devotional
-
ఏపీలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా పూరీ జగన్నాథ స్నానోత్సవం.. పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం..భక్తజన పావనం (ఫొటోలు)
-
అక్కడ 11 ఏళ్ల తర్వాత 'దేవర'.. సతీమణితో మంచు మనోజ్ సందడి (ఫోటోలు)
-
యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కోలాహలం (ఫొటోలు)
-
పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? (ఫొటోలు)
-
గంగి గోవు పాలు...గడ్డిపోచ..ఏది ఘనమైనది?!
గురుకులంలో గురువుగారు శిష్యులకు ‘చాణక్య నీతి’ పాఠం చెప్తున్నారు. ‘తృణం బ్రహ్మవిదః స్వర్గం,/ తృణం శూరస్య జీవితం,/ జితాక్షస్య తృణం నారీ,/ నిరీహస్య తృణం జగత్’ – అన్న శ్లోకం చదివారు. ‘బ్రహ్మవేత్తకు స్వర్గ సుఖాదులు తృణప్రాయం. శూరుడికి ప్రాణాలు లెక్కలోనివి కావు. జితేంద్రియుడికి అందాల అప్సరసయినా గడ్డిపరక పాటిగా కనిపిస్తుంది. కోరికలు లేని విరాగికి ఈ జగత్తే ఒక గడ్డిపోచతో సమానం’ అని అర్థం చెప్పారు.‘గురుదేవా! ఈ ప్రపంచంలో అన్నిటికంటే నిరర్థకమైనది గడ్డిపోచ అన్న అర్థం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది కదా?’ అని అడిగాడొక కొంటె శిష్యుడు.‘పిచ్చితండ్రీ! అలాంటి అర్థాలనే పెడర్థాలు అంటారు. తృణం నిరర్థకం కాదు. బ్రహ్మవేత్తకూ, విరాగికీ దాని వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు. అంతవరకే! ఆ మాటకొస్తే గడ్డిపోచకు యతీంద్రుడి వల్ల ప్రయోజనం లేదు. అంతమాత్రాన ఆయన నిరర్థకుడవు తాడా? మాట వరసకు చెప్పిన మాటకు పెడర్థాలు తీయకూడదు.తృణం వల్ల చాలా ప్రయోజనం ఉంది. దాని ఆయుష్షు స్వల్ప కాలం. ఆ స్వల్పకాలం పొడుగునా అది తన ముగ్ధమైన అందాన్ని ప్రదర్శిస్తూ చూపరులకు కనువిందు చేస్తుంది. అవకాశముంటే, ఒక బుజ్జి పువ్వు కూడా పూసి, లోకాన్ని మురిపిస్తుంది. ఆఖరికి, ఏ గోమాతకో ఆహారంగా తనను తాను సమర్పించుకొని, ధన్యమౌతుంది. గడ్డిపరక తేలికయిన పదార్థమే కానీ, తేలిక చేయవలసిన పదార్థం కాదు. సృష్టిలో ఏ పదార్థమూ నిష్ప్రయోజనం కాదు. ప్రయోజనం అనేది వాడుకొనే వారిని బట్టి కూడా ఉంటుంది.మరొక విశేషం గమనించు. గడ్డిపోచను ఆవు ఆహారంగా తీసుకొంటే, ఆ ఆహారం ఆవు శరీరంలో పవిత్రమైన గోక్షీరంగా పరిణమించగలదు. అవునా? గోక్షీరాన్ని పాముకు ఆహారంగా పోస్తే, ఆ ఆహారం పాముశరీరంలో భయంకరమైన విషంగా మారుతున్నది. అలాంటప్పుడు, గంగి గోవు పాలు ఘనమైనవనీ, పచ్చగడ్డి పనికిమాలినదనీ భావించటం భావ్యంగా ఉంటుందా?ఈ సృష్టిలో ప్రతి పదార్థమూ ప్రత్యేకమే, విశేషమే! ప్రతి ప్రక్రియా ఈశ్వర విలాసమే. ఈశ్వర విలాసం మనకు పూర్తిగా ఎప్పటికీ అర్థం కాదు. కారణం, అందుకు మనకున్న గ్రహణశక్తి సరిపోదు. తన మేధ పరిమితి ఏమిటో తెలియని అమాయకుడు మాత్రమే తనకు అన్నీ తెలుసుననీ,తను సర్వమూ తెలుసుకోగలననీ మిడిసి పడుతుంటాడు. అందుకేఅలాంటి వారి జ్ఞానాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. అది సంపూర్ణ జ్ఞానం కాదు. సర్వజ్ఞత్వ లక్షణం కలవాడు సాంబమూర్తి ఒక్కడే!’ అని గురువు సమాధానం చెప్పారు.– ఎం. మారుతి శాస్త్రి -
ఘనంగా కాళేశ్వరం సరస్వతి పురస్కారాలు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
-
కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)
-
పిల్లలూ..ఈ సమ్మర్ ఈ సినిమాలు చూస్తున్నారా..?
పిల్లలూ...భారతం తెలుసా మీకు? రామాయణ, మహాభారతాలుమన తొలి పాఠ్యపుస్తకాలు. మీకు పదేళ్లు దాటితే ఈ రెండూ ఏదో ఒక మేరకు తెలిసుండాలి. వినడం, చదవడం ద్వారా మాత్రమే కాక చూడటం వల్ల కూడా భారతం తెలుసుకోవచ్చు. స్కూళ్లు తెరవడానికి ఇంకా రెండు వారాలుంది. భారతం మీద వచ్చిన సినిమాలు వరుసపెట్టి చూడండి చాలు. ఆ లిస్టు ఇవాళ ఇస్తున్నాం. రేపు రామాయణం సినిమాల లిస్ట్ ఇస్తాం. పిల్లలూ...మహాభారతం అంటే పాండవులకు కౌరవులకు మధ్య వార్ అని మాత్రమే అనుకుంటున్నారా మీరు? మహాభారతంలో ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, వీరత్వాలూ శూరత్వాలూ ఉన్నాయి, చీటింగ్ ఉంది, నిజాయితీ ఉంది, ట్రూత్ కోసం నిలబడిన వారు ఉన్నారు, గొప్ప విమెన్ ఉన్నారు, ఆటవిక వీరులున్నారు... వీరందరినీ మీరు తెలుసుకోవాలి.మహాభారతంలో పాండవులు రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తారు. అజ్ఞాతవాసం కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో లైఫ్లో ఇలాంటి సవాళ్లు వస్తాయి. పాండవులు భయపడలేదు. అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేసి మళ్లీ యుద్ధం చేసి గెలిచారు. అరణ్యవాసం అంటే అడవుల్లో ఉండటం, అజ్ఞాతవాసం అంటే ఐడెంటిటీని దాచి బతకడం.ఇవాళ ప్రపంచంలో చాలా చోట్ల వార్స్ జరుగుతున్నాయి. వార్ను ప్రజలు కోరుకోరు. పాలకులే కోరుకుంటారు. వాళ్లకు కావాల్సినదాని కోసం కొట్లాడుకుంటారు. కాని వార్ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు. పీస్ అంబాసిడర్స్గా మారి వార్ వద్దని మంచి మాటలు చెబుతారు. భారతంలో కృష్ణుడు అలా పాండవులకు, కౌరవులకు రాయబారం చేయాలని చూశాడు. కాని కుదరలేదు. మహాభారతంలో ద్రోణుడు వంటి గొప్ప టీచర్ ఉన్నాడు. శకుని వంటి విలన్ ఉన్నాడు. మాట వినని, మొండికేసే దుర్యోధనుడున్నాడు. వీళ్లందరి నుంచి మనం నేర్చుకోదగ్గ లెసన్స్ ఉంటాయి. అలాగే మహాభారతంలో కుంతి, ద్రౌపది, సుభద్ర... వంటి గొప్ప స్త్రీ పాత్రలను మనం తెలుసుకోవాలి.మహాభారతాన్ని పిల్లల కోసం సులభంగా అర్థమయ్యేలా కొన్ని పుస్తకాలు రాశారు. అవి తెప్పించుకుని చదవండి. లేదా సినిమాలు చూసి కూడా భారతాన్ని తెలుసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. సెలవులు కొన్నాళ్లే మిగిలాయి. ఈ సినిమాలు చూసేయండి మరి. అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి.1. బాలభారతం: ఇది 1972లో వచ్చిన తెలుగు సినిమా. పాండవుల, కౌరవుల చైల్డ్హుడ్ ఇందులో ఉంటుంది. అందరూ పిల్లలే నటించారు.2. మాయాబజార్: ఇది తప్పకుండా చూడాల్సిన క్లాసిక్. ఇందులో ఘటోత్కచుడు స్పెషల్ అట్రాక్షన్. ఈ కథ భారతంలో లేదుగానీ ఇందులో ఉన్నవన్నీ భారతంలోని క్యారెక్టర్లే. దుష్ట చతుష్టయం అనే నలుగురు ఎవరో ఈ సినిమాలో చూడొచ్చు. చెడు ఆలోచనలు చేస్తే చెడు ఫలితమే వస్తుందని తెలుసుకుంటారు.3. భీష్మ: మహా భారతంలో భీష్ముడు చాలా ముఖ్యమైన పాత్ర. మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ ఆయన ఉంటాడు. ఆయన మీద తీసిన సినిమా ఇది. పెద్దవాళ్లను తోడు చేసుకుని డౌట్స్ అడుగుతూ ఈ సినిమా చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి.4. నర్తన శాల: ఇది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు జరిగిన కథ. పాండవుల్లో భీముడు ఎంత బలం కలిగినవాడో ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే కీచకుడు అనే క్యారెక్టర్ ఉంటుంది. బ్యాడ్ క్యారెక్టర్. ఉమెన్తో మిస్ బిహేవ్ చేసి తగిన పనిష్మెంట్ పొందుతాడు. తప్పకుండా చూడండి.5. వీరాభిమన్యు: భారతంలో అభిమన్యుడు అద్భుతమైన పాత్ర. పద్మవ్యూహంలోకి చొచ్చుకు వెళ్లి గొప్పగా పోరాడుతాడు. కాని తిరిగి రావడం తెలియక మరణిస్తాడు. అతని మీద తీసిన సినిమా ఇది.6. పాండవ వనవాసము: పాండవులు వనవాసం చేసినప్పుడు అంటే అడవుల్లో ఉన్నప్పుడు ఏమేమి ఘటనలు జరిగాయో ఈ సినిమా చూపిస్తుంది.7. దానవీరశూర కర్ణ: మహాభారతాన్ని ఒక్కొక్కరు ఒక్కో పర్స్పెక్టివ్లో చూస్తారు. ఈ సినిమా కర్ణున్ని ఒక వీరుడుగా, శూరుడుగా చూపుతుంది. అతను దానం ఇవ్వడంలో మేటి అట. అలాగే అతను పొందిన అవమానాలను ఎలా తట్టుకున్నాడో కూడా ఈ సినిమా చూపుతుంది. కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. యుద్ధ సమయంలో ఫ్రెండ్ పక్షాన నిలవడం అతని ధర్మం. ఈ సినిమా తప్పక చూడండి.8. ఏకలవ్య: ఏకలవ్య శిష్యరికం అని మీరు సామెత వింటూనే ఉంటారు కదా... ద్రోణుడి బొమ్మ పెట్టుకుని విలువిద్య నేర్చుకుంటాడితను. అర్జునుడిని మించిన విలుకాడితను. ద్రోణుడు గురుదక్షిణ అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా బొటనవేలు కోసి ఇచ్చేస్తాడు. అన్నట్టు పిల్లలూ... ఈ సినిమాల్లో భాష మీకు పూర్తిగా అర్థం కాక΄ోవచ్చు. ఇందులో గ్రాంథిక తెలుగు ఉంటుంది. అయినా సరే చూస్తూ ఉంటే భాష కూడా మీకు తెలుస్తుంది. తెలుగు గొప్ప భాష. అందులో ఎన్నో స్థాయులు ఉన్నాయి. అన్నింటితో మనకు పరిచయం ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం. మీ అమ్మతోనో నానమ్మతోనో కలిసి భారతం సినిమాలు చూడటం మొదలుపెట్టండి. (చదవండి: చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!) -
కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఎవడు వివేకి? ఎవడు అవివేకి?
