
ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ వత్రాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో అరుదుగా వచ్చే 5వ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఐదో శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు.

మహా మండపం ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాలు జరుపుకొన్నారు.












