Hyderabad
-
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
సాక్షి, హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో అఘోరీకి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారంటూ అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించగా.. అఘోరీ ప్రవర్తనపై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.కాగా, చంచల్ గుడ జైలును నిన్న(గురువారం) సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్ను పరిశీలించారు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్లో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్ హోమ్కు తరలించారు. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది ఇవాళ అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.మహిళా సినీ నిర్మాత ఫిర్యాదుతో..పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ శివారులోని ప్రగతి రిసార్ట్స్లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈ ఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 308(5), 318(1), 351(3), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్ప్రదేశ్లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్ ఫస్ట్క్లాస్ జడ్జి ధీరజ్కుమార్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
తెలంగాణలో తొలిసారిగా టెండన్ ఆగ్మెంటేషన్ షోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆపరేషన్
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్లోని డా. మేశ్రంని సంప్రదించారు.ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. -
Summer లేస్ బ్రైట్ఫుల్
వేసవిలో కంఫర్ట్గానూ,స్టైలిష్గానూ ఉండే ఔట్ఫిట్స్ జాబితాలో కూల్గా మన మదిని చుట్టేస్తుంది క్రోచెట్ లేస్ డ్రెస్సింగ్ స్టైల్. ఎప్పుడూ ఎవర్గ్రీన్ అనిపించుకునే ఈ క్రియేటివ్ వర్క్ని ఏ ఫ్యాబ్రిక్తోనైనా జత చేస్తే రిచ్ లుక్ని మన సొంతం చేస్తుంది.క్యాజువల్ లేదా పార్టీవేర్గా ఇట్టే మార్కులు కొట్టేస్తుంది.బ్రైడల్ వేర్గా యూనివర్సల్ సింబల్ని సొంతం చేసుకున్న ఈ అల్లికల అందం ఈ వేసవికి మగువల ముస్తాబులో రెక్కలకు రంగులు అద్దుకున్న రాయంచలా మరింతగా మెరిసిపోతుంది.సంప్రదాయ హంగులుక్రోచెట్ లేస్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన వర్క్. సంప్రదాయ అల్లిక కావడంతో ఈ వర్క్ ఎవర్గ్రీన్గా అందరి మన్ననలు అందుకుంటుంది. కాటన్, సిల్క్, చందేరీ, నెటెడ్... ఏ ఫ్యాబ్రిక్తో అయినా ఇట్టే జత కట్టే క్రోచెట్ లేస్లో సంప్రదాయ పద్ధతిలో హ్యాండ్మేడ్గానూ, అధునాతనంగా మిషనరీపైనా రూపు దిద్దుకుంటుంది. ఇండో–వెస్ట్రన్గానూ..వెస్ట్రన్ గౌన్స్, టాప్స్, మిడీస్.. ఇండోవెస్ట్రన్ శైలులు క్రోచెట్ లేస్ మోడల్ డ్రెస్సుల ద్వారా మనం చూడచ్చు. కాటన్, సిల్క్దారాలతో తయారయ్యే ఈ అల్లికల ఫ్యాబ్రిక్లో పువ్వులు, తీగలు, లతల డిజైన్లు కనిపిస్తాయి. లేతరంగులు, ముఖ్యంగా తెలుపులో ఎక్కువగా కనిపించే ఈ డ్రెస్సులు సమ్మర్ స్పెషల్గానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.వెస్ట్రన్ బ్రైడ్స్ ధరించే పొడవాటి తెల్లని గౌన్లతో మనల్ని ఆకట్టుకుంటుంది క్రోచెట్ లేస్. మన సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలలోనూ నవ వధువులు లేస్ డిజైనరీ దుస్తులు ధరించడం చూస్తే కదలాడుతుండే హంసలు కళ్ల ముందు నిలుస్తాయి. క్యాజువల్ వేర్గానూ, చీరలు, లెహంగాలు, కుర్తా, దుపట్టా.. వంటి డ్రెస్సులకు, క్రొచెట్ లేస్ అందమైన అలంకరణగా విరాజిల్లుతుంది. క్రోచెట్ లేస్తో అంచులు, డెకరేటివ్ ప్యాచ్ లేదా మొత్తం దుపట్టా, శారీగానూ ఆకట్టుకుంటుంది. లేస్ ఆభరణాలుముచ్చటైన కంఠాభరణాలు, పర్సులు, హ్యాండ్ కఫ్స్, షూ డిజైన్స్లోనూ డిజైనర్లు లేస్తో క్రియేటివ్ డిజైన్స్ను మన ముందుకు తీసుకువస్తున్నారు. నాణ్యతను బట్టి వందల రూపాయల నుంచి డిజైన్ను బట్టి వేలల్లోనూ ఈ డిజైన్స్ ధర పలుకుతున్నాయి. -
హైదరాబాద్లో హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. త్వరలో రెండు కీలక ఘట్టాలకు నగరం వేదిక కానుండటంతో హైదరాబాద్, సైబరాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నగర వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హెచ్ఐసీసీలో ఈ నెల 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్, వచ్చే నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్–2025 పోటీలు జరగనున్నాయి. వీటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, సెలబ్రెటీలు రానున్నారు. దేశంలోని ఉగ్రవాద ప్రభావిత నగరల్లో హైదరాబాద్ కూడా ఒకటి కావడంతో నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. భారత్ సమ్మిట్కు వంద దేశాల నుంచి దాదాపు 400 మంది, మిస్ వలర్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరుకానుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలూ సైబరాబాద్లో జరుగుతున్నప్పటికీ అతిథుల్లో అత్యధికులు హైదరాబాద్లోని వివిధ హోటళ్లలో బస చేయనున్నారు. -
Hyderabad: నగరంలోని పాకిస్థానీలపై ఆరా
సాక్షి,హైదరబాద్: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం.. దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్న పాకిస్థానీలు నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని స్పెషల్ బ్రాంచ్లో (ఎస్బీ) రిజస్టర్ చేసుకున్న పాకిస్థానీల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్కు వచ్చే విదేశీయులు ఇక్కడ కచి్చతంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఫోన్ నంబర్? చిరునామా? తదితరాలను అందించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లూ శంషాబాద్లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మా త్రం ఎస్బీ అధీనంలోని పాక్, బంగ్లా బ్రాంచ్ల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాతబస్తీలోని పురానీ హవేలీలో ఉంది. ఈ విభాగంలో రిజిస్టరై ఉన్న పాకిస్థానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్థానీలతో పాటు వారి రక్త సంబం«దీకులకు ఈ వీసాలు జారీ చేస్తుంటారు. మరో 13 మంది షార్ట్టర్మ్ వీసా కలిగి ఉన్నారు. విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్టర్మ్ కిందికి వస్తా యి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. 1992 నుంచి సార్క్ వీసాలు అమలవుతున్నాయి. సార్క్ సభ్యత్వ దేశాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు సహా 24 రకాల వారికి ప్రత్యేక మినహాయింపులతో కూడిన వీసాలు ఇస్తుంటారు. ప్రస్తుతం సిటీలో ఉన్న పాకిస్థానీల్లో సార్క్ వీసా కలిగిన వాళ్లు లేరు. నగరంలో రిజిస్టర్ అయిన ఈ 208 మంది వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ వదలాల్సిందిగా సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత వీరిలో ఎందరు ఎగ్జిట్ అయ్యారు అనేది ఇమ్మిగ్రేషన్ నుంచి తీసుకోనున్నారు. అప్పటి కీ ఎవరైనా మిగిలిన ఉన్నట్లు తేలితే వారిని పట్టుకుని బలవంతంగా తిప్పి పంపుతారని ఓ అధికారి తెలిపారు. -
హైదరాబాద్లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
సూరీడు సుర్రు.. మీటర్ గిర్రు!
సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలకే సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతుండటంతో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కొద్ది రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల డిమాండ్ (90.68 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా.. తాజాగా గురువారం 4,170 మెగావాట్లకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే మే ఒకటి నాటికి 4,500 మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం లేకపోలేదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఆన్లోనే ఏసీలు, కూలర్లు గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కన్పించే ఏసీలు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి నివాసాల్లోనూ అనివార్యమయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అనేక మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తయారీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులు జీరో పర్సంటేజీ లోన్లు మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎల్రక్టానిక్ యంత్రాలు సాధారణమయ్యాయి. ఫలితంగా గత కొద్ది రోజుల నుంచి నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. -
టూర్.. డర్!
సాక్షి, హైదరాబాద్: కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి పర్యాటక రంగంపై పిడుగుపాటుగా మారింది. నగర నుంచి కాశ్మీర్కు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. గత రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో బుకింగ్లు రద్దయినట్లు నగరానికి చెందిన పలు ట్రావెల్స్ సంస్థలు వెల్లడించాయి. ఇటీవల పిల్లలకు వేసవి సెలవులు ప్రకటించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వా సులు సన్నద్ధమవుతున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఊటీ, మనాలి, కొడైకెనాల్, సిమ్లా తదితర ప్రాంతాలతో పాటు ఎక్కువ మంది కశ్మీర్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అనూహ్యంగా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. మూడేళ్లుగా పెరిగిన టూర్లు.. కోవిడ్ అనంతరం పర్యాటకరంగం అనూహ్యంగా విస్తరించింది. హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. దక్షిణమధ్య రైల్వే ఆధ్యాత్మిక టూర్ల కోసం ప్రత్యేకంగా భారత్గౌరవ్ రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరిగింది. సుమారు 70 నగరాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గత మూడేళ్లుగా టూరిస్టులు పెరిగారు. ఏటా లక్షలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. జైపూర్, ఉదయ్పూర్ వంటి చారిత్రక నగరాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్కు డిమాండ్ భారీగా పెరిగింది. 10 వేల మందికిపైగా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యాటకుల రాకపోకలు విస్తరించాయి. ‘మే మొదటి వారంలోనే హైదరాబాద్ నుంచి కశీŠమ్ర్కు వెళ్లేందుకు 5 గ్రూపులు బుక్ అయ్యాయి. ఇప్పుడు వాళ్లంతా తమ టూర్లను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా తలకిందులైంది’ అని హిమాయత్నగర్కు చెందిన ట్రావెల్ ఏజెంట్ పవన్ విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఉగ్ర ఘటన నేపథ్యంలో ఈ రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కశ్మీర్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న సుమారు 10 వేల మందికి పైగా పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నట్లు ట్రావెల్స్ సంస్థలు అంచనా వేశాయి.అమర్నాథ్ యాత్రపై ప్రభావం.. మరోవైపు జూలైలో జరగనున్న అమర్నాథ్యాత్రపైనా పహల్గాం దాడి ఘటన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం తమ వద్ద నమోదు చేసుకున్న 70 బుకింగ్లు నిలిచిపోయినట్లు అమీర్పేట్కు చెందిన ఓ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఆసక్తి చూపిన ఎంతోమంది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగి జూలై వరకు సాధారణ పరిస్థితులు నెలకొంటే మార్పు రావచ్చు. కాశ్మీర్ పర్యటనలను రద్దు చేసుకున్న వాళ్లు చాలామంది సిమ్లా, ఉత్తరాఖండ్, ఊటీ, మనాలీ వంటి ప్రాంతాలను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంటున్నారు. -
Hyderabad MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ఉల్ హాసన్కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది. ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్గా మద్దతు ఇస్తే.. బీఆర్ఎస్ ఓటింగ్కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్ఎంసీ వద్ద మోహరించాయి. -
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్,సాక్షి: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.కాశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు ,ఎమ్మెల్యేలు , భారత్ సమ్మిట్కు హాజరయ్యే పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. -
క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో నాణ్యత పర్యవేక్షణ కొరవడటంతోనే 7వ బ్లాక్ కుంగిపోయిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ తేల్చింది. బరాజ్ పునాదుల(ర్యాఫ్ట్) కింద సికెంట్ పైల్స్ను నీళ్లను నిలువరించేలా నిర్మించడంలో విఫలమైనట్టు నిర్ధారించింది. దీంతో ఇసుక భారీగా కొట్టుకుపోయి పునాదుల కింద పెద్దపరిమాణంలో బుంగలు ఏర్పడ్డాయని నిర్ధారించింది. బరాజ్కి ఎగువన 20–21 పియర్ల మధ్య ఏర్పడిన భారీ గుంత, 17వ పియర్కి దిగువన ఏర్పడిన గుంతలే దీనికి సంకేతమని స్పష్టం చేసింది. సికెంట్ పైల్స్(కటాఫ్ వాల్స్) విఫలం కావడంతోనే మేడిగడ్డ బరాజ్ కుంగిందని పేర్కొంది. బరాజ్లో ఇలాంటి బుంగలు మరిన్ని ఉండటానికి ఆస్కారముందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవచ్చని హెచ్చరించింది. అన్నారం, సుందిళ్ల బరాజ్ల సికెంట్ పైల్స్ నిర్మాణంలో సైతం ఇదే తరహా వైఫల్యాలున్నట్టు గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యాలపై సుదీర్ఘ అధ్యయనం అనంతరం కమిటీ రూపొందించిన తుది నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ డిజైన్లు, నిర్మాణాన్ని పరీక్షించాక ఎన్నో లోపాలను గుర్తించినట్టు కమిటీ తెలిపింది. నిర్మాణానికి ముందు నిర్వహించిన సైట్ పరిశోధనలు, మోడల్ స్టడీస్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అండ్ జియోటెక్నికల్ డిజైన్, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ, నిర్వహణ, పర్యవేక్షణతోపాటు బరాజ్ రక్షణకి సంబంధించిన అంశాల్లో లోపాలున్నట్టు నిర్ధారించింది. రెండు నెలల కిందే కేంద్రానికి నివేదిక నిర్మాణ లోపాలకు తోడుగా బరాజ్ కింద బుంగలు ఏర్పడి ఇసుక కొట్టుకుపోవడం, దిగువ ప్రాంతంలోని అప్రాన్ సీసీ బ్లాకులు కొట్టుకుపోవడంతో 7వ బ్లాక్ కుంగిపోయి బరాజ్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని కమిటీ స్పష్టం చేసింది. బరాజ్లోని ఇతర బ్లాకుల్లో సైతం ఇలాంటి లోపాలే ఉండవచ్చని అంచనా వేసింది. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బరాజ్ల డిజైన్లు, నిర్మాణంలో లోపాలుండటం, సమస్యలు ఉత్పన్నం కావడంతో అవి కూడా దుర్బల స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మూడు బరాజ్లపై అన్ని కోణాల్లో సమగ్ర అధ్యయనం జరపాలని సిఫారసు చేసింది. బరాజ్లపై జరిపే పరీక్షలు, పరిశోధనల ఆధారంగా వాటి పునరుద్ధరణకు ప్రణాళికలు, డిజైన్లను రూపొందించి అమలు చేయాలని కోరింది. ఎన్డీఎస్ఏ తుది నివేదికను రెండు నెలల కిందే కేంద్రానికి సమర్పించగా, గురువారం మీడియాకి అందింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. –ఎలాంటి సైట్ ఇన్వెస్టిగేషన్లు నిర్వహించకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల లోకేషన్లు మార్చాలని హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. –మేడిగడ్డ బరాజ్ డిజైన్ల తయారీ, నిర్మాణం కోసం నిర్వహించిన జియోటెక్నికల్ పరీక్షలు.. పునాదుల కింద భూగర్భంలోని వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఏ మాత్రం సరిపోవు. – బరాజ్ 7వ బ్లాక్ కుంగడానికి కారణాలను విశ్లేíÙంచడానికి 22 బోర్ రంధ్రాలు చేసి జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించాలని ఎన్డీఎస్ఏ ప్రతిపాదించగా, కేవలం 9 రంధ్రాలు చేసి పరీక్షలు చేశారు. దీంతో కమిటీకి అవసరమైన సమాచారం ఈ పరీక్షల ద్వారా లభించలేదు. –ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మూడు బరాజ్లను సందర్శించి చూడగా మూడింటిలోనూ గణనీయమైన రీతిలో నిర్మాణ లోపాలు కనిపించాయి. –అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం బుంగలు ఏర్పడి సీపేజీ జరిగింది. –బరాజ్లకి మరింత నష్టం జరగకుండా గత వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలతోపాటు వైఫల్యాలను నిర్ధారించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేయగా, వాటిని తగిన రీతిలో చేయడంలో నీటిపారుదల శాఖ విఫలమైంది. –అధ్యయన పరీక్షలకు ముందే మేడిగడ్డ బరాజ్ పునాదులకు బోర్హోల్ రంధ్రాలు చేసి గ్రౌటింగ్తో బుంగలను మూసివేయడంతో వైఫల్యానికి కారణాలు తెలిపే సాక్ష్యాధారాలకు నష్టం జరిగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ తొలగించాలి మేడిగడ్డ బరాజ్లో కుంగిపోయిన 7వ బ్లాక్ను పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా తొలగించాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. సాధ్యం కాని పక్షంలో 7వ బ్లాకు స్థిరంగా ఉండేలా పటిష్టపరచాలని సూచించింది. రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా పక్కన ఉన్న ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పింది. -
ఆరోగ్య బీమా అంతంతే..
