Hyderabad
-
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.నేరగాళ్ల నెట్వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర తలు నమోదు కావొచ్చని హెచ్చరిం చింది.ఆదివారం రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణో గ్రత 44.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది.ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వడగాడ్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్య వసరమైతే తప్ప మండే ఎండల్లో (మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు) అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా తీవ్ర తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, స్పృహ కోల్పోయే అవకాశమూ ఉందని.. కండరాలు బలహీనపడి తిమ్మిర్లు రావచ్చని వివరించింది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించింది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తగిన వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టంచేసింది. -
TG : హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే? పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.బండి సాయి భగీరధ్ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. -
కేబీఆర్ పార్క్ వ్యవహారం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కాసు బ్రహ్మనందరెడ్డి పార్క్ వ్యవహారంలో సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఉద్యానవనం ఆవరణలో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణ చేపట్టేంతదాకా పార్క్కు 35 మీటర్ల పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అధికార యంత్రాంగానికి కోర్టు స్పష్టం చేసింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అండర్పాస్ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లూ విధించారు. అయితే చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ ప్రేమికుల తరఫున కోర్టులో సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను నరకరాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది. ఎస్ఆర్డీపీ (SRDP - Strategic Road Development Plan) పేరిట.. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ వద్ద నిర్మాణలకు దిగింది. అయితే.. సుప్రీం కోర్టు స్టేతో కేబీఆర్ పార్క్ వద్ద ఆ పనులు తాత్కాలికంగా ఆగిపోనున్నాయి. -
అయినా కావాలి..నేపాలీ !
బంజారాహిల్స్: తక్కువ జీతం ఎక్కువ పని.. ఏడాది ఒక్కసారైనా సెలవు తీసుకోకపోవడం.. 24 గంటలూ ఇంటిపట్టునే ఉండడం..ఏ పని చెప్పినా కాదనకపోవడం.. పని ఎగ్గొట్టకపోవడం..ఇదీ నేపాలీ పనిమనుషులు చేస్తున్న పనులు. దీంతో వీరిని తొలగించాలంటే యజమానులు ససేమిరా అంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో చోటుచేసుకున్న నేపాలీ గ్యాంగ్ల దొంగతనాల దృష్ట్యా వారిని పనిలో నుంచి తొలగించాలంటూ నగరంలో అన్ని ఠాణాల పోలీసులు వారి వివరాలను సేకరించి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా తమ ఇళ్లల్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనుషులను దూరం పెట్టడానికి యజమానులు అంగీకరించడం లేదు. ● ఈ నెల 8వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రశాసన్నగర్లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజరంజన్ను ఆ ఇంటి పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నేపాలీలు కలిసి దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించారు. నేపాలీ పనిమనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు ఈ కాలనీలో నేపాలీ పనిమనుషులను ఎవరెవరు పెట్టుకున్నారో ఆ యజమానులను కలిశారు. మొత్తం 37 ఇళ్లల్లో నేపాలీ పనిమనుషులు ఉన్నారు. ● తమ ఇంట్లో గత 15 సంవత్సరాలుగా నేపాలీ జంట పనిచేస్తుందని, నమ్మకంగా ఉంటున్నారని, ఇప్పుడు వారిని తొలగిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, వీరి లాగా మరెవరూ పనిచేయలేరని ఓ అధికారి పోలీసుల మొహం మీదనే చెప్పేశాడు. వీరి పనితనం ఏమిటో ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగారు. ● బంజారాహిల్స్ పోలీస్స్టేషన్తో పాటు వెస్ట్జోన్ పరిధిలోని సుమారు 1360 మంది నేపాలీలు ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చి కనీసం వారి వివరాలైనా తీసుకోవాలని చెప్పినా ఒక్కరూ స్పందించిన పాపానపోలేదు. ప్రశాసన్నగర్లో ఇంత పెద్ద ఘటన జరిగినా నేపాలీ పనిమనుషుల విషయంలో అక్కడి బ్యూరోక్రాట్లు ఏమాత్రం భయపడకపోగా ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్నారని, వారిని తొలగించడం కష్టమంటూ చెప్పేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. తక్కువ జీతం..ఎక్కువ పని.. ఏడాదికోసారి సెలవు అందుకే వారివైపు మొగ్గు దశాబ్దాల తరబడి సేవలందిస్తూ.. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు నేపాలీల పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేసినా దశాబ్దాల తరబడి నగరంతో వీరి అనుబంధం విడదీయలేనిది. సెక్యూరిటీగార్డులుగా, ఇంటి కాపలాదారులుగా, డ్రైవర్లుగా, పనిమనుషులుగా, వంటవాళ్లుగా చాలా ఇళ్లల్లో దశాబ్దాలుగా వీరి సేవలు కొనసాగుతున్నాయి. వీరు తక్కువ జీతానికి ఎక్కువ పనిచేయడం బాగా కలిసివస్తుంది. ఇళ్లల్లోనే చిన్న గది ఇచ్చినా కుటుంబం అంతా సర్దుకుపోతుంది. వీళ్లు ఏడాది, రెండేళ్లకు ఒక్కసారే వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామమైన నేపాల్కు వెళ్తుంటారు. మిగతా ఏడాదంతా ఇంటిపట్టునే ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులకు వీరి అవసరం ఎంతో ఉంటుంది. అందులోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే వీరి చేసే వంటలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏరకంగా చూసినా వీరి వల్ల ఎక్కువ లాభాలే తప్పితే అతి తక్కువ నష్టాలు కనబడుతుండడంతో యజమానులెవరూ వీరిని తొలగించడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఇప్పటివరకు ఒక్క యజమాని కూడా తమ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీలను వెళ్లిపోమ్మని చెప్పలేదంటే ప్రతి ఇంటికీ వీరి అవసరం ఎంత ఉందో అర్ధంచేసుకోవచ్చు. -
అమ్మవార్లకు కోటి దండాలు
● రాష్ట్రంలోనే 7, 8 స్థానాల్లో బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాలు ● ఏడాదిలో రూ.24 కోట్లకు పైగా ఆదాయం బంజారాహిల్స్: దేవాదాయ శాఖ రూపొందించిన 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా నివేదిక ప్రకారం నగరంలోని బల్కపేట శ్రీ ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. దర్శనం టికెట్లు, హుండీ కానుకలు, ప్రసాద విక్రయాలు, వివిధ సేవల ద్వారా బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.12.56 కోట్లు, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ.12.21 కోట్లు సమకూరాయి. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రాష్ట్రంలోని టాప్– 10 ఆదాయం వచ్చే దేవాలయాల్లో 7వ స్థానంలో బల్కంపేట ఎల్ల్మమ్మ, 8వ స్థానంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలు చోటు సంపాదించుకున్నాయి. -
టాప్–10లో మనోళ్లే
● ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పరీక్షల్లో విజయ కేతనం ● ఎప్సెట్లో హైదరాబాద్కు ర్యాంకుల పంట సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఎంసెట్ (టీజీ ఎప్సెట్)–2026 ఫలితాల్లో మహా హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులను కొల్లగొట్టి ‘మహా నగరం’ విద్యా హబ్గా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. పట్టుదల, ప్రణాళికాబద్ధమైన కృషితో విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ● ఇంజనీరింగ్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర స్థాయి మొదటి (ఫస్ట్) ర్యాంక్తో పాటు టాప్–10లో వరుసగా 2, 6, 7, 8, 9, 10 ర్యాంకులను కై వసం చేసుకుని జైత్రయాత్ర సాగించారు. ● అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లోనూ అదే జోరును కొనసాగించారు. రాష్ట్ర స్థాయి రెండో (సెకండ్) ర్యాంక్ను సొంతం చేసుకోవడంతో పాటు, వరుసగా 3, 4, 5, 10 స్థానాలను దక్కించుకుని టాప్గా నిలిచారు. ఫలితాల్లో టాప్–10లో మెజారిటీ ర్యాంకులు గ్రేటర్కే దక్కడం విశేషం. మురిపించిన ఫలితాలు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఈ ఏడాది భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరై, అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో మూడు జిల్లాల నుంచి దాదాపు 1.15 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో సుమారు 98వేల మందికిపైగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో గ్రేటర్ పరిధి నుంచి సుమారు 48వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41వేల మందికిపైగా అర్హత సాధించి ఉన్నత చదువుల రేసులో నిలిచారు. -
మహాలక్ష్మిపై చిన్నచూపు
సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ మీదుగా చర్లపల్లి వెళ్లే (49ఎం/250) బస్సు. బంజారాహిల్స్ ఒకటో నంబర్ రోడ్ బస్టాపులో ఇద్దరు మహిళలు ఎదురుచూస్తున్నారు. సుమారు 45 నిమిషాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఆ బస్సును చూసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది అక్కడ ఆగకుండానే ముందుకు కదిలింది. దాంతో ఆ మహిళలు నిస్సహాయంగా మరో బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలా.. ఈ ఒక్క రూట్లోనే కాదు. నగరంలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి. ఒకరిద్దరు మహిళా ప్రయాణికులు కనిపిస్తే చాలు బస్సులు నిలపకుండానే డ్రైవర్లు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా అప్పటికే బస్సులు పూర్తిగా నిండిపోయి అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఇలా నిలపకుండా వెళ్లిపోవడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా బస్సుల్లో ప్రయాణికులు లేకపోయినా సరే మహిళలు కనిపిస్తే చాలు ఆపడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంపై చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు చులకన భావాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందితో ఘర్షణ.. ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థినులకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా కనీసం రూ.3000 నుంచి రూ.5000 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిన డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో అన్ని బస్సుల్లో 70 శాతం మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. మరోవైపు సిటీ బస్సులు సైతం 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనే చులన భావంతోనే కండక్టర్లులు, డ్రైవర్లు బస్టాపుల్లో బస్సులను ఆపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొందరు మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. జనరల్ సీట్లలో కూర్చోవద్దా..? మహిళా ప్రయాణికులు జనరల్ సీట్లలో కూర్చుంటే లేపేస్తున్నారు. బస్సుల్లో రద్దీ కారణంగా ఒక్కోసారి వెనుక ద్వారం నుంచి కూడా బస్సు ఎక్కాల్సి వస్తోంది. అలా ప్రవేశించేవారిని దింపేస్తున్నారు. ముందు నుంచి రావాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాళ్లు వెనుక నుంచి ముందుకు వచ్చే లోపు బస్సు కదిలిపోతుంది’ అని బంజారాహిల్స్ నుంచి హబ్సిగూడకు చెందిన ఓ మహిళ విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కండక్టర్లతో గొడవలు తప్పడం లేదని చెప్పారు. గతంలో ప్రతిరోజు 8 లక్షల నుంచి 12 లక్షల మంది మహిళలు ప్రయాణించగా ప్రస్తుతం సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రయాణం చేసినట్లు అంచనా. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్నా.. ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని పలువురు మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్న డ్రైవర్లు కసురుకుంటున్న కొందరు కండక్టర్లు జనరల్ సీట్లలో కూర్చోవద్దంటూ ఇబ్బందులు ఆవేదన వ్యక్తంచేస్తున్న మహిళా ప్రయాణికులు -
మనవడు ఇక లేడని తెలిసి కూడా..
2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్ ఇంపాక్ట్ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్ఫోన్ మోగింది. ఆ కాల్ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్పుర పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్కు (ఎస్ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్ 28న మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్చంద్ర, సందీప్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలను 2010 ఏప్రిల్ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్ వెళ్లారు. సీబీఐ అధికారులు 2010 జూన్ 11న దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్ పొందారు. వీరిని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్చంద్ర, సందీప్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు 2011 ఏప్రిల్ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్చంద్ర, సందీప్లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
గురుకులాలకు ప్రతి నెలా నిధులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలతో పాటు ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటి అద్దెను ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేయనుంది. సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఇబ్బందులకు క్రమంగా స్వస్తి పలికేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచే నెలవారీగా నిధులు విడుదల చేయనున్నారు. తాజాగా ఆదివారం రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వసతి, విద్యా సౌకర్యాల వాతావరణం మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు, అద్దె చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల వరకు కూడా నిధులు విడుదల కాని పరిస్థితి ఉండేది. దీనివల్ల గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విద్యార్థుల ఆహారం, వసతి, ఇతర మౌలిక అవసరాలపై ప్రభావం పడేది. ఈ సమస్యలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించిన విధంగా, తొలుత త్రైమాసిక (క్వార్టర్లీ) ప్రాతిపదికన నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం దానిని మరింత మెరుగుపరిచి నెలవారీ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. నిధులు సకాలంలో విడుదల కావడం వల్ల విద్యార్థులకు పోషకాహారం నిరంతరాయంగా అందుతుంది. హాస్టళ్ల నిర్వహణ, భవనాల అద్దెల చెల్లింపులు, అవసరమైన సౌకర్యాల కల్పన సులభతరమవుతాయి. ఆదివారం విడుదల చేసిన రూ.221.24 కోట్లలో.. డైట్ చార్జీల కింద రూ.164.37 కోట్లు, కాస్మోటిక్ చార్జీల కింద రూ.22.43 కోట్లు, భవనాల అద్దె కింద రూ.34.44 కోట్లు కేటాయించారు. -
కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిందేమీ లేదు
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..’అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మహానాయకుడు కేసీఆర్ పోరాట పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 8 రోజులుగా కొడుకును దాచిపెట్టి, బాలిక కుటుంబసభ్యులను బెదిరించి, మీడియా నోరు నొక్కిన కేంద్రమంత్రి బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని, నిష్పాక్షికంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆదివారం హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ‘గతంలో నిజాం ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్లో మూడు ఆసుపత్రుల నిర్మాణం జరిగితే, బీఆర్ఎస్ హయాంలో 4 ఆసుపత్రుల నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తే, రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తోంది. మైనర్ బాలిక విషయమై బీఆర్ఎస్ మహిళా విభాగం, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోరాడుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతున్న బాలిక తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్నాం. బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసు కెళ్ళాలి..’అని కేటీఆర్ చెప్పారు. ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి ‘దేశంలో బీజేపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా బెంగాల్, కేరళ రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఏ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పార్టీ సభ్యత్వం, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవారికే అవకాశం వస్తుంది. ఎల్బీనగర్లో ఉన్న 18 డివిజన్లను బీఆర్ఎస్ గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రాజయ్య, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, నాయకులు దాసోజు శ్రవణ్, దేశ్పతి శ్రీనివాస్, దేవీప్రసాద్, గోలి శ్రీనివాస్రెడ్డి, పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
‘సర్’కు.. 'ఆధారం' కాదు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువు చేసుకోవాలని నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుందా?.. ఏమాత్రం కాదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. అందులో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును చేర్చినా దానిని కేవలం ఓటరు గుర్తింపు నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కోసమే ఆధార్ కార్డును స్వీకరించి వాడాలి, పౌరసత్వ ధ్రువీకరణ కోసం కాదు’... అని పేర్కొంటూ ఈసీ 2025 సెప్టెంబర్ 9న మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంపై అనుమానాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు అందుకు రుజువుగా ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈసీ నిర్దేశించిన తొలి 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. ఇబ్బందులు తప్పవా..?: నిరుపేదలు, నిరక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల వద్ద ఈ పత్రాలు ఉండే అవకాశాలు చాలా తక్కువే. విచారణ సమయంలో ఇలాంటి పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడకతప్పదని తెలుస్తోంది. ‘సర్’తొలి విడత నిర్వహించిన బిహార్లో 47 లక్షలు, రెండో విడత జరిగిన మరో 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.2 కోట్ల ఓటర్లను ఈసీ తొలగించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ(అడ్జుడికేషన్) దశలో ఈసీ నిర్దేశించిన పత్రాలను అందజేయకపోవడంతో తొలగించిన ఓటర్ల పేర్లే ఇందులో అధికంగా ఉన్నాయి. వీరికి నోటీసులు.. ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. అప్పుడు ఈసీ నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతానికి రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు విషయంలో అనుమానాలున్న పక్షంలోనే ఆధార్ కార్డును రుజువుగా స్వీకరిస్తారు. సర్–2002 జాబితాలోని ఓటర్ల పేర్లు, ఇతర వివరాలతో పోల్చితే ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లు, వివరాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలున్నా సాఫ్ట్వేర్ గుర్తించనుంది. దీంతో ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఒక ఓటుకు ఇద్దరు, ముగ్గురి ధ్రువీకరణ పత్రాలు జెన్జీతో పాటు 1987 తర్వాత పుట్టిన మిలినియల్స్ ఓటర్లు తమ ఒక్కరి ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇద్దరు లేదా ముగ్గు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించక తప్పదు. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే వీరు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వీరు మొత్తం మగ్గురు వ్యక్తుల పుట్టిన తేదీ/ప్రాంతం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు అందితే ఈ కింది పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సిందే... 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 2. 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్ట్ 5. గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు 6. శాశ్వత నివాస సర్టిఫికెట్ 7. అడవి హక్కుల సర్టిఫికెట్ 8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం 9. జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ 11. ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం 12. ఆధార్ కార్డు (కేవలం గుర్తింపు నిర్ధారణ కోసమే) -
EAPCET Results: బాలికలదే పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)కు హాజరైన విద్యార్థుల్లో అత్యధిక మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం.రుషి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మూసాపేటకు చెందిన అన్షుల్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పులివెందులకు చెందిన ఎం.వంశీధర్ రెడ్డి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇంజనీరింగ్లో 73.36 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 86.27% మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. ఈఏపీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మే 4 నుంచి 11 వరకూ సీబీటీ విధానంలో జరిగాయి. ఆదివారం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,10,766 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,97,242 మంది పరీక్ష రాశారు. 1,44,704 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా సెట్కు 90,977 మంది దరఖాస్తు చేస్తే, 84,954 మంది పరీక్ష రాశారు. వీరిలో 73,294 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో బాలురు 84.70 శాతం మంది అర్హత సాధిస్తే, బాలికలు 86.76 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ ప్రొ. టీకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొ.వెంకటేశ్వరరావు, మండలి వైస్ చైర్మన్లు ప్రొ. ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్ పాల్గొన్నారు. వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్సెట్ ఫలితాలు వెల్లడవ్వడంతో కాలేజీల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి మొదలు పెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగతా సీట్లను యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. ఏపీ విద్యార్థులు టాపర్లుగా నిలిచినప్పటికీ కౌన్సెలింగ్లో వారికి అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. కన్వీనర్ అసలు హీరో కేవలం వారం రోజుల్లోనే ఎప్సెట్ ఫలితాలు విడుదల చేయడం మామూలు విషయం కాదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. అదీ ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఫలితాలు వెల్లడించడం అభినందనీయమన్నారు. పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే కాదు... సెట్ కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి కూడా హీరోనే అని కొనియాడారు. -
అమ్మకానికి అర్చక పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ‘అది ఉమ్మడి కరీంనగర్లోని ప్రధాన దేవాలయం. నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఐదారు నెలల క్రితం ఆ ఆలయంలో పరిచారకుల (సహాయ అర్చకులు) నియామకాలు జరిగినప్పుడు, అప్పటికే ఆ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారి కుమారులు నియమితులయ్యారు. ఇతర అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఆలయంలో నాలుగు అర్చకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జరగబోతోంది. అర్చకుల పిల్లలు నలుగురు దరఖాస్తు చేశారు. వారికే పోస్టులు దక్కేలా తెరవెనక రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.’ అర్చకుల పోస్టులను బేరానికి అంగట్లో పెట్టేశారు. అర్చకులు, సహాయ అర్చకుల (పరిచారక) పోస్టులకు కొందరు అధికారులు ధర ఖరారు చేసి అమ్మకానికి తెరదీశారు. కొన్ని ఆలయాల్లో పద్ధతిగానే సాగుతున్నా, కొన్నింట్లో అక్రమాలకు గేట్లు ఎత్తారు. పే స్కేల్ పోస్టులు కావటంతో... గతంలో ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, డోలు సన్నాయి వాయించే వారి పోస్టులంటే పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. వారికి జీతాలను ఆ దేవాలయ ఆదాయం నుంచే అత్తెసరుగా చెల్లించేవారు. కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో పనిచేసేవారికి ప్రభుత్వ పేస్కేల్ ప్రకారం జీతాలు అందుతున్నాయి. దీంతో ఆయా పోస్టులకు మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలోని 55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. అయితే, భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సీ లాంటి నియామక సంస్థల ద్వారా కాకుండా, ఆలయాల స్థాయిలోనే జరిగేలా ఏర్పాటు చేశారు. నియామక నోటిఫికేషన్లను కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్ ద్వారా కాకుండా ఆయా దేవాలయాల స్థాయిలోనే జారీ అయ్యాయి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. దేవాలయ ఈఓలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తుల ప్రక్రియ యావత్తు లోపభూయిష్టంగా సాగింది. చాలాచోట్ల అభ్యర్థులకు రశీదు కూడా ఇవ్వలేదు. ఒక్కో దేవాలయానికి ఒక్కో తేదీన నియామక తేదీలను ప్రకటించారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు.. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కొన్నింటికి దేవాదాయశాఖ ప్రధాన సెంటర్లలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లోని ఓ ప్రధాన దేవాలయంలో ప్రక్రియ ఒక్కటి ప్రస్తుతానికి పూర్తయింది. అక్కడ దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు కనీసం పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ కూడా వెల్లడించలేదు. తీరా ఇంటర్వ్యూల విషయం తెలిసి అభ్యర్థులు వెళ్లేసరికి ప్రక్రియ పూర్తయిందని, వారి దరఖాస్తులను తిరస్కరించామని చెప్పటంతో కంగు తిన్నారు. దీనిపై వారు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, దేవాలయం స్థాయిలోనే ప్రక్రియ జరిగినందున, అక్కడే తేల్చుకోవాలని చెప్పి పంపించేశారు. అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని, అందుకే చెప్పాపెట్టకుండా ప్రక్రియను పూర్తి చేశారని ఇతర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మిగతా ఆలయాల ప్రక్రియ మొదలవుతోంది. చాలాచోట్ల ఇప్పటికే ఇదే తరహా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు ఖరారు చేసి బేరమాడుకుని పోస్టులను రిజర్వ్ చేశారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ ప్రక్రియను రద్దు చేసి, నియామక బోర్డు ద్వారా పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించి అర్హులకే పోస్టులు దక్కేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డోలు సన్నాయి వాద్యకారుల పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొందరు అర్హతలేని వారికి బాధ్యత అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ⇒ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ అంతర్గతంగానే జరిగే సంప్రదాయం ఉండేది. కానీ, ఇది అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీకి కేటాయించింది. త్వరలో జరగబోయే నియామక ప్రక్రియ పూర్తిగా నియామక బోర్డుల ఆధ్వర్యంలో జరగనుంది. డ్రైవర్, కండక్టర్ పోస్టులను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, డీఎం, అసిస్టెంట్ డీఎం అయితే టీజీపీఎస్సీ, ఆర్టీసీ ఆసుపత్రి సిబ్బంది నియామకాలు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతోంది. -
పర్సంటేజీ ఫిక్స్!
కరీంనగర్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన పదవీ విరమణ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని రెండేళ్లయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు 4 నెలల క్రితం ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ను మంజూరు చేసింది. ఈ బిల్లును ట్రెజరీ కార్యాలయం ఆమోదించి ఆయన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాల్సి ఉంది. ఆ రిటైర్డ్ ఉద్యోగి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. బిల్లు వచ్చిన మాట వాస్తవమే కానీ అన్ని వివరాలు పరిశీలించాలని, పింఛనుకు సంబంధించి కొన్ని వివరాలు లోపించాయంటూ ట్రెజరీ సిబ్బంది లేని కొర్రీలు వేసి పదిరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు అసలు విషయం గ్రహించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి.. ఓ ఉద్యోగ సంఘం నేత సహకారంతో ట్రెజరీ సిబ్బందిని సంప్రదించాడు. వారికి కావాల్సిన (తన మొత్తం బిల్లులో 4%) పర్సంటేజీని ముట్టజెప్పడంతో కొర్రీలు ఎటు వెళ్లాయో..! వారం వ్యవధిలోనే డబ్బులు విడుదల కావడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీలు నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని చాలా డీటీవో (జిల్లా ట్రెజరీ కార్యాలయాలు), ఎస్టీవోలు (సబ్ ట్రెజరీ కార్యాలయాలు) అవినీతికి అడ్డాలుగా మారాయని, ఫిక్స్డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే, మరికొన్ని చోట్ల బిల్లును బట్టి ఆమ్యామ్యాలు ఇవ్వాల్సిందేనని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు చెబుతున్నారు. పర్సంటేజీల వారీగా ముట్టజెపితే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని, లేదంటే కొర్రీలు పెడుతున్నారని, సర్వర్లు పనిచేయడం లేదు.. దరఖాస్తుల్లో తప్పులున్నాయంటూ ఫైల్స్ కదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ తప్పించుకోవడానికీ ముడుపులు! ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ ద్వారా వచ్చే ప్రతి రూపాయి ట్రెజరీల ద్వారానే చెల్లిస్తుంటారు. కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల వేతనాలు, వారికి సంబంధించిన మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు, గురుకులాలకు ఇచ్చే డైట్ చార్జీలు, అద్దె వాహనాలు, వివిధ కార్యాలయాలు, గ్రామపంచాయతీల బిల్లులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు.. ఇలా అన్ని రకాల బిల్లులను చెక్కుల రూపంలో బ్యాంకులకు పంపడం లేదంటే ఆయా బ్యాంకు అకౌంట్లలో వేయడం ట్రెజరీల ద్వారానే జరుగుతుంది. అయితే ఈ బిల్లుల విడుదల కోసం ట్రెజరీ కార్యాలయాల్లో పర్సంటేజీలు ముట్టజెప్పడం మామూలేనని, అయితే ఇటీవల కాలంలో ఈ అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లులకు పది శాతం టోకుగా లేదంటే బిల్లును బట్టి ముట్టజెప్పాల్సి వస్తోందని, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలన్నా ట్రెజరీ సిబ్బందిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ బిల్లుల విడుదలకు తోడు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆదాయ పన్నుకు సంబంధించిన ‘సహకారానికి’ గాను క్రమం తప్పకుండా ముడుపులివ్వాలని, అలా ఇస్తే వారు పన్ను కట్టే పని లేకుండా ఆడిట్ చేస్తారని చెబుతున్నారు. కొర్రీలు నమోదు చేయకుండానే.. వాస్తవానికి ఏదైనా బిల్లును తిరస్కరించే సమయంలో ట్రెజరీ సిబ్బంది ఎందుకు తిరస్కరించారనే కారణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బులు ముట్టకపోతే కారణాలేవీ నమోదు చేయకుండానే బిల్లులు తిరస్కరిస్తారని, లేదంటే కొర్రీలు వేసి ఫైల్ కదలకుండా చేస్తారని, విధిలేని పరిస్థితుల్లో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ఈ బిల్లుల చెల్లింపుల కోసం పర్సంటేజీలు ఇచ్చేలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులే మధ్యవర్తిత్వం వహిస్తారని, కొన్ని చోట్ల ఉద్యోగ సంఘాల నేతలు సమన్వయం చేస్తుంటారని, డీటీవోలు, ఎస్టీవోలు ముందు జాగ్రత్తగా ఉద్యోగ సంఘాల నేతలు, పలు శాఖల ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారనే ఆరోపణలున్నా.. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ దృష్టి ఈ ట్రెజరీల మీద పడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిజామాబాద్ డీటీవోలో.. నిజామాబాద్ జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో ప్రతి పనికి సంబంధిత సెక్షన్లోనే డబ్బుల వసూలు జరుగుతోంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాలు సమర్పించడం కోసం ప్రతి ఉద్యోగి నుంచి రూ.500 ఎస్టీవోల ఆధ్వర్యంలోనే వసూలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు ఉన్న మెడికల్ బిల్లులకు రూ.10 వేలు, దానికి లోపు ఉంటే రూ.5 వేలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. టీఎన్జీవో సంఘంలో నేతలుగా ఉన్న కొందరు ఉద్యోగులు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. డీటీవో కార్యాలయానికి ఈ నేతల ద్వారానే వెళ్లి డబ్బులు సమర్పించి పనులు చేయించుకుంటున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్లులు సమర్పించే పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఇలా సమన్వయం చేస్తుంటారు. సకాలంలో బిల్లులు చేయించుకోకపోతే నిధులు వెనక్కు వెళ్లిపోతాయని చెప్పి మరీ రూ.10 వేలు, రూ.20 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో.. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా ట్రెజరీ కార్యాలయాలు, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వసూళ్ల దందా యధేచ్చగా సాగుతోంది. ఉద్యోగుల మెడికల్ బిల్లులకు పది శాతం చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి మెడికల్ బిల్లు రూ.80 వేలు ప్రాసెస్ చేయాలంటే రూ.8 వేలు ఇచ్చుకోవాల్సిందే. లేని పక్షంలో బిల్లుల్లో ఆ వివరాలు లేవని, ఆన్లైన్లో సర్వర్ తీసుకోవడం లేదంటూ రోజుల తరబడి తిప్పడం పరిపాటి అయిపోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్ల దందా సాగిస్తున్నారని తెలుస్తోంది. వచ్చిన ముడుపుల్లో సెక్షన్ల వారీగా పనిచేసే సిబ్బందితో పాటు అధికారులకు వాటాలు అందుతున్నాయని సమాచారం. బిల్లు స్థాయిని బట్టి.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎస్టీవో పరిధిలో బిల్లు, ఆ బిల్లు తెచ్చిన వ్యక్తి, ఆ బిల్లుకు సంబంధించిన స్థాయిని బట్టి పర్సంటేజీలు నిర్ణయిస్తున్నారు. ఓ ఉద్యోగి వేతన బిల్లు చేయడంలో లంచం తీసుకోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ను ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కార్యాలయంలో బిల్లుల కోసం ఉపాధ్యాయులు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఎరియర్స్ బిల్లులు మాత్రం బిల్లును బట్టి పర్సంటేజీలు ఉంటున్నాయి. సూర్యాపేట జిల్లా సూర్యాపేట ట్రెజరీ ఆఫీసులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 25–30 వేలు, మెడికల్ బిల్లుల కోసం రూ.10 వేల దాకా తీసుకుంటున్నారని, గ్రామ పంచాయతీ బిల్లులకు కనీసం 2 శా>తం ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి. పెన్షన్ ఫైలు చెక్ చేసినందుకూ.. నల్లగొండ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాల్లో రిటైర్ అయిన ఉద్యోగులు పెన్ష¯న్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ ఫైల్ చెక్ చేసి పెట్టేందుకు కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడిస్తుందో తెలియని పరిస్థితులున్నా.. సదరు రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం ముందుగానే ట్రెజరీ సిబ్బందికి ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్టు సమాచారం. -
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు -
‘మక్కా’ పేలుళ్లు.. ఇంట్లో పోలీసులు.. మనవడి మృతి అంటూ ఫోన్.. పెద్దాయన ఏం చేశాడు..
‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్క్లూజివ్ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం.. -
నకిలీ యాప్స్.. బీ అలర్ట్!
ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో టోకరా సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కొత్వాల్ వీసీ సజ్జనర్ శనివారం పేర్కొన్నారు. ఆ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయని, అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ’డిస్ట్రిక్ట్’ యాప్ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని సజ్జనర్ తెలిపారు. అచ్చం అసలు యాప్ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇలాంటి ఫేక్ యాప్లు, వెబ్ సైట్స్పై నిఘా ఉంచామని, ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు
బైక్ అదుపుతప్పి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి గచ్చిబౌలి: స్నేహితుడిని బస్స్టాప్లో దించి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరు.. జార్ఖండ్కు చెందిన దిబ్యం కుమార్ (26) కొండాపూర్లోని సాయి అర్బన్ విల్లాలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడు సంకల్ప్ సృజన్ను కొండాపూర్లోని రత్నదీప్ సూపర్మార్కెట్ సమీపంలో బస్స్టాప్లో దించి తిరిగి వస్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ప్రధానం ద్వారం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో దిబ్య కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెనుక బైక్పై వచ్చిన స్నేహితులు దిబ్య కుమార్ను హైటెక్సిటీలోని యశోద హస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దిబ్య కుమార్ హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం..అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య
గచ్చిబౌలి: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు మహిళ భర్తను దారుణంగా హత్యచేశాడు. శనివారం శేరిలింగంపల్లిలో డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ● పటాన్చెరులో హోటల్ నిర్వహిస్తున్న బైండ్ల నవీన్(27), ఇస్నాపూర్కు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్ రాయిగల్ల శేఖర్(36) స్నేహితులు. తరచూ శేఖర్ ఇంటికి నవీన్ వచ్చేవాడు. ఈ క్రమంలో శేఖర్ భార్య ప్రమీలతో నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తన భార్య ఓ మహిళ వద్ద ఫోన్ ఉంచి తరచుగా నవీన్తో మాట్లాడుతోందని శేఖర్ తెలుసుకున్నాడు. ఇటీవల భార్య గర్భం దాల్చడంతో నవీన్ మూలంగానే గర్భవతి అయిందని అనుమానించి వేధించసాగాడు. ఈ విషయం నవీన్తో చెప్పి ప్రమీల వాపోయింది. దీంతో శేఖర్ను అంతమొందించాలని నవీన్ ప్లాన్ వేశాడు. మద్యం తాగించి... ఈ నెల 12న రాత్రి శేఖర్కు నవీన్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. ఇద్దరూ ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. శేఖర్కు మద్యం తాగించి గొడవపడ్డ నవీన్ బండ రాయితో తలపై మోది హత్య చేశారు. మృతదేహంపై అట్టముక్కలు కప్పి రాయిని మరోచోట పడేశాడు. ప్రమీలకు ఫోన్చేసి నీ భర్తను చంపేశానని చెప్పాడు. మృతుడి ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఔటర్ వద్ద మృతదేహం... మరుసటి రోజు ప్రమీల..తన భర్త ఇంటికి రాలేదని అతను పనిచేసే కంపెనీకి వెళ్లి అడిగింది. ఈ నెల 14న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పటాన్చెరు పోలీసులకు సమాచారం అందింది. ఆ మృతదేహం తన అన్నదే అని శేఖర్ తమ్ముడు గుర్తించాడు. భార్య మాత్రం ఎవరు చంపారో తనకు తెలియదని పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమీల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తమదైన శైలిలో విచారించగా నవీన్ హత్య చేశాడని తెలిపింది. నవీన్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బైండ్ల నవీన్తోపాటు ప్రమీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బండరాయితో కొట్టి అంతమొందించిన ప్రియుడు మృతుడి భార్య, నిందితుడు అరెస్ట్ -
‘సిమ్ స్వాప్’ ముఠా ఆటకట్టు
● టెలికం వెరిఫికేషన్ పేరుతో సైబర్ మోసాలు ● ఆరుగురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: సిమ్ స్వాపింగ్తో మోసాలకు పాల్పడతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. విషింగ్, సిమ్ మానిప్యులేషన్, ఓటీపీ డైవర్షన్, మోసపూరిత ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతో వందలాది బాధితుల నుంచి రూ.77.75 లక్షల సొమ్మును ఈ ముఠా కాజేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ శనివారం మీడియాకు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన సలీం, సయ్యద్ హషీమ్ రెజా అలియాస్ టిప్పు, బన్సీధర్, అబ్దుల్ అలీం అలియాస్ మిట్టు, మిజానుర్ రెహమాన్ షేక్, మెహబూబ్ ఆలం అన్సారీ అలియాస్ సూరజ్లు ముఠాగా ఏర్పడి ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. థర్డ్ పార్టీ నుంచి కస్టమర్ల ఫోన్ నంబర్లు సేకరించి సిటీ బ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డ్ డివిజన్ అధికారులమంటూ వారికి ఫోన్ చేసి నమ్మిస్తారు. టెలికాం శాఖ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ఈ–సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ కార్డ్లుగా మార్చుకునేలా ప్రేరేపిస్తారు. ఆ తర్వాత మాల్వేర్ ఇన్స్టాల్ చేసిన మొబైల్ ఫోన్లను కొరియర్ సర్వీసుల ద్వారా బాధితులకు ఇంటికే పంపిస్తారు. బాధితులు ఆ ఫోన్లలో ఫిజికల్ సిమ్ కార్డ్లను వేయగానే.. వెంటనే, వారికి రావలసిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ)లు, బ్యాంకింగ్ అలర్ట్లు నిందితులకు డైవర్ట్ అవుతాయి. వీటి ఆధారంగా నిందితులు బాధితుల బ్యాంక్ ఖాతాలకు అనధికారిక యాక్సెస్ పొంది, మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను నిర్వహిస్తారు. ఈక్రమంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ ముఠా సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అక్కడి వెళ్లి ఆరుగురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్లోని నిందితుల నివాసాల నుండి రూ.15 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. -
రెడ్డి కార్పొరేషన్కు నిధులు కేటాయించాలి
రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: రెడ్డి సామాజిక వర్గ్గ కార్పొరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర రెడ్డి సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు జైపాల్రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గ పేదల సంక్షేమానికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని.. అయితే నేటికీ పాలక మండలి ఏర్పాటు చేయలేదని.. నిధులు కేటాయించలేదని వివరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు రెడ్డి కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించి, రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. -
బర్త్డే పేరిట దోపిడీకి స్కెచ్
● రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నలుగురి అరెస్ట్ ● పరారీలో అసలు సూత్రధారులు పక్కా ప్లాన్తో వ్యవహరించిన నేపాలీ గ్యాంగ్ అల్వాల్: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్లోని కార్యాలయంలో మల్యాజిగిరి కమిషనర్ సుమతి శనివారం వివరాలు వెల్లడించారు. నేపాల్కు చెందిన మీనా అలియాస్ మమత, రాజేష్లు కొన్ని నెలల ముందు కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మిల ఇంట్లో పని మనుషులుగా చేరారు. వారిద్దరు ఒంటరిగా ఉంటున్నారని, ఇంట్లో నగదు, బంగారం, వెండి ఉందని పసిగట్టారు. ఎలాగైనా సొత్తు దోచుకోవాలని భావించిన మమత నగరంలో మరోచోట పనిచేస్తున్న నేపాల్కు చెందిన రాజేష్, సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్లతో కలిసి పథకం వేశారు. ఈ నెల 11వ తేదీన తన పుట్టిన రోజని అబద్ధం చెప్పి మమత తన గ్యాంగ్తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్లో వేడుకలను జరుపుకున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి మురళీమోహన్, విజయలక్ష్మిలను బంధించి వారికి మత్తు పదార్థాలు ఇచ్చారు. అనంతరం ఇంట్లోని బీరువాలు పగులగొట్టి దాదాపు 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, మూడు వేల డాలర్లను దోపిడీ చేశారు. తర్వాత ఆటోలో కొంతమంది, స్కూటర్పై మరికొంత మంది పరారై యాప్రాల్కు చేరుకున్నారు. అక్కడ స్కూటర్ విడిచిపెట్టి.. రెండు ట్యాక్సీలు మాట్లాడుకుని నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుని దేశం వదిలి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో గతంలో మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో మీనా, రాజేష్లకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఘటన స్థలంలో జరిపిన వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోలాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారని సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. గ్యాంగ్ లీడర్ మమత, రాజేష్లతో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆమె తెలిపారు. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. వందలకొద్దీ సీసీ కెమెరాల జల్లెడ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సమాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. -
కే–పాప్ కేక
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కం ఆర్టిస్ట్ సంజీతా భట్టాచార్య సిటీలో సందడి చేశారు. శనివారం మాదాపూర్లోని ఇనార్బిట్మాల్లో ‘ఫస్ట్ గ్లోబల్ గర్ల్ గ్రూప్’ ఆడిషన్స్కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కే–పాప్ సాంగ్ ‘స్మూత్ లైక్ బెటర్’ బీటీఎస్ పాటతో అభిమానులను ఉర్రూతలూగించారు. తన కొత్త ఆల్బమ్ లైవ్ కాపీలకు ఆటోగ్రాఫ్ ఇస్తూ, ఫ్యాన్స్కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ అలరించారు. కాగా ఈ ఈవెంట్ లైఫ్స్టైల్, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫొటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. – సాక్షి, సిటీబ్యూరో -
నృత్య రూపిక
తెలంగాణ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతి వేదికగా శనివారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నృత్యరూపకాలు మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాయి. కాగా కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అంటే గొప్ప చరిత్ర అని, ఇక్కడి ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సలహాదారు ఆర్.గోవింద్ హరి, దేవాదాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. – గన్ఫౌండ్రి -
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీహాల్లో ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగ్గా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.👉టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ రిజల్ట్ డైరెక్ట్ లింక్👉 టీజీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ రిజల్ట్ డైరెక్ట్ లింక్ -
చాయ్ గరం.. బిర్యానీ పిరం..
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి. 30 శాతం జనానికి హోటలే దిక్కు! నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది. కడుపు నింపని భోజనం! నగరంలోని అమీర్పేట్, అశోక్నగర్, దిల్సుఖ్నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. కర్రీ..వర్రీ నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.వసతి భారం హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు. -
ఉప్పల్ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..
ఉప్పల్: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నా మని సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్ ఫ్లవర్ వెనక దారి నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ ఎదుటి హెచ్ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్ చేసుకుని తిరిగి ఉప్పల్ వైపు రావాలి. వరంగల్ వైపు వెళ్లేవారు హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి వరంగల్ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్కు వచ్చే వరంగల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్ఆర్ మీదుగా హయత్నగర్ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
‘ఎన్యూమరేషన్’ ఇస్తేనే ఓటు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారుల(బీఎల్ఓ)కు ఇవ్వని ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి చెప్పారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకు 2 ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే బీఎల్ఓలు కనీస పర్యాయాలు ఆ ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారని స్పష్టం చేశారు. ఓటర్లకు సంబంధించిన పాక్షిక సమాచారంతో ఈ ఫారాలను ముందే ముద్రిస్తారన్నారు. మిగిలిన సమాచారాన్ని ఓటర్లు పూరించి ఒక ఫారం ప్రతిని తిరిగి బీఎల్ఓలకు జూలై 24లోగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov. in) ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని భర్తీ చేసి సమర్పించవచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్న ‘సర్–2026’ కార్యక్రమంపై శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముసాయిదాలో ఈ ఓటర్ల తొలగింపు ‘అందుబాటులో లేని/ వలసవెళ్లిన/చనిపోయిన(అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారు. ఆయా కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన ఓటర్ల జాబితాలను స్థానిక పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,18,902 పురుష, 1,71,02,883 మహిళా, 2,879 ట్రాన్స్జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,39,24,664 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,18,39,741 మంది (64.38శాతం) ఓటర్లను సర్–2002 జాబితా మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం. ముసాయిదాలో ఉన్నా మ్యాపింగ్ కాకపోతే కష్టమే ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాలేకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. ఇలా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాలను ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లు ప్రచురిస్తారు. ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువుగా విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్కార్డును ఓటరు గుర్తింపు నిర్థారణకు అనుమతిస్తారు..’అని సీఈఓ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలుంటే ఎదురయ్యే పరిస్థితులపై సీఈఓ ఒక ఉదాహరణ తెలిపారు. సర్–2002 ఓటర్ల జాబితాలో తన తండ్రి పేరు ‘నారాయణ’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘సి.నారాయణ’గా ఉండడంతో తాను సైతం విచారణకు హాజరై ‘మా నాన్న నారాయణే’అని రుజువులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/దరఖాస్తులను జూలై 31–ఆగస్టు 30 మధ్య స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. జూలై 31–సెప్టెంబర్ 28 మధ్య నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే.. నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. – 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. – 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. – 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలు – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ – 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు – జనన ధ్రువీకరణ పత్రం – పాస్పోర్ట్ – గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు – శాశ్వత నివాస సరి్టఫికెట్ – అడవి హక్కుల సర్టిఫికెట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం – జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల) – రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ – ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం – ఆధార్ కార్డు (09.09.2025 నాటి ఈసీ సూచనలు వర్తిస్తాయి) -
ఆధిపత్య పోరుకు ‘చెక్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉండగా, ఉప సర్పంచ్లకున్న చెక్ పవర్ రద్దుకు చర్యలు మొదలైనట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న చెక్ పవర్ సమస్యకు ఓ పరిష్కారం చూపే దిశలో ప్రయత్నాలు ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి చెక్ పవర్ వినియోగం విషయంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని తెలిపాయి. అసెంబ్లీలో చట్ట సవరణ చేయాలి ఉప సర్పంచ్లకున్న చెక్ పవర్ రద్దు కావాలంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 కి సవరణలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు లేని పక్షంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ మార్పును అమలు చేసేందుకు వీలుంటుంది. అయితే ఆ తర్వాత ఆరు నెలల్లోగా అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వడం వల్ల పంచాయతీరాజ్ శాఖ ప్రతినిధిగా జవాబుదారీతనంతో పాటు నిధుల దుర్వీనియోగం వాటిల్లితే అతడినే బాధ్యుడిని చేసి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో రాజకీయ నాయకుల మధ్య గొడవలతో అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే ఇదే సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకాలతోనే నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా 2018కి ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండగా, గత ప్రభుత్వం ఉప సర్పంచ్లకు ఈ అధికారాన్ని కల్పించింది. అభివృద్ధికి ఆటంకం ఫిర్యాదులతో.. సర్పంచ్లు, ఉప సర్పంచ్ల మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అడ్డంకిగా మారినట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడడం, సకాలంలో నిధులు, బిల్లులు విడుదల కాకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జాయింట్ చెక్ పవర్ విధానం వల్ల సర్పంచ్లు–ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు/అధికారుల మధ్య కోల్డ్వార్ సాగుతున్నట్టుగా వస్తున్న వార్తలపై పీఆర్ఆర్డీ శాఖ అప్రమత్తమైంది. మళ్లీ పాత పద్ధతిలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఉమ్మడి సంతక అధికారాలు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. నిధుల విడుదల, చెల్లింపులో ప్రతిష్టంభన ప్రస్తుతం అమల్లో ఉన్న నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం..గ్రామాల్లో ఏ ఖర్చు చేయాలన్నా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. అయితే అత్యధిక శాతం గ్రామాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడడం, ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారైతే ఈ సమస్య మరింత జఠిలంగా మారుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ వర్గ పోరు కారణంగా నిధుల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోందనే విమర్శలున్నాయి. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచులు సంతకం పెట్టాలంటే కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే బిల్లులు ఆపేస్తున్నారనే ఆరోపణలుండగా, సర్పంచులతో పాటు డీపీవోలు, ఇతర అధికారుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందినట్టుగా తెలిసింది.ఏకాభిప్రాయం కొరవడటంతో నిధుల విడుదల, బిల్లులు చెల్లింపు వంటి వాటిలో ఎడతెగని జాప్యం చేసుకుంటోందనే ఫిర్యాదులు అందినట్టు సమాచారం. చివరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సకాలంలో యుటిలైజేషన్ సర్టీఫికెట్లు సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన తదుపరి నిధుల విడుదల కూడా ఆలస్యమవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచి్చనట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తాజా ప్రతిపాదనలు చేసిందని, అయితే దీనిపై ప్రభుత్వం కచి్చతమైన నిర్ణయం తీసుకుంటేనే చట్ట సవరణ ఇతర విషయాల్లో ముందడుగు పడుతుందని అధికారులంటున్నారు. -
నమ్మకంగా నయవంచన
సాక్షి, హైదరాబాద్: ఒంటరి వృద్ధ జంటల్ని, ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నా..వారు ఇంట్లో లేని సమయంలో వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వృద్ధులకు అవసరమైన సపర్యలు చేసేందుకు ఇళ్లల్లో పని మనుషులుగా, కేర్ గివర్స్గా, కేర్ టేకర్స్గా చేరుతున్న ఇతర రాష్ట్రాలవారు, నేపాల్ వంటి దేశాలకు చెందినవారిలో కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఆభరణాలు దొంగిలించి పరారవుతున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇలాంటి వారి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు వయో వృద్ధులకు వైద్య సహాయకులను, వ్యక్తిగత సేవకులను అందజేసే నెపంతో ఊరూ పేరు లేని కేర్ గివర్స్ ఏజెన్సీలు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ విధమైన చట్టబద్ధత, గుర్తింపు లేని ఇలాంటి సంస్థల ద్వారా అటెండెంట్లు, పని మనుషులుగా చేరుతున్న వారు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్లో అన్ని విధాలుగా చట్టబద్ధమైన గుర్తింపు కలిగిన కేర్ గివింగ్ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. కానీ ఏ గుర్తింపు లేని సంస్థలు మాత్రం వందల సంఖ్యలోనే ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వణికించిన ఉదంతాలు పదవీ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారి భార్యను నేపాలి ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడిన ఘటన మరిచిపోకుండానే జవహర్నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఇలాంటిదే మరో ఉదంతం చోటుచేసుకుంది. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా ఉంటున్నట్టు నటించి పక్కా పథకం ప్రకారం వృద్ధ దంపతులను బంధించి ఇల్లంతా దోచుకెళ్లారు.ఈ సంఘటనలో ఆ నేపాలీ గ్యాంగ్ను వృద్ధ దంపతులు ఏవిధంగానూ ప్రతిఘటించక పోవడంతో వారు బతికి బట్టకట్టారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనలే కాకుండా నగరంలో తరచుగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారి ద్వారా లేదా రకరకాల ఏజెన్సీల ద్వారా పని మనుషులు, కేర్ టేకర్లు, అటెండెంట్లుగా చేరుతున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో రెండు, మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా పని చేసి ఆ తర్వాత దురాగతాలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీల ద్వారా చేరి.. వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన వృద్ధులకు డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, వేళకు మందులు ఇవ్వడంతో పాటు నర్సింగ్ విధులు నిర్వహించేందుకు కేర్ గివర్స్ను నియమించుకుంటారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేవారు, 12 గంటల పాటు పని చేసేవారు, లేదా ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సపర్యలు చేసేవారు ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటూ అవసరమైన వారివద్ద విధుల్లో చేరుతున్నారు.ఇందుకోసం రూ.15000, రూ.25000, రూ.30,000 చొప్పున ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. హెల్పేజ్ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 10 లక్షల మంది ఒంటరి వయోధికులు లేదా వృద్ధులైన భార్యాభర్తలు ఈ రకమైన సేవలను వినియోగించుకుంటున్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్న కొందరు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతుండగా, మరి కొందరు ఇళ్లల్లోనే పని మనుషులను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరిలో కొందరు నమ్మక ద్రోహులుగా మారుతున్న వారి బారిన పడుతున్నారు. పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి సపర్యల విషయం అలా ఉంచితే నిస్సహాయులైన వయో వృద్ధులను ఈ ‘పని మనుషులు’అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు, ఫిర్యాదులు అనేకం ఉన్నాయని హెల్పేజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ వెల్లడించారు. ఒంటరి వయోధికులు ఉండే ఇళ్లపై పోలీసులు ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని, వృద్ధుల వద్ద తమ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచిస్తున్నారు. అమలుకు నోచని సంక్షేమ చట్టం ⇒ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (2007) ప్రకారం వృద్ధుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ చట్టంలోని సెక్షన్ 21 (2) ప్రకారం వృద్ధులకు సేవలు అందించే గృహ సేవకులు, కేర్ గివర్లు, అటెండెంట్లు, ఏజెన్సీలు, ఇతర సంస్థలు స్థానిక పోలీస్స్టేషన్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ⇒ నగరంలో ప్రస్తుతం వృద్ధుల సంరక్షణ, హోమ్ నర్సింగ్, హోమ్ కేర్ సేవలు అందించేందుకు అనేక ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. వీరికి సంబంధించి ఎలాంటి గణాంకాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ⇒ చాలావరకు హోమ్ కేర్, హోమ్ హెల్త్ కేర్ సంస్థలుగా పనిచేస్తున్నాయి. అయితే ఇలాంటి ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా నియంత్రణ చట్టం లేదా లైసెన్సింగ్ వ్యవస్థ వంటివి లేకపోవడం గమనార్హం. అలాంటి వారికి ఇవి తప్పనిసరి.. ⇒ ఇళ్లల్లో పనిచేసే గృహ కారి్మకులు మొదలుకొని కేర్ గివర్స్ వరకు ఎవరైనా సరే వయోధికుల కోసం విధుల్లో చేరాలంటే తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ⇒ చట్టం ప్రకారం ప్రతి కేర్ గివర్కు ఆధార్ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, వైద్యులు అందించే ఫిట్నెస్ ధ్రువీకరణ వంటి అర్హతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. ⇒ కొన్ని పేరొందిన సంస్థలు మాత్రమే కఠినమైన ధ్రువీకరణలు కలిగి ఉంటుండగా.. చిన్న స్థాయి ఏజెన్సీలు లేదా వ్యక్తిగతంగా కేర్ గివర్లను పంపించే వారు ఈ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. ⇒ కుటుంబసభ్యులు కేర్గివర్ల పూర్తి ఆధారాలతో పాటు ఫొటోలు కూడా తీసుకుని పెట్టుకోవాలి. అలాగే సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం మంచిది. ⇒ కేర్గివర్లు లేదా వ్యక్తిగత సేవకులకు డెబిట్, క్రెడిట్ కార్డులు, పిన్ నంబర్లు, చెక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మెడికల్ రిపోర్ట్లు, ఆస్తి పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.తస్మాత్ జాగ్రత్త ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోకూడదు. సాధారణంగా దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా పనిలో చేరేవారు 6 నెలల పాటు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటి పరిసరాలను, ఇంటికి వచ్చి వెళ్లేవారిని గమనిస్తారు. ఏ సమయం అనుకూలమైందో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఏ మాత్రం అనుమానం రాకుండా అవసరమైతే తమ ముఠా సభ్యులతో కలిసి పంజా విసురుతారు. దోపిడీలు, హత్యలకు పాల్పడుతారు. గత పదేళ్లుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. – గురజాడ శోభ, తెలంగాణ స్త్రీ సేవా సంస్థ -
బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్
లొంగుబాటా.. అరెస్టా?భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారా? లేక అతనే పోలీసులకు లొంగిపోయాడా? అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 20 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న క్రమంలో పోలీసు అకాడమీ వద్ద నిందితుడు భగీరథ్ను పట్టుకున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ తెలిపారు. కాగా.. ‘భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయలేదని, తానే స్వయంగా ఇద్దరు లాయర్లతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారని’ పేర్కొంటూ బండి సంజయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి అప్పా జంక్షన్లోని పోలీసు అకాడమీ వద్ద సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ పి.శోభన్ కుమార్, అతని బృందం నిందితుడు భగీరథ్ను శనివారం రాత్రి 8:15 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించిన మర్నాడే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అరెస్టు తర్వాత భగీరథ్ను భారీ బందోబస్తు నడుమ రాత్రి 9:05 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఠాణాలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సుమారు రెండున్నర గంటల పాటు భగీరథ్ను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 11:35 గంటలకు భగీరథ్ను మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత నిందితుడిని మేడ్చల్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. ఆయన సమక్షంలోనే భగీరథ్ వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. అలాగే బాధితురాలు మైనర్ బాలిక, ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రెండుసార్లు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఉదయం నుంచే హడావుడి శనివారం ఉదయం పేట్ బషీరాబాద్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నం.3లోని ఆరోరా కాలనీలోని బండి సంజయ్, భగీరథ్ మేనమామ కరీంనగర్లోని కార్తికేయ ఆసుపత్రిలో డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రెండు గంటల పాటు దాడులు చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. శనివారం ఉదయం నుంచే భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతాడనే ప్రచారం జరిగిన నేపథ్యంలో పేట్ బషీరాబాద్ ఠాణా, చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా కార్యకర్తలు, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అపస్మారక స్థితిలో ఉండగా... కుత్బుల్లాపూర్లోని సుచిత్ర ప్రాంతంలో నివసించే ఓ మైనర్ బాలికతో భగీరథ్కు గతేడాది పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెను కలవడం, ఫోన్లో మాట్లాడుతూ ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. శారీరకంగా ఆమెను లొంగదీసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్లోని తన ఫామ్హౌస్కు బాలికను తీసుకెళ్లిన భగీరథ్.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర మానసిక, శారీరక కుంగుబాటుకు గురైన బాలిక ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో ఆమె ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సున్నితమైన కేసు కావడంతో కేసు విచారణ నిమిత్తం ప్రభుత్వం కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా ‘సిట్’ను నియమించిన సంగతి తెలిసిందే. పేట్ బహీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోక్సోలోని సెక్షన్ 11 రెడ్విత్ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లను పరిశీలించిన పర్యవేక్షణాధికారి రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భగీరథ్పై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో–2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ) జోడించారు. కేసు నమోదైన నాటి నుంచి 8 రోజులుగా నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు. దీంతో 20 బృందాలు నిందితుడి కోసం ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్లో తీవ్రంగా గాలించారు. మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని, రాష్ట్రపతికి లేఖ కేంద్ర మంత్రి బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ అందింది. సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తరుఫు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు ఈ లేఖను రాశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే అధికార బలంతో కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బాధితులకు ఇటీవల బహిరంగంగా బెదిరింపులు కూడా వచ్చాయని, అందువల్ల తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆ లేఖలో డిమాండ్ చేశారు. చట్టంపై గౌరవం ఉంది: బండి సంజయ్ ‘మా అబ్బాయి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం పైఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించా’నని బండి సంజయ్ మీడియాతో అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. కానీ, లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్ అన్నారు. -
ఈవీదే ఠీవీ!
