
హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణమాసం. శివభక్తులు పరమశివుడి ఆశీర్వాదం కోసం ‘కన్వర్ యాత్ర’ (కావడి యాత్ర)ను ఆదివారం మార్వాడీలు విశాఖలో నిర్వహించారు.

కన్వర్ అనేది వెదురుతో చేసిన ఒక కావడి, దీనికి ఇరువైపులా కుండలు కట్టి గంగా జలాన్ని మోసుకెళ్తారు.

ఈ యాత్రలో పాల్గొనే భక్తులను కన్వరియాలు అంటారు. వీరు కాషాయ వస్త్రాలు ధరించి మాధవధారలోని జలధార నుంచి పవిత్ర జలాలను సేకరించి.. శివాలయాల్లోని శివలింగాలకు అభిషేకం చేశారు.

పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.







