
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఎస్ఐ–2గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుతో విజయవాడలో సోమవారం ఉదయం మృతి చెందారు. విజయవాడలోని దుర్గాదేవి ఆలయం వద్ద దసరా ఉత్సవాల బందోబస్తు విధులకు వచ్చిన ఎస్ఐ విజయవాడ హనుమాన్పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరేలోపు బాత్రూంలో విగత జీవిగా పడి ఉండడంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.