breaking news
sri ranganayaka swamy temple
-
తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?
-
రంగనాయక స్వామి ఆలయంలో చోరీ
మహబూబ్నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని స్వామివారి పంచలోహ విగ్రహాన్ని దుండగులు అపహరించుకు వెళ్లారు. విగ్రహం సుమారు 50కేజీల బరువు ఉంటుందని అంచనా. ఈరోజు తెల్లవారుజామున గస్తీకి వచ్చిన పోలీసులు చోరీ జరిగిన విషయాన్ని గమనించారు. కాగా దుండగులు ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. గతంలోనూ ఈ ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.