
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం రాత్రి అమ్మవారు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

సాయంత్రం దివ్యాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై ఆశీనులై ఐదు మార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

రాత్రి అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు.










