breaking news
vijayawada
-
ఉదయం ఇడ్లీ.. రాత్రి చికెన్
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల ఆహారపు అలవాట్లు భలే ఉన్నాయి. ఉదయం ఇడ్లీ, వెజ్ దోశ వంటి సాత్విక ఆహారంతో దైనందిన కార్యకలాపాలు ప్రారంభిస్తున్న వారికి చీకటి పడితే చికెన్ ముక్క గొంతు దిగాల్సిందేనట. 2025లో వచ్చిన ఆర్డర్ల ఆధారంగా విజయవాడ వాసుల ఆహారపు అలవాట్లపై ఆన్లైన్ ఫుడ్ యాప్ సంస్థ స్విగ్గీ ప్రత్యేక నివేదికలో వెల్లడించింది. చికెన్ వంటకాలకు క్రేజ్ ఆ సంస్థకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో 7.78 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ తొలిస్థానంలో నిలిచింది. 3.2 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో, 2.7 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ 3వ స్థానంలో నిలిచాయి. బ్రేక్ ఫాస్ట్లో ఇడ్లీ.. దోశ పోటాపోటీ ఉదయం వేళల్లో వచ్చిన ఆర్డర్లలో సింహ భాగం ఇడ్లీదే. 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి స్థానంలో 1.12 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ నిలిచింది. వీటితోపాటు ఉల్లి దోశ, పూరీ, వెజ్ వడలు ఉదయం వేళ అత్యధికంగా ఆర్డర్ చేశారు. పెరుగుతున్న అర్ధరాత్రి ఆర్డర్లు అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చే సంస్కృతి విజయవాడలో వేగంగా విస్తరిస్తోందని స్విగ్గీ ఆ నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే రాత్రి 12 నుంచి రెండు గంటల్లోపు ఇచ్చే ఆర్డర్లు 47.7 శాతం పెరిగాయి. అర్ధరాత్రి ఇచ్చే ఆర్డర్లలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఉండగా, ఆ తర్వాత చికెన్ బర్గర్లు, చికెన్ ఫ్రై, చికెన్ పిజ్జా, చికెన్ నగ్గెట్స్ వంటి నాన్వెజ్ వంటకాలు ఉన్నాయి. బెంగాలీ.. పంజాబీ వంటకాలపై మోజు విజయవాడ వాసులు బెంగాలీ, పంజాబీ వంటకాలను అత్యధికంగా ఇష్టపడుతున్నారని వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే బెంగాలీ వంటకాల ఆర్డర్లు 35 శాతం, పంజాబీ వంటకాల ఆర్డర్లు 30 శాతం పెరిగాయి. బయట తినేద్దాం విజయవాడలో బయట భోజనాలు చేసే అలవాటు పెరుగుతోందని వెల్లడించింది.అత్యధికంగా మదర్స్డే నాడు బయట హోటల్స్లో తినగా.. ఇందులో ఒక కుటుంబం రూ.30,079 బిల్లు చేసినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బయట తినేవారి సంఖ్య 276 శాతం పెరిగినట్టు స్విగ్గీ పేర్కొంది. స్విగ్గీ డైన్ అవుట్ ద్వారా నగరం సమష్టిగా రూ.90 లక్షలు ఆదా చేసిందని, ఒక కస్టమర్ సింగిల్ బుకింగ్లో రూ. 15,109 అత్యధికంగా ఆదా చేశారని స్విగ్గీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ్ భాకూ తెలిపారు. ఫుడ్ ఆన్ ట్రైన్కు కూడా డిమాండ్ బాగాపెరుగుతోందని, విజయవాడ జంక్షన్లో ఫుడ్ ఆన్ ట్రైన్ ద్వారా చేసే ఆర్డర్లు 233 శాతం పెరిగినట్లు తెలిపింది. కొనసాగుతున్న బిర్యానీ హవా ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ తన రాజసాన్ని కొనసాగిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా 93 మిలియన్ బిర్యానీల ఆర్డర్లు వచ్చాయి. నిమిషానికి 194, ప్రతీ సెకనుకు 3.25 బిర్యానీలు లాగించేస్తున్నారు. -
ఏపీ పోలీసులకు సైబర్ నేరగాళ్ల సవాల్
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీసులకు సైబర్ నేరగాళ్ల సవాల్ విసిరారు. సుమారు 80 మంది పోలీసు అధికారులు నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. లిక్కర్ కేసు సిట్లో ఉన్న కీలక అధికారి పేరుతో వసూళ్లు చేసినట్లు సమాచారం.లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న ఏఎస్పీ.. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. డీజీ స్థాయి అధికారి, డీఐజీ స్థాయి అధికారులు నుండి డబ్బులు వసూళ్లు చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పోలీసులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సైబర్ దాడితో ఏపీ పోలీసుల్లో కలకలం రేగుతోంది. -
‘కూటమిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’
సాక్షి, ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్లకు వైఎస్సార్సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా భయపడరని వైఎస్సార్సీపీ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారని చెప్పుకొచ్చారు.జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ను ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కలిశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ..‘కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు.83 రోజులు జోగి రమేష్, అతని సోదరుడిని జైలు పెట్టారు. జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పం. కోర్ట్ కూడా నమ్మింది బెయిల్ ఇచ్చింది. కూటమి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన కూటమి అన్యాయాన్ని జోగి ప్రశ్నిస్తున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జోగి రమేష్ను అరెస్ట్ చేసినా ఎవరిని బయపెట్టలేరు. అరెస్టులకు ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త భయపడరు. వైఎస్ జగన్ నాయకత్వంలో మరింత చురుగ్గా పాల్గొంటారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కక్ష పూరితంగా కేసులు పెట్టారు. వ్యక్తుల మీదనే కాకుండా కుటుంబంపైన కేసులు పెడుతున్నారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మాట్లాడుతూ..‘చేయని తప్పులకు 83 రోజులు జోగి రమేష్ను జైలులో పెట్టారు. జైలులో పెట్టడం తప్ప కూటమి నేతలు ఏమీ చేయలేరు. కూటమి చర్యలు చూసి ఆంధ్రప్రదేశ్ అంతా నవ్వుతుంది. జోగి రమేష్ మీదనే కాదు.. కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు నాటిన విత్తనం రేపు చెట్టు అవుతుంది. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై 2029లో చట్టబద్దంగా చర్యలు తీసుకుంటాం. జోగి రమేష్ ఎంత ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా బయటకి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో జోగి రమేష్ కూటమి పాలనపై పోరాటం చేస్తారు అని తెలిపారు. -
జనసేన సమావేశంలో రసాభాస
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రసాభాస జరిగింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఎదుట తూర్పు నియోజకవర్గ జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది.వివరాల మేరకు.. జనసేన పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సౌజన్య వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పుబట్టారు. పార్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారని సౌజన్యపై ఆరోపణలు చేశారు. దీంతో, తనపై ఆరోపణలు కాదు బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను వారికి సర్ది చెప్పారు. -
విజయవాడలో ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ.. సీపీఎం ఆందోళన
విజయవాడ: నగరంలో ఏపీఈఆర్సీ (APERC) బహిరంగ విచారణ చేపట్టిన సందర్భంలో సీపీఎం ఆందోళన బాట పట్టింది. విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ సీపీఎం డిమాండ్ చేసింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు సీపీఎం నేతలు. ట్రూ ఆఫ్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలంటూ సీపీఎం శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేశాయి. స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, పెట్టినవి తొలగించాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.విజయవాడలో ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలు జనవరి 22,23 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరుగుతున్నాయి. ఇవి 2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల సవరణలపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి నిర్వహిస్తున్నారు. -
Vij- Hyd: జనం తిరుగు ప్రయాణం
-
సంక్రాంతి రద్దీ.. ఏపీ నుంచి వచ్చేవారికి బిగ్ అలర్ట్..
సాక్షి, నల్లగొండ జిల్లా: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు చేపట్టారు. ఎన్హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుగుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలుమాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలునల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలుకోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.ఎన్హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ -
వరుస వివాదాల్లో ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దుర్గమ్మ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చేస్తోంది. కనకదుర్గానగర్ పార్కింగ్ వద్ద భక్తులపై దాడి ఘటన కలకలం రేపింది. విచక్షణ కోల్పోయి భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినందుకు భక్తులపై దాడి చేశారు.భక్తులపై దాడి చేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై స్పష్టత లేదంటూ దుర్గగుడి అధికారులు ప్రకటించారు. దుర్గగుడి అధికారుల బాధ్యతా రాహిత్యంపై భక్తులు మండిపడుతున్నారు.కాగా, ఇటీవల దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో ఈ ఘటన చోటుచేసుకోగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్ గ్రూప్లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది. -
విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ
-
Hyd: కొనసాగుతున్న వాహనాల రద్దీ
-
స్కిల్ స్కామ్ కేసు అలా ముగిసింది..
సాక్షి, విజయవాడ: అధికార దుర్వినియోగంలో చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా 53 రోజులపాటు జైలు శిక్ష అనుభవించిన స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును మొత్తానికి క్లోజ్ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీఐడీ తుది నివేదికను కోర్టులో ఫైల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. చివరకు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కినట్లయ్యింది.ఆంధ్రప్రదేశ్లో 2014–2019 చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 2023కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మర స్థాయికి చేరుకుంది. స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్ కంపెనీల ద్వారా సుమారు రూ.371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్ 9, 2023లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేసు దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని సీఐడీ కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది కూడా. మరోవైపు.. ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురి ఆస్తులను సైతం జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టేయించుకోవడానికి సీఐడీతో పిటిషన్ వేయించారు. గతంలో స్కిల్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సీఐడీ.. ఇప్పుడు ఇంత తీవ్రమైన కేసులో ఏమాత్రం నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేసులు మూయించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
Rayana Bhagya: ఏ ఇంట్లో సంక్రాంతి లేదు పేదలకు పండగ లేకుండా చేశావ్
-
దూసుకొచ్చిన కారు.. సాక్షి రిపోర్టర్ కు గాయాలు
-
విజయవాడలో కారు బీభత్సం
సాక్షి, విజయవాడ: భవానిపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సాక్షి టీవి ప్రతినిధి నాగేంద్ర చేతికి తీవ్ర గాయమైంది. రాజరాజేశ్వరి పేటకు చెందిన యూట్యూబర్కి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి కారు డ్రైవ్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.ఎలక్ట్రికల్ కారులో మంటలు.. మరో ఘటనలో బెంజ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రికల్ కారులో మంటలు చెలరేగాయి. కారు యాజమాని అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. కారు కానూరుకు చెందిన పీఆర్ హాస్పిటల్ డాక్టర్ చెందినదిగా గుర్తించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
సంక్రాంతి జోష్.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్ (ఫొటోలు)
-
సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.విజయవాడలో..పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. -
సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగకు ముందు, తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.In order to clear the extra rush of passengers, it is decided to arrange to run #SpecialTrains during #Sankranti festival between Hyderabad andSirpur Kaghaznagar & Hyderabad and Vijayawada with the dates as under: pic.twitter.com/JzzDcDAbZ5— South Central Railway (@SCRailwayIndia) January 10, 2026కాగా, తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ మీదుగా ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం
విజయవాడ: దుర్గమ్మ వారి గుడిలో అధికారుల మరో నిర్లక్ష్యం బయటపడింది. విజయవాడ దుర్గ గుడిలో భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. శనివారం( జనవరి 10వ తేదీ) ఉచిత ప్రసాదం కౌంటర్ దగ్గర భక్తులు క్యూలైన్లో ఉన్న సమయంలో విద్యుత్ షాక్ సంభవించింది. దాంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దాంతో ప్రసాదం పంపిణీని విద్యుత్ లేకుండానే పంపిణీ చేశారు. అయితే గత 15 రోజుల నుంచి చూస్తే దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం వ్మవహరించడం మూడోసారి. డిసెంబర్ 27వ తేదీ పవర్ కట్ చేశారు. ఆపై నిన్న(శుక్రవారం, జనవరి 9వ తేదీ) శ్రీ చక్ర అర్చనలో ఆవు పాలలో పురుగులు కనిపించడంతో అర్చన నిలిపి వేయాల్సి వచ్చింది. ఆపై ఈరోజు(శనివారం,జనవరి 10 వ తేదీ) విద్యుత్ షాక్ చోటు చేసుకోవడం, కరెంట్ లేకుండానే ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. -
విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్ (ఫొటోలు)
-
విజయవాడ సెంటర్లో 'కృష్ణ' విగ్రహావిష్కరణ
సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ అయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనవరి 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ మనవుడు 'జై కృష్ణ' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.అగ్ని పర్వతం సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారని చెప్పారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే31వ తేదీన సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహేష్ బాబు, కృష్ణ లాగా తను కూడా అభిమానులను సంపాదించుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ సినిమా థియేటర్స్ యజమానులతో పాటు నగర ప్రజలతో కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.సినిమా టికెట్ ధరలపై సూచనటాలీవుడ్లో సినిమా టికెట్ ధరల పెంపు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. ఈ అంశంపై తాజాగా ఆదిశేషగిరిరావు స్పందించారు. నిర్మాతలతో పాటు ప్రేక్షకుల కోణంలో ఆయన మాట్లాడారు. ఒక సినిమాకు బడ్జెట్ పెరిగిందనే సాకు చూపించి టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ పద్ధతి కాదని అయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచడంతో చిన్న సినిమాలు భారీగా దెబ్బతింటున్నాయన్నారు. ఆపై టికెట్ ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెద్ద సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్ భారీ ధరలు ఉంటాయని, ఆ మూడు రోజుల అయిపోగానే ఎటూ రేట్లు తగ్గుతాయన్నారు. టికెట్ ధరలు అందుబాటులోకి థియేటర్కు వెళ్లాలని ప్రేక్షకులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆదిశేషగిరిరావు తెలిపారు. -
ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....
