శబరిమలలో తెలుగు భక్తులపై దాడి | Local Traders Attack Telugu Devotees In Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలలో తెలుగు భక్తులపై దాడి

Dec 5 2025 9:54 AM | Updated on Dec 5 2025 10:17 AM

Local Traders Attack Telugu Devotees In Sabarimala

పతనంతిట్ట: శబరిమలలో తీవ్ర ఉద్రికత నెలకొంది. ఓ దుకాణం యాజమాని గాజుసీసాతో ఓ భక్తుడి తల పగలగొట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భక్తులు నిరసనగా తెలపగా.. స్థానికులు ఆ వ్యాపారికి అండగా వచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

తెలుగు అయ్యప్ప స్వాములు కొందరు స్థానికంగా దుకాణాలకు వెళ్లారు. ఓ భక్తుడు వాటర్‌ బాటిల్‌ కొనే సమయంలో.. ధర ఎక్కువ ఉందని షాపు అతన్ని ప్రశ్నించాడు. దీంతో పట్టరాని కోపంతో ఆ యాజమాని దాడికి దిగాడు. విషయం తెలిసిన తెలుగు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల షాపులవాళ్లు ఎదురు దాడికి దిగారు. అయితే.. 

ఈ క్రమంలో పోలీసులు అ‍క్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా వ్యాపారులకే సపోర్ట్‌గా ఉన్నారంటూ తెలుగు భక్తులు నిరసనకు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement