breaking news
vijayawada
-
మితిమీరిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఆగడాలు
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ లెనిన్ సెంటర్లో రైవస్ కాలువ ఒడ్డున గత 30, 40 ఏళ్లుగా దుకాణాలు నడుపుతున్న చిరువ్యాపారుల జోలికి వస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు అధికారపార్టీ నేతలను హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల కన్ను లెనిన్ సెంటర్పై పడిందని, ఈ ప్రాంతంపై గద్దల్లా వాలిపోయారని విమర్శించారు. గత ఆరు నెలలుగా మామూళ్ల కోసం వ్యాపారులను వేధిస్తున్నారని మండిపడ్డారు. మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించిన చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తున్నారని, షాపులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం, షాపులు తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని దుయ్యబట్టారు.చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేసే వారి నుంచి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. లెనిన్ సెంటర్లో అధికారులు కరెంట్ కట్ చేసిన దుకాణాలను శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. దుకాణాలకు విద్యుత్ సౌకర్యం కట్ చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లెనిన్ సెంటర్ నుంచి ఐఎంఏ హాలు వరకు పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలు మితిమీరిపోయాయని, ఈ ప్రాంతంలో 290 దుకాణాలు ఉంటే టీడీపీ నేతలు షాపునకు రూ.5 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్కానింగ్ సెంటర్లు, డయాగి్నస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ చివరికి డాక్టర్ల వద్ద కూడా బొండా అనుచరులు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చేతిలో టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, పోలీసు శాఖలు కీలు»ొమ్మలుగా మారాయని మండిపడ్డారు. చిరువ్యాపారుల జోలికి వెళితే సహించేది లేదన్నారు. చిరువ్యాపారులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడలో అడ్వకేట్స్ ఆందోళన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
-
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించడంతోపాటు నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్భవన్కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందరు రోడ్డులో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు భారీగా మోహరించారు.శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్భవన్కు వెళ్తున్న విద్యార్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందరు రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్భవన్కు వెళ్లేందుకు బందరు రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. రోడ్డుకేసి కొడుతూ బూటుకాళ్లతో తన్నారు. విద్యార్థినులు, యువతులపైనా విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడడం గమనార్హం. ఏఎస్సై రవికుమార్ ఓ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.రోడ్డుపై బైఠాయింపు అనంతరం.. విద్యార్థి సంఘాల ప్రతినిధులను లోక్భవన్కు తీసుకెళ్తామని, గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే, అపాయింట్మెంట్ ఇప్పించే వరకు వెనక్కు వెళ్లేది లేదంటూ మ్యూజియం రోడ్డులో విద్యార్థులు భైఠాయించారు. గంట తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని, వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్భవన్కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చిపడేస్తూ మ్యూజియం రోడ్డులోకి నెట్టేశారు.పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జరపతలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
విజయవాడలో హైటెన్షన్.. విద్యార్థులు అరెస్ట్
-
విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్!
భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో వందేభారత్ రైలు సుదూర రాత్రి ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పగటిపూట నడిచే చైర్ కార్ వెర్షన్లతో ఆదరణ పొందిన వందేభారత్ సిరీస్ రైళ్లను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలో ‘వందేభారత్ స్లీపర్’ పేరుతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎస్సీఆర్ పరిధిలో దీన్ని ముందుగా విజయవాడ డివిజన్లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ మీదుగా ఈ అత్యాధునిక స్లీపర్ సర్వీసును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా బెంగళూరు మార్గంలో ఈ రైలును నడిపే ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ ఈ ఏడాది జనవరిలోనే హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు.విమాన తరహా ప్రయాణ అనుభూతివందేభారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతికత, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో డిజైన్ చేశారు. మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్లతో రూపొందించిన ఈ రైలులో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించేలా సీటింగ్/బెర్త్ అమరిక ఉంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల డిజైన్ వేగం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా 160 కి.మీ/గం ఆపరేషనల్ వేగంతో ప్రయాణిస్తుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) సాంకేతికత వల్ల వేగవంతమైన ఆక్సిలరేషన్ సాధ్యమవుతుంది.ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ బెర్త్లు, శబ్ద కాలుష్యం లేకుండా ఉండే సౌండ్ ప్రూఫ్ క్యాబిన్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి బెర్త్ వద్ద ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిస్థాయి స్వదేశీ ప్రమాద నిరోధక వ్యవస్థ ‘కవచ్’, నిరంతర సీసీటీవీ నిఘా, ఏఐ ఆధారిత కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ బటన్లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత కోసం బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ వాటర్ ట్యాప్లు అమర్చారు.రవాణా రంగంలో సరికొత్త అధ్యాయంసాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, రాజధాని ఎక్స్ప్రెస్లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్యాసింజర్ సేఫ్టీకి ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, ఐటీ, రవాణా అవసరాలకు విజయవాడ కీలక కేంద్రంగా ఉన్నందున ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రావడం ఇక్కడి ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. త్వరలోనే అధికారిక టైమ్టేబుల్, ప్రారంభ తేదీ వివరాలను రైల్వే బోర్డు ప్రకటించనుంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
విజయవాడలో ఉద్రిక్తత..
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలు లోక్భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో, పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
సాయి కృష్ణ తల్లి కేసును వెనక్కి తీసుకుందంటే... పొన్నవోలు షాకింగ్ నిజాలు
-
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున పొన్నవోలు ఫిర్యాదు చేశారు.డీజీపీ హరీష్కుమార్ గుప్తాను ఏ–1గా పేర్కొన్న పిటిషనర్.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబును ఏ–2గా, విజయవాడ సౌత్జోన్ ఏసీపీ ఎం.మానసను ఏ–3గా చేర్చారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అదృశ్యం, మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు.టాస్క్ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున కమిషనర్కు అరెస్టు విషయం తెలియదనడం సాధ్యం కాదని వాదన. సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకుని మే 9 వరకు కృష్ణలంక పోలీస్స్టేషన్లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. జూన్ 15న హైకోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు.హైకోర్టుకు ఇచ్చిన సమాచారం, సీఐ రిమాండ్ రిపోర్టులోని వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదన. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహాని అనుమానాలపై డీజీపీ, కమిషనర్కు ఈ–మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. సమాచారం అందినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సాయి కృష్ణను రక్షించేందుకు చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వక మౌనం వల్ల సాక్ష్యాలను మాయం చేసేందుకు, నిందితులను కాపాడేందుకు అవకాశం కలిగిందని పిటిషన్లో ఆరోపించారు.పోలీస్స్టేషన్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ల మార్పు, ఫుటేజీ మాయం అంశాలపైనా పిటిషన్లో ప్రస్తావించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్ఫోన్తో నకిలీ ఆధారాలు సృష్టించడం సంస్థాగత కుట్రలో భాగమని పిటిషనర్ పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు, డైలీ స్టేటస్ రిపోర్టులు, అధికారుల రోజువారీ సమావేశాల ద్వారా అక్రమ నిర్బంధ సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుందని పిటిషన్లో వాదన. ఇది కేవలం కిందిస్థాయి పోలీసుల చర్య కాదని, ఉన్నతస్థాయి కుట్ర–కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.సిట్ దర్యాప్తు కిందిస్థాయి పోలీసులకే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని పేర్కొన్న పిటిషనర్.. డీజీపీ, కమిషనర్, ఏసీపీపై హత్య, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, అధికార దుర్వినియోగం, సాక్ష్యాల మాయం అభియోగాలు ఉన్నాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61, 49, 103, 127(3), 198, 238తో పాటు సెక్షన్ 3(5) కింద చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన చర్యలు కావని, అందువల్ల విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్ వాదన. పోలీస్ కస్టడీలో కొట్టడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ఫిర్యాదుదారు ఉదహరించారు.ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుతోపాటు ప్రైవేట్ ఫిర్యాదును కలిపి విచారించేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 233ను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కేసులో డీజీపీ నుంచి కిందిస్థాయి పోలీసుల వరకు మొత్తం పాత్రను వెలికితీయాలని పిటిషన్ వేశారు. ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనే సూత్రాన్ని అమలు చేయాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, కమిషనర్, ఏసీపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. -
ఏపీలో వీసా స్కామ్.. రోడ్డున పడ్డ 700మంది బాధితులు
సాక్షి,కృష్ణ: ఇటీవల నందూస్ వరల్డ్ వీసా స్కామ్ మరువక ముందే తాజాగా మరో వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ’మోసం తాజాగా విజయవాడలో బయటపడింది. సుమారు 700 మంది బాధితుల నుండి ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు.ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలను నమ్మి తాము హైదరాబాద్ బేగంపేట, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీని సంప్రదించామని బాధితులు తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ తమను నమ్మించారని పేర్కొన్నారు.యూకేలో స్కిల్డ్ వర్క్ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లొచ్చని నమ్మబలికారు. అక్కడ ఉద్యోగం, వసతితో పాటు పోస్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని, ముందుగా రూ.6 లక్షలు, యూకే వెళ్లిన తర్వాత మిగిలిన రూ.6 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది అప్పులు చేసి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ చెల్లించారు. రిక్రూట్మెంట్ లైసెన్స్ లేకుండానే వీరు ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు బాధితులు గుర్తించారు.డబ్బులు కట్టించుకున్న తర్వాతే వీరు అగ్రిమెంట్లు చూపించారని, అందులో ఉద్యోగ హామీ గురించి స్పష్టంగా లేదని బాధితులు వాపోయారు. మౌఖికంగా మాత్రం 100శాతం జాబ్ వస్తుందని నమ్మించారు. తీరా డబ్బులు కట్టాక వీసాలు రాకపోవడంతో నిలదీస్తే బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేశారు. లక్ష రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు.న్యాయం కోసం హైదరాబాద్ బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి వివరణ కోరగా.. నిర్వాహకులు బాధితులపైనే ఉల్టా న్యూసెన్స్ కేసులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాధితులపై సివిల్ సూట్లు దాఖలు చేసి, డబ్బులు అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.తమను నిలువునా ముంచిన ఫ్లైయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమడబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. -
టీచర్ను హోటల్కు తీసుకెళ్లిన జిమ్ ట్రైనర్.. ఆపై నిజస్వరూపం..
విజయవాడ: ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్పై కేసు నమోదు చేసిన సత్య నారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్గా పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. లావుగా ఉన్న టీచర్ స్లిమ్గా అయ్యేందుకు జిమ్ సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రైవేట్ హోటల్కు తీసుకువెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆ టీచర్ తెలిపింది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి యువతిని పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నాడు. -
విజయవాడ : ఆషాఢ వైభవం..‘ఇంద్ర’ వైభోగం (ఫొటోలు)
-
హైదరాబాద్–విజయవాడ ఇక నాన్స్టాప్!
సాక్షి, హైదరాబాద్: విజయవాడకు వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కి తే, ఎల్బీనగర్ దాటిన తర్వాత మధ్యలో రాత్రి భోజనానికో, టీ తాగేందుకో తప్ప మరెక్కడా ఆగకుండా నేరుగా విజయ వాడకు చేరుకుంటుంది. అదే, ఆర్టీసీ బస్సులో ఎక్కితే భోజన, టీ విరామాలతోపాటు అదనంగా కోదాడ, సూర్యా పేట బస్టాండ్లలో ఆగుతుంది. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతున్నట్లు తాజాగా ఆర్టీసీ గుర్తించింది. వేగంగా విజయవాడకు చేరుకోవాలనుకునే చాలామంది, ఈ ఒక్క కారణంతో ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు తే లింది. ఇప్పుడు గరుడ, రాజధాని సహా ప్రీమియం కేటగిరీ సర్వీసులకు, ఆ హాల్టులను తప్పించి నేరుగా విజయవాడకు నాన్స్టాప్ సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అవసరమైతే ఆ రెండు ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు తిప్పాలని యోచిస్తోంది.‘బెంగళూరు ప్రయోగం’ సక్సెస్తో...ప్రతినెలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సుల్లో సగటున 1.30 లక్షల మంది ప్రయాణిస్తుండగా, 90 వేల మంది మాత్రమే తిరిగి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. మిగతావారు ఎందుకు రావటం లేదో తెలుసుకునేందుకు ఇటీవల ఆర్టీసీ ఓ బృందాన్ని బెంగళూరుకు పంపింది. బెంగళూరు నుంచి వచ్చే క్రమంలో ప్రైవేటు బస్సులు 20 చోట్ల ఆగుతున్నాయని, ఆర్టీసీ బస్సులు కేవలం నాలుగు చోట్లే నిలుపుతున్నాయని, దీంతో చాలామంది తమకు అనుకూలమైన ప్రాంతంలోని హాల్టుల వద్దకు వెళ్లి ప్రైవేటు బస్సులు ఎక్కుతు న్నారని ఆ బృందం గుర్తించింది. వెంటనే, ఆర్టీసీ కూడా 20 ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించింది. దీంతో 20 రోజుల్లో, రోజుకు 8 శాతం వరకు ఆక్యు పెన్సీ రేషియో పెరిగి రోజుకు రూ.80 వేల ఆదాయం అదనంగా సమకూరటం మొదలైంది. ఈ సక్సెస్తో తాజాగా, మరో బృందాన్ని విజయవాడ, గుంటూరు సెక్టార్లో అధ్యయనానికి ఆర్టీసీ పంపింది. ఇందులో భాగంగా, హైదరాబాద్–విజయవాడ మధ్య నాన్స్టాప్ సర్వీసులు కావాలన్న డిమాండ్ ఆ బృందం దృష్టికి వచ్చింది. గతంలో గరుడ బస్సులకు ఈ స్టాపులు ఉండేవి కాదు. కానీ, ఆక్యుపెన్సీ రేషియో పేరుతో వాటిని కూడా నాన్స్టాప్ కోటా నుంచి తొలగించి కోదాడ, సూర్యాపేట బస్టాండ్లలోకి వెళ్లేలా మార్చారు. దీనివల్ల దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల సమయం వృథా అవుతోంది. ఫలితంగా ఆర్టీసీ ప్రయాణికుల్లో 10 శాతం మంది ప్రైవేటుకు మళ్లారని భావిస్తున్నారు. విజయవాడలో కూడా వేర్వేరు స్టాపులు...హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు నేరుగా పండిట్ నెహ్రూ బస్టాండ్లోకి వెళ్లి నిలిచిపోతాయి. కానీ, అదే హైదరాబాద్లో ఏపీ బస్సులు ఎంజీబీఎస్కే పరిమితం కాకుండా, అమీర్పేట, కూకట్పల్లి, కేపీహెచ్బీ, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ సహా చాలా ప్రాంతాలకు వెళ్లి ఆగుతాయి. ఇప్పుడు ఇదే తరహాలో విజయవాడలో కూడా బెంజ్ సర్కిల్, ఆటోనగర్, పోరంకి, గాంధీనగర్, సత్యనారాయణపురం... ఇలాంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లేలా బస్సు రూట్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. గుంటూరులో కూడా ఇదే తరహా ఏర్పాటు చేయనున్నారు. -
విజయవాడలో మళ్లీ ‘కాల్ మనీ’ కలకలం
సాక్షి, విజయవాడ: నగరంలో మరోసారి కాల్ మనీ వ్యాపారులు రెచ్చిపోయారు. కాల్ మనీ వ్యాపారీ ద్వారా మోసపోయానంటూ న్యాయం కోసం బాధితుడు రోడ్డెక్కాడు. 96 లక్షల అప్పుకు కోటి 96 లక్షలు కట్టానని బాధితుడు మోతే గోపరాజు చెబుతున్నాడు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయని.. 96 లక్షలు కట్టాలంటూ బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘లక్షకు రోజుకు 500 వడ్డీతో 96 లక్షలు అప్పు తీసుకున్నాను.. 96 లక్షలకు గాను కోటి 96లక్షలు ఇప్పటివరకు కట్టాను.. ఏప్రిల్ 11వ తేదీన కొంతమంది కుర్రవాళ్లతో బెదిరించారు. నా భార్యతో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్స్పై సంతకాలు తీసుకున్నారు. ఇంకా డబ్బులు కట్టకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అధికార పార్టీకి చెందిన నేతలు తన వెనుక ఉన్నారని బెదిరించడం ప్రారంభించారు...మే నెలలో పెనమలూరు స్టేషన్లో నాపై సుంకరసాయి అనే వ్యక్తి కేసు పెట్టారు. 6 సార్లు పెనమలూరు స్టేషన్కి వెళ్లి వివరాలు అన్ని ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్నే బెదిరించారు. కోటి 96 లక్షలు వడ్డీకే సరిపోయాయి. 96 లక్షలు కట్టాలని పోలీసులు బెదిరించారు. చంద్రబాబుకు, డీజీపీకి లేఖ రాశాను. కాల్ మనీ వ్యాపారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి’’ అని బాధితుడు కోరుతున్నారు. -
క్రాంతికుమార్ కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక కాంత్రికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జూలై 2న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.క్రాంతి కుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు 10 లక్షల రూపాయల చెక్ను కాంత్రికుమార్ కుటుంబసభ్యులకు వైఎస్సార్సీపీ నేతలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోన్రావు, మాజీ ఎంపీ నందిగామ సురేష్.. క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి చెక్ అందించారు.చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?: టీజేఆర్ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన మానవతా హృదయం చూపించారు. పేరుపొగు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది సామాజిక బాధ్యత. క్రాంతి కుమార్ని గంజాయి, డ్రగ్స్ అమ్మాలని, మర్డర్ చేయాలంటూ సీఐ వేధించాడు. క్రాంతి కుమార్ ఆవేశ పూరిత నిర్ణయంతో ముగ్గురు రోడ్డు మీద పడ్డారు. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి ఎందుకు చంద్రబాబు న్యాయం చేయలేదు?..వైఎస్ జగన్.. క్రాంతి కుమార్ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చారు. పేరూపొగు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాత ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు. రాజ్యాగం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. దళితులను ఉచకోత కొస్తున్నారు. చంద్రబాబు దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకొంటారంటూ అన్నాడు.’’ అని టీజేఆర్ గుర్తు చేశారు.రెడ్బుక్ రాజ్యాంగంలో ఇలాగే..: మొండితోక జగన్మోహన్రావుమొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రాజకీయ కోణంలో కాకుండా మానవత కోణంలో సాయం చేశారు.. ప్రభుత్వం తుతూ మంత్రంగా వ్యవహరించింది. సాయికృష్ణ బూడిద కూడా ఇవ్వని పరిస్థితి. గుంటూరులో మహిళను వివస్త్రని చేస్తే ముడు రోజుల వరకు బయటకు రాలేదు. హోమంత్రి ఏం చేస్తున్నారు? ఐటీడీపిలో పని చేసిన వ్యక్తి మంచోడు మణిరత్నంపై కూడా దాడి చేసి కొట్టారు. నందిగామలో టీడీపీ నేత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయడు. పాము తన పిల్లలను తినేటట్లు టీడీపీ నేతలు తమ కార్యకర్తలనుని వదలడం లేదు. శాంతిభద్రతాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాడులకు దిగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాగే జరుగుతుంది.ఆర్థిక సాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా: నందిగామ సురేష్ మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ.. ఆర్థిక సహాయమే కాదు.. ఆరోగ్య భరోసా కూడా అందించాం. హోం మంత్రి కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదు. చంద్రబాబు మొదటి నుండి దళితులను చిన్న చూపు చూస్తాడు. లోకేష్ పెత్తనం తీసుకొన్న తర్వాత మరింత విచ్చలవిడిగా దారుణాలు పెరిగాయి. రాష్టాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకొంటున్నారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ అంశాల్లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం స్వందించింది..దళితులంటే చంద్రబాబుకి చిన్న చూపు: దేవినేని అవినాష్10 లక్షలు ఇచ్చి.. క్రాంతి కుమార్ కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న క్రాంతి కుమార్ చిన్న కుమారుడికి విజయవాడలో టెస్ట్లు చేసి హైదరాబాద్ పంపుతున్నారు. ఏ కష్టం వొచ్చిన నేనున్నాను అని చెప్పే వ్యక్తి జగన్. దళితులు అంటే చంద్రబాబుకి చిన్న చూపు. కూటమి ప్రభుత్వం నిజ స్వరూపం ప్రజలు తెలుసుకొంటున్నారు. పరిపాలన ఎలా చేయాలో జగన్ని చూసి నేర్చుకోవాలి.వైఎస్ జగన్కి కృతజ్ఞతలు: క్రాంతి కుమార్ తండ్రి క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. క్రాంతి కుమార్ విషయంలో వైస్సార్సీసీ సత్వరమే స్పందించింది. వైఎస్ జగన్ ఇంటికి వచ్చి భరోసా ఇచ్చారు. 10 లక్షలు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు. వైఎస్ జగన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. -
దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఆ ప్రకటనలు నమ్మకండి
సాక్షి, విజయవాడ: దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉచితసేవలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్జిత సేవలు గురించి దేవస్థానం జారీ చేసే అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని దేవాదాయ శాఖ అధికారులు ఈ రోజు (శనివారం) ప్రకటన విడుదల చేశారు. స్వామివారి దర్శనములు, సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులు గురించి సోషల్ మీడియా గానీ ఇతరప్రసార మాధ్యమాలలో లేదా వ్యక్తుల వ్యక్తిగత ప్రకటనలు /ప్రచారాలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం చేయిస్తామని, సారె సమర్పించడానికి ఏర్పాటు చేస్తామని, అమ్మవారి దగ్గర సేవ చేయడానికి అవకాశం ఇప్పిస్తామని, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎవరైనా చెబితే వాటిని అస్సలు ఆ మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. దేవస్థానంలో సేవలు పొందడానికి, ఏదైనా విరాళాలు చెల్లింపు, భక్తులు ఉచిత సేవలు అందించడానికి మధ్యవర్తుల ప్రమేయం లేదని ఆలయ ఈవో స్పష్టం చేశారు. ఆలయ సేవలకు సంబంధించి ఏదైనా వివరాలకు భక్తులు దేవస్థానం కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని తెలిపారు. దేవస్థానం వెబ్ సైట్ : www.kanakadurgamma.org, దేవస్థానం టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ :18004259099పై సంప్రదించాలని దేవస్థానం ఈవో వికె శీనా నాయక్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. -
విజయవాడలో డయేరియా డేంజర్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని గిరిపురంపై డయేరియా పంజా విసిరింది. రెండు వీధులకు చెందిన దాదాపు 20 మంది వరకూ డయేరియా బారిన పడ్డారు. పది రోజులుగా కుళాయిల నుంచి కలుషిత, రంగుమారిన నీరు వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గురువారం రాత్రి ఒకేసారి ఏకంగా ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించడంతో అధికారులు హడావుడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి విరోచనాలు కావడంతో తొలుత యూపీహెచ్సీలో చికిత్స అందించి అనంతరం పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డయేరియాకు గురైన సుబ్బలక్ష్మికి డీహైడ్రేషన్తో అనూహ్యంగా క్రియాటినిన్ పెరగడంతో కిడ్నీ వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి తలెత్తింది. పచ్చ రంగులో నీళ్లు: స్థానికులు అత్యధికంగా నగర పాలక సంస్థ సరఫరా చేసే మంచినీటినే తాగుతుంటారు. వారం రోజులుగా కుళాయిల నుంచి రంగు మారి పచ్చ రంగులో నీళ్లు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో డ్రైయిన్లు అపరిశుభ్రంగా మారినా వీఎంసీ అధికారుల్లో చలనం లేదు. దీంతో ఒక్కొక్కరుగా డయేరియా బారిన పడుతూ వచ్చారు. కలుషిత నీరే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోలేదు.. మంచినీటి పైపుల నుంచి రంగు మారిన నీళ్లు వస్తున్నాయి. వాటిని తాగడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందా. ఇంకా నీరసం తగ్గలేదు. రంగునీళ్లు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – నన్నిపోగు మణి, బొడ్డు సుందరం వీధి, గిరిపురంకిడ్నీలపై ఎఫెక్ట్.. వారం రోజుల కిందట ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు ప్రారంభం అయ్యాయి. ఒక్కసారిగా నీరసించి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షిస్తే క్రియాటినిన్ 15.9కి చేరింది. కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యేవని చెప్పారు. వీఎంసీ సరఫరా చేసే నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది. – జి.సుబ్బలక్ష్మి, గిరిపురం జీజీహెచ్లో చేరా.. నాకు వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయా. ప్రభుత్వాస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి అయ్యా. వీఎంసీ సరఫరా చేసే రంగు మారిన నీళ్లు తాగడం వల్లే ఇలా జరిగింది. – పి.ఉదయ్కుమార్, గిరిపురం -
విశ్వసనీయత లేని బాబు మాటలు
-
గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయలక్ష్మి తప్పుకున్నా.. మేం పోరాటం చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ సాయం వద్దంది. కేసు నుంచి ఆమె తప్పుకున్నా.. నేను పోరాడుతా’’ అంటూ కనకదుర్గ స్పష్టం చేశారు.మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారు. నాక్కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల వల్ల అడ్వకేట్స్ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకుని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయికృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా..నేను పిన్నిగా సాయికృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం’’ అని కనకదుర్గ తెలిపారు. -
పిటిషన్ను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు?: హైకోర్టు
విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. అయితే, నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణ విచారణ కోసం వేసిన పిటిషన్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. దీంతో పిటిషన్ను ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టుకు ఆదేశించింది.మొదట సీబీఐ విచారణ ఎందుకు కోరారు? మళ్లీ వద్దని ఎందుకు కోరుతున్నారో చెప్పాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. -
చంద్రన్న బోడిగుండు పథకం!
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు. ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. -
జీతాలు ఇప్పించండి బాబూ!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ‘రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా సరిగా కల్పించడం లేదు. కనీస వేతనాలు ఇవ్వడం లేదు. కుటుంబాలను ఎలా పోషించాలి?’ అంటూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహించే సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కష్టాలను ఏకరవు పెట్టారు.వార్డుల్లో అన్ని పనులు తామే చేయాలని, తమకు సంబంధంలేని పనులూ చేయిస్తున్నారని ఆరోపించారు. జీతాలు సైతం సక్రమంగా ఇవ్వడంలేదని, రెండు నెలలుగా పెండింగ్లో ఉంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం చొరవ చూపి న్యాయం చేయాలన్నారు. అనంతరం కార్మికులను పోలీసులు కలెక్టరేట్లోకి అనుమతించగా, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు అందించారు.అన్ని పనులూ చేయిస్తున్నారు అన్ని పనులూ చేయిస్తున్నారు. సంబంధం లేని పనులు చేయడంతో పని ఒత్తిడి పెరుగుతుంది. భోజనం కూడా చేయనీయడం లేదు. సంబంధం లేకున్నా బెడ్షీట్లు మార్పిస్తున్నారు. రోగులు బెడ్పై విరోచనానికి వెళ్తే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు చేయాల్సిన పనులు కూడా మాతోనే చేయిస్తున్నారు. – మణి, పారిశుద్ధ్య కార్మికురాలుసక్రమంగా జీతాలు చెల్లించాలిజీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. ప్రతిసారి జీతాల కోసం నిరసన చేయాల్సిన దుస్థితి నెలకొంది. కనీస వేతనం అమలు చేయడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. – అఖిల, పారిశుద్ధ్య కార్మికురాలు -
పెండింగ్ జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు ధర్నా
-
సాయి కృష్ణ కేసుకు బ్రేకులు
-
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలుఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ: విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆటోనగర్లోని ఓ మెకానికల్ షెడ్డులో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల ధాటికి పలు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. కాగా, ప్రమాదానికి గత కారణాలు తెలియాల్సి ఉంది. -
కొడాలి నానిపై కేసు...