-
విజయవాడ జైలులో జోగి రమేష్ తో YSRCP నేతల ములాఖత్
-
Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం
-
విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)
-
విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి
సాక్షి,విజయవాడ: ఐఏఎస్ అధికారి కిషోర్ సతీమణి సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్య దీపిక గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత వారం ఐఏఎస్ అధికారి కిషోర్ తన భార్యను ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే,ఈ ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.సత్య దీపిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యదీపిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు. -
‘ఇప్పటివరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం’
విజయవాడ: నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఎగ్జిబిషన్ను ఉన్నపళంగా కూల్చివేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధమైన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కూల్చివేత కార్యక్రమానికి నిర్వాహకులు అడ్డుకున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి పెస్టివల్ నిర్వహించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. అయితే దాన్ని తీసువేయాలని చెప్పి.. ఇవాళ కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో ఎగ్జిబిషన్ నిర్వహాకులు ఆందోళనకు దిగారు. నోటీసుల్లో వారం రోజులు గడువు అని ఉండగా, ఉన్నపళంగా కూల్చివేయడంపై మండిపడుతున్నారు. ఎగ్జిబిషన్ను ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్ల రూపాయిలు నష్టం వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో వారం రోజులు గడువు ఇచ్చారని, ఇవాళ కూల్చివేతలకు దిగారని మండిపడుతున్నారు. ఇప్పటివరకూ ఐదు కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టామని, ఉన్నపళంగా తీసేసేమంటే రోడ్డున పడే పరిస్ధితి వస్తుందని అంటున్నారు. -
‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి షాక్
సాక్షి, విజయవాడ: ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్ తగిలింది. పున్నమి ఘాట్లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవ్వగా.. పున్నమి ఘాట్లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు.భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు మాట్లాడుతూ.. పున్నమి ఘాట్లోని మా భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. పున్నమిఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కానీ కూల్చివేస్తున్నారు. మా భూములకు రక్షణ అవసరం. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాం. మా భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం. అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు..మా హద్దులు వేసుకొని మా భూములను కాపాడుకుంటాం. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎగ్జిబిషన్కు అన్ని అనుమతులు ఉన్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేస్తారా?. ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూల్చివేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వరా?. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం.కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మా స్థలాలను వాడుకుంటున్నారు మాకు పరిష్కారం చూపించడం లేదు. 20 ఏళ్లుగా వాడుకుంటూ మాకు రూపాయి బిళ్ల ఇవ్వడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ కార్యక్రమాలు పెడితే ఎలా?. ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్నే పంపేస్తారా?. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మాకు సహకరించకుంటే మేం సహకరించం. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మా భూముల పరిరక్షణకోసం అందరం ఏకమయ్యాం’’ అని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ పేర్కొన్నారు. -
విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..
-
దుర్గగుడికి కరెంట్ కట్!
సాక్షి, విజయవాడ: శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానానికి ఏపీసీపీడీసీఎల్ షాకిచ్చింది. కరెంటు బిల్లు చెల్లించలేదని ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపిసేసింది. దుర్గమ్మ ఆలయానికి రూ.3.08 కోట్ల బిల్లు బకాయి ఉందని పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు నోటిసులిచ్చినా అధికారులు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.ఈ క్రమంలో విసుగు చెందిన విద్యుత్ శాఖ అధికారులు హెచ్టీ లైన్ నుంచి పవర్ సరఫరా నిలిపేశారు. కరెంటు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలు కొనసాగిస్తున్నారు. అయితే ఆలయానికి చెందిన సోలార్ ప్లాంట్ నుంచి దేవస్థానానికి విద్యుత్ సరఫరా అవుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. అందుకే విద్యుత్ శాఖను పలుమార్లు నెట్ మీటరింగ్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.అయితే విద్యుత్ శాఖ సోలార్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సాంకేతిక కారణాలతో నమోదు చేయడం లేదన్నారు. కరెంట్ సరఫరా నిలిపివేస్తామని నిన్న సాయంత్రమే ఈవోకు సమాచారమిచ్చి అధికారులు స్పందించేలోపే విద్యుత్ నిలిపివేసారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తుల వస్తారని వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను అభ్యర్థించారు. -
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మందుబాబుల వీరంగం
-
కదం తొక్కిన సీఆర్ఎంటీలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్ష క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్ఎంటీ) కదం తొక్కారు. స్కూల్ అసిస్టెంట్ అర్హతలతో విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. తొలుత సీఆర్ఎం టీచర్లు ఏలూరు లాకుల సెంటర్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేతనాలు పెంచాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని, డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలనే డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.అనంతరం చేపట్టిన దీక్షలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ, ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఎస్టీయూ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. దీక్షను ఉద్దేశించి సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు ఎం.కాశి, బి.నారాయణమూర్తి, పోలినాయుడు, రాంజీప్రసాద్, యు.సాయికుమార్ మాట్లాడుతూ.. డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హతలు కలిగిన తాము అతి తక్కువ వేతనానికి 14 ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామన్నారు. అర్హతకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.స్కూల్ కాంప్లెక్సులను ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లుగా వేతన పెంపు లేకుండా పనిచేస్తున్నామన్నారు. అన్ని అర్హతలు ఉన్న సీఆర్ఎంటీలకు డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలని, ట్రావెలింగ్ అలవెన్సు పునరుద్ధరించాలని, సీఆర్ఎంటీలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి అందరికీ ఒకే విధమైన హోదాను, పనిని అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఖాళీ పోస్టుల్లో 50–100కిలో మీటర్ల దూరం ఉన్న వారిని మ్యాపింగ్ చేసే ప్రక్రియను విరమించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నూతన నియామకాలు చేపట్టి సీఆర్ఎంటీలపై అదనపు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఆర్ఎంటీలకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలన్నారు. సీఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. -
విజయవాడకు డ్రగ్స్ కల్చర్..!