ప్రోత్సాహంగా పన్ను మినహాయింపు.. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్ వాహనాలు సాక్షి, సిటీబ్యూరో కొద్ది రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని వల్లెవేసిన కేంద్రం ఊహించినట్లుగానే పెట్రో బాంబు పేల్చింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని అందరిపైనా పెట్రోల్, డీజిల్ భారం మోపింది. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా ఇంధనం ధరలకు రెక్కలొచ్చేస్తాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ధరలు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు ఈ ధరాఘాతం నుంచి సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. ఈ వాహనాల వినియోగంతో రోజుకు సుమారు 1.82 లక్షల లీటర్ల చొప్పున ప్రతి నెలా సుమారు 54.86 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నట్లు అంచనా. తద్వారా సుమారు రూ. 56.53 కోట్లు ఆదాయం మిగులుతుంది. అస్థిరమైన పెట్రోల్, డీజిల్,సీఎన్జీ, ఎల్పీజీ, తదితర ఇంధన ధరలను దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాలు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రవాణాశాఖ జీవితకాల పన్నును మినహాయించింది.ఇది విద్యుత్ వాహనాలకు ఎంతో ప్రోత్సాహంగా మారింది. 2024 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యుత్ వాహనాలపైన రూ.810 కోట్ల వరకు ఈ మినహాయింపు లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు.ఆర్టీఏలో నమోదైన 81812 వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 56,465 ఉన్నాయి. వీటిపైన రూ.67.14 కోట్లు, సుమారు 22049 కార్లపైన రూ.741.19 కోట్ల చొప్పున పన్ను మినహాయింపు లభించింది. అలాగే 2608 ఆటోరిక్షాలు, 372 సరుకు రవాణా వాహనాలు, మరో 318 బస్సులకు కూడా జీవిత కాల పన్ను నుంచి ఊరట కల్పించినట్లు జేటీసీ చెప్పారు.హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపును కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ విద్యుత్ వాహనాల వినియోగం వల్ల ప్రతి నెలా 1.31 లక్షల టన్నులకు పైగా కాలుష్య కారకాలు తగ్గుముఖం పట్టినట్లు అంచనా. ప్రతి నెలా రూ.56 కోట్లకు పైగా ఆదా రోజుకు 1.83 లక్షల లీటర్ల ఇంధనం పొదుపు ప్రజా రవాణా సదుపాయంతో మరింత తగ్గనున్న ఖర్చులువాహన రకం సంఖ్య నెల ఇంధన ఆదా (రూ.కోట్లలో) ద్విచక్ర వాహనాలు 56,465 26.68కార్లు 22,049 22.23 ఆటోలు 2,608 2.88 గూడ్స్ వాహనాలు 372 1.23 బస్సులు 318 3.51 మొత్తం వాహనాలు 81,812 56.53 విద్యుత్ వాహనాలతో ఆదా ఇలా.. -
నేపాలీలను నివారించండి
● ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు ఇతర పనివారి వివరాలూ ధ్రువీకరించుకోండి సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్ రాజధాని వ్యాప్తంగా ఇటీవలి నేరాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలున్నంత వరకు నేపాలీలను పనిలో పెట్టుకోవడాన్ని నిలువరించాలని సూచిస్తున్నారు. ఇతర పనివాళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటూ నగరవ్యాప్తంగా ఇళ్లు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ దారుణ హత్య, దోపిడీ ఘటన జరిగిన వారం రోజుల్లోనే జవహర్నగర్ కౌకూర్లో నేపాలీలు మరో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేపాలీల నేరాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తులో పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. ఇక ఇతర పనివారి రికార్డులూ లేకపోవడంతో జరగరానిది జరిగినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఠాణాల వారీగా క్షేత్రస్థాయిలో నేపాలీలు, ఇతర పనివారి వివరాలు సేకరించడంతో పాటు నేపాలీలను నివారించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిలో... కొందరు నేరచరితులు డ్రైవర్లు, కార్మికులు, కేర్టేకర్లుగా చేరి యజమానుల విశ్వాసం పొందుతున్నారు. ఆపై అదును చూసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాళ్లలో నేపాలీలు ఎక్కువ ఉంటున్నారు. ఈ దృష్ట్యా పనిలో పెట్టుకునే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, పనివాళ్ల వివరాలను పోలీసులకు అందించి పూర్వాపరాల పరిశీలన, ధ్రువీకరణ చేసుకోవాలని, వీటిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. వీలున్నంత వరకు నేపాలీ గృహ కార్మికులను నియమించుకోవడాన్ని నివారించాలని, ఒకవేళ నియమించుకుంటే పూర్తి నాగరిక్/గుర్తింపు వివరాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్, ఫొటోగ్రాఫ్, మొబైల్ నంబర్, శాశ్వత చిరునామాను ధ్రువీకరించువాలని, ఈ వివరాలన్నీ రికార్డుల నిర్వహణ కోసం స్థానిక స్టేషన్లో అందించాలని పోలీసులు కోరుతున్నారు. దీంతోపాటు నేరాల నిరోధం, ఆధారాల సేకరణకు సాధ్యమైన చోటల్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. విలువైన వస్తువులు, లాకర్లు, నగదు ఉన్నవాటితో పాటు సున్నిత ప్రాంతాలకు పనివాళ్ల ప్రవేశాన్ని పరిమితం చేయాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపం లేదా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. నేపాల్తో సంబంధాలపై ప్రభావం? హైదరాబాద్ పోలీసుల చర్యలు సరిహద్దు దేశమైన నేపాల్తో భారత్ సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దేశంతో స్నేహపూర్వక, వర్తక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నేపాలీల అంశంలో జారీచేసిన నోటీసుల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలని చెబుతున్నారు. -
నిమ్స్ మరో రికార్డు
● రోగులకు అవయవాలువిజయవంతంగా అమర్చిన వైద్యులు24 గంటల్లో 2 లివర్.. 3 కిడ్నీ మార్పిడి సర్జరీలులక్డీకాపూల్: నిమ్స్ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్), 3 మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మార్పిడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మార్పిడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు. ● బ్రెయిన్ డెడ్ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు. ● కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ (డీసీఎల్డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్ డీసీఎల్డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మార్పిడి చేపట్టింది. ● దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్ఆర్డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్సలు జరిగాయి. -
రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ● బండ్లగూడ పరిధిలో విషాదం చాంద్రాయణగుట్ట: రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన ఘటన బండ్లగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్కు చెందిన వాచింగ్ మిషన్ టెక్నీషియన్ మహ్మద్ ఆమేర్ (26), ఫాతిమా బేగం (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. గురువారం అర్ధరాత్రి ఈ దంపతులు తమ ఆడపడచు పిల్లలు షేక్ సులేమాన్ (9), నౌషిన్ బేగం(11)లతో కలిసి బండ్లగూడలోని బంధువుల శుభకార్యానికి హాజరై జహంగీరాబాద్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. హాషామాబాద్ యూటర్న్ వద్ద ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కు చెందిన జితేందర్ కుమార్ (22) లారీతో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఫాతిమా లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లలు షేక్ సులేమాన్, నౌషిన్ బేగం, ఆమేర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. -
ఒకడు చిక్కాడు
● మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో ముంబయిలో పట్టివేత ● చోరీ ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్ కూడా..! బంజారాహిల్స్: విశ్రాంత ఐపీఎస్ వినయ్రంజన్ భార్య తనూజ రంజన్ను జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో నేపాలీ పని మనిషి కల్పన, మరో ముగ్గురు నేపాలీలు దారుణంగా హత్య చేసిన ఉదంతం దర్యాప్తులో నగర పోలీసులు కొంత పురోగతి సాధించారు. కీలక నిందితుడు సునీల్ పరియర్తో పాటు ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్ను ముంబైలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. దోపిడీలో పాల్గొన్న మిగతా ముగ్గురు కల్పన అలియాస్ ధర్మ, సురేష్షాహి, గణేష్షాహి కోసం ముంబైలో సీసీఎస్, టాస్క్ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. తనూజను ఈ నెల 8న నలుగురు నేపాలీలు హత్య చేసి తెల్లవారుజామున 3.30కు నాంపల్లిలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారు. పోలీసుల కళ్లుగప్పేందుకు చర్లపల్లిలో దిగి కారు బుక్ చేసుకుని నగర శివార్ల వరకు వెళ్లారు. కాగా, కల్పన, సురేష్, గణేష్ల వద్ద ఫోన్ లేకపోవడంతో పట్టుకోవడంలో జాప్యమవుతోంది. సునీల్ ద్వారా వీరి జాడ కోసం సాంకేతికతను వినియోగించి జల్లెడ పడుతున్నారు. గ్యాంగ్లో ఒకరు దొరకడంతో దర్యాప్తు కొంత సులువైంది. కల్పన, సునీల్, సురేష్, గణేష్లు తనూజను హత్య చేసి 22 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తు కల్పన దగ్గరే ఉండడంతో ఆమెను పట్టుకుంటే మొత్తం మిస్టరీ వీడనుంది. కాగా, ప్రశాసన్నగర్ ఘటనలో ఒకరు పట్టుబడడం పోలీసులకు కొంత ఊరటనిచ్చింది. వీరి ద్వారా నగరంలో తిష్టవేసిన నేపాలీ గ్యాంగ్ను పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
హైదరాబాద్: పేట్బషీరాబాద్లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో బండి భగీరథ్ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్.తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత ఏ తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్. చట్టం ముందు అంతా సమానమేనని, ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేశాం: సీపీబండి భగీరథ్ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్ను గాలించే క్రమంలో అరెస్ట్ చేశామన్నారు. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను అరెస్ట్ చేశామన్నారు. అటు తర్వాత పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామన్నారు సీపీఇదిలా ఉంచితే, బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. -
బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, మేడ్చల్: బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.మరోవైపు, భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ముమ్మరంగా గాలించారు. బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్పై తుది తీర్పు వెలువడనుంది. భగీరథ్ కోసం ఐదు బృందాలు.. ఢిల్లీ, కరీంనగర్తో పాటు హైదరాబాద్ను జల్లెడపట్టారు. ఇవాళ సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి (శనివారం మే 16) షేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో బండి భగీరథ్ లొంగిపోయారు. -
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభమ్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారునిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా ఏ1 కాగా, A2 సోహమ్ నాయక్, A3 కలంగి రాజేష్, A4 ముంతున్ కుమార్ మరియు A8 అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రాకు, అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్.. సాయి నిఖిల్ వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్ను సేకరించడం ప్రారంభించాడు. కాగా, సాయి నిఖిల్ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించాడు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. ఈ కేసులోని వినియోగదారులు.. నిందితులైన పెడ్లర్ల నుండి గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. -
బండి భగీరథ్కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: మైనర్పై లైంగిక వేధింపుల కేసులో బండీ భగీరథ్కు మరో షాక్ తగిలింది. భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో మధ్యంతర ఉపశమనం దక్కని నేపథ్యంలో.. శనివారం అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. మైనర్ బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్పై తుది తీర్పు వెలువడనుంది. ఈలోపు..ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదు బృందాలు భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్తో పాటు హైదరాబాద్ను జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నాం సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు పేట్ బషీర్బాద్ పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. దీంతో ఇవాళో రేపో భగీరథ్ను అరెస్ట్ చేస్తారని.. తనంతట తానే లొంగిపోతాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.సెన్సిటివ్ కేసు.. ఎలాపడితే అలా కుదరదు: సీఎం రేవంత్ఈ కేసు దర్యాప్తు విషయంలో వస్తున్న విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే పోక్సో కేసు ఎందుకు పెడతామని విమర్శకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మరుసటిరోజే విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11న సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి భగీరథ్ తండ్రికి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్కి, బండి భగీరథ్ తండ్రికి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో ఆ కేంద్ర మంత్రి(సహాయ) తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అని సీఎం రేవంత్ సూచించారు. -
బాలికపై బాబాయి లైంగిక దాడి
హైదరాబాద్: పరీక్షలు పూర్తి అయ్యాయి..వేసవి సెలవులు సరదాగా గడుపుదామని బాబాయి ఇంటికి వెళ్లింది ఓ బాలిక..అయితే బాబాయి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పసిచేస్తున్న బాబాయి రామమూర్తి... తన భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తరువాత నగరానికి వచి్చన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచి్చంది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేష¯న్కు బదిలీ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
Hyderabad: రోగికోసమని రప్పించి అంబులెన్స్ చోరీ
హైదరాబాద్: రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ను రప్పించి డ్రైవర్ను బలవంతంగా దింపి అంబులెన్సుతో పరారయ్యారు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్ (32) చెంగిచెర్లలోని శ్రీఎస్విఎస్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 12న అసుపత్రి సిబ్బందికి ఫోన్ రావడంతో అంబులెన్స్తో లొకేషన్కు వెళ్లాడు. అక్కడ ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్లో ఎక్కి మహిళకు కడుపునొప్పి ఉంది.. కామినేని అసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. సోదరుడు వస్తాడని చెప్పి సీపీఆర్ఐ రోడ్డులోని నిర్మానుష్య ప్రాతంతో అంబులెన్స్ను ఆపారు. మరో ఆద్దరు వ్యక్తులు వచ్చి డ్రైవర్ను బలవంతంగా కిందకు దింపి ఐదుగురూ కలిసి అంబులెన్సుతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంన్నారు. -
తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో డేంజర్ ఈదురుగాలుల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం, అల్లకల్లోల వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్లో భారీ ఈదురుగాలులు వంటి పరిస్థితి తెలంగాణలో నెలకొనే అవకాశముందన్నారు. పలు జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, జనగాం, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ డేంజర్ గాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. ఇక హైదరాబాద్ వాతావారణ కేంద్రం కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడా ఈ వర్షాలకు తోడు బీభత్సం సృష్టించవచ్చని పేర్కొంది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.Today's FORECAST ⚠️⛈️ Just like yesterday, even today, INTENSE HEATWAVE conditions expected in most parts of TG mainly North TG Thereafter, during late afternoon to night, scattered INTENSE THUNDERSTORMS ahead in Nalgonda, Yadadri - Bhongir, Nagarkurnool, Rangareddy, Jangaon,…— Telangana Weatherman (@balaji25_t) May 16, 2026 ఏపీ పరిస్థితి ఇలా.. మరోవైపు.. ఏపీలో కూడా వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పలు జిల్లాలో వర్షం కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరిగింది. నేడు విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇక ఆదివారం 19 మండలాల్లో తీవ్రమైన, 30 మండలాల్లో సాధారణ స్థాయితో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుందని, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.Dear people of Telangana We have seen what happened in Uttar Pradesh earlier due to serious windsToday, the below mentioned districts can get thunderstorms with VERY STRONG WINDS upto 70kmph due to very high instability caused by heatwave ⚠️💨Requesting to stay alert as… https://t.co/bRXfU44Z8J— Telangana Weatherman (@balaji25_t) May 16, 2026 ఇదిలా ఉండగా.. భారత వాతావరణ ఈ నెల మే 26 లోపు రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అంతకంటే ముందు ఇవి తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు సముద్రంలో ఏర్పడ్డాయి. అందుకే మే 22నే ఇవి కేరళం చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేరళం చేరుకున్న నైరుతి రుతుపవనాలు రెండుమూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయి. వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎండల తీవ్రత తగ్గుతుంది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు శనివారం విజయనగరం,మన్యం,పోలవరం,పల్నాడు, మార్కాపురం,ప్రకాశం,కర్నూలు,నంద్యాల,వైఎస్సార్ కడప జిల్లాల్లో 40-42°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం.ఆదివారం 19మండలాల్లో తీవ్ర,30 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. pic.twitter.com/nMUfx2kLkf— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 15, 2026 -
సీఏ కోర్సు చదవడం నా వల్ల కావడం లేదు..!
హైదరాబాద్: చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న ఓ విద్యార్థి నాలుక కోసుకొని..ఆపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ క్రిష్ణ తెలిపిన మేరకు.. ఏపీలోని కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ (28) చెన్నైలో సీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నగరానికి వచ్చి మియాపూర్లోని స్నేహితులతో ఉంటున్నాడు. గురువారం ఉదయం స్నేహితులు విధులకు వెళ్లగా జనార్ధన్ ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి స్నేహితులు గదికి వచ్చి చూడగా జనార్ధన్ ఫ్యాన్కు లుంగీతో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. గదిలో సూసైడ్ నోట్ లభించింది. అమ్మ..నాన్నా. మీరు అనుకున్నట్లు నేను చదువులేక పోతున్నా.. సీఏ కోర్సు చదవడం నా వల్ల కావడం లేదు.. తనను క్షమించాలని లేఖలో పేర్కొన్నాడు. మొదట మొదట నాలుక కోసుకొని ఆ తరువాత ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో మొత్తం రక్తపు మరకలు ఉండడంతో మృతుడి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉన్న ఒక్కగొనక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
నిమ్స్ మరో రికార్డు
హైదరాబాద్: నిమ్స్ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్), 3 మూత్రపిండ (కిడ్నీ) మారి్పడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మారి్పడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మారి్పడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు. బ్రెయిన్ డెడ్ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కారి్నయాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు. కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ (డీసీఎల్డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్ డీసీఎల్డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మారి్పడి చేపట్టింది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్ఆర్డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మారి్పడి చికిత్సలు జరిగాయి. -
పోక్సో కేసులో కానిస్టేబుల్కు 31 ఏళ్ల జైలు
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన పోక్సో కేసులో నిందితుడైన కానిస్టేబుల్కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నేరం రుజువు కావడంతో నిందితుడు వరదరాజ్ సుదేశ్కు 31 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అదనంగా బాధిత బాలికకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. 2020లో డీసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వరదరాజ్ సుదేశ్ బోయిన్ నపల్లి తాడుబండ్ ప్రాంతంలో నివసించే ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ కొనసాగింది. ఆరు సంవత్సరాల అనంతరం నేరం నిరూపణ కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
ఇప్పుడు అర్థమవుతోంది బాపూ..!
ఉత్తరం.. ఒకప్పుడు భావోద్వేగాలు పంచుకోవడానికి ఉపకరించే ఏకైక సాధనం. స్మార్ట్ యుగంలో దీన్ని అంతా మర్చిపోయాం. వ్యక్తిగత అవసరాలతో పాటు అధికారిక అవసరాలకూ ఈ–మెయిల్, వాట్సాప్ వంటి సాంకేతిక అంశాలనే వినియోగిస్తున్నాం. అయితే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల ఠాణా ఇన్స్పెక్టర్ జి.మల్లేశం మాత్రం మనలోని భావాలను మన వారికి పూర్తిగా వ్యక్తీకరించాలంటే ఉత్తరం రాయడం ఉత్తమం అని, దాని వల్లే అనుబంధాలు మరింతగా అల్లుకుంటాయని భావించారు. దీంతో తన పోలీసుస్టేషన్లోని అధికారులు, సిబ్బందితో ‘తల్లిదండ్రులకు ఓ ఉత్తరం’ పేరుతో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఖాకీ చొక్కా వెనుక కన్నీటి కథను వివరిస్తూ కానిస్టేబుల్ రాజు ఇన్ ల్యాండ్ లెటర్లో రాసిన ఉత్తరం వైరల్గా మారింది. అందులోని అంశాలు ఇలా...‘పూజ్యలైన తండ్రి గారికి తమ చిన్నకుమారుడు రాయునది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. మీరు అక్కడ క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నా. మా పిల్లలు, భార్య వేసవి సెలవులకు వారి అమ్మ వాళ్ల ఊరికి వెళ్లారు. పిల్లలు, ఫ్యామిలీ లేకుండా ఉండటం చాలా కష్టంగా ఉంది బాపూ. కానీ.. మీరు ఎనిమిది ఏళ్లుగా అమ్మ లేకుండా, మాకు దూరంగా ఉంటూ ఎంత కష్టంగా జీవనం సాగిస్తున్నారో ఇప్పడు అర్థం అవుతోంది. రియల్లీ ఐ మిస్యూ బాపూ. వంట పని, ఇంటి పనికి తోడు లేకుండా జీవించడం చాలా కష్టం బాపూ. నీ కంటి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. నేను ఇంటికి వచ్చాక నీ కంటికి ఆపరేషన్ చేయిస్తాను. ఆ హాస్పిటల్ వారితో మాట్లాడుతున్నాను.నువ్వు ఖాళీగా ఉండలేక కరువు పనికి వెళ్తున్నావని తెలిసింది. ఖాళీగా ఉండలేక, ఆరోగ్యం సహకరిస్తేనే వెళ్లు. ఇంటి దగ్గర అమ్మ, మీరు ఉన్నప్పుడు పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు చాలా సంతోషంగా జరుపుకున్నాం. కానీ ఇప్పుడు అమ్మ లేకపోవడంతో మీరు మాకు దూరంగా ఉండటంతో అన్నీ మిస్ అవుతున్నాం బాపు. ఈ ఉద్యోగం, పిల్లల చదువులు, ఇంటికి దూరంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నా. అన్ని ఫంక్షన్లు, పండుగలకు రావాలని ఉంది కానీ కుదరడం లేదు బాపూ. ఈసారి నేను పది రోజులు సెలవు తీసుకుని ఇంటికి వచ్చి మీ కంటి ఆపరేషన్ చేయించడంతో పాటు మన బంధువుల పెళ్లికి మీ కలిసి పాలుపంచుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్త.ఇట్లు నాన్నకు ప్రేమతో.. తమ చిన్న కుమారుడు రాజీ (రాజు). -
ముందస్తు బెయిల్పై 21న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వు చేసింది. ఈనెల 21న ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. వాదనలకే 3 గంటలకుపైగా సమయం పట్టిందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని, అన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.అన్ని పక్షాలు చేసిన వాదనలు, గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందంటూ ఉత్తర్వులను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్ను అరెస్టు చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా స్టేటస్కో ఆదేశాలు ఇవ్వాలని కోరగా, నిరాకరించింది. తనపై పేట్బïÙరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం రాత్రి మరోసారి విచారణ చేపట్టింది. పోలీసులు కుమ్మక్కు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘గత సంవత్సరంలోనే బాధితురాలు, నిందితుడు స్నేహితులుగా మారారు. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు నాలుగుసార్లు బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనడంలో వాస్తవం లేదు. పోలీసులు బాధితులతో కుమ్మక్కై తొలుత ఉన్న సెక్షన్లకు తోడు పోక్సో సెక్షన్లు 5, 6ను చేర్చారు.బెయిల్ రాకుండా పూర్తి న్యాయ సలహాతో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ మార్చారు. నానక్రామ్గూడ, తర్వాత ఫామ్హౌస్లకు వెళ్లినప్పుడు వారి వెంట మిత్రులు కూడా ఉన్నారు. బాధితురాలికి గతంలోనే ఆల్కహాల్ అలవాటు ఉంది. బాధితురాలు మైనర్ కాదు (కొన్ని సర్టీఫికెట్లను సమరి్పంచారు). నాలుగున్నర నెలల వరకు ఫిర్యాదు చేయకపోవడంలో కుట్రదాగి ఉంది. బాధితురాలు పలుమార్లు బెదిరిస్తూ సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపారు. దీంతో ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని బాధితురాలి తల్లిదండ్రులకు పిటిషనర్ చెప్పారు’ అని పేర్కొన్నారు. పిటిషనర్కు నేర చరిత్ర... బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘బాధితురాలి డాక్యుమెంట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది సమరి్పంచడం అభ్యంతరకరం. బాధితురాలు మేజర్ అనేది నిరాధార ఆరోపణ. బర్త్ సర్టీఫికెట్ స్కూల్లో ఇచ్చింది ప్రధాన ఆధారం. దీనిపై ఏది ప్రామాణికమో సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. మున్సిపల్ అధికారులు ఇచి్చన పత్రం, టెన్త్ సర్టీఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. భగీరథ్ ఒత్తిడితో బాధితురాలు అతని ప్రేమను అంగీకరించింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. పెళ్లి చేసుకుంటానంటున్నాడన్న నమ్మకంతో మరికొందరు కూడా ఉండటంతో భగీరథ్ వెంట తమ అమ్మాయిని తల్లిదండ్రులు పంపారు. అక్కడ బలవంతంగా ఆల్కహాల్ తాగించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అవమానించేలా రూ.50 వేలు పంపగా, ఆమె వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కు పంపింది. నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో అందరి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. దుండిగల్ పోలీస్స్టేషన్లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. నిందితుడికి గతంలోనే నేర చరిత్ర ఉంది’ అని పేర్కొన్నారు. ఐవోకు ఎఫ్ఐఆర్లో మార్పు అధికారం.. పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘పుట్టిన రోజు (2008, ఆగస్టు), ఇతర సర్టీఫికెట్లు దర్యాప్తు అధికారి నుంచి తీసుకున్నాం (వాటిని కోర్టుకు సమరి్పంచారు). పోక్సో కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యంకాదు. ఇలాంటి కేసుల్లో కూడా నిందితులకు బెయిలిస్తే చట్టంపై నమ్మకం లేకుండా పోతుంది. ఎఫ్ఐఆర్లో మార్పులు చేసే అధికారం దర్యాప్తు అధికారి (ఐవో)కి ఉంటుంది. సేకరించిన వివరాల ఆధారంగా సెక్షన్ల మార్పు, నిందితులను చేర్చడం చేయొచ్చు’ అని చెప్పారు. నాపైనే తీవ్ర ఆరోపణలు...కేసు విచారణకు స్వీకరించడానికి ముందు న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో తనపై, తన భర్తపై సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు చేశారన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని భావించానని, కానీ, వెకేషన్ కోర్టు అయినందున అన్ని పక్షాల న్యాయవాదులంతా అంగీకరిస్తేనే వాదనలు వింటానని చెప్పారు.అయితే, సోషల్ మీడియా పోస్టులు తాము కూడా చూశామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తిపై అత్యంత నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిని తొలగించాలని డీజీపీని కోరినట్లు పీపీ పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేసుల విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి రాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టడం గమనార్హం. -
మద్యం తాగించి.. బలవంతం చేసి!