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో భారతీయులు వెనకడుగు వేస్తున్నారు. ఆరోగ్య బీమా గురించి 83 శాతం మందికి అవగాహన ఉన్నా.. 23 శాతం మంది మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకున్నారు. ఆరోగ్య బీమా లేని భారతీయుల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది అనూహ్యంగా ఎదురయ్యే జీవన, ఆరోగ్య సంక్షోభాల వాస్తవ ఖర్చులపై ముందుచూపు లేక ఇబ్బందులు పడుతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ వంటివి లేనివారిలో 87 శాతం మంది ఆర్థికంగా పడబోయే భారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. 13 శాతం మంది మాత్రమే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ అవసరాలను గుర్తిస్తున్నట్లు ‘హౌ ఇండియా బైస్ ఇన్సూరెన్స్ 2.0’పేరిట ‘పాలసీ బజార్ డాట్కామ్’సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు» భారతీయులు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు,ఆకస్మిక ఖర్చులను భరించేందుకు సిద్ధంగా లేరు. » దేశ జనాభాలో ఆరోగ్య బీమా లేనివారే అధికం. పాలసీదారుల్లోనూ సుమారు 75 శాతం మంది రూ.10 లక్షల కంటే తక్కువ కవరేజీ ఉన్నవారే. 48 శాతం మంది రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ కవరేజీతో సరిపెట్టుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇక్కడ 66 శాతం పాలసీదారులు రూ 5 లక్షల అంతకంటే తక్కువ కవరేజీ కలిగి ఉన్నారు. » పాలసీదారుల్లో 51 శాతం మంది క్యాన్సర్, కిడ్నీ మారి్పడి, గుండె జబ్బుల చికిత్సల ఖర్చు రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుందనిభావిస్తున్నారు. 47.6 శాతం భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ప్రయోజనాల గురించి తెలియదు. » ఇప్పటికీ బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా సంబంధిత పొదుపు పథకాలు, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులు ఆధిపత్యం వహిస్తున్నాయి. » బీమా తీసుకోనివారిలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం ఆందోళనకరంగా మారింది. » చాలామంది తమ కుటుంబ అవసరాలను అంచనా వేసేటప్పుడు పిల్లల విద్య, వివాహం, రుణ బాధ్యతలు, జీవిత భాగస్వామి పదవీ విరమణ, ఆకస్మిక వైద్య ఖర్చుల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.అవగాహన పెంచుతున్నాంఈ నివేదికఆధారంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపైఅవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర చికిత్సలతో ఆర్థిక సంక్షోభం ఎదురైనపుడు ఆస్తులను అమ్మటం, అప్పు చేయటానికి బదులు ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోవటంమంచిది. అందరికీ ఆర్థిక భద్రత ఏర్పడేలా పాలసీలు, ఇతరత్రా సలహాల ద్వారా కష్టమర్లకు ప్రయోజనం కలిగేలా చూడాల్సిఉంది. – సర్బ్వీర్ సింగ్,జాయింట్ గ్రూప్ సీఈఓ, పీబీ ఫిన్టెక్. -
మండుతున్న ఉష్ణోగ్రతలకు జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత.. తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణి కార్మికులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తత అవసరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. డీహైడ్రేషన్కు గురికాకుండా ... వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు. ఆహారం ముఖ్యం తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్లు, సలాడ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది.జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్సైజ్లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల -
శిక్షణ లేదు.. ఉద్యోగాల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధి హామీ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) త్రిశంకుస్వర్గంలో వేలాడుతోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఈ పథకం అమలు గత కొంతకాలంగా దాదాపు నిలిచిపోయింది. వివిధ రంగాలు, విభాగాల్లో నైపుణ్యాల శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా..ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంటోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈజీఎంఎం కింద గ్రామీణ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించాల్సి ఉంది. ఆరోగ్యం, రిటైల్, ఆతిథ్య, సాఫ్ట్వేర్, యానిమేషన్, ఫార్మసీ, ఫ్యాషన్, తదితర రంగాల్లో ఏజెన్సీల ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆయా రంగాల్లో నైపుణ్యాలున్న సంస్థలు డిజైన్ చేసిన కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. కాగా ప్రస్తుతం ఈ లక్ష్యాల సాధన తూతూ మంత్రంగానే మిగిలిపోయిందనే విమర్శలున్నాయి. నిధుల లేమి కారణంగా ఈ పథకం మొక్కుబడిగా సాగుతోంది.కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకం కావడంతో దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) కింద కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. కేంద్రం నుంచి క్రమం తప్పకుండా నిధులు వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా సరిగ్గా విడుదల కాకపోవడంతో పథకం కుంటి నడక నడుస్తోంది. 2019 నుంచి సమస్యే.. ఈ స్కీమ్ కోసం రాష్ట్ర వాటా నిధులు 2019 నుంచే సక్రమంగా విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం ఓసారి రాష్ట్ర వాటా విడుదల కాకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది. ఈ కారణంగా కేంద్రం నుంచి ఆ తర్వాత రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తులు పంపించడంతో నిధులు విడుదల పునరుద్ధరించారు. అయితే రాష్ట్రవాటా కింద ఏటా రూ.144 కోట్లు సక్రమంగా చెల్లించకపోవడంతో సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల్లోనూ ఈ స్కీమ్ కింద నిధులు విడుదల కాలేదని అంటున్నారు. డీడీయూజీకేవై 2.0కు కేంద్రం సన్నాహాలు రాష్ట్రంలో ప్రస్తుతం డీడీయూజీకేవై 1.0 స్కీమ్ అమలవుతుండగా (2015 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ దాకా)...దానిని ఈ ఏప్రిల్ దాకా పొడిగించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా వచ్చే జూలై, ఆగస్టు తర్వాత డీడీయూజీకేవై 2.0 స్కీమ్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లక్ష్యాలు, ఇతర వివరాలను రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం అందజేసింది. రాష్ట్ర వాటా విడుదల కాని పక్షంలో..తెలంగాణలో డీడీయూజీకేవై 2.0 పథకం అమలు, తద్వారా ఈజీఎంఎం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవచ్చునని అంటున్నారు. -
ప్రపంచానికి మోడల్గా తెలంగాణను చూపుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా చూపేందుకు రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమంగా నిర్వహించనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా శుక్ర, శనివారాల్లో సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి భట్టి గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ ఎటువైపు మొగ్గు చూపకుండా అలీన విధానాన్ని ఎంచుకొని ముందుకెళ్లిందని భట్టి గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని.. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల ప్రతినిధులను వివిధ అంశాలపై చర్చించేందుకు ఆహ్వానించిందని వివరించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, వనరులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు రానుండటం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. అనంతరం భారత్ సమ్మిట్ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు సమీక్షించారు. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో.. భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం, అలీనోద్యమానికి ఆధారమైన 1955 నాటి బండుంగ్ సదస్సు జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘న్యాయ్’ఆలోచన ఆధారంగా ఇది రూపొందింది. భారతీయ విలువలతో కూడిన న్యాయమైన, ఉదారవాద ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్బాబు తొలిరోజు సదస్సులో స్వాగతోపన్యాసం చేయనుండగా రాహుల్ గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను ప్రకటిస్తారు. సదస్సు ముగింపు సమావేశంలో ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్ ప్రసంగించనున్నారు. -
ఐఐటీల్లో సీట్లు పెరుగుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలుగా పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఈసారి సీట్లు పెరగబోతున్నాయి. వీటితోపాటు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (ఎన్ఐటీ)ల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. సీట్ల పెంపుపై ఇప్పటికే ఐఐటీలు, ఎన్ఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. డిమాండ్, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోందని, ఈ పోటీని తట్టుకోవాలంటే కొన్ని కొత్త కోర్సుల అవసరం ఉందన్నాయి. ఇప్పటికే ఐఐటీలు, ఎన్ఐటీలు అవసరమైన మౌలిక వసతుల దిశగా అడుగులేస్తున్నాయి. కాబట్టి అదనపు సీట్లు అవసరమని కేంద్రాన్ని కోరాయి. ఐఐటీల్లో గరిష్టంగా 500 వరకూ సీట్లు పెంచే ఆలోచన ఉన్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంకో 900 సీట్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. సూత్రప్రాయంగా కేంద్రం ఆమోదం తెలిపిందని, దీనిపై అధికారిక అనుమతి రావాల్సి ఉందని ఓ సీనియర్ ఐఐటీ అధికారి తెలిపారు.జోసా కౌన్సెలింగ్ నాటికి..మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 2.50 లక్షల మందిని ఎంపిక చేశారు. ఇది పూర్తయి, ఫలితాలు వెల్లడించిన వెంటనే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మొదలుపెడుతుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీఐల్లో (కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థ) సీట్లను భర్తీ చేస్తారు. ఇది మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత వచ్చే వీలుంది. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ప్రస్తుతం 17,740 బీటెక్ సీట్లున్నాయి. గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో 355 సీట్లు పెరిగాయి. ఐఐటీ తిరుపతిలో 244 సీట్లుంటే, మరో పది పెంచారు. వరంగల్ ఎన్ఐటీలో 989గా ఉన్న సీట్లను 1049కు పెంచారు. కొత్తగా 60 సీట్లతో సీఎస్ఈ (ఏఐ అండ్ డేటా సైన్స్) కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 40 నుంచి 110 సీట్లకు పెంచారు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఎస్ఈలో సీట్లు పెంచారు. ఇక్కడే గత ఏడాది అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (మెటీరియల్స్ ఇంజనీరింగ్) బ్రాంచీని 60 సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు. ఇందులో ఈసారి మరికొన్ని సీట్లు పెరిగే వీలుంది. ఐఐటీ–గాంధీనగర్, ఐఐటీ–బాంబే, ధార్వాడ్, భిలాయ్, భువనేశ్వర్, జోధ్పూర్, పట్నా, గువాహటిలో సీట్ల పెంపు ప్రతిపాదనలు పంపారు. -
బీటీ పత్తి.. పురుగుమందు ఎడాపెడా
సాక్షి, స్పెషల్ డెస్క్ : జన్యుమార్పిడి (జీఎం) పంటలు మన దేశ సాగులోకి వచ్చిన గత ముప్పయ్యేళ్లలో ముందు ఆశించినట్టు, రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గకపోగా పెరిగిందా? అంటే అవుననే చెబుతోంది ఓ తాజా అధ్యయనం. అమెరికాలోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ), వాషింగ్టన్లోని వర్డ్యూ యూనివర్సిటీ, లీ యూనివర్సిటీ పరిశోధకులు ఉమ్మడిగా ఈ అధ్యయనం చేశారు. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% బీటీ పత్తి విత్తనాలనే ఇప్పుడు రైతులు వాడుతున్న సంగతి తెలిసిందే. బీటీ పత్తి మొక్క విషపూరితంగా ఉంటుంది కాబట్టి.. పురుగు ఆశించిన వెంటనే చనిపోతుందని, తద్వారా పురుగు మందులు వాడాల్సిన అవసరమే తగ్గిపోతుందని చెబుతూ వచ్చారు. అయితే, వాస్తవానికి ఆచరణలో అందుకు భిన్నంగా జరిగిందని ‘జర్నల్ ఆఫ్ అగ్రేరియన్ చేంజ్’లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం తేల్చింది. భారతీయ రైతులు 1990 దశకంలో నాన్బీటీ పత్తి రకాలను సాగు చేసినప్పుడు వాడినప్పటికన్నా బీటీ పత్తి వచ్చిన తర్వాత ఎక్కువగా విష రసాయనాలను వాడాల్సి వస్తోందని గత ముప్పయేళ్ల గణాంకాలను విశ్లేíÙంచిన తర్వాత పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. పెరిగిన ఖర్చులు బీటీ పత్తిని 2002లో దేశంలోకి ప్రవేశపెట్టిన తొలిదశలో పురుగుమందుల వాడకం, తద్వారా సాగు ఖర్చు తగ్గింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో సంప్రదాయ పత్తి వంగడాలను వదిలి రైతుల్లో 95% మంది బీటీ పత్తి వైపు మళ్లారు. అయితే, బీటీపత్తిపై పెట్టుకున్న ఆశలు కొద్ది ఏళ్లలోనే తారుమారయ్యాయి. పురుగులు బీటీ పత్తికి అలవాటుపడిపోవటంతో 2010 నాటికే పురుగుమందుల వాడకం మళ్లీ పెరిగింది. ‘2018 నాటికి భారతీయ పత్తి రైతులు బీటీకి ముందుకన్నా 37% ఎక్కువగా పురుగు మందులపై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’అని అధ్యయనం తెలిపింది. ఎక్కువ మంది బీటీ పత్తిని ఏకపంటగా విస్తారంగా సాగు చేస్తుండటంతో త్వరలోనే పురుగులు బీటీ విషానికి తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి. పురుగు మందుల వాడకం ఉధృతమైంది. ఈ అధ్యయనంలో భాగస్వాములైన సంస్థల్లో వాషింగ్టన్లోని అంతర్జాతీయ పత్తి సలహా సంఘం (ఐసీఏసీ) ఒకటి. దీని ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ కేశవ్ క్రాంతి తెలుగు వ్యక్తి కావటం విశేషం. ఆయన గతంలో నాగపూర్లోని ఐసీఏఆర్–కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం (సీఐసీఆర్) సంచాలకుడిగా పనిచేశారు. రసం పీల్చే పురుగుల విజృంభణ కాయ తొలిచే పురుగును నియంత్రించే ప్రధాన లక్ష్యంతో బీటీ పత్తి వంగడాలను ప్రవేశపెట్టారు. అయితే, ఆ తర్వాత ఈ పురుగుల ఉధృతి తగ్గినా, అప్పటి వరకు స్వల్పంగా ఉన్న రసం పీల్చే పురుగుల బెడద గతమెన్నడూ ఎరుగనంత తీవ్రమైంది. 2006 నాటికి బీటీ పత్తి సాగు చేయటం దేశవ్యాప్తమైంది. తదనంతర కాలంలో పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఏటేటా పెరుగుతూ వచ్చింది. 2018 నాటికే భారతీయ పత్తి రైతులపై పురుగుమందుల పిచికారీ ఖర్చు భారీగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. అమెరికాలో ఏకు మేకైన కలుపు అమెరికాలో రైతులు గ్లైఫొసేట్ వంటి కలుపు మందులను చల్లినా తట్టుకొని నిలిచేలా జన్యుమార్పిడి చేసిన పంటల (హెచ్టీ క్రాప్స్)ను విస్తారంగా సాగు చేస్తున్నారు. సోయా, మొక్కజొన్న తదితర పంటలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో హెచ్టీ. సోయా విస్తీర్ణం 1994 లో 92 లక్షల ఎకరాలుండగా, 2018 నాటికి 11.3 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఆ మేరకు గ్లైఫొసేట్ వినియోగం పెరిగింది. గ్లైఫొసేట్ పనితీరు సంక్లిష్ట పద్ధతిలో ఉంటుంది కాబట్టి దీనికి కలుపు మొక్కలు అలవాటు పడి, చనిపోకుండా ఎదురు తిరగవని గ్లైఫొసేట్ తయారు చేసిన కంపెనీ చెబుతూ వచ్చింది. అయితే, 1998 నాటికే డజన్ల కొద్దీ కలుపు మొక్కలు గ్లైఫొసేట్ చల్లినా చనిపోని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ అమెరికాలో జన్యుమారి్పడి పంటలకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ రైతులు హెచ్టీ సోయా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. కెనడాలోనూ హెచ్టీ మొక్కజొన్న, షుగర్ బీట్, ఆవ పంటల సాగు విస్తీర్ణం తామరతంపరగా విస్తరించింది. ‘ఈ (జన్యుమార్పిడి పంటల) సాంకేతికత చెప్పినట్టు రసాయనిక పురుగుమందుల వినియోగం తొలుత తగ్గినా, తదనంతరం అంతకుముందుకన్నా పెరిగిపోయింది. ఏదో ఒకే రకం పంటనే పొలం అంతటా సాగు చేసే పారిశ్రామిక సాంద్ర వ్యవసాయ పద్ధతి వల్ల రసాయనిక పురుగుమందులతో పాటు ఎరువుల వాడకం కూడా పెరిగిపోయింది. శక్తివంతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందుల కంపెనీల ఒత్తిళ్ల ప్రభావం వల్ల ఆయా దేశాల ప్రభుత్వాలు శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంపొందించే జన్యుమార్పిడి పంటలను గట్టిగా ప్రోత్సహిస్తున్నాయి..’అని ఈ అధ్యయనం విశ్లేషించింది. భారత్లోనూ గ్లైఫొసేట్ను తట్టుకునే హెచ్టీ బీటీ పత్తి వంగడాన్ని అనేక లక్షల ఎకరాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, గత కొన్ని సంవత్సరాలుగా అనధికారికంగా సాగు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిన గ్లైఫొసేట్ వాడకంతెలంగాణ, ఏపీలోకూడా హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి విత్తనాల ఉపయోగం వల్ల గ్లైఫొసేట్ వాడకం పెరిగింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కలు పు మందును రెండు, మూడు సంవత్సరాలు 60 రోజుల పాటు నిషేధించాయి. తెలంగాణలో పత్తి విస్తీర్ణం పెరిగింది. గులాబీ పురుగులు మరింత ఉధృతం కావటంతో ప్రమాదకర రసాయనాల వాడకం ఎక్కువైంది. సాగు ఖర్చు పెరిగింది. – డా. దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా, హైదరాబాద్ -
రుణం.. కాదిక సులభం!