-
మంత్రి నాదెండ్లకు షాకిచ్చిన రైతులు, టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: మంత్రి నాదెండ్ల మనోహర్కు రైతులు, టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేతలు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా అందిందన్నారు. కూటమి పాలనలో రైతు భరోసా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్ 20) తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ను మిల్లర్లు తమ కష్టాన్ని దోచేస్తున్నారంటూ రైతులు నిలదీశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు.. చంద్రబాబు సర్కార్ గాలితీసేశారు. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా రైతులు బయటపెట్టారు.రైతులకు మేమే మేలు చేశామని డబ్బాలు కొట్టిన చంద్రబాబు సర్కార్.. ధాన్యం కొనుగోళ్లపై గొప్పలు చెప్పుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ సాక్షిగా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. వైఎస్సార్సీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేత తోట సాయిబాబు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అరకొరగానే ఇచ్చారన్నారు. దీంతో టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కంగుతిన్నారు. -
పది రూపాయలు ఇవ్వలేదని తాతను చంపిన మనవడు
-
బాబు బిత్తరపోయేలా వైఎస్ జగన్ క్రేజ్
-
పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠా ఆటకట్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఢిల్లీ, ముంబైల నుంచి పసి పిల్లలను తీసుకొచ్చి, పిల్లలులేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టుచేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై నగరంలోని కొత్తపేట, భవానీపురం, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదుచేశారు. నిందితుల నుంచి ఐదుగురు పసిపిల్లలతోపాటు, రూ.3.30 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.విజయవాడ సితార సెంటర్కు చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లల్లేని వారికి అక్రమంగా పిల్లలను విక్రయించడాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ఆమెకు పరిచయమయ్యారు. వారు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవారు. ప్రతిఫలంగా వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వరకూ సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. వీరికి విజయవాడలో మరికొందరు కూడా జతకలిశారు. వీరంతా గతంలో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చారు. అమ్మకానికి సిద్ధంగా ఉండగా.. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్శర్మ, భారతిల నుంచి ఇద్దరు పిల్లలను.. ముంబైకి చెందిన కవిత, నూరి, సతీష్ ల నుంచి మరో ముగ్గురు పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే, పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు ఈ విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కె. లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, భవానీపురం, నున్న ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో ఐదుగురిని, నున్న పోలీస్స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నలుగురు పిల్లలను, రూ.3.30 లక్షల నగదును స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని (31), గరికముక్కు విజయలక్ష్మి (41), వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీకిరణ్కుమార్, శంక యోహాన్, పతి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని ఘట్కేసర్కు చెందిన ముక్తిపేట నందిని.. మొత్తం పదిమందిని అరెస్టుచేసినట్లు సీపీ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏడీసీపీలు జి. రామకృష్ణ, ఏసీపీ కె. లతాకుమారి, ఎన్వీ దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
బోండా ఉమా అండతో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
-
రివర్స్ డ్రామా.. వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్పై కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయించింది.సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయ్యింది. 2024 జులైలో వంశీ, ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డాడని తాజాగా ఆ వ్యక్తి మాచవరం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో.. వంశీ సహా మరో 20 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ జరిగింది వేరు!. 2024 జూలై 7న విజయవాడలోని వంశీ ఇంటిపై టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో రెచ్చిపోయారు. అయితే వంశీ ఇంటిపై జరిగిన దాడిని.. తమ పైన దాడిగా రివర్స్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పైగా ఫిర్యాదులో తమను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొట్టి.. దూషించి దాడి చేశారంటూ సునీల్ పేర్కొనడం గమనార్హం. ఇంతకు ముందు.. వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసుతో వంశీని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఈ కేసులో విజయవాడ జైల్లో ఉన్న ఆయన.. నూజివీడు కోర్టు బెయిల్ ఇవ్వడంతో 137 రోజుల తర్వాత బయటకు వచ్చారు. -
ఇంట్లోకి చొరబడి మహిళపై హత్యాయత్నం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో గంజాయి బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రాళ్లు, క్రికెట్ బ్యాట్లు, కారం చేత పట్టుకొని ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఓ మహిళను హతమార్చేందుకు యత్నించారు. గంజాయి మత్తులో వీరు చేసిన వీరంగంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ అజిత్సింగ్నగర్ లూనాసెంటర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుమ్మళ్ల కుసుమ అనే మహిళ సింగ్నగర్లోని నార్త్జోన్ తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో 20 ఏళ్లుగా ఉంటోంది. బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో టీవీ చూస్తుండగా గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు లోనికి ప్రవేశించాడు. చీరను లాగి ఆమెపై హత్యాయత్నానికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని బయటకు తోసేసి తలుపులు వేసింది. విషయాన్ని సమీపంలో ఉన్న తన అన్నయ్య శేఖర్కు ఫోను చేసి చెప్పింది. ఇంతలో ఆ వ్యక్తితోపాటు మరో ఇద్దరు గంజాయి బ్యాచ్ సభ్యులు, ఓ మహిళ కూడా వారితోపాటు వచ్చి రాళ్లు, బ్యాట్, కారంతో వీరంగం సృష్టించారు. మహిళను, ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఇంటిపైకి రాళ్లు రువ్వారు. అద్దాలు, తలుపులు, కిటికీలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. వీరి చేష్టలకు భయపడి స్థానికులు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులపైనా రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పోలీసులపైనా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. తమకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అండదండలు ఉన్నాయని హూంకరించింది. వారు చెప్పినట్లుగానే స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొడవ జరిగిన కాసేపటికే అక్కడకు చేరుకొని నిందితులను రక్షించేందుకు యత్నించారు. వారిపై కేసులు పెట్టవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నా కేసులు కట్టేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. రాజీ పడాల్సిందిగా బాధితులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. విషయం మీడియాకు, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కాకుండా చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు కట్టి చేతులు దులుపుకునేందుకు యత్నిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
హాస్టల్ విద్యార్థులకు కలుషిత నీరు.. తప్పు ఒప్పుకున్న చంద్రబాబు
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు కలుషిత నీరు అందించినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ..‘హాస్టళ్లలో నీళ్లు సరిగా లేవు, బాత్రూమ్లు సరిగా లేవు. కలుషిత నీరు ఇవ్వడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇది మనందరం సిగ్గుపడే విషయం’ అని అన్నారు. ఇన్నాళ్లూ మంత్రులు హాస్టళ్లలో నీటి సమస్య లేదని, కలుషితం కాలేదని బుకాయించారు. కానీ ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాస్టళ్లలోని దుస్థితిని బయటపెట్టారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించగా.. ఇప్పుడు తన పాలనా వైఫల్యాల్ని చంద్రబాబు సైతం అంగీకరించడం గమనార్హం. -
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
ఫేక్ సొసైటీతో భూకబ్జా కుట్ర
విజయవాడ నడిబొడ్డున ఖరీదైన భవానీపురంలోని జోజినగర్లో భూముల కబ్జాకు 2016లోనే కన్నేశారు. 1981 నాటి డేట్తో ఒక ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు జోజినగర్లో ఏకంగా 42 మంది పేదల ఇళ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేయటాన్ని బట్టి ఇందులో కూటమి పెద్దల కుట్ర స్పష్టంగా తేలుతోంది. ఇళ్ల కూల్చివేతపై సీబీఐతో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? పేదల తరపున ఉందా? ఇక్కడి వారు సీఎం చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్ రెండు సార్లు కలిశారు. అర్జీలు ఇచ్చారు. ఎవరికైతే వీరు అర్జీలు ఇచ్చారో.. వారే కుట్ర పన్ని వీళ్లకు అన్యాయం చేశారు.సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కారు విజయవాడ భవానీపురంలోని జోజినగర్లో 42 మంది పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్ల కూల్చివేత దారుణమన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం ఉందన్నారు.‘సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు ఎలా కూల్చేస్తారు? పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేయడం దుర్మార్గం. జోజినగర్ బాధితుల బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లించాలి. కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లు కట్టించి ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ జరిపించి ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామని హెచ్చరించారు.జోజినగర్ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం జోజినగర్లో పర్యటించి ఇళ్లు కోల్పోవడంతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ ఏకపక్షంగా తమ ఇళ్లను కూల్చివేశారని, ఎంత ప్రాథేయపడినా ఆలకించకుండా ఈ ప్రభుత్వం తమ బతుకులను రోడ్డు పాలు చేసిందని బాధిత కుటుంబాలు ఆక్రోశించాయి. వారికి న్యాయం జరిగేవరకు తోడుగా నిలిచి పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రభుత్వ పెద్దల అండతోనే కూల్చివేతలు..విజయవాడ జోజినగర్లో 42 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు 25 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే ఒక్కసారిగా వచ్చి ధ్వంసం చేశారు. ఈ స్థలం గురించి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఆ 42 కుటుంబాలకు డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఒకవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా, ఈనెల 31 వరకు ఊరట ఉండగానే.. ఒకేసారి 200 మందికి పైగా పోలీసులు వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ, ఈ 42 ఇళ్లకు సంబంధించిన వారిని నిర్దాక్షిణ్యంగా, వాళ్లు ఇళ్లలో ఉండగానే, ఇళ్లన్నీ పడగొట్టి రోడ్డున పడేశారు.ప్రభుత్వ పెద్దల ప్రమేయం, వారి సహకారం, ఆశీస్సులతోనే ఇదంతా జరిగింది. అందుకే ఇంత అకస్మాత్తుగా కూల్చివేశారు. ఈ నెలాఖరు వరకు గడువు ఉందని తెలిసి కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వారిని రోడ్డు పాల్జేశారు.ఫేక్ సొసైటీ ఏర్పాటు..ఇక్కడ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంది. దీంతో దీంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఓ ఫేక్ సొసైటీని పెట్టారు. 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీని ఏర్పాటు చేసి, రూ.150 కోట్ల స్థలాన్ని కాజేసేందుకు అడుగులు పడ్డాయి.వీరంతా చంద్రబాబు సన్నిహితులు. నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడికి కూడా ఇందులో ప్రమేయం ఉంది. ఇంతమంది కలిశారు. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందనేందుకు ఇది నిదర్శనం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే, డిసెంబర్ 31 వరకు వెసులుబాటు ఉన్నా కూడా.. 200 మందికిపైగా పోలీసులు వచ్చి ఇంత మందిని రోడ్డు పాల్జేశారు.ఈ స్థలాలు వేరేవారివైతే.. అనుమతులన్నీ ఎలా ఇచ్చారు?ఈ 2.17 ఎకరాల స్థలంలో 2001కి ముందు నుంచి 25 ఏళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇందులో చాలా మంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. వాటికి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చారు. ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి.ఇక్కడున్న వారిలో చాలామంది రూ.20 లక్షలు, రూ.25 లక్షలకుపైగా లోన్లు కూడా తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. మరి ఇక్కడ స్థలాలు వేరేవారివైతే.. ఎలా అనుమతి ఇచ్చారు? ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? బిల్డింగ్ ప్లాన్ ఎలా అనుమతించారు? బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి? వాటర్, పవర్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? మరి ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు, అన్ని అనుమతులున్నా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, న్యాయం చేయాలని కనీసం ఆలోచన చేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు మద్దతు ఇస్తూ, పోలీసులు వచ్చి పొక్లెయిన్లు, బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పగలగొట్టారు.గతంలో ఇక్కడ ఇళ్ల క్రయ విక్రయాలు జరిగినప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ఎక్కడా, ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదు. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు, రూ.150 కోట్లకుపైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ ఎంపీ, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. ఇంతమంది కలిసి ఒక్కటై పేదలను నిస్సహాయులుగా రోడ్ల మీద నిలబెట్టించారు.సీబీఐతో విచారణ జరిపించాలి..ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోంది. ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎంటర్ అవుతున్నారు. ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి కబ్జా చేస్తున్నారు. వీరే నిషేధిత జాబితాలో ఆస్తులను బలవంతంగా చేరుస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు.. వీరంతా కలసి ఏ రకంగా కబ్జాలు చేయిస్తున్నారో ప్రజలకు తెలియాలి.ఇక్కడ 1981 డేట్ వేసి ఓ ఫేక్ సొసైటీని 2016లో ఏర్పాటు చేశారు. అది కూడా బయటకు రావాలి. ప్రభుత్వం పేదలకు అండగా ఉండాల్సింది పోయి వారికి వ్యతిరేకంగా అఫిడవిట్లు, పిటిషన్లు వేసింది. అందుకే మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. వాస్తవాలు బయటకు రావాలి.ప్రభుత్వమే లోన్లు చెల్లించాలి.. ఇళ్లు కూడా కట్టించాలిఇక్కడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు. వారికి బ్యాంక్ లోన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇళ్లు లేవు. అందుకే ప్రభుత్వం ముందుకు రావాలి. వీరి బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే కట్టాలి. వీరందరికి ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ పక్కాగా ఇళ్లు కట్టించాలి.ఇది మీ జగనన్న మాట..!అయ్యా చంద్రబాబూ..! మీరు ఈ పని చేయకపోతే, రేపు మా ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం. దోషులను కోర్టు ముందు నిలబెడతాం. ఇక్కడి బాధితులందరికీ తోడుగా నిలబడతాం. బాధితులకు ఇది మీ జగనన్న మాట అని హామీ ఇస్తున్నా. సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ బాధితుల తరపున వాదించేందుకు వైఎస్సార్ సీపీ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తాం.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహూల్లా, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పోతిన మహేష్, పూనూరు గౌతంరెడ్డి, ఆసిఫ్, జోగి రాజీవ్, రామిరెడ్డి, కొండారెడ్డి, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆడపిల్లలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చా మేం 2007లో ఇక్కడ 180 గజాల ప్లాట్ కొన్నాం. నా ఇద్దరు కుమార్తెలకు 2015లో పెళ్లిళ్లు చేశాం. ఆ ప్లాట్ను రెండు భాగాలు చేసి 2016లో నా కుమార్తెలకు పసుపు–కుంకుమ కింద ఇచ్చాను. ఇప్పుడేమో ఆ ప్లాట్ మాది కాదని రోడ్డుపాలు చేశారు. ఇద్దరు కుమార్తెలు మా పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లుళ్లు గొడవ చేస్తున్నారు. చాలా దారుణంగా మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు భరోసా ఇచ్చారు.– కోడెబోయిన కోటేశ్వరమ్మప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది మేం అందరం డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. అక్రమంగా ఆక్రమించుకుని ఉంటున్న స్థలాలు కాదు ఇవి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మేం కొన్న స్థలాలు 25 తర్వాత మావి కాదంటే... మేం ఏమి చేయాలి? ఏమీ అర్థంకావడం లేదు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే మమ్మల్ని రోడ్డుపాలు చేసింది. అధికారులు బలవంతంగా మా ఇళ్లు కూల్చేశారు. ఉన్నపళంగా రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు.– విజయలక్ష్మిప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాసిన ప్రభుత్వం మేం ఎన్నో ఏళ్లపాటు డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రభుత్వం కొమ్ముకాసి మమ్మల్ని బజారున పడేసింది. ఇంత అడ్డగోలుగా మమ్మల్ని రోడ్డుపాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పేదలంటే చిన్నచూపని అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి మాకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయ పోరాటానికి సహకారం అందిస్తామని, మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మాకు చాలా ధైర్యం వచ్చింది.– కె.అరుణరూ.25 లక్షలు బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇక్కడ స్థలం కొన్నాం. కార్పొరేషన్ నుంచి ప్లాన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. ఇంటి నిర్మాణానికి బ్యాంకు నుంచి రూ.25 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పుడేమో ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. మేం కొనుక్కున్న స్థలం మాదికాదంటున్నారు. బ్యాంక్ రుణం ఎలా కట్టాలి? మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులే మా ఇంటి నిర్మాణానికి ప్లాన్ ఇచ్చారు. ఆ ఇంటికి పన్ను కట్టించుకుంటున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులైన పోలీసులు వచ్చి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మేం ఎలా బతకాలి?.– డి.స్రవంతిఊరిలో పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం సిటీలో స్థలం ఉంటే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాం. 25 ఏళ్ల కిందట సొంతూరులో ఉన్న ఎకరం పొలం అమ్మి ఇక్కడ స్థలం కొన్నాం. మొత్తం 42 ప్లాట్లు కొనుగోలుచేసివారు పేదలు. రోజువారీ పనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుని బతికేవాళ్లు. మేం అందరం కలిసి ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని కాస్త అభివృద్ధి చేసుకున్నాం. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి ఆక్రమించినట్లుగా సొసైటీ పేరుతో అక్రమంగా మా స్థలాలను ఆక్రమించారు. ప్రశ్నిస్తే కోర్టు తీర్పు అంటూ బెదిరిస్తున్నారు.– సుబ్బులులీగల్ సపోర్ట్ ఇస్తామని వైఎస్ జగన్ భరోసా కోర్టు తీర్పులో ఇళ్లు కూల్చి 42 ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెలాఖరు వరకు కోర్టు గడువిచ్చింది. స్థానిక న్యాయస్థానాలు, హైకోర్టు ఇలా చాలాచోట్ల వాదోపవాదనలు జరిగాయి. అయితే బాధితులకు సరైన న్యాయం జరగలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల బాధితుల తరఫున న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించటానికి లీగర్ సపోర్ట్ ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. – వి.స్వప్న, న్యాయవాది -
జోజినగర్కు వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
MASS WARNING : 42 కుటుంబాలను నడిరోడ్డున పడేస్తావా?