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా మీడియాకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘2025లో నా కుమార్తెకు భగీరథ్తో పరిచయం ఏర్పడింది. తరుచూ మాట్లాడుతూ నా కూతురి నమ్మకాన్ని చూరగొన్నాడు. క్రమంగా ఆమెను చదువుకు దూరం చేస్తూ, ఆమెకు ఇష్టం లేకపోయినా శారీరకంగా లొంగదీసుకోవడం కోసం నిరంతరం ఒత్తిడి తెచ్చాడు.ఈ క్రమంలో 2025 డిసెంబర్ 31 రాత్రి మెయినాబాద్లోని ఫామ్హౌస్లో నా కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించారు. దీంతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి, శారీరక దాడులకు తెగబడ్డాడు. తర్వాత బాలిక తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భగీరథ్ నా కూతురితో చేసిన చాటింగ్లు, క్షమాపణల మెసేజ్లు మా వద్ద ఉన్నాయి’ అని ఆమె వెల్లడించారు. తమపై ఒత్తిళ్లు : న్యాయపరమైన చర్యల కోసం తాము ప్రయత్నిస్తున్న క్రమంలో తమపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని బాధితురాలి తల్లి తెలిపారు. ‘ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి రాజీ కోసం ప్రయత్నించారు. మర్నాడు ఉదయం ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఆయన్ను కలిసిన క్రమంలో అక్కడ మాకు భరోసా లభిస్తుందని ఆశిస్తే, దానికి భిన్నంగా రాజకీయ ప్రభావం, అనుచరుల అండదండల గురించి మాట్లాడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు’ అని ఆరోపించారు.ఈనెల 8న తాము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అధికారులు తమను దాదాపు 5 గంటల పాటు నిలబెట్టారని ఆవేదన చెందారు. జ్యురిస్డిక్షన్ నెపంతో కాలయాపన చేశారని, కేసు నమోదు చేయాలని తాము పట్టుబట్టడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మరోవైపు తాము ఫిర్యాదు చేసిన అదే సమయంలో కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో తమ కుటుంబంపై రూ.5 కోట్ల బ్లాక్మెయిల్, వసూళ్ల ఆరోపణలతో భగీరథ్ తరఫు వ్యక్తులు కౌంటర్ కేసు నమోదు చేశారన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ హెల్త్కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటామని, ఆరోజున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కార్డులు లాంఛనంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జేఎస్సీ సమావేశం జరగడం గమనార్హం.ఈ సందర్భంగా జేఎస్సీ సభ్యులతో సీఎస్ పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. పీఆర్సీ నివేదిక, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జీఓ సమస్యల పరిష్కారం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణారావు మాట్లాడుతూ సమావేశంలో ప్రస్తావించిన ఆర్థికేతర అంశాలను వీలైనంత మేరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆ దిశగా కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. జిల్లాలు, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ⇒ టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన బిల్లులను వేగవంతంగా విడుదల చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన పలు అంశాలకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ⇒ రెవెన్యూ శాఖలో 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల చట్టబద్ధ వారసులను నియమించాలని అని రెవెన్యూ శాఖలో తొలగించిన 632 కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఎఫ్టీఎస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ⇒ రెవెన్యూ శాఖ ఉద్యోగులను బదిలీల నిషేధం నుంచి మినహాయింపు కల్పించాలి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు సంఘాల తరపున ఉద్యోగుల సమస్యలపై వేర్వేరుగా వినతిపత్రాలను సీఎస్కు అందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మహేశ్దత్ ఎక్కా, సబ్యసాచి ఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్ తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఇవీ నిర్ణయాలు⇒ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) జూన్ 2 నుంచి అమలు.. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% చొప్పున వసూలు చేసి, ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు⇒ పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.⇒ పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటాం.⇒ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్పై చర్చ. పాత పెన్షన్ అమలుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటాం.⇒ ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచన.⇒ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచన.⇒ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్ కేటగిరీలో పరిగణించేలా చర్యలు.⇒ వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటాం. -
రాష్ట్రం స్వయం సమృద్ధి!
సాక్షి, హైదరాబాద్: సొంత పన్ను ఆదాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా ముందుకెళుతోంది. ఇతర గ్రాంట్లు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే వచ్చే రాబడులు ఏటేటా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల మేర పెరుగుదల నమోదు కావడం గమనార్హం.2021–22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, రాష్ట్రం విధించే ఇతర పన్నులు కలిపితే రూ.96,844 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ మొత్తం రూ.1,31,320 కోట్లకు పెరిగిందని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి యేటా సగటున మన రాష్ట్ర సొంత ఆదాయం రూ.7 వేల కోట్ల వరకు పెరుగుతోందన్న మాట. ప్రతి రాబడిలోనూ పెరుగుదల: ఆదాయ వనరుల వారీగా పరిశీలిస్తే ప్రతి రాబడిలోనూ వృద్ధి నమోదవుతోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద 2021–22లో రూ.34,489 కోట్లు రాగా, 2025–26 నాటికి అది ఏకంగా రూ.52,375 కోట్లకు చేరింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ద్వారా 2021–22లో రూ.12 వేల కోట్లు రాగా, 2025–26లో రూ.15 వేల కోట్లకు చేరింది. అమ్మకపు పన్నును పరిశీలిస్తే 2021–22లో రూ.27 వేల కోట్లు వసూలు కాగా 2025–26 కల్లా రూ.33 వేల కోట్లు దాటింది. ఇక ఎక్సైజ్ ఆదాయం రూ.17 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ప్రతి కేటగిరీలోనూ పన్ను రాబడుల్లో గత ఐదేళ్ల కాలంలో వృద్ధి కనిపిస్తుండటం గమనార్హం. గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా అంతంతే.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా నిధులను అంచనా వేయడంలో ఆర్థిక శాఖ అధికారులు విఫలమవుతున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 2021–22లో రూ.8,500 కోట్లు వస్తే ఐదేళ్ల తర్వాత 2025–26లో కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే దాటడం గమనార్హం. అయితే 2025–26లో గ్రాంట్ ఇన్ఎయిడ్ రూపంలో రూ.22,782 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అందులో కేవలం 45.75 శాతం అంటే రూ.10,422 కోట్లు మాత్రమే వచ్చాయి.కేంద్ర పన్నుల్లో వాటా ఏటేటా పెరుగుతున్నా ఆశించిన మేర రావడం లేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–22లో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.13,147 కోట్లు రాగా, ఐదేళ్ల కాలంలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే పెరిగి రూ.21 వేల కోట్లకు చేరిందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు పద్దులు ఇంకొంత మేర పెరిగి, పన్ను రాబడుల్లో లీకేజీలను అరికట్టగలిగితే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
2034 వరకు నేనే సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. ఆ తర్వాత ఉండను. తర్వాతి తరానికి అవకాశం ఇస్తా. పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. 2034 వరకు కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తారని ఆయన మరోమారు ధీమా వ్యక్తం చేశా రు. 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, 10% జీడీపీ దేశానికి ఇచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని అన్నా రు. ప్రస్తుతం ప్రజలు ‘స్విగ్గీ పాలిటిక్స్’ కోరుకుంటున్నారని, ఫలాలు తక్షణమే అందాలనే ఆలోచనతో జెన్జీ ఉందని, అందుకు అనుగుణంగా రాజకీయంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు.2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాహుల్కు ప్రధాని కావాలనే లక్ష్యం లేదు.. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉంది. రాహుల్గాంధీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే. ప్రధాని కావాలన్న లక్ష్యం ఆయనకు లేదు. కానీ ప్రధాని పదవి తీసుకోవాలని వికారాబాద్ మీటింగ్లో రాహుల్ను నేను ఒప్పించా. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్గాం«దీయే. ఈ మేరకు ఇండియా కూటమిని ఒప్పిస్తాం. మాట్లాడింది ప్రభుత్వాల సహకారంపైనే.. ప్ర«దానిగా మోదీ, సీఎంగా నేను ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాం. మేం మైక్ల ముందే మాట్లాడుకున్నాం. ఇందులో రహస్యం లేదు. నిధుల కోసం తమతో కలసిరావాలని మోదీ నన్ను అడిగారు. మేం మాట్లాడుకుంది ప్రభుత్వాల సహకారం గురించి మాత్రమే. చొరవ ఉంది కానీ గీత దాటను.. నేను రాహుల్గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. నేను నా మనసుకు నచ్చినట్టు చేస్తా. అవకాశాల కోసం అవకాశవాదిగా మారను. కొంతమంది ఓటమికి కుంగిపోతారు. గెలుపునకు పొంగిపోతారు. కానీ ప్రజాప్రతినిధిగా నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నిబద్ధతతో పార్టీలో చేరాననే గాంధీ కుటుంబం నాకు అవకాశమిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంకల వద్ద నాకు చొరవ ఉంది. కానీ నా గీత నేను దాటను. అప్పుడూ ఇప్పుడూ ఒకే ఇంట్లో.. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో సీఎం అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నా. ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వెడ్మ బొజ్జు, రూపాయి చేతిలో లేని మందుల సామేల్ను ఎమ్మెల్యేలను చేశాం. కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టులిస్తున్నాం. చాకలి ఐలమ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండరాం, ఆకనూరి మురళి ఇలా అందరిని గుర్తు పెట్టుకుని పదవులు ఇచ్చాం. ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.. జీవితంలో నేను చాలా సౌకర్యంగా ఉన్నా.. 100 శాతం సంతృప్తితో ఉన్నా. భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆలోచన. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా. ప్రజా సమస్యలపై అవగహన ఉంది. సీఎంగా వ్యవస్థలను పట్టాలెక్కించాల్సిన బాధ్యత నాపై ఉంది. గతంలో కులాలు, మతాల వారీగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించినట్లే కదా? నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్లో అన్ని కులాలు, మతాల విద్యార్థులుంటారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనుకుంటున్న నన్ను విలన్లా చూస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ఏ కీలుకు ఆ కీలు తీస్తా. మూసీ ప్రక్షాళన ఆగదు.. ఎవరు అడ్డువచ్చినా మూసీని ప్రక్షాళన చేస్తాం. నగరాలను కలుషితం చేస్తే మరిచిపోతారు కాని నీటి వనరులను కలుషితం చేస్తే ఎప్పటికీ మరిచిపోరని జపాన్లో ఒక సామెత ఉంది. యుద్ధం జరిగినప్పుడు కొందరు అమాయకులు కూడా చనిపోతారు. యుద్ధ నీతే అది. ఆక్రమణలదారులకు ముందే నోటీసులు ఇస్తున్నాం. ఎవరూ మూసీ మురికిలో ఉండాలని కోరుకోరు. వారసత్వంగా సీఎం పదవి వస్తదని కొందరు కలలు కన్నారు.. బుర్రలేని లేని వాళ్లు టెండర్లు, కాంట్రాక్టులు మాత్రమే చూస్తారు.. టెండర్లు ఇచ్చి కమీషన్లు తీసుకునే వారి ఆలోచన వేరే ఉంటుంది. నా దగ్గరకి వచ్చి నీకు ఇంత ఇస్తాం పని చేయి అని చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. రోజుకు 18 గంటలు అధికారులతో సమీక్షలు చేస్తున్నా. నా ప్యూచర్ను ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతిపక్షం కాదు. వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి వస్తదని కొందరు కలలు కన్నారు. నేను వాస్తవంలో ఉంటా. ఉహాజనితమైన ప్రపంచంలో ఉండను. అలాగైతే పోక్సో కేసు ఎందుకు పెడతాం.. మేం అధికారంలోకి వచ్చాక మహిళలపై నేరాలు నియంత్రించాం. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. 9 తేదీన విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11 వ తేదీన సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి సంజయ్కి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్కి, బండి సంజయ్కి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. బండి సంజయ్ తీరు సరికాదు.. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో బండి సంజయ్ తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి. -
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హార్ట్ స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. -
సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాల తగ్గింపు..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్లో వాహానాలు తగ్గించాలని నిర్ణయించారు. ఇక నుంచి నాలుగు వాహనాలతోనే సీఎం రేవంత్ కాన్వాయ్ బయల్దేరనుంది. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మధ్యనే సీఎం కాన్వాయ్ వెళ్లడానికి నిర్ణయించారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్కు సంబంధించిన వాహనాలపై నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియాలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం వాహనాల వాడకాన్ని కాసేపు పక్కనపెట్టి సైకిళ్లు, మెట్రోల్లో, ఎడ్లబండిపై పయనిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్లోని వాహనాలను రెండుకు పరిమితం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో తొలుత కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను నాలుగుకు పరిమితం చేశారు. -
నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్ఫాంపై ఉన్న ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి. జైపూర్ వెళ్తున్నట్రైన్ ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. -
బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు
హైదరాబాద్: బండి భగీరథ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్ కోర్టు. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. -
హైదరాబాద్లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే
వాషింగ్టన్: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో హెచ్-1బీ వీసా పోగ్రామ్ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. అమెరికా సెనేటర్ నోట చిలుకూరు బాలాజీ ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకుఅమెరికా వీసా ప్రోగ్రామ్లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్-1బీ,ఎల్-1,ఎఫ్-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్లో ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. ఎల్‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్ ట్యాక్స్, వేజ్ రూల్స్ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్ కార్డ్లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్ చేస్తారుకార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్వర్క్లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్ వర్క్ ఫోర్స్ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావనఅమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 11 లేదంటే 108 ప్రదక్షిణలుచిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.100% approval for them, zero for equally qualified non-Indians.This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య!
హైదరాబాద్: తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్నగర్ పీఎస్ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది. తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. దీనిపై గోవర్థన్ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. -
హలీమ్ ప్రియులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: డబ్బాలో పెట్టి కేఫ్/షాప్ల వాళ్లు అందిస్తున్న హలీమ్ ఎలాంటిది? ఏ దినుసులు ఎంత శాతం చొప్పున కలుపుతున్నారు? అది ఎంత మేర ఆరోగ్యకరం? ఇప్పటిదాకా తెలియని ఈ కచ్చితమైన వివరాలు హలీమ్ ప్రియులకు తెలియనున్నాయి. గోధుమలు, పప్పు లు సహా ఏవేవో కలిపేసి హలీమ్ తయారీ చేసే అక్రమ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం పడనుంది. హైదరాబాద్ హలీమ్ (Hyderabad Haleem) ఎంతో పాపులర్. కాగా అంతర్జాతీయంగా ఎగుమతి అయ్యే ఏ ఆహారోత్పత్తికైనా నిర్దుష్ట ప్రమాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొందరు ఎగుమతిదారుల ఆరోపణల దృష్ట్యా హలీమ్ నాణ్యత ఖరారు చేయాలని, నగర సంస్కృతికి పర్యాయపదంగా నిలిచిన ప్రఖ్యాత వంటకాన్ని ప్రామాణీకరించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. నిర్దుష్ట ప్రమాణాలను రూపొందించింది. గత ఏప్రిల్ 28న నవీకరణను జారీ చేసింది. ప్రమాణాలను పాటించాల్సిన గడువును పొడిగిస్తూ నవంబర్ 1గా నిర్ణయించింది.ప్రమాణాలు ఏమిటి? మాంసం, ప్రోటీన్ తేమ అవసరాలతో సహా కఠిన ప్రమాణాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రవేశపెట్టింది. హలీమ్ను ‘సాధారణ ఆహారం’ వర్గం నుంచి ఒక ప్రత్యేక విభాగానికి మార్చి కచ్చితంగా ఏమేం ఉండాలో తేల్చింది. ఇకపై చట్టబద్ధంగా ’హలీమ్’ అని పేర్కొనాలన్నా, అధికారముద్ర పడాలన్నా.. ఆ ఆహార ఉత్పత్తిలో ఇప్పుడు బరువు ప్రకారం కనీసం 25 శాతం మటన్ /చికెన్ ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి గోధుమ కంకులు, పప్పులు నీళ్లు కలిపిన హలీమ్స్ను వండి వడ్డించే కొన్ని హలీమ్ స్టాల్స్ ఆటలు ఇక చెల్లవు.ప్యాక్ చేసి ఎగుమతి చేసే ప్రతి హలీమ్ తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట రసాయన ప్రమాణాలను కూడా నిబంధనలు నిర్దేశించాయి. మటన్ హలీమ్లో కనీసం 8 శాతం ప్రోటీన్, 70 శాతం తేమ ఉండాలి. చికెన్ హలీమ్లో (Chicken Haleem) కనీసం 6 శాతం ప్రోటీన్, 75 శాతం తేమ పరిమితిని నిర్దేశించారు. నిర్ణీత ప్రోటీన్, తేమ శాతాలు ఇప్పుడు హలీమ్ నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాల పరీక్షల సమయంలో పారామితులుగా పనిచేస్తాయి.చదవండి: భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్హలీమ్లలో కొవ్వు 12 శాతానికి పరిమితం కావాలి. వచ్చే రంజాన్ నాటికి, ప్రతి వాణిజ్య తయారీదారు ఈ ప్రోటీన్ కొవ్వు శాతాలను తమ లేబుళ్లపై చట్టబద్ధంగా ముద్రించాల్సి ఉంటుంది. మటన్, బఫెలో మీట్ హలీమ్ల మధ్య తేడాను లేబుళ్లపై స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. -
‘తనూజ రంజన్’ కేసులో వెలుగులోకి కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను చంపి, భారీ దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ కోసం నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేరంలో ఆరుగురు నేరుగా పాల్గొన్నారని, మరొకరు పరోక్షంగా సహకరించారని గుర్తించారు. ఉత్తరాది జైల్లో కల్పన భర్త... నేపాల్ నుంచి వలసొచ్చిన కల్పనతోపాటు ఆమె భర్త ఉత్తరాదిలో కొన్ని నేరాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన మరో నేపాలీ మహిళ ద్వారా వినయ్ రంజన్ రే తల్లికి సపర్యలు చేయడానికి చేరింది. రంజన్ తల్లి రెండు నెలల క్రితం చనిపోయినా, కల్పన మీద ఉన్న నమ్మకంతో పనిలో కొనసాగించారు. ఈమెకు రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన గదిని ఇచ్చారు. ఉత్తరాదిలో చేసిన నేరంలో అరెస్టు అయిన కల్పన భర్త ప్రస్తుతం అక్కడి జైల్లో ఉన్నట్టు తెలిసింది. జైలు నుంచే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కల్పనతో సంప్రదింపులు జరిపాడని సమాచారం. ఇలా మెసెంజర్ ద్వారా రంజన్ ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేసి, ఆ విషయాన్ని కల్పనకు చెప్పారు. రెండు రోజుల ముందు వచ్చిన ముగ్గురు ఇటీవల వినయ్ రంజన్ రే (Vinay Ranjan Ray) బెంగళూరు వెళ్లడంతో దోపిడీకి అదే అదునైన సమయంగా భావించిన కల్పన అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతడి సూచనల మేరకు నేపాల్కు చెందిన సుజన్ షాహి అలియాస్ సురేశ్ సాహి, గణేశ్ సాహి, భరత్, దేవేందర్ నేరం చేయడానికి రెండు రోజులు ముందు నగరానికి వచ్చారు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరు రైలు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చి గోపాలపురం పరిధిలోని ఎంఎస్ హోటల్లో బస చేశారు. ఆ మర్నాడు మరో నిందితుడు వచ్చి వీరిని కలిశాడు. గురువారం ఈ హోటల్లో సోదాలు చేసిన పోలీసులు పలు రికార్డులు, నేరగాళ్లు ఇచ్చిన గుర్తింపు పత్రాల ప్రతులు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను స్వాదీనం చేసుకున్నారు. ఆటోలో జూబ్లీహిల్స్ వరకు...నేరం చేసిన రోజు కల్పన ఆదేశాల మేరకు ఈ ఐదుగురూ ఆటోలో ప్రశాసన్నగర్ వద్దకు చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరి కదలికలు మాత్రమే ఉండగా, మిగిలిన చోట్ల ఐదుగురినీ పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత వీరు వేర్వేరుగా రైళ్లల్లోనే పారిపోయారని పోలీసులకు ఆధారాలు లభించాయి. కల్పన (Kalpana) సహా కొందరు సొత్తుతో నేపాల్కు చేరినట్టు భావిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి ఉత్తరాదిలోని వివిధ నగరాల్లో గాలిస్తున్న టీమ్స్, ఇండో–నేపాల్ బోర్డర్లోని వివిధ ప్రాంతాలు, ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచాయి.పోలీసుల అదుపులో నేపాలీ మమత గ్యాంగ్? జవహర్నగర్: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కౌకూర్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మీ నివాసంలో వారిని బంధించి ఆ ఇంట్లోనే దొంగతనం చేసిన నేపాలీ మమత గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మురళీమోహన్ నివాసంలో ఈ నెల 11న ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనిషి, నేపాల్కు చెందినవారు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.జవహర్నగర్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో నేపాలీ గ్యాంగ్ను ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారని, అక్కడ కోర్టులో హాజరుపర్చిన తర్వాత వారిని హైదరాబాద్ తీసుకొస్తారని సమాచారం. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా పర్యవేక్షించి 10 ప్రత్యేక టీమ్లు రంగంలోకి దించి నేపాలీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
ఒకేరోజు 3 అగ్నిప్రమాదాలు
హైరైజ్ అపార్ట్మెంట్లో.. మన్సూరాబాద్: మన్సూరాబాద్ ఎంఈ రెడ్డి గార్డెన్స్ ఎదురుగా ఉన్న ట్రెడెంట్ నమశ్రీ హైరైజ్ అపార్ట్మెంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అంతస్తుల ఆపార్ట్మెంట్ 4వ అంతస్తులోని ఓ అపార్ట్మెంట్లో శ్రీకాంత్ కుటుంబంతో నివాసముంటున్నారు. సాయంత్రం నివాసితులు దేవుడి గదిలో దేవుడి దీపం పెట్టి బయటకు వెళ్లారు.అయితే దీపం అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. హయత్నగర్లో.. హయత్నగర్: విద్యుదాఘాతం కారణంగా రెండు షాపులు దగ్ధమయ్యాయి. హయత్నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఉగాది కాంప్లెక్స్ దుకాణాల సముదాయంలో జయశ్రీ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాపు, లక్ష్మీనర్సింహా కార్ డెకర్స్, ఒక ఫర్నిచర్ షాపులు ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు పక్కనే ఉన్న రెండు షాపులతోపాటు ఫర్నిచర్ దుకాణానికి అంటున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. కోకాపేటలో మణికొండ: పూజకోసం వెలిగించిన దీపం అంటుకోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. కోకాపేట రాజీవ్ గృహకల్పలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో మంటలు అధికంగా వచ్చి పక్కనే ఉన్న కర్టెన్లకు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. యూపీకి చెందిన ప్రవీణ్ కుమార్సింగ్ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. మహానగరంలో మూడు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. మన్సూరాబాద్, కోకాపేట్, హయత్నగర్ ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. -
బెట్టింగ్కు బానిసై.. ఆర్మీ జవాన్ చైన్ స్నాచింగ్
అల్వాల్: నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్మీ జవాన్ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. గురువారం నేరేడ్మెట్ పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ యాదగిరిరెడ్డి తెలిపిన మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా గోరవంద్లపల్లికి చెందిన కుర్రపోతుల రెడ్డి శేఖర్ (31) ఆర్మీలో జనరల్ డ్యూటీ జవాన్గా పనిచేస్తూ అల్వాల్లోని త్రిశూల్ లైన్ ఆర్మీ క్వార్టర్స్ నివాసం ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి భారీగా అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చేందుకు దొంగగా మారాడు. ఈ నెల 10న సాయంత్రం తన ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్ను మార్చుకుని అల్వాల్లోని డాల్ఫిన్ వైన్ షాప్ సమీపంలోని పాన్ షాప్ వద్దకు వచ్చాడు. సప్తగిరి కాలనీకి చెందిన మణి మేఘల (57)ను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లి పరారయ్యాడు. పోలీసులు అదే ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కులవివక్ష లేని సమాజం నిర్మించాలి
రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ బంజారాహిల్స్: దేశంలో ఇంకా కులవివక్ష ఉందని, ఆధునిక యుగంలో కూడా అది కొనసాగడం దురదృష్టకరమని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి బెజవాడ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ‘పూర్వ విద్యార్ధుల స్ఫూర్తిదాయక ప్రసంగం’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా సఫాయి కర్మచారి వ్యవస్థ ఉందని, దానిని నిర్మూలించడానికి చేపట్టిన ఇండియా ఎట్ 80 ఉద్యమానికి విద్యావంతులు, మేధావులు మద్దతు ఇవ్వాలని కోరారు. వైస్ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ,రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, పల్లవి కాబ్డే, వీసీ ఓఎస్డీ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. -
వరదలకు అడ్డుకట్ట
టీసీయూఆర్ కోసం భారీ స్టామ్ వాటర్ డ్రైన్ సాక్షి, సిటీబ్యూరో ప్రతి వర్షాకాలంలో ముంచెత్తుతున్న వరద సమస్యలకు శాశ్వత పరిష్కారానికి జీహెచ్ఎంసీ కీలక అడుగు వేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్) వరకు సమగ్ర, సమన్వయ స్టామ్ వాటర్ డ్రైన్ మాస్టర్ప్లాన్ కోసం ఆర్ఎఫ్పీ టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్ని, 2047 నాటికి రూపాంతరం చెందనున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్ప్లాన్కు సిద్ధమైంది. జీఐఎస్, 2డీ మోడలింగ్తో.. ఈ మాస్టర్ప్లాన్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్, హైడ్రాలజికల్, హైడ్రోడైనమిక్ 1డీ–2డీ మోడలింగ్ ద్వారా నగరంలోని ప్రధాన, ఉప, చిన్న డ్రైనేజీ వ్యవస్థలను కూడా విశ్లేషించనున్నారు. వరదల తీవ్రత, నీటి ప్రవాహ దిశలు, నీటిమునిగే ప్రాంతాలు, డ్రైనేజీ సామర్థ్యం తదితర అంశాలను కంప్యూటర్ మోడళ్ల ద్వారా అంచనా వేయనున్నారు. ఆక్రమణలపై దృష్టి నగరంలోని చెరువులు, నాలాలు, వాగులు, రోడ్ల పక్కన ఉన్న డ్రైన్లు, కల్వర్టులు, బ్రిడ్జిల పరిస్థితిని పూర్తిస్థాయిలో సర్వే చేయనున్నారు. నాలాలపై ఆక్రమణలు, పేరుకుపోతున్న చెత్త, మురుగునీరు కలుస్తుండటం, కాలుష్యం వంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. చెరువుల సరిహద్దులు, ఫుల్ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్), నీటి నిల్వ సామర్థ్యం, బండ్ల స్థితి, సిల్టింగ్ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. రియల్టైమ్ మానిటరింగ్ నగరంలో వరద ముప్పు ప్రాంతాల్లో రియల్టైమ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. నీటి మట్టం, వర్షపాతం, నీటి ప్రవాహాలను గుర్తించే ఐఓటీ సెన్సర్లు, డాప్లర్ రాడార్ వ్యవస్థలు, జీఐఎస్ డ్యాష్బోర్డులు, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను రూపొందించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానం చేసి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఈ వ్యవస్థ పని చేయనుంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతతో, రియల్టైమ్ మానిటరింగ్ వ్యవస్థతో, మూడు కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని తాజాగా టెండర్లు పిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. వరద నీటి ప్రవాహ దారిభూగర్భ మౌలిక వసతి రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా మాస్టర్ ప్లాన్ రియల్ టైమ్ పర్యవేక్షణతో వరద హెచ్చరికలు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ నిర్వహణ వ్యవస్థకు ప్రత్యేక ప్రణాళిక స్టామ్ వాటర్ డ్రైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రేమ్వర్క్ను రూపొందించనున్నారు. ప్రతి నాలాకు డీసిల్టింగ్ షెడ్యూల్, జీఐఎస్ ఆధారిత మానిటరింగ్, శాఖలవారీ బాధ్యతలు, అత్యవసర స్పందన విధానాలు సిద్ధం చేయనున్నారు. రోబోటిక్, యాంత్రిక పద్ధతుల్లో నాలాల శుభ్రతకు అవసరమైన యంత్ర సామగ్రి వినియోగంపై కూడా అధ్యయనం చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్లు పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో భవిష్యత్ వరద ముప్పును తగ్గించడమే కాకుండా, సమగ్ర పట్టణ ప్రణాళిక, నీటి వనరుల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి సైతం ఉపయోగపడేలా ఈ మాస్టర్ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 26. -
డ్రగ్స్ నిర్మూలన సామాజిక బాధ్యత
మల్కాజిగిరి సీపీ సుమతి సాక్షి, సిటీబ్యూరో: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్, అపూర్వ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 320–ఏ) సంయుక్తంగా రూపకల్పన చేసిన స్టాప్ డ్రగ్ అబ్యూజ్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మత్తులో మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుండి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల మానసిక స్థితిని, వారి స్నేహితులను నిరంతరం గమనిస్తూ వారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అపూర్వ లయన్ చైర్పర్సన్ నైనా దేవి, షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీహెచ్ అశోక్, ఫౌండేషన్ సలహాదారులు హైకోర్ట్ అడ్వకేట్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్ సరఫరా
ఇద్దరు అరెస్ట్.. రూ. 2.58 లక్షల డ్రగ్స్ పట్టివేత కుత్బుల్లాపూర్: సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బ్రాంచ్ (ఎస్టీఎఫ్బీ) టీమ్ అరెస్ట్ చేసింది. కొంపల్లి హై టెన్షన్ రోడ్డులో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం మేరకు ఎస్టిఎఫ్బీ టీం ఎస్ఐలు బాలరాజు, సంధ్యతో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇన్నోవా కారును గుర్తించి ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో ఉన్న ప్రవీణ్ వద్ద బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 3.24 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, ఎలిజర్ అలియాస్ సన్నీ వద్ద 36.90 ఓజి కుష్, 7.73 గ్రాముల చెరస్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 2.58 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను కుత్బుల్లాపూర్ ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టిఎఫ్బి టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. -
బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి
డీజీపీకి పలువురి వినతిపత్రంసాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు డీజీపీ సీవీ ఆనంద్ను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి భగీరథ్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని, ఆరు రోజులుగా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శిపుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆందోళనకుత్బుల్లాపూర్: బాలికపై ఘాయిత్యానికి పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్ను భర్తరఫ్ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వం, పోలీసులుబండి సంజయ్ కుటుంబానికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఎన్ అశాలత, ప్రజా సంఘాల నాయకులు ఐలాపురం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
● రూ. 3 లక్షల మద్యం సీజ్ చందానగర్ : నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని కొండాపూర్ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ విలేకరుల మాట్లాడుతూ.. లిక్కర్ ఈవెంట్స్లో ఒరిస్సాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్లు పని చేస్తుంటారు. కరీంనగర్కు చెందిన శరత్ చంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అత్తాపూర్లో నివాసముంటున్నాడు. లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్లను పరిచయం చేసుకొని ఖరీదైన లిక్కర్ బాటిళ్ళలో చీప్ లిక్కర్ నింపి కొండాపూర్ ప్రాంతంలోని గుట్టల బేగంపేట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందడంతో రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చంద్ర, ఎస్ఐ అఖిల్, సిబ్బందితో కలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని నకిలీ విదేశీ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. -
పెళ్లింట విషాదం..