-
దొరికిన సాయికృష్ణ లాకప్ డెత్ CCTV ఫుటేజ్
-
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం
-
సాయి కృష్ణని ఎక్కడైతే చంపాడో అక్కడే CI నాగరాజు విచారణ
-
సర్కారుకు 3 నెలలు గడువు ఇస్తున్నాం: కాపు రిజర్వేషన్ పోరాట సమితి
విజయవాడ: కూటమి సర్కారుపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి మండిపడింది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చలమల్ల ప్రసాదరావు బుధవారం మాట్లాడుతూ.. కాపులను ఎన్నికల్లో కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని చెప్పారు. వెంటనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.‘‘ప్రభుత్వానికి మూడు నెలలు గడువు ఇస్తున్నాం. బీసీల మాదిరి కాపులకు కాపు రక్షణ చట్టం తీసుకురావాలి. జూలై 27న అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇస్తాం. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్ల ఇస్తామని చెప్పారు. 2014లో అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై చంద్రబాబు తీర్మానం చేసి నేటికీ అమలు చేయలేదు. 2014, 2024 ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించారు. కాపుల పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ చెబితే ఓట్లేశారు. కూటమిని గెలిపిస్తే ఈ రెండేళ్లలో కాపులకు మీరేం చేశారు? కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం లేదు. కాపుల రిజర్వేషన్లను పట్టించుకోవడం లేదు. కాపులను ఎక్కడ చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కాపులకు విదేశీ విద్య పథకం లేదు. కాపు భవనాలు కట్టిస్తామన్నారు.. కట్టించలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలతో రాజధాని కడుతున్న మీరు కాపులను ఎందుకు తొక్కిపెడుతున్నారు? కాపుల పట్ల ఎందుకు మీరు ఇంత వివక్ష చూపుతున్నారు? మేం ఎన్నుకున్న.. మేం గెలిపించుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా? కాపులను కరివేపాకులా వాడుకుంటున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ పట్టించుకోరా? పెద్దన్న పాత్ర పోషించాలని అడిగారు. మరి మా గురించి మీరు అడగరా? వెంటనే ప్రత్యే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ల కోటాను పెంచాలి. డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటం చేయకతప్పదు’’ అని చలమల్ల ప్రసాదరావు హెచ్చరించారు. -
విజయవాడ లో కలకలం రేవుతున్న మరో మిస్సింగ్
-
విజయవాడలో NIA సోదాలు
సాక్షి,కృష్ణ: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్,మహమ్మద్ రహమతుల్లా అనే ముగ్గురు యువకులను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆన్లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ ముగ్గురి ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నారుమొదట విజయవాడ వన్టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయటపడటంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును అధికారికంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఈ ఆన్లైన్ నెట్వర్క్పై అధికారులు నిఘా పెట్టారు.ఇప్పటికే అరెస్టయిన ఈ ముగ్గురు నిందితులకు నగరంలో లేదా ఇతర ప్రాంతాలలో మరికొందరితో ఏమైనా రహస్య సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు మరియు ఏవైనా అనుమానాస్పద పత్రాలు దొరుకుతాయేమోనని ఇళ్లలో ప్రతి అంగుళాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. -
అమరావతి పై ఉన్న శ్రద్ద మాపై లేదు, సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
-
డీఎస్సీ పోస్టులు అక్రమార్కులకు కట్టబెట్టారు
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025లో టీచర్ పోస్టులను అక్రమార్కులకు కట్టబెట్టి అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందని అర్హత ఉన్నా ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అర్హత సాధించినప్పటికీ, ఉద్యోగాలు రాని బాధిత అభ్యర్థులు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దివ్యాంగుడు గెరివి అంజినప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఉడదల ప్రభావతి సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.వీరికి ఇతర డీఎస్సీ అభ్యర్థులు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మద్దతు పలికారు. తమకు న్యాయం చేసి, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. పేదలకు, అర్హులకు న్యాయం చేయలేనప్పుడు మంత్రి పదవి ఎందుకు అని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ను ప్రశ్నించారు.డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ఉద్యోగాలను పప్పు బెల్లాల్లా అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, న్యాయం కోసం నిలబడితే జైళ్లకు పంపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి సోదరుడు, టీడీపీ కార్యకర్త ఉడదల శివ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు హెచ్.వసంత్ కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, దివ్యాంగ విభాగం అనంతపురం జిల్లా కార్యదర్శి బోయ రాజేష్ తదితరులు ప్రసంగించారు.నేను ఫేక్ కాదు.. నిరూపిస్తా పది నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయా. నా ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఇక్కడికే వచ్చా. దివ్యాంగుడినైన నాకు విద్యాశాఖ మంత్రి లోకేశ్, అధికారులు చాలా అన్యాయం చేశారు. ఐఏఎస్ అధికారులంతా నేను ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలతో ఎక్కడికి రమ్మన్నా వచ్చి నిరూపిస్తా. మరి అసలు అర్హతే లేని కురువ శ్రీనివాసులుకు ఉద్యోగం ఎలా ఇచ్చారు? మంత్రి లోకేశ్ను కలిసినా న్యాయం జరగలేదు. కొందరు అధికారులు కోర్టులకు కూడా తప్పుడు సమాచారం పంపుతున్నారు. – గెరివి అంజినప్ప, దివ్యాంగుడు, డీఎస్సీ బాధితుడు, సత్యసాయి జిల్లాడీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చినా... నాకు డీఎస్సీలో 130వ ర్యాంకు వచ్చింది. గెరివి అంజినప్పది పీహెచ్ కోటాలో ఉద్యోగం పోయినందువల్ల హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల నా ఉద్యోగం పోయిందని చెప్పారు. కానీ అది బీసీ–ఏ కోటా. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల కాదు అధికారుల మోసం వల్లే పోయిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మా కుటుంబమంతా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాం. మంత్రి లోకేశ్ను మూడుసార్లు కలిశాం. భూమిరెడ్డి రాంభూపాల్రెడ్డిని కలిస్తే నాలుగు రోజులు ఆగండి జాబ్స్ ఇప్పిస్తామన్నారు. మాకు అర్హత ఉందని అందరికీ తెలిసినా, మేము ఫేక్ అని మాట్లాడుతున్నారు. – ఉడదల ప్రభావతి, డీఎస్సీ అభ్యర్థని, గుంతకల్లు -
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: క్రాంతికుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్ ఆత్మహత్యపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. క్రాంతికుమార్ ఫోన్ను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు.. ఫోన్ ఇవ్వాలంటూ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ అందజేయనున్నారు. కాగా, దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది.లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
సాయి కృష్ణ కేసులో CIనాగరాజుకి అన్యాయం జరిగిన కూడా ఒప్పుకోము
-
నీకు ఓటు వేసి గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి..
-
నిన్ను వదిలితే.. నేను పెట్రోల్ పోసుకుని నడి రోడ్డుపై చస్తా
-
ఆధారాలను విచారణ అధికారికి ఇచ్చిన సాయికృష్ణ తల్లి
-
కాల్ మని కేసులో పెద్ద తలకాయలు సంచలన విషయాలు బయటపెట్టిన గాయత్రి
-
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
-
వేధించి చంపేశారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘‘పోలీసుల వేధింపుల వల్లే నా కొడుకు అన్యాయంగా చనిపోయాడు. ఆరోజు పోలీసులు ఇంటికి వచ్చి బెదిరించడంతో తలుపులు వేసుకుని భయంతో పురుగుల మందు గుళికలు తిని ప్రాణాలు తీసుకున్నాడు’’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట క్రాంతికుమార్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.గురువారం కృష్ణలంకలోని క్రాంతికుమార్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన కొడుకు వీడియో వాంగ్మూలంలో చెప్పినట్టుగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే చనిపోయాడని, తనను కులం పేరుతో సీఐ దూషించాడని, ఈ రెండు విషయాలపై కేసులు కట్టి సీబీఐతో విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని క్రాంతికుమార్ తల్లిదండ్రులు జగన్కు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే... క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటన ఏరోజు జరిగిందని వైఎస్ జగన్ అడగ్గా మే 21న జరిగిందని వెంకటేశ్వరరావు వివరించారు. ‘‘ మే 21న మా ఇంటికి పోలీసులు వచ్చారు. వారిని చూసి నా కుమారుడు భయంతో లోపలికి వెళ్లి తలుపువేసుకున్నాడు. తలుపు తీయాలని వాళ్ల అమ్మ పిలిస్తే.. తలుపు తీస్తే పోలీసులు తనను చంపేస్తారంటూ పురుగుమందుల గుళికలు తినేశాడు. వాళ్ల అమ్మ దుఖంతో కేకలు వేస్తే తలుపు తీసాడు. హడావుడిగా హెల్ప్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయినా ప్రాణం దక్కలేదు’’ అని వెంకటేశ్వరరావు జగన్కు చెప్పారు.సాయికృష్ణ తరహాలోనే తనను కూడా పోలీసులు కొట్టి చంపేస్తారన్న భయంతో ప్రాణం తీసుకున్నాడని తెలిపారు. క్రాంతి కుమార్పై 12 ఏళ్ల క్రితం కేసులు ఉండేవని, ఇప్పుడు లేవని ఆయన వివరించాడు. ఎనిమిదేళ్లుగా ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు. గత నెల ఎనిమిదో తేదీన దళిత సంఘాలను తీçసుకొని సీపీ వద్దకు వెళ్లానన్నారు. ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తాయన్న నమ్మకం లేదని, దేవుడిలా వచి్చన మీరే మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన జగన్కు విజ్ఞప్తి చేశారు. బాత్రూంలు కడిగించి.. బూట్లు పాలిష్ చేయించేవారు.. తన కొడుకును పోలీసులు ఎన్ని రకాలుగా వేధించారో క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు వైఎస్ జగన్కు వివరించారు. ‘‘పోలీసులు ఇష్టం లేని పనులు చేయించేవారు. సొంత పనులకు వాడుకునేవారు. బూట్లు పాలిష్ చేయించేవారు. బాత్రూంలు కడిగించేవారు. రౌడీషీటర్లను పట్టుకురమ్మనేవారు. కులం పేరుతో దూషించేవారు. పోలీసులు చెప్పిన పనులు చేయక పోతే ఆదివారం సంతకం పేరుతో పిలిచి, ముగ్గురు కానిస్టేబుళ్లు టైరు బెల్ట్ తీసుకొని కొట్టేవారు. ముఖ్యంగా సీఐ నాగరాజు వేధింపుల వల్లే నా కొడుకు చనిపోయాడు’’ అని క్రాంతికుమార్ తండ్రి జగన్కు వివరించారు. క్రాంతికుమార్ కుమారుడికి వైద్యం.. కుటుంబానికి సాయం.. ‘క్రాంతి మరణంతో నా ముగ్గురు పిల్లలు, నేను దిక్కులేనివారమయ్యాం’ అంటూ క్రాంతి భార్య ప్రభావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాప లిఖిత పదోతరగతి, కుమారులు రవిచంద్ర ఏడు, వెంకటేశ్వరరావు ఐదు చదువుతున్నారని పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆమె జగన్కు వివరించారు. క్రాంతి కుమారుడు రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. కాలికి కట్టు కట్టి ఉండటాన్ని గమనించిన జగన్ దాని గురించి అడిగారు.పుట్టుకతోనే పోలియో వల్ల రెండు వేళ్లు పోయాయని, తర్వాత వెన్నుముకపై కణితి వచ్చిందని, అది తీస్తే బతకడని వైద్యులు చెప్పారని క్రాంతి భార్య వివరించారు. చాలా ఆస్పత్రులలో చూపించామని, కొంత వయసు వచి్చన తర్వాత ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారని ఆమె తెలిపారు. పోలియో వల్ల వేళ్లు పోయిన కాలికే గాయం కావడంతో కట్టుకట్టామని చెప్పారు. ఏ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారో అడిగి తెలుసుకున్న జగన్ నరాలకు సంబంధించిన ఆస్పత్రిలో చూపించాలని సూచించి అన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. బాబుకు పింఛనూ రావటం లేదని తల్లి జగన్ దృష్టి తీసుకెళ్లగా తాను చూసుకొంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఐదు సెంట్ల స్థలం, పొలం, చట్టబద్ధంగా రావలసిన బెనిఫిట్స్, హక్కు గా రావల్సినవన్నీ, మన ప్రభుత్వం వచి్చన నెలలోపే తాను చేస్తానని భరోసా ఇచ్చారు. బాబుకూ సమస్య లేకుండా చూస్తానని పేర్కొన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్టుగా తనకు మెసేజ్ పంపితే తాను చూసుకుంటానన్నారు. కోడిని వేలాడదీసినట్లు వేలాడదీసి కొట్టారు..ఆరోజు తలుపు తీయమంటే పోలీసులకు నన్ను అప్పజెప్పవద్దమ్మా అంటూ తన కుమారుడు గట్టిగా ఏడ్చాడని క్రాంతికుమార్ తల్లి మరియమ్మ జగన్కు వివరిస్తూ భోరున విలపించారు. తన కొడుకును పోలీసులు అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని ఆమె అన్నారు. పాత కేసులు ఉన్నాయని పిలవడం, గంజాయి అమ్మించడం వంటి పనులు చేయించేవారని, భయపడి వెళ్లకపోతే బాగా కొట్టేవారని ఆమె చెప్పారు.ఒక రోజు రాత్రి సీఐ నాగరాజు రమ్మంటున్నారని పోలీసులు వచ్చి తీసుకెళ్లారని ఉదయం మేము స్టేషన్కు వెళ్లే సరికి కోడిని వేలాడదీసినట్టు వేలాడదీసి కొట్టడం చూసి తట్టుకోలేకపోయామని మరియమ్మ విలపించారు. ఈ వయసులో మమ్మల్ని చూడాల్సిన కొడుకు మా కళ్ల ఎదుటే మరణించడం చూసి బాధతో మా ప్రాణం విలవిల్లాడుతోందని మరియమ్మ జగన్ను పట్టుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమారుడు ఆత్మహత్మ చేసుకొనే సమయంలో తీసుకొన్న సెల్ఫీ వీడియోను జగన్కు చూపించారు. ఆ కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా న్యాయం చేస్తానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుకు సిట్ కస్టడీ
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజుని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు 12 రోజులు కస్టడీ కోరగా.. 8 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. రేపటి నుండి 10వ తేదీ వరకు కస్టడీ ఇచ్చిన న్యాయస్థానం.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు విచారణ చేయాలని ఆదేశించింది. విచారణ చేసే సమయంలో వీడియో రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది. రాజమండ్రిలో సిట్ విచారణ చేయనుంది.సాయికృష్ణ మెజిస్టీరియల్ విచారణ జరగనుంది. జూలై 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ మెజిస్టీరియల్ విచారణ చేపట్టనుంది. సమాచారం తెలిసిన వారు హాజరై తమ వద్ద ఉన్న సాక్ష్యాలు సమర్పించాలంటూ విజయవాడ ఆర్డీవో ప్రకటన విడుదల చేశారు. -
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
క్రాంతి కుమార్ కుటుంబానికి పరామర్శ, నేనున్నా అంటూ వైఎస్ జగన్ భరోసా (ఫొటోలు)
-
అయ్యా నా కొడుకును చంపేశారయ్యా... జగన్ ముందు కన్నీరు పెట్టుకున్న క్రాంతి కుమార్ తల్లి
-
ఒక అమాయకుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: ఒక అమాయకుడ్ని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులనే రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారాయన. గురువారం విజయవాడలోని పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడారు.క్రాంతి కుమార్పై ఏ కేసులు లేవు. కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయినా పోలీసులు అతన్ని ఎందుకు పోలీస్ స్టేషన్కు పిలిచారు? ఎందుకు హింసించారు?. సీఐ నాగరాజు తనను వేధిస్తున్నాడంటూ.. అది తట్టుకోలేక పోతున్నానంటూ వీడియో తీసుకుని మరీ క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పోలీసులే చిన్నాభిన్నం చేశారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.మూడు నెలలుగా పోలీసులు వేధిస్తున్నారని క్రాంతి తన వీడియోలో చెప్పాడు. ఆ మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు పెట్టాలని.. కానీ ఎందుకు అలా చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కనీసం క్రాంతి కుటుంబం ఫిర్యాదు చేస్తే కేసు పెట్టలేదు. క్రాంతి కుటుంబానికి న్యాయపరంగా సహాయం చేస్తాం. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటాం అని వైఎస్ జగన్ ప్రకటించారు.నెల వ్యవధిలోనే..విజయవాడ నడిబొడ్డులోనే రెండు దారుణ ఘటనలు జరిగాయి. నెల వ్యవధిలో ఓ లాకప్డెత్(గాదె సాయికృష్ణ కేసు), పోలీసుల వేధింపులు తట్టుకోలేక మరొకరు మరణించారు(క్రాంతి కేసును ఉద్దేశించి..). సాయికృష్ణ కేసులో అతని తల్లి అర్జీని కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఏకంగా సీసీటీవీ ఫుటేజీనే మాయం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ మాయమైపోతే బ్యాకప్ ఉండదా?. పద్ధతి ప్రకారమే స్టేషన్లో అరాచకాలు చేస్తున్నారు. సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం రక్షిస్తున్నారని అని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
ఇంటి పక్కనే ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావ్ చంద్రబాబు
-
క్రాంతి కుమార్ భార్యను పరామర్శించిన వైఎస్ జగన్
-
Watch Live: క్రాంతి కుమార్ ఇంటికి వైఎస్ జగన్
-
క్రాంతి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. వైఎస్ జగన్ రాకతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చారు. కాగా, సీఐ నాగరాజు వేధింపులతో క్రాంతికుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు కృష్ణలంక సీఐ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
-
నేడు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించనున్నారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని విజయవాడలో ఉదయం 10 గంటలకు పరామర్శించనున్నారు. -
క్రాంతికుమార్ కుటుంబానికి పీవీ సునీల్ కుమార్ పరామర్శ
సాక్షి, విజయవాడ: పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పరామర్శించారు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు భరించలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును పివి.సునీల్ కుమార్, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు (AIMS) సభ్యులు పరామర్శించారు.క్రాంతి కుమార్ కేసును సీబిఐకి అప్పగించాలని పీవీ సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. క్రాంతికుమార్పై ఉన్న అభియోగాలపై ఇప్పటి వరకూ నిరూపణ జరగలేదు. ఆరోపణలున్నంత మాత్రాన వారం వారం విచారణకు పిలిచి హింసించే అధికారం ఎవరికీ లేదు. ఎంత ఒత్తిడి లేకపోతే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటాడు. మే 21న క్రాంతి కుమార్ కోసం పోలీసులు వచ్చారు. పోలీసులు రావడంతో క్రాంతి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్రాంతి కుమార్ను ఎందుకు అంతగా వేధించాలి’’ అంటూ పీవీ సునీల్కుమార్ ప్రశ్నించారు.‘‘కేసులుంటే కోర్టులు శిక్షిస్తాయి. తక్షణమే క్రాంతి కుమార్ కేసులో సెక్షన్లు మార్చాలి. క్రాంతి కుమార్ ఆత్మహత్యను బీఎన్ఎస్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)గా మార్పు చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం క్రాంతి కుమార్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి. 15 రోజుల్లోగా ఈ పరిహారం అందించాలి. క్రాంతి కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగంతో పాటు భూమి ఇవ్వాలి. సీబీఐ విచారణ ద్వారానే క్రాంతి కుమార్కు న్యాయం జరుగుతుంది. క్రాంతి కుమార్ తండ్రి చేసే న్యాయపోరాటానికి నేను అండగా ఉంటా’’ అని సునీల్ పేర్కొన్నారు. -
ప్రైవేట్ చేతుల్లోకి ఆర్టీసీ భూములు
-
కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్ విజయవాడ 2వ ACM కోర్టు ఆదేశాలు
-
YS Jagan: "ఫోన్లు నాగ్పూర్లో అమ్మేశారా? ఈ కథను నమ్మాలా?"