-
YS Jagan: ఎవ్వరినీ వదిలిపెట్టను.. CBI ఎంక్వయిరీ వేయిస్తా..
-
విజయవాడ జోజినగర్ బాధితులకు అండగా YS జగన్మోహన్రెడ్డి
-
జగనన్న రాకతో ధైర్యమొచ్చింది..!
జగనన్న అంటే ప్రజల గళం.. జగనన్న అంటే ప్రజల బలం.. జగనన్న అంటే ప్రతి ఇంటి వెలుగు.. జగనన్న అంటే ప్రతి మనసు నమ్మకం.. జగనన్న అంటే ప్రజల ఆశ.. జగనన్న అంటే ప్రజల విజయం.. జగనన్న అంటే మన అందరి భవిష్యత్తు.. ఓవరాల్గా చెప్పాలంటే జగనన్న అంటే ప్రజల ధైర్యం.విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులు సైతం ఇదే ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ వద్దకు జగనన్న రావడంతో ధైర్యమొచ్చిందన్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే చేస్తారనే నమ్మకం ఆయన కల్పించారని ఆ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందనే బాధను దిగమింగుతూనే జగనన్న రాక ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే జగనన్న తమ వద్దకు వచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ జోజినగర్ ఇళ్ల కూల్చివేత బాధితుల్ని నేడు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) వైఎస్ జగన్ పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో 42 మందిని అన్యాయంగా రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. కాగా, విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ , ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వారిని ఈరోజు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇళ్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు. ఇవీ చదవండి:బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్ జగన్జోజిగనర్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ -
Vijayawada: సుప్రీం స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారు.. YS జగన్తో బాధితుల ఆవేదన
-
LIVE : విజయవాడ 42 ప్లాట్ల బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
Vijayawada: జగన్ విజయవాడ పర్యటన
-
ఇంద్రకీలాద్రి : సంబరంగా ముగిసిన దీక్ష విరమణ ఉత్సవాలు (ఫొటోలు)
-
రేపు విజయవాడకు వైఎస్ జగన్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం, డిసంబర్ 16వ తేదీ) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఇళ్లు కోల్పోయిన జోజినగర్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. భవానీపురం జోజినగర్కు చెందిన 42 ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ను కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ..విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ , ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి:‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’ -
విజయవాడ దుర్గమ్మ గుడిలో భవానీ భక్తుల పట్ల అపచారం
-
ఇంద్రకీలాద్రి : రెండో రోజు దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : జై భవానీ..జైజై..భవానీ..! (ఫొటోలు)
-
జోజినగర్ బాధితులకు వైఎస్సార్సీపీ అండ
సాక్షి, అమరావతి: విజయవాడలోని జోజినగర్లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.పక్కా రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిరి్మంచుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ రిజి్రస్టేషన్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు. పేదోళ్లంటే ఈ ప్రభుత్వానికి కడుపు మంట చంద్రబాబు ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ జగన్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామా న్లు బయటకు తీసుకొచ్చే సమయమూ ఇవ్వకుండా నేలమట్టం చేశారని ధ్వజమెత్తారు. 25 ఏళ్లుగా ఆస్తి పన్ను, కరెంట్ బిల్లు చెల్లిస్తున్నా ఏమాత్రం కనికరం చూపలేదన్నారు. ఎక్కువగా మాట్లాడితే మా ఇళ్లను నేలమట్టం చేసినట్లు మమ్మల్ని కూడా నేలమట్టం చేస్తామని టీడీపీ నేత సురక శ్రీనివాసరావు బెదిరించారని బాధితురాలు అరుణ వాపోయారు.ఇళ్లు కూల్చేయడంతో చెట్టు కింద ఉంటున్నామని బాధితురాలు తంగా సుబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం కుదువ పెట్టి, పైసాపైసా కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని చెప్పా రు. శ్రీ లక్ష్మీ రామ కో–ఆపరేటివ్ సొసైటీ వాళ్లే ఇదంతా చేశారని విజయలక్ష్మి అనే బాధితురాలు మండిపడ్డారు. వైఎస్ జగన్ భరోసాతో ధైర్య మొచ్చిందని బాధితులు లలిత కుమారి, లక్ష్మణ్ తదితరులు అన్నారు. -
భవానీపురం బాధితులకు విజయవాడ మేయర్ గుడ్ న్యూస్
-
చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్ మంత్రులపై సీరియస్..
-
భవానీపురం బాధితుల కంటతడి.. వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఉత్తర్వులపై ఉత్కంఠ
సాక్షి, విజయవాడ: దొడ్డిదారిన తనపై నమోదైన ఫైబర్నెట్ కుంభకోణం కేసును క్లోజ్ చేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రయత్నానికి వైఎస్సార్సీపీ నేత, ఫైబర్నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి రూపంలో ట్విస్ట్ ఎదురైంది. తాజాగా గౌతమ్రెడ్డి వేసిన పిటిషన్ను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఉత్తర్వులను రెండ్రోజుల పాటు వాయిదా వేసింది. 2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో సుమారు రూ.300 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీడీఐ కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న 'టెర్రా సాఫ్ట్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చింది. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆస్తుల అటాచ్మెంట్కు కూడా సిద్ధమైంది.అయితే.. అదే సీడీఐ ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియదని.. ఈ కేసు క్లోజ్ చేయమని పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే కేసును మూసివేస్తున్నట్లు సీఐడీ, సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. మాజీ ఎండీలు సైతం ఇందుకు అంగీకారం తెలిపారు. అయితే.. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఫిర్యాదుతో ప్రారంభమైన కేసును, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని పూనూరు గౌతమ్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసును క్లోజ్ చేయొద్దంటూ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ఇవాళ గౌతమ్ తరఫున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అభియోగాలను, వివరాలను.. ఇప్పుడు అధికారం ఉండడంతో కేసును మూసేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పొన్నవోలు. వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ ఆర్డర్స్ను 11వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
కూటమి కర్కశ సర్కారుపై గళమెత్తిన విద్యార్థి దళం (ఫొటోలు)
-
టెన్షన్.. టెన్షన్.. విజయవాడలో ఉద్రిక్తత
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)
-
సమ్మె బాటలో ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ ఫీజులను పెంచే నోటిఫికేషన్ అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిలిపివేయని పక్షంలో ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామన్నారు. రాష్ట్రంలోని రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డులలో గూడ్స్ రవాణా వాహనాలు నిలిపివేయడానికి నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది.ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ.. 13 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్నెస్ ఫీజు కేంద్రం భారీగా పెంచిందన్నారు. వాహన యజమానులు భారీగా ఫీజు చెల్లించాల్సి వస్తోందన్నారు. 20 ఏళ్లు దాటిన పాత వాహనాల ఫీజు రూ33వేల 400కు పెంచారు. పెంపు వల్ల వేలాది లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతారు. పాత వాహనాలపై అదనపు టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.చట్టం అమలు చేస్తే చిన్న వాహన యజమానులు దారుణంగా నష్టపోతారు. సరకు రవాణా యజమానులపై పెను భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను తప్పనిసరిగా రాష్ట్రం అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అమలు ను వెంటనే నిలిపివేయాలి. వెంటనే ఫీజులు తగ్గించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 9 నుంచి ఆందోళనకు దిగుతాం. రాష్ట్రంలో తిరిగే 10 వేల గూడ్స్ వాహనాలను నిలిపివేస్తాం. అన్ని వాహనాలకు వెహికిల్ లొషన్ ట్రాకింగ్ డివైజ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది.ఫ్యాసింజర్ వాహనాలకు వీఎల్టీడీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సరైనదే. గూడ్స్ వాహనాలకు వీఎల్ టీడీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. తగిన గడువు పెంచి వీఎల్ టీడీ అమలు చేస్తే సరకు రవాణా వాహనాలకు విఎల్ టీడీ ఏర్పాటుకు సహకరిస్తాం. నష్టాల్లో ఉన్న లారీ యజమానులపై భారం పడకుండా కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని వైవీ ఈశ్వరరావు పేర్కొన్నారు. -
విజయవాడ : ఆకట్టుకుంటున్న ఫల, పుష్ప ప్రదర్శన (ఫొటోలు)
-
చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం
-
ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)
-
విజయవాడలో ఉద్రిక్తత.. సుజనాచౌదరి ఆఫీస్ ముట్టడి
సాక్షి, విజయవాడ: భవానీపురంలో ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు ఇంటి ముందు బాధితులు బైఠాయించారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వాలని భవానీపురం బాధితులు కోరుతున్నారు. నిన్న విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేతలు అధికారులు చేపట్టారు. తక్షణమే కూల్చివేతలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్డర్ కాపీ అందేలోపే ఇళ్లను అధికారులు కూల్చేశారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు విలపిస్తున్నాయి.విజయవాడలో ఇళ్ల కూల్చివేత దారుణమని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఇందులో పలువురు నేతల హస్తం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పోతిన మహేష్ అన్నారు.బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ను బాధితులు ముట్టడించారు. ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫ్లాట్స్ను అన్యాయంగా కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కూల్చొద్దని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అన్యాయంగా మా ఫ్లాట్లను కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై ఎంక్వయిరీ చేయాలి. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వద్దకు కూడా వెళ్తామని బాధితులు అన్నారు. -
చంద్రబాబు ఇంటికి భవానిపురం బాధితులు
-
విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత
సాక్షి, విజయవాడ: భవానీపురంలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుంది.42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధితులు రోడ్డునపడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో బాధితుల వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బందోబస్త్ మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. కూల్చివేతలను బాధితులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. -
విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత
-
సంపద సృష్టి చేతకాలేదు.. చంద్రబాబు ఒప్పేసుకున్నారు!
