
నాగర్ కర్నూల్: వంద ఆలయాలు నిర్మించడం కంటే.. శిథిలమైన ఒక పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడం వంద జన్మల పుణ్యఫలమని పండితులు చెబుతుంటారు. ఆ మాటలు విన్న కొంతమంది భక్తులు కలిసికట్టుగా కృషిచేసి అత్యంత పురాతన మైన ఆలయాన్ని జీర్ణోద్దరణ చేసి సరికొత్త చరిత్ర లిఖించారు.

తమిళనాడులోని శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథస్వామిని దర్శించుకోలేని భక్తులకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి అత్యంత చేరువలో ఉన్న శ్రీపురం శ్రీరంగనాథస్వామి కొంగు బంగారంగా మారారు.

అత్యంత మహిమాన్వితమైన శ్రీపురం శ్రీరంగనాథస్వామి ఆలయం దినదినాభి వృద్ధి చెందుతూ జిల్లాలోనే ప్రముఖ ఆలయంగా మారింది.

జిల్లాలోనే పురాతన వైష్ణవాలయాల్లో ఒక టైన శ్రీపురం రంగనాథస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

ఒకప్పుడు కూలిన గోడలు.. విరిగిన విగ్ర హాలు, పిచ్చి మొక్కలతో నిర్మానుష్యంగా కనిపించే ఆలయ ప్రాంగణం ప్రస్తుతం అత్యంత శోభా యమానంగా మారింది.

2014 జూన్లో ఆలయాన్ని పునఃప్రతిష్టించగా.. భక్తులు స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నారు. అచెంచలమైన భక్తి స్వామివారి వైభవాన్ని నలువైపులా చాటుతోంది.