వివేకి లోక విషయాల్లోని దోషాన్ని గ్రహిస్తాడు. అలౌకికాన్ని ఆరాధిస్తాడు. అవివేకి అజ్ఞానంతో లౌకిక విషయాసక్తుడై అలౌకిక సత్యాన్ని ఆలోచించలేడు. పైగా లౌకిక విషయ సుఖమే సత్యంగా భావించి దాన్ని అనుభవిస్తూండటం వివేకమనుకుంటాడు. అటువంటి వారు అతితెలివితో భ్రాంతచిత్తులయి తమాషాగా ప్రవర్తిస్తారు. అలాంటి కథ ఇది:మిక్కిలి తెలివి గల ఒక రాజు ఉన్నాడు. మనిషి మంచివాడే. కాక పోతే కొంచెం వక్రంగా ఆలోచిస్తాడు. అందుకే అందరికంటే వివేక హీనుడెవడో చూచి వాడికి సన్మానం చేయాలనుకుంటాడు. అటువంటివాడిని తీసుకురమ్మని సేవకులను రాజ్యం నలుమూలలకూ పంపాడు. అతి కష్టం మీద రాజసేవకులు ఏ పనీ చేయని, ఎవరి తోనూ మాట్లాడని, చింపిరి గుడ్డలు కట్టుకొని ఆకులు అలములుతింటూ తిరుగాడేవాడిని తీసుకొస్తారు. రాజు కూడా అవివేకి ఇతడే అని సంతోషించి సన్మానంలో ఒక వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని అతనికి బహూకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజుకు తీవ్రమైన రోగం వచ్చింది. ఎవరూ వైద్యం చేయలేమని చేతులెత్తేసిన సమయంలో అవి వేకిగా సన్మానితుడైన మనిషి వచ్చి రాజు రోగాన్ని నయం చేస్తానన్నాడు. చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఅయితే వైద్యం ప్రారంభించే ముందు... ‘ఓ రాజా! మీరింతవరకూ సుఖాలెన్నో అనుభవిస్తూ వచ్చారు. మరి మీరు చనిపోతే మీ శరీరం ఈ సుఖభోగాల ననుభవించలేదు కదా! అందువల్ల మర ణించే ముందైనా, ఇప్పటినుంచే ఆ భోగాలన్నింటినీ వదిలిపెట్టి ఉండగలరా చెప్పండి?’ అన్నాడు. ‘ఇంతవరకు అలవాటు పడిన ఈ భోగాలను వదలి ఉండలేను’ అని సమాధానం చెప్పాడు రాజు. ‘రాజా! నేను ఆకులలములు తింటూ ఏవో గుడ్డ పీలికలు కట్టుకొని, కటిక నేలపై పడుకొంటూ ఇప్పటికీ సుఖంగానే ఉన్నాను. మరి నాకు కష్టం, సుఖం వేరుగా కనబడలేదు. నాకెంతో తృప్తిగా ఉంది. కానీ మీరు, ప్రాణాంతకమైన రోగం వచ్చినా రక్షించలేని ఈ సుఖాలను, కొంతకాలమైనా వదిలి పెట్టలేకపోతున్నారు. అన్నీ ఉన్నా మీకు తృప్తిలేదు. విషయ సుఖలాలసత ఇంకా కోరుతున్న మీరు, సిసలైన అవివేకులు. కనుక మీరు నాకిచ్చిన వజ్రపుటుంగరం తిరిగి మీకే ఇస్తున్నాను తీసుకోండి’ అని ఉంగరం ఇస్తూ తన యోగదృష్టి పాతంతోనే రాజుకు పరిపూర్ణమైన ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాడాయన.చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?ఆయన ఎవరో కాదు. సర్వసిద్ధులూ కలిగిన ’అవధూత’. ‘విరతి రాత్మరతి శ్చేతి వివేకస్య పరమం లక్షణమ్’. విషయసుఖాలపై వైరాగ్యముండటం, సర్వదా ఆత్మానుసంధానంతో ఉండటమూ వివేకానికి లక్షణమని అర్థం. అవధూత స్థితి ఇలాంటిది. కనుక గురూపదేశంతో ప్రతి ఒక్కరూ సుఖదుఃఖ సమభావన సాధించాలి.-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
హనుమాన్ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)
-
సరస్వతీ నది పుష్కర స్నానాలు..బారులు తీరిన భక్తజనం (ఫొటోలు)
-
ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)
-
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
-
తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)
-
గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
-
యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)
-
అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)
-
అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)
-
తిరుపతి : రెండో రోజు గంగమ్మ జాతర.. బైరాగి వేషంలో మొక్కుల చెల్లింపులు (ఫొటోలు)
-
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
-
గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
-
శతాబ్దాల చరిత్రకు నిలయం డిచ్పల్లి ఖిల్లా రామాలయం.. అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే (ఫొటోలు)
-
విశాఖపట్నం : అంగరంగ వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ జాతర (ఫొటోలు)
-
యముడికి కాళ్ళు విరగాలని శపించిన తల్లి!
విశ్వకర్మ కూతురైన సంజ్ఞను సూర్యుడు పెండ్లాడాడు. వైవస్వత మనువు, యముడు, యమున వారి సంతానం. సూర్యుడి ప్రచండ కిరణాల ఉష్ణాన్ని భరించలేని సంజ్ఞ, కొంత కాలం సూర్యుడికి దూరంగా ఉండాలనుకుంది. అది సూర్యుడికి తెలియకుండా జరగాలని, తన ఛాయకు రూపాన్ని కల్పించి, తాను అశ్వరూపం ధరించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఛాయ సూర్యుడిని ఆరాధించింది. వారికి సూర్యసావర్ణి మనువు, శని, తపతి సంతాన మయ్యారు. ఛాయకు సొంత సంతానం కలిగిన తరువాత, తమ పట్ల ఆమెచూపించే అనురాగంలో క్షీణతను గమనించిన యముడు ‘తల్లివైయుండి అందరి పట్ల సమానమైన ప్రేమను చూపక పోవడం ఏమిటి? ఇలాంటి బుద్ధి నీకు ఎందుకు కలిగింది?’ అని ప్రశ్నించాడు. అది సహించని ఛాయ, యముడిని దుర్భాష లాడింది. తల్లి నుండి దుర్భాషను ఊహించని యముడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో గ్రహించకుండా, ఛాయను కాలితో తన్నాడు. ఆ విపరీత ప్రవర్తనను భరించలేని ఛాయ, యముడికి కాళ్ళు విరగాలని శపించిది. కాళ్ళు పోగొట్టుకున్న యముడిని చూసి సూర్యుడు ‘ఎందుకిలా జరిగింది?’ అని అడిగాడు. శాపం గురించి చెప్పి ‘ఆమె నిజంగా నా తల్లి అయుంటే ఆమెను నేను ఎలా తన్నగలిగేవాడను? ఆమెకు నేను కొడుకునైతే ఆమె నన్ను ఎలా శపించగలిగేది? ఆమె మాకు తల్లి కాదు, నేను ఆమెకు కొడుకునూ కాదు!’ అన్నాడు. యముడి మాటలు విన్న సూర్యుడు, ఛాయను నిజం చెప్పమని, లేకుంటే శపిస్తానని గద్దించి అడిగాడు. భయపడిన ఛాయ జరిగినదంతా చెప్పింది. విన్న సూర్యుడు యముడి కాళ్ళు పూర్వంలా అయేట్లుగా అనుగ్రహించి, వెంటనే వెళ్ళి అడవిలో అశ్వరూపంలో సంచరిస్తున్న సంజ్ఞను కలుసుకున్నాడు. వారికి రేవంతుడు, అశ్వినీదేవతలు సంతానంగా కలిగారు. త్వష్ట వచ్చి, సంజ్ఞ పడుతున్న బాధను గురించి సూర్యుడికి చెప్పి, సూర్యుడి కిరణాలలో ఎనిమిదవ పాలు సానపట్టి తగ్గించాడు. అలా తగ్గించేక్రమంలో రాలిన సూర్యుడి రణ రజం నుండి శంకరుడి త్రిశూలము, విష్ణుమూర్తి చక్రము, కుబేరుడి ఖడ్గము, కమారస్వామి శక్తి ... ఇలా నానాదేవతల ఆయుధాలు తయారుచేయబడ్డాయని వెన్నెలకంటి సూరన రచించిన శ్రీవిష్ణుపురాణం, చతుర్థాశ్వాసంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