సాక్షి, విజయవాడ: ఏపీ ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం చేతకాలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఎంత వెతికిన కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పు చేయడానికి వీలుండదు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించడం.. సంపద సృష్టి చేతకాలేదని తేలిపోయింది. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. ఇక అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరంటూ చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు.బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. -
విజయవాడ : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
Vijayawada: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు
-
ఎన్నికల హామీలు మరిచిన కూటమిపై AISF ఆగ్రహం
-
దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ: పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం నాటి ఈవో ధర్మారెడ్డి, సీ.ఎస్.వో నరసింహ కిషోర్లను విచారించిన సీఐడీ అధికారులు.. ఇవాళ వైవీ సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారని తెలిపారు. గంటన్నరపాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు.మనోభావాలకు సంబంధించి ఇష్యూను పొలిటికల్ ఇష్యూలా మారుస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణి అంశాలను రాజకీయ వివాదాలుగా మార్చారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘పరకామణి కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలి. దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలి. మీ హయంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచామని చెప్పారు. ఎవరిని పిలిచినా ఎవరిని విచారించినా రాజకీయం చేయొద్దు. తప్పు ఎవరు చేసిన తప్పే తప్పు. చేసినా దోషులను శిక్షించాలని మేము చెప్తున్నాం. నన్ను పిలిచినా, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచినా విచారణ కోసమే పిలిచారు.’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
విజయవాడలో హైటెన్షన్.. పోలీసుల బారికేడ్లు తోసేసి లోకేష్ ఇంటి ముట్టడి!
-
విజయవాడ : నయన మనోహరంగా జానపద కళా ప్రదర్శనలు (ఫొటోలు)
-
Vijayawada: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి తీరుతాం: విద్యార్థి సంఘాలు
-
వల్లభనేని వంశీకి సపోర్ట్ చేస్తావా? మహిళా అడ్వాకెట్ పై కక్షసాధింపు..
-
వల్లభనేని వంశీ లాయర్కి వేధింపులు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వేధింపులు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అక్రమ కేసులో వల్లభనేని వంశీకి అండగా న్యాయ పోరాటం చేసిన మహిళా న్యాయవాది అనూగీతపై కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. తుమ్మల రామకృష్ణ అనే వ్యక్తి అనూగీత స్థలంలో రాత్రికి రాత్రే గోడ నిర్మాణం చేపట్టాడు. దీంతో, ఆమె తరఫు వ్యక్తులు ప్రశ్నించగా పోలీసులు బెదిరింపులకు దిగడం గమనార్హం. విజయవాడ పోలీసులు సివిల్ పంచాయతీలు చేశారు. దీంతో, బాధితురాలు.. సీపీ రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని వెటర్నరీ కాలనీలో ప్లాట్ నెంబర్ 405లో న్యాయవాది అనూగీత (70) నివాసం ఉంటున్నారు. తాజాగా అనూగీత ఉంటున్న స్థలం సరిహద్దుల్లో ఆమె మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల రామకృష్ణ అనే వ్యక్తి అనూగీత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడి 30 చదరపు గజాలు భూమిని ఆక్రమించారు. రాత్రి రాత్రే ఆమె స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. దీంతో, ఇదేం పద్దతి అని అనూగీత ఇంట్లో పనిచేస్తున్న మహిళ రామకృష్ణను నిలదీశారు. అనంతరం, రామకృష్ణ తరఫున మాచవరం పోలీసులు రంగంలోకి దిగారు. ఏసీపీ దామోదర్ ఆదేశాలతో పోలీసులు అనూగీత ప్లాట్లోకి వెళ్లి పని మనిషి, ఆమె భర్తతో అనుచితంగా ప్రవర్తించారు.మహిళ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ అమెను దుర్భాషలాడాడు. వంద రూపాయలు ఇస్తే పక్కకు పోయే దానివి అంటూ అసభ్యంగా దూషించాడు. ఈ విషయాన్ని ఆమె.. అనూగీత దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అనూగీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామకృష్ణకు వత్తాసు పలకడమేంటని ప్రశ్నించారు. దీంతో, తమకు న్యాయం చేయాలని అనూగీత.. పోలీస్ కమిషనర్తో పాటు కోర్టును ఆశ్రయించారు. మాచవరం పోలీసులు కక్ష సాధింపుతోనే ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. -
జనారణ్యంలో విప్లవ స్లో‘గన్’!
రామవరప్పాడు/పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో మావోయిస్టు కదలికలు స్థానికంగా కలకలం రేపింది. భవన నిర్మాణ కార్మికులుగా, ఆటోనగర్లో రోజువారీ కూలీగా పనిచేసుకుంటూ బతుకుతామని చెప్పి నగరానికి కొంచెం దూరంగా ఉండే ఇళ్లను ఎంపిక చేసుకుని ఇళ్లను అద్దెకు తీసుకుని ఉండటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆక్టోపస్, టాస్క్ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్యూరోలతోపాటు స్థానికపోలీసులు రావటంతో ప్రసాదంపాడు ఉలికిపాటుకు గురైయ్యింది. ఆపరేషన్ కగార్ తర్వాత.. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ తర్వాత దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలకు చెక్ పడింది. దీంతో మావోయిస్టులు భారీగా నగరాల్లోకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా, పాలమడుగు గ్రామానికి చెందిన పొడియా బీమా, బీజాపూర్ జిల్లా గోండిగూడా గ్రామానికి చెందిన మడకం లఖ్మ, బీజాపూర్ జిల్లాకు చెందిన మడవి చిన్మయి, సుక్మా జిల్లాకు చెందిన చోడిమంగీ విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు ఎస్ఈఆర్ సెంటర్ దాటాక రైల్వేట్రాక్ అవతలివైపు దూరంగా ఉన్న ఓ రెండంతస్తుల భవనాన్ని రెండు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. మాయమాటలతో నమ్మించి.. తమది నగరంలోని అజిత్సింగ్నగర్ ప్రాంతమని, తమ చెల్లికి, ఆమె భర్త్తకు విభేదాలు వచ్చాయని, దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ నడుస్తుందని, కొంతకాలం విడిగా ఉండడం ఆ వివాదం ముగిసేవరకు ఉంటామని ఇంటి యజమానికి మావోలు నలుగురూ మాయమాటలు చెప్పా రు. ఇంటికి సంబందించి రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చారు. నెలనెలా అద్దెను కూడా సక్రమంగానే చెల్లించారు. ఆ మావోయిస్టుల్లో ఒక మహిళ మాత్రం ఇంటి నుంచి బయటకు రావటం, ఎవరితో మాట్లాడకపోవటంతో ఇటీవల ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు. దీంతో పొడియా భీమా, మడకం లఖ్మ తమ చెల్లెలి వివాదం సద్దుమణుగుతుందని, త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని యజమానిని బతిమలాడాడు. సోమవారం పోలీసులు తమ ఇంటి ముందు మోహరించటంతో అవాక్కవడం యజమాని వంతైంది. వీరివద్ద మారణాయుదాలు కూడా లభ్యం కావడంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. తరచూ వచ్చేది ఎవరు..? మావోయిస్టులు మకాం చేసిన ఇంటికి రెండు రోజులకు ఓసారి ముగ్గురు సభ్యులు వచ్చి రహస్యమంతనాలు చేసేవా రు. వారంలో రెండుసార్లు తప్పకుండా వచ్చేవారని స్థానికు లు తెలిపారు. వీరు వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వారికి భోజ న క్యారేజీలు తీసుకువచ్చేవారు. ఇంటి యజమానితో వారు బంధువులని చెప్పి మభ్యపెట్టారు. వీరు రాని సమయంలో తరచూ ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకునేవారని, ఎవరితోనూ మాట్లాడేవారు కాదని స్థానికులు తెలిపారు. -
విజయవాడ కోర్టుకు 28 మంది మావోయిస్టులు
-
తెలంగాణలో సరెండర్.. ఏపీలో మావోయిస్టుల షెల్టర్ : ఏడీజీ లడ్డా
సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.ఏపీలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ.. భద్రతా బలగాలు చారిత్రక విజయం సాధించాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలకు అభినందనలు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఎన్కౌంటర్ సమయంలో కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్చేశాం. కాకినాడలో మరో ఇద్దరిని, కోనసీమలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారు.ప్లాన్ ప్రకారమే ఆపరేషన్.. ఛత్తీస్ఘడ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం. నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్లో చనిపోయారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టాం. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నాం. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీంలను పట్టుకున్నాం. వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని పట్టుకున్నాం. మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు. మా ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసింది. మాకు ముందే సమాచారం వచ్చినా.. వారి పై నిఘా పెట్టాం. వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించాం. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం.వచ్చే ఏడాది మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తి.. తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారు. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి మూవ్మెంట్, ప్లాన్లపై ఇతర సమాచారం లేదు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదు. వచ్చ ఏడాది మార్చినాటికి ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం. మావోయిస్టుల కదలికలపై అనేక మార్గాల ద్వారా సమాచారం వస్తోంది. అనుమానితులపై నిఘా ఉంచాం. ఈరోజు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు ఇస్తాం’ అని చెప్పారు. -
కాసేపట్లో విజయవాడ కోర్టుకు మావోయిస్టులు
మావోయిస్టుల అరెస్ట్ అప్డేట్స్.. విజయవాడ:50 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు.ప్రత్యేక అనుమతితో ఐదు జిల్లాల పరిధిలో అరెస్టయిన మావోయిస్టులను విజయవాడ కోర్టుకు తరలింపు.మావోయిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.మరికొద్ది సేపట్లో భారీ భద్రత నడుమ మావోయిస్టులను కోర్టుకు తరలించనున్న పోలీసులుమీడియా ముందుకు మావోయిస్టులుఏపీలో నిన్న పట్టుబడిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలించిన పోలీసులు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఏపీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. నిఘా వర్గాలు అలర్ట్..ఇదిలా ఉండగా.. అల్లూరి జిల్లాలోని దండకారణ్యంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏజెన్సీలో హై అలర్ట్ జారీ చేశారు. మావోయిస్టులు అడవిని వీడుతున్న నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లోనూ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. విజయవాడ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకోవడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీకి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. -
విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది. భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్ఫోర్స్ ఆఫీస్కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)
-
కలహాల కాపురం.. విషాద తీరం
విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే విజయ్, సరస్వతి మనసులు కలిశాయి. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఏడాది పాటు కాపురం సజావుగానే సాగింది. పండంటి మగబిడ్డ కూడా పుట్టాడు. అప్పటి నుంచే కలతలు ప్రారంభమయ్యాయి. భార్య ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానం పెంచుకున్నాడు విజయ్. ఇటీవల ఆస్పత్రిలో డ్యూటీ ముగించుకుని బయటకు వస్తున్న భార్యపై కత్తితో దాడి చేసి చంపేశాడు. గంపలగూడెంకు చెందిన యువతి గ్రామ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తోంది. పెద్దాపురం గ్రామానికి చెందిన పవన్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 15 రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. వేధింపులకు గురి చేస్తున్నారంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వారితో పాటు, పెద్దలు కుదిర్చిన దంపతుల్లోనూ అనేక కలతలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా కొత్త స్నేహాలు ఏర్పడుతూ, అవి ఆకర్షణగా మారి, సొంత మనుషుల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని పరిస్థితికి తీసుకొస్తున్నాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): మూడు ముళ్లు.. ఏడడుగులతో ఒక్కటైన బంధం జీవితాంతం కలిసుండాలనే ఆలోచన చేసే వారు తక్కువయ్యారు. విలువలు అంతరించిపోతున్నాయి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఆప్యాయతలు, అభిమానాలు కనిపించడం లేదు. నామాటే నెగ్గాలనే ఇగోలు పెరిగిపోవడంతో భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడుతున్నాయి. వాటికి స్మార్ట్ఫోన్లు తోడవడంతో అనుమానపు భూతం మరింత జటిలం అవుతోంది. వీటి మధ్య విడాకుల దారి పట్టే వారు కొందరైతే, క్రూరమైన ఆలోచనలతో ప్రాణాలను తీసేందుకు వెనుకాడని వారు మరికొందరు. ఇగోలే కారణం.. దంపతుల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. ఎవరికి వారు తమమాటే నెగ్గాలనే పంతాలు పెరిగాయి. ఇద్దరూ సంపాదన పరులు అయినప్పుడు ఇలాంటి సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. చిన్న విషయాలను సైతం పెద్ద సమస్యను చేస్తున్నారు. ఎవరి చాటింగ్ వారిదే.. ఎవరి ఫోన్లాక్ వారిదే అన్నట్లు కాపురాలు సాగుతున్నాయి. దీంతో ఇంట్లో ఎవరితోనైనా భార్య ఫోన్ మాట్లాడితే భర్త అనుమానించే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా భర్త మాట్లాడినా భార్య అనుమానిస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో దంపతుల మధ్య పెను వివాదాలు తెచ్చి పెడుతున్నట్లు ఇటీవల జరిగిన ఘటనలే చెబుతున్నాయి. దాంపత్య మధురిమలేవి? భార్యభర్తలు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఆప్యాయంగా మెలిగేది లేదు. డబ్బు సంపాదనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది. ఏదొక వ్యాపారం, ఉద్యోగం చేస్తూ భర్త రోజంతా పనిచేసి, ఇంటికి రాగానే భోజనం చేసి పడుకొవడం సాధారణంగా మారింది. మనసంతా డబ్బు సంపాదన పైనే ఉంటుంది. కొద్ది సమయం కూడా భార్యతో ఆప్యాయంగా మాట్లాడే పరిస్థితి ఉండటం లేదు. ఇంటి వచ్చిన తర్వాత కొద్దిపాటి సమయం ఉంటే ఫోన్తోనే గడిపేస్తున్నారు. ఇలా దాంపత్య మధురిమలు అంతరించి పోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో భార్యభర్తల మధ్య రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. అనుమానాలే.. పెనుభూతాలుగా.. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో కొందరు కొత్త రిలేషన్స్ను వెతుక్కుంటూ పాశ్చాత్య ధోరణికి అలవాటు పడుతున్నారు. సోషల్ మీడియాలో చూస్తూ అలానే చేసేందుకు చూస్తున్నారు. అవే దంపతుల మధ్య కలహాలు రేపుతున్నాయి. అంతేకాదు అనుమానాలతో హత్యలు చేసేందుకు వెనుకాడటం లేదు. తన భార్య ఎవరితోనో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతోంది.. తనను అసలు పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకునే భర్తలు కొందరైతే, తన భర్త బయట ఎవరితోనో రిలేషన్లో ఉన్నాడు. తనను పట్టించుకోవడం లేదనే సాకుతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే మహిళలు మరికొందరు. ఇలా విలువలు లేని జీవితాలకు అలవాటు పడుతున్నారు. -
సింగపూర్-విజయవాడ విమాన సేవలు పునఃప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి సింగపూర్కు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ శనివారం నుంచి విమాన సేవలను పునఃప్రారంభించింది. సింగపూర్ నుంచి విమానం 151 మంది ప్రయాణికులతో ఉదయం 7.45 గంటలకు ఇక్కడికి చేరుకుంది.అనంతరం 10 గంటలకు 119 మంది ప్రయాణికులతో సింగపూర్ బయలుదేరి వెళ్లింది.ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమానాలు నడుస్తాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఈ సర్వీసుల వల్ల సింగపూర్తో పాటు ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు వెళ్లేందుకు సులభమవుతుందన్నారు. -
విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య
-
నడిరోడ్డుపై భార్యను కిరాతకంగా..
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచాడు. మెడపై పొడిచి పీక కోయడంతో ఆ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో కుప్పకూలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకుకున్న భర్త విజయ్.. భార్యను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా పొడిచాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 14న విజయ్, సర్వసతీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సరస్వతి.. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తుండగా.. భర్త విజయ్.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. అనుమానం పెనుభూతంగా మారి పట్టపగలే భార్యను విజయ్ దారుణంగా హత్య చేశాడు. భార్య సరస్వతి రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివాసం ఉంటుందిప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే?కాగా, ప్రత్యక్ష సాక్షి బాలయ్య సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. సరస్వతిని విజయ్ కత్తితో పొడిచిన సమయంలో తాను ఆపే ప్రయత్నం చేశానని తెలిపారు. ‘‘దగ్గరకి వెళ్తే.. మీకు దీని గురించి తెలియదు నన్ను అపకండంటూ విజయ్ గట్టిగా అరిచాడు. నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది అందుకే చంపేస్తున్నా అంటూ అరిచాడు. వద్దని వారించిన మెడపై కత్తి తో పొడిచాడు.. పీక కోసి రాక్షసుడిలా బిహేవ్ చేశాడు. ఆసుపత్రిలో సరస్వతి డ్యూటీ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. అప్పుడే కత్తితో దాడి చేశాడు‘‘ అని బాలయ్య వివరించారు. -
Vijayawada: ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ఈ ప్రజా ఉద్యమంతో కళ్ళు తెరవండి
-
విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత
విజయవాడL ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విజయవాడలో 248 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి యూపీ తరలించేందుకు విజయవాడలో ఉంచిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి గంజాయి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 50 లక్షల రూపాయల ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి తరలించడానికి సిద్ధం చేసిన రెండు లారీలను సీజ్ చేశారు అధికారులు. -
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్, షెడ్యూల్ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాటా్పడి, కృష్ణరాజపురంలో హాల్ట్లు కల్పించింది. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 ఏసీ చైర్కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. అలాగే, రైలు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ప్రారంభించిన విజయవాడ– చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను నరసాపురం వరకు పొడిగించారు. గుడివాడ, భీమవరంలో హాల్ట్లు కల్పించారు. -
NRI భాస్కర్ రెడ్డిని కొట్టిన పోలీసు అధికారులు
-
Punuru Gowtham: నన్ను చంపడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు
-
YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం
-
వైఎస్సార్సీపీ గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం?.. షాకింగ్ వీడియో
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కారుకు నిప్పు అంటించిన తర్వాత సదరు వ్యక్తి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే పలుమార్లు పూనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన అనంతరం తనకు ప్రాణహాని ఉందని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటికైనా పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
అంబేద్కర్ విగ్రహంపై రెడ్ బుక్ రాజ్యాంగం
-
విజయవాడ సబ్ జైలుకు జోగి రమేష్
-
కాశీబుగ్గ ఘటన.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
-
ఎంఎస్రాజు వ్యాఖ్యలపై పవన్ ఎందుకు స్పందించడం లేదు?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే టీటీడీ పాలకమండలి సభ్యునిగా తొలగించాలన్నారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే ఇలాంటి వారికి టీటీడీలో సభ్యునిగా కొనసాగిస్తారా?. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం సిగ్గుచేటు. ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్న భగవద్గీతను టీడీపీ ఎమ్మెల్యే రాజు కించపరచటం దారుణం’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.అలాంటి వ్యక్తిని టీటీడీ సభ్యునిగా నియమించటాన్ని ఏం అనాలి?. టీటీడీ చరిత్రలో ఇలాంటి సభ్యుడిని ఎప్పుడూ చూడలేదు. ఇంత జరుగుతున్నా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?. టీటీడీ గోశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించటం దారుణం. ఇదేనా టీటీడీ గోసంరక్షణ?. చంద్రబాబుది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే రాజుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు
-
APలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్, తెలంగాణలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
-
24X7 మద్యం.. ఊరూరా సాక్ష్యం!
