. చివరకు ఏమైంది? నిజంగానే సదరు డాక్టర్ అలాంటిదేనా? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాని భారతీయ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి? ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్) -
సుహాస్కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
ఈ వీకెండ్ థియేటర్లలోకి పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ సుహాస్ హీరోగా చేసిన 'హే బలవంత్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారిక నంబర్స్ వదిలారు. ఎన్ని కోట్లు వచ్చాయనేది పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?(ఇదీ చదవండి: ‘హే బల్వంత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతవారం రిలీజైన వాటిలో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఈ వారం 'హే బలవంత్' ఆ బాధ్యత తీసుకుంది. ఇది కాకుండా మరో రెండు మూడు విడుదలైనప్పటికీ వాటికి పాజిటివ్ టాక్ రాలేదు. ఇకపోతే సుహాస్, శివానీ నాగారం, నరేశ్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'హే బలవంత్' చిత్రానికి ముందురోజు ప్రీమియర్స్ వేశారు. నిన్న(ఫిబ్రవరి 20) థియేటర్లలోకి వచ్చింది. అలా తొలిరోజు రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. సుహాస్ గత చిత్రంతో పోలిస్తే ఇది చాలా బెటర్. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశముంది.'హే బలవంత్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కృష్ణ(సుహాసన్), తండ్రి బలవంత్(నరేశ్), నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని రోల్ మోడల్గా తీసుకున్న కృష్ణ.. ఆయన బిజినెస్ టేకోవర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి తొలుత వద్దని చెప్పినప్పటికీ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. దీని వల్లే ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏంటి? దాని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన చిక్కేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ధురంధర్.. ఆ సీన్ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్) -
చిరు, మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ ఎవరు..? రాధిక సమాధానం వైరల్
-
చిన్మయి, తన తండ్రిపై నెటిజన్ దిగజారుడు కామెంట్
సోషల్మీడియా వినియోగం పెరుగుతున్న కొద్ది కొందరు నెటిజన్లు తమ విచక్షణ కోల్పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పశువులకంటే హీనంగా మారిపోతున్నారు. తండ్రీ కూతుళ్ల బంధంపై విషం చిమ్మే స్థాయికి కూడా చేరిపోతున్నారు. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియోపై 'ఫన్ & డాంక్' పేరుతో ప్రణీత్ హన్మంతు చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించిన విషయం గుర్తే ఉండుంటుంది కదా.. అయితే, తాజాగా ఇదే రీతిలో ప్రముఖ సింగర్ చిన్మయిపై ఒక నెటిజన్ 'మీ తండ్రి నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని నీచమైన కామెంట్ చేశాడు.ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలికలపై లైంగిక వేధింపుల గురించి ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో వైరల్ అవుతుంది. ఈ అంశంపై సింగర్ చిన్మయి కూడా రియాక్ట్ అయింది. భారత ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భవనంలో ఎప్స్టీన్లు ఉంటారు. ఈ విషయంలో గుడ్డిగా మత పెద్దలను కూడా నమ్మకండి. వారితో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. భారతదేశంలో లక్షలాది మంది బాల లైంగిక నేరస్థులు ఉన్నారని గుర్తుంచుకోండి. నేను చెబుతుంది మీరు నమ్మకపోతే.. మీకు తెలిసిన అమ్మాయిని అడగండి. మొదటిసారి ఎప్పుడు, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురి అయిందో చెబుతుంది.' అని పోస్ట్ చేసింది. దీనికి సమాధానంగా చిన్మయిపై ఒక నెటిజన్ విషం చిమ్మాడు. 'మీ తండ్రి కూడా నిన్ను తప్పకుండా అత్యాచారం చేసే ఉంటాడు' అని తెగబడ్డాడు. దీంతో ఆమె కూడా తిరిగి కౌంటర్ ఇచ్చింది.అతనికి కౌంటర్గా చిన్మయి ఇలా పోస్ట్ చేసింది.. 'నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు. కానీ, కూతుళ్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు ఖచ్చితంగా ఊహించుకుంటారని తెలుస్తోంది. మీరు ఏమిటో, మీ సంస్కృతి ఏమిటో తెలుస్తుంది. మిమ్మల్ని ఎవరు పెంచారో కూడా ఈ ప్రవర్తనలోనే కనపడుతుంది.' అని ఆమె రిప్లై ఇచ్చింది.No - Akula Reddy.I wasn’t raped by my father. But you definitely fantasise daughters getting raped by their fathers. And use that so commonly to a woman on Twitter Shows what you are, your culture,Your people, your society is and DEFINITELY SHOWS WHO RAISED YOU. pic.twitter.com/lBIr6agCdB— Chinmayi Sripaada (@Chinmayi) February 20, 2026 -
వసూళ్లు చూసి నమ్మలేకపోతున్నాను: సుహాస్
సుహాస్, శివానీ నాగారం జంటగా, వీకే నరేశ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘హే బల్వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి తమ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్మీట్లో సుహాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ సినిమాతో వచ్చింది.కలెక్షన్స్ చూస్తే నమ్మలేకపోతున్నాను. రాను రాను కలెక్షన్స్ మరింత పెరుగుతాయి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు థియేటర్స్లో చూసి, మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు గోపీ, నరేంద్ర. ‘‘సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి.