గరుడ పక్షి రాకతో వైభవోపేతంగా రఘునాయకుని కల్యాణోత్సవం (ఫొటోలు)
-
సింహాచలం : దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? (ఫొటోలు)
-
వెళ్లొస్తాం.. లింగమయ్యా ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఒంటిమిట్ట : కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం (ఫోటోలు)
-
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (ఫొటోలు)
-
భద్రాచలం : వైభవోపేతంగా రామయ్యకు పట్టాభిషేకం (ఫొటోలు)
-
భద్రాచలం : కనుల పండువగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం (ఫొటోలు)
-
సమస్యలే సాఫల్యానికి సోపానాలు
ఒక ఊరిలో జలాలుద్దీన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి కుటుంబం పెద్దది కావడంతో ఇల్లు ఏమాత్రం సరిపోయేది కాదు. చివరికి ఒకరోజు మసీదులో ఉన్న ధార్మిక గురువు దగ్గరికెళ్ళి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. సావధానంగా విన్న గురువు.. ‘నువ్వొక కోడిని తీసుకువెళ్ళి మీతోపాటే ఇంట్లో ఉంచుకో. నీ సమస్య తీరిపోతుంది.’ అన్నాడు.ఆ వ్యక్తి కోడిని కొనుక్కొని వెళ్ళాడు. తమతోపాటే దాన్ని ఇంట్లో ఉంచాడు. అలా వారం గడిచింది. కాని పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా సమస్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆ వ్యక్తి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. ‘‘అయ్యా.. మరికాస్త ఇబ్బంది ఎక్కువైంది’’ అని మొర పెట్టుకున్నాడు. ‘‘ఈసారి ఒక మేకను తీసుకువెళ్ళు. దాన్నీ మీతోపాటే ఇంట్లో ఉంచు. మళ్ళీ వారం తరువాత వచ్చి కలువు’ అన్నాడు గురువు.ఆ వ్యక్తి మేకను కొనుక్కొని తీసుకువెళ్ళాడు. ఈసారి సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. గురువు దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నాడు. అతను చెప్పినదంతా విని.. ‘ఇప్పుడు నువ్వు ఒక గాడిదను తీసుకు వెళ్ళు.. దాన్నీ మీతోనే ఇంట్లోనే ఉంచు. నీకు శుభం కలుగుతుంది’ అన్నాడు. గురువు మాటమీద గాడిదను తెచ్చిన తరువాత ఇల్లు నరకం అయిపోయింది. ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ వీధి వీధంతా అల్లకల్లోలం మొదలైంది. ఏడవరోజు గాడిదతో పడిన నరక బాధను చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు గురువు ‘సరే.. నువ్వు ఇంటికెళ్ళి కోడిని కోసి వండుకొని తిను. వారం తరువాత వచ్చి కలువు.’ అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆరోజు కోడి కూర వండాడు. వారం తరువాత వెళ్ళి గురువుని కలిశాడు. ‘అయ్యా.. సమస్య అయితే తీరలేదు కాని, కాస్తంత పరవాలేదు.’ అన్నాడు. ‘ఈసారి మేకను కోసి విందు చేసుకోండి. మీ వీధి వారిని కూడా విందుకు పిలవండి.’ అని పురమాయించాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి గురువు చెప్పినట్టే చేసి వారం తర్వాత సంతోషంగా.. ‘‘ఇప్పుడు పరిస్థితి మెరుగు పడింది.’ అని చెప్పాడు. అప్పుడు గురువు, ‘‘నువ్వు గాడిదను సంతలో అమ్మెయ్ ..’ అని సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి గాడిదను సంతలో అమ్మేసి ఇంటికి వెళ్ళాడు. వారం ప్రశాంతంగా గడిచింది. గురువు చేసిన ఉపదేశాల్లోని మర్మం అర్థమైంది. ‘అంతా అల్లాహ్ అనుగ్రహం గురువు గారూ..ఇప్పుడు పరమ సంతోషంగా ఉంది. ఇల్లు విశాలమై పోయింది.’ చెప్పాడు పరమానందంగా..!– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఏపీలో ఈ కోదండరామాలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
మనిషిని మార్చే సాన్నిధ్యం
వర్ధమాన మహావీరుని కాలంలోనే మక్కలి గోశాల్, అజిత్ కేశకంబల్, సంజయ్ విలేతిపుత్ర అనే ప్రముఖులూ ఉండేవారు. వారంతా మహామేధావులు, పండితులు, చక్కటి సంభాషణా చతురత గల వారు. ఒక్కొక్కరికీ వేలమంది శిష్యులుండేవారు. వారు వారి గురువు లను ‘తీర్థంకరుడు’ అనే గౌరవానికి అర్హులుగానే భావించేవారు. కానీ మహావీరుడు ‘తీర్థంకరుడై’ వేల ఏండ్లుగా జనంచే పూజింపబడుతున్నాడు. కానీ వారేమో చక్కటి వాగ్ధాటి, పాండిత్యం ఉన్న వారైనా కనుమరుగై కాలగర్భంలో కలిసి పోయారు.ఎక్కువ కాలం మౌనంగా ఉండి, ఎపుడో నాలుగు మాటలు చెప్పిన మహావీరుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? మహావీరుని జ్ఞానం స్వాను భవంతో వచ్చినది, ఇతరులది కేవలం శాస్త్ర పాండిత్యం. అంతరంగంలోని కరుణ నుండి వెలువడిన వాక్కులు మహావీరునివి! వారి వేమో మెదడు నుండి బయల్పడినవి. మహావీరుని మాట కాదు... ఆయన ఉనికే చుట్టూ వున్న వారిపై గణనీయమైన ప్రభావం చూపి వారిలో సమూల మార్పు తెచ్చేది.ఆనాడు దొంగతనం చేసి కుటుంబ పోషణ చేసే ఒక గజదొంగ తన అంత్యదశలో తన కుమారుడికి ఇచ్చిన సలహా: ‘నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మహావీరుడున్న ప్రాంతానికి వెళ్ళవద్దు. ఈ ఊరికి ఆయన వచ్చాడని తెలిస్తే వెంటనే నీవు పొరుగూరికి పారిపో. పొరబాటున కూడా ఆయన చెప్పే ఒక్క మాట కూడా నీ చెవిలో పడకుండా జాగ్రత్త పడు. ఒక్క మాట విన్నా నీవు మన వృత్తిని కొనసాగించలేవు, కుటుంబ పోషణ చేయలేవు జాగ్రత్త.’ దీన్ని బట్టి మహావీరుని మాట ఎంతటి ప్రభావం చూపగలదో అర్థం చేసుకోవచ్చు. (27-35 పుటలు: హిడెన్ మిస్టరీస్–ఓషో) పుణ్య పురుషుల సాన్నిధ్యంలో క్రూరమృగాలు సాధు జంతువులవుతాయి, దుర్మార్గులు సన్మార్గులవుతారు.– రాచమడుగు శ్రీనివాసులు -
గార్దభాలను బండ్లకు కట్టుకుని గుడి చుట్టూ బురదలో ప్రదర్శన (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు..భక్తజనసంద్రం (ఫొటోలు)
-
తిరుపతి : గుడి సంబరం..అంగరంగ వైభవంగా (ఫొటోలు)
-
ఉగాదికి ముందుగానే శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)
-
చిత్తూరు : శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
అగ్నిగుండాలతో ముగిసిన కొమురవెల్లి మల్లన్న జాతర (ఫొటోలు)
-
శ్రీశైలం : కర్ణాటక,మహారాష్ట్రాల నుంచి పాదయాత్రగా వేలాది భక్తులు (ఫొటోలు)
-
ఏపీలో ప్రసిద్ధ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
అడవులకే వెళ్ళాలా? మనసే కీలకం!