-
రేపు ఉదయం విజయవాడకు వైఎస్ జగన్..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపు(గురువారం) ఉదయం విజయవాడులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పేరపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, క్రాంతి కుమార్ ఇటీవల సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
రగిలిన రైతన్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. సీజన్లో యూరియా, విత్తనాలు అందించకుండా యాప్ పేరుతో ఇక్కట్లకు గురి చేయడం.. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం.. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టడం.. సున్నా వడ్డీ రాయితీ పథకం డబ్బులివ్వకుండా రెండేళ్లుగా తొక్కిపెట్టటాన్ని నిరసిస్తూ రైతన్నలు చంద్రబాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, రైతుల పొట్టగొట్టిన ఈ రాక్షస పాలనను తుదముట్టించేంతవరకు విశ్రమించబోమని గర్జించారు. ‘సీఎం డౌన్ డౌన్’... ‘రైతు వ్యతిరేక పాలన నశించాలి’.. ‘కష్టం రైతులది.. లాభం దళారులదా..!’ అంటూ పిడికిళ్లు బిగించారు. బాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలతో విజయవాడ ధర్నాచౌక్ ప్రాంతం దద్దరిల్లింది. ధర్నాచౌక్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు వైపు కదం తొక్కారు. బూటుకాళ్లతో తొక్కుతూ.. పిడిగుద్దులుఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా రైతన్నలు ఉద్యమ కెరటాల్లా ఎగసిపడ్డారు. అలంకార్ సెంటర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి మూడు అంచెల బారికేడ్లతో దిగ్బంధించారు. పిడిగుద్దులు, బూటుకాళ్లతో తొక్కుతూ వారిని నిరోధించేందుకు యత్నించారు. పలువురు రైతులను పోలీసులు ఈడ్చేశారు. ధర్నాచౌక్ నుంచి లెనిన్ సెంటర్ వైపు ర్యాలీగా తరలి వెళ్లిన అన్నదాతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకంబారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. దాదాపు గంటకుపైగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకానికి పలువురు రైతులకు కాలి వేళ్లు చితికిపోయి రక్తపు గాయాలయ్యాయి. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా కొదమ సింహాల మాదిరిగా బారికేడ్లను తోసుకుంటూ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. దారిపొడవునా రైతులను అడ్డగిస్తూ బలవంతంగా ఈడ్చి పారేయగా, మరి కొంత మంది రైతులను పోలీసులు బూటుకాళ్లతో అడ్డగించే యత్నం చేశారు. అలంకార్ సెంటర్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బ్యారికేడ్ల పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ప్రభుత్వం పోలీసు బలగాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు బుజ్జగించడంతో రైతులు కొద్దిగా శాంతించారు. అంతకుముందు ధర్నాచౌక్ వద్ద 2 గంటల పాటు ధర్నా చేశారు. రైతులు ప్లకార్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేతబట్టి తలపై ఆకుపచ్చ కండువాలు కట్టుకుని ముందుకు సాగారు. ధర్నా చౌక్ వద్ద బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు..చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒక్కరైనా సంతృప్తికరంగా ఉన్నారని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా సంక్షోభంలో కూరుకుపోయేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు. ధర్నాచౌక్లో జరిగిన సభలో ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ఏపీ, కౌలు రైతుల సంఘ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఏ.కాటమయ్య, ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.రైతుల పరిస్థితి దారుణం400 ఎకరాల్లో మొక్కజొన్న వేశాం. కొనేవారు లేరు.. ఐదుసార్లు కలెక్టర్ చుట్టూ తిరిగాం. పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల వెంటపడ్డాం. పట్టించుకోలేదు. చేసేది లేక క్వింటాల్ రూ.1,600కు తెగనమ్ముకున్నాం. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. – డి.మల్లిఖార్జునరెడ్డి, వీరపునాయనపల్లి, వైఎస్సార్ కడప జిల్లాఏ పంటకూ మద్దతు ధరలేదుఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, మినుము సాగు చేశా. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1,600కు అమ్ముకుంటే.. ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,350కు అమ్ముకున్నాం. జొన్న క్వింటాల్కు రూ.1,800 మాత్రమే దక్కితే మినుము పూర్తిగా దెబ్బతింది. ఐదెకరాలకు రూ.3 లక్షల మేర నష్టపోయా. – కూరపాటి శింగయ్య, చిర్రావూరు, గుంటూరు జిల్లా -
సాయికృష్ణ లాకప్డెత్ కేసు.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
సాయి కృష్ణ లాకప్డెత్ కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ బాబురావు A5, A6గా సాంబయ్యలను చేరుస్తున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సాయి కృష్ణ లాకప్డెత్ లో అశోక్, నాని మా ఎదుట సరండర్ అయ్యారు. వారిని అరెస్టు చేసినప్పుడు మొబైల్స్ ఫోన్స్ ఇవ్వాలని అడిగితే అమ్మేశామంటూ చెప్పారు. అయితే తమ ఫోన్లను నాగపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్లు తెలిపారు. అయితే సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించడం నుంచి హత్య చేయడం వరకు సాక్ష్యాలు మాయం చేయడంలో అశోక్, నానిలు కీలకంగా వ్యవహరించారు. కుట్రలో భాగంగానే వీరు ముందస్తు చర్యల్లో భాగంగా భాగంగా అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. ఈ కేసు ఇంకా కీలక విచారణ దశలోనే ఉంది. మృతదేహాన్ని మాయం చేయడంలో ఇంట్లో ఎవరు పాత్ర ఉందో విచారణ జరపాలి ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరపాల్సి ఉంది. అశోక్, నానిని మరింత విచారించాల్సిన అవసరముంది. మే 6న సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. సాయి కృష్ణను విజయవాడలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకువచ్చినట్టు టవర్ లోకేషన్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు లభించాయి.. సాక్షులు నిందితుల మొబైల్ ఫోన్లో నెట్వర్క్ లు ఒకే ప్రాంతంలో చూపించాయి. సాయి కృష్ణ లాక్ అప్ డెత్ లో అశోక్, నాని ఇద్దరి పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షులు విచారించిన తర్వాత A 1గా వున్నా నాగరాజుని సాయికృష్ణకి అప్పగించారు. సాయికృష్ణ ని అశోక్, నాని, నాగరాజు తీవ్రంగా కుట్టారని శరీరం మీద గాయాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తీవ్రమైన హింస కారణంగా సాయికృష్ణ లాక్ అప్ డెత్ అయ్యాడు అని మేము విశ్వసిస్తున్నాం.’అని చెప్పుకొచ్చారు. -
విజయవాడ వెస్ట్ బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్నగర్కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. -
High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు
-
సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు
-
విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
Big Intro : హెడ్ కానిస్టేబుళ్లపై సంచలన ఆరోపణలు.. వెలుగులోకి వచ్చిన నిజాలు!
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి హైదరాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు.. టైర్ పంక్చర్తో అదుపుతప్పి.. డివైడర్ను దాటి విజయవాడ వెళ్తున్న లారీని ఢీకొట్టింది.బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరికిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్ను బయటకుతీశారు. ట్రావెల్స్ బస్సు, లారీ డ్రైవర్లకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ముప్పు తప్పింది.విశాఖలో కంటైనర్ బోల్తావిశాఖలోని షీలా నగర్ జంక్షన్లో కంటైనర్ లారీ బోల్తా పడింది. గాజువాక నుంచి పోర్టుకు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.నెల్లూరు జిల్లాలో..నెల్లూరు జిల్లాలో సంగం మండలం తరుణవాయు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి నెల్లూరు రొట్టెల పండగకు వస్తుండగా ఘటన జరిగింది. యాత్రికుల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
కానిస్టేబుళ్ల లొంగుబాటు... నిజమా? నాటకమా? కోర్టులో ఏంజరిగిదంటే
-
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?
-
హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది? ఫోన్ డేటా డిలీట్ కేసులో టెన్షన్!
-
AP: పలు జిల్లాల్లో భారీ వర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ
సాక్షి, విజయవాడ: రాగల మూడుగంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా ప్రస్తుతం విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. -
నల్గొండ: హైవేపై ఘోర ప్రమాదం
నల్గొండ జిల్లా: చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పింది. డివైడర్ దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా పడింది. బోల్తా పడిన వాహనాన్ని హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో రెండు కార్లు ఢీకొట్టాయి. వరుసగా మూడు కార్లు బోల్తా పడటంతో హైదరాబాద్ వైపు సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జాం అయ్యింది.ప్రమాదంలో సుమారు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్, ఎన్హెచ్ఏఐ సిబ్బంది పోలీసులు.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
సాయికృష్ణ కేసు కంచికే.. పోలీసులే పోలీసులపై విచారణ.. కృష్ణలంక క్రిమినల్స్
-
నా కొడుకు కేసును CBIకి ఇవ్వండి.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు సన్నిహితుడు..