-
దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన. ‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు. -
విజయవాడ భవానీ ద్వీపంలో కార్తిక సందడి (ఫొటోలు)
-
పేదల గుండె ఘోష పట్టని సర్కార్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదల గుండె ఘోష చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి చికిత్సలు అందక గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి దిన దిన గండంగా మారింది. ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు అందక, చేతి నుంచి డబ్బు కట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితులు మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వం బకాయి పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నెల 10వ తేదీ నుంచి సేవలు పూర్తి స్థాయిలో నిలిపేసిన విషయం తెలిసిందే.గుండె జబ్బు బాధితులకు బైపాస్ సర్జరీలు, స్టెంట్లు, కిడ్నీ బాధితులకు డయాలసిస్, క్యాన్సర్ రోగులకు కీమో, రేడియేషన్ థెరపీలు నిలిపేశారు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం.. లేదంటే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిపోండని తరిమేస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) గురువారం విజయవాడలో ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరుకానున్నారు. ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఐఎంఏ, ఏపీ జూడా, ప్రభుత్వ వైద్యుల సంఘాలు సైతం ఆశ ధర్నాకు సంఘీభావం ప్రకటించినట్టు తెలిసింది. బేరసారాలతో మభ్యపెట్టే యత్నం! ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టినప్పటి నుంచి నెట్వర్క్ ఆస్పత్రులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన దాఖలాలు ఇదివరకు లేవు. చంద్రబాబు గద్దెనెక్కిన 17 నెలల కాలంలో రెండు పర్యాయాలు నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి సమ్మెబాట పట్టాయి. అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్ర చరిత్రలో లేనట్టుగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టడం కోసం ఇప్పుడు ఏకంగా ధర్నాకు దిగుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో పరువు పోతుందని గ్రహించిన ప్రభుత్వం ‘ఆశ’ ప్రతినిధులతో బేరసారాలకు దిగింది.మంగళవారం రాత్రి వైద్య శాఖ ఉన్నతాధికారులు ‘ఆశ’ ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించి బకాయిల చెల్లింపుపై బేరసారాలు ఆడారు. ‘ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లు ఇప్పుడు ఇస్తాం. నవంబర్ నెలలో మరికొంత మొత్తం ఇస్తాం’ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘ఇప్పటికే రూ.3 వేల కోట్ల పైబడి బకాయి పెట్టారు. అందులో రూ.250 కోట్లు మాత్రమే ఇస్తాం అంటున్నారు. క్లెయిమ్లు ప్రాసెస్ చేసి, ఆస్పత్రులకు జమ చేయడం కోసం సీఎఫ్ఎంఎస్లో సిద్ధంగా ఉన్న బిల్లులన్నీ వెంటనే విడుదల చేయండి. మిగిలిన బిల్లులు ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పండి. అప్పుడే మేం వెనక్కు తగ్గుతాం’ అని ‘ఆశ’ ప్రతినిధులు తేల్చి చెప్పినట్టు తెలిసింది.మా గోడు ప్రభుత్వం వింటుందని ఆశిస్తున్నాం నెల రోజుల పైబడి మేము సమ్మె చేస్తున్నాం. పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపేసి రెండు వారాలు అయింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ధర్నాకు సిద్ధం అయ్యాం. ధర్నా అనంతరం అయినా ప్రభుత్వానికి మా గోడు వినిపిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. – డాక్టర్ విజయ్కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ -
విజయవాడలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న బస్సు
-
విజయవాడలో భారీ వర్షం.. ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి, విజయవాడ: ఏపీలో(Ap Rains) వర్షాలు దంచికొడుతున్నాయి. విజయవాడలో శనివారం అర్థరాత్రి ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి విజయవాడ బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ క్రింద వరద నీరు చేరుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది బస్సులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు.ఇదిలా ఉండగా.. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో, తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీ బుధవారం నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.Crazy Rain yesterday night in #Vijayawada.IGMS Stadium is completely inundated in water. pic.twitter.com/Rdr3xyr3PO— Raghu (@RaghuB_) October 19, 2025ఇక, ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గురువారం నాటికి దక్షిణమధ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. pic.twitter.com/F8MfeYLfvr— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 18, 2025 -
పవర్ JAC సమ్మె విరమించడంపై స్ట్రగుల్ కమిటీ ఫైర్
-
Vijayawada: ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యం చర్చలు ప్రారంభం
-
తప్పులను ప్రశ్నిస్తున్న సాక్షిపై కూటమి కక్ష సాధింపు
-
లూథ్రాపై సీరియస్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లీగల్ : మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తీరుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్కృష్ణల బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించడంలో లూథ్రా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తుండటాన్ని తప్పుబట్టింది. ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సిద్దార్ధ లూథ్రా గురువారం ఆన్లైన్లో వాదనలు వినిపించారు.అయితే తన వాదనలు సూటిగా వినిపించకుండా కాలయాపన చేసేందుకు యత్నించారు. కౌంటర్లోని అంశాలను చదువుకుంటూ ఆయన ఆలస్యం చేస్తుండటంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించినప్పటికీ సిద్దార్థ లూథ్రా తన సాగదీత వైఖరిని కొనసాగించడం గమనార్హం. దాంతో మరింత అసహనానికి గురైన న్యాయమూర్తి.. అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా.. లేదా? సూటిగా చెప్పాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.అయినా సరే లూథ్రా ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. శుక్రవారం వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని పదేపదే కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఇప్పటికే రిమాండ్ మూడుసార్లు పొడిగించామని గుర్తు చేశారు. కొత్త ఆధారాలు, మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు సమరి్పంచలేదని, ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు.డిఫెన్స్ న్యాయవాదులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో డిఫెన్స్ న్యాయవాదులు స్పందిస్తూ.. గతంలో చంద్రబాబుపై దాఖలైన కేసులో లూథ్రా అర్థరాత్రి వరకు వాదనలు వినిపించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం తామంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాదనలు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మిధున్రెడ్డి అమెరికా వెళ్లే పిటిషన్పై విచారణ పూర్తి ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు వెళ్లేందుకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అనుమతి ఇప్పించాల్సిందిగా ఎంపీ తరఫున న్యాయవాది చంద్రగిరి విష్ణువర్ధన్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం ఏసీబీ న్యాయస్థానంలో ఇరుపక్షాల తరఫున విచారణ పూర్తయింది. న్యాయమూర్తి పి.భాస్కరరావు తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. చెవిరెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెన్నెపూస వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన మంతెన సత్యనారాయణరాజు వైద్యశాలలో చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది ఎం.వాణిరెడ్డి వేసిన పిటిషన్పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.మెరిట్ ఆధారంగా విచారణ జరపండి మద్యం విధానంపై అక్రమ కేసులో బెయిల్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక ఉత్తర్వులుసాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానంపై అక్రమ కేసులో కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, బూనేటి చాణక్య బెయిల్ పిటిషన్ల విచారణకు మార్గం సుగమమైంది. దీనిపై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. బెయిల్ పిటిషన్లను కేసు మెరిట్ ఆధారంగా విచారించాలని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కేసులో బుధవారం ఇచ్చిన తీర్పునే ఈ కేసులకు కూడా వర్తింపజేస్తున్నట్లు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. అందరికీ ఒకే తీర్పు వర్తింపు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు విచారించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు ప్రతి బెయిల్ పిటిషన్ను మెరిట్ ఆధారంగా, స్వేచ్ఛగా విచారించి నిర్ణయం తీసుకోనుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం.. మద్యం విధానంపై దాఖలైన కేసుల్లో కొందరు నిందితుల బెయిల్పై నిర్ణయం వెలువడే వరకు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో విచారించవద్దని హైకోర్టు ఆదేశించటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బుధవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టింది. ఒకరి బెయిల్ పిటిషన్తో మరొకరికి సంబంధం లేదని, ప్రతి కేసును దాని యోగ్యత (మెరిట్) ఆధారంగానే విచారించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ పిటిషన్ల విచారణను నిలిపివేయడం సరికాదని, వ్యక్తి స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. -
విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
సాక్షి, విజయవాడ: నగరంలో భారీగా స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏనీటైమ్ ఫిట్నెస్ సెంటర్లో స్టెరాయిడ్స్తో రసూల్ అనే యువకుడు పట్టుబడ్డాడు. జిమ్కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్, టాస్క్ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. నగరంలోని పలు జిమ్లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. సునీల్, రసూల్ కలిసి స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. -
గర్జించిన విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, విద్యుత్ సంస్థల మొండివైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో భారీ ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ పేరుతో నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది ఉద్యోగులు తరలివచ్చారు. డిమాండ్ల సాధనకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) గత నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి స్పష్టమైన హామీ రాలేదు.దీంతో సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 20 వేల మందికి పైగా శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు, తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా లెక్కచేయకుండా ముందు రోజు రాత్రే దూర ప్రాంతాల నుంచి ఏ వాహనం దొరికితే అందులో విజయవాడకు వచ్చారు. చర్చలు విఫలం.. సమ్మె తప్పదు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచాయి. సోమవారం సాయంత్రం రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లను విద్యుత్ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో మంగళవారం ‘వర్క్ టు రూల్’, బుధవారం నుంచి నిరవధిక సమ్మె జరుగుతాయని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య స్పష్టం చేశారు. చర్చల అనంతరం జేఏసీ నేతలు కె.శ్రీనివాస్, ఎంవీ గోపాలరావు, ఎంవీ రాఘవరెడ్డి, కేవీ శేషారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, ఏపీ జెన్కో ఎండీతో కూడిన అధికారుల బృందం చర్చలు జరిపింది.జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో కొన్నిటికి మాత్రమే వారు సానుకూలత వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయడం, బకాయిలు చెల్లించడం, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంటు)లకు విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న పాత సర్విసు నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్రధాన డిమాండ్లను కమిటీ తిరస్కరించింది. ఫలితంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి’ అని కృష్ణయ్య తెలిపారు. ఉద్యోగులు దాదాపు 59 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిలో ఆఖరి ప్రాధాన్యతగా పొందుపరిచిన వాటిలో మొక్కుబడిగా కొన్నింటికి యాజమాన్యం అంగీకరించింది.ఈ మేరకు సోమవారం రాత్రి పలు ఆదేశాలను జారీ చేసింది. వాటి ప్రకారం.. కారుణ్య నియామకాలను చేపట్టేటప్పుడు 16 ఏళ్ల లోపు ఉన్నవారిని, 45 దాటిన వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అయితే ఈ వయసు తక్కువ, ఎక్కువ (అండర్ ఏజ్, ఓవర్ ఏజ్) ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నాటికి దరఖాస్తు చేసిన వారికి మాత్రమేనని మెలిక పెట్టింది. ఉద్యోగ సంఘాలతో పీరియాడికల్ నెగోషియేషన్ కమిటీ (పీఎన్సీ) సమావేశం ప్రతి మూడు నెలలకు జరపడానికి ఒప్పుకుంది.డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంస్థ అవసరాలకు అడ్వాన్స్గా తీసుకునే నగదును రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. సర్వీస్ ఇంక్రిమెంట్ల క్రమబద్ధీకరణకు ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. పీఆర్సీ 2022పై ఇంజినీర్స్ అసోసియేషన్లు వేసిన కోర్టు పిటిషన్లను ఉపసంహరింపజేస్తామని హామీ ఇచ్చింది. కాగా కొన్ని డిమాండ్లకు అంగీకరించామని చెప్పుకునేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని విద్యుత్ జేఏసీ మండిపడింది. -
నారావారి సారాపాలన.. రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ ( ఫొటోలు)
-
YSRCP Leaders: ఆరోజు ఊగిపోయావ్ కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు
-
‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సాక్షిపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు
-
ఇంద్రకీలాద్రి కొండపై హీరోయిన్ లయ పూజలు (ఫొటోలు)
-
విజయవాడలో భారీ వర్షం (ఫొటోలు)
-
అందమైన రైల్వే స్టేషన్లు, ఎపుడైనా చూశారా?