పూర్వం అనుభవజ్ఞులైన ఆలోచనాపరులు జీవితానికి సంబంధించి వివిధ దశలలో వివిధ నియమాలను, జీవన పద్ధతులను నిర్దేశించి చెప్పి, ఆ పద్ధతుల ప్రకారం జీవనం సాగిస్తే జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఇహలోకం నుండి నిష్క్రమించడం కూడా అంతగా బాధ అనిపించకుండా జరుగుతుందని చెప్పారు. ఆ పద్ధతులలో ఒక వ్యక్తి గృహస్థుడిగా జీవితాన్ని గడిపి, నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నిర్వర్తించాక, వృద్ధాప్యంలో సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయి, శేషజీవితం అక్కడ గడిపి ప్రశాంతంగా ఇహలోకాన్ని వదిలి ప్రకృతిలో కలిసి పొమ్మన్నారు. అయితే, సన్యాసం స్వీకరించడం అందరూ చేయగలిగే పని కాదనీ, ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న బంధాలను ఒక్కసారిగా తెంచు కుని వెళ్ళిపోవడం ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయ్యే పనీ అని ఆచరణలో తేలింది. ఫలితంగా, అడవులకే వెళ్ళాలా? అన్న ప్రశ్న ఉదయించి, అన్నిటికీ మనసే మూలం కనుక, మనసు చేసే ఆలోచనలను కట్టడి చేస్తే, అడవులకు వెళ్ళవలసిన పనిలేదని చెప్పుకోవడం జరిగింది. ఈ విషయంపై దంతులూరి బాపకవి రచించిన ‘మూర్తిత్రయో పాఖ్యానము’ ద్వితీయాశ్వాసంలో ఆసక్తికరమైన వివరణ ఉంది. ‘ఇల్లు వదిలిపెట్టి అడవులలోకి అడుగుపెట్టగానే కామ సంబంధమైన ఆలో చనలు కరిగిపోయి, బుద్ధి నిష్కామమై మిగులుతుందా? మిగలదు కదా! అలాగే క్రోధ మోహ మద మాత్సర్యాలనే లక్షణాలు కూడా జీవితంలో ఏదో ఒక క్షణం నుండి మొదలై, మరొక క్షణంలో అంత మవ్వాలని కోరుకున్నప్పుడు అంతమయ్యేవిగా ఉండవు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, తాను అలా అయిపోయానని అంటే... అతడిని మించిన మోసగాడు మరొకడు ఉండడు!’ అన్నది ఆ వివరణ సారాంశం. ఆ సందర్భంలో ముఖ్య విషయానికి ముక్తాయింపుగా ఈ క్రింది పద్యం చెప్పబడింది.చదవండి: UoH వర్సిటీ భూములను కాపాడాలి! తే. మనసు నిలుపలేని మనుజుండు వనములోనున్నయంత మోక్షయుక్తి లేదువహ్నిలోన నెన్ని వారముల్ వైచినంగుప్యమునకు హేమగుణము గలదె? ‘మనసును కట్టడి చేసుకోలేకపోతే అడవిలో ఉండి కూడా ప్రయో జనం ఏమీ కలగదు. అగ్నిలో ఎన్ని వారాల పాటు మండించి కరి గించినా కుప్యం (బంగారం, వెండి తక్క అన్యలోహం) బంగారమవు తుందా? కాదు కదా! ఆ విధంగానే ఆలోచనలను అదుపులో ఉంచు కోకుండా కొనసాగించే అడవులలో జీవనం ప్రయోజనం లేనిదిగా పరిణమిస్తుంద’ని భావం.ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?– భట్టు వెంకటరావు -
వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవంగా శివ కల్యాణం (ఫొటోలు)
-
సర్వమతాల భక్తులు కొలిచే సాగర్ మాత
సర్వ మతాల భక్తుల కోర్కెలు తీర్చే క్షేత్రంగా వెలుగొందుతోంది సాగర్ మాత ఆలయం. ఈ ఆలయం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం తీరంలో ఉంది. సాగర్మాత మహోత్సవాలను ఏటా మార్చి 7, 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు. విదేశీయులు సైతం ఈ ఉత్సవాలకు హాజరుకావడం విశేషం. ఉత్సవాల సమయంలోనే కాకుండా.. ప్రతి ఆదివారం భక్తులు ఆలయానికి వస్తుంటారు.ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్మాత (Sagar Matha) ఆలయానికి రాష్ట్రంలోనే విశిష్టత ఉంది. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్రకళా నైపుణ్యం వీటిలో కనిపిస్తుంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత.. సాగర్మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు తదితర అన్ని మతాల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ సంప్రదాయ రీతుల్లో నిర్మాణం ఈ ఆలయం దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతులలో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా చెబుతారు. ధూప, దీప, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయం కావడం విశేషం. కోర్కెలు తీరిన భక్తులు జీవాలను బలి ఇస్తారు. సాగర తీరంలో వంటలు చేసుకొని ఆరగించి వెళ్తారు. సాగర్లో పయనించే నావికుడు.. రాత్రి వేళల్లో నక్షత్రాల సహాయంతో ఓడను నడిపి గమ్యస్థానం చేరినట్లు.. పాపపంకిలమైన లోకమనే సముద్రంలో మానవునికి మంచి అనే దారి చూపేందుకు మరియమాత నక్షత్రంగా ప్రకాశిస్తుందని.. భక్తులు చెబుతారు. ఆ నమ్మకంతోనే దీనికి సాగర్మాత మందిరం అని పేరు పెట్టారు. చదవండి: ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. దీని నిర్మాణానికి మరియదాసుతో పాటు ముమ్మడి ఇగ్నేషియన్, తాను గుండ్ల బాలశౌరి విశేష కృషి చేశారు.ఆకట్టుకుంటున్న జపమాల స్థలాలు 2011 మార్చి 6న కృష్ణానదీ (Krishna River) తీరంలో నిర్మించిన జపమాల క్షేత్రాన్ని గుంటూరు పీఠాధిపతులు గాలిబాలి ప్రారంభోత్సవం చేశారు. ఏసుక్రీస్తు జననం నుంచి మరణం వరకు ఆయన జీవిత చరిత్ర గురించి ఏర్పాటు చేసిన 20 జపమాల స్థలాలు, ధ్యానమందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2024లో సాగర్మాత ఆలయంపై, ఆలయంలోని 14 స్థలాల విగ్రహాలపై దేవదూతల విగ్రహాలను విచారణ గురువులు హృదయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్మాతకు కొబ్బరికాయ కొట్టి అగర్బత్తీల హారతి, తలనీలాలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పుణ్యస్నానాలు చేసి ప్రార్థనలు జరుపుతారు. -
నెల్లూరులో వైభవంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి రథోత్సవం (ఫొటోలు)
-
వరంగల్ జిల్లా : అట్టహాసంగా ప్రారంభమైన కొమ్మాల జాతర (ఫొటోలు)
-
భద్రాచలం : సీతారాముల కల్యాణ పనులు ఆరంభం (ఫొటోలు)
-
కన్నులపండువగా ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం (ఫొటోలు)
-
వైభవంగా పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం (ఫొటోలు)
-
యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం (ఫొటోలు)
-
దైవ భూమిలో ఇటువంటి ఏనుగుల గురించి తెలుసా? (ఫొటోలు)
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..పులకించిన భక్తజనం (ఫొటోలు)
-
శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం. మెరుగైన రోడ్డు సౌకర్యం నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు. (Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?) ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట 27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం 28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.చదవండి: కనువిందు.. ఇందూరు చిందు అత్యంత మహిమాన్వితుడు మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. –బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్ -
హరహర మహదేవ..కాలినడకన శ్రీశైలం చేరుకుంటున్న భక్తులు (ఫోటోలు)
-
శ్రీశైలం : నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
పెద్దగట్టు జాతర : కేసారం చేరిన దేవరపెట్టె..నేడు జాతర ముగింపు (ఫొటోలు)
-
యాదగిరిగుట్ట క్షేత్రంలో వైభవంగా గిరిప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో అరుదైన అర్ధనారీశ్వర దేవాలయం..ఎక్కడో తెలుసా.? (ఫొటోలు)
-
దురాజ్పల్లి : వైభవంగా లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
మినీ మేడారం జాతర మూడో రోజు భక్తుల రద్దీ (ఫోటోలు)
-
వైభవంగా మినీ మేడారం జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీ గజ్జలమ్మదేవి వార్షికోత్సవాలు బోనాలు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
గుణదల మేరీమాత ఉత్సవాలు..వేలాదిగా తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ : ఏడాదిలో రెండు రోజులు మాత్రమే దేవాలయ దర్శనం
ఆత్మకూరు : ప్రముఖ శైవక్షేత్రాల్లో బండి ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరక్షేత్రం ప్రసిద్ధి చెందింది. కాకతీయ, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. దక్షిణ భారత నిర్మాణశైలిని ఆలయంలో గమనించవచ్చు. ఈ క్షేత్రాన్ని చూడాలంటే ఏడాదికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. శివరాత్రి వరకు ఈ క్షేత్రానికి వచ్చే పరిస్థితి లేదు. ఆలయంలో మహాశివుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నారు. ద్వాపరయుగంలో మహాభారత కురుక్షేత్ర సంగ్రామం అనంతరం అశ్వత్థామ.. శ్రీకృష్ణుడి ఆదేశానుసారంతో గుండ్లకమ్మ నది జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఆలయంలో గుండ్లబ్రహ్మేశ్వరస్వామితో పాటు రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు కొలువై ఉన్నాయి. శివరాత్రి మినహా మరొకరోజు మాత్రమే ఆలయాన్ని దర్శించుకునేందుకు అటవీశాఖ అధికారులు అనుమతిస్తారు.ప్రకృతి రమణీయత..గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఎన్నో వృక్షాలు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో 353 వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పులులు, మచ్చలపిల్లి, ఉడతలు తదితర జంతువులు, దుప్పులను చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దేవాలయం సమీపంలో గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో అనేక గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది.ఇలా చేరుకోవచ్చు..వెలుగోడు మీదుగా గట్టుతండా నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని ట్రాక్టర్లు, వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. గతంలో ఆర్టీసీ బస్సులు, అన్ని వాహనాల్లో ఈ క్షేత్రానికి వెళ్లేవారు. తెలుగుగంగ రిజర్వాయర్ను నిర్మించడం, పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి.. ఈ రహదారిని మూసి వేశారు. ఈ రహదారిని ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా అనుమతించాలని అటవీశాఖ అధికారులకు భక్తులు విన్నవించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి దృష్టికి కూడా భక్తులు తీసుకెళ్లారు. ప్రస్తుతం నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు నుంచి సంతజూటూరు గ్రామం నుంచి పెద్దదేవలాపురం గ్రామం మీదుగా ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట వద్ద దిగి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి దిగువమెట్ట మీదుగా గుండ్ల బ్రహ్మేశ్వరానికి అన్నిరకాల వాహనాలు వెళ్తాయి. దూరం 42 కి.మీ ఉంటుంది. ఈ కేత్రానికి చేరాలంటే అటవీశాఖ అధికారులు అనుమతి తీసుకోవాలి. వారు కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. వాహనాలు ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తిరిగి రావాల్సి ఉంటుంది.ప్రతి ఒక్కరూ సందర్శించాలినల్లమల అటవీ పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందే. ఈ క్షేత్రంలో వెలిసిన రాజరాజేశ్వరిమాతను పూ జించాలి. ఈ క్షేత్రానికి ఒకప్పుడు వెలుగోడు, సంతజూటూరు, గిద్దలూరు మీదుగా వేలాది మంది భక్తులు కార్తీకమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో వెళ్లేవారు. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. దేవాలయం అభివృద్ధి చెందాలంటే భక్తులను అనుమతించాలి. ఇక్కడ గుండ్ల బ్రహ్మేశ్వరస్వామిని దర్శిస్తే అనేక జన్మల పుణ్య ఫలితం ఉంటుంది.– కృష్ణశర్మ, ఆలయ పురోహితుడురెండు రోజులు మాత్రమేనల్లమల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఎవరినీ అనుమతించం. కేవలం మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే ప్రకాశం, కర్నూలు జిల్లాల భక్తులను రెండు రోజులు మాత్రమే అనుమతిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– ఉదయ్దీప్,గుండ్ల బ్రహ్మేశ్వరం రేంజ్ ఆఫీసర్ -
వరంగల్ : కాళేశ్వరంలో అంగరంగవైభవంగా మహాకుంభాభిషేకం (ఫొటోలు)
-
కరీంనగర్ : రమణీయం..శ్రీనివాస కల్యాణం (ఫొటోలు)
-
కరీంనగర్ : వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..వైభవంగా ఎదుర్కోలు వేడుక (ఫొటోలు)
-
నార్కట్పల్లి : అంగరంగ వైభవంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుడి కల్యాణోత్సవం (ఫొటోలు)
-
భక్తజనం మధ్య వైభవంగా దేవుని కడప క్షేత్రంలో రాయుని రథోత్సవం (ఫొటోలు)
-
అరసవిల్లి ఎల్లొద్దాం పదర్రా !!