డబ్బు అవసరం ఉంది.. సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చనుకుంటే కుదరదిక. రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాపారాన్ని, వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడానికి గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చిన సంస్థలు రూట్ మార్చాయి. మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో తాము ఇచి్చన రుణాలు నిరర్ధక ఆస్తులుగా (ఎన్పీఏ) మారకూడదని జాగ్రత్త పడుతున్నాయి. ఎన్పీఏల రిస్క్ నుంచి బయటపడేందుకు క్రెడిట్ స్కోర్ను నిక్కచ్చిగా పాటిస్తున్నాయి. ముప్పు తక్కువగా ఉన్న కస్టమర్లకే లోన్స్ మంజూరు చేస్తున్నాయి. మరికొన్ని రుణ సంస్థలు ఒక మెట్టు దిగినప్పటికీ వాహనాలు, కన్యూమర్ డ్యూరబుల్స్ విషయంలో తక్కువ మొత్తం మంజూరు చేయడం లేదా డౌన్పేమెంట్ అధికంగా వసూలు చేయడం లాంటివి చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్కంపెనీల సేఫ్ గేమ్క్రెడిట్ హిస్టరీ లేనివారు.. అంటే తొలిసారిగా రుణం తీసుకోవాలనుకునే వారిని కంపెనీలు అంత సులభంగా కనికరించడం లేదు. న్యూ టు క్రెడిట్ (ఎన్టీసీ) విభాగంలో రెండేళ్లలో లోన్ పొందిన కస్టమర్ల సంఖ్య 54.5% తగ్గిందంటే కంపెనీల సేఫ్ గేమ్ను అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 730లోపు ఉన్న వినియోగదార్లకు జారీ చేస్తున్న రుణాల సంఖ్య సైతం క్షీణించింది. రెండేళ్లలో వీరి వాటా 42 నుంచి 36 శాతానికి వచి్చంది. అదే సమయంలో 731 మించి క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లు 58 నుంచి 64 శాతానికి చేరారు. అంతేకాదు ఏడాదిలో సగటు వ్యక్తిగత రుణ మొత్తాన్ని 2024 డిసెంబర్ నాటికి 20% తగ్గించి రూ.44,000కు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. 2023 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.55,000 ఉండేది. చిన్న రుణాల్లో ఫిన్టెక్ హవా భారత్లో 2024 డిసెంబర్ నాటికి ఫిన్టెక్ కంపెనీలు మంజూరు చేసిన రుణాల మొత్తం రూ.1,30,000 కోట్లు. దేశంలోని మొత్తం రుణ పరిశ్రమలో ఫిన్టెక్ సంస్థల వాటా కేవలం 1.03 శాతమే. అయినా ఈ కంపెనీలు జారీ చేసిన రుణాలు ఏడాదిలో 32% వృద్ధిని నమోదు చేశాయి. రూ.50,000లోపు విలువ చేసే వ్యక్తిగత రుణాల్లో ఖాతాల సంఖ్య పరంగా ఫిన్టెక్ కంపెనీల వాటా ఏకంగా 89 శాతం ఉంది. ఇక ఫిన్టెక్లు ఇస్తున్న పర్సనల్ లోన్స్లో తక్కువ విలువ చేసే (రూ.50 వేల లోపు) ఖాతాలు 92 శాతం నమోదు చేశాయి. ఈ కంపెనీలు యువత లక్ష్యంగా మారుమూల పల్లెలకూ విస్తరించాయనడానికి ఈ అంకెలే నిదర్శనం. ఫిన్టెక్ సంస్థలు వినూత్న సాంకేతికతను ఉపయోగించి ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ చెల్లింపులు, వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్–టు–పీర్ లెండింగ్) రుణాల వంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి. 2024 డిసెంబర్ నాటికి భారత్లో రిటైల్ రుణాలు ఇలా..పరిశ్రమమొత్తం రుణాలు రూ.1,26,48,000 కోట్లురెండేళ్లలో వృద్ధి: 52%కస్టమర్లు: 27.8 కోట్లుఫిన్టెక్మొత్తం రుణాలు రూ.1,30,000 కోట్లు రెండేళ్లలో వృద్ధి: 145%కస్టమర్లు: 2.33 కోట్లు -
‘భూదాన్’పై సీబీఐ విచారణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించింది. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.భూకబ్జాలో 26 మంది ఉన్నతాధికారులు: రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్పేట్కు చెందిన బిర్లా మహేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.అధికారుల నుంచి స్పందన లేదు..పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్పై విచారణ జరిపించాలని మహేశ్ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు. కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్బుక్లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు. అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్ పాస్బుక్లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్బుక్లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు. -
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
ఆ వీడియోలు లీక్ చేస్తా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి జిల్లా: ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన ఓ యూట్యూబర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్యామ్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్ బ్లాక్మెయిలింగ్కు దిగాడు.సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే భారీగా డబ్బులు ఇవ్వాలంటూ శ్యామ్ డిమాండ్ చేశాడు. దీంతో తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆ దిశగానే భారత్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించిన 450 ప్రతినిధులు పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు. భారతదేశం అలీనోద్యమం తీసుకొని ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని, ఆ దిశగానే సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.ఈరోజు(గురువారం) హెచ్ఐసీసీ నుంచి మాట్లాడిన భట్టి విక్రమార్క.. ‘ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఉదయం గం. 7.30ని.ల నుంచి గం.10.30 ని.ల వరకూ ఎన్ఆర్జీసీ పథకం ఫీల్డ్ విజిటింగ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తాం. 2:45 నుంచి 4 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కోసం ఏం చేస్తుందనేది వివరిస్తాం. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శాంతిని నింపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.ఎల్లుండి(శనివారం) సాయంత్రం ఇందిర మహిళ శక్తి బజార్ శిల్పకళ వేదిక సందర్శిస్తాం. పెహల్గామ్ ఉగ్రదాడి దురదృష్టకర సంఘటన. ఈ ప్రాంతాన్ని రేపు రాహుల్ గాంధీ సందర్శిస్తారు. అనంతరం భారత్ సమ్మిట్ కి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. అహింస, సత్యాగ్రహ పద్ధతి ప్రపంచం పాటించాలని కోరుకుంటున్నాం. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరుల వివరిస్తాం. న్యాయం అన్ని వర్గాలకు దక్కాలనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు. మా ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి ఈ మూల సిద్ధాంతం తెలియజేస్తాం. ప్రగతిశీల భావజాలం ఉన్న, న్యాయ సిద్ధాంతం ఉన్న పార్టీలను ఈ సమ్మిట్ కి ఆహ్వానిస్తాం’ అని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలపై పోలీసులు నజర్ పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.మరో వైపు, తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. -
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాసారు. పెహల్గాంలోని బైసరాన్కు విహార యాత్రలోభాగంగా , ప్రకృతి అందాలను వీక్షిస్తున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు. దాంతో ఆ ఆనంద క్షణాలు కాస్తా విషాదంగా మారిపోయాయి. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమారుడు ఉన్నారు.ఐబీ(ఇంటెలిజెన్సీ బ్యూరో) ఆఫీసర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజాన్.. ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు విడిచాడు. రంజాన్ మృతదేహం బుధవారం స్వస్థలానికి చేరుకున్న తరుణంలో ఆయన తండ్రి మంగ్లేస్ మిశ్రా కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూస్తూ కృంగిపోయారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ఆయన్ని పలకరించగా తాను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.‘నన్ను ఒంటరిగా వదిలేయండి. నేనే మాట్లాడలేను. కశ్మీర్ కు నవ్వుతూ వెళ్లాడు నా కుమారుడు రంజన్. ప్రతీరోజూ మాకు కాల్ చేసి మా ఆరోగ్యం గురించి అడిగేవాడు.. జాగ్రత్తలు చెప్పేవాడు. తాను అసువులు బాసిన చివరి రోజు కూడా మాకు కాల్ చేశాడు. అంతకుముందే మా కాల్ చేసి మాట్లాడిన నా కుమారుడు ఇలా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటి వేదనతో చెప్పారు. -
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తాను ఏది మాట్లాడినా సరే.. అది సంచలనమే అవుతుందని చెప్పుకునే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా.. ఆయనను చూడటానికి జనం ఆశగా ఉన్నారంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.‘‘కేసీఆర్ సభకు జనం భారీగా రావొచ్చు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు లేదు. ఇదే విషయంలో సీఎస్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భూమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పునరాలోచన చేస్తుంది.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.కాగా, ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపడానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు. -
కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ.. వీటిపైనే ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్.. తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే రెండో వారం వరకు విచారణ కొనసాగించనుంది. మే రెండో వారంలో ప్రభుత్వానికి తుది రిపోర్ట్ను ఇవ్వనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసిన కమిషన్.. దాదాపు 90 శాతం రిపోర్ట్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్కు ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ అందకపోవడంతో ఆ నివేదిక కోసం ఎన్డీఎస్ఏకి కమిషన్ లేఖ రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్డీఎస్ఏ మరో మూడు వారాల సమయం కోరింది.కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి ప్రశ్నించాల్సి ఉంది.ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశముంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో బరాజ్ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలు సేకరించిన విషయం తెలిసిందే. వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది. -
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఇప్పటికీ ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన విషయం విధితమే.. ఈ గుర్తింపును ఇప్పటికీ కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, వజ్రాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా నగరం నిలుస్తోంది. అంతేకాకుండా ఆభరణాల వ్యాపారానికి సురక్షితమైన ప్రాంతంగానూ నగరం సేవలందిస్తోంది. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో ఈ వ్యాపార కలాపాలు ఇక్కడ విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆభరణాల వినియోగంలో దేశం దాదాపు 29 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దక్షిణాది, మరీ ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో నగరం వేదికగా ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’కు సిద్ధమవు తోంది. 3 రోజుల ఈవెంట్లో ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు, బ్రాండ్ లాంచ్లు, ఆభరణాల సమావేశాలు, ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక, పవర్ ఆఫ్ యంగ్, లెజెండ్స్ ఆఫ్ సౌత్, జ్యువెలరీ పర్చేజ్ మేనేజర్స్ కనెక్ట్, కాఫీ విత్ డాక్టర్ చేతన్, బిజినెస్ మ్యాచ్ మేకింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం దక్షిణాదిలోని హైదరాబాద్ సహా ముంబై, జైపూర్, కేరళ, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాలకు చెందిన ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్లు నగరానికి విచ్చేయనున్నాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. భారతదేశపు ప్రీమియర్ బీ2బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్గా ఇందులో 8 వేలకు పైగా వాణిజ్య సందర్శకులను ఆకర్షిస్తోందని, 220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం ఇస్తుందని అంచనా. ఈ వేదికగా తాజా ఆభరణాల ట్రెండ్స్, ప్రత్యేక బ్రాండ్ సేకరణలు, అత్యాధునిక డిజైన్లను ఆవిష్కరిస్తుంది. ఈ వేదికగా భారతదేశ వార్షిక ఆభరణాల అమ్మకాలలో 60 శాతం వరకు ప్రభావితం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ దేశంలోని ప్రీమియం ప్లాట్ఫామ్లలో ఒకటిగా స్థిరపడింది. దక్షిణాదిలోని ఆవిష్కరణ, హస్తకళ, వారసత్వం, వ్యాపారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. బంగారం, వజ్రం, వెండి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను, టెక్నాలజీ ప్రొవైడర్లు, విలువైన లోహ సరఫరాదారులు, ఆభరణాల యంత్రాల తయారీదారులు, భారత్తో పాటు విదేశాల నుంచి మౌంటింగ్ వ్యాపారులను ఏకం చేస్తున్నాం. – యోగేష్ ముద్రాస్, భారత ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్. వచ్చే నెలలో హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్, జెమ్ ఫెయిర్ -
‘అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు’.. హైకోర్టులో పాడి కౌశిక్రెడ్డికి ఊరట
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ హైకోర్టులో (telangana highcourt) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (brs mla padi kaushik reddy)కి ఊరట దక్కింది. సుబేదారి పీఎస్లో నమోదైన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.50లక్షలు ఇవ్వాలంటూ క్వారీ యజమాని మనోజ్ను పాడి కౌశిక్రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయంపై మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే,ఈ నేపథ్యంలో తనపై నమోదైనే కేసును కొట్టి వేయాలని కోర్టుతో పాడికౌశిక్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పాడికౌశిక్రెడ్డి పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్..2023 అక్టోబర్25న 25లక్షల రూపాయలు కౌశిక్ రెడ్డికి మనోజ్ చెల్లించినట్లు వాంగ్మూలం ఉంది కదా అని ప్రభుత్వం తరుఫు న్యాయవాది (public prosecutor) హైకోర్టు ప్రశ్నించింది.అందుకు పాడికౌశిక్ రెడ్డి బెదిరించారు కాబట్టే రూ.25 లక్షలను కౌశిక్రెడ్డికి మనోజ్ చెల్లించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని పీపీని ప్రశ్నించిన హైకోర్టు..కౌశిక్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ 28వ తేదీకి విచారణ వాయిదా వేసింది. -
World Mental Health Index : అట్టడుగున హైదరాబాద్, కారణాలివే!
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్క్యు) స్కేల్లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఎంహెచ్క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.యువతే ఎక్కువ.. మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.పంచుకునే మనసులు లేక.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్ను దగ్గర చేస్తుంది. పర్యావరణ ప్రభావం.. మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది. రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్.. అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది. -
పహల్గాం దాడి.. సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించాలనుకున్న క్యాండిల్ ర్యాలీ వాయిదా పడింది. ఏఐసీసీ పిలుపు మేరకు రేపు(శుక్రవారం) ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలిగిలా కొవ్వుతులతో ఈ ర్యాలీలో నివాళులర్పించనున్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. -
సుంకిశాల పనుల్లో నిర్లక్ష్యం వద్దు
జలమండలి ఎండీ అశోక్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: సుంకిశాల ప్రాజెక్టు పనుల డిజైన్లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన జలమండలి ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పైపులైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని అశోక్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్, జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. -
ఈసారి ‘బతుకమ్మ’ కుంటలోనే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రజలు వినియోగించుకోవడానికి సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. స్థానికులు బతుకమ్మ కుంటలోనే పండగ సంబరాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రంగనాథ్ బుధవారం అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. అభివృద్ధి పనులను స్థానికుల సమక్షంలో పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు పునరుజ్జీవంతో పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలూ ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. అభివృద్ధి పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చెరువు పూడికతీత ప్రారంభమైంది. ఆ నెల 18న జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఆపై కోర్టు వివాదం నేపథ్యంలో పనులకు బ్రేక్ పడగా.. బుధవారం మళ్లీ మొదలయ్యాయి. హైడ్రా కోసం ప్రత్యేక లోగో సిద్ధమైంది. ఇప్పటి వరకు అధికారులు జీహెచ్ఎంసీలో భాగంగా ఉండగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) కోసం రూపొందించిన లోగోనే వినియోగించారు. తాజాగా హైడ్రా కోసం ఓ ప్రత్యేక లోగోను డిజైన్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైడ్రా ప్రధాన లక్ష్యం జలవనరుల పరిరక్షణ. ఈ థీమ్ ఉట్టిపడేలా లోగోను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖరారు చేశారు. అభివృద్ధి పనులు పునఃప్రారంభంలో రంగనాథ్ వెల్లడి హైడ్రా కోసం రూపొందించిన ప్రత్యేక లోగో సిద్ధం -
కొంపముంచిన ‘మ్యాజిక్ మనీ’
కరెన్సీ కట్టలను ప్యాక్ చేసి ఇంజక్షన్ ఇస్తే డబుల్ మనీ అంటూ టోకరా ● చైతన్యపురిలో వెలుగులోకి నయా తరహా వంచన ● రూ.1.75 లక్షలు స్వాహా చైతన్యపురి: మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించినా కొత్త రకం మోసాలకు అమాయకులు బలైపోతున్నారు. చెప్పుడు మాటలతో మోసపోతున్నారు. ఇలా ‘మ్యాజిక్ మనీ’ పేరుతో జరిగిన నయా తరహా మోసం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురిలో నివసించే ప్రైవేట్ ఉద్యోగి దుద్దాల సాయి కల్యాణ్, బి.ఆనంద్ స్నేహితులు. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే మ్యాజిక్ మనీ ట్రిక్ ఒకటి ఉందని, ఎంత డబ్బులు ఇస్తే దానికి రెట్టింపు సంపాదించవచ్చని ఆనంద్ చెప్పాడు. తన స్నేహితుడు కందా శ్రీనివాస్ను మ్యాజిక్ మనీ గురించి తెలుసన్నాడు. ఈ నెల 16న విద్యుత్నగర్ రోడ్నంబర్–8 లోని శ్రీనివాస్ ఇంటికి సాయి కల్యాణ్ను తీసుకెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రవి అనే వ్యక్తిని పిలిపించారు. ఎంత డబ్బు ఇస్తే అంత రెట్టింపు మనీ వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు. దీంతో సాయి కల్యాణ్ తన వద్ద ఉన్న రూ.1.75 లక్షల కరెన్సీ నోట్లను శ్రీనివాస్ ద్వారా రవికి అప్పగించాడు. రవి ఆ డబ్బును తీసుకుని బ్రౌన్ కలర్ బాక్స్లో పెట్టి పైన ఆకుపచ్చ రంగు టేప్ చుట్టి డబ్బాకు పింక్ కలర్ ఇంజక్షన్ చేశాడు. బాక్స్ను శ్రీనివాస్ ఇంట్లోని ఫ్రిజ్లో పెట్టి సాయంత్రం వస్తానని రవి వెళ్లిపోయాడు. అయితే సాయంత్రం అయినా రవి తిరిగి రాలేదు. అతని మొబైల్కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ తన ఇంట్లో ఫ్రిజ్లోని డబ్బులు పెట్టిన బాక్స్ను సాయి కల్యాణ్ ఇంటికి తీసుకొచ్చాడు. దానిని తెరిచి చూడగా డబ్బుకు బదులు తెల్ల కాగితాలు ఉండటం గమనించారు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయి కల్యాణ్ మంగళవారం సాయంత్రం పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
బుక్ చేయబోయి బుక్కయ్యాడు!
ఆన్లైన్ విధానంలో శ్రీశైలంలో రూమ్ బుకింగ్ ● జీఎస్టీ కోసమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ● నగదు రిఫండ్ చేస్తామని రూ.1.33 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: శ్రీశైలం వెళ్లాలని భావించిన నగర వాసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నారు. జీఎస్టీ విషయంలో తేడా రావడంతో ఆ బుకింగ్ రద్దు చేసుకోవాలని భావించారు. చెల్లించిన మొత్తం రిఫండ్ ఇస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.33 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీశైలంలోని వైశ్య సత్రంలో రూమ్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ వెబ్సైట్ ఆధారంగా ఒక రోజు కోసం రూమ్ బుక్ చేసుకుని, అందుకు సంబంధించి రూ.1000 చెల్లించారు. అది బోగస్ వెబ్సైట్ కావడంతో బాధితుడి వివరాలను సైబర్ నేరగాళ్లకు చేరాయి. కొద్దిసేపటికే అతడికి కాల్ చేసిన నేరగాళ్లు... రూమ్ అద్దె మాత్రమే చెల్లించారని, బుకింగ్ ఖరారు కావడానికి జీఎస్టీగా మరో రూ.180 చెల్లించాలని కోరారు. దీంతో తనకు రూమ్ వద్దని చెప్పిన బాధితుడు తాను చెల్లించిన రూ.వెయ్యి రిఫండ్ చేయాలని కోరాడు. దీంతో సైబర్ నేరగాడు రిఫండ్ కోసం సంప్రదించాలంటూ మరో నెంబర్ ఇచ్చాడు. బాధితుడు ఆ నెంబర్కు కాల్ చేసి విషయం చెప్పగా... రిఫండ్ ప్రాసెస్ ప్రారంభించడానికి తొలుత తమకు రూ.1 చెల్లించాలని కోరారు. యువకుడు అలానే చెల్లించగా... రూ.2 రిఫండ్ చేశారు. తమ కంపెనీ రిఫండ్ పాలనీ ఇలానే ఉందని... తమకు చెల్లించిన మొత్తానికి రెట్టింపు తిరిగి ఇస్తూ రిఫండ్ పూర్తి చేస్తామని నమ్మబలికారు. ఆపై బాధితుడి నుంచి రూ.1,180 కట్టించుకుని రెట్టింపు ఇచ్చారు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత రూ.76,500 చెల్లించాలని చెప్పడంతో బాధితుడు నిరాకరించాడు. ఇప్పటి వరకు తాను చెల్లించింది తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తమ వద్దకు నేరుగా వచ్చి డబ్బు తీసుకోవాలని వాళ్లు చెప్పడంతో నగర యువకుడు అంగీకరించలేదు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు లెక్కలు చూడగా సైబర్ నేరగాళ్లకు రూ.1,33,564 చెల్లించినట్లు తేలింది. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. -
పోలింగ్కు బీఆర్ఎస్ దూరం
ఫలించిన కేటీఆర్ హుకుం ● కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీల నుంచి అందరూ హాజరు ● 112 మందికిగాను ఓటేసింది 88 మంది ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ అప్పుడు అలా.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక పర్యాయం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి రెండు పార్టీలు పోటీకి దిగగా, ఓటర్ల బలం లేని పార్టీ తీరా పోలింగ్ రోజున బహిష్కరించడంతో సాంకేతికంగా పోలింగ్ జరిగినప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవమే అయినట్లు సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలేమైనా జరుగుతాయేననే భయాందోళనలతో పాటు పలు ఊహాగాలకు తావిచ్చింది. పలు ప్రచారాలతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికలో ఓటర్లు కేవలం ప్రజాప్రతినిధులే కావడం.. పార్టీల వారీగా సంఖ్యాబలంతోనే గెలవలేమని తెలిసి తక్కువ ఓట్లున్న పార్టీలు పోటీ చేయకపోవడంతో గతంలో ఏకగ్రీవంగానే ఈ ఎన్నిక ముగిసేది. ఈసారి తగిన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ పోటీలో దిగడం, ఇతర పార్టీల ఓట్లనూ కూడగడతామని ధీమాగా చెప్పడంతో ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ పోలింగ్ను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ వారి వైఖరి ఏమిటన్నది పోలింగ్ ముగిసేంత వరకూ సస్పెన్స్గానే సాగింది. ఒక దశలో నలుగురైదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోలింగ్కు వస్తున్నట్లు మీడియాలో కొందరికి సమాచారమిచ్చి, అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. రెండు కేంద్రాల్లో పోలింగ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతంతో పోలింగ్ పూర్తయింది. మొత్తం 112 మంది ఓటర్లలో (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) 88 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగతా 24 మంది బీఆర్ఎస్ వారిగా భావిస్తున్నారు. అన్ని పార్టీల్లో వెరసి ఎక్స్అఫీషియో సభ్యులు 31 మందిలో 22 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది ఓట్లేశారు. తొలుత బీజేపీ.. పోలింగ్ సమయం ప్రారంభమయ్యాక తొలుత బీజేపీ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, డా.కె. లక్ష్మణ్ వరుసగా ఓట్లు వేశారు. అనంతరం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, అహ్మద్ బలాలా, మహ్మద్ ముబిన్, కౌసర్ తదితరులు ఒకరి తర్వాత ఒకరు ఓట్లు వేశారు. టీజేఎస్ ఎమ్మెల్సీ కోదండరామ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ప్రస్తుత ‘స్థానిక’ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ విడిగా వచ్చి ఓటేశారు. బీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలకు చెందిన ఓటర్లందరూ పోలింగ్లో పాల్గొన్నారు. ఎంఐఎం గెలుపు లాంఛనమే.. పోలింగ్లో 88 మంది పాల్గొన్నందున సగం కంటే ఎక్కువ.. అంటే 45 ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలుస్తారు. ఎంఐఎం పార్టీకి స్వతహాగానే 49 ఓటర్ల బలం ఉండటంతో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా వారికే పడే అవకాశ ఉండటంతో ఎంఐఎం గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం తమకు కొన్ని కాంగ్రెస్ ఓట్లు పడ్డట్లు చెబుతోంది. స్ట్రాంగ్రూమ్లకు బ్యాలెట్ బాక్స్లు పోలింగ్ ముగిశాక బ్యాలెట్ పత్రాలున్న బాక్స్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లోకి తరలించారు. ఓటు వేస్తున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి -
ఉగ్రవాదంపై పెల్లుబికిన ఆగ్రహం
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిని నగరం ముక్తకంఠంతో ఖండించింది. ఉగ్రవాదంపై ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం నగర వ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. మృతులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్–ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు క్రీడాకారులు, రిఫరీలు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. సంతాప సూచికంగా ఈ మ్యాచ్కు చీర్ గర్ల్స్ను రద్దు చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం..
ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న నేషనల్ సిల్క్ ఎక్స్పో సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యం కలిగిన వస్త్ర ఉత్పత్తులు నగరం వేదికగా అలరిస్తున్నాయి. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా కళింగ కల్చరల్ సెంటర్లో ఏప్రిల్ 27 వరకు కొనసాగనున్న ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ నగరవాసులకు నాణ్యమైన, విలక్షణమైన వస్త్రర సోయగాలను చేరువ చేస్తోంది. ఈ ఎక్స్పోలో విభిన్న రకాల పట్టు డిజైన్లతో పాటు కాటన్ డిజైన్ దుస్తులు, డిజైనర్ బ్లౌజ్లు, కుర్తీలు తదితర భారతీయ వస్త్ర వైభవాలు నేత కార్మికుల ద్వారా 50 శాతం వరకు తగ్గింపుతో అందించబడుతున్నాయి. ఇందులోని మహారాష్ట్ర స్వచ్ఛమైన పైథానీ సిల్క్ చీరలు, కర్ణాటక – బెంగళూరు సిల్క్, సాఫ్ట్ సిల్క్ తదితరాలు వస్త్ర ప్రియులను ఆకర్షిస్తున్నాయి. -
‘సీవర్ క్రోక్’ పనితీరు పరిశీలన
సాక్షి, సిటీబ్యూరో: మురుగు నీటి పైపు లైన్లలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించేందుకు ఉద్దేశించిన సీవర్ క్రోక్ రోబోటిక్ యంత్రం పనితీరును హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఇలంబర్తి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోబోటిక్, వాటర్–జెట్ శక్తితో నడిచే ఈ యంత్రం సిల్ట్ను తొలగించే విధానాన్ని గమనించారు. సచివాలయం ముందు ఉన్న డైన్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. మురుగు, వరద నీరు పొంగి రహదారులను ముంచెత్తిత్తడం నగరంలో సర్వ సాధారణం. ఈ పరిస్థితుల్లో సీవర్ క్రోక్ ఎంత వరకు ఉపకరిస్తుందనేది అధ్యయనం చేశారు. వాటర్ జెట్తో టర్బైన్ తిప్పడంతో ముందుకు వెళ్లి ఈ యంత్రం బ్లేడ్ల సాయంతో చెత్తను తొలగిస్తుంది. మురుగునీటి లైన్లను శుభ్రం చేయడానికి సీవర్ క్రోక్ను గతంలో వాటర్ బోర్డు వినియోగించిందని తయారీ సంస్థ అజంతా టెక్నో సొల్యూషన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జర్మయ్య తెలిపారు. -
రెడ్బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
సాక్షి, గుంటూరు/హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు. -
దళారులే రైతులుగా దోపిడీ
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని స్వయంగా రైతే విక్రయించాలి. ఒకవేళ కౌలు రైతులు పంట పండిస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేయించి ఏఈవోల వద్ద మిస్సింగ్ డేటా కింద ధ్రువపత్రం తీసుకోవాలి. తర్వాత జిన్నింగ్ మిల్ వద్ద ఫొటో దిగి.. పండించిన పత్తిని మార్కెటింగ్ శాఖ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించాలి. వరంగల్ రీజియన్లోని ఓ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల పేరుతో దిగిన ఫొటోల్లో వార పత్రికల మీద కవర్ పేజీల్లో ఉన్న సినిమా తారల ఫొటోలు, పత్రికల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన ఫొటోలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల ముసుగులో దళారులు, అధికారులు కుమ్మక్కయ్యారు. వానాకాలం సీజన్కు సంబంధించిన పత్తి రైతు ల పేరిట సాగించిన దందా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాగిస్తున్న విచారణలో వెలుగు చూస్తున్నట్టు సమాచారం. వానాకాలం సీజన్లో రూ.15,557 కోట్ల విలువైన 21లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అందులో 40 శాతం కొనుగోళ్లలో అవకతకవలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తద్వారా రైతులకు దక్కాల్సిన రూ.వేల కోట్లు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి చేరితే..మార్కెటింగ్ శాఖతోపాటు సీసీఐ ఉద్యోగులు, సిబ్బందే కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) ధ్రువపత్రాలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ అధికారులపై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది. 28.46 లక్షల మంది రైతులు పంట పండిస్తే... విక్రయించింది 8.58 లక్షల మందే.. రాష్ట్రంలో వానకాలం సీజన్లో 28,46,668 మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 28.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తే , కేవలం 25.45 ఎల్ఎంటీ వచ్చింది. ఇందులో 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మార్కెటింగ్ శాఖ తెరిచిన 302 కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ సేకరించింది. ఇక్కడే దళారులు, అధికారులు కుమ్మక్కైన విషయం వెలుగు చూసింది. పత్తి విక్రయాల కోసం కనీసం 20 లక్షల మంది రైతులైనా రావాలి. కానీ కేవలం 8,85,894 మంది రైతులు మాత్రమే 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని విక్రయించినట్టు మార్కెటింగ్ శాఖ లెక్కల్లో చూపిస్తోంది. ఈ దందా ఉత్తర తెలంగాణలో అధికంగా సాగగా, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంది. రైతు తెచ్చిన పత్తిని తిరస్కరించి... దళారుల ద్వారా తిరిగి కొనుగోలు రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తేగానే, తేమ 8 నుంచి 12 శాతం లోపు లేదని కొనుగోలుకు తిరస్కరిస్తారు. పత్తిని ఆరబెట్టి తీసుకొస్తేనే మద్ధతు ధర క్వింటాల్కు రూ. 7,521చొప్పున కొనుగోలు చేస్తారని మార్కెటింగ్ కార్యదర్శులు చెబుతారు. దీంతో అక్కడే ఉన్న దళారులు రంగ ప్రవేశం చేసి, రైతుల నుంచి క్వింటాల్కు రూ. 6,000 నుంచి రూ. 6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. అదే పత్తిని అదే కొనుగోలు కేంద్రంలో దళారులు సాయంత్రం విక్రయిస్తారు. అందుకు అవసరమైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ల ధ్రువపత్రాలను రైతుల పేరిట ఏఈవోల నుంచి తీసుకోవడం నుంచి జిన్నింగ్ మిల్లులో ఫొటోలు దిగడం వరకు అన్ని ప్రక్రియలు పూర్తవుతాయి. క్వింటాల్కు కనీసంగా రూ. 1,000–1,500 వరకు దోచుకొనే దళారులు, అధికారులతో కలిసి ఆదాయాన్ని పంచుకుంటారు. క్రాప్ మిస్సింగ్ డేటాతో విక్రయాలు పోల్చడంతో దొరికిన దొంగలు నాలుగేళ్లుగా ఏఈవోలు ప్రతి సీజన్లో క్రాప్ బుకింగ్ డేటా తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇందులో భాగంగా గత డిసెంబర్ నుంచి జనవరి వరకు సాగిన సీసీఐ పత్తి అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో దళారుల ప్రమేయం స్పష్టంగా కనిపించింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏడుగురు మార్కెటింగ్ మేనేజర్లను సస్పెండ్ చేశారు. పూర్తి విచారణపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. -
చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని, చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తొలుత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణను సాధించాలనే నినాదంతో కేసీఆర్ నాయకత్వంలో బీ(టీ)ఆర్ఎస్ పురుడు పోసుకుంది. ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడి తెలంగాణను సాధించడంతో పాటు అధికారాన్ని చేపట్టి అద్భుతమైన పాలన అందించింది. ప్రభుత్వంగా, ప్రతిపక్షంగా హిమాలయాల స్థాయికి తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్. రెండున్నర దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటోంది. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా..’ అని కేటీఆర్ చెప్పారు. సభా స్థలికి నలుమూలలా పార్కింగ్ ఏర్పాట్లు‘రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. 10 లక్షల చొప్పున వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లుసభకు హాజరయ్యే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం. వీటిని ఇంకా పెంచుతాం. వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు మీద నమ్మకం లేదు. అందువల్ల 200 జనరేటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. 2 వేల మంది వలంటీర్లు సభకు వచ్చే వారికి సహకరిస్తారు..’ అని కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట రైతులకు సలాం‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూడాలి. ఆయన మాట వినాలన్న ఆత్రుతతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడదాం. కేసీఆర్ సందేశాన్ని గులాబీ సైనికులు ప్రతీ గ్రామానికీ చేర్చాలి. 27వ తేదీన తెలంగాణలోని 12,796 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేసి కదం తొక్కిన ఉత్సాహంతో చలో వరంగల్ సభకు చేరుకోవాలి. మండుటెండలను లెక్కచేయకుండా రజతోత్సవ సభ కోసం ఎడ్లబండ్లలో బయలుదేరిన సూర్యాపేట రైతులకు సలాం చేస్తున్నా. మనమందరం వారిని ఆదర్శంగా తీసుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, డీఎస్ రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిప్పుల కొలిమి.. రికార్డు స్థాయిలో ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు భగభగమంటున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. ఐదు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతు న్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్ర తలు తార స్థాయికి చేరాయి. మరోవైపు గాలిలో తేమ శాతం కూడా పెరగటంతో ఉక్క పోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. బుధవారం నిజామాబాద్లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణో గ్రత మెదక్లో 24.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్ర తలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డయ్యాయి. నిజామాబాద్లో 3.6, ఆదిలాబాద్లో 3.4, ఖమ్మంలో 3.1 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట జన సంచారం తగ్గింది. అత్యవసరమైతేనే ప్రజలు బయ టకు రావాలని, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతుండటంతో రాత్రిపూట కూడా వేడి తగ్గటంలేదు. -
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతోపాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, చివరి రెండు గంటల్లో ఎవరూ రాలేదు. మొత్తం 112 మంది ఓటర్లలో.. 88 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ నుంచి ఎన్.గౌతమ్రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులెవరూ పోలింగ్లో పాల్గొనలేదు. పార్టీల వారీగా పోలింగ్కు హాజరైన ఓటర్ల సంఖ్యను బట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో ఉండటంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి నెలకొంది. తమ పార్టీలకు గెలిచేంత ఓటర్ల సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. చివరి క్షణం వరకూ తమకు ఇతర పార్టీల ఓట్లు పడతాయన్న బీజేపీ, పోలింగ్ అనంతరం సైతం కాంగ్రెస్ ఓట్లు కొన్ని తమకు పడ్డట్లు పేర్కొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఎంఐఎం తొత్తుగా మారిందని బీజేపీ అభ్యర్థి గౌతమ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు బయటపడ్డాయని, ఎంఐఎంకు వాటి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందన్నారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా బీజేపీకి చెందిన కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి నల్ల దుస్తులతో పోలింగ్కు హాజరయ్యారు. మిగతా బీజేపీ ఓటర్లు చేతులకు నల్లరిబ్బన్లు చుట్టుకొని వచ్చారు. -
ప్రపంచ సాగుభూమిలో 15% కలుషితం
భూమి..మన మనుగడకు మూలాధారం. మనం తినే 95% ఆహారానికే కాదు..అనుదినం తాగే నీటికి కూడా ప్రధాన వనరు భూమి. అయితే ఈ భూమిలో దాదాపు 15% విస్తీర్ణం మేర విషతుల్యమైన భార లోహాలతో కలుషితమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా, ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ కాలుష్యం అపరిమితంగా ఉంది. ఆర్సెనిక్, లెడ్ తదితర భార లోహాలు పరిమితికి మించి సాగు భూమిని కలుషితం చేసి ఆహార వ్యవస్థల్లోకి చేరిపోయాయి. సుమారు 140 కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి భార లోహాల కాలుష్యం» అమెరికన్ అసోసియేషన ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ (ఏఏఏఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్య యనానికి చైనాలోని సింగువా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డా. దేయీ హౌ నేతృత్వం వహించారు. ఈ పరిశోధన ఫలితాలపై వ్యాసం ప్రసిద్ధ ‘సైన్స్’జర్నల్లో ఇటీవల ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతీయ అధ్యయనాల గణాంకాలను సేకరించి, మెషీన్ లెర్నింగ్ సాంకేతికత ద్వారా విశ్లేషించారు. » ప్రపంచవ్యాప్త సాగు భూమిలో కనిష్టంగా14% గరిష్టంగా 17% విస్తీర్ణంలో ఈ కాలుష్యం ఉంది. సుమారు 24.2 కోట్ల హెక్టార్ల నేలల్లో భార లోహ కాలుష్యం తిష్ట వేసిందని అధ్యయనం తేల్చింది.ఆర్సెనిక్, కాడ్మియం, కోబాల్ట్, క్రోమియం,రాగి, నికెల్, సీసం వంటి భార లోహాలు అపరిమిత స్థాయిలో సాగు భూమిలో ప్రజారోగ్యానికి తీరనిహాని కలిగించే స్థాయిలో ఉన్నాయని అధ్యయనంతెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్భార లోహాలతో ముప్పేమిటి?శిలలు, మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే లోహాలు, మెటలాయిడ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని నేలల్లో ఉంటాయి. ఇతర లోహాలతో పోల్చితే ఈ లోహాల బరువు అణుస్థాయిలో అధికంగా ఉంటుంది. అందుకే వీటిని భార లోహాలు అంటారు. అవి మన కంటికి కనిపించవు. సేంద్రియ పదార్థం మాదిరిగా కాలగమనంలో భార లోహాలు విచ్ఛిన్నం కావు. ఒక్కసారి మట్టిలో ఇవి కలిశాయంటే దశాబ్దాల కాలం వరకూ పోవు. వీటిని మట్టిలో నుంచి పంట మొక్కల వేర్లు గ్రహిస్తాయి. అవి ఆ పంటల ధాన్యాలు, పూలు, కాయల్లోకి చేరుతాయి. ఆ విధంగా ఆహార చక్రం ద్వారా మనుషుల దేహాల్లోకి చేరుతున్నాయి. » ఈ సమ్మేళనాలు పరిమితికి మించి దేహంలోకి చేరితే మనుషులు, జంతువులు, ఇతర జీవులకు ఆరోగ్యపరంగా తీరని హాని జరుగుతుంది. అయితే, వీటి ప్రతికూల ప్రభావం వెంటనే తెలియదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏయే దేశాల సాగు భూముల్లో ఏయే మోతాదుల్లో భార లోహాలు ఇప్పటికే మితిమీరి ఉన్నాయనే వివరాలు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉన్నాయి. ఇక ముందూ దశాబ్దాల పాటు ఉంటాయి. » జింక్, రాగి వంటివి భార లోహాలైనప్పటికీ అత్యల్ప మోతాదులో మనకు సూక్ష్మపోషకాలుగా మనకు అవసరమే. అయితే, ఆర్సెనిక్, కాడ్మియం, పాదరసం, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉన్నా కేన్సర్, కిడ్నీ, ఎముకల పటుత్వం క్షీణించటంతో పాటు పిల్లల్లో డిజార్డర్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. యురేసియా దేశాలకు అధిక ముప్పు యురేసియా తక్కువ అక్షాంశ ప్రాంతంలోని సాగుభూముల్లో భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. దక్షిణ ఐరోపా, మధ్య ప్రాచ్య, దక్షిణాసియా, దక్షిణ చైనా ప్రాంత దేశాలకు ఈ బెడద అధికం. గ్రీకు, రోమన్, పర్షియన్, చైనా తదితర పురాతన నాగరికతలు విలసిల్లిన ప్రాంతం ఈ హైరిస్క్ జోన్లోనే ఉంది. గనుల తవ్వకం, లోహాలను కరిగించటం, వ్యవసాయం వంటి మానవ కార్యకలాపాలతోపాటు లోహ సంపన్న సహజ రాతి శిలలు ఉండటం, ఇవి తక్కువ వర్షపాత ప్రాంతం కావటమే ఈ కాలుష్యానికి కారణమని పరిశోధకులు విశ్లేషించారు. » అన్నిచోట్లా సాగు భూముల్లో ఈ ఏడు భార లోహాలు ఉన్నాయని కాదు.. కనీసం ఏదో ఒక రకమైనా అపరిమిత మోతాదులో పోగుపడినట్టు శాస్త్రబద్ధమైన అధ్యయనంలో గుర్తించామని డా. దేయీ హౌ స్పష్టం చేశారు. వీటిల్లో కాడ్మియం కాలుష్యం అత్యధికంగా ఉంది. ప్రపంచ నేలల్లో కనీసం 9% భూమిని కలుషితం చేసింది. ఉత్తర, మధ్య భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనాతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కొన్ని ప్రాంతపు నేలల్లో కాడ్మియం ఎక్కువగా ఉంది. » ఆర్సెనిక్ బెడద దక్షిణ చైనా, ఆగ్నేయాసియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంది. నికెల్, క్రోమియం కాలుష్యం మధ్య ప్రాచ్యం, సబార్కిటిక్ రష్యా, తూర్పు ఆఫ్రికాలో ఎక్కువ. కోబాల్ట్ కాలుష్యానికి ప్రధాన కారణం గనుల తవ్వకం. జాంబియా, కాంగో, ఇథియోపియాల్లో ఇది అధికం. » ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తుల వాణిజ్యం విస్తృతంగా జరుగుతున్నందున, ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మాత్రమే ముప్పు పరిమితమైందని భావించడానికి లేదు. కాబట్టి, భార లోహాల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు భూముల స్థితిగతులపై పర్యవేక్షణకు అంతర్జాతీయంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని డా. దేయీ హౌ సూచించారు. -
పోలవరం ఎత్తు కుదింపు
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, తొలిదశ కింద 135 అడుగులకే ఎత్తును కుదించి నిర్మించాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 135 అడుగుల నీటిమట్టంతో నీటిని నిల్వ చేస్తే.. ప్రాజెక్టు కింద తెలంగాణ భూభాగంలో ఎలాంటి ముంపు ఉండదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులకు ఎప్పుడు పెంచితే అప్పుడే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే నిర్వహించే అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఈ నెల 8న హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ అధికారులతో నిర్వహించిన సమావేశం మినట్స్లో ఈ విషయాన్ని పొందుపరిచింది. పోలవరం బ్యాక్వాటర్తో కిన్నెరసాని, మున్నేరువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై మాత్రమే అధ్యయనం చేయాలని ఎన్జీటీ తీర్పు ఇచి్చన నేపథ్యంలో ఆ మేరకే నిర్వహిస్తామని ఈ సమావేశంలో ఏపీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ముంపు సమస్య ఉండదని వాదించింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం మేర నీటిని నిల్వ చేస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపు ప్రభావంపై సైతం ఏకకాలంలో అధ్యయనం చేయాలని సమావేశంలో తెలంగాణ పట్టుబట్టింది. మొత్తం 954.15 ఎకరాల్లో ముంపు ఏర్పడుతుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో తాము స్వయంగా మిగిలిన 5 వాగులకు ఉండే ముంపు ప్రభావంపై అధ్యయనం జరుపుతామని పీపీఏ సీఈఓ అనీల్జైన్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరిపి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. పోలవరం ముంపుపై అధ్యయనం చేయండిఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 6 వాగులకు ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనం నిర్వహించాలని కేంద్ర జలసంఘానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరింది. ఈ మేరకు పీపీఏ సీఈఓ అనీల్జైన్ తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. గతంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం నిర్వహించిన అనుభవం సీడబ్ల్యూసీకి ఉండడంతో మరోసారి సర్వే నిర్వహించాలని అధ్యయనంలో కోరారు. -
ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి
నూతనకల్: రాష్ట్రంలో వివాద రహిత భూ విధానం తేవాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దొర పాలనలో రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ధరణి పోర్టల్ను తెచ్చారని ఆరోపించారు. ధరణి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఎంతో మంది తమ భూములు పట్టా కాకపోవడంతో ఇబ్బందులు పడి కోర్టుల చుట్టూ తిరిగారని చెప్పారు. ధరణి కష్టాలను తొలగించేందుకే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చామని వివరించారు. నిషేధిత జాబితాలోని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తాం ధరణిలో తప్పిదాలు జరిగితే రెవెన్యూ అధికారులు వాటిని సరిచేయడానికి కూడా అధికారం లేకుండా గత పాలకులు చట్టాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నకు లాభం చేయడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణిలో పెండింగ్లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. కొత్తగా 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఇచ్చే పాసు పుస్తకాల్లో సర్వే మ్యాప్ వివరాలు ఉంటాయని తెలిపారు. మండల స్థాయిలో ఏర్పడే సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ధరణి పోర్టల్లో నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వమే ఉచిత దరఖాస్తు ఫారాలను అందించి రైతుల పక్షపాతిగా నిలుస్తోందని తెలిపారు. భూమికి హద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. సదస్సులో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏ పంటలకు బీమా ఇవ్వాలి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓసారి బ్యాంకర్లు, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించినా, పథకం అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం, నష్టపోయిన రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పంటల బీమాపై దృష్టి పెట్టింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశం నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులందరికీ బీమా అందే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఏఏ పంటలకు వానాకాలం, యాసంగిలో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. అయితే కొత్తగా రాష్ట్రం పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయడం కష్టమైన పని కాబట్టి, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్రం చేరే విషయంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయ నం చేసి, రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి.. ప్రాథమిక అంచనాల ప్రకారం అధికార యంత్రాంగం పంట నష్టం కలిగే సంభావ్యత ఆధా రంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించింది. » వానాకాలం సీజన్లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేస్తే, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23 లక్షల ఎకరాలు, పత్తి 44.75 లక్షల ఎకరాలు పోగా మిర్చి, సోయాబీన్, కంది వంటి ఇతర పంటలు కూడా సాగవుతాయి. » యాసంగి సీజన్లో 78 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. » ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2%, యాసంగి పంటకాలంలో 1.5 %, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమి యంలో రాష్ట్రం, కేంద్రప్రభుత్వం 50:50 భరిస్తుందని తెలిపారు. రైతులందరికీ పంటలబీమా వర్తింపచేయడం వల్ల స్థూల పంట విస్తీర్ణంలోని 98% విస్తీర్ణానికి బీమా వర్తిస్తుందని అధికారులు వివరించారు. రైతులందరికీ మేలు జరిగేలా బీమా: తుమ్మలవాతావారణ మార్పుల వలన కలిగే పంట నష్టాన్ని పంటల బీమాతో కొంతవరకు భర్తీ చేసే అవకాశం కలుగుతుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాటా, బత్తాయి మొదలైన పంటలకు బీమా వర్తింపచేసే అవకాశం ఉందన్నారు. పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షంతో నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. -
65 దాటితే 'నో' పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఇదీ షెడ్యూల్..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ⇒ బ్లాక్, మండల అధ్యక్ష పదవుల కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది. ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్ పీసీసీ విధానాన్ని మోడల్గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కోరారు.లేటుగా వచ్చినవారు ఇంటికే.. పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్కుమార్గౌడ్ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల్లో ఈ లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టి అప్డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు.కాగా, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
ఐఏఎస్ స్మితా సబర్వాల్పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతంకేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?IAS అధికారి స్మితా సబర్వాల్పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025 -
జానారెడ్డి ఎపిసోడ్.. రాజగోపాల్రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.అయితే, జానారెడ్డి ఎపిసోడ్పై రాజగోపాల్రెడ్డి.. బుధవారం స్పందించారు. ‘‘జానారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్పై ఒక సభలో మాట్లాడాను. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ రాజగోపాల్రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్రెడ్డి గట్టి హెచ్చరికలే చేశారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది...మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. -
గిన్నిస్ బుక్ రికార్డు: ఒకే కుటుంబంలో ముగ్గురికి అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు. డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్లోడ్ చేశారు. లండన్లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. -
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది.వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు. -
TG: రేపు కూడా భగభగలే..! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.రెడ్ అలర్ట్ జారీ చేసిన తొమ్మిది జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉందని.. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్ మహబూబ్నగర్ జిల్లాలకు వడ గాల్పుల హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. -
కలర్ఫుల్.. సిబ్లింగ్స్ వాక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్లో గానీ సంప్రదించాలన్నారు. -
భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్ రాజ్ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్ రాజ్ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్రాజ్ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది. నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్ రాజ్ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్రాజ్ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఫాల్స్ సీలింగ్ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
కేపీహెచ్బీ కాలనీ(హైదరాబాద్): కూతురు పెళ్లి విషయంలో తలదూర్చవద్దని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన భర్తను కరెంటు షాక్ పెట్టి హత్య చేసిన కేసులో భార్యతో పాటు సహకరించిన మరో ఇద్దరిని కేపీహెచ్బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిలు హత్య కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా లింగాయపల్లికి చెందిన సాయిలును భార్య కవిత గత శుక్రవారం రాత్రి పథకం ప్రకారం విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో కవితకు సహకరించిన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేష్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు మృతదేహాన్ని గుర్తు పట్టకుండా కవర్లో చుట్టి ఆటోలో తరలించి జోగిపేట వద్ద పూడ్చి పెట్టేందుకు యత్నంచగా ఆటో డ్రైవర్ నిలదీయడంతో తిరిగి వారు నివాసం ఉంటున్న మిత్ర హిల్స్కు చేరుకొని అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టారు. అనంతరం ఆటో డ్రైవర్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుట్టు రట్టు చేసిన ఆటో డ్రైవర్... కవర్లో మూటకట్టిన మృతదేహాన్ని చెత్త కుప్పగా నమ్మించి సంగారెడ్డి చెరువులో పడవేసేందుకు ఆటోను మాట్లాడుకొని శనివారం రాత్రి బయలుదేరి వెళ్లగా నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు యతి్నస్తున్న విషయాన్ని ఆటోడ్రైవర్ వలీనాయక్ కనిపెట్టాడు. అనుమానం వచ్చి కవితను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె తిరిగి తమను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడే దించాలని చెప్పడంతో మిత్రహిల్స్ వద్ద దించాడు. అప్పటికే కవర్లో మూటగట్టిన మృతదేహం వాసన రావడంతో అనుమానం వచి్చన ఆటోడ్రైవర్ వలీనాయక్ మరుసటి రోజు కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిని కలిసి విషయం చెప్పాడు. దీంతో హత్య కేసు గుట్టు రట్టయింది. ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పిన వలీనాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు. -
TS Inter Result 2025: ఈసారి కూడా అమ్మాయిలదే హవా
సాక్షి, (హైదరాబాద్): ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ అమ్మాయిల హవానే కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి సత్తా చాటారు. కాగా.. రాష్ట్ర స్థాయిలోనే ఫస్టియర్లో మేడ్చల్– మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సెకండియర్లోనూ ఈ రెండు జిల్లాలు మూడు, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్ జిల్లా మరోసారి చతికిలపడి నిరాశే మిగిలి్చంది. మొత్తమ్మీద ఇంటరీ్మడియట్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్కు 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గత ఏడాది కంటే 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఉత్తీర్ణత ఇలా.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్యా కోర్సులతో కలిపి 73.41 శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.39 శాతం ఉత్తీర్ణత లభించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్లో 66.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.36, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 77.21 శాతం, ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా 77.91, రంగారెడ్డి 77.53, హైదరాబాద్ 67.74 శాతం ఉత్తీర్ణత సాధించాయి.మరోసారి.. సత్తా చాటి.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది సైతం బాలికల హవానే కొనసాగింది. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో ఫలితాలు పరిశీలిస్తే.. మేడ్చల్– మల్కాజిగిరిలో బాలికలు 82.40 శాతం, బాలురు 73.54, రంగారెడ్డి జిల్లాలో 81.92 బాలికలు, 72.24 బాలురు, హైదరాబాద్ జిల్లాలో 74.65 బాలికలు, 60.47 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో.. మేడ్చల్లో 82.21 బాలికలు, 74.56 బాలురు, రంగారెడి జిల్లాలో 82 శాతం బాలికలు, 73.70 బాలురు, హైదరాబాద్ జిల్లాలో బాలికలు 74.81, బాలురు 59.50 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారు. -
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్కు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారుఉదయం 10 గంటల వరకు 50 శాతం ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు.మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది. -
విద్యుదాఘాత మరణాలపై నివేదిక ఇవ్వండి
సిటీ కోర్టులు: వరుసగా జరుగుతున్న విద్యుత్ షాక్ మరణాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ టీజీఎస్పీడీసీఎల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుపాశాలు’ కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యుత్శాఖ కారణంగా సంభవించిన మరణాలపై సమాగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను జూన్ 4లోపు సమర్పించాలని టీజీఎస్పీడీసీఎల్ను ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. శంషాబాద్ కొందుర్గు మండలాలలో ఇటీవల జరిగిన ఘటనలతో పాటు గత ఏడాది కాలంలో 69 మంది విద్యుదాఘాతానికి గురై మరణించడం ఆందోళన కలిగించిందని పేర్కొంది. దీనికి కారణం ప్రమాదకరమైన వైర్లు, ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని కమిషన్ పేర్కొంది. జూన్ 2025 మొదటి వారంలోగా ఈ మరణాలకు సంబంధించి వివరణాత్మక నివేదికలను సమర్పించాలని సీఎండీ టీజీఎస్పీడీసీఎల్ను, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది.గత ఏడాది విద్యుత్ షాక్తో వర్షాకాలంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మరణించిన బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందకపోవడం సంబంధిత అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం.... ప్రజలకు జీవించే హక్కుతో పాటు తమ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోందని కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు సంబంధింత మరణాల్లో ఎక్కువగా కారి్మకులు ఉండడం, వారి మృతదేహాలను సబ్స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణలోపు నివేదిక సమరి్పంచకపోతే నేరుగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని సంబంధిత అధికారులను హెచ్చరించింది. -
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
మణికొండ: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓ యువకుడికి నార్సింగి మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికెట్ జారీ అయింది. దీని ఆధారంగా అతడు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ టాస్్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నార్సింగి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు సదరు బంగ్లాదేశీయుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుదీర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నాడు. దీనికి ముందు అతడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేశాడు. అధికారులు ఇతడికి జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సు«దీర్.. బంగ్లాదేశీయుడికి నార్సింగిలో జని్మంచిన వ్యక్తిగా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు ఇటీవల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జరిగిన పోలీసు వెరిఫికేషన్లో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్్కఫోర్స్ పోలీసులు సుదీర్తో పాటు సదరు బంగ్లాదేశీని అదుపులోకి తీసుకున్నారు.మరింత లోతుగా విచారణమున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న సు«దీర్ రెండు సంవత్సరాల క్రితం ఒకరికి అప్పటి కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు తెలిసింది. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నామని, అతన్ని అదుపులోకి తీసుకుంటున్నామని టాస్్కఫోర్స్ పోలీసులు తెలిపారు. అతను చేసిన అక్రమాలన్నింటినీ వెలుగులోకి తేవాలని, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారికి చెప్పాను. అవసరమైతే మరింత లోతుగా విచారణ చేయాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తాం. – టి. కృష్ణమోహన్రెడ్డి, కమిషనర్, నార్సింగి మున్సిపాలిటీ -
నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
పాలకుర్తి (రామగుండం)/ బంజారాహిల్స్/ నాగోలు (హైదరాబాద్)/భువనగిరి: ఇంటర్మిడియెట్ పరీక్షలో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు బలవన్మరణాని కి పాల్పడ్డారు.పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్నగర్ (జీడీనగర్) గ్రామానికి చెందిన సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కుమార్తె శశిరేఖ (17), బంజారాహిల్స్ రోడ్డునంబర్–2 ఇందిరానగర్కు చెందిన నిష్ట (16), తట్టిఅన్నారం, వైఎస్ఆర్ కాలనీకి చెందిన సుక్కా రవికుమార్ కూతురు అరుంధతి (17), భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన రాసాల మల్లేశ్, సునీత దంపతుల చిన్నకుమారుడు అఖిలేష్ యాదవ్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడి యెట్ ఫలితాల్లో ప్రభుత్వ గురు కులాలు మంచి ఫలితాలు కనబరి చాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలే జీలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో సగటున 80% ఫలితాలు నమోద య్యాయి.అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం ఈసారి ఫలితాలు నిరాశే మిగి ల్చాయి. ఫస్టియర్లో 42 శాతం, సెకెండియర్లో 53 శాతానికి మాత్రమే రిజల్ట్ పరిమితమైంది. ఇక రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే, గంటల కొద్దీ బోధన చేసే ప్రైవేటు కాలేజీల్లో 69.8 శాతం (ఫస్టియర్), 65.83 శాతానికే (సెకెండియర్) రిజల్ట్స్ పరిమితం కావడం గమనార్హం. -
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను నాలుగు వరుసలకు బదులు ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మించాలని భావిస్తున్న ఎన్హెచ్ఏఐ.. ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్లు, వంతెనలు, అండర్పాస్లున్న చోట మాత్రం 8 లేన్లతో రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. ప్రధాన క్యారేజ్వే (రోడ్డు) ఆరు వరుసలుగా నిర్మించటం ఖరారైతే, వంతెనలుండే చోట 8 వరసలుగానే నిర్మించనున్నారు. ఈ మేరకు అన్ని డిజైన్లు మారుస్తున్నారు. ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచి ఉన్నందున, టెండర్ డాక్యుమెంటులో కూడా వివరాలను మారుస్తున్నారు. టెండర్ పిలిచేనాటికి నాలుగు వరసలుగా మాత్రమే రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆలోచన మారినందున, అదే టెండర్ను కొనసాగించాలా, కొత్త టెండర్ పిలవాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 55 మీటర్ల వెడల్పుతో ఇంటర్ఛేంజ్లు, వంతెనలు » ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 11 చోట్ల ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్లు నిర్మిస్తారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట ఈ నిర్మాణాలుంటాయి. ఆయా రోడ్ల నుంచి రింగురోడ్డు మీదకు, రింగురోడ్డు నుంచి ఆయా రోడ్లకు వాహనాలు మారేందుకు వీలుగా లూప్ రోడ్లను అనుసంధానిస్తారు. » ఇవి కాకుండా 3 నదులపై భారీ ఫ్లైఓవర్లు ఉంటాయి. మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద కి.మీ. నిడివితో, మంజీరా నది మీద పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద 600 మీటర్ల నిడివితో, తూప్రాన్ వద్ద హరిద్రా నది(హల్దీవాగు) మీద 500 మీటర్ల పొడవుతో వంతెనలు నిర్మిస్తారు. » చిన్న రోడ్లు, నీటి కాలువలు క్రాస్ అయ్యే 105 ప్రాంతాల్లో వంతెనలు నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఈ ప్రాంతంలో రోడ్డు 5.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. » చెక్డ్యామ్స్, చెరువు కాలువలు, గుట్టల నుంచి జాలువారే కాలువలను క్రాస్ చేసే చోట్ల 85 కల్వర్టులుంటాయి. ఈ ప్రదేశాలన్నిటి వద్ద ప్రధాన రోడ్డు 8 వరుసలతో, 55 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు.ఒక్కో లేన్ 5.31 మీటర్ల వెడల్పు ఒక్కోవైపు నాలుగు వరుసలతో మొత్తం ఎనిమిది వరుసలుగా ట్రిపుల్ ఆర్ ఉంటుంది. ఒకవైపు నాలుగు వరసలు కలిపి 21.25 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే ఒక్కో లేన్ 5.31 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ రెంటి మధ్య సెంట్రల్ మీడియన్ 12.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆర్ఆర్ఆర్ కింద ఉండే రాష్ట్ర, జాతీయ రోడ్లను అనుసంధానించే లూప్లు ఒక్కోవైపు 7.5 మీటర్ల వెడల్పుతో ప్రారంభమవుతాయి. రెండు వైపులా కలిపి 15 మీటర్ల వెడల్పు ఉంటాయి. ఈ లూప్లు ఉండే చోట మొత్తం రోడ్డు వెడల్పు ఏకంగా 70 మీటర్లు ఉండనుండటం విశేషం. 150 ఎకరాల వైశాల్యంలో ఇంటర్ఛేంజ్ కూడలి ఉత్తర రింగులో 11 చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను ట్రిపుల్ ఆర్ క్రాస్ చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్లు నిర్మిస్తారు. ఎనిమిది వరుసలతో నిర్మాణం చేపట్టాలని తాజాగా నిర్ణయించినందున ఈ స్ట్రక్చర్లు అతి భారీగా ఉండబోతున్నాయి. ఔటర్ రింగురోడ్డును కూడా 8 వరుసలతో నిర్మించినా, దానిమీద ఉండే ఇంటర్ఛేంజ్ స్ట్రక్చర్లు ఇంత భారీగా లేవు. ఓఆర్ఆర్ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతోనే నిర్మించారు. అయితే రీజినల్ రింగురోడ్డును ఎక్స్ప్రెస్వే ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దీనిపై 120 కి.మీ.కు మించి వేగానికి అనుమతి ఉంటుంది. ప్రధాన క్యారేజ్వే నుంచి దిగువ రోడ్లలోకి మారేప్పుడు ఉండే లూప్ల మీద వాటి వేగం 60 కి.మీ. నుంచి 80 కి.మీ. వరకు ఉంటుంది. ఓఆర్ఆర్ లూప్స్లో వేగ పరిమితి 30 కి.మీ. మాత్రమే కావడం గమనార్హం. కాగా 60–80 కి.మీ వేగంలో మలుపు తిరగాలన్నప్పుడు లూప్ వ్యాసార్ధం ఎక్కువగా ఉండాలి. దీంతో ఈ లూప్లు కిలోమీటరున్నర దూరం నుంచే ప్రారంభమై వంపు తిరుగుతాయి. ఇందుకోసం ఒక్కో ఇంటర్ఛేంజ్ కూడలిని 120–150 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించనున్నారు. -
ఎంపీసీలో టాప్ 996