-
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
మా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే
లబ్బీపేట/పటమట (విజయవాడ తూర్పు): తమ సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పందించి.. స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీహెచ్సీ వైద్యులు 20 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని.. తమతోపాటు ఇతర శాఖల్లో చేరిన వారు రెండు, మూడు పదోన్నతులు పొందారని వివరించారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.వైద్యుల సమ్మెకు జీడీఏఏ మద్దతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మెకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని జీడీఏఏ (గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యదర్శి డాక్టర్ బాబ్జీ శ్యామ్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లు నెరవేర్చాలని, డీఎంఈ వైద్యులకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇప్పటికే వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న పీహెచ్సీ వైద్యులు -
నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
PHC వైద్యులు, ప్రభుత్వం మధ్య చర్చలు విఫలం
-
రేపు చలో విజయవాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్లో జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టినా స్పందించలేదని.. అందుకే ఈనెల 7న ‘చలో విజయవాడ’ పేరుతో మహా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్విస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్క్యా‹Ùమెంట్ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని.. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ నియమించలేదని వాపోయారు.గత ప్రభుత్వం తెచి్చన హైసూ్కల్ ప్లస్లను పూర్తిగా నిర్విర్యం చేశారని.. అక్కడి పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా వైద్యం చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. సర్విసులో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు. అందుకే ఈనెల 7న ఉద్యమించబోతున్నట్లు తెలిపారు. పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతుఈనెల 7న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్రెడ్డి, గెడ్డం సుధీర్, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సైతం ధర్నాకు మద్దతు పలికింది. -
పిన్నిని ముక్కలుగా నరికి..!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది. -
ఎర్ర సముద్రంలా మారిన ఇంద్రకీలాద్రి..పోటెత్తిన భవానీలు (ఫొటోలు)
-
రిలే దీక్షలకు దిగిన పీహెచ్సీ వైద్యులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటివరకూ అమలుచేయకపోగా, వాటికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన వైద్యులు.. తాజాగా విజయవాడ ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రారంభించిన ఈ రిలే దీక్షలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగుతాయని అసోసియేషన్ నేతలు ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ⇒ అన్ని విభాగాల్లో 20 శాతం ఇన్సర్వీస్ పీజీ సీట్లు కొనసాగించాలి. టైమ్»ౌండ్ ఉద్యోగోన్నతులు ప్రకటించాలి. డీసీఎస్, సీఎస్ ఉద్యోగోన్నతులకు కాలపరిమితి నిర్ణయించాలి. ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వెంటనే ట్రైబల్ అలవెన్స్ మంజూరుచేయాలి. ⇒ సంచార వైద్యసేవలకు తక్షణమే సదుపాయాలు కలి్పంచాలి. వాయిదా పడిన వేతన పెంపును తక్షణమే అమలుచేయాలి. రోగులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు.. రోగులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశంకాదని, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తోనే సమ్మెకు వెళ్లినట్లు తెలిపారు. తాము సమ్మెకు వెళ్తామని అధికారులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకూ తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆమోదయోగ్యమైన డిమాండ్లు సీఎం దృష్టికిసాక్షి, అమరావతి: పీహెచ్సీ వైద్యుల డిమాండ్లలో ఆమోదయోగ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. వెంటేనే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. శనివారం సత్యకుమార్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. ఇన్ సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. -
కోడలిని హత్య చేసిన అత్తకు దుర్గగుడి ట్రస్ట్ లో కీలక పదవి..?
-
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మహిళ స్నానం చేస్తుండగా నగ్న వీడియో రికార్డ్ చేసి..
-
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
మహిషాసుర మర్దినిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
శ్రీ దుర్గాదేవి అలంకారం. .పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
విజయవాడలో గుండెపోటుతో ఎస్ఐ మృతి
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఎస్ఐ–2గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుతో విజయవాడలో సోమవారం ఉదయం మృతి చెందారు. విజయవాడలోని దుర్గాదేవి ఆలయం వద్ద దసరా ఉత్సవాల బందోబస్తు విధులకు వచ్చిన ఎస్ఐ విజయవాడ హనుమాన్పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరేలోపు బాత్రూంలో విగత జీవిగా పడి ఉండడంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. -
కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం
-
శ్రీమహాచండీ దేవి అలంకరణలో దుర్గమ్మ
-
నృత్యార్చనం
దేశవ్యాప్తంగా ఆలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ టెంపుల్ డ్యాన్సర్గా పేరుతెచ్చుకుంది విజయవాడవాసి కూచిపూడి నృత్యకారిణి కావ్య కంచర్ల. దసరా నవరాత్రుల సందర్భంగా తన విద్యార్థులతో కలిసి అమ్మవారి రూ పాలను వివిధ ఆలయాలలో నృత్యరూపకాలుగా ప్రదర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే కేరళ తరంగ్లో పాల్గొని విజేతగా నిలిచారు. గిన్నిస్బుక్ రికార్డ్లోనూ చోటు సం పాదించారు. నృత్యం ద్వారా తమ శక్తిని ఎలా ప్రదర్శిస్తారో ఈ సందర్భంగా వివరించారు.‘‘దసరా నవరాత్రులలో అంతటా అమ్మవారే కనిపిస్తుంటారు. ఇక విజయవాడలోనే కొలువైన అమ్మవారికి చేరువలో ఉంటూ నృత్యం ద్వారా సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వివిధ ఆలయాలకు ముందుగానే అప్లికేషన్స్ ఇచ్చాం. వారు ఇచ్చిన టైమ్ ప్రకారం నృత్యం ప్రదర్శనలు ఇస్తున్నాం. అలసట తెలియదునవరాత్రుల మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆరు ప్రదర్శనలు ఇచ్చాం. అమ్మవారి మీద ఎన్నో గీతాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో గీతాన్ని ఒక్కో ఆలయంలో మాకు ఇచ్చిన సమయం వరకు ప్రదర్శన ఇస్తున్నాం. పూర్తయ్యాక పెద్ద వయసున్నవారు కూడా ఏమాత్రం సంకోచించకుండా మమ్మల్ని కలిసి ‘ఆ అమ్మవారే నృత్యం చేస్తున్నారా అనే భావన కలిగింది’ అని చెప్పినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఒక తొంభై ఏళ్ల బామ్మగారు ప్రదర్శన పూర్తయ్యాక వచ్చి తన చిన్నప్పుడు నేర్చుకున్న ఆలాపన ఇప్పుడు గుర్తుకు వచ్చిందని భావయుక్తంగా పాడి వినిపించారు. ‘ఆ అమ్మవారు ఈ రూపంలో నాకు కనిపించారు’ అని పొంగిపోయారు. ఇలాంటి ఎన్నో అనుభూతులను ప్రతిసారీ మేం పొందుతుంటాం. మా దగ్గర నృత్యం నేర్చుకునే విద్యార్థులు కూడా ‘అమ్మవారి నృత్యంలో అలసట ఎందుకు రాదు’ అని అడుగుతుంటారు. నృత్యం ఒక యాక్టివిటీ కాదు దైవికంగా ఎంత దగ్గరవుతుంటామో ఈ నృత్యం మాకు స్పష్టం చేస్తుంటుంది. విజయవాడ అంటేనే అమ్మవారు. దసరానవరాత్రుల్లో ఆలయాల్లో మేం నృత్యం చేయడం అంటే అమ్మకు దగ్గరగా ఉన్నట్టే. ఒక భక్తి పూర్వక ప్రార్థన. మా నృత్యాన్ని అమ్మ చూస్తుంది అనే భావనతోనే చేస్తాం. ‘ఎంతసేపు నృత్యం చేసినా అలసటగా ఎందుకు అనిపించడం లేదు?’ అని మా విద్యార్థులు అడుగుతుంటారు. ఆధ్యాత్మికంగా అమ్మవారికి దగ్గరగా ఉంటే మరేమీ తెలియదు. అమ్మవారి ప్రతి రూపం మనకు ప్రేరణ ఇచ్చే పాఠమే. మన జీవన విధానానికి ఎంతగానో తోడ్పడేదే. ఆ శక్తిని మేం నృత్యం ద్వారా ప్రదర్శించడమే కాదు మేమూ పొందుతుంటాం. సేవ చేస్తున్న కొద్దీ శక్తి పెరిగేదే. శ్రీశైలం, తిరుపతి, శిరిడీ, మహానంది, భద్రాచలం, హరిద్వార్, కేదార్నాద్, బదిరీనాద్... ఇలా మనదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. వందల, వేల మంది ముందు ప్రదర్శనలు ఇస్తుంటాం కాబట్టి ధైర్యం పెరుగుతుంది. మధురమైన మాటతీరు, ఏకాగ్రత.. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలు పెరుగుతాయి. రోజూ సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆనందం కలుగుతుంది. వీటన్నింటి వల్ల జీవనశైలి కూడా బాగుంటుంది.బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ, నృత్యంలో డిప్లొమా చేశాను. మా అమ్మ మాధవికి కూచిపూడి నృత్యం అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచి నాకు నృత్యం నేర్పించారు. ఐదేళ్ల వయసు నుంచి ప్రదర్శనలు ఇస్తున్నాను. అకాడమీ పెట్టి, నృత్యసేవను కొనసాగిస్తూ ఉండాలని మా నాన్న కల. నాన్న వెంకట రత్నకుమార్ కరోనాలో మాకు దూరమయ్యారు. నాన్న కలను నెరవేర్చడానికి ‘పంచమవేద’ అకాడమీ ద్వారా కృషి చేస్తున్నాను. జాతీయ స్థాయి నృత్య పోటీ అయిన కేరళ తరంగ్లో పాల్గొన్ని విజేతగా నిలిచాను. ఇప్పటి వరకు 1500 కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. గ్రూప్గా చేసిన శతనృత్య యాగంలో పాల్గొనే అవకాశం రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కింది. ఎంతో సాధన చేస్తూ శక్తిని పెంచుకోవడానికే ఈ నృత్య సేవ చేస్తున్నాను’ అని వివరించారు ఈ నృత్యకారిణి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది. -
కాత్యాయనీ దేవిగా దుర్గమ్మ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి: మహిళా భక్తులపై పోలీసుల జులుం
విజయవాడ: శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్లో సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ భక్తులు తరలి రావడంతో వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు.దుర్గ గుడిపై వైభవంగా జరుగుతున్న నవరాత్రులలో భాగంగా గురువారం అమ్మవారు కాత్యాయనీ అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. విశేషంగా తరలివస్తున్న మహిళా భక్తులను పోలీసులను కట్టడి చేయలేకపోతున్నారు. విచక్షణ మరిచి పోలీసులు ప్రవర్తిస్తున్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా భక్తులను పట్టుకుని, పోలీసులు ముందుకు నెట్టివేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఒక సమయంలో పోలీసులతో సేవా కమిటీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. తమ వారిని దర్శనాలకు పంపించాలంటూ పోలీసులతో సేవా కమిటీ సభ్యులు గొడవపెట్టుకున్నారు. ఇదిలావుండగా దుర్గగుడి ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద డ్యూటీ ముగించుకుని బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ ను ముందుకు వెళ్ళమని ఏసీపీ తోసేసిన ఉదంతం చోబుచేసుకుంది. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి కానిస్టేబుల్ కిందపడిపోయాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఏసీపీ ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీ వాళ్లకేనా దర్శనాలు.. దుర్గ గుడి కమిటీ సభ్యులపై YSRCP రజని సీరియస్
-
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిపివేత
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశ) నిర్ణయించింది. రూ. 670 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.రూ.670 కోట్లు చెల్లిస్తేనే మేం చర్చలకు వెళతామని లేకపోతే చర్చలకు వెళ్లేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ‘‘మిగిలిన 2 వేల కోట్ల బకాయిల పై కార్యాచరణ ఇవ్వాలని.. అక్టోబర్ 10 లోగా మా సమస్యలన్నీ తీర్చాలి. మా సమస్యలు తీర్చకపోతే అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలన్నింటినీ పూర్తిగా ఆపేస్తాం. ప్యాకేజీలలో కచ్చితంగా మార్పులు చేయాలి...ప్యాకేజీలకు ఒక కచ్చితమైన సిస్టమ్ను పెట్టాలి. ఇన్స్యూరెన్స్ స్కీమ్కు వెళ్లే ముందు కచ్చితంగా మా బకాయిలు తీర్చాలి. ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్లాలి. బీమా ఆధారిత యూనివర్శల్ హెల్త్ ప్రోగ్రామ్కు రూపకల్పన చేయడంలో మమ్మల్ని భాగస్వామ్యుల్ని చేయాలి’’ అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. -
ఇంద్రకీలాద్రిపై అపచారం.. చెప్పులతో అమ్మవారి దర్శనానికి