ఓరి సూర్నారాయనా... ఓసి ఉషా..పదర్రా బేగి బయలుదేరితే అరసవిల్లి ఎల్లి ఎలిపొద్దుము.. ఈరోజు అసలే రథ సప్తమి. అలాగ వెళ్లి... దేముడికి దండం పెట్టిసి వచ్చిద్దుము... గాబరా పెడుతున్నాడు సురేసు... ఓరి గుంటడా ఒట్టి నీళ్ళు కాదురా బుర్రమీద రేగిపళ్ళు... జిల్లేడు ఆకు పెట్టుకుని పోసుకోరా పెరట్లొంచి మనవడు ఆదిత్య మీద కేకేసింది నానమ్మ సూరమ్మ.. ఏటే నాయినమ్మా పొద్దుట నుంచి గొల్లు గొల్లు పెడతన్నావు.. చిరాకు పడ్డాడు ఆదిత్య . గొల్లు కాదురా పిక్కిరోడా మన ఊరి దేముడు లోకానికే నాయకుడు ..ప్రపంచానికి దారి చూపే నాయకుడు.. యేటనుకున్నావు చెబుతోంది నానమ్మ పొయ్యిమీంచి నీళ్ళు దించుతూ... ఒసే.. పల్లకోయే నువ్వాన్నీ ఇలాగే సెప్తవు. సిరాకు పడ్డాడు బుడ్డోడు ఆదిత్య.. అవునురా నీకేకాదు..మీ నాన్నకు కూడా ఇలాగే నీళ్ళు పోసేదాన్ని.. మన ఊళ్లో ఆన్న సూర్యనారాయణ స్వామి మన శిక్కోలుకు ఆస్తి. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు మన ఊళ్లో ఉండడం అంటే గొప్ప కాదేట్రా అంది.. పిల్లాడి నెత్తిన జిల్లేడు ఆకులు పెడుతూ అవునే నానమ్మ.. ఈ జిల్లేడు ఆకుల ఎందుకే.. చిన్నప్పటి నుంచి నెత్తి మీద పెట్టి నీళ్ళు పోస్తావు అన్నాడు ఆదిత్య.. ఒరేయ్ ఇవి వట్టి ఆకులు కాదురాజిల్లేడు ఆకుల స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా విశిష్టత ఉంది. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న చెడును సైతం తొలగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా ఉందిరా.. ఏదైనా చోట దెబ్బ తగిలి వాపు, నొప్పి వచ్చినా ఈ ఆకులు నయం చేస్తాయిరా అంది నానమ్మ. ఓహో అన్నాడు బుడ్డోడు. ఒరేయ్ నీకు ఇంకో విషయం చెప్పాలిరా అంది నానమ్మ.. పొద్దున్నుంచి నోరు ఆపకుండా వాగుతూనే ఉన్నావు మళ్లీ ఇంకేం చెప్తావె అన్నాడు ఆదిత్య. ఒరేయ్ అప్పట్లో ఎవరికైనా కొడుకు పుట్టాలి అంటే మన సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని మొక్కుకొని.. సూర్య నమస్కారాలు చేస్తే కొడుకు పుట్టేవాడ్రా.. మీ నాన్న కూడా నాకు అలాగే పుట్టాడు.. అందుకే వాడికి సురేష్ అని పేరు పెట్టాం అంది నానమ్మ.. ఓహో అందుకేనా మా నాన్న తరచు అరసవిల్లి గుడికి వెళుతుంటాడు అన్నాడు పిల్లాడు.. అవున్రా సూర్యనారాయణ స్వామి మన శ్రీకాకుళానికి ఆస్తి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి ఒక వెలుగు.. అందుకే మనం అందరం గుడికి పోదాం.. ముందు పిడకల మీద పరమాన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టి రిక్షాల వెళ్లిపోదాం సరేనా అంది నానమ్మ.. మన ఊళ్లో కాకుండా ఇంకెక్కడా సూర్యుడికి గుళ్ళు లేవా నానమ్మా అడిగాడు ఆదిత్య.. ఉన్నాయిరా కాశ్మీర్లో మార్తాండ ఆలయం ఉండేది.. కానీ అందులో పూజల్లేవు.. శిథిలమైంది.. ఒరిస్సా కోణార్క్ లో ఉన్నదీ సూర్యుని ఆలయమే కానీ అక్కడా పూజలు ఉండవు.. ఈ దక్షిణ దేశంలో పూజలందుకుంటున్న సూర్య ఆలయం మన ఊళ్లోనే ఉందిరా చిన్నా అని. చదవండి: పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదుసూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా ధన.. గుణ సంపన్నులు అవుతారు బుజ్జి..నువ్వు రోజూ ఆయన్ను నమస్కరించి వీలైతే సూర్యనమస్కారాలు చేసుకో.. ఆరోగ్యం ఐశ్వర్యం దక్కుతాయి.. చెప్పింది నానమ్మ.. అదెలాగే అన్నాడు ఆదిత్య... అవునురా సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి పూజించడం ద్వారానే శమంతక మణిని పొందాడు.. అది రోజుకు ఎంత బంగారం ఇస్తుందో తెలీదు.. అంతెందుకు రోజూ ఎండలో కాసేపు నిలబడితే ఒంటికి కూడా మంచిదిరా.... విటమిన్లు వస్తాయి చెప్పింది నానమ్మ.. నానమ్మ విటమిన్లు ఎండలో వస్తాయి కదాని నన్ను ఎండలో నడిపిస్తే కుదరదు. రిక్షాలో వెళ్దాం . నాకు అక్కడ సెనగలు ఖజ్జూరం కొనాలి మరి అన్నాడు..పిల్లాడు.. సరే పదండి..గమ్మున వెళ్ళి లైన్లో నిలబడదాం.. ఆదిత్యుణ్ణి దర్శిద్దాం అంటూ అందరూ బయల్దేరారు..- సిమ్మాదిరప్పన్న -
తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు (ఫొటోలు)
-
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్తో పర్ఫెక్ట్ టైమింగ్తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్తో పాటు అమెరికా, లండన్లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
వసంత పంచమి వేళ..విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
కనులపండువగా చెర్వుగట్టు జడల పార్వతీ రామలింగేశ్వర స్వామి నగరోత్సవం (ఫొటోలు)
-
ఆదిలాదాబాద్ : వైభవంగా నాగోబా జాతర..గంటల తరబడి క్యూలో భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
ఆ కేసుతో జీవితమే తలకిందులు.. సన్యాసం తీసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఆదిలాబాద్ : నాగోబా జాతర..ఇంద్రాదేవికి ‘మెస్రం’ పూజలు (ఫొటోలు)
-
సరస్వతి దేవికి అంకితం.. వర్గల్ ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా? (ఫొటోలు)
-
కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం,అగ్నిగుండాలు తరించిన భక్తకోటి (ఫొటోలు)
-
గాజులరామారం చిత్తారమ్మా జాతర..అశేష భక్తజనం (ఫొటోలు)
-
'గజేంద్ర మోక్షం' ఆధారంగా ఆలయం!
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు. అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి. ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది. – సురేశ్, శాంతినగర్ చరిత్ర కలిగిన ఆలయం గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. – అంజి, రాజోలి -
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)
-
విశాఖపట్నం : పాలను సముద్రంలో వదిలి..గంగమ్మతల్లికి పూజాలు (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)
-
విశాఖపట్నం : కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
రాజమహేంద్రవరం : ఘనంగా మరిడమ్మ తల్లి బోనాల జాతర (ఫొటోలు)
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా ఏడు గంగమ్మల జాతర (ఫొటోలు)
-
అహం బ్రహ్మాస్మి
దైవం ఒక నమ్మకం కాదు. సత్యమే, దైవం. నమ్మకాలన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు సత్యం కానే కాదు. నమ్మకాలేవీ నిజాలు కాదు. నమ్మకాలకు, విషయజ్ఞానానికి అతీతమైనదే సత్యం. దైవాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. సత్యాన్ని నీలోపల అన్వేషించాలి. భౌతికమైన ఆచారాలు, క్రతువులు ఏవీ కూడా నీకు దైవాన్ని తెలియజేయలేవు. అహం అనే అడ్డును తొలగించుకోనంత వరకు దైవాన్ని తెలుసుకోలేవు. నిన్ను దైవం నుండి వేరు చేసేది అహమే. అహం అనే భ్రమ వీడితే మిగిలేది దైవమే... దివ్యచైతన్యమే... అదే అసలైన నీవు... అదే నీ సహజస్థితి.. అదే దైవం. ప్రతిక్షణం చైతన్యంతో ఉండాలి. ఏపని చేస్తున్నా దానితో కలిసిపోకుండా ఒక సాక్షీ చైతన్యంగా ఉండాలి. చేసేవాడివి నీవు కాదు. అనుభవించేవాడివి కూడా నీవు కాదు. వీటిని చూస్తున్న ద్రష్టవే నీవు. అదే ఆత్మ, అదే దైవం, ఆ అద్వైతస్థితే దైవం. మనస్సు ‘నేను’ కాదు. మనస్సు వెనుక దాన్ని సాక్షిగా చూస్తున్న చైతన్యమే ‘నేను’. ఈ ‘నేను’ కి పుట్టుక లేదు చావు కూడా లేదు ద్వంద్వాలకు అతీతం. దాన్ని ఏదీ కలుషితం చేయలేదు. ఆ ఆత్మస్థితే నీ సహజస్థితి. విషయాలకు అంటని ఆ సాక్షివి కావాలి. అప్పుడే భ్రమలతో పుట్టిన ‘నేను’ అంతమై అసలైన ‘నేను’ (ఆత్మ) ప్రజ్వలిస్తుంది. ఆలోచనలన్నీ అంతమై ఆత్మ ప్రకాశిస్తుంది. ఏమి జరుగుతున్నా సరే నీవు ఈ అత్మస్థితిలోనే ఉండాలి. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, వింటున్నా, నిద్ర΄ోతున్నా... నీవు సాక్షిగా ఉండిపోవాలి. మనం ఇప్పుడు అనుకుంటున్నది మెలకువ కానే కాదు. కళ్ళు తెరిచినా నిద్రలోనే ఉంటున్నాం. మన నిజతత్వం పట్ల ఎరుకలేకుండా శరీరమే నేను, మనస్సే నేను అనే భ్రమలో ఉంటూ ఉన్నాం. నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. అది తెలిసిన క్షణం ఆలోచనలు అగిపోతాయి. నీ నిజతత్వాన్ని ప్రతిబింబిస్తావు, నీవే ఆత్మగా ఉండి΄ోతావు. ఆ స్థితిలో సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరుగుతుంది. నమ్మవలసిన అవసరమే లేదు. నీవే సత్యం, నీవే దైవం. సత్యం అంటే ఆలోచనలు, నమ్మకాలు, సూత్రాలు, వర్ణనలు, విషయజ్ఞానం మొదలైనవేవీ కావు. సత్యం నీలోనే ఉంది. నీ నిజతత్వమే సత్యం. దైవం గురించిన వర్ణనలు, సిద్ధాంతాలు, పుస్తక జ్ఞానం మొదలైనవేవీ దైవాన్ని అనుభవంలోకి వచ్చేలా చేయలేవు. పైగా ఇంకా అడ్డుపడతాయి. అహాన్ని పెంచుతాయి. మనస్సును బలపరుస్తాయి. ఈ మనస్సు ఖాళీ ఐనపుడే సత్యం అనుభవమౌతుంది. ఈ సమాజమంతా మనస్సుతో నిర్మితమైదే. నీవు చూడాలనుకున్నదే కనబడుతుంది. మనస్సు భ్రమలతోనే నిర్మితం. దైవాన్ని కూడా వివిధ రూ΄ాల్లో ఊహించుకుంటుంది. అసలు మనస్సు, పదార్థం అనేవి కూడా లేవు. స్వచ్ఛమైన చైతన్యమే నీవు. అదే సత్యం... అదే దైవం.– స్వామి మైత్రేయ -
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు: వైభవంగా పంచమితీర్థం
-
భక్తుల కొంగు బంగారం.. సుందరమైన సూగూరేశ్వర ఆలయం (ఫొటోలు)
-
చంద్రగిరి : స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మీమగా శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
చంద్రగిరి : శ్రీమహాలక్ష్మి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం (ఫొటోలు)
-
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
హైదరాబాద్లో చికున్ గున్యా ,డెంగీ జ్వరాల విజృంభణ.. (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు (ఫొటోలు)
-
సముద్ర స్నానాలు ఆచరించి..భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం..భక్తకోటి పరవశం (ఫొటోలు)
-
కార్తీక సోమవారం.. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు (ఫొటోలు)
-
హైదరాబాద్లో చిత్రగుప్త ఆలయం: ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా మహా హారతి (ఫొటోలు)
-
వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..భారీగా తరలివచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు (ఫొటోలు)
-
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
తిరుపతి : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
తిరుపతి : పోలేరమ్మ నగరోత్సవం..కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
తిరుపతి జిల్లా వెంకటగిరి లో పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కాణిపాకం : కనులపండువగా సిద్ధి వినాయక రథోత్సవం (ఫొటోలు)
-
సుగుణ భూషణుడు... విభీషణుడు!
