పతనంతిట్ట: శబరిమలలో తీవ్ర ఉద్రికత నెలకొంది. ఓ దుకాణం యాజమాని గాజుసీసాతో ఓ భక్తుడి తల పగలగొట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భక్తులు నిరసనగా తెలపగా.. స్థానికులు ఆ వ్యాపారికి అండగా వచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
తెలుగు అయ్యప్ప స్వాములు కొందరు స్థానికంగా దుకాణాలకు వెళ్లారు. ఓ భక్తుడు వాటర్ బాటిల్ కొనే సమయంలో.. ధర ఎక్కువ ఉందని షాపు అతన్ని ప్రశ్నించాడు. దీంతో పట్టరాని కోపంతో ఆ యాజమాని దాడికి దిగాడు. విషయం తెలిసిన తెలుగు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల షాపులవాళ్లు ఎదురు దాడికి దిగారు. అయితే..
ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా వ్యాపారులకే సపోర్ట్గా ఉన్నారంటూ తెలుగు భక్తులు నిరసనకు దిగారు.