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
కీలక పరిణామం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు. మొదట అదృశ్యం కేసుగా నమోదైంది ఈ వ్యవహారం. ఆ తర్వాత కస్టడీలో మృతి చెందాడన్న ఆరోపణలు వచ్చాయి.సాయికృష్ణను 2026 మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకపోవడంతో పాటు ఇంటికి కూడా రాకపోవడంతో, అతని తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలోనే తన కుమారుడిని హింసించి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. -
సాయికృష్ణ లాకప్డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు ఎన్హెబ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది సిట్ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.పోలీసు స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయాలి. గాదె సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలి. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలి. ఈ ఘటనలో సాక్షులను కాపాడాలి. బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం సహాయం వివరాలను అందజేయాలి’’ ఎన్హెచ్ఆర్సీ కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
-
సాయి కృష్ణ తల్లి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే..! అడ్వొకేట్స్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. ఇద్దరు పై అనుమానాలు
-
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
-
జాగ్రత్త నాగరాజు.. నిన్ను జైల్లోనే...! CIపై చంద్రబాబు బిగ్ స్కెచ్..!?
-
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. -
సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
గంగమ్మ లాకప్డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్పై దాఖలైన పిల్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా 17 మంది
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం ..
-
‘సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. అతన్ని పోలీసులు ఇబ్బంది పెట్టటానికి వేరే కారణాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబిఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణపై అత్యాచారం కేసు అబద్ధం. తన మరదలు, సాయికృష్ణ ప్రేమించుకున్నారు. ఇరువైపులా కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతో పెళ్లి చేయలేదు. ఈ విషయంలో ఆ అమ్మాయిని బెదిరించి.. సాయికృష్ణపై అక్రమంగా కేసు పెట్టించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సాయికృష్ణపై పోక్సో కేసు పెట్టారు. అది అబద్ధపు కేసని ఆ అమ్మాయే కోర్టులో చెప్పింది’’ అని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు.‘‘అసలు సాయికృష్ణ మీద పోలీసులు ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంటి?. సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ వాళ్లు తీసుకువచ్చి విచారించాల్సినంత కేసు ఏం ఉంది?. అతన్ని పోలీసు శాఖ ఎందుకు వాడుకుందో తెలియాలి. సీపీ, డీజీపీ, హోంమంత్రి నోరు తెరిచి వాస్తవాలను వెల్లడించాలి. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారంటే వాళ్లు ఎంతపెద్ద క్రిమినల్స్?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంకట్, రాజులను బెదిరించి సీసీ కెమెరా పుటేజీని డిలీట్ చేయించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలన్నీ బయటకు రావాలంటే సీబీఐతోనే విచారించాలి’’ అని వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. -
నేనే చంపా..! రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు ఇవే
-
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
పేరు చెప్పొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..! సీఐ నాగరాజు కు బిగ్ ఆఫర్..
-
తప్పు ఒప్పుకున్న CI నాగరాజు..? ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి?
-
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
-
ఒకరు కాదు ఇద్దరు కాదు.. 28 మంది వరకు ఈ కేసులో నిందితులు ఉన్నారు
-
CI నాగరాజు అరెస్ట్ పై, సీసీ టీవీ ఫుటేజ్ మాయం పై.. దేవినేని అవినాష్ రియాక్షన్
-
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!
-
రాత్రి 2 మృతదేహాలు వస్తే.. పోలీసుల ఒత్తిడితో దహనం చేశాం
-
ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికుల శంఖారావం
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14 రకాల సేవలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై కార్మికులు కన్నెర్రజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా సోమవారం విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ప్రభుత్వ తీరుకు నిరసనగా శంఖారావం పూరించారు. మున్సిపల్ సేవలు ప్రైవేటుపరమైతే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు.చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో చెత్త పన్నుపై నానా యాగీ చేసిన ఇదే చంద్రబాబు.. ఇప్పుడు అదే చెత్త పన్ను తీసుకొస్తున్నారని.. ఉమ్మేస్తే కూడా పన్ను వసూలు చేసేలా ఉన్నారని మండిపడ్డారు. కరోనా సమయం, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మున్సిపల్ కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుని దేవుళ్లు అని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు వారందర్నీ బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు చీకటి జీవోలతో పొట్టగొడతారా! కార్మికులను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి జీఓలతో మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో 14 సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధం కావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రైవేటుపరమైతే అన్ని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న 60 వేల మంది మున్సిపల్ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయన్నారు.ఇదే చంద్రబాబు 2014–19 కాలంలో జీవో నం.279 తెచ్చి మున్సిపల్ కార్మికుల బయటకు గెంటేసి, ప్రైవేటుపరం చేయాలని చూశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు జీవోలు 975, 673 తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నారన్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.నాగభూషణం మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేటుపరం చేయొద్దని, సేవలందించే వారిని పర్మినెంట్ చేయాలని కోరుతూ వేలాదిమంది కార్మికులు సంతకాలు చేశారని, ఆ ప్రతులను మున్సిపల్ మంత్రి నారాయణ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కార్మిక నేతలు కాశీనాథ్, వెంకటరెడ్డి, వెంకటరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..?
-
చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్
విజయవాడ: క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును దేవినేని అవినాశ్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేశ్,షేక్ ఆసిఫ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.నెలరోజుల క్రితం ఇదే రోజు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని దేవినేని అవినాశ్ చెప్పారు. ‘‘పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలే. 8 ఏళ్ల క్రితం క్రాంతి కుమార్ పై కేసులున్నాయి. ఇప్పుడు క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవు. తండ్రి కొనిచ్చిన కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ దందాల కోసం, గంజాయి అమ్మకాల కోసం పోలీసులు వేధిస్తున్నారు. క్రాంతి కుమార్ మృతికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో క్రాంతి కుమార్ కుటుంబం కూటమి కోసం పనిచేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకూ సీపీ పరామర్శించలేదు. డీజీపీ, సీపీ బయటికి రావాలి. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. క్రాంతి కుమార్ ను కులం పేరుతో పోలీసులు దూషించారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అందరిపై కేసులు నమోదు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు బయటికి వచ్చేవా? జగన్ కలిశాకే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సాయికృష్ణ,క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.ఇంకెప్పుడు ఆగుతాయి?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... క్రాంతి కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ హత్యలు ఇంకెప్పుడు ఆగుతాయని నిలదీశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ చనిపోయినా చంద్రబాబు, పవన్, హోంమంత్రి నోరుమెదపడం లేదని విమర్శించారు. చంపేసి సెటిల్మెంట్ చేసుకోవాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని తెలిపారు.వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో పోలీసులంటేనే భయపడేలా చేస్తున్నారని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ చెప్పారు. క్రాంతి కుమార్,సాయికృష్ణవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసీపీ నేత పోతిన మహేశ్ మాట్లాడుతూ.. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, క్రాంతి కుమార్ కుటుంబం పనిచేసిందని అన్నారు. కూటమి నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. -
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?
-
లాకప్ డెత్ కేసులో రోజుకో మలుపు.. మలయాళం సినిమాను మించిన క్రైమ్ థ్రిల్లర్
-
సాయి కృష్ణ కేసులో బిగ్ రివీల్.. బైక్ పై తీసుకెళ్లి దహనం చేసిన చోటు ఇదేనా..
-
‘‘కృష్ణలంక సీఐ వేధింపుల వల్లే నా భర్త చనిపోయాడు’’
విజయవాడ: కృష్ణలంక సీఐ వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని క్రాంతి కుమార్ భార్య ప్రభావతి చెప్పారు. స్టేషన్కు పిలిచినప్పుడల్లా చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. తాళ్లతో చేతులు కట్టి, ఒళ్లంతా కుళ్లబొడిచేవారని చెప్పారు. పోలీసులు దారుణంగా కొడుతున్నారని తన భర్త గతంలో కూడా చెప్పారని అన్నారు. చనిపోవడానికి ముందు కూడా సీఐ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు క్రాంతి కుమార్ ఫోన్ చేశారని తెలిపారు. తన భర్త చావుకు ముమ్మాటికీ సీఐ నాగరాజే కారణమని అన్నారు. నాగరాజును సస్పెండ్ చేయడం కాదు.. ఉరితీయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు పిల్లలతో ఇప్పుడు తాను ఎలా బ్రతకాలని నిలదీశారు. ప్రభుత్వమే తనను, తన పిల్లల్ని ఆదుకోవాలని కోరారు. -
ఆ రోజు జరిగింది ఇదే.. స్వర్గపురి శ్మశానవాటిక నిర్వాహకుడు
-
సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా!
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.విచారణలో భాగంగా ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకుని సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. శ్మశాన వాటికలో విధి నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
కృష్ణలంక స్మశాన వాటికలో సాయికృష్ణ అస్థికలు..?
-
సాయి కృష్ణ లాకప్ డెత్ శాంపిల్స్ ల్యాబ్ కు తరలింపు...
-
నా కొడుకు క్రాంతి కుమార్ ఎలా చనిపోయాడో.. నిజాలు బయటపెట్టిన తండ్రి
-
చంపిన తరువాత ఎందుకు కాల్చారు అంటే, అడ్వకేట్ బాల సంచలనం కామెంట్స్
-
కృష్ణలంక PSలో ఏం జరిగిందంటే! సీన్ టు సీన్ విశ్లేషణ..