విభీషణుడు విశ్రవసు, కైకసిల సంతానమే విభీషణుడు, రావణాసురుని చిన్న తమ్ముడు. అందరికంటే పెద్దవాడు రావణాసురుడు, కుంభకర్ణుడు రెండవవాడు. విభీషనుడు వీరిద్దరికంటే పూర్తి భిన్నమైన వాడు. సంస్కారవంతుడు, ఉత్తమోత్తమగుణాలు కలవాడు. సోదరులంటే అభిమానం కలవాడు. అందులో రావణాసురుడు అంటే భయభక్తులున్నవాడు. సీతమ్మ వారిని రావణాసురుడు చెర పట్టినప్పుడు‘అన్నా నీకు ఇది తగదు’ అని మొదట హెచ్చరించింది విభీషణుడే. తదుపరి ఎన్నడూ రావణుని మందిరానికి వెళ్ళింది లేదు.హనుమ లంకాదహనం చేసినప్పుడు మరోసారి రావణునికి హితబోధ చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రావణుడు, సీతమ్మ దగ్గరకు వెళ్ళి గడువు పెట్టి వస్తున్నప్పుడు, రావణుని ఏకాంతంగా కలసి చెప్పాలనుకుని భయంతో విరమించుకున్నాడు. ఈ దిశలో రామలక్ష్మణులు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి రావడం, రావణునితో సమర భేరి మోగించడం జరిగింది ఆ సమయంలో రాచకొలువులో కోపోద్రిక్తుడై యుద్ధంలో ఆ రోజు విధులను కొంతమంది రాక్షస వీరులను నియమించాడు. అప్పుడు కూడా విభీషనుడు, రావణునికి చెప్పలేకపోయాడు. అన్న అంటే అంత భయం అతనికి. యుద్ధంలో రాక్షస వీరులు మరణిస్తుంటే తట్టుకోలేక పోయాడు విభీషణుడు. అప్పుడే పూజ ముగించి దైర్యంతో నేరుగా రావణుని దగ్గరకు వెళ్ళాడు.. అప్పుడు రావణుడు ‘‘రా విభీషణా!రేపు యుద్ధంలో నీవే నాయకత్వం వహించాలి’’ అని చెబుతుండగా, విభీషణుడు చేతులు జోడించి ‘అగ్రజా! యుద్ధం మనకు వద్దు.సీతమ్మ పరమ సాధ్వి. ఆ రామలక్ష్మణులు దైవాంశ సంభూతులు... అందువల్ల... ’’ అంటుండగా రావణుని తీక్షణ చూపులు చూడలేక తల దించుకున్నాడు. మళ్ళీ ధైర్యంతో ‘ఒక్కసారి ఆలోచించు ఒక రాజుగా మీకు ఇది శ్రేయస్కరం కాదు. రాజు ప్రజల బాగోగులు చూడాలి. స్త్రీలకు రక్షణగా ఉండాలి. నా మాట విను, ఆ సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించు. సమయం మించి పోలేదు. చేసిన తప్పు ఒప్పుకుని ఆ శ్రీరాముల వారిని శరణు వేడు. నీకు జయం కలుగుతుంది. శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచి గుణాలు అయనకు ఉన్నాయి, మీ మేలు కోరి ఈ లంక ప్రజల తరపున చివరిసారిగా చెబుతున్నాను. సీతమ్మ వారిని అప్పగించు, చేసిన తప్పు ఒప్పుకో! నిన్ను శ్రీ రాములు వారు కరుణిస్తారు’’ అని పరి పరి విధాలుగా చెప్పాడు.ఆ మాటలు విని రావణుడు ‘‘అయ్యిందా నీ ఉపన్యాసం? నాకే నీతులు చెబుతావా! ముల్లోకాలలోనూ నాకు ఎదురు లేదు అనే విషయం నీకు తెలియదా! ఆ రాముని వధించి, సీతను వివాహం చేసుకొనుటకే నేను నిశ్చయించుకున్నా, నీ హితబోధ నాకు కాదు. ఇదే నిన్ను శాసిస్తున్నాను. రేపు యుద్ధ భూమిలో నీవే ప్రధాన బాధ్యత వహించాలి ఇది నా ఆజ్ఞ’’ అని చర చర వెళ్ళిపోయాడు రావణుడు. విభీషణుడు అన్నీ ఆలోచించి శ్రీరాముల వారి దగ్గరకు ‘శరణు, శరణు’ అని వెళ్ళాడు.శ్రీ రాముడు అతన్ని చూశాడు. వినమ్రంగా, చేతులు జోడించి ఉన్న విభీషణుని చూడగానే ఆసనంపై నుంచి లేచి తన హృదయానికి హత్తుకున్నాడు.‘నా జన్మ ధన్యమైంది ప్రభూ’’ అంటూ శ్రీ రాముల వారి పాదాలు తాకి తన భక్తి, వినయం నిరూపించుకున్నాడు. ఆ విధంగా శ్రీరాముడితో విభీషణునికి స్నేహం కుదిరింది. రాముడికి యుద్ధంలో చేదోడుగా ఉన్నాడు. రావణుని మరణానంతరం లంకకు విభీషణుడు రాజైనాడు. ఇది శ్రీ రాముల వారు, విభీషణునికి ఇచ్చిన కానుక. లంకకు రాజైన విభీషణుడు సుపరిపాలన చేసి, ప్రజలకు ఉత్తమ పాలన అదించాడు. విభీషణుని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు -
ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి..