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ఈ సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో నలుగురు విద్యార్థులు 1,000కి 996 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు ముగ్గురు విద్యార్థులు 469 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలోనూ 440 మార్కులకు నలుగురు 339 మార్కులు సాధించారు. ఈ సంవత్సరం బైపీసీలో టాప్ మార్కులు 997గా నమోదయ్యాయి. ఇంటర్బోర్డ్ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టాపర్ల వివరాలు ఇలా.. మొదటి సంవత్సరం (ఎంపీసీ): సి.అక్షయ, పుప్పాలగూడ, హైదరాబాద్ 469/470; పుట్టపోగుల వర్షిణి, బాచుపల్లి, హైదరాబాద్ 469/470; మామిడి సంహిత, వనస్థలిపురం, హైదరాబాద్ 469/470.బైపీసీ: బి. లావణ్య, టీఎస్ఆర్జేసీ, మహబూబ్నగర్ 439/ 440; సయ్యద్ అర్షియా సమ్రీన్, మలక్పేట్, హైదరాబాద్ 439/440; హస్పాబేగం, టోలీచౌక్, హైదరాబాద్ 439/440 ; వాదుల వైష్ణవి, బాలానగర్, మహబూబ్నగర్ 439/440. సీఈసీ: ఎండీ ఫర్హాన్, గుర్రంగూడ, రంగారెడ్డి జిల్లా495/500; మునీబ్ అహ్మద్ ఖాన్, కార్వాన్, హైదరాబాద్ 494/500.హెచ్ఈసీ: తంగోరు వెన్నెల, సుదిమళ్ల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ 494/500; జంగం గ్లోరీ, సికింద్రాబాద్ 493/500.మొత్తంగా ఇంటర్ టాపర్స్ ఎంపీసీ: ఇందూరి రషి్మత, రోటరీనగర్, ఖమ్మం 996/1,000 ; వారణాసి మనస్వి, జీడిమెట్ల, రంగారెడ్డి 996/1,000; కూనా రుతి్వక్, కొత్తపల్లి, కరీంనగర్ 996/1,000; పల్లెపంగ వసంత్కుమార్, సూర్యాపేట 996/1,000.బైపీసీ: జక్కు అంజన, కొత్తపల్లి, కరీంనగర్ 997/1,000; కేతావత్ అఖిల, పెంచికల్పాడ్, దేవరకొండ 996/1,000; డి జ్యోత్స్నశ్రీ, కరీంనగర్ 996/1,000.సీఈసీ: ఎనుబారి కెవిక్ జోష్, మేడ్చల్ 988/1,000; భక్తు గ్రీష్మ, భగత్నగర్, కరీంనగర్ 987/1,000.హెచ్ఈసీ: గుండెబోయిన ధనప్రియ, మదీనాగూడ, రంగారెడ్డి 983/1,000; ఓనీ అభినా‹Ù, శేరిలింగంపల్లి, రంగారెడ్డి982/1,000. కాగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.గ్రూప్స్ సాధించడమే లక్ష్యంపల్లెపంగు వసంత్ కుమార్, (996) ఎంపీసీ, ప్రతిభ జూనియర్ కళాశాల, సూర్యాపేట సూర్యాపేట: స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో గ్రూప్– వన్ ఆఫీసర్ కావాలన్నదే నా కల. నాన్న కానిస్టేబుల్ శీనయ్య, అమ్మ జానకమ్మల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగాను. ప్రతిభ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.నా లక్ష్యం డాక్టర్ నేను చదివిన కాలేజీ యాజమాన్యం అందించిన ప్రణాళికాబద్ధమైన బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి రాష్ట్రంలో టాపర్గా నిలవడం గర్వంగా ఉంది. నీట్ పరీక్షలో సత్తాచాటి సీటు సాధించడంతో పాటు వైద్య విద్య అభ్యసించడమే నా లక్ష్యం.– జె.అంజనా, కొత్తపల్లి, కరీంనగర్ (బైపీసీ 997/1000)సివిల్ సర్వెంట్గా..ఇంటర్ సెకండియర్లో అత్యుత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. పటిష్ట ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో అగ్రభాగాన నిలిచినందుకు సంతోషిస్తున్నా. రాబోయే కాలంలో ఉన్నత విద్యనభ్యసించి యూపీఎస్సీ సాధించి సివిల్ సర్వెంట్గా సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా. – కె.రుత్విక్, కొత్తపల్లి, కరీంనగర్ (ఎంపీసీ996/1000) -
సమష్టితత్వంతో ఏదైనా సాధ్యమని హిరోషిమా చాటింది
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజలు సమష్టిగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని ప్రపంచానికి చూపించిన నగరం హిరోషిమా. హిరోషిమా మాదిరిగానే ప్రజల ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి చిహ్నం తెలంగాణ. దూరదృష్టితో విజయం సాధించిన రాష్ట్రం తెలంగాణ. హిరోషిమా నగరానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిరోషిమా అసెంబ్లీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో చివరి రోజైన మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతో కూడిన తెలంగాణ రైజింగ్ బృందం బిజీబిజీగా గడిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా 1945 ఆగస్టు 6న అమెరికా జరిపిన అణు బాంబు దాడిలో నామరూపాల్లేకుండా ధ్వంసమైన హిరోషిమా నగరంలో సీఎం రేవంత్ బృందం పర్యటించింది. వివిధ ప్రాంతాలను సందర్శించడంతోపాటు పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తొలుత హిరోషిమా ప్రిఫెక్చురల్ (రాష్ట్ర ప్రభుత్వం) అసెంబ్లీకి రేవంత్ బృందం విచ్చేయగా వారికి స్పీకర్ తకాషి నకమోటో, శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ‘శాంతి, స్థిరత్వం, సమృద్ధి లాంటి విలువలను పంచుకుందాం. పెట్టుబడులకు పరస్పర సహకారం, భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి వచ్చాం. కలసికట్టుగా మెరుగైన, పచ్చని, సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం’అని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 50కిపైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో పనిచేస్తున్నాయని.. మరిన్ని కంపెనీలను ఏర్పాటు చేయాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరారు. తెలంగాణను సందర్శించి రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. అలాగే హిరోషిమా డిప్యూటీ గవర్నర్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత హిరోషిమా చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్ వద్ద సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నివాళులర్పించారు. ఆపై అక్కడి గాంధీ మెమోరియల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. జపాన్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ బుధవారం హైదరాబాద్కు తిరిగి రానున్నారు.పెట్టుబడులు రూ. 12,062 కోట్లు.. 30,500 ఉద్యోగాలుజపాన్ పర్యటనలో రూ. 12,062 కోట్ల పెట్టుబడులు, 30,500 ఉద్యోగాల సృష్టికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో అత్యధికంగా ఎన్టీటీ డేటా–నెయిసా నెట్వర్క్స్ హైదరాబాద్లో రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని పేర్కొంది. అలాగే మారుబెని కంపెనీ రూ. వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడి ద్వారా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్సŠట్ జనరేషన్ ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుందని.. మొత్తంగా రూ. 5,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో 30 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. తోషిబా అనుబంధ కంపెనీ టీటీడీఐ హైదరాబాద్ శివార్లలో మూడో విద్యుత్ పరికరాల ప్లాంట్ ఏర్పాటు కోసం రూ. 562 కోట్ల పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకుందని వివరించింది. టామ్కాతో కుదిరిన ఒప్పందం ద్వారా 500 ఉద్యోగాలకు ఒప్పందం కుదర్చుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. -
దెబ్బతిన్నా తిరిగి లేస్తాం: కేటీఆర్
శూన్యం నుంచి సునామీని సృష్టించి లక్ష్యాన్ని చేరుకున్న అసాధారణ నేత కేసీఆర్. ఆయన మార్గదర్శకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం. బీఆర్ఎస్ మాత్రమే రాజీ పడకుండా కొట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే భావన ప్రజల్లో బలంగా ఉంది..రాబోయే రోజుల్లో కేంద్రంలో సొంత బలంతో ఏ జాతీయ పార్టీ అధికారంలోకి రాదని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. బీఆర్ఎస్తో పాటు దెబ్బతిన్న ప్రాంతీయ పార్టీ లు తమ సొంత రాష్ట్రాల్లో పుంజుకుని మరింత బలంగా ఎదుగుతాయని అన్నారు. దెబ్బతిన్నా తిరిగి నిల్చుంటామని స్పష్టం చేశారు. తమకు ఎదురైంది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని, తిరిగి ప్రజాదరణ పొందుతామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోందని, తెలంగాణలో బీజేపీతో కలిసి టీడీపీ, పవన్ కల్యాణ్ వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కుల, మతాలు అనే తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడే పార్టీ లు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ యే రక్షణ కవచం. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభం.’’ఇక్కడి ప్రజలపై మాకు ఉన్న ప్రేమలో అణువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదు. అందుకే 25 ఏళ్లుగా తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను మరో 50 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ప్రజలు కాపాడుకోవాలి..’అని కేటీఆర్ అన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీగా అవతరించి బీఆర్ఎస్గా కొనసాగుతున్న పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం, పదేళ్ల పాలన, రజతోత్సవాలు, వర్తమాన రాజకీయాలు, తదితర అంశాలపై ఆయన స్పందించారు.సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గాపార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని ఎలా చూస్తున్నారు? కేటీఆర్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ లు రజతోత్సవాలు నిర్వహించుకోవడం ఆషామాషీ కాదు. అధికారం కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు చాలా పార్టీ లు ఒక లక్ష్యం కోసం ప్రారంభమై గమ్యాన్ని చేరుకోక మునుపే మూత పడతాయి. ‘‘టీఆర్ఎస్ పిడికెడు మందితో ప్రారంభమై 60 లక్షల మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్గా ఎదిగింది. ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం..ఇలా ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా వారి గొంతుకగా నిలుస్తున్నాం. మరో 50 ఏళ్ల పాటు పార్టీ నిలిచేలా చేసే అద్భుతమైన నాయకత్వం మా పార్టీ సొంతం. 25 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పేరు మాత్రమే మారింది. మా జెండా, ఎజెండా, గుర్తు, నాయకుడు, సిద్ధాంతం మారలేదు..’’ప్రజల బాగోగులు ఎజెండాగా పని చేయడమే మా పార్టీ భావజాలంసాక్షి: ఉద్యమ సమయంలో సవాళ్ల నడుమసాగిన ప్రయాణం ఎలా అనిపించింది? కేటీఆర్: మొండితనం, పట్టుదల, నమ్మిన సిద్ధాంతంపై రాజీ పడకపోవడం, నిజాయితీ.. ఇవే కేసీఆర్ ఆస్తులు. ధన, కుల, మీడియా బలం లేకున్నా పార్టీని ప్రారంభించి తెలంగాణ అస్తిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలతో రాటుదేలిన కేసీఆర్కు ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకునే శక్తి ఉంది. పార్టీని ప్రారంభించింది మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ చరిత్ర మార్చిన నాయకుడు ఆయన. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ సాధించిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. పదేళ్లు అధికారంలో ఉన్నదాని కంటే ఎక్కువ సంతృప్తినిచ్చింది.కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనంపై ఎందుకు వెనక్కి తగ్గారు? పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియాఇంటికి వెళ్లి పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. సోనియా సూచన మేరకు దిగ్విజయ్ సింగ్తో విలీనంపై జరిపిన సంప్రదింపుల్లో కాంగ్రెస్నిజాయితీగా స్పందించలేదు. తనను నమ్ముకున్న వందలాది మందినాయకులు, వేలాది మంది కార్యకర్తల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోవడంతో విలీనం ప్రతిపాదనను కేసీఆర్ విరమించుకున్నారు. తమిళనాడులో డీఎంకే తరహాలో తెలంగాణకు ఒకగొంతు ఉండాలని పౌర సమాజం నుంచి ఒత్తిడి కూడా రావడంతో స్వతంత్రంగా ఉండేందుకే కేసీఆర్ ఇష్టపడ్డారు.సాక్షి: కొత్త రాష్ట్రంలో ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు? కేటీఆర్: జమిలి ఎన్నికల పేరిట రెండు జాతీయ పార్టీ లు నాటకం ఆడుతున్న సమయంలో తెలంగాణను దేశం ముందు ఆవిష్కరించేందుకు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఆరు నెలల పదవీ కాలాన్ని పక్కన పెట్టి ఎన్నికలకు వెళితే 88 సీట్లతో అసాధారణ గెలుపు నమోదు చేశాం. ఇది కేసీఆర్ సమర్థతకు ప్రజలు ఇచ్చిన సరి్టఫికెట్. రెండో టర్మ్లో పెద్ద నోట్ల రద్దు, కరోనాతో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా సమర్థవంతమైన నాయకత్వం అందించాం. మూడోసారి కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయినా మేము తుడిచి పెట్టుకుపోలేదు. కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మోడల్ సాధించిందేమిటి? 2014లో తెలంగాణలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించి విద్యుత్, సాగునీరు, తాగునీరు సహా అనేక అంశాల్లో తన దూరదృష్టితో కేసీఆర్ సమగ్ర, సమతుల్య, సమీకృత అభివృద్ధి నమూనాను ఆవిష్కరించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వినతులు మేరకే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. భవిష్యత్తులోనూ జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకున్నారా? పదేళ్ల పాలనలో మేము చేసిన మంచి పనులను సరిగా ప్రచారం చేసుకోలేక పోయాం. విప్లవాత్మక పథకాలు అమలు చేసినా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. నాతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఓటమికి కారణం. మరోవైపు కాంగ్రెస్ ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడంతో ప్రజలు మోసపోయారు. మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం తదితరాలు ప్రభావం చూపాయి. రాజకీయ పునరేకీకరణతో బహుళ నాయకత్వ సమస్యతో ఓటమి చెందామనే వాదన కూడా సరికాదు. ఇది తాత్కాలికమైన చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. శాశ్వతంగా ఇదే పరిస్థితి కొనసాగదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాదరణ రుజువు చేసుకుంటాం. ఫామ్హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ అనే విమర్శలను ఎలా చూస్తారు? అధికారం చేతిలో పెట్టినా రాష్ట్రాన్ని నడపలేక చేసే విమర్శలు అవి. కేసీఆర్ ఆయన నియోజకవర్గంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో ఇటీవల ఫామ్హౌస్ పాలన కావాలా, కాంగ్రెస్ పాలన కావాలా అని పోల్ పెడితే ప్రజలు ఫామ్హౌస్ వైపు మొగ్గు చూపారు. ఇక సీఎం రేవంత్ కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం. పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఎందుకు వచ్చింది? తెలంగాణ బిడ్డగా కేసీఆర్ స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చా. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్పై పనిభారం తగ్గించేందుకు 2018 డిసెంబర్లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఆరున్నరేళ్లలో 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, 60 లక్షల సభ్యత్వం, అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం. అధికారం కోల్పోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, కేసీఆర్కు అనారోగ్యం వంటి సమస్యలు ఎదురైనా కేడర్లో విశ్వాసం కల్పించాం. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించేలా పనిచేస్తా.పార్టీ రజతోత్సవంసందర్భంగా మీ సందేశం తెలంగాణ ఇంటి పార్టీ మాది.రాబోయే రోజుల్లో విద్యార్థి, యువజన, మహిళా విభాగాలను బలోపేతం చేసి సంస్థాగతంగా బలోపేతం చేస్తాం.కేసీఆర్ను తిరిగి సీఎం చేసేంత వరకు ఒక కార్యకర్తగా పనిచేస్తా.నాతో కలిసి వచ్చే పార్టీ శ్రేణులనుకంటికి రెప్పలా కాపాడుకుంటా. బీజేపీ నుంచి కొత్త పోటీఎదురవుతోందా?కేసీఆర్ స్థాయి రాష్ట్ర రాజకీయాల్లో ఏ ఇతర నేతకూ లేదు. మేం బ్యాగులు, చెప్పులు మోసే నాయకులం కాదు. ఎవరికీ తలవంచకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ దశాబ్దాల కల నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణలో జరిగిన మూడు ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటలేదు. మోదీకి ఆదరణ క్రమంగాతగ్గుతున్న తరుణంలో ఆ పార్టీని పోటీగా భావించడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అఖండ మెజారిటీ సాధిస్తుంది. మరోవైపు రేవంత్.. సొంతూరుకు చెందిన మాజీ సర్పంచ్ మొదలుకుని రాష్ట్రమాజీ ముఖ్యమంత్రిపైనా ఆరోపణలతో అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ప్రజల దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ పలుచన అవుతున్నాయి.−కల్వల మల్లికార్జున్రెడ్డి -
ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల హవా..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో బాలికలు అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలురు 57.83 శాతం పాసయితే, బాలికలు ఏకంగా 73.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 57.31 ఉంటే, బాలికల ఉత్తీర్ణత శాతం దాదాపుగా ఫస్టియర్ మాదిరే 74.21 శాతం నమోదైంది. మొత్తంగా (రెండేళ్ళు కలిపి) ఈ ఏడాది ఇంటర్ ఉత్తీర్ణత 65.81గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 5%ఎక్కువ. ఆసిఫాబాద్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత మార్చి 5 నుంచి 25వ తేదీల మధ్య ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలకు రెండు సంవత్సరాలకు కలిపి 9,97,012 మంది హాజరయ్యారని, వీరిలో 6,56,099 మంది పాసయ్యారని భట్టి తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు చేసిందని తెలిపారు.కాగా ఫస్టియర్లో మహబూబాబాద్, సెకెండియర్లో కామారెడ్డి అతితక్కువ ఉత్తీర్ణత నమోదు చేశాయని ఆయన వివరించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగిరాణా, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, ప్రత్యేక కార్యదర్శి హరిత, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరీక్ష విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్ తదితరులు పాల్గొన్నారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. జూన్ 3 నుంచి ఆరు వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని చెప్పారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా ఫలితాలకు సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కొనుడే ‘బంగార’మాయే!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వస్తువు ధరలో హెచ్చు తగ్గులు వస్తే వినియోగదారుడు లేదా వ్యాపారిలో ఎవరో ఒకరికి లాభం చేకూరుతుంది. కానీ, బంగారం ధర రూ.లక్ష దాటడం వల్ల అటు కొనుగోలు దారుడు, ఇటు అమ్మకం దారుడు కూడా ఆనందంగా లేకపోవడం గమనార్హం. మంగళవారం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.లక్షా 2 వేలకు చేరింది. గత సంవత్సరం ఇదే సమయంలో రూ.61,000 ఉంది. అంటే ఏడాది కాలంలోనే 62% పెరిగింది. మూడు నెలల క్రితం రూ.80 వేలకు చేరువలో ఉన్న 10 గ్రాముల బంగారం.. 90 రోజుల్లో 20 శాతం పెరిగి రూ.లక్షను దాటింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చినా బంగారం దుకాణాల వద్ద పెద్దగా జనం కనిపించక వెలవెలబోతున్నాయి.50% తగ్గిన అమ్మకాలుహైదరాబాద్లో ధరలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉండేది. అయితే 10 గ్రాముల ధర రూ.80 వేలు దాటినప్పటి నుంచి కొనుగోళ్లు మందగించాయి. హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం దుకాణాల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 30 నుంచి 50 శాతం వరకు అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తగ్గుదల 35% దాటిందని జెమ్స్ అండ్ జువెల్లరీ అసోసియేషన్ ప్రకటించింది.ఆభరణాల కన్నా ‘ముద్ద’గానే..బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఇష్టం. కానీ, ధర భారీగా పెరగటంతో బంగారాన్ని 22 క్యారట్ల ఆభరణంగా ధరించడం కన్నా భవిష్యత్ పెట్టుబడిగా ‘నిల్వ’చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆభరణంగా చేయిస్తే తరువాత ఎప్పుడైనా విక్రయించేటప్పుడు తరుగు, నాణ్యత, వీఏ పేర్లతో దాని విలువను వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేస్తారు. అదే బిస్కట్, కడ్డీ రూపంలో ఉంటే విలువలో తేడా ఉండదు. బేగంబజార్లోని బంగారం దుకాణాల్లో గత కొద్ది రోజులుగా 24 క్యారట్ల 100 గ్రాముల బంగారం బిస్కట్లను ఎక్కువగా విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. 10, 20 గ్రాముల బంగారు బిల్లలకు కూడా డిమాండ్ ఉందని చెప్పారు. ధరలు అనూహ్యంగా పెరగటంతో ఇళ్లలో ఉన్న బంగారాన్ని కూడా విక్రయించి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నవారు కూడా ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారుల్లో ఆందోళనవివాహాల సీజన్లోనూ ప్రజలు పెళ్లిళ్ల బడ్జెట్లో బంగారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపెద్ద ఆభరణాల దుకాణాలు ఈఎంఐ స్కీమ్లు, మేకింగ్ చార్జీలపై రాయితీలు, పాత బంగారం మార్పిడి మీద అదనపు బెనిఫిట్స్ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి బంగారు ఆభరణాల దుకాణాలు తెరిస్తే ధరల పెరుగుదలతో ప్రజలు తమ దుకాణాల వైపే రావడం లేదని పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యాపారి కొమురవెళ్లి వెంకటరమణా చారి ఆందోళన వ్యక్తం చేశారు.కొనడానికి ఎవరూ రావడం లేదు10 గ్రాముల బంగా రం ధర రూ.లక్షకు చేరడంతో బేగంబజార్తోపాటు రాష్ట్రమంతటా బంగారం వ్యాపారం పడిపో యింది. బంగారం కొనడానికి ఎవరూ రావడం లేదు. మూడు నెలల్లోనే దాదాపు 50 శాతం కన్నా ఎక్కువే అమ్మకాలు తగ్గాయి. అమ్మకాలు సాధా రణ స్థితికి రావడం ఇప్పట్లో కష్టమే. – కంకర్ల రాకేశ్,బంగారం వ్యాపారి, బేగంబజార్ఖాళీగా కూర్చుంటున్నాం బంగారం ధరలు పెరగడంతో గిరాకీ తగ్గింది. పెళ్లిళ్లు, శుభ కార్యాలయాలకు కూడా ఆభరణాలు చేయించుకోవడానికి జనం రావడం లేదు. కరీంనగర్లో ఎప్పుడూ కళకళలాడే ఆభరణాల దుకాణాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 22 క్యారట్ల ఆభరణాల కొనుగోళ్లు తగ్గడం బంగారు పరిశ్రమ మీద ఆధారపడ్డ వారిని అంధకారంలోకి నెడుతోంది. – ఈశ్వరోజు వెంకటేశ్వర్లు,రాఘవేంద్ర జ్యువెల్లర్స్, కరీంనగర్ -