-
Ambati: వీళ్ళందరూ హంతకులే..!
-
సాయి కృష్ణను ఎలా ఎప్పుడు చంపారో మొత్తం చెప్పిన జడ శ్రవణ్
-
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
రికార్డెన అసలు నిజం, విచారణలో బయటకు రాబోతున్న సంచలన నిజాలు..!
-
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు.. అసలు ఏం చేశారు?
-
CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు
-
సాయికృష్ణ, క్రాంతి కుమార్ కేసులు.. NHRCకి వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, అలాగే లాకప్ డెత్కు (అదృశ్యం) గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఛైర్మన్ను కలిశారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల తనూజరాణి, డాక్టర్ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యల వెనుక ఉన్న నిజాలను బయటకు తీసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. -
సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డు చేసిన ACP
-
ఫోరెన్సిక్ టీమ్ కి కీలక ఆధారాలు ఇవే!
-
ACP: ఫోటో రెడీ చేసుకుని దండేసుకో.. ఏంటి సార్ ఈ దారుణం..!
-
చనిపోయింది ఒకరు కాదు.. ఇద్దరు.. సాయికృష్ణ తల్లితో విచారణ బృందం..
-
సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు
-
సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!
-
ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్
-
నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో
-
నేరంలో CI, ACP, DGPకి కూడా భాగం ఉంది..
-
వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్
-
ఎవడి అండతో రెచ్చిపోతున్నారు? చంద్రబాబుపై జగన్ ఫైర్
-
ప్రత్యక్ష సాక్షి వీడియోను జగన్కు చూపించిన సాయి కృష్ణ తల్లి
-
LIVE: YS Jagan గాదె సాయికృష్ణ ఇంటికి..
-
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి : బొత్స
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతల బృందం లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసింది. డీఎస్సీ సహా కీలక అంశాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసింది. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు.మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు. ఆధారాలతో సహా మేం చెబుతున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది పేపర్ సెట్ చేసిన దగ్గర్నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకూ అంతా అక్రమమే. డీఎస్సీని పూర్తయ్యాక మెరిట్ లిస్ట్ ను ప్రకటించడం ఆవనాయితీ కానీ ఎక్కడా మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదు.ఆరోపణలు విమర్శలు వచ్చాక లిస్ట్ను వెబ్సైట్లో పెట్టారు. నేనే సాక్ష్యం. స్వయంగా నేను నలుగురు డీఈవోలతో మాట్లాడా.తప్పు జరగనప్పుడు దాపరికం దేనికి. ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే ఇలా చేశారు. పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. క్లబ్లలో ఆడే పేకాట బ్రిడ్జి గేమ్ను కూడా స్పోర్ట్స్ కోటాలో పెట్టారు. బ్రిడ్జి గేమ్ను గత ప్రభుత్వం పెట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయండి. అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. సీబీఐ విచారణతోనే అక్రమాలు బయటపడతాయి. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. సమగ్రవిచారణ జరిపించాలని గవర్నర్ ను కోరాం. విద్యార్ధుల భవిష్యత్, మనోభావాలాతో ఆడుకోవద్దని ఒక సెక్షన్ మీడియాను కోరుతున్నాం. ఈ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియపై ఎలాంటి నమ్మకం లేదు.అవసరమైతే అధికారులు రండి. మేం చర్చకు సిద్ధం. సిబిఐ విచారణ జరిగే వరకూ మా పోరాటం కొనసాగిస్తాం. లోకేష్వి పిల్ల చేష్టలు. మంత్రిగా ఉండి లోకేష్ మాట్లాడే మాటలు సరికాదు. మీ ఇంటికొస్తాం..మాకు 200 మీటర్లేనని లోకేష్ మాట్లాడుతున్నారు. గతంలో ఇదే మాట మాట్లాడిన జోగి రమేష్ను ఎందుకు అరెస్ట్ చేశారు.గవర్నర్ ఇంటి ముందే మేం ఉన్నాం..రమ్మనండి లోకేష్ని. అవగాహనలేని మాటలతో చేసేవన్నీ పిల్లచేష్టలే.మేం మొదటి నుంచి మంత్రి లోకేష్ ను డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ పై స్పందించాలని కోరాం. ఇన్నాళ్లకు లోకేష్ గుర్తొచ్చిందా. 2004లో మంత్రిగా ఉన్న నాపై వోక్స్ వ్యాగన్ డబ్బులు తినేశారని ఆరోణలు వచ్చాయి. సీబీఐ విచారణ జరిపించాలని మేమే కోరాం. ఆరోజు సిబిఐ విచారణ జరిగింది కాబట్టే మేం ఆరోపణల నుంచి బయటపడ్డాం. అందుకే డీఎస్సీ అక్రమాల పై సిబిఐ విచారణ కోరుతున్నాం. లాకప్ డెత్ ..విషయంలో పార్టీలు కాదు..మానవత్వం చూడాలి. ఒక అధికారిని బలిచేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. గాదె సాయికృష్ణది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఈ హత్యకు కారకులైన అందరినీ శిక్షించాలి. గాదె సాయికృష్ణ కేసును సిబిఐతో విచారణ జరిపించాలి’అని డిమాండ్ చేశారు. -
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు.అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని.. సీపీ, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని.. డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ‘‘మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును చూపించమని పోలీస్స్టేషన్కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారు. ..బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారు. సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసింది. బాధితులకు మేం సపోర్ట్గా నిలబడ్డాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారు. చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్ చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. చంద్రబాబు మాత్రం అతన్ని కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. సాయికృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేశారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘కంటితుడుపుగా సీఐ నాగారాజును మాత్రమే సస్పెండ్ చేశారు. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు. నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది. వీళ్లందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
జైల్లో ఖైదీలు చెప్పిన మాటలు వింటుంటే ...అంబటి సంచలనం
-
సాయికృష్ణ కేసులో వాటిని భద్రపరచాలని కోర్టు ఆదేశం
విజయవాడ రెండో ఏజేఎం కోర్టు గాదె సాయికృష్ణ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది. సీసీ ఫుటేజ్తో పాటు కాల్డేటాను కూడా భద్రపరచాలని కోర్టు చెప్పింది. కాగా, గాదె సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. గాదె సాయి కృష్ణ నెల రోజుల క్రితం కనపడకుండాపోయారు. ఆయన ఆచూకీ గల్లంతయిన కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. ఆ సమయంలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 29లోగా బాధితుడిని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని చెప్పింది. కాగా, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని.. మార్కాపురం జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. -
కలకలం.. సీఐ నాగరాజు వేధింపులకు మరో యువకుడు బలి?
సాక్షి,కృష్ణ: ప్రశాంతంగా ఉండే విజయవాడ నగరం.. గాదె సాయికృష్ణ అదృశ్యం, కస్టడీ మరణం ఆరోపణల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంచలనం సద్దుమణగక ముందే.. కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజుపై మరో తీవ్ర ఆరోపణ వెలుగులోకి వచ్చింది. గతంలో క్రాంతికుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. తన ఆత్మహత్యకు సీఐ నాగరాజే కారణమంటూ క్రాంతికుమార్ మరణానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఒకే పోలీస్ అధికారిపై వరుసగా ఇద్దరు యువకుల మరణాలు, అదృశ్యాలకు సంబంధించిన ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. సీఐ నాగరాజు నిరంతర వేధింపుల వల్లే క్రాంతికుమార్ ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీస్ స్టేషన్కు రావాలని పిలిచిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురైన క్రాంతికుమార్.. విష గుళికలు మింగి తనువు చాలించాడు. ఈ ఘోరానికి సంబంధించి మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్పట్లోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఎవరీ సీఐ నాగరాజువిజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పనిచేశారు. ఇద్దరు యువకుల (గాదె సాయికృష్ణ, క్రాంతికుమార్) అదృశ్యం, మరణం కేసులలో తీవ్రమైన వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.గాదె సాయికృష్ణ (25) అనే యువకుడిని మే 9, 2026న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆచూకీ పూర్తిగా గల్లంతైంది. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ఉపయోగించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ హింస భరించలేకే అతను కస్టడీలోనే మరణించి ఉంటాడని (లాకప్ డెత్) అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై బెజవాడ బార్ అసోసియేషన్ సాయంతో కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు, జూన్ 29 లోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.ఇదే క్రమంలో క్రాంతికుమార్ అనే మరో యువకుడి మృతి కూడా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కృష్ణలంక పోలీసులు తనను స్టేషన్కు రావాలని పిలవడంతో తీవ్ర ఆందోళనకు గురైన క్రాంతికుమార్ విష గుళికలు (పురుగుల మందు) మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.చనిపోయే ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో ఇటీవల బయటపడింది. ఆ వీడియోలో క్రాంతికుమార్ స్పందిస్తూ... ‘కృష్ణలంక సీఐ నాగరాజు మూడు నెలలుగా నన్ను వేటాడుతూ, కొడుతూ తీవ్రంగా వేధిస్తున్నారు. నా చావుకు ఆయనే కారణం’ అని స్పష్టంగా పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ రెండు వరుస ఘటనలకు సీఐ నాగరాజు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
రాజకీయ నేతల హస్తం ఉన్నదని బలంగా చెపుతున్న సాయి కృష్ణ తల్లి
-
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బాసు, బిగ్ బాసే సూత్రధారులు
-
సాయి కృష్ణ ఫోటోలు నాకు ఎలా వచ్చాయో తెలుసా..