కూతురి వివాహం చేసిన మరుసటి రోజే తండ్రి మృతి శంషాబాద్: సంబరంగా కుమార్తె పెళ్లి చేసిన మరుసటి రోజే ఓ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. మల్కారం గ్రామానికి చెందిన రైతు దండు సురేందర్ (50) పెద్ద కుమార్తె పావనికి ఇబ్రహీంపట్నం గ్రామానికి యువకుడితో వివాహాన్ని బుధవారం నర్కూడ గ్రామంలో ఘనంగా చేశాడు. గురువారం వరుడి ఇంటి వద్ద జరిగే విందు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఉదయమే పొలం పనులు చూసుకోడానికి వెళ్లిన సురేందర్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు. -
మోత మోగిపోద్ది..
● మాడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల కన్నెర్ర ● ఒక్కరోజే 451 కేసులు, రూ.6 లక్షల ఫైన్సాక్షి, సిటీబ్యూరో: ధ్వని కాలుష్య నియంత్రణే లక్ష్యంగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా... వాహనాలకు మార్పులు చేసిన సైలెన్సర్లను అమర్చి, విపరీతమైన శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 451 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. 76 వాహనాల నుంచి అనధికారిక సైలెన్సర్లను అక్కడికక్కడే తొలగించారు. ఉల్లంఘనదారులకు రూ.6.14 లక్షల జరిమానా విధించారు. -
హెచ్ఐసీసీలో గ్రీన్ సిమెంటెక్ సదస్సు
మాదాపూర్: గ్రీన్బిల్డింగ్లు మౌళిక సదుపాయాలను నిర్మించడంలో సిమెంట్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ సి.శేఖర్రెడ్డి తెలిపారు. మాదాపూర్లోని గురువారం హెచ్ఐసీసీలో వార్షిక కాన్ఫరెన్స్ ఎక్స్పో గ్రీన్సిమెంటెక్ 22వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మన జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి తక్కువ కార్బన్ పదార్థాలను స్వీకరించడం చాలా ముఖ్యమన్నారు. సిమెంట్ పరిశ్రమ ఏఐ ఆధారిత పరిష్కారాలను ఎక్కువగా స్వీకరించాలన్నారు. 50 మందికిపైగా ఎగ్జిబిటర్లతో ఎక్స్పో నిర్వహించారు. -
పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్ ఆసుపత్రులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు.సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇందులో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని 300 ICU బెడ్స్తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. -
సందడిగా యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ అండ్ గ్రీట్
సాక్షి, హైదరాబాద్ : మీట్ అండ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వీసీ జాన్ వాల్.. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ గ్రీట్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో గురువారం యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ మీట్ ద గ్రీట్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వైస్ ఛాన్సిలర్ జాన్ వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మూస కోర్సులు చదువుకునేందుకు ఇష్టపడటం లేదని ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ యూనివర్సిటీకి భారతీయ విద్యార్థులకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ లభించే కోర్సులకు ప్రతియేటా భారతీయ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. టెక్నాలజీ కోర్సులు, సైబర్ సెక్యూరిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రొబోటిక్స్ వంటి ఎన్నో అంశాలపై అధునాతన కోర్సులను విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అందిస్తున్నదని తెలిపారు.ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అడ్మిన్ గులిని రిచర్డ్ మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీలో 12 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని అన్నారు. సావరియా ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ రాజేష్ గోయల్ మాట్లాడుతూ తొలుత 200 మంది తమ కన్సల్టెన్సీ నుంచి లండన్ వెళ్ళారని ఇప్పుడు 500 మందికిపైగా వెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈడీ గ్రోత్ మిస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
ఆ వీఆర్ఏల గోడు పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక పద్ధతిన చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తే జీవితాలు బాగుపడతాయని అందరూ ఆశిస్తారు... కానీ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) విషయంలో మాత్రం ఉద్యోగాల క్రమబద్ధీకరణ నిరాశను మిగిల్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన క్రమబద్ధికరణ అనంతరం దాదాపు 7 వేల వీఆర్ఏల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులు మూడేళ్లుగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. తరాలుగా... సహాయకులుగా: రాష్ట్రంలో పేద వర్గాలకు చెందిన వేలాది మంది తరతరాలుగా మసూ్కరులుగా, సుంకరులుగా, నీరటిలుగా రెవెన్యూ శాఖలో సేవలందిస్తున్నారు. వీరితోపాటు 2012, 2014లో రాత పరీక్ష ద్వారా మరికొందరు గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఎంపికయ్యారు. వీరి పోరాటం కారణంగా గత ప్రభుత్వం 2023, ఆగస్టు నెలలో ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేసి వారిని ప లు శాఖల్లో జూనియర్, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, లస్కర్లుగా నియమించింది. ఇ ప్పుడు ఈ క్రమబద్ధీకరణే కొందరు వీఆర్ ఏల జీవితాల్లో కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. ⇒ ఉద్యోగాల క్రమబద్ధికరణకు ముందు అప్పటి ప్రభుత్వం వీఆర్ఏల కారుణ్య నియామకాలను నిలిపివేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో వీఆర్ఏలుగా పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇలా కారుణ్య నియామకాల కోసం దాదాపు 1,500 మంది ఎదురు చూస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ⇒ క్రమబద్ధికరణ సమయానికి 61 సంవత్సరాలు నిండిన వారిని రెగ్యులరైజ్ చేయలేదు. కానీ మండల రెవెన్యూ కార్యాలయాల్లో వారు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఇలా రెగ్యులరైజ్ కాకుండానే ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 4వేల మంది ఉంటారని అంచనా. ⇒ మరో సమస్య ఏమిటంటే... మసూ్కరు ఉద్యో గం జీవితాంతం ఉంటుంది. దానికి రిటైర్మెంట్ ఉండదు. కానీ క్రమబద్ధికరణ నిబంధనల ప్రకారం 2వేల మంది వరకు రిటైరయ్యారు. వీరిలో చాలా మంది రెగ్యులర్ ఉద్యోగులుగా 3 నెలల నుంచి మూడేళ్లు మాత్రమే పనిచేయగలిగారు. ⇒ ఈ మూడు కేటగిరీలకు చెందిన వీఆర్ఏల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం కూడా శీతకన్ను వేసింది. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సహా ఉన్నతాధికారులెవరూ వీరి గోడును పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.కొసమెరుపేమిటంటే... ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయి కుటుంబాలకు దూరంగా, ఇతర జిల్లాలకు వెళ్లి పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు, లస్కర్లు, అటెండర్లకు ఇంతవరకు ప్రొబేషన్ డిక్లేర్ కాకపోవడంతో వారు ఇంక్రిమెంట్లు పొందేందుకు వీలు లేకుండా పోయింది. కనీసం అధికారికంగా సెలవులు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొనడం గమనార్హం. -
ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు
సిటీ కోర్టులు, (హైదరాబాద్): ఫార్ములా–ఈ రేస్ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషిట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేటీఆర్ (ఏ–1)తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ (ఏ–2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డి (ఏ–3)కి గురువారం నోటీసులు జారీ చేసింది.జూలై 31న కోర్టులో హాజరుకావాలని తెలిపింది. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (ఏ–4), యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థ (ఏ–5)లను కూడా ఏసీబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఆర్థిక లావాదేవీలు, తదితరాలకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు చార్జిషిట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. రూ. 54.89 కోట్ల మళ్లింపు ఆరోపణలు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గత గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, అర్వింద్కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నిధుల విషయంలో ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే కేటీఆర్ తదితరులు విచారించింది. -
రాత్రిళ్లు... ఉక్కపోతే!
రాత్రి సమయాల్లోనూ ఉక్కపోత, వేడి వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండువేసవిలో సూర్యాస్తమయం తర్వాత చాలా సేపటి వరకు పడకగదులు ఉక్కపోతగానే ఉంటున్నాయి. దీంతో నిద్రకు అంతరాయం కలగడం, చిరాకు పెరగడం వంటి వాటితో మరుసటి రోజు పని, కార్యకలాపాల నిర్వహణలో ఉత్సాహం, చురుకుదనం కోల్పోయి ఉత్పాదకత కూడా ప్రభావితమవుతోంది.హైదరాబాద్, బెంగళూరు సహా దాదాపుగా అన్ని మహానగరాలు, పట్టణాల్లో ఇదే సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లలో రాత్రిపూట వేడిమి ఒక తీవ్రమైన సంక్షోభంగా మారుతోంది. సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గకపోవడం వల్ల, పగటిపూట వేడి నుంచి భౌతికంగా కోలుకోవడానికి వీలులేకుండా ఒక ‘ఉష్ణ లోటు’ ఏర్పడుతోంది. 2026 వివిధ అధ్యయనాలు, నివేదికల ప్రకారం చూస్తే...2026 మే నాటికి భారత్లో పగటి కంటే రాత్రుళ్లే వేగంగా వేడెక్కుతున్నాయని, 76% జనాభా తీవ్రమైన, మిశ్రమ వడగాలుల బారిన పడే అధిక ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. – సాక్షి, హైదరాబాద్ఇదీ అధ్యయనం...2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య ఏడు నెలల హై–రిజల్యూషన్ సెన్సార్ డేటా ఆధారంగా క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం పెరుగుతున్న వాతావరణ ముప్పును సూచిస్తోంది. ఉదయం నుంచి కాంక్రీట్ గోడలు, నేలలు నిల్వ ఉంచుకున్న ఎండ వేడిమి విడుదల కావడం వల్ల, రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 34.7ని సెంటిగ్రేడ్ల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తెల్లవారుజామున కూడా, ఉష్ణోగ్రతలు 33.8ని నుంచి 34ని సెంటిగ్రేడ్ల మధ్యే ఉండటంతో ఇళ్లల్లోని వారికి పెద్దగా ఉపశమనం లభించడం లేదు.ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ప్రచురితమైన ఈ పరిశోధనలో వడగాలుల సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి, మరణాల రేటు పెరగడానికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. నిద్రపై జరిపిన అధ్యయనాలు ఇంకా సూచించేదేమిటంటే, ఇళ్లలో 26–28 నిసెంటిగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నిద్ర నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తాయి, అయితే 30ని సెంటిగ్రేడ్ల మించిన ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక అసౌకర్యానికి క్రమంగా పెరిగే శారీరక ఒత్తిడికి దోహదం చేస్తాయి. తాజాగా ఇండియా హీట్ సమ్మిట్–2026 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. పట్టణ ప్రణాళికలు.. పర్యావరణహితంగా లేకే సమస్యలు మనదేశంలో నగరీకరణ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో, నగరాలు, పట్టణాలు ‘కాంక్రీట్ జంగిళ్లు’గా మారాయి. హైదరాబాద్, బెంగళూరు ఇతర నగరాల్లో పట్టణ ప్రణాళికలు, పర్యావరణహితంగా లేకనే సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవి కూడా నగరీకరణపై ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. అర్భనైజేషన్కు సంబంధించి ఒక బ్లూప్రింట్, కచి్చతమైన ప్లానింగ్, దీర్ఘకాలిక నగర సుస్థిరాభివృద్ధి, ప్రకృతి, పర్యావరణ అనుకూల ‘డిజైన్ విత్ నేచర్’వంటివి, గాలి వీచే దిశ, వర్షపాతం, బహిరంగ, ఖాళీస్థలాలు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా క్రీడామైదానాలు, పార్కులు, స్కూళ్లు వంటి వాటిని అంతర్భాగం చేసి ‘లేయర్డ్ ప్లానింగ్’చేయాల్సి ఉండగా అది జరగలేదు. – ప్రొఫెసర్ .కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తఅధ్యయనం ముఖ్యాంశాలు... ⇒ గత దశాబ్ద కాలంలో ఇండో–గంగా మైదానంలో తేమ స్థాయిలు 10% పెరిగాయి ⇒ దీనివల్ల ఉష్ణోగ్రత 3–5ని సెంటిగ్రేడ్లు అధికంగా ఉన్నట్టు అనిపిస్తుంది ⇒ రాత్రిపూట సహజంగా చల్లబడే ప్రక్రియను అణచివేస్తుంది ⇒ అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో దాదాపు 49% మంది ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు ⇒ రాత్రులు వెచ్చగా ఉన్నప్పుడు, మానవ శరీరం చల్లబడలేదు, దీనివల్ల శరీరంలో వేడి భారం పెరిగి పక్షవాతం, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదం పెరుగుతుంది -
‘సర్’ సైరన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. తొలి విడతలో బిహార్, రెండో విడతలో మరో ఆరు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మూడో విడత కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ నిర్వహించనుంది. తెలంగాణలో 2026 అక్టోబర్ 1ని అర్హత తేదీగా పరిగణిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంటే ఆ రోజుకు 18 ఏళ్లు నిండిన/నిండనున్న పౌరులందరూ ఓటర్లుగా నమోదు కావడానికి అర్హత కలిగి ఉంటారన్నమాట. ఇదీ షెడ్యూల్..: ఈసీ షెడ్యూల్ ప్రకారం..రాష్ట్రంలో వచ్చే జూన్ 15–24 మధ్యకాలంలో దరఖాస్తులు, మెటీరియల్ ముద్రణ, సిబ్బందికి శిక్షణ వంటి చర్యలు తీసుకుంటారు. జూన్ 25–జూలై 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎస్ఓలు) ఇంటింటా తిరిగి ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఈ ప్రక్రియలో బీఎల్ఓలకు ఆయా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏ) సహకరించాలని ఎన్నికల సంఘం సూచించింది. జూలై 31న ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ల ఆధ్వర్యంలో విచారణకు పిలుస్తారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలో ఈ నెల 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా, 35,985 మంది బీఎల్ఓలు, 25,886 మంది బీఎల్ఏలు ‘సర్’ ప్రక్రియలో పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 60 శాతమే మ్యాపింగ్ పూర్తి! సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్) పేరుతో ప్రతి ఏటా జనవరిలో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనేక చోట్ల ఓట్లు ఉన్న వలస ఓటర్ల డూప్లికేట్ ఓట్లను, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడానికి ‘సర్’ను చేపట్టినట్టు ఎన్నికల సంఘం పేర్కొంటోంది. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో ‘సర్’ నిర్వహించగా, రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ నిర్వహిస్తున్నారు. ‘సర్’ 2026 కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను.. ‘సర్’ 2002 జాబితాలోని వారి పేర్లు/ తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లతో మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు .. 2002 జాబితాలో వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లు గానీ కలిగి ఉన్నారో గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. సర్ 2002 జాబితా ప్రకారం తెలంగాణలో నాడు మొత్తం 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని 60 శాతం మంది పేర్లను మాత్రమే ఇప్పటివరకు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి లేదు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు ‘సర్’ 2026లో ఇబ్బందులు తప్పవు. సర్–2002 జాబితాను స్థానిక బీఎల్ఓలతో పాటు సీఈఓ కార్యాలయం వెబ్సైట్(https:// ceotelangana.nic.in)తో పాటు ఎన్నికల సంఘం వెబ్సైట్ (https:// voters.eci.gov.in)లో అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికీ బీఎల్ఓలు సర్వేలో భాగంగా జూన్ 25–జూలై 24 మధ్య బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు సంబంధించి ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్ రెండు ప్రతులను అందజేస్తారు. ఆన్లైన్ నుంచి కూడా ఓటర్లు ఈ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. భర్తీ చేసిన ఒక ప్రతిని బీఎల్ఓలకు అందజేయాల్సి ఉంటుంది. మరో ప్రతిని స్వీకరణ రశీదుగా నమోదు చేసి ఓటరు వద్దే ఉంచుతారు. 2002 జాబితాలో తమ ఓటు ఉందా? లేక తమ తల్లిదండ్రులు/తాతఅమ్మమ్మల పేర్లు ఉన్నాయా ? వంటి వివరాలను ఈ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీఎల్ఓలు ఓటర్లకు సహకరిస్తారు. ఎన్యూమరేషన్ దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని ఓటర్లకు.. జూలై 31– ఆగస్టు 30 మధ్య అభ్యంతరాలు, దరఖాస్తుల సమయంలో మరో అవకాశం కల్పిస్తారు. వారు కొత్తగా ఓటరుగా నమోదు కోసం ఫామ్–6 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు నియోజకవర్గం లోపల/బయట నివాసం మారిన ఓటర్లు/ వివరాల దిద్దుబాటు/కొత్త ఎపిక్కార్డు/ దివ్యాంగ ఓటరుగా గుర్తింపు కోసం ఇదే సమయంలో (ఫారం–8) దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు నోటీసులు పూర్తి వివరాలు ఇవ్వని ఓటర్లతో పాటు 2002 జాబితాలో పేర్లు లేని/సరిపోల్చలేని ఓటర్లకు జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీన స్థానిక ఈఆర్వో)/ఏఈఆర్ఓల వద్ద విచారణకు పిలిపిస్తారు. అప్పుడు తమ అర్హతలను రుజువు చేసే ఆధారాలను సంబంధిత ఓటర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాల్లో ఏదో ఒకదానిని వారు ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్, సీఈఓకు అప్పీల్ అవకాశం... విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కు రెండో అప్పీల్ చేయవచ్చు. -
సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాల కుదింపు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీఎంతో పాటు ఇతర మంత్రుల వాహనాల సంఖ్యలోనూ తగ్గింపు చేసినట్లు తెలిసింది. సీఎం కాన్వాయ్లో ప్రస్తుతం 9 వాహనాలు ఉండగా ఆ సంఖ్యను మూడుకు తగ్గించినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి భద్రతాధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో భాగంగా గురువారం తన క్యాంపు ఆఫీసు నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి మూడు వాహనాల కాన్వాయ్లోనే వెళ్లారు. అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా జరగలేదని, నేడో, రేపో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా కేబినెట్ మంత్రుల కాన్వాయ్ లోనూ పైలట్ వాహనాలను తొలగించనున్నట్లుగా సమాచారం. దీంతో మంత్రుల వాహనాల సంఖ్య రెండుకు తగ్గనుంది. ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను కుదించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
‘సర్’...ఫికర్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పక్షాలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పిడుగు పడనే పడింది. తెలంగాణతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. గతంలో అసోం, మణిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహించిన సందర్భంగా వచ్చిన ఆరోపణలు, సందేహాల నేపథ్యంలో తమ ఓట్లు జారిపోకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. రెడీ అవుతున్న పార్టీలు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఈ సవరణ కేవలం సెక్యులర్ ఓట్లను తొలగించేందుకే చేపడుతున్నారని, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ అనుకూల ఓట్లను జాబితాలో ఉంచి, మిగిలిన పార్టీల సానుభూతిపరుల ఓట్లను పలు కారణాలతో తొలగిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాదన. తెలంగాణలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్టు సీఈసీ చేసిన ప్రకటనతో రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమావేశం కావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ నిర్ణయించారు.ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డితో పార్టీ నేతలతో కలిసి ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఈ భేటీలో భాగంగా రెండు కీలకాంశాలపై ఎన్నికల సంఘం అధికారులతో చర్చిస్తామని మహేశ్గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. ఓటరు జాబితా సవరణ నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకుండే అన్ని సందేహాలను తీర్చిన తర్వాతే తుది ఓటరు జాబితా నిర్ధారించాలనే అంశాలపై మాట్లాడతామని, ఎస్ఐఆర్ విషయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వివరిస్తామని చెప్పారు. ఓటరు జాబితాలో అవకతవకలు జరగకుండా పార్టీ కేడర్ను కూడా సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ⇒ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఎస్ఐఆర్ విషయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పార్టీ మద్దతుదారులు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఉండేలా గ్రామస్థాయిలో కేడర్ను సిద్ధం చేస్తోంది. పోలింగ్ బూత్ల వారీగా ఇద్దరు కార్యకర్తలకు ఎస్ఐఆర్పై శిక్షణనిస్తోంది. ⇒ ఎంఐఎం కూడా ఇప్పటికే ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సవరణ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ఇప్పటికే చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలోని తమ ఓట్లు జారిపోకుండా ఉండే క్రమంలోనే ఎంఐఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. -
జాగ్రత్తలు ఈవీ.. పేలిపోతున్న వాహనాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. పర్యావరణహిత ప్రయాణ సాధనాలుగా పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అక్కడక్కడా ఈ ఈవీ వాహనాల బ్యాటరీలు పేలిపోతుండటం తెలిసిందే. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40ని–45ని డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నప్పుడు ఇవి కాలిపోవడం, కొన్ని సందర్భాల్లో వాహనదారులు గాయపడటం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల్లో బ్యాటరీ సమస్యలు, వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.పరిమితికి మించి వేడెక్కినప్పుడు.. ఈవీలలో సాధారణంగా లిథియం–అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇవి అత్యధిక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో రసాయనిక మార్పుల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్లో వేలాది చిన్న సెల్స్ ఉంటాయి. చార్జింగ్, డిశ్చార్జింగ్ సమయంలో ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఒక సెల్ పరిమితికి మించి వేడెక్కినప్పుడు, ఆ వేడి పక్కన ఉన్న సెల్స్కు వేగంగా వ్యాపిస్తుంది. క్షణాల్లో బ్యాటరీ ప్యాక్ పేలిపోయి మంటలు వ్యాపిస్తాయి. చల్లని వాతావరణం లేకపోవడం..విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అనేక లిథియం–అయాన్ సెల్స్ (ప్రధానంగా నికెల్ మాంగనీస్ కోబాల్ట్) చల్లని వాతావరణానికి అనుకూలంగా రూపొందుతాయి. అయితే భారత్లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ. అధిక బాహ్య ఉష్ణోగ్రతలకు.. వాహనం నడిపినప్పుడు, ఫాస్ట్ చార్జింగ్ చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే అంతర్గత వేడి తోడై బ్యాటరీ త్వరగా ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. బీఎంఎస్ వైఫల్యంబ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) అనేది బ్యాటరీకి మెదడు లాంటిది. ఇది ప్రతి సెల్ వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తుంది. తక్కువ నాణ్యత గల సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కలిగిన బీఎంఎస్.. సెల్స్ వేడెక్కుతున్నప్పుడు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంలో విఫలమైతే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకుంటాయి.మన దేశంలో భద్రతా చర్యలుకేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ బ్యాటరీ భద్రతను పటిష్టం చేయడానికి ఏఐఎస్–156, ఏఐఎస్–038 నిబంధనలకు సవరణలు తీసుకువచ్చింది. వాటి ప్రకారం.. ⇒ ప్రతి బ్యాటరీ సెల్ను బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిబంధనల ప్రకారం సునిశితంగా పరీక్షించాలి. ⇒ ప్రతి బీఎంఎస్ తప్పనిసరిగా ఓవర్–చార్జ్, ఓవర్–డిశ్చార్జ్, ఓవర్–టెంపరేచర్, ఓవర్ కరెంట్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ను కలిగి ఉండాలి. ⇒ ఒక సెల్ కాలిపోయినా, ఆ మంటలు పక్క సెల్కు వ్యాపించకుండా ఉండేలా బ్యాటరీ డిజైన్ ఉండాలి. వాహనదారులు సురక్షితంగా బయటపడటానికి కనీసం 5 నిమిషాల సమయం లభించేలా ఉండాలి. ⇒ బ్యాటరీలో అధిక వేడి సంభవించినప్పుడు డ్రైవర్ను అప్రమత్తం చేసేందుకు డిస్ప్లేలో హెచ్చరిక, బీప్ సౌండ్ రావాలి. ⇒ బ్యాటరీ ప్యాక్ తప్పనిసరిగా ఐపీ67 రేటింగ్ కలిగి ఉండాలి. దీనివల్ల ధూళి, వరద నీటిలో మునిగినా షార్ట్ సర్క్యూట్ కాదు.కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఎలక్ట్రిక్ వాహనదారులు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం ద్వారా బ్యాటరీ ప్రమాదాలను దాదాపు 99 శాతం నివారించవచ్చు. ⇒ వాహనంతో పాటు కంపెనీ ఇచ్చిన లేదా ధ్రువీకరించిన చార్జర్లనే వాడాలి. ⇒ సుదీర్ఘ ప్రయాణం తర్వాత బ్యాటరీ కనీసం 30–45 నిమిషాలు చల్లబడిన తర్వాతే చార్జింగ్కు పెట్టాలి. ⇒ రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేయడం ప్రమాదకరం. 100% చార్జ్ అయిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ⇒ ఎండాకాలంలో వాహనాన్ని వీలైనంత వరకు చెట్లు ఇతర నీడ ప్రాంతాల్లో పార్క్ చేయాలి. ⇒ బ్యాటరీ ప్యాక్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోవాలి. ముఖ్యంగా డిటాచబుల్ బ్యాటరీలను ఇంట్లో చార్జ్ చేసేటప్పుడు బెడ్రూమ్లు లేదా సులభంగా మంటలు అంటుకునే వస్తువుల (ఎల్పీజీ సిలిండర్లు) దగ్గర పెట్టకూడదు. ⇒ బ్యాటరీ చార్జ్ అవుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు రసాయనాల వాసన, పొగ వచ్చినా, అసాధారణ శబ్దాలు విని్పస్తున్నా, బ్యాటరీ ప్యాక్ ఉబ్బినట్లు అనిపించినా వాహనాన్ని నిలిపివేసి టెస్టింగ్కు తరలించాలి. -
ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జూలజీలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోర్డు మ్యాథ్స్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ను ప్రవేశపెట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ మార్కులు 75 నుండి 60కి తగ్గించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. హ్యూమానిటీస్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా 20 మార్కులు పొందే అవకాశం కల్పించారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. లాంగ్వేజెస్లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కుల బదులు 80 మార్కులకే జరుగుతాయని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్రెడ్డికి సైతం సమన్లు పంపింది. జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. -