కుసుమ్కు ఈఆర్సీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పీఎం–కుసుమ్ పథకం కాంపోనెంట్–ఏ కింద 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ) అనుమతిచ్చింది. మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల (ఎస్హెచ్జీ) నుంచి 1,000 మెగావాట్లు, రైతుల నుంచి 3,000 మెగావాట్లు కలిపి మొత్తం 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ను యూనిట్కు రూ.3.13 ధరతో 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుసుమ్ పథకం కాంపోనెంట్–ఏ కింద కేంద్రం గతంలో రాష్ట్రానికి 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిచ్చి, ఆ తర్వాత 1,000 మెగావాట్లకు తగ్గించింది. రాష్ట్రప్రభుత్వం మాత్రం 4,000 మెగావాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ఆహ్వానించగా, పెద్ద సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. కేంద్రం 1,000 మెగావాట్లకే అనుమతివ్వగా, మిగిలిన 3,000 మెగావాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఏ విధంగా అనుమతులిస్తారని గతంలో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో కొందరు ప్రశ్నించారు. రద్దు చేసిన 3000 మెగావాట్ల అనుమతులను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. ఒకవేళ కేంద్రం అనుమతివ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గంలో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గత నెలలో ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించిన తర్వాత, అందుకు అనుమతి కోరుతూ ఈఆర్సీకి దరఖాస్తు చేయగా.. ముందు తీసుకున్న చర్యలకు తర్వాత అనుమతులు ఇవ్వలేమని డిస్కంలకు ఈఆర్సీ స్పష్టం చేసింది. రైతులు–డెవలపర్ల మధ్య జరిగే భూముల లీజు ముసాయిదా ఒప్పందాన్ని సైతం ఆమోదించడానికి నిరాకరించింది. ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)కు మాత్రం ఆమోదం తెలిపింది. 28 వేల సౌర పంప్సెట్ల ఏర్పాటు కుసుమ్–సీ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి 28 వేల సోలార్ పంప్సెట్లను కేంద్రం మంజూరు చేసిందని డిస్కంలు ఈఆర్సీకి తెలిపాయి. కాంపోనెంట్–బీ కింద ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్సెట్ల ఏర్పాటుకు సైతం అనుమతులు కోరుతున్నామని వివరించాయి. -
అద్దె బస్సులూ సై అంటేనే సమ్మె సక్సెస్
సాక్షి, హైదరాబాద్: టీజీఆర్టీసీలో సమ్మె అనివార్యమైతే అద్దె బస్సులు, గ్రాస్కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను కూడా సమ్మెలో భాగం చేసేలా కార్మిక సంఘాలు కసరత్తు ప్రారంభించాయి. వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మె ఉంటుందని ఆర్టీసీలోని ఒక జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రస్తుతం అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో పాల్గొని బస్సులను బయటకు తీయకున్నా, అద్దె బస్సులు రోడ్డెక్కితే ప్రయాణికులకు కొంతవరకు రవాణా కష్టాలు దూరమవుతాయి. దీంతో సమ్మె ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదన్నది కార్మికసంఘాల ఆందోళన. ప్రస్తుతం ఆర్టీసీలో 9,400 బస్సులున్నాయి. వీటిల్లో ఆర్టీసీ సొంత బస్సులు 6,200 మాత్రమే. మిగతావాటిలో 2,800 అద్దె బస్సులు, 400 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. వీటికి డ్రైవర్లుగా ఆర్టీసీ సొంత ఉద్యోగులు ఉండరు. ఆ బస్సుల యజమానులే డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంటారు. సమ్మె ప్రారంభమైతే అద్దె బస్సుల యజమానులు తమ డ్రైవర్లతో 3,200 బస్సులను నడుపుతారు. 34 శాతం అద్దె బస్సులే2019లో 53 రోజుల పాటు సమ్మె జరిగిన సమయంలో ఆర్టీసీలో 11 వేల వరకు బస్సులుంటే, ఆద్దె బస్సులు 1,800 మాత్రమే ఉన్నాయి. సమ్మె ముగిసిన వెంటనే 2 వేల బస్సులు తొలగించాలని నాటి సీఎం కేసీఆర్ ఆదేశించటంతో అంతమేర బస్సులను ఆర్టీసీ ఉపసంహరించింది. ఆ తర్వాత కూడా సొంత బస్సుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. వాటి స్థానంలో అద్దె బస్సుల సంఖ్యను సంస్థ పెంచింది. ఫలితంగా ఇప్పుడు అద్దె బస్సులు 34 శాతానికి చేరాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల వరకు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో 1,500 మంది ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొంతమంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. సమ్మె నాటికి మిగతా ఔట్సోర్సింగ్ డ్రైవర్లు కూడా విధుల్లోకి వస్తారు. వీరు కూడా సమ్మె సమయంలో బస్సులను తిప్పేందుకు అందుబాటులో ఉంటారు. వెరసి సగం బస్సులు రోడ్డెక్కటం ఖాయంగా ఉంది. ఈ పరిస్థితి సమ్మెకు అడ్డంకిగా మారుతుందని సంఘాలు భావిస్తున్నాయి. అద్దె బస్సుల నిర్వాహకులతో చర్చించి వారు కూడా సమ్మెకు మద్దతిచ్చేలా చూడాలని కొన్ని సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి. డ్రైవర్, కండక్టర్లతో పాటు సూపర్వైజర్ల సంఘం కూడా సమ్మెకు మద్దతిచ్చేలా చూడాలని పేర్కొంటున్నాయి. రెండు జేఏసీల మధ్య కొనసాగుతున్న విభేదాలుఆర్టీసీలో ఒక జేఏసీ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చింది. మరో జేఏసీ దీనికి దూరంగా ఉంది. మొదటి జేఏసీ మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి రెండో జేఏసీని, జేఏసీల్లో భాగం కాని ఎస్డబ్ల్యూఎఫ్, ఎస్డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) నేతలను ఆహ్వానించింది. అయితే, ఆహ్వానించిన తీరు సరిగా లేదని రెండో జేఏసీ సమావేశంలో పాల్గొనలేదు. ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు సమావేశంలో పాల్గొన్నా.. మొదటి జేఏసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్డబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హాజరైనా, రెండో జేఏసీ సహా ఎస్డబ్ల్యూఎఫ్లు సమ్మెకు సిద్ధమైతేనే తాము సమ్మెకు మద్దతిస్తామని ప్రకటించారు. మరోవైపు ఐక్య కార్యాచరణను సాధించేందుకు రెండో జేఏసీ ఈ నెల 28న సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. -
మహేశ్బాబుకు ఈడీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంస్థలకు ప్రచారకర్తగా పనిచేసిన ప్రముఖ సినీ నటుడు మహేశ్బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఈ నెల 28న బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని సోమవారం సమన్లు జారీచేశారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. మహేశ్బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఈ సోదాల్లో ఆధారాలు లభించాయి. దీంతో ఆయనకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు వచ్చే సమయంలో పాన్కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్స్ను తీసుకురావాలని సూచించారు. ఇదీ కేసు నేపథ్యం సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నవంబర్లో ఈ సంస్థలపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 11 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. గ్రీన్ మెడోస్ ప్రాజెక్ట్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు సతీష్చంద్ర గుప్తాపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లోనూ గతేడాది కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో ఈసీఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. అయితే, ఒకరికి విక్రయించిన ప్లాట్ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ క్రమంలోనే నటుడు మహేశ్బాబుకు రూ.5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్ నుంచి చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఆయనకు సమన్లు జారీచేశారు. -
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో.. నాకేం తెలుసు.. ఆయనకు ఎప్పుడు ఖాళీదొరికితే అప్పుడే నా పెళ్లి.. ఓహో.. పురోహితుడు డేట్స్ కుదరలేదా.. అవునులే.. అసలే ఇప్పుడు పంతుళ్ళకు బిజీ ఉంది.. అయన తీరిక దొరికాక ఏదో డేట్ చెబుతాడు.. చేసుకుందువులే.. .. పురోహితుడు కాదు.. వేరే అయన డేట్స్ కుదరాలి.. ఓహో.. అర్థమైందిరా పిల్ల అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఆయనకు సెలవులు.. డేట్స్ దొరకలేదు.. అయన వస్తేగానీ పెళ్లి వద్దన్నారు ఆడపిల్లవాళ్ళు.. అయన వచ్చాకే చేసుకుందువులే.. అన్నారు పెద్దలు.. అది కాదు.. అన్నాడు గణేష్.. మరింకేందిరా.. ఇంకెవరి డేట్స్ కుదరాలి.. రేవంత్ రెడ్డి డేట్స్ కుదరాలి.. చెప్పాడు గణేష్.. వార్నీ.. అదేందిరా అన్నారు పెద్దలు.. అదంతే.. రేవంత్ రెడ్డి వస్తేనే నా పెళ్లి.. లేదంటే లేదు అంటుకుంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కుర్రాడు.. పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లను ఎవరైనా ఒరేయ్ అబ్బాయ్ నీ పెళ్లి ఎప్పుడురా అంటే ఇదిగో జాబ్ రాగానే చేసుకుంటాను.. ఇదిగో మా మరదలు ఒకే అనడమే లేటు.. అయ్యో.. ఇల్లు పని మధ్యలో ఉంది.. అది పూర్తయ్యాక బ్యాండ్ వాయించడమే.. జీతం తక్కువ ఉంది పెద్దయ్యా.. వచ్చే ఏడాది జీతం పెరగ్గానే చేస్కుంటా.. నువ్వే పిల్లను చూడు... నేనా అమెరికా వెళ్తున్న రెండేళ్లు అక్కడ ఉండి వస్తాను.. రాగానే చేసేసుకుంటా... లేదు బాబాయ్.. పిల్లలు దొరకడం లేదు.. పోనీ నువ్వైనా చూడు.. చేస్కుంటా.. అంటూ సమాధానాలు వస్తాయి.. కానీ ఈ కుర్రాడు మాత్రం.. నీ పెళ్లి ఎప్పుడురా అంటే షాకిచ్చే సమాధానం ఇచ్చాడు.. ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి సార్ నాకు ఉద్యోగం చూడండి.. లేదా మంత్రికి చెప్పి ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పించండి.. ఇంకా పెద్దాయనకు చెప్పి నాకు మెడిసిన్ సీట్ ఇప్పించండి అని కోరుకుంటారు.. సదరు నాయకుడు కూడా తన కార్యకర్త మాటను గౌరవించి మున్ముందు తనకు ఉపయోగపడే తీరునుబట్టి రికమెండేషన్ చేస్తారు. కానీ ఇదిగో తెలంగాణలోని వైరా నియోజకవర్గానికి చెందిన భూక్యా గణేష్ అనే యూత్ నాయకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరాడు. తన పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే అని పట్టుబట్టాడు.. అయన ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను అని ఫిక్షయ్యాడు. దీంతో ఏకంగా ఎమ్మెల్యే రామ్ దాస్ మాలోత్ కు ఒక లెటర్ రాసాడు.. ఇదిగో అన్నా.. నేను మీ నియోజకవర్గంలో నాయకుణ్ణి పెళ్ళికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ.. ఒక విజ్ఞాపన అందించాడు.. దాన్ని సదరు ఎమ్మెల్యే సీఎం కు ఫార్వార్డ్ చేసాడు.. మా ఊరి కుర్రాడికి పెళ్లి కుదిరింది.. మీరైతే రావాల్సిందే.. రాకుంటే నాకు ఇజ్జత్ పోయేలా ఉంది.. ఏదైనా చేసి రండి సారూ అంటూ ఆ ఎమ్మెల్యే కూడా సీఎం కు ఆ లెటర్ పంపాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు డేట్స్ కుదురుతాయో.. భూక్యా గణేష్ పెళ్ళికి.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
‘మా ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వదిలిపెట్టం’.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్రెడ్డికి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc) ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్లలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్నా, భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్టప్రకారం లేదని దుయ్యబట్టింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు హైదరాబాద్ నందినగర్లో కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలి. లగచర్లలో మహిళలపై దాడి చేశారు. బాధితుల పకక్షాన ఎన్హెచ్ఆర్సీని సంప్రదించాం. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళతాం. లగచర్లలో ఓవర్ యాక్షన్ చేసిన అధికారులను వదలం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షిస్తాం’ అని హెచ్చరించారు. -
మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ అమరిక.. రోబోటిక్ శస్త్రచికిత్సతో అద్భుతం
హైదరాబాద్: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి సొంత మూత్రపిండాన్నే శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు... పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సాధారణ స్థితికి తీసుకొచ్చారు.ఈ వృద్ధుడికి 2023లో వేరేచోట మూత్రపిండాల్లో రాళ్లు తీయడానికి మామూలు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదకరంగా పెరిగిపోయి, విపరీతమైన నొప్పి, తరచు జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు (నెఫ్రోస్టమీలు) అమర్చి బయటి నుంచి మూత్రం పంపేవారు. పలు రాష్ట్రాలు తిరిగినా ఏ ఆస్పత్రీ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. సమగ్ర పరీక్షలు చేసిన తర్వాత.. అతడి మూత్రనాళాలు చాలావరకు పూడుకుపోయినట్లు గుర్తించారు. ఇది చాలా అరుదు, సమస్యాత్మకం కూడా.కుడివైపు కిడ్నీ కోసం వైద్యులు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దాన్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనాళం పరిమాణంలోనే ఉంటుంది. రోబోటిక్ శస్త్రచికిత్సతో దీన్ని మార్చారు. ఇది చాలా అరుదుగా చేసే చికిత్స. దీన్ని అపెండిక్స్ ఇంటర్పొజిషన్ అంటారు.“మూత్రనాళం బాగా పూడిపోఉయినప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇది అత్యంత సృజనాత్మకమైన, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. సాధారణంగా ఇలా చేయరు. కానీ ఈ రోగి కేసులో ఇదే సరైన పరిష్కారం” అని ఏఐఎన్యూలోని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్,యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు.సొంత కిడ్నీ మార్పిడి ఇలా.. రెండు నెలల తర్వాత అతడి ఎడమవైపు కిడ్నీ ఇంకా అలాగే ఉంది. అపెండిక్స్ కుడివైపే ఉంటుంది కాబట్టి రెండోవైపు పేగులను తీసి అమర్చవచ్చు. కానీ, అందులో ఈ వృద్ధుడికి సమస్యలు ఉండడంతో అత్యంత అరుదైన పరిష్కారాన్ని వైద్యులు ఎంచుకున్నారు. అదే.. సొంత కిడ్నీనే మార్చడం. ఈ సంక్లిష్టమైన చికిత్సలో.. రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దాన్ని కొంత కిందభాగంలో అమర్చారు. తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు.“సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా పెద్ద ఆస్పత్రుల్లోనే చేస్తారు. ఇది చిట్టచివరి పరిష్కారం. చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు. ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధారణ స్థితికి చేరుకున్నారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధారణంగా ఉంది. నొప్పి, ఇతర సమస్యలూ తగ్గిపోయాయి.“ఈ కేసు వైద్యపరంగా ఓ సరికొత్త విజయం. రెండు కిడ్నీలను కాపాడేందుకు రెండు విభిన్న రకాల, అత్యాధునిక శస్త్రచికిత్సలు చేశాం. ఒకదాంట్లో అపెండిక్స్ను ఉపయోగించగా, మరోదాంట్లో సొంత కిడ్నీనే మార్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ” అని ఏఐఎన్యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి కూడా పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు. -
‘భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుంది’
హైదరాబాద్: త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ 2025 అనేది చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ కు సంబంధించి ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన.. ‘జాతీయ , అంతర్జాతీయ రాజకీయ, సామాజిక ,ఆర్దిక సమస్యల పై సమ్మిట్ లో చర్చ జరుగుతుంది. వందకు పైగా దేశాల నుంచి 400మందికి పైగా రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్థితిగతుల లో నిష్టాతులైన వారు సమ్మిట్ కు హాజరవుతారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ లను ఆహ్వానించాం. రోహిత్ వేముల చట్టం తీసుకువస్తాం. ఈ చట్టం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఓత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్ ఇమేజ్ పెరగనుంది. ఖర్గే, సోనియా, రాహుల్ ,ప్రియాంక గాంధీ లతో పాటు కార్పోరేట్ పెద్దలకు ఆహ్వానం. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై సీఐడీ కేసు
హైదరాబాద్,సాక్షి: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేచెన్నమనేని పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్ నెలలో చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేష్ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొనసాగుతోంది. ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గతేడాది అక్టోబర్లో తీర్పు రిజర్వు చేసి డిసెంబర్ నెలలో తుది తీర్పును వెలువరించారు. -
శానిటరీ ప్యాడ్ల ఫ్యాక్టరీపై బీఐఎస్ దాడులు
హైదరాబాద్: ఐఎస్ఐ మార్కు లేని శానిటరీ ప్యాడ్లు సరఫరా చేస్తున్న ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం, కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జరిగిన సోదాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 30 వేల ప్యాడ్లు, 7వేలకు పైగా లేబుల్ కవర్లకు ఐఎస్ఐ మార్కు లేనట్లు గుర్తించిన అధికారులు వాటన్నింటినీ జప్తు చేశారు.మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఐఎస్ 5405:2019 ప్రమాణాలున్న శానిటరీ ప్యాడ్లను భారత ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ గెజిట్ ద్వారా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. బీఐఎస్ ధ్రువీకరణ పొందకుండా అమ్మినా, తయారు చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించింది. అయితే, ఈ కేంద్రంలో ఎలాంటి ధ్రువీకరణ లేకుండా పెద్ద ఎత్తున శానిటరీ న్యాప్కిన్లు నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అందడంతో సోదాలు నిర్వహించినట్లు బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధిపతి, సంచాలకులు పీవీ శ్రీకాంత్ తెలిపారు. జాయింట్ డైరెక్టర్లు సవిత, రాకేశ్ తన్నీరు ఆధ్వర్యంలో బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా మొదటిసారి, ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా రెండోసారి, తదుపరి దీనికి పదిరెట్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం 679 ఉత్పత్తులను తప్పనిసరి చేస్తూ పలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుదల చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్క వినియోగదారుడూ అవగాహన కలిగి ఉండాలని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వస్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాలని, ఉల్లంఘనలను గుర్తిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. -
ఐదేళ్లుగా అదే పని.. మహిళలు స్నానం చేస్తుండగా..
