విశాఖ : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విశాఖవాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాసోత్సవాలతో కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా రెండో గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
గురువారం ఒక్క రోజే సుమారు 40 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
వైభవంగా విశేష పూజలు : వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.