బండి భగీరథ్ ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశాడు. భగీరథ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్ ముందస్తు రక్షణ పిటిషన్పై విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. -
నీట్ పేపర్ లీక్పై సీఎం రేవంత్రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్రెడ్డి ఎక్స్లో స్పందించారు. నీట్ పేపర్ లీక్తో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టారని.. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళనలొ ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. పేపర్ లీక్, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘కేంద్ర ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపట్టాలి. వ్యవస్థ వైఫల్యాలతో అమాయక విద్యార్థులు నష్టపోకూడదు. పోటీ పరీక్షలు అవకాశాలకు మార్గం కావాలి గానీ భయానికి కాదు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ‘ఎస్ఐఆర్’కు ఈసీ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్స్థాయి అధికారుల్ని నియమించింది.ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లుజూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంసెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా విడుదలతెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 24 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంఅక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదలఈసీ అధికారిని కలవనున్న కాంగ్రెస్ నేతలుహైదరాబాద్: తెలంగాణ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. -
మహిళా కానిస్టేబుల్పై ఎస్సై లైంగిక దాడి
హైదరాబాద్: మహిళా కానిస్టేబుల్పై కన్నేసిన ఓ ఎస్సై ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని ఆ లేడీ కానిస్టేబుల్ బలవంతం చేసేసరికి ఎస్సై ఎదురుతిరిగాడు. దీంతో బాధితురాలు కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెలన్నర కిందట నమోదైన ఈ కేసులో కొల్లూరు ఎస్సైను కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సురేశ్కుమార్ 2020లో కూకట్పల్లి ఠాణాలో ఎస్సైగా పనిచేశారు. అదే సమయంలో ఎస్సైకు రైటర్గా ఓ మహిళా కానిస్టేబుల్ను నియమించారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అప్పటికే తనకు పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టిన ఎస్సై.. కానిస్టేబుల్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2022 సంవత్సరంలో బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి చిత్తారమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న క్రమంలో.. ఎస్సై సురేశ్ మహిళా కానిస్టేబుల్ని గుడిలోకి తీసుకెళ్లి ఆమె నుదుటిన బొట్టు పెట్టి మనిద్దరికి పెళ్లి అయిందని నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. 2023లో ఎస్సై సురేశ్కు కొల్లూరు పోలీస్స్టేషన్కు బదిలీ అయింది. కొంతకాలానికి ఎస్సై సురేశ్కు అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారని మహిళా కానిస్టేబుల్కు తెలిసింది. ఈ విషయమై ఎస్సైని ఆమె నిలదీసింది. దీంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని రెండేళ్ల పాటు కాలాయాపన చేశాడు. ఈ సమయంలో లేడీ కానిస్టేబుల్ గర్భవతి అయింది. దీంతో కంగారు పడిపోయిన ఎస్సై.. ఆమెకు మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కానిస్టేబుల్ బలవంతం చేసేసరికి.. తాను ఎస్సై అని, కానిస్టేబుల్ను ఎలా పెళ్లి చేసుకుంటానని ఎదురు తిరిగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 1న కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని, భార్యాపిల్లలతో సహా పరారయ్యాడు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నెలన్నర తర్వాత పోలీసులు ఎస్సై సురేశ్ను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఎస్సై సురేశ్పై లైంగిక దాడి కేసు నమోదైందని తెలియగానే అతడిని సస్పెండ్ చేసినట్టు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. -
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్లో రెండో దశను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
రాజధానిలో పనిమనుషుల గురించి పోలీసుల ఆరా
సాక్షి, సిటీబ్యూరో నగరంలో నేపాలీ పనిమనుషులు ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంతమంది ఉన్నారు.. ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. మొన్న ప్రశాసన్నగర్లోని మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఇంట్లో... తాజాగా జవహర్నగర్ ఠాణా పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఉండే రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో నేపాలీలు పంజా విసిరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో సర్వేంట్స్ వెరిఫికేషన్ను బుధవారం నుంచి మొదలుపెట్టారు. సరైన రికార్డుల ఉండట్లేదు... రాజధానిలోని ఎగువ మధ్య తరగతి, ఉన్నత కుటుంబాల ఇళ్లకు ఇదివరకు సర్వెంట్స్ ఉదయం, సాయంత్రం వచ్చి పనిచేసేవారు. ప్రస్తుతం ఇళ్లల్లోనే 24 గంటలూ అందుబాటులో ఉండే సంస్కృతి వచ్చింది. దీంతో ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలతోపాటు నేపాల్కు చెందినవారూ ఈ పనిలోకి వస్తున్నారు. సర్వెంట్స్, డ్రైవర్స్, కుక్స్.. ఇలా వివిధ పనుల్లోకి వీరిని యజమానులు నేరుగా, లేదా దళారుల ద్వారా నియమించుకుంటున్నారు. ఆయా సమయాల్లో వారి వివరాల సేకరణ, నమోదు లేకపోవడంతో యజమానుల వద్ద ఎలాంటి రికార్డులు ఉండట్లేదు. గుర్తించే సరికే సరిహద్దులు దాటేస్తూ.. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. బరితెగించిన పనిమనుషుల వివరాలు సేకరించడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. ఘటనాస్థలి నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వందల సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి పరిశీలించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి నేరగాళ్లు సరిహద్దులు దాటి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసులు కొలిక్కిరాకపోవడమో, నిందితులందరూ అరెస్టు కాకపోవడ మో, రికవరీలు లేకపోవడమో జరుగుతోంది. ఫలితంగా బాధితుడు నష్టపోవడంతోపాటు మరికొంద రు నేరగాళ్లు నేరం చేసేలా ప్రేరణ పొందుతున్నారు. వరుస ఉదంతాల నేపథ్యంలో డీజీపీ ఆనంద్ ఆదేశాలు ఠాణాలవారీగా వివరాలు సేకరిస్తున్న క్షేత్రస్థాయి అధికారులు నాలుగు కమిషనరేట్లలోనూ ప్రారంభమైన ప్రక్రియ 2 రకాలుగా నమోదు.. -
డీజిల్ చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
కందుకూరు: పార్క్ చేసిన వాహనాల నుంచి రాత్రి వేళ డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన మేరకు.. మండల పరిధిలోని దిల్వార్గూడ (జండాగూడ)లో రాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు పార్క్ చేసిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలిస్తున్నారు. ఓ ఆర్టీసీ బస్సు నుంచి 110 లీటర్లు, డీసీఎం నుంచి 30 లీటర్లు, టిప్పర్ నుంచి 300 లీటర్లు ఇలా రెండు రోజుల వ్యవధిలో 440 లీటర్లు దోచినట్లు వాహనాల యజమానులు, డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి కారులో రాత్రి సమయంలో ఇద్దరు వచ్చి డీజిల్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. పుటేజీ ఆధారంగా నిందితులు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ సభావత్ రమేశ్(30), మియాపూర్లో ఉండే నడిగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్ ముడావత్ గణేశ్(18)గా గుర్తించారు. వీరిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకొన్నారు. దీంతో వారి వద్ద 330 లీటర్ల డీజిల్తో పాటు స్విఫ్ట్ కారు, డీజిల్ అమ్మగా వచ్చిన సొమ్ము రూ.19,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రారంభమైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి కోరారు. బుధవారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టు హౌసింగ్ సోసైటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ... దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 21న జరిగే క్యాబినెట్ సమావేశం నాటికి హైదరాబాద్లో ఉన్న అన్ని సొసైటీల పూర్తి వివరాలను జర్నలిస్టుల సంఖ్యతో కూడిన నివేదికను తయారు చేయాలన్నారు. ఇందుకు అన్ని సోసైటీలు సమష్టిగా సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులను మాత్రమే జాబితాలో చేర్చాలని ఆయన ప్రతినిధులను కోరారు. నూతన డీజీపీలకు సత్కారం సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పోలీసు శాఖలో పదోన్నతులు పొందిన ఉన్నతాధికారులను ఇంటర్నేషనల్ ఛాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ (ఐసీపీఆర్) జాతీయ అధ్యక్షుడు డా. అజయ్ కుమార్ అగర్వాల్ మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. స్వచ్ఛ అధికార్ ఇండియా, టేస్ట్ బడ్డర్స్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్తో కలిసి ఆయన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, ఆక్టోపస్ డీజీ అనిల్ కుమార్ను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా. అజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ఆధునిక పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి అధికారులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. విజయనగర్కాలనీ: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో 2,570 మంది విద్యార్థులకు గాను 2,266 మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్షా కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. -
ఆన్లైన్లో అశ్లీల కంటెంట్..కేసు నమోదు
బంజారాహిల్స్: బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ (సీఎస్ఏఎం) ఆన్లైన్లో ప్రసారం చేసినట్లు ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ వైష్ణవీ ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేశారు. అనుమానాస్పద ఇన్స్ట్రాగామ్ ఖాతా మొబైల్ నెంబర్తో ఈ అశ్లీల కంటెంట్ లింక్ అయ్యి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతా యూసుఫ్గూడ కృష్ణానగర్కు చెందిన ఓ మహిళదిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి ఐసీయూలో చికిత్స మన్సూరాబాద్: వీధి కుక్కల దాడిలో గాయపడి ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు అద్వీక్కు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నామని కామినేని వైద్యులు తెలిపారు. బాగా లోతైన కుక్క గాట్లు ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకకుండా మందులు ఇస్తున్నామని, ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. బాలుడు స్పృహలోనే ఉన్నాడని, వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని, మరో 24 గంటలు గడిస్తే పరిస్థితి తెలుస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. వ్యక్తి ఆత్మహత్య ఉప్పల్: ఆన్లైన్ ట్రేడింగ్తో నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యచేసుకున్నాడు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు..రామంతాపూర్ నవరంగ్ గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబిబూద్ధీన్ (36) క్రిప్టో కరెన్సీ అన్లైన్లో ట్రేడింగ్ చేస్తూ నష్టపోయాడు. దీంతో అప్పుల భారం పెరిగి మనస్థాపంతో మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జితేందర్ సింగ్ తెలిపిన మేరకు.. ఉప్పరిగూడకు చెందిన దార శంకర్(53) కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మల్కాజిగిరి చౌరస్తాలో అపస్మారక స్థితిలో పడివున్న శంకర్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రాంతానికి వచ్చిన 108 సిబ్బంది అప్పటికే శంకర్ మృతి చెందాడని చెప్పారు. దీంతో పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
చదువుతో క్రీడల సమన్వయం అవసరం
● మాజీ డీజీపీ శివధర్రెడ్డి బంజారాహిల్స్: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలను చదువుతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్పోర్ట్స్ అండ్ వెల్ బీయింగ్ డే’ కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివధర్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపయోగపడే వినూత్న అకడమిక్ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికుల సంక్షేమానికి తెలంగాణ మాజీ సైనిక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్.బాబు కోరారు. అలాగే ముఖ్యమంత్రి చైర్మెన్గా రాజ్య సైనిక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారు. విధి విధానాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో మాజీ సైనిక కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయో, వాటి విధానాలు, నమూనాలను సేకరించి త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు గవర్నర్ చైర్మన్గా ఉన్న స్టేట్ మేనేజింగ్ కమిటీ ఏర్పాటుకు సైతం త్వరలోనే ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.మాజీ సైనికుల సమస్యలపై పూర్తి వివరాలతో నివేదికను అందజేయాలని చెప్పారు.ఆ నివేదికలోని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి,తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్య
ఘట్కేసర్: ఎదులాబాద్ డివిజన్ అంకుషాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామానికి చెందిన అన్వర్ (50) పట్టణంలోని ఓ సెకండ్ హ్యాండ్ సేల్ షోరూంలో ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తుంటాడు. షోరూం యజమానులు నిర్మల్ జిల్లా బాన్సువాడలో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ను కొనుగోలు చేయగా తీసుకురావడానికి మంగళవారం వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రావకపోవడం, ఫోన్ స్విచాప్ రావడంతో అన్వర్ భార్య షోరూం యజమానికి తెలిపింది. అప్రమత్తమైన యజమాని తూప్రాన్ సమీనంలోని టోల్ ప్లాజా వద్ద సీసీ పుటేజీలు పరిశీలించగా ట్రాక్టర్ టోల్ దాటలేదని గ్రహించారు. కాగా అన్వర్ ట్రాక్టర్ను తీసుకొని ఘట్కేసర్కు వస్తుండగా మెదక్ జిల్లా శభాష్పల్లి శివారు పోతారం రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ట్రాక్టర్తో పరారయ్యారు. దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో బుధవారం విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ లభించకపోవడంతో ఆర్థిక కోణం, వివాహేతర సంబంధం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా పోతారం రోడ్డుపై దారుణం ట్రాక్టర్ అపహరించిన దుండగులు వివాహేతర సంబంధమే కారణం! -
క్యూర్ ఐటీ.. ఉమ్మడి కమిటీ
జీహెచ్ఎంసీ విభజన తర్వాత సమన్వయానికి ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఉమ్మడి డిజిటల్ సేవలు, ఐటీ మౌలిక వసతుల నిర్వహణలో సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలో కొనసాగుతున్న సాధారణ ఐటీ సేవల నిర్వహణకు సంయుక్త కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ జారీ చేసిన జీఓ నెంబర్ 541 మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కమిటీకి చైర్మన్. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు సభ్యులుగా, ఆయా సంస్థల ఐటీ విభాగ అదనపు కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. అంతరాయం లేకుండా కార్యకలాపాలు మూడు కార్పొరేషన్లకు ఉమ్మడిగా పనిచేస్తున్న అన్ని ఐటీ ప్రాజెక్టులు, డిజిటల్ ప్లాట్ఫారాలు, సాఫ్ట్వేర్ ఒప్పందాలు, క్లౌడ్, హోస్టింగ్ సేవలు, యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్టులు తదితరమైనవాటిని అంతరాయం లేకుండా కొనసాగించనున్నారు. సాధారణంగా వీటి నిర్వహణ వ్యయాన్ని మూడు కార్పొరేషన్లు సమానంగా భరించాల్సి ఉండగా, అవసరాన్ని బట్టి వినియోగం ఆధారంగా వ్యయ పంపిణీపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిటీకి ఇచ్చారు. అమలులో ఉన్న ప్రాజెక్టుల్లో మార్పులు, సాంకేతిక నవీకరణలు, ఆర్థిక సవరణలు, డేటా మైగ్రేషన్ వంటివన్నీ సంయుక్త కమిటీ ఆమోదంతోనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ పరిశీలించాకే.. భవిష్యత్తులో చేపట్టే కొత్త ఐటీ ప్రాజెక్టులు, ప్రాంతీయ స్థాయి ఈ–గవర్నెన్స్ వ్యవస్థలు, ఉమ్మడి డిజిటల్ మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ముందుగా ఈ కమిటీ పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. సాంకేతిక సాధ్యత, ఆర్థిక సామర్థ్యం, సైబర్ భద్రత, డేటా గవర్నెన్స్, విస్తరణ సామర్థ్యం వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఆమోదించనున్నారు. ప్రతి కార్పొరేషన్ తమ స్థానిక పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్వేర్లనుగానీ, మాడ్యూళ్లనుగానీ స్వతంత్రంగా అమలు చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. అయితే అవి ఉమ్మడి సేవలపై ప్రభావం చూపకూడదని, ప్రాంతీయ డిజిటల్ ఏకరీతిని దెబ్బతీయకూడదని షరతులు విధించింది. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, హెచ్ఆర్ఎంఎస్, జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ, ఇంటర్నెట్ లీజ్డ్ లైన్లు, మొబైల్ సిమ్ సేవలు, ఎస్ఎంఎస్ గేట్వేలు, డిజిటల్ ఽధ్రువీకరణ సేవలు వంటి వివిధ ఐటీ సేవల పర్యవేక్షణ బాధ్యతనూ ఈ కమిటీకి అప్పగించారు. నెలకోసారి సమీక్ష.. కమిటీ ప్రతినెలా కనీసం ఒకసారి సమావేశమై ప్రాజెక్టుల పురోగతి, సైబర్ భద్రత, ఆర్థిక వ్యయాలు, డిజిటల్ సేవల నిర్వహణ, రాబోయే ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనుంది. అవసరాన్ని బట్టి అత్యవసర అంశాలపై అవసరమైతే ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ విభజన అనంతరం డిజిటల్ సేవల్లో అంతరాయం లేకుండా కొనసాగించడం, పౌరసేవలను సమర్థవంతంగా నిర్వహించడం, వ్యయ నియంత్రణ, మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం ఈ కమిటీ అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. చైర్మన్గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం -
ఎండ వేడిమికి పేలిన బ్యాటరీలు
టాటా షోరూంలో అగ్నిప్రమాదం కుషాయిగూడ: కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో నిర్వహిస్తున్న టాటా షోరూంలో డెంటింగ్, పెయింటింగ్ చేసే యూనిట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎండల తీవ్రతకు బ్యాటరీలు పేలి మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన షోరూం సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారమిచ్చి షోరూంలో ఉన్న కార్లను బయటకు తీశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా టాటా షోరూం పక్కనే ఉన్న సప్తగిరి హైట్స్ అపార్ట్మెంటు వైపుగా మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన అపార్టుమెంట్వాసులు బయటకు పరుగులు తీశారు. సుమారు 20 లక్షల వరకు ఆస్థినష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రదాన కారణం.. అక్రమంగా నిర్మించిన షెడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న షోరూంపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేసిన అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణమని 2022లో నోటీసులు జారీ చేసి కూల్చివేతలకు సిద్ధమైన అధికారులు కూల్చివేయకుండా వదిలివేయడంతోనే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టాటా షోరూం నిర్వాహకులపై స్థానికులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భరత్నగర్ ఆర్వోబీ ఆధునికీకరణ
కొత్త సాంకేతికతతో త్వరలో పనులు కన్సల్టెన్సీలను ఆహ్వానించిన సీఎంసీ సాక్షి, సిటీబ్యూరో: మూసాపేట సర్కిల్లోని భరత్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ఆధునికీకరణకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) సిద్ధమైంది. పనులు చేయడానికి ముందు కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లు ఆహ్వానించింది. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పునరుద్ధరణ పనులు చేసిన అనుభవం ఉన్న సంస్థలు టెండర్లలో పాల్గొనాల్సిందిగా పేర్కొంది. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. టెక్నికల్గా అర్హత పొందిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్లు పరిశీలిస్తారు. టెండర్లలో పాల్గొనే ఏజెన్సీ సొంతంగానే పనులు చేయాలి. ఒక ఏజెన్సీ ఒక టెండరు మాత్రమే వేయాలి. పనులు వేగంగా, సమర్థంగా, తక్కువ వ్యయంతో చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ సాంకేతిక విధానాలను ఎంచుకోవచ్చు. బిడ్లు దాఖలుకు ముందు ఏజెన్సీలు ఆర్వోబీని, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గర్డర్లు, డయాఫ్రమ్స్, బేరింగ్ రీజియన్స్, పియర్స్ తదితరాల స్థితిగతులు తెలుసుకోవాలని సూచించారు. ఆర్వోబీ డేటా, నివేదికల అధ్యయనానికి సమాచారాన్ని కార్పొరేషన్ అందజేస్తుంది. వాటిని విశ్లేషించడంతో పాటు కావాల్సిన ఇతర వివరాలు సేకరించాల్సిన బాధ్య త ఏజెన్సీదే. కన్సల్టెన్సీ సర్వీసులకు ఎంపికయ్యే సంస్థ మూడు నెలల్లోగా నివేదిక అందజేయాలి. -
నైపుణ్యంతో పాటు నిబద్ధతతో ప్రజాసేవ
● డీఐజీ రమణారెడ్డి వెంగళరావునగర్ : విధి నిర్వహణలో క్రమశిక్షణ, నైపుణ్యంతో పాటు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని డీఐజీ వి.రమణారెడ్డి తెలియజేశారు. యూసుఫ్గూడలోని ఫస్ట్ బెటాలియన్లో నాలుగు వారాల పాటు నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్) హవల్దార్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం హవల్దార్లకు ప్రత్యేక అభినందన సమావేశాన్ని బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమణారెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే సిబ్బంది అధికారులు నిరంతరం నిజాయితీ కలిగి ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి తలొగ్గ వద్దని సూచించారు. ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధి నిర్వహణలో మెరుగైన సామర్థ్యం పెరుగుతుందని తెలియజేశారు. నాసిన్ జోనల్ డైరెక్టర్ టి.అనంత్ శిక్షణ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి సర్టిఫికెట్లు, ప్రత్యేక ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమ ఆల్రౌండర్ ప్రదర్శన ఇచ్చన మౌనిక అనే హవల్దార్కు సర్టిఫికెట్తో పాటుగా షీల్డ్ను అందజేసి అభినందించారు. తొలుత టీఎస్ఎస్పీ ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు సైనిక వందనం చేశారు. -
ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మాదాపూర్: మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. పర్వత్నగర్ ఎక్స్రోడ్లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో సూర్యాపేటకు చెందిన పూజరెడ్డి (16) ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే సెకెండ్ ఇయర్ తరగతులు ప్రారంభమయ్యాయి. పరీక్షల మానసిక ఒత్తిడితో తన రూమ్లో మంగళవారం రాత్రి హాస్టల్లో ఎవరూలేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి గోపిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డు.. నెత్తురోడి
మూడు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత● మల్లాపూర్లో ఇద్దరు, మియాపూర్, గచ్చిబౌలిలో ఒకరు దుర్మరణంపనులు వెళ్తూ మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు, బంధువుల పెళ్లికని బయలుదేరి మరొకరు మృత్యువాత పడ్డారు. మల్లాపూర్ పారిశ్రామికవాడలో ఇద్దరు, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద, గచ్చిబౌలి ఓఆర్ఆర్ పక్కన ఒకరు చొప్పున దుర్మరణం పాలయ్యారు. జడుపుల గణేష్, దండగల్ల గంగాధర్ (ఫైల్) మల్లాపూర్/మియాపూర్/గచ్చిబౌలి: మీర్పేట్ భక్షిగూడకు చెందిన దండగల్ల గంగాధర్(42), మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన జడుపుల గణేష్(49) మల్లాపూర్ పారిశ్రామికవాడలో బండరాళ్లు కొట్టుకుని జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి బండరాళ్ల వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టి కొద్దిదూరం ఈడ్చుకు వెళ్లింది. ఇద్దరూ రోడ్డుపై పడటంతో తలలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఈసీఐఎల్లోని ఓ ప్రయివేట్ ఆసుప్రతికి తరలించగా అప్పటికే మృతిచెందారని వైద్యులు చెప్పారు. కారుడ్రైవర్ పరారీలో ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని నాచారం పోలీస్స్టేషన్ ఎదుట మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. నాచారం ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఈడ్చుకెళ్లిన కారుఆగిన డీసీఎంను ఢీ కొట్టి.. అసోంకు చెందిన అమ్దాదుల్లా(23) రెండేళ్లుగా గచ్చిబౌలి సిద్ధిఖీనగర్లో నివాసముంటూ హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్పై గచ్చిబౌలి నుంచి నానక్రాంగూడ రోటరీలో పనికి వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఎడమ పక్కన డీసీఎం వ్యాన్ను ఢీ కొట్టి కింద పడిపోయాడు. కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. తలకు హెల్మెట్ ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే 108లో సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మూత్ర విసర్జన కోసమని నో పార్కింగ్ వద్ద డీసీఎం వ్యాన్ ఆపిన డ్రైవర్పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రోడ్డు దాటుతుండగా.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా మన్నెళ్లికి చెందిన అథియా(35), మహ్మద్ యూనస్ దంపతులకు ముగ్గురు కుమారులు. యూనస్ దినసరి కూలీ. మియాపూర్ హాఫీజ్పేట్లో ఈ నెల 15న జరిగే బంధువుల పెళ్లి వేడుకకు బుధవారం స్వగ్రామం నుంచి అథియా, ఆమె తండ్రి హైదర్షా, తల్లి రషీద, చిన్న కుమారుడు అయాన్తో కలిసి ఆర్టీసీ బస్సులో నగరానికి వచ్చి మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద దిగారు. హఫీజ్పేట్ వెళ్లేందుకు రహదారి దాటుతుండగా చందానగర్ నుంచి మియాపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న శ్రీ లక్ష్మీ నర్సింహ్మ బోర్వెల్స్ లారీ ఢీ కొట్టడంతో అథియా అక్కడికక్కడే మృతి చెందింది. రషీదకు స్వల్ప గాయాలయ్యాయి. -
మళ్లీ ఊపిరి.. మళ్లీ మాట..