శౌనక మహర్షి వంశంలో సునహోత్రుడు అనే తపస్వి ఉన్నాడు. ఆయన వేదవేదాంగ శాస్త్ర పారంగతుడు, ధర్మనిరతుడు, శమదమాది సంపన్నుడు. సంసారాశ్రమంలో ఉన్నా, నిత్య కర్మానుష్ఠానాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. అతడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు: కౌశుడు, శాల్ముడు, గృత్సమదుడు. సునహోత్రుడి ముగ్గురు కొడుకుల్లోనూ గృత్సమదుడు మహాతపస్విగా ప్రఖ్యాతి పొందాడు.వేదవేత్త అయిన గృత్సమదుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకోదలచాడు. వేదమంత్రాలతో అగ్నిదేవుడిని భక్తిగా స్తుతించాడు. అగ్నిదేవుడికి ప్రీతికరమైన మంత్ర సప్తకాన్ని పఠిస్తూ, యజ్ఞం చేశాడు. గృత్సమదుడి నిష్కళంక భక్తితత్పరతలకు అగ్నిదేవుడు అమిత ప్రసన్నుడయ్యాడు. అతడి ఎదుట దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గృత్సమదుడు వరమేదీ కోరకపోయినా, అతడికి అగ్నిదేవుడు దివ్యశరీరాన్ని అనుగ్రహించాడు. ముల్లోకాలలో మూడు శరీరాలతో ఒకేసారి సంచరించగల దివ్యశక్తిని ప్రసాదించాడు.అగ్నిదేవుడి కటాక్షంతో దివ్యశరీరధారి అయిన గృత్సమదుడు సాక్షాత్తు ఇంద్రుడిలా ప్రకాశించసాగాడు. భూమిపైన, ఆకాశంలోను, గాలిలోను ఒకేసారి మూడు దివ్యశరీరాలతో స్వేచ్ఛగా తిరుగాడసాగాడు. అలా తిరుగుతూ ఒకనాడు గృత్సమదుడు స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడి శత్రువులైన ధుని, చమురి అనే ఇద్దరు రాక్షస సోదరులు స్వర్గంలోని నందనవనంలో ఉల్లాసంగా విహరిస్తున్న గృత్సమదుడిని చూశాడు. ఇంద్రుడిలాంటి దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న గృత్సమదుడిని చూసి, అతడే ఇంద్రుడనుకున్నారు. ‘మన అదృష్టం కొద్ది ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు. ఇదే తగిన అదను. ఇక్కడే అతణ్ణి మట్టుబెట్టేద్దాం’ అని రాక్షస సోదరులిద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయుధాలు పట్టుకుని, ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి విరుచుకుపడ్డారు.హాయిగా విహరిస్తున్న తన ఎదుట ఇద్దరు రాక్షసులు ఆయుధాలతో ప్రత్యక్షమవడంతో గృత్సమదుడు ఒకింత ఆశ్చర్యపోయాడు. దివ్యదృష్టితో వారి ఆంతర్యాన్ని కనుగొన్నాడు. ఏమాత్రం తొణకకుండా, తన క్షేమం కోసం, వారి నాశనం కోసం ఇంద్రుడి గుణగణాలను ప్రశంసించే వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి గుణగణాలను వినగానే దాడికి తెగబడ్డ ఇద్దరు రాక్షసులకూ భయంతో గుండె జారినంత పనైంది. ‘అనవసరంగా పొరపాటు చేశామా’ అని ఆలోచనలో పడ్డారు. వారు ఇంకా తేరుకోక ముందే ఇంద్రుడు అక్కడకు ఐరావతంపై వచ్చాడు. రాక్షస సోదరులు ధుని, చమురి ఒకేసారి ఇంద్రుడి మీదకు ఆయుధాలు ప్రయోగించారు. ఇంద్రుడు వాటిని తన వజ్రాయుధంతో తుత్తునియలు చేశాడు. ఇద్దరు రాక్షసులనూ తన వజ్రాయుధంతోనే మట్టుబెట్టాడు.ఆ సంఘటనతో ఇంద్రుడిని ప్రత్యక్షంగా చూసిన గృత్సమదుడు పరమానందం పొందాడు. మళ్లీ ఇంద్రుడిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి శౌర్యప్రతాపాలను, గుణగణాలను వేనోళ్ల పొగిడాడు. గృత్సమదుడి స్తోత్రానికి ఇంద్రుడు సంతోషించాడు. ‘మునివర్యా! నేటితో నువ్వు నాకు మిత్రుడివయ్యావు. నువ్వు చేసిన ప్రశంస నీ నిష్కల్మషమైన అంతఃకరణకు సాక్షి. నీ స్తోత్రం నాకు ప్రీతి కలిగించింది. నువ్వు చేసిన స్తుతి నీ సమస్తమైన కోరికలనూ ఈడేరుస్తుంది. నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు.‘దేవేంద్రా! నీ కటాక్షంతో నాకు దివ్యమైన వాక్చమత్కృతి, సకల ఐశ్వర్యాలు కలగనివ్వు. నిరంతరం నా హృదయంలో నీ స్మరణనే ఉండనివ్వు. ఎల్లప్పుడూ నీ అనుగ్రహాన్ని పొందనివ్వు’ అని కోరాడు. ఇంద్రుడు ‘తథాస్తు!’ అన్నాడు. అంతే కాకుండా, గృత్సమదుడి చేయి పట్టుకుని, తనతో పాటు తన ప్రాసాదానికి తీసుకుపోయాడు. అతిథి మర్యాదలు చేశాడు. గృత్సమదుడికి ఇంద్రుడు అతిథి మర్యాదలు చేస్తుండగా, దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. బృహస్పతిని చూసిన గృత్సమదుడు ఆయనను స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. బృహస్పతి సంతోషించి, ‘సురేశ్వరుడిని, సురగురువును విద్యా వినయాలతో సంతృప్తి పరచినవాడి కంటే మేధావి మరొకడు లేడు’ అని పలికాడు. కొన్నాళ్లు ఆతిథ్యం పొందాక గృత్సమదుడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని, తన ఆశ్రమానికి బయలుదేరాడు.అగ్నిదేవుడి వరప్రభావంతో గృత్సమదుడు కోరుకున్నప్పుడల్లా త్రిలోక సంచారం చేస్తూ కాలక్షేపం చేసేవాడు. క్రమం తప్పకుండా ఆచరించే నిత్యానుష్ఠానాలలో అగ్నిని, ఇంద్రుడిని, బృహస్పతిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండేవాడు. ఇలా ఉండగా, ఒకనాడు ఇంద్రుడికి గృత్సమదుడి భక్తిని పరీక్షించాలనే ఆలోచన పుట్టింది.వెంటనే ఇంద్రుడు ఒక పక్షిరూపం ధరించాడు. అడవిలో అరణిని, దర్భలను ఏరుకుంటూ ఉన్న గృత్సమదుడి భుజం మీద వాలాడు. గృత్సమదుడు కొంత దూరం ముందుకు కదిలినా, భుజం మీద వాలిన పక్షి ఎగిరిపోలేదు. గృత్సమదుడు దివ్యదృష్టితో తన భుజం మీద వాలిన పక్షి ఇంద్రుడేనని గ్రహించాడు. పక్షిరూపంలో ఇంద్రుడి ఆకస్మిక ఆగమనానికి సంతోషభరితుడై, ఇంద్రుడిని ఖగేంద్రుడిగా, సురేంద్రుడిగా స్తుతిస్తూ స్తోత్రం పఠించాడు.గృత్సమదుడికి తనపైనున్న అనన్యభక్తికి సంతోషించిన ఇంద్రుడు నిజరూపంలో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘మిత్రమా! నీ భక్తి తత్పరతలపై నాకిక ఎటువంటి సందేహమూ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ నీవు నాకు మిత్రుడవై ఉంటావు. నాకు నిన్ను మించిన ఉత్తమ భక్తుడెవరూ లేరు. నీ కోసం స్వర్గద్వారాలు, ఇంద్రభవన ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. నీవు ఎప్పుడు కోరుకున్నా, యథేచ్ఛగా, నిరాటంకంగా నా వద్దకు వచ్చిపోతూ ఉండు’ అని పలికి, సెలవు తీసుకుని స్వర్గానికి పయనమయ్యాడు. – సాంఖ్యాయన -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
August 30: ఆధ్యాత్మిక సమాచారం..
శ్రీవారి దర్శనానికి 18 గంటలు..తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 76,772 మంది స్వామివారిని దర్శించుకోగా 30,293 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆగమోక్తంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు..శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురుదక్షిణామూర్తికి పలు రకాల అభిõÙక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమరి్పంచారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..సింహాచలం: సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం స్వర్ణపుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుదీర్చారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు.కనకమహాలక్షి్మకి త్రికాల పంచామృతాభిషేకం..డాబాగార్డెన్స్: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు గురువారం 25వ రోజుకు చేరాయి. అమ్మవారికి విశేష పూజలు, త్రికాల పంచామృతాభిషేక సేవ, విశేష హోమాలు నిర్వహించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని జపగతినగరంలో వేంచేసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద నాట్య ప్రదర్శన, కోలాటం వంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.నేటితో ముగియనున్న వరలక్ష్మీ వ్రతాలు..సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మీ వత్రాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ సామూహిక వ్రతాల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్న మహిళలు ఉదయం 9 గంటలకు ఆలయానికి హాజరుకావాలన్నారు.ఘనంగా సామూహిక సత్య దత్త వ్రతాలు..పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేక అభిõÙకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ పెంపు.. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ రుసుము సెపె్టంబరు ఒకటో తేదీ నుంచి పెరగనుంది. ప్రస్తుతం రూ.1,500గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.2 వేలకు పెంచుతున్నటుŠట్ ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు గురువారం వెల్లడించారు. స్వామివారికి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, కోర్కెలు తీరాలని మొక్కుకున్నవారు ఈ సేవలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 100 మంది, ప్రతి శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 230 నుంచి 250 మంది వరకు దంపతులు ఈ సేవలో పాల్గొంటున్నారు. -
ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.భక్తులతో కిటకిట.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు... – అలంపూర్ జోగులాంబ దేవాలయం – బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం – వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం – కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం – యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం – చిలుకూరు బాలాజీ దేవాలయం – ఖర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం – ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిరుపతి ఫీల్ ఉంది..కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ -
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)
-
తిరుమల : రూములు లేవు గోవిందా ... (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం (ఫొటోలు)
-
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
వింధ్యపర్వతాన్ని అణచిన అగస్త్యుడు..
