సాక్షి, గుంటూరు: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లో నోటీసు ఇచ్చిన అధికారులు.. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో కోర్టుకు హాజరై తమ వాదన వినిపించుకోవచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని అధికారులు నోటీసులో తెలిపారు. ఈ నెల 27వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నారు.