కేర్ ఆస్పత్రిలో అరుదైన శ్వాసనాళ చికిత్స రాయదుర్గం: హైటెక్సిటీ కేర్ ఆస్పత్రి వైద్య బృందం ఓ వృద్ధుడికి అరుదైన శ్వాసనాళ చికిత్స చేసింది.కేర్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ డాక్టర్ సతీష్ సి రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ డాక్టర్ ఎం అబ్దుల్ ఆమ్జద్ఖాన్ తెలిపిన మేరకు.. నగరానికి చెందిన ఓ వృద్ధుడు (60) గతంలో ప్రమాదంలో గాయపడి వెన్నముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. శ్వాస సౌకర్యం కోసం ట్రాకియోస్టమీ చేశారు. అయితే ఇటీవల శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో కేర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన బ్రోంకోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సాంకేతికతలతో శస్త్ర చికిత్స అవసరం లేకుండా శ్వాసనాళాన్ని పునరుద్దరించి మళ్లీ మాట వచ్చేలా చేయగలిగామన్నారు. నీట్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి సుల్తాన్బజార్: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐచే విచారణ జరిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కిషన్, డాక్టర్ బి.అశోక్లు బుధవారం డిమాండ్ చేశారు.22 లక్షల మంది భావి వైద్య అభ్యర్థులకు ఘోర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 2024 నాటి నీట్ పేపర్ లీక్ పరాభవం మళ్లీ పునరావృతం కావడం ఆందోళన కరణమన్నారు. సుమారు 140 ప్రశ్నలతో కూడిన చేతితో రాసిన గెస్ పేపర్ 720 మార్కులలో 600 మార్కులకు సమానమైన అసలు ప్రశ్నలతో సరిపోలిందన్నారు. పరీక్షకు కొన్ని రోజుల ముందే ఈ పేపర్ చలామణి అయ్యిందన్నారు. లీకై న మెటీరియల్ ఉపయోగించిన అభ్యర్థులను శాశ్వతంగా నిషేధించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్: లక్నోలో జరుగుతున్న రెండో ఆలిండియా బ్యాడ్మింటన్–టేబుల్ టెణ్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ పోలీసులు రజత పతకం కై వసం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, హుజురాబాద్ ఏసీపీ మాధవి మిక్స్డబుల్స్ కేటగిరిలో రజత పతకం అందుకున్నారు. లక్నోలో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం వీరు తమ సత్తా చాటి రెండో స్థానంలో నిలిచారు. గోల్డ్ మెడల్ ఇంటిలిజెన్స్ బ్యూరో జట్టుకు రాగా, సిల్వర్ మెడల్ కట్టా హరిప్రసాద్, మాధవి గెలుచుకున్నారు. కాంస్య పతకం ఐజీ రవికృష్ణ, ఎస్పీ స్వరూపరాణిలు సాధించారు. -
ఖమ్మం, వరంగల్, కరీంనగర్కు 'ఔటర్ రింగ్ రోడ్డు'
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాలను వృద్ధి కేంద్రాలుగా మార్చడంలో భాగంగా మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం అధికారులతో సమీక్షించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణ కేంద్రంగా అభివృద్ధికి బాటలు వేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎయిర్పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈవీలే లీజుకు తీసుకోవాలి.. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పట్టణ కేంద్రంగా డెవలప్మెంట్ ప్లానింగ్ ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్లో తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ కారిడార్.. నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. – వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడాడ్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకం అని సీఎం అన్నారు. ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సీలింగ్పై 'టెన్'షన్ సర్కారు అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య చదివే బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల సడలింపుపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కసరత్తు చేపట్టింది. ఇప్పటివరకు ఈఏపీసెట్లో కేవలం 10 వేల లోపు ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తోంది. పాలీసెట్తో పాటు వివిధ సెట్లకు సంబంధించి కేవలం వెయ్యిలోపు ర్యాంకు సాధించిన వారు మాత్రమే పూర్తిస్థాయి ఫీజుకు అర్హత సాధిస్తారు. ఈ నిబంధన బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఇబ్బందికరంగా మారుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించినప్పుడు ర్యాంకు సీలింగ్ నిబంధన లేనప్పటికీ... 2010 తర్వాత సీలింగ్ విధించడంతో బీసీ విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు వెనకడుగు వేస్తున్నారని, ఈ నిబంధనను ఎత్తేయాలని బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలుమార్లు ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన బీసీ సంఘాల నేతలు ర్యాంకు పరిమితిని ఎత్తివేయాలని కోరడంతో పాటు స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ మిగిలిన మొత్తం విద్యార్థులు చెల్లించాల్సిందే.. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో చేరే 10 వేల లోపు ర్యాంకు బీసీ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజును పూర్తిస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఆపై ర్యాంకు వారికి మాత్రం కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు ఏటా రూ.1 లక్షకు పైబడి ఉంటే కొన్ని కాలేజీల్లో రూ.1.6 లక్షల వరకు ఉంది. అయితే 10 వేల ర్యాంకు దాటిన బీసీ విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరితే కేవలం రూ.35 వేల ఫీజు మాత్రమే రీయింబర్స్ చేస్తున్నారు. మిగిలిన ఫీజును విద్యార్థి వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్, ఇంజనీరింగ్ కోర్సులో లాటరల్ ఎంట్రీకి సంబంధించి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పలు సెట్లలో ర్యాంకు పరిమితిని వెయ్యిగా ఖరారు చేశారు. దీనికి మించి ర్యాంకు వచ్చిన వారంతా ప్రభుత్వమిచ్చే సాయం పోను మిగిలిన మొత్తాన్ని విద్యార్థి వ్యక్తిగతంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మాత్రం ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల ఒత్తిడి మేరకు సంబంధిత నిబంధనల సడలింపుపై కసర్తు జరపాల్సిందిగా మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలపై కసరత్తు... ప్రస్తుతం ఈఏపీసెట్కు సంబంధించి ఉన్న ర్యాంకు పరిమితిని 10 వేల నుంచి 20 వేలకు పెంచడంతో పాటు ఇతర సెట్లకు సంబంధించి ప్రస్తుతమున్న ర్యాంకు సీలింగ్ను వెయ్యి నుంచి రెండు వేలకు పెంచే విధంగా పరిశీలన చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. అలా ర్యాంకు పరిమితిని పెంచడంతో ప్రభుత్వంపై పడే భారాన్ని కూడా లెక్కంచి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు బిజీ అయ్యారు. ఒకట్రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించనున్నారు. వీటిని సీఎం రేవంత్రెడ్డికి సమర్పించిన తర్వాత సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. -
కాంటా వేయరు 'లోడ్ ఎత్తరు'!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపి కుట్టిపెట్టారు. కానీ ఐదు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం అక్కడే అలాగే ఉంది. ఈ కేంద్రంలో 15 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కానీ లారీలు రాక కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరిచామని, భారీగా ధాన్యం సేకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటినా కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం తీసుకోవడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కాంటా వేయడం, కాంటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగా లేదని, హమాలీల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. రైతుల ఆందోళనకు తగినట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లు ధాన్యం రాశులతో నిండిపోయి కన్పిస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తుండటంతో, తమ పంట ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ వంటి చాలా జిల్లాల్లో రాశులు పోసిన ధాన్యం తడిచిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ధాన్యం తడవకుండా తగిన సంఖ్యలో టార్పాలిన్లు సరఫరా చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మక్కలు, జొన్నల కొనుగోళ్ల పరిస్థితీ ఇదేనని రైతులు వాపోతున్నారు. లక్ష్యంలో మూడో వంతే..! ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 8,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లోని మండలాల్లో పేరుకు కొనుగోలు కేంద్రాలే తప్ప, అక్కడ కొనుగోళ్లు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. అంటే లక్ష్యంలో మూడో వంతు మాత్రమే పూర్తయ్యిందన్నమాట. జూన్ నెల సమీపిస్తుండటంతో ఖరీఫ్ పనులు మొదలయ్యే సమయం ఆసన్నమైనా, ఇంకా రబీ పంట కొనుగోళ్లే పూర్తి కాకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి 15 రోజులకు పైగా రైతులు నిరీక్షిస్తున్న పరిస్థితి చాలా జిల్లాల్లో ఉంది. మంగళవారంముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఇంకా కదిలిన దాఖలాలు కన్పించడం లేదు. అన్నీ సమస్యలే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడమే ఒక ప్రహసనమైతే, వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో పెద్ద యుద్ధంలా మారింది. లారీలు రాక రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒకవేళ మిల్లుకు ధాన్యం చేరినా, అక్కడ మిల్లర్లు పెట్టే ఆంక్షలతో రైతులు బిక్క ముఖం వేస్తున్నారు. తరుగు, తాలు, తేమ శాతం పేరుతో యధావిధిగానే కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగానే రైతుతో లావాదేవీలు ముగియాల్సి ఉండగా, మిల్లులకు వెళ్లిన తరువాత తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో తరుగు పేరిట నాలుగైదు కిలోల ధాన్యాన్ని తరుగుగా తీసే విధానం ఇంకా కొనసాగుతోందని పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు తెలిపారు. ధాన్యం ఎత్తుకోవడానికి, దించుకోవడానికి సవాలక్ష సాకులు చెబుతూ లారీలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల సేకరణలో మార్క్ఫెడ్ విఫలం! వరి రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మొక్కజొన్న (మక్కలు) పండించిన రైతుల గోస వర్ణనాతీతం. రాష్ట్రంలో రబీలో పెరిగిన మక్కజొన్న సాగు నేపథ్యంలో ఈసారి సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతను మార్క్ఫెడ్కు అప్పగించింది. అయితే మక్కల కొనుగోళ్లలో మార్క్ఫెడ్ అపసోపాలు పడుతోంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మార్కెట్కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటివరకు మార్క్ఫెడ్ ఎండీగా ఉన్న శ్రీనివాస్రెడ్డిని ఇటీవలే తప్పించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ను నియమించింది. అయితే కొన్ని జిల్లాల్లో పాతుకుపోయిన మార్క్ఫెడ్ మేనేజర్లు కొనుగోళ్లు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసుల్లో కూర్చొని అవినీతి కార్యకలాపాలు సాగించేందుకు అలవాటు పడిన అధికారులు మక్కల కొనుగోళ్లు చేయలేకపోతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మక్కలు కొనడానికి కనీసం గోనె సంచులు సమకూర్చుకోలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెబుతున్నారు. మార్క్ఫెడ్ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.97 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, అతికష్టంమ్మీద 1.83 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. చాలా చోట్ల సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాగర్కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం ప్రాంతాల్లో కొనుగోళ్ల కోసం రైతులు మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లలో ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంది. తగిన సంఖ్యలో గోదాములు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ప్రైవేటుకు అమ్ముకుంటున్నాను.. 70 క్వింటాళ్ల మక్కలు రూ.1,750 చొప్పున ప్రైవేటుగా అమ్ముకున్నా. ఇంకా 50 కింటాళ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రైవేట్గానే అమ్ముతా. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలారోజుల సమయం పడుతుంది. ఇంటిదగ్గర గొర్లు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లేవారు ఎవరూ లేరు. అందుకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నా. – మల్లేష్, దేశీటికాల, నాగర్ కర్నూల్. మొక్కజొన్న ఎప్పుడు కొంటారో చెప్పడం లేదు.. నేను నాగర్కర్నూల్ మార్కెట్యార్డ్కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చి నెల రోజులు దాటింది. సుమారు 200 క్వింటాళ్ల పంటను అమ్ముకునేందుకు రోజూ మార్కెట్ యార్డుకు వస్తున్నాను. కానీ ఫలితం లేదు. కనీసం ఎప్పుడు కొనుగోలు చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. – సిక్కొండ రాములు, మంతటి, నాగర్ కర్నూల్ మండలం -
‘‘బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి’’
హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా నేతలు బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను కలిశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డీజీపీకి వినతిపత్రం అందించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం ఉండాలంటే.. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: సీపీఎం బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మే 14న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపునిస్తుందని ఆయన తెలిపారు. పోక్సో కేసు నమోదైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని చెప్పారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే సరెండర్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
సిట్కు బండి భగీరథ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: సిట్కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లేఖ రాశారు. ఎల్లుండి(శుక్రవారం) విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్.. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇవాళ(మే 13) హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు...వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదన్న భగీరథ్.. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడువంటూ లేఖలో భగీరథ్ ప్రస్తావించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్కు విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు విచారణకు ఇవాళ బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడైన బండి భగీరథ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి హాజరవుతానంటూ సిట్కు భగీరథ్ లేఖ రాశారుకుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. -
లిఫ్ట్లో చిక్కుకుని తల్లడిల్లిన పసిపాప.. ఊపిరి ఆగిపోయింది..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మహి వుమెన్ పీజీ’లో ఐదేళ్ల చిన్నారిని లిఫ్ట్ బలిదీసుకుంది. ఆడుకుంటూ అమాయకంగా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లోకి వెళ్లిన చిన్నారి బిస్తు సేఫ్ (5) అందులోనే చిక్కుకుపోయింది. ఆ తర్వాత నొప్పితో తల్లడిల్లిపోయింది. ఆ పసిపాప బయటపడలేకపోవడంతో చివరకు ఆమె ఊపిరి ఆగిపోయింది. జార్ఖండ్కు చెందిన బిస్తు సేఫ్ తన తాత, అమ్మమ్మలతో కలిసి ఆ హాస్టల్లో ఉంటోంది. కళ్లముందే ఆ చిన్నారి ప్రాణం పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణాల వ్యవధిలో ఆమె జీవితం ఆగిపోవడం.. కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. పసిపాప నవ్వులతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అమాయక ప్రాణం ఇలా లిఫ్ట్లో ఇరుక్కుపోవడం భద్రతా ప్రమాణాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ప్రతి లిఫ్ట్కి సరైన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం. -
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందిపోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు. -
హనుమకే అరటి దండ దక్కితే!
హైదరాబాద్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని రామాలయాలు, అంజన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. కూకట్పల్లిలో హనుమంతుడిని ప్రత్యేకంగా అరటి పండ్ల దండలతో ఇలా అలంకరించారు. – కూకట్పల్లిఅధికారులే అడ్డంపడితే..!ఆ రహదారులు.. అధి‘కారు’లకు అడ్డాగా మారాయి. ఇతర వాహనదారులకు ఆటంకంగా ఉన్నాయి. గీతానగర్లోని మల్కాజిగిరి సర్కిల్, జోనల్ కార్యాలయాలున్న భవనం ముందున్న రహదారులు పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. – మల్కాజిగిరి గాం«దీలో అగ్గి పుడితే..సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అసిస్టెంట్ డిస్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ భాను ప్రతాప్ నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన ఫైర్సేఫ్టీ అవేర్నెస్, మాక్ ఎవాక్యుయేషన్ డ్రిల్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి, ఫైర్స్టేషన్ ఆఫీసర్లు మహ్మద్ షౌకత్ అలీ, రమే‹Ù, భిక్షపతి పాల్గొన్నారు. – గాం«దీఆస్పత్రి -
మమత ఎక్కడ..? ఇద్దరు పిల్లలతో అదృశ్యం
పటాన్చెరు టౌన్: తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మల్లన్న దేవస్థానం సమీపంలోని ఎండీఆర్ హోమ్స్లో నివాసం ఉండే నాగిరెడ్డి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి భార్య మమత (28), కుమారుడు శివరాం రెడ్డి, కూతురు బృందన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కాగా వారి కోసం తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మరో ఘటనలో..శివ్వంపేట(నర్సాపూర్): తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోమారం గ్రామానికి చెందిన ఎరుకలి మమత, పెంటయ్య దంపతులకు సంసార విషయంలో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి. సోమవారం పెంటయ్య ధాన్యం బస్తాలు తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లగా, భార్య మమత, కూతురు అఖిల కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్కు వెళ్తున్నామని చెప్పి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన పెంటయ్య బంధువులు, స్నేహితుల ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. -
చికెన్ కిలో ధర రూ.400..!
జోగిపేట(అందోల్): కోడి ధర కొండెక్కింది. ఈ నెల 1న కిలో రూ.259గా ఉన్న ధర ఆదివారం రూ.360కి పెరిగింది. పది రోజుల్లోనే కిలోపై రూ.100 పెరగడం గమనార్హం. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. వేసవి కావడంతో ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని, వాటి బరువు కూడా తగ్గిపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలను చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ ధరలు మరో 15 నుంచి 20 రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తగ్గిన ఉత్పత్తి ఎండలకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. అధికంగా కంపెనీల యజమానులే షెడ్లలో కోళ్లను పెంచి, వారు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పొచ్చు. స్కిన్లెస్ కిలో రూ.360కి, లైవ్ కోడి రూ.210, స్కిన్తో రూ. 320కి అమ్ముతున్నారు.పెళ్లిళ్ల సీజన్తో డిమాండ్ పెళ్లిళ్ల సీజన్తో చికెన్కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఎండ త్రీవత కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. డిమాండ్ మేర ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగాయి. రెండు వారాల నుంచి కోళ్ల, చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.360కి విక్రయిస్తున్నాం. ధరలు పెరగడంతో కొంతమేరకు విక్రయాలు తగ్గాయి. – ఎండీ. జావీద్, విక్రయదారుడు, జోగిపేట -
సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్.. ఓనర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు.వివరాల మేరకు.. జవహర్నగర్లోని కౌకుర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ప్ ఎన్క్లేవ్లో దంపతులు చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మీ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడి చేశారు. కాగా, నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే, నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో ముగ్గురు నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం.. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో ఐదుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో, ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) నేపాలీ గ్యాంగ్ స్కెచ్లో భాగంగానేహైదరాబాద్కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతాల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఉంటూనే భారత్లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం దిశగా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఉచిత సేవలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఏటా రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదనపైన దక్షిణమధ్య రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ రైల్వేబోర్డు ఆమోదిస్తే తప్ప తాము ఈ సదుపాయాన్ని కల్పించలేమని, రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేబోర్డు మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరాల్సి ఉంటుందని చెబుతున్నారు. రైల్వే బోర్డుకు సమాచారం లేదు! ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 75 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. 35 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగానే ఉన్నప్పటికీ రైల్వేబోర్డుకు ఇంకా సమాచారం అందజేయలేదు. ఇప్పటికిప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేసినా రైల్వేబోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకొనేందుకు కొంత సమయం పట్టవచ్చు. పైగా ఎంవోయూ కూడా కుదుర్చుకోవలసి ఉంటుంది. జూన్ 2 లోపు ఇదంతా సాధ్యం కాకపోవచ్చుననిపిస్తోంది..’అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పైగా ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్రం నుంచి రావలసిన రూ.460 కోట్లకు పైగా బకాయీలపైనా స్పష్టత రావలసి ఉందని ఆయన అన్నారు. రెండోదశ నిధులే ఇవ్వలేదు..! హైదరాబాద్లో లోకల్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును 2003లో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/3 వంతు చొప్పున భరించాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 2013లో ఇదే ఒప్పందం ఆధారంగా రెండోదశను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తిగా చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే సొంతంగా పూర్తి చేయవలసి వచ్చింది. ప్రస్తుతం ఘటకేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టిన యాదాద్రి ఎంఎంటీఎస్ పనులను కూడా దక్షిణ మధ్య రైల్వే సొంత నిధులతో చేపట్టింది. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెరపైకి తేవడంతో..ఇప్పటివరకు రెండో దశ నిధులను చెల్లించకపోవడాన్ని రైల్వే అధికారులు ప్రధానంగా ఎత్తిచూపుతున్నారు. సమయ పాలన మెరుగుపరచాలి ఎంఎంటీఎస్ రైళ్లలో సమయ పాలన మెరుగుపడి, సర్వీసులు పెంచితేనే ప్రయాణికులకు ఉచిత సదుపాయం సద్వినియోగమవుతుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ (హుమ్టా) అధికారులు భావిస్తున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు చొప్పున అందుబాటులో ఉండాలని, అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లకు సిటీబస్ కనెక్టివిటీ కల్పించాలని సూచిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్ సేవలను సమన్వయం చేయడంపై సంస్థ ప్రణాళికలను రూపొందించింది. -
తెలంగాణకు 23 ఆంధ్రప్రదేశ్కు 10 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో కనీస నిల్వమట్టానికి (ఎండీడీఎల్) ఎగువన మిగిలి ఉన్న 5.27 టీఎంసీల జలాలను పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. నాగార్జునసాగర్ జలాశయంలో ఎండీడీఎల్కి ఎగువన 28.21 టీఎంసీల నిల్వలు మిగిలి ఉండగా, ఏపీ తాగునీటి అవసరాలకు కుడి కాల్వ ద్వారా 10 టీఎంసీలను విడుదల చేయాలని నిర్ణయించింది. మిగిలిన 18.21 టీఎంసీలను సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 23.48 టీఎంసీల జలాలను త్రిసభ్య కమిటీ కేటాయించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. వేసవి తాగునీటి అసవరాల కోసం ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులపై ఈ భేటీలో చర్చించారు. వేసవి అవసరాలకు విన్నపాలు: మే 31 నాటికి ఉండనున్న తమ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు 10 టీఎంసీల జలాలను విడుదల చేయాలని గతంలో కృష్ణా బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 13 టీఎంసీలు.. మొత్తంగా 18 టీఎంసీల జలాలను జూలై చివరి నాటికి వాడుకుంటామని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కాగా ఏపీ విజ్ఞప్తిపై మంగళవారం నాటి భేటీలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 1112.66 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యతలోకి ఉండగా, ఏపీ ఇప్పటికే ఏకంగా 771.25 టీఎంసీలు (74.23శాతం) వాడుకుందని కమిటీ దృష్టికి తెచ్చింది. అయితే వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ పరస్పరం సహకరించుకోవాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సూచించడంతో ఈ మేరకు కేటాయింపులకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. -
4 కోట్లు వసూలు చేసి రూ. కోటి ఇవ్వండి
బంజారాహిల్స్: మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సుమారు నాలుగుకోట్ల రూపాయలు వసూలు చేసి, రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోవాలని నిందితులకు యువతి ఆఫర్ చేసింది. అయితే చివరికి ఆ ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు ఈ కేసును ఛేదించి యువతితోపాటు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంకు చెందిన పాయం మౌనిక(25) హైదరాబాద్లో నర్సు గా పనిచేస్తోంది. ఆమెకు హయత్నగర్కు చెందిన మోకురాల నిఖిల్(26)తో ఓ పబ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 9 నెలల సహజీవనం అనంతరం తనను మోసం చేశాడంటూ నిఖిల్పై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. నిఖిల్పై కేసు నమోదు కాగా, బెయిల్పై విడుదలయ్యాడు. నిఖిల్ వద్ద రూ.9 కోట్లు ఉన్నాయని, అందులో సగం వసూలు చేసి రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోండని పరిచయస్తులైన రౌడీషీటర్లకు ఆమె ఆశ చూపింది. నిఖిల్తోపాటు అతడి స్నేహితులు మహేశ్, సాయిశ్రీకాంత్లను కిడ్నాప్ చేయించి రూ.రూ.13.60 లక్షలు వసూలు చేసింది. సాయిశ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనికతోపాటు అంబర్పేట రౌడీషీటర్ అన్వర్ఖాన్(60), కాప్రాకు చెందిన సుంకరి ప్రసాద్రెడ్డి(56), జవహర్నగర్కు చెందిన మారెనేని రాజు(48), ఖమ్మంకు చెందిన కనకం సుధీర్, పోల్కంపల్లి నాగరాజు, అల్వాల్కు చెందిన జాన్లను పట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన కనకం మహేశ్, బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన చందు పరారీలో ఉన్నారు. ● మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో నిందితులకు యువతి ఆఫర్ ● ప్రధాన నిందితురాలు సహా ఏడుగురి అరెస్టు.. పరారీలో ఇద్దరు -
సీఎం సార్.. థ్యాంక్స్
● రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ అభ్యర్థుల క్షీరాభిషేకం లక్డికాపూల్: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులు 1,175 మందిని ఉపాధ్యాయులుగా నియమించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్కు 2008 డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికల పోస్టింగ్ మార్చాలని సీఎం ప్రజావాణి ఇన్చార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీఎం ప్రజావాణికి 393 దరఖాస్తులు లక్డీకాపూల్: మహా త్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన 221వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 393 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 190, రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇందిరమ్మ ఇండ్ల కోసం 97, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహామండలి చైర్మన్ బీఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయండి
● నిషేధిత భూముల రిజిస్ట్రేషన్పై మంత్రి సీరియస్ ● జూన్ నాటికి జవహర్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లుఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులకు పొంగులేటి ఆదేశంసాక్షి, సిటీబ్యూరో: అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంబంధిత సబ్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ భూముల్లో సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న వడ్డెర కులస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి స్పందించారు. ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. మంగళవారం హిమాయత్నగర్లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి అధ్యక్షతన వహించి మాట్లాడారు. జవహర్నగర్లో 6,399 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాల పేదలకు లాటరీ విధానంలో కేటాయించాలని అధికారులకు సూచించారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే అవకాశం ఉండగా కేవలం 1,622 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, ఆరికపూడి గాంధీ, వి.పి.గౌతమ్, కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. -
సంపులో పడి బాలిక మృతి
అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యుల ఆందోళనమియాపూర్: అపార్ట్మెంట్ నీటి సంపులో పడి ఓ బాలిక మృతి చెందింది. అయితే కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం మద్దిరాళ్ల తండాకు చెందిన గుగులోత్ చరణ్, రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వలస వచ్చి మియాపూర్లోని గోకుల్ ఫ్లాట్స్లో చరణ్ కొంతకాలంగా వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. ఎనిమిది రోజుల క్రితం శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వాచ్మేన్గా చేరాడు. అతడి రెండో కూతురు సారా(13) స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో బోర్ మోటార్ ఆన్ చేయాలని సారాకు చెప్పి చరణ్ బయటకు వెళ్లాడు. 8 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంట్లో సారా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అనుమానంతో సంపు మూత తీసి చూడగా సారా అందులో పడి ఉంది. వెంటనే బాలికను నిజాంపేట్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంపును పరిశీలించారు. సంపు నిండిందా అని చూసేందుకు సారా వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన ... సారా మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు, బంధువులు శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రమాదవశాత్తు బాలిక సంపులో పడిపోతే గాయాలయ్యే అవకాశం ఉందని, కానీ బాలిక శరీరంపై అలాంటివేవీ లేవని పేర్కొన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉన్నా ఫుటేజీని తమకు చూపడంలేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
బంధువే దొంగ
24 గంటల్లో చోరీ కేసును ఛే దించిన పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోవడంతో పక్కదారి అబిడ్స్: గోషామహాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని షాహినాయత్గంజ్ ముల్తానిపురాలో చోరీ కేసులో బంధువే దొంగ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనను 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి దొంగను అరెస్టు చేశారు. దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని, ఇతర సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గోషామహాల్ పోలీస్స్టేషన్లో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్ తన కుటుంబసభ్యులతో కలిసి ఐదురోజులుగా ఇంటికి తాళాలు వేసి బంధువుల పెండ్లి సన్నాహాలకు వెళ్తున్న విషయాన్ని మేనల్లుడు దొంతుల రాజేష్ కనిపెట్టాడు. రాజేశ్ కొంతకాలంగా కిరాణాషాప్ నిర్వహిస్తూ, ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటై నష్టాలకు గురయ్యాడు. ముల్తానిపురాలోనే మహేష్ ఇంటి సమీపంలో నివసిస్తున్న రాజేష్ ఆదివారం రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్తో తాళాలు తీసి లోపలికి వెళ్లిన మహేష్ బీరువాలోని దాదాపు 30 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, కిలోన్నరకుపైగా వెండి సామగ్రి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రిని దొంగిలించి దర్జాగా ఇంటికి వెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఒక సంచిలో పెట్టి లోపలి గదిలో దాచిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా రోజుమాదిరిగా ఆటో నడపడానికి వెళ్లాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్కు తెలిసినవారు, బంధువులే దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానించి సమీపంలోని రాజేష్ ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చిన అతడిని పోలీసులు ప్రశ్నించగా తడబడ్డాడు. పోలీసులు గట్టిగా నిలదీయడంతో దొంగతనం చేసినట్లు రాజేష్ ఒప్పుకున్నాడు. ఇంట్లో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు, వెండి, నగదును పోలీసులకు అప్పగించాడు. రాజేష్ను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గోషామహాల్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్, ఎస్ఐ అజిత్ దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాన్ని ఛేదించిన పోలీసులకు, ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్లకు డీసీపీ రివార్డ్స్ అందజేసి ప్రశంసించారు. -
ప్రజారోగ్య పరిరక్షణలో నర్సులే కీలకం
● అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాంపల్లి: ప్రజారోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర కీలకమని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోగులకు వైద్యసేవలతోపాటు మనోధైర్యాన్ని ఇస్తూ మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని కొనియాడారు. 1,500 మంది అవుట్ పేషంట్స్, 2 వేల మంది ఇన్ పేషంట్స్ ఉన్న ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఎక్కడా అలసిపోకుండా సేవలు అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం పలువురు నర్సులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్ఓ వెంకట్, నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్కుమార్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
కంపోస్ట్ తయారీపై అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కింద 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ, ఎంఎంసీల్లో రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సులు నిర్వహించారు. గృహస్థాయిలో కంపోస్టింగ్ను ప్రోత్సహించడం తద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ము ఖ్యోద్దేశమని సంబంధిత యూబీడీ విభాగం అధికారులు పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల విభజన, కంపోస్ట్ బిన్ల వాడకం, నిర్వహణ పద్ధతులు, కంపోస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు హాజరైన వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. తమ కాలనీలోకంపోస్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. విజయనగర్ కాలనీ: పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. మాసబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 11 నుంచి 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. ● బండి భగరీథ్ను అరెస్టు చేయాలి ● బీఆర్ఎస్ మహిళా నేతల డిమాండ్ వెంగళరావునగర్: ఎప్పుడూ న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో ఎందుకు కొడుక్కి వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ మహిళా సంఘం నేతలు ప్రశ్నించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంజయ్ కుమారుడు భగీరథపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంగళవారం బీఆర్ఎస్కు చెందిన మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, చారులత, జూబ్లీహిల్స్ ఇన్చార్జి మాగంటి సునీత, తదితరులు డిమాండ్ చేశారు. మంగళవారం మధురానగర్లోని తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భగీఽరథ్పై పోక్సో కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధిత బాలికకు న్యాయం చేయాలని, చట్టం ముందు అందరూ సమానులనే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 16 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ రెగ్యులర్ కోర్సుల 4, 6 సెమిస్టర్ పరీక్షలతోపాటు 1 నుంచి 6 వరకు బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
ఎన్టీఏను రద్దు చేయాలని ఆందోళన
● విద్యానగర్ సర్కిల్లో బైఠాయించిన విద్యార్థి జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దు చేయాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సంతలో సరుకులాగా ప్రశ్నపత్రాలను విక్రయించడం వల్ల దిక్కుతోచనిస్థితిలో 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యానగర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి మోదీ వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైద్యవిద్య పరీక్షలను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నందగోపాల్, సాయి, సతీష్, ప్రవీణ్, రాజశంకర్, హరిశంకర్, వినయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల జలధిలో..