బ్రహ్మదేవుడి ఆదేశంతో సూర్యుడు మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ లోకానికి వెలుగు పంచుతూ వస్తున్నాడు. సూర్యుడు ప్రదక్షిణ చేసే పర్వతం కావడంతో మిగిలిన దేవతలందరూ మేరువును గౌరవించసాగారు. మేరువు వైభవం వింధ్యపర్వతానికి అక్కసు కలిగించింది. సూర్యుడు మేరువు చుట్టూనే తిరుగుతుండటం, దేవతలు సైతం మేరువునే గౌరవిస్తుండటం, మేరువును గౌరవించే వారెవరూ తనను పట్టించుకోకపోవడం వింధ్యుడి అహాన్ని దెబ్బతీసింది.నారద మహర్షి ఒకనాడు ఆకాశమార్గాన వింధ్యను దాటుకుని కాశీనగరం వైపు వెళుతుండగా, వింధ్యుడు ఆయనను పలకరించి, ‘మహర్షీ! మా పర్వతాల్లో మేరువు గొప్పా? నేను గొప్పా?’ అని అడిగాడు. ‘ఇద్దరూ ఉన్నతులే! ఎవరి గొప్ప వారిదే!’ అని పలికి, నారద మహర్షి నారాయణ నామజపం చేస్తూ ముందుకు సాగిపోయాడు. నారదుడి సమాధానం వింధ్యుడికి రుచించలేదు.ఒకనాడు వింధ్యుడు ఉండబట్టలేక సూర్యుడిని అడ్డగించి, ‘ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను. నువ్వు ఆ మేరుపర్వతం చుట్టూనే ప్రదక్షిణగా తిరుగుతున్నావు. నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం? నీకిది ఏమైనా మర్యాదగా ఉందా?’ అని నిలదీశాడు. ‘సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకే నేను మేరువు చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను ఆయన ఆజ్ఞ మీరి లోకరీతిని తప్పితే, జీవులకు మనుగడ అసాధ్యం’ అన్నాడు సూర్యుడు.సూర్యుడి మాటలు వినే స్థితిలో లేని వింధ్యుడు ‘లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతుల మాట కూడా నెగ్గాలి. రేపటి నుంచి నువ్వు నా చుట్టూ కూడా తిరుగు’ అని హుకుం జారీ చేశాడు.‘అయ్యా! నేనేమీ చేయలేను. మేరుపర్వతం మహోన్నతమైనదే కాదు, సృష్టికర్త ఆదేశం కూడా తనకే అనుకూలంగా ఉంది’ అంటూ సూర్యుడు చక్కా పోయాడు.అహం దెబ్బతిన్న వింధ్యుడు ఎలాగైనా మేరువుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తనను తాను అంతకంతకూ పెంచుకుని, ఆకాశానికి అడ్డుగా నిలిచాడు. ఆ దెబ్బకు సూర్యచంద్రుల గతులు తప్పి లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్యుడి విశ్వరూపం చూసి, దేవతలకు దిక్కు తోచలేదు. వారంతా వెంటనే ఇంద్రుడి వద్దకు పరుగు పరుగున వెళ్లి, జరుగుతున్న ఉత్పాతాన్ని వివరించారు.లోకానికి తలెత్తిన ఈ విపత్తును తప్పించగల సమర్థుడు అగస్త్యుడు మాత్రమేనని తలచాడు ఇంద్రుడు. వెంటనే దేవతలను వెంటపెట్టుకుని, అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. వింధ్యుడి ఆగడాన్ని ఆయనకు చెప్పి, ‘మహర్షీ! ఎలాగైనా నువ్వే ఈ ఆపదను తప్పించాలి’ అని ప్రార్థించాడు. ‘మరేమీ భయం లేదు. వింధ్యుడి సంగతి నేను చూసుకుంటాను’ అని చెప్పి అగస్త్యుడు ఇంద్రాది దేవతలను సాగనంపాడు. ఇంద్రాదులు తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాక, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్యపర్వతం దిశగా బయలుదేరాడు. దేవతలు, మహర్షులు పట్టించుకోవడం మానేసిన తనవైపు అగస్త్యుడు సతీ సమేతంగా వస్తుండటం చూసి, వింధ్యుడి ఆనందానికి అవధులు లేకపోయాయి.‘మహర్షీ! నా జన్మ ధన్యమైంది. నేను తమ వద్దకు రాలేనని ఎరిగి, నా జన్మ పావనం చేయడానికే మీరిలా తరలి వచ్చినట్లున్నారు. మీకు ఏవిధంగా సేవ చేయగలనో ఆదేశించండి’ అంటూ అగస్త్యుడి ముందు మోకరిల్లాడు వింధ్యుడు.‘ఓ పర్వతరాజా! నేను అత్యవసరమైన పని మీద దక్షిణ దిశగా వెళుతున్నాను. నువ్వేమో దారికి అడ్డుగా ఇంత ఎత్తుగా ఉన్నావు. అసలే పొట్టివాణ్ణి. నువ్వు కాస్త తలవంచి తగ్గావంటే, ఏదోలా నిన్ను దాటుకుని దక్షిణాపథం వైపు వెళతాను’ అని పలికాడు అగస్త్యుడు.‘ఓస్! అదెంత పని!’ అంటూ వింధ్యుడు తలవంచి, పూర్తిగా మోకరిల్లాడు.వింధ్యుడు శిరసు వంచడమే తరువాయిగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి పర్వతానికి అటువైపు చేరుకున్నాడు. ‘పర్వతరాజా! నాది మరో విన్నపం. పని పూర్తయ్యాక నేను ఏ క్షణాన అయినా ఇటు తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉన్నావంటే, నేను సులువుగా నా ప్రయాణాన్ని పూర్తి చేసుకోగలను’ అన్నాడు. మాట నిలబెట్టుకోవడానికి వింధ్యుడు తలవంచుకుని అలాగే ఉండిపోయాడు. అగస్త్యుడు ఇప్పటికీ అటువైపుగా మళ్లీ రాలేదు. వింధ్యుడి గర్వాన్ని అగస్త్యుడు చాకచక్యంగా అణచాడు. – సాంఖ్యాయన -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
తుల్జాభవానీ అమ్మవారి సేవలో జెనిలీయా దంపతులు.. (ఫొటోలు)
-
మారిషస్ : 108 అడుగుల వేంకటేశ్వర స్వామి విగ్రహం (ఫొటోలు)
-
విశాఖపట్నం : భక్తిశ్రద్ధలతో మార్వాడిల కావడి యాత్ర (ఫొటోలు)
-
చ్యవనుడి చేతిలో.. ఇంద్రుడి గర్వభంగం?
అశ్వనీ కుమారుల వల్ల చ్యవన మహర్షికి నవయవ్వనం లభించింది. తనకు యవ్వనాన్ని ప్రసాదించిన అశ్వనీ దేవతలకు ప్రత్యుపకారం చేయాలని తలచాడు చ్యవనుడు. అప్పటికి అశ్వనీ కుమారులకు సోమపానం చేసే అర్హత లేదు. అందువల్ల వారి చేత సోమపానం చేయిస్తానని చ్యవనుడు ప్రతిజ్ఞ చేసి, వారిని సాదరంగా సాగనంపాడు. యవ్వనవంతుడైన చ్యవనుడిని చూడటానికి ఒకనాడు అతడి మామగారైన సంయాతి వచ్చాడు. నవయవ్వన తేజస్సుతో మెరిసిపోతున్న అల్లుడిని చూసి సంయాతి సంతోషించాడు.తన రాజ్యం సుభిక్షంగా ఉండటానికి, రాజ్యప్రజల క్షేమం కోసం, తన అభివృద్ధి కోసం యజ్ఞం తలపెట్టానని సంయాతి చెప్పాడు. మామగారు యజ్ఞం తలపెట్టడం పట్ల చ్యవనుడు సంతోషం వ్యక్తం చేశాడు. తానే స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తానని చెప్పి, యజ్ఞానికి ముహూర్తాన్ని నిర్ణయించాడు. యజ్ఞ ముహూర్తానికి కొద్దిరోజులు గడువు ఉండగానే భార్య సుకన్యతో కలసి చ్యవనుడు మామగారైన సంయాతి ఇంటికి చేరుకున్నాడు. నిర్ణీత ముహూర్తానికి సంయాతి తన అల్లుడు చ్యవనుడి ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞానికి ఇంద్రాది అష్టదిక్పాలకులు వచ్చారు.యజ్ఞం శాస్త్రోక్తంగా జరుగుతోంది. పురోహితులు మంత్ర సహితంగా హవిస్సులను సమర్పిస్తున్నారు. యజ్ఞంలో సోమాన్ని సమర్పించే ఘట్టం వచ్చింది. అశ్వనీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చ్యవనుడు వారికి కూడా సోమాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. చ్యవనుడు చేయబోతున్న పనిచూసి ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ‘అశ్వినులు దేవతలు కారు. వారికి సోమపానార్హత లేదు. వారికి సోమాన్ని సమర్పించడం అనాచారం’ అంటూ అభ్యంతరపెట్టాడు. మిగిలిన దిక్పాలకులు కూడా ఇంద్రుడికి వంత పలికారు.చ్యవనుడు వారిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, అశ్వినులకు సోమాన్ని సమర్పించాడు. చ్యవనుడి చేతుల మీదుగా అశ్వినులు సంతృప్తిగా సోమపానం చేశారు. అశ్వినులు సోమపానం చేయడాన్ని కళ్లారా చూసిన ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. పట్టరాని ఆగ్రహంతో రగిలిపోతూ, చ్యవనుడిపై విసరడానికి తన వజ్రాయుధాన్ని పైకెత్తాడు. మహిమాన్వితుడైన చ్యవనుడు మంత్రోచ్ఛాటన చేస్తూ, ఇంద్రుడి వైపు తన చూపు సారించాడు. వజ్రాయుధంతో పైకెత్తిన ఇంద్రుడి చేయి అలాగే కదలకుండా నిలిచిపోయింది. ఇంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసి మిగిలిన దిక్పాలకులంతా హతాశులయ్యారు.వెంటనే చ్యవనుడు యజ్ఞగుండంలో హవిస్సును వేయగా, అందులోంచి భీకరాకారుడైన ‘మధుడు’ అనే రాక్షసుడు పుట్టుకొచ్చాడు. భూమ్యాకాశాలను తాకుతున్నట్లున్న శరీరం, పదునైన కోరలు, అగ్నిజ్వాలలాంటి నాలుకతో పెదవులు నాక్కుంటూ వచ్చి ఇంద్రుణ్ణి అమాంతం మింగేయబోయాడు. ఇది చూసి దిక్పాలకులు హాహాకారాలు చేశారు. ఇంద్రుడు భయకంపితుడయ్యాడు.‘రక్షించు మహర్షీ! రక్షించు!’ అంటూ చ్యవనుడి పాదాల మీద పడ్డాడు. అశ్వనీకుమారుల సోమపానానికి తాను అంగీకరిస్తున్నానని ప్రకటించాడు. ఇంద్రుడి పట్ల శాంతించిన చ్యవనుడు అతడికి అభయమిచ్చాడు. యజ్ఞగుండం నుంచి వెలువడిన మధుడిని సాగనంపడానికి ప్రయత్నించాడు. ‘ఇంద్రుడిని విడిచిపెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపో!‘ అని మధుడిని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు ఇంద్రుడిని విడిచిపెట్టాడు. తర్వాత చ్యవనుడి ఎదుట వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ‘మహర్షీ! నీ సంకల్పంతో నన్ను సృష్టించావు. నాకు ఆశ్రయాన్ని చూపిస్తే, ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని పలికాడు.‘నువ్వు మద్యాన్ని, స్త్రీలోలురను, మృగయా వినోదంలో మునిగి తేలే వేటగాళ్లను, అక్షక్రీడలో కాలం వెళ్లబుచ్చే జూదరులను ఆశ్రయించుకుని ఉండు’ అని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు అక్కడి నుంచి వెంటనే అదృశ్యమైపోయాడు. పెను ప్రమాదాన్ని తప్పించుకున్న ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ స్వర్గానికి బయలుదేరాడు. మిగిలిన దిక్పాలకులు కూడా తమ తమ నెలవులకు బయలుదేరారు. చ్యవన మహర్షి తన తపోమహిమను వెల్లడి చేసిన యజ్ఞవాటిక గల పర్వతానికి ‘అర్చీక పర్వతం’ అనే పేరు వచ్చింది. – సాంఖ్యాయన -
Naga Panchami: భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు (ఫొటోలు)
-
కాచిగూడ తుల్జా భవన్లో ఘనంగా మంగళ గౌరీ పూజ (ఫొటోలు)