రాబడి కంటే వ్యయం రెండింతలు సాక్షి, సిటీబ్యూరో జలమండలి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నీళ్ల లోతు కష్టాలతో మునిగిపోయింది. మహా నగరానికి తాగునీటి సరఫరా, మురుగు నీటి సేవలు అందిస్తున్న జలమండలి తీవ్రమైన ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ఖర్చుకు, రాబడికి పొంతన లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి నెలా రూ.వందల కోట్ల నష్టంతో కాలం వెళ్లదీస్తున్న బోర్డు.. అప్పుల ఊబిలోంచి ఎలా బయట పడుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. జలమండలికి లభిస్తున్న ఆదాయం , చేస్తున్న ఖర్చుకు మధ్య రెండింతలు వ్యత్యాసం కనిపిస్తోంది. తాగునీటి సరఫరా, సీవరేజీ ఛార్జీలు, వాటర్ ట్యాంకర్ల ద్వారా నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం వస్తుండగా.. నిర్వహణ వ్యయం మాత్రం రూ. 306 కోట్లు దాటుతోంది. అంటే నెలకు రూ.174 కోట్ల లోటు కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి కేవలం నిర్వహణ రూపంలోనే దాదాపు రూ.2,088 కోట్ల భారీ నష్టాన్ని సంస్థ చవిచూస్తోంది. విద్యుత్ చార్జీల మోత.. నగరాభివద్ధిలో కీలకంగా ఉన్న జలమండలికి విద్యుత్ చార్జీలు పెనుభారంగా మారాయి. కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి పంపింగ్ చేయడానికి నెలకు సుమారు రూ.190 కోట్ల వరకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సంస్థకు వచ్చే మొత్తం ఆదాయం (రూ. 132 కోట్లు) కంటే, కరెంట్ బిల్లులే రూ. 58 కోట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం విద్యుత్ బకాయిలే కొండలా పేరుకుపోతున్నాయి. వడ్డీలు తడిసి మోపెడు తాగునీటి పథకాలు, సీవరేజీ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న, తీసుకుంటున్న రుణాలు ఇప్పుడు జలమండలి మెడకు ఉరితాళ్లుగా మారాయి. అసలు కంటే వడ్డీలే భారీగా పెరిగిపోతున్నాయి. ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందక.. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రుణాల చెల్లింపులే సంస్థను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఉచిత సబ్సిడీ అరకొర నగర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రవేశపెట్టిన నెలకు 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా పథకం జలమండలిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాంది. ఇటీవల బడ్జెట్లోఉచిత నీటి పథకం బకాయిలు, నిర్వహణ కోసం బోర్డు రూ. 849.63 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరమైన దానిలో 40 శాతం కంటే తక్కువ నిధులు కేటాయించడంతో, మిగిలిన రూ. 550 కోట్ల భారాన్ని సంస్థ తన సొంత వనరుల నుంచే భరించాల్సి వస్తోంది.కేటాయింపుల ఆశలపై నీళ్లు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో జలమండలికి తీవ్ర నిరాశే ఎదురైంది. రుణాల చెల్లింపు, పెండింగ్లో ఉన్న అభివద్ధి పనుల కోసం బోర్డు రూ. 8,533 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 3,305 కోట్లు మాత్రమే కేటాయించింది. అడిగిన దాంట్లో సగం కూడా ఇవ్వకపోవడంతో ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. నిధుల కొరత వల్ల కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడం గగనంగా మారింది. రుణాలతోనే అభివృద్ధి పనులు భారంగా 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా తలకు మించిన భారంగా విద్యుత్ చార్జీలు నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం నిర్వహణ వ్యయం రూ. 306 కోట్లు నెలకు రూ.174 కోట్ల లోటు రూ.2,088 కోట్ల భారీ నష్టం నీళ్లలోతు కష్టాల్లో జలమండలి -
ప్రాణాలు తీసిన ఓవర్టేక్
● ముందువెళ్తున్న లారీని ఢీకొన్న బైక్ ● ఇద్దరు యువకుల మృత్యువాత సనత్నగర్: ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సనత్నగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు చెందిన సందీప్ (26) నగరంలోని మహేంద్రహిల్స్లో, ఇతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌశిక్ (24) రామంతాపూర్లో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్లో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు కోసం బైక్పై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తున్నారు. కౌశిక్ బైక్ నడుపుతుండగా సందీప్ వెనక కూర్చున్నాడు. భరత్నగర్ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ముందు వెళ్తున్న లారీలను అతివేగంగా ఓవర్ టేక్ చేయబోవడంతో ప్రమాదం జరిగింది. లారీని ఢీకొనడంతో బైక్తో సహా ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్కౌశిక్ -
సైబర్ నేరగాళ్లకు సింహస్వప్నమే
మల్కాజిగిరిలో సైబర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ● విధివిధానాలపై కసరత్తు ● సమగ్ర సమాచార సేకరణ, కార్యకలాపాల నిర్వహణ కదలికలపై నిరంతర నిఘా సైబర్ నేరాలు, మోసాలు చేసి తప్పించుకోలేమన్న భయం కలిగిచడమే లక్ష్యంగా సీసీఐయూ కార్యకలాపాలు సాగిస్తుందని ఓ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి చెప్పారు. సైబర్ నేరస్తుల కదలికలు, నెట్వర్క్పై నిఘా పెట్టడం, ఆన్లైన్లో సైబర్ నేరస్తుల మూలాలను ట్రాక్ చేయడం, ఆర్థిక లావాదేవీలను ఛేదించడం, ఇతర అంతర్గత భద్రతా అంశాలపై కన్నేసి ఉంచుతారు. క్షేత్ర స్థాయిలో అజ్ఞాత వ్యక్తుల నెట్వర్క్లను ఛేదిస్తారు. కేసుల నమోదు నుంచి విచారణ, దర్యాప్తు విశ్లేషణ, అభియోగ పత్రాల దాఖలు వరకూ ప్రతి అంశంలోనూ సమర్థంగా ఉంటుంది. సమగ్ర సమాచారం సేకరణ, లోతైన విశ్లేషణ ఉంటుంది. బ్యాంక్లు, ఆర్ధిక సంస్థలు, టెలికం, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఒకచోట చేర్చి, ఆర్థిక మోసాలపై తక్షణ చర్యలను సులభతరం చేస్తుంది. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ డేటా పంచుకోవడానికి, విశ్లేషణలోనూ సీసీఐయూ కీలక పాత్ర పోషిస్తుంది. సాక్షి, సిటీబ్యూరో: సమాజానికి సైబర్ నేరాలు పెను ముప్పుగా మారాయి. రోజుకో కొత్త రకం మోసాలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి భరతం పట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్లో సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీసీఐయూ) ఏర్పాటు కానుంది. ఈ మేరకు విధి విధానాలు, మార్గదర్శకాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వామపక్ష, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఏర్పాటైన స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) తరహాలోనే.. సీసీఐయూ కార్యకలాపాలు సాగించనుంది. -
నిధులెత్తని మూసీ..
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవం పనులకు ప్రభుత్వం మూడేళ్లలో ప్రతి బడ్జెట్లో రూ.1,500 కోట్ల చొప్పున రూ.4,500 కోట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు రూ.392 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ సుందరీకరణలో ఫేజ్–1 అభివృద్ధి పనులకు రూ.5,812.4 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 2024–25 రాష్ట్ర బడ్జెట్లో మూసీ ప్రాజెక్ట్కు ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.11.25 కోట్లు, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లకు.. రూ.6.21 కోట్ల నిధులను మాత్రమే వినియోగించారు. 2026–27 బడ్జెట్లో రూ.1,500 కోట్లను కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.375 కోట్లను విడుదల చేశారు. భూ సేకరణ ముమ్మరం.. ఫేజ్–1లో 21 కి.మీ. మేర మూసీ సుందరీకరణ చేపటనున్నారు. హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ., ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ. ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీంతో ఆయా మార్గాల లో భూ సేకరణ కార్యకలాపాలను ఎంఆర్డీసీఎల్ అధికారులు ముమ్మరం చేశారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్, గాంధీ సరోవర్ ప్రాంతాలలో బఫర్ జోన్లలోని పలువురు భూ యజమానులకు, సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ● ఇప్పటికే గండిపేట మండలంలోని హిమాయత్సాగర్, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట, బుద్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వాలంతరీ), ఎస్సీ/ఎస్టీ స్టడీ సర్కిల్ వంటి సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 734 ఎకరాల భూములను మూసీ ప్రాజెక్ట్కు బదిలీ చేశారు. కాగా.. మూసీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ఇంకా పూర్తి కాలేదు. అందుకే నిధుల కేటాయింపులు, వినియోగం ఆశించిన స్థాయి లో లేదని ఎంఆర్డీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పునరుజ్జీవానికి అరకొర కేటాయింపులు తొలి దశ పనుల అంచనా రూ.5,812 కోట్లు ఇప్పటికి విడుదలైంది రూ.392 కోట్లే -
సీఎం మెప్పు పొందేదెవరో?
వచ్చే నెలతో ముగియనున్న నిమ్స్ డైరెక్టర్ పదవీకాలం ● భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ● ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం సాక్షి, సిటీబ్యూరో: వైద్యరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పదవికి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. 2023 జూన్లో నిమ్స్ డైరెక్టర్గా పదవీబాధ్యతలు చేపట్టిన నగరి బీరప్ప మూడేళ్ల పదవీకాలం మరో నెలరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా నిమ్స్లోని ముగ్గురు సీనియర్ వైద్యుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో కొన్ని కీలక విభాగాల అధిపతులు కూడా డైరెక్టర్ పోస్టు రేసులో ఉన్నామంటున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు సైతం మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైద్యం, పరిపాలనాపరంగా అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ గౌరవం లభిస్తుంది. నిమ్స్ పాలక మండలి అధ్యక్షుడిగా వ్యవహరించే సీఎం ఆదేశాల మేరకే డైరెక్టర్ నియామకం ఉంటుంది. ఎంపిక విధానం ఎలా? నిమ్స్ డైరెక్టర్ పదవీ కాలం ముగిసే సమయానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో సీనియర్ వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు ఉంటారు. డైరెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దరఖాస్తుదారులు కనీసం 25 ఏళ్లు వృత్తిపరమైన అనుభవం, పదేళ్లకుపైగా టీచింగ్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసి, పరిపాలనా అనుభవం ఉండాలి. దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించి, ప్రతిభావంతులైనవారిలో మూడు నుంచి ఐదు మంది పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో ఒకరిని సీఎం డైరెక్టర్గా ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో విడులవుతుంది. ఎంపికై న వ్యక్తి మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. -
ఎన్టీఏకి ఇది 'కామన్'!
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరిన తొలి రోజు నుంచే నీట్లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్లో అడుగుపెట్టాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. కానీ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో 22.79 లక్షలమంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. నీట్ యూజీ మాత్రమే కాకుండా ఇతర పరీక్షల విషయంలోనూ ఎన్టీఏ నిర్వహణ లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ల నిర్వహణలో ఎన్టీఏ వైఫల్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తు న్నాయి. రాజస్తాన్లోని సికార్ ప్రాంతంలో పేపర్ లీకైనట్లు, 600 మార్కులకు సరితూగే 120కి పైగా ప్రశ్నలు పరీక్షకు రెండు రోజుల ముందుగానే పలు కోచింగ్ సెంటర్లలో ప్రాక్టీస్ పేపర్ పేరిట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమే అని, పేపర్ లీక్ కాలేదని తొలుత ప్రకటించిన ఎన్టీఏ.. కేవలం కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని నీట్–2026 పరీక్షను రద్దు చేసింది. పరీక్ష కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ చెప్పింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ ప్రశ్నపత్రం లీక్ కావడం ఎన్టీఏ వైఫల్యానికి పరాకాష్ట అని వైద్య కళాశాలల ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిపోయి, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు లేవా? ఎన్టీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రశ్నపత్రం లీకైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రశ్నపత్రాలను రూపొందించి పరీక్ష కేంద్రాలకు పంపించే ఎన్టీఏ వాటి పంపిణీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. పటిష్ట భద్రతతో పేపర్లను సెంటర్లకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదని, దీంతో ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షణ అధికారుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఏ నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలికి నీట్ యూజీ–2024ని కూడా విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. ఆ ఏడాది నీట్ యూజీ నిర్వహణ సమయంలో బిహార్ రాజధాని పట్నాలో పేపర్ లీకైందని, సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాలను ముందుగానే అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ పట్నా సెంటర్ నుంచి పరీక్షకు హాజరైన 67 మంది అభ్యర్థులకు 720 మార్కులకుగాను 720 మార్కులు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, సదరు పరీక్ష సెంటర్లో నిర్వహణ పరమైన ఇబ్బందుల కారణంగా విద్యార్థులకు సమయాభావం ఏర్పడిందని, దీంతో వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడంతో ఆ స్థాయిలో మార్కులు వచ్చాయని చెప్పింది. అయితే, దీనిపై సీబీఐ విచారణ జరిపి పేపర్ లీక్ వాస్తవమని తేల్చింది. కేవలం ఒక సెంటర్లో లీకైందనే కారణంతో లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లో పెట్టబోమని, పేపర్ లీకైన సెంటర్లలోని 1,563 మందికి మాత్రమే పరీక్ష రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలని నాడు కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. విద్యా సంవత్సరంపై ప్రభావం నీట్ పరీక్ష రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు? పేపర్ ఎలా ఉంటుంది? అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పరీక్షకు హాజరైన విద్యార్థులు మళ్లీ అదే పరీక్షకు హాజరు కావాలంటే మానసికంగా అలసటకు గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ రద్దు, పునర్నిర్వహణ కారణంగా వచ్చే విద్యా సంవత్సరంపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. నీట్ పునర్నిర్వహణకు ఎన్టీఏకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత ఫలితాల విడుదలకు మరో పది, పదిహేను రోజులు.. మొత్తంగా 40 రోజులు పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే జూన్ మూడో వారానికి గానీ నీట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఇదే జరిగితే నీట్ ఆధారంగా నిర్వహించే మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం అవడం ఖాయం. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం కూడా జాప్యమవుతుంది. ఇతర కోర్సుల ప్రవేశాలకు సందిగ్ధత: నీట్ పునర్నిర్వహణ వల్ల విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాల విషయంలోనూ సందిగ్ధత నెలకొనే ప్రమాదం ఉంది. నీట్లో సరైన ఫలితం రాకుంటే బైపీసీ అర్హతతో డిగ్రీ లేదా ఇతర కోర్సులవైపు విద్యార్థులు దృష్టి సారిస్తారు. అయితే డిగ్రీ ప్రవేశాల విషయంలో ఇప్పటికే తెలంగాణలో ‘దోస్త్’షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 20 కల్లా మూడు దశల కౌన్సెలింగ్ పూర్తయి జూలై 1 నుంచి క్లాస్లు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఏపీలోనూ జూలై రెండో వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో నీట్ ఫలితాలు ఆలస్యమైతే అందులో నిరాశకు గురైన విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా బైపీసీ అర్హతతో ఎప్సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు నిర్వహించే అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సుల షెడ్యూల్ కోణంలోనూ గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు 2024లో నీట్ లీకేజ్ నేపథ్యంలో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన చర్యలపై నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అదే సంవత్సరం అక్టోబర్లో నీట్ యూజీ నిర్వహణ తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ.. నీట్ యూజీని ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా లేదా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సిఫార్సు చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ సహా ఇతర నెట్వర్క్ సదుపాయాలు లేవనే కారణంతో దీన్ని అమలు చేయలేదు. అయితే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తే ప్రశ్నపత్రాల లీకేజ్కు ఆస్కారం ఉండదని, విద్యార్థులు తాము పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నలను చూసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇతర పరీక్షల్లోనూ ఎన్టీఏ లోపాలు ⇒ నీట్ యూజీ–2024 ప్రశ్నపత్రం బిహార్ రాజధాని పట్నాలో లీకైంది. దీంతో పేపర్ లీకైన కేంద్రంలో పరీక్షను మళ్లీ నిర్వహించారు. ⇒ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జేఆర్ఎఫ్లకు అర్హతగా నిర్వహించే యూజీసీ నెట్–2024 పరీక్ష కూడా పేపర్ లీక్ కారణంగా 2024 జూన్ 18న పరీక్ష జరిగిన మరుసటి రోజు రద్దు చేశారు. ⇒ సీఎస్ఐఆర్– యూజీసీ–నెట్– 2024ను కూడా పేపర్ లీకైందనే ఆందోళన నేపథ్యంలో రీషెడ్యూల్ చేసి నిర్వహించారు. ⇒ టీచింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎన్సీఈటీ–2024ను నిర్వహణ పరమైన లోపాలతో నెలపాటు వాయిదా వేశారు. ⇒ జేఈఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్లో.. సరైన ప్రశ్నలు రూపొందించని కారణంతో 12 ప్రశ్నలు తొలగించారు. జేఈఈ – మెయిన్ 2025లో సైతం 19 ప్రశ్నలను తొలగించారు. ⇒ ఇలా 2018లో ఎన్టీఏ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 పరీక్షలను వాయిదా వేయగా.. పలు పరీక్షల విషయంలో ప్రశ్నల రూపకల్పనలో పొరపాట్లు చేయడంతో లక్షల మంది విద్యార్థులు ప్రతికూల ప్రభావానికి గురయ్యారు. 2024లో ఎన్టీఏ డీజీపై వేటు 2024లో కొన్ని సెంటర్లలో నీట్ పేపర్ లీకేజ్, యూజీసీ నెట్ లీకేజ్లకు బాధ్యులుగా.. అప్పుడు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ను తొలగించారు. ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించారు. అయినప్పటికీ ఆశించిన మార్పులు లేకపోవడంతో తాజాగా ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ను నియమించారు. ఇలా అధికారుల స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో నిర్వహణ వరకు పలు లోటుపాట్లు ఎన్టీఏలో జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తీవ్ర ఒత్తిడి ఉంటుంది నీట్ యూజీ పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒకసారి చదివిన అంశాలే అయినప్పటికీ.. పరీక్ష క్లిష్టత, పోటీ వంటి కారణాలతో ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా నీట్లో అవకాశం చేజారితే దృష్టి సారించాల్సిన ముఖ్య ప్రత్యామ్నాయ కోర్సులైన అగ్రి బీఎస్సీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ కోణంలోనూ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నీట్ను ఆన్లైన్లో నిర్వహించడం శ్రేయస్కరం. –ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. రేవంత్రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వంద శాతం తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, పార్టీ నేతలు ఇంటికి పరిమితం కాకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో జనంతో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. మంగళవా రం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్ష తన పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్రావుతో పాటు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 7 గంటల పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం భేటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతల పనితీరును గమనిస్తున్నాం ‘క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరును నిశితంగా గమనిస్తున్నాం. పనిచేయని వారిని పక్కన పెడతాం. ప్రజా సమస్యలపై స్పందిస్తూ కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి. సీఎం రేవంత్ గుజరాత్ మోడల్ను పదే పదే వల్లె వేస్తున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గుజరాత్ మోడల్ను మించి ఫలితాలు సాధించాం. జాతీయ స్థాయిలో అనేక సూచీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రభుత్వానికి నిధుల సమీకరణ, వనరుల వినియోగం వంటి అంశాలపై ఏ మాత్రం అవగాహన లేదు. పాలన చేతకాక కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతోంది..’ అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి సమన్వయకర్త రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణ వంటి అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా మాట్లాడినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆయా అంశాలపై నేతల అభిప్రాయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ పద్ధతిలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ పద్ధతిలోనే జరపాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ నమోదు సమన్వయకర్తను నియమించాలి. కార్యకర్తలకు శిక్షణ అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహిచేందుకు ‘సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండుమూడు రోజుల్లో నియమించాలి. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేస్తున్నందున రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్లకు బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగుతాయి..’ అని కేసీఆర్ తెలిపారు. సభ్యత నమోదు కోసం ఇన్చార్జిలను ప్రకటించారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. -
కలెక్టర్లపైనా చర్యలకు వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి ‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు నివేదికలు పంపాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ ‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల ప్రతి ఐకేపీ సెంటర్కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
6 గంటలు చర్చించిన కేసీఆర్.. కీలక నిర్ణయాలు
ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని అనుకుంటుండడంతో రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్ లలో, బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని, ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించిన ఇన్చార్జిల వివరాలుఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శిజగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శిజనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శిమెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు- గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శినిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శిఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు- రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శివికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యేమహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రిగద్వాల్,నాగర్కర్నూల్,వనపర్తి జిల్లాలు— మెట్టు శ్రీనివాస్, కార్యదర్శిమేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్హైదరాబాద్ జిల్లా— తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యేనల్గొండ, సూర్యాపేట జిల్లాలు — ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి -
బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
పట్టపగలే పంజాగుట్టలో రూ.15లక్షల మాయం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ మాయమైంది. నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్కు వచ్చిన ఆఫ్షద్ అనే వ్యక్తి.. గణేష్ స్టాంప్స్ అండ్కో వద్ద ఆగి బ్యాగ్ను కుర్చీలో పెట్టారు. రూ.15 లక్షలు నగదు ఉన్న బ్యాగ్ను క్షణాల్లో చోరీచేశారు. బాధితుడు పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీపీఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
రూ.500కే.. జైలు యోగం!
చంచల్గూడ (హైదరాబాద్): సాధారణంగా జైలుకెళ్లాలంటే ఏదో ఒక నేరం చేయాలి.. పోలీసులు అరెస్ట్ చేయాలి.. కోర్టు రిమాండ్ విధించాలి.. ఇదంతా పాత పద్ధతి. అసలు సిసలైన ‘ఖైదీ’ఫీలింగ్ కోసం ఇకపై అలాంటి కష్టాలేమీ పడక్కర్లేదు. కేవలం ఐదు వందల రూపాయలు జేబులో ఉంటే చాలు, చంచల్గూడ జైలు గేట్లు మీ కోసం గౌరవంగా తెరుచుకుంటాయి!.. మీరు చదివింది నిజమే. తెలంగాణ జైళ్ల శాఖ ఆలోచనతో చంచల్గూడలోని శిక్షణ సంస్థ (సీకా) ప్రాంగణంలో సరికొత్త ‘జైలు మ్యూజియం’కొలువుదీరింది. మంగళవారం ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనికి రిబ్బన్ కట్ చేయగానే, పర్యాటకులు క్యూ కట్టేయొచ్చు.రూ.500 టికెట్ కొంటే,ఒక్క రోజంతా జైలు వాతావరణాన్నిఅనుభవించవచ్చు. కేసుల భయం లేదు, బెయిల్ కోసం తిప్పలు లేవు!పాత కాలపు శిక్షలు ఎలా ఉండేవి?జైలు విధానాలు ఏంటన్నవిపెయింటింగ్స్ రూపంలో చూపిస్తూ మనల్ని భయపెడతారు. నేను జైలు చూశానని కాలర్ఎగరేయడానికి ఇదో సువర్ణావకాశం. -
1 నుంచి ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమరి్పంచారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. -
ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్మన్కు సమాచారం ఇచి్చంది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేసుకుందామనుకున్నా.. నా మరదలినే ప్రేమిస్తావా..!
హైదరాబాద్: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్నగర్లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిïÙటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
బీన్స్ @ రూ.145
సనత్నగర్: బీన్స్ ధర ౖపైపెకి ఎగబాకింది. రైతుబజార్లోనే కిలో బీన్స్ రూ.145 ఉండగా, బహిరంగ మార్కెట్లో 180–200 వరకు పలుకుతోంది. వెజ్ బిర్యానీలో ప్రధాన ముడిసరుకుగా ఉపయోగించే బీన్స్ ధర అమాంతం పెరగడంతో అటు హోటళ్ల యజమానులు, ఇటు గృహ నివాసితులు కొనాలంటే ఒకింత ఆలోచనలో పడుతున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు బీన్స్ ధరను భారీగా పెంచేశారు. వారం క్రితం రైతుబజార్లో రూ.60–70లుగా ఉన్న బీన్స్ ధర ఒక్కసారిగా రూ.115కు పెరిగింది. సోమవారం నాటికి రూ.145కు చేరింది. పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో బీన్స్ ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
వేర్వేరుచోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ● కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్మన్కు సమాచారం ఇచ్చింది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. ● విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రధాని మోదీ సూచనలు పాటించాలి: ఎంపీ ఈటల
కంటోన్మెంట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా ధోరణికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన సోమవారం కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు భానుక నర్మదతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగిన ప్రధాన మంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారని అన్నారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని తమతో కలవాలంటూ మోదీ పిలుపునివ్వడాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈటల అన్నారు. ఈ పిలుపుతో బీజేపీలో నాయకత్వ లేమి ఉందని చెప్పడం సరికాదన్నారు. -
ముఠా కట్టి.. హవాలా బాట పట్టి..
నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టివేత ● ఏడుగురి అరెస్ట్ గచ్చిబౌలి: కూకట్పల్లి ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 4 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సోలాపూర్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మనీషా పడ్వాల్ మరింత గంజాయి కోసం అదే ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ప్రతాప్ హరిదాస్ పవార్(24)ను సంప్రదించింది. ఒడిశాకు చెందిన ట్రిబుని వద్ద గంజాయి ఉందని తెలుసుకున్న ప్రతాప్ డీసీఎం యజమాని ఆనంద్యప్ప హోవల్(34), డ్రైవర్లు చందన్షిప్వే అబుంబర్(46), రంజిత్ రాజేందర్ గడాగే(27)లు ఒడిశాలోని మల్కన్గిరికి ఈ నెల 8న బయలుదేరారు. డీసీఎం వ్యాన్కు ఎస్కార్ట్గా కారులో బాలాజీ గణేష్(35), రోహిత్ హోవల్(27), చంద్శివ్ సాహిల్(17) వెళ్లారు. ఖమ్మం జిల్లా వైరాకు వెళ్లగానే మల్కన్గిరికి కాకుండా, రాజమండ్రికి రావాలని గంజాయి పెడ్లర్ నుంచి కబురు వచ్చింది. ఈ మేరకు రాజమండ్రిలోని మారుమూల ప్రాంతానికి వెళ్లి రెండు కిలోల బరువు ఉన్న 200 గంజాయి ప్యాకెట్లను డీసీఎంలో లోడ్ చేసుకుని తెలంగాణ మీదుగా బయలుదేరారు. పోలీసులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ వద్ద డీసీఎంను అడ్డుకున్నారు. ఆరుగురు నిందితులతోపాటు ప్రతాప్ హరిదాస్ పవార్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మనీషా పడ్వాల్, ట్రిబుని పరారీలో ఉన్నారు. 400 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్లు ఉంటుంది. హవాలా ద్వారా డబ్బు చేరవేత ప్రధాన నిందితురాలు మనీషా పడ్వాల్ హవాలా ద్వారా అంతర్రాష్ట్ర ముఠాకు మూడు లక్షల నగదు, గూగుల్ పే ద్వారా చేరవేసింది. మనీషా పడ్వాల్, ట్రిబుని పట్టుబడితే మరింత సమాచారం తెలిసే వీలుందని, వారిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓస్ఓటీ డీసీపీ శోభన్ బాబు, ఏడీసీపీ విశ్వప్రసాద్, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్ , పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, డీఐ రాజు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి సందట్లో ఇల్లు గుల్ల
● షాహినాయత్ గంజ్లో భారీ చోరీ ● 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదుతో పరార్ అబిడ్స్: షాహినాయత్గంజ్ ముల్తానిపురాలో భారీ చోరీ చోటుచేసుకుంది. గోషామహాల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ కథనం ప్రకారం... ముల్తానిపురాకు చెందిన మహేశ్ బేగంబజార్లోని స్టీల్ దుకాణంలో సేల్స్మేన్. లంగర్హౌస్లో బంధువుల పెళ్లి ఉండటంతో 4, 5 రోజులుగా ఉదయం కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లి వచ్చేసరికి ఇంటి ద్వారం తెరిచి ఉంది. లోపల బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రి కనిపించలేదు. మహేష్ వెంటనే గోషామహాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ సంఘటనాస్థలానికి వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. 2వ అంతస్తులో తమ్ముడి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నప్పటికీ ఏ వస్తువు కూడా చోరీ కాలేదు. గ్రౌండ్ఫ్లోర్లోని స్టోర్రూమ్ కానీ, ఫస్ట్ ఫ్లోర్లో తల్లి నివాసం వైపుకానీ కన్నెత్తి చూడలేదు. తెలిసిన వ్యక్తులే రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల సొత్తు చోరీ అయిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉపాధి కల్పనే లక్ష్యం
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు● సరూర్నగర్లో మెగా జాబ్మేళా ● భారీగా తరలివచ్చిన అభ్యర్థులు ● 779 మందికి నియామక పత్రాలు హుడాకాంప్లెక్స్: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది నిరుద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 1,645 మందితో జాబితా కుదించి, 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. మంత్రి మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగా పనిచేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