వెంగళరావునగర్(హైదరాబాద్): మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని మధురానగర్ అసోసియేషన్ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం... మధురానగర్కాలనీ కమ్యూనిటీహాల్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వారి కుమార్తె సమీపంలోని చీరల దుకాణంలో సేల్స్గర్ల్గా పని చేస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లడానికి స్నానం చేస్తూ సబ్బు కోసం వెతికింది. అయితే ఆమెకు అక్కడ మొబైల్ ఫోన్ చేతిని తాకింది. భయపడి దుస్తులు ధరించి బయటకు వచ్చి చూడగా కమ్యూనిటీహాల్లో ఎలక్ట్రిషియన్గా విధులు నిర్వర్తించే వై.మరియాలి కుమార్ స్నానం గది కిటికీ పక్కన దాక్కుని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయగా అతడు వచ్చి మరియాలి కుమార్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఫోన్తో సహా అతను పారిపోయాడు. విషయాన్ని బాధితురాలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రతాప్రెడ్డి తదితరులకు తెలియజేసింది. సంఘం నేతలు పోలీసులకు ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్ను పట్టుకుని విషయాన్ని సేకరించారు. ఐదేళ్లుగా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నట్లుగా అంగీకరించాడు. తాను తీసిన వీడియోలు, ఫొటోలు అన్నీ తొలగించినట్టుగా తెలియజేశాడు. అనంతరం నిందితుడిని కాలనీ నేతలు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య, అత్తపై అల్లుడు దాడి
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ మహేష్.. శ్రీదేవి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో శ్రీదేవి తల్లి మంగ తన కూతురును చూసేందుకు ఇంటికి రాగా, అయితే మహేష్, శ్రీదేవిల మధ్య మరోసారి గొడవ జరిగింది. వారిని గొడవ పడొద్దని మంగ వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ తన భార్య శ్రీదేవి, అత్త మంగపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీదేవి స్వల్పంగా గాయపడగా.. ఆమె తల్లి మంగ తీవ్రంగా గాయపడింది. ఆమెను మియాపూర్లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
గ్రేటర్లో సిటీ బస్సు ప్రయాణికుల వేదన
అటు హయత్నగర్ నుంచి పటాన్చెరు, ఆరాంఘర్ నుంచి సికింద్రాబాద్, ఇటు గచ్చిబౌలి నుంచి అఫ్జల్గంజ్, కూకట్పల్లి నుంచి కోఠి వరకు మాత్రమే కాదు..నగరంలో ఎటువైపు నుంచి ఎటు వెళ్లాలన్నా, ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు పోవాలన్నా దాదాపు 20 లక్షల మంది సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్నది సిటీ బస్సుల్లోనే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సిటీ బస్సు ప్రయాణికుల విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కని్పస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు బస్సుల కోసం నిరీక్షించే ప్రాంతాల్లో ఎలాంటి షెల్టర్లు లేవు. మండుటెండల్లో మలమల మాడుతున్నారు. అకాల వర్షాలతో తడుస్తున్నారు. బస్ షెల్టర్లు ఉన్న ప్రాంతాల్లో అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. తూతూ మంత్రంగా ఏర్పాటు చేసిన షెల్టర్లు..కేవలం కొన్ని ప్రైవేటు ఏజెన్సీలను మేపేందుకేననే విమర్శలు ఎంతోకాలంగా వెల్లువెత్తుతున్నా సంబంధిత యంత్రాంగాలకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్లో బస్షెల్టర్లు దుస్థితి..ప్రయాణికుల వెతలపై ‘సాక్షి’ బిగ్ స్టోరీ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ జంక్షన్లను, ఫ్లై ఓవర్లను రంగుల హంగులతో తీర్చిదిద్దుతున్న యంత్రాంగం..బస్సుల కోసం వేచి చూసే లక్షల ప్రయాణికులకు కనీసం నీడ కల్పించలేక పోతోంది. అధికారుల లెక్కల మేరకు నగరంలో 1300కు పైగా బస్షెల్టర్లున్నాయి. కానీ, వాటిల్లో సగం కూడా ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు. మెజార్టీ షెల్టర్లు ఎంపిక చేసిన కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ప్రకటనల ద్వారా కాసుల వర్షం కురిపించేందుకు తప్ప, లక్షల సంఖ్యలో ఉన్న ప్రజలకు కనీసం నీడనివ్వడం లేవు. అన్నీ తెలిసినా సంబంధిత యంత్రాంగం నిద్ర నటిస్తోంది. వాటిని ఏర్పాటు చేసిందే ‘పై వాళ్ల’ కోసం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అంతేకాదు..ఫిర్యాదులందినప్పుడో, పత్రికల్లో వచ్చినప్పుడో చర్యలు తీసుకోమన్నా కిందిస్థాయి సిబ్బంది డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిసున్నారంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. చెమటలు పుట్టిస్తున్న ఏసీ షెల్టర్లు పేరుకు ఏసీ షెల్టర్లయినా, వాటిల్లో ఉండలేక ప్రజలకు చెమటలు పడుతున్నాయి. నగరంలో 19 ఏసీ షెల్టర్లుండగా పేరుకే ఏసీ చందంగా మారాయి. కొన్ని ప్రయాణికులకు షెల్టర్లుగా కాకుండా, ప్రైవేటు దుకాణాలుగా బాగా ఉపయోగపడుతున్నాయి. జ్యూస్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లుగానే కాక జనరల్ స్టోర్స్గానూ లాభాలు కురిపిస్తున్నాయి. ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్లలో ఇలాంటివి చూడవచ్చు. సికింద్రాబాద్తో సహ పలు ప్రాంతాల్లో బస్òÙల్టర్ల ముందే చిరు దుకాణాలుండటంతో ప్రజలు వాటిల్లోకి వెళ్లలేక బయటే నిలబడాల్సిన దుస్థితినెలకొంది. ప్రయాణికులున్నా, షెల్టర్లు లేవు బస్షెల్టర్లుకు అనుమతులిచ్చేది జీహెచ్ఎంసీ. షెల్టర్లు ఏర్పాటు చేసి లాభాలు పొందేది ప్రైవేటు ఏజెన్సీ. ప్రయాణికుల కోసం బస్సులాపేది ఆరీ్టసీ. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అనుమతులిచ్చాక నిర్వహణ లోపాలపై జీహెచ్ఎంసీ చర్యల్లేవు. ఎక్కడ అడ్వర్టయిజ్మెంట్లు బాగా కనిపిస్తాయో అక్కడ ఏర్పాటు చేస్తున్నారే తప్ప ప్రజలు అవస్థలు పడుతున్న బస్టాపుల్లో షెల్టర్లు ఏర్పాటు చేయడం లేదు. సికింద్రాబాద్, పంజగుట్ట, ముషీరాబాద్, రామంతాపూర్, ఎల్బీనగర్ వంటి అనేక ముఖ్య ప్రాంతాల్లో అసలు షెల్టర్లే లేవు. రోడ్లపైనే నుంచుని ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారుల కళ్లకు కనిపించడం లేదు. వారి దృష్టిలో అక్కడ బస్షెల్టర్లు అవసరం లేదు. ఆర్టీసీ అధికారుల లెక్కల మేరకు తగినంత మంది ప్రయాణికులు లేనందున అక్కడ బస్షెల్టర్లు అవసరం లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఉన్న ప్రాంతాల్లోనూ చాలా చోట్ల విరిగిన బెంచీలు, చెత్తా చెదారాలు, పాన్, జర్దా మరకలు, వాటిల్లోనే ఆవాసముంటున్న కుక్కలు, పిల్లులతో మురికిమయంగా మారాయి. వాటి కంటే బయట ఎండలో ఉండేందుకే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రుళ్లు లైట్లు వెలగక, తిష్టవేసే పోకిరీలతో అక్కడ ఉండాలంటే మహిళలు భయపడాల్సిన పరిస్థితి. ఇవ్వడం వరకే జీహెచ్ఎంసీ వంతు.. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్(డీబీఎఫ్ఓటీ) కింద జీహెచ్ఎంసీ షెల్టర్ల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు మాత్రమే అనుమతులిచి్చంది. ఏసీ షెల్టర్లకు అనుమతులిచ్చి దాదాపు ఎనిమిదేళ్లయింది. లెక్క ప్రకారం పదేళ్ల గడువు కాగా, మరో ఐదేళ్లు అదనంగా పొడిగించే సదుపాయాన్నీ ఇచ్చేసినట్లే పరిగణిస్తున్నారు. మిగతా షెల్టర్లదీ అదే పరిస్థితి. షెల్టర్లకు గ్రేడ్లున్నప్పటికీ,ఉండాల్సిన సదుపాయాల్లేవు. ఇన్నేసి ఏళ్లపాటు ప్రైవేటుకు కట్టబెట్టి, ప్రజలకు సమస్యలు మిగులుస్తున్నారు. ఏసీ షెల్టర్లున్న ప్రాంతాలు ఖైరతాబాద్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బోరబండ, కేపీహెచ్బీ, ఆరాంఘర్, దిల్సుఖ్నగర్, కొండాపూర్, మలేసియన్ టౌన్íÙప్, కోఠి, తార్నాక, మదీనాగూడ, శిల్పారామం, విద్యానగర్, బేగంపేట్. ఇబ్బందిగా ఉంది.. చందానగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీగా ఉద్యోగం చేస్తున్నా. కూకట్పల్లికి వెళ్ళడానికి చందానగర్ గంగారం బస్టాప్లో నిలబడ్డా. బస్ షెల్టర్ లేక అరగంట నుంచి మండుటెండలో బస్సు కోసం ఎదురుచుస్తున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. వస్తున్న బస్సులు సైతం ఫుల్ రష్తో ఉంటున్నాయి. – అరవింద్, టీచర్ ఎఫ్ఓబీ నీడలో.. నేను దీప్తిశ్రీనగర్లో ఉంటా. రుద్రారంలోని తోషిబా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. మదీనాగూడ దీప్తిశ్రీనగర్ బస్టాప్లో బస్òÙల్టర్ లేక ఎండాకాలంలో ఎఫ్ఓబీ కింద నిల్చుంటున్నాం. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు సమస్య వివరించినా పట్టించుకున్నవారే లేరు. – రవికుమార్, ప్రైవేట్ ఉద్యోగి మండుటెండలో అవస్థలు బస్ షెల్టర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. సమయానికి బస్సులు రాక, కూర్చునే సదుపాయం లేక ఎంతో సేపు వేచి చూసేందుకు నరకం అనుభవిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి అడ్డగుట్ట డివిజన్లో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి. – మహేష్, అడ్డగుట్ట గాల్లో దీపంలా.. బస్టాప్ల వద్ద ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. అత్యంత రద్దీగా ఉండే టోలిచౌకి కూడలి వద్ద ఒక్క బస్òÙల్టర్ కూడా లేదు. ప్రతి గంటకు ఈ చౌరస్తా నుంచి వేలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వృద్ధులు, మహిళలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్òÙల్టర్లు ఉండాలి. –సయ్యద్ ఇమ్రోజ్, టోలిచౌకి దుకాణాల ముందే నిల్చుంటున్నాం.. బస్షెల్టర్లు లేక రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. చిన్నారులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండకు తాళలేక దుకాణాల ముందు నిలబడి చీవాట్లు తినాల్సి వస్తోంది. జీహెచ్ంఎసీ, ఆర్టీసీ అధికారులు çసమన్వయంతో బస్ షెల్టర్లు నిర్మించాలి. –అంబటి రాజేష్, ఛత్రినాకపేరుకే ఏసీ.. నిత్యం ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు తిరిగే తిరిగే ప్రదేశం మాదాపూర్. ఇక్కడ పేరుకు ఏసీ బస్òÙల్టర్ ఉన్నా కూర్చోడానికి వీలులేకుండా, అపరిశుభ్రంగా మారింది. చెత్తా చెదారం, దుమ్ముధూళితో నిండి ఉంది. నిర్వహణ లేదు. ఏసీ లేని బస్షెల్టర్లు ఎందుకు?. – రాజేశ్, స్థానికుడు, మాదాపూర్చర్యలు తీసుకుంటున్నాం.. బస్ షెల్టర్ల నిర్వహణపై ఫిర్యాదులను పరిశీలించి ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (అడ్వర్టయిజ్మెంట్స్) వేణుగోపాల్రెడ్డి చెప్పారు. సంబంధిత ఏజెన్సీలు యూనియాడ్స్, ప్రకాశ్ఆర్ట్స్, మీడియా కార్ట్లకు రూ.2,45,000 జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి మరమ్మతులు చేశారన్నారు. ఎక్కడైనా పనిచేయకుంటే ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే.. కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో క్రేజ్ ఉంది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్సీ నెంబర్లకు గణనీయమైన ఆఫర్లు.. రేట్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు ఎక్కువ. పాతబస్తీ మొఘల్పురాలోని ఉర్దూఘర్లో అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. పది లక్షల నోట్లలో ఒకటి, రెండు ఫ్యాన్సీ నోట్లు ఉంటాయని.. ఇవి అరుదుగా లభిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. వీటి ఖరీదు వేలల్లో ఉందని, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకూ కొనసాగనుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. నోరూరించే.. మ్యాడ్ ఓవర్ డోనట్స్ డోనట్స్ ప్రియులకు 24 రకాల ఎగ్లెస్ డోనట్స్ అందుబాటులోకి వచ్చాయి. సోమవారం కొత్తగూడలోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో మ్యాడ్ ఓవర్ డోనట్స్ స్టోర్ను ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, సీఈఓ తారక్ భట్టాచార్య ప్రారంభించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డోనట్లలో మ్యాడ్ ఓవర్ డోనట్స్ (ఎంఓడీ) ఒకటి. బబుల్టీ, బ్రైనీలు, బైట్స్తో పాటు చేతితో తయారు చేసిన 24 రకాల ఎగ్లెస్ డోనట్లను రుచి చూడవచ్చు. పుట్టిన రోజులు, ప్రమోషన్లు, స్నేహితుల కలయికకు ఎంఓడీ వేదిక కానుంది. సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు తారక్ భట్టాచార్య ప్రకటించారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒకే క్లిక్తో క్షణాల్లో రిజల్ట్స్ ఇలా..
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో https://education.sakshi.com/ ఫలితాలు తెలుసుకోవచ్చు.క్లిక్ చేయండి👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్ క్లిక్ చేయండి👉 ఇంటర్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ రిజల్ట్స్క్లిక్ చేయండి👉 ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్క్లిక్ చేయండి👉 సెకండ్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్తెలంగాణలో ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు రాసిన వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా.. 5 లక్షలకు మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు.గతం కన్నా మెరుగైనా ఫలితాలు వచ్చాయని.. తెలంగాణ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచిందని మంత్రి భట్టి తెలిపారు. పాసైన విద్యార్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారయన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89 శాతం, ఇంటర్ సెకండర్ ఇయర్లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి అడ్వాన్స్డ్ పరీక్షలు ఉండనున్నాయి. రీకౌంటింగ్, వెరిఫికేషన్కు వారం గడువు ఇచ్చింది ఇంటర్ బోర్డు. -
Domalguda: నీటి సంపులో యువతి అస్తిపంజరం
కవాడిగూడ(హైదరాబాద్): లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్ఆర్మిల్స్ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. దోమల గూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నిరంజన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్‘బుక్కై’పోయాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సుదీర్ఘ కాలం తర్వాత మరో కస్టమ్స్ ఫ్రాడ్ కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నేరగాడు కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి రూ.1.55 లక్షలు కాజేశాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి దాదాపు రెండు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికాలో ఉంటున్న సర్జన్ హెన్రీ రాబర్ట్ అంటూ ప్రొఫైల్ ఉండటంతో నగరవాసి యాక్సప్ట్ చేశాడు. ఆపై వాట్సాప్ కాల్స్ చేసిన రాబర్ట్ నగరవాసితో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. తాను త్వరలోనే భారత్కు వస్తున్నానని, హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పాడు. పూర్తిగా నమ్మించేందుకు డమ్మీ ఫ్లైట్ టిక్కెట్స్ ఫొటోలను పంపాడు. కొన్ని రోజులకు బాధితుడికి కాల్ చేసిన రాబర్ట్ తాను ముంబై విమానాశ్రయంలో దిగానని, తన వద్ద లెక్కలు చెప్పని 1.2 లక్షల డాలర్లు ఉన్నాయని నమ్మించాడు. దీంతో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారన్న రాబర్ట్ పన్ను చెల్లించకపోతే నగదుతో పాటు తన లగేజీ సైతం జప్తు చేస్తారని చెప్పాడు. ఆపై ముంబై ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారిగా మాట్లాడిన మరో వ్యక్తి రాబర్ట్ రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని చెప్పాడు. తాను బయటకు వచ్చాక ఆ మొత్తం ఇచ్చేస్తాంటూ రాబర్ట్ చెప్పంతో నమ్మిన నగర వాసి ఆ మొత్తం వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో నిందితుడి అరెస్టు... నగరానికి చెందిన బాధితుడి (68) నుంచి ఏళ్ల బాధితుడి నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.52,29,500 కాజేసిన కేసులో ఓ నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్మీడియా ద్వారా బాధితుడికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు 5పైసా క్యాపిటల్ లిమిటెడ్, బార్క్లేస్, షాండా క్యాపిటల్ గ్రూప్ లిమిటెడ్ల్లో పెట్టుబడుల పేరు చెప్పారు. ఓ టెలిగ్రాం గ్రూపులో సభ్యుడిగా చేర్చి ప్రియా అగర్వాల్, గౌరవ్ ముంజాల్ పేర్లతో ఇరువురు సలహాలు సూచనలు ఇచ్చారు. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ నిండా ముంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఘజియాబాద్కు చెందిన ప్రతీఖ్ శుక్లాను అరెస్టు చేశారు. అతడిపై దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
కాచిగూడ(హైదరాబాద్): వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచి్చంది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.జూనియర్ ఇంటర్మిడియెట్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీలతో అగ్రికల్చర్ – క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ https:// mjptbcwreis. telangana.gov.in (ro) https:// mjpabcwreis. cgg.gov.in/ TSMJBCWEB/ లో లేదా 040–23328266 నంబర్లో సంప్రదించాలని సూచించారు. బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్లో సంబంధిత ప్రిన్సిపాల్కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని వివరించారు. -
కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు: భట్టి
మధిర: కోరి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులకే ఉద్యోగాలు దక్కాయి తప్ప.. గత పదేళ్లలో నిరుద్యోగులకు లాభం జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం తొలుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, జాబ్ కేలెండర్ను విడుదల చేయగా.. తొలి ఏడాది లోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. రెండో దశలో బహుళ జాతి సంస్థలను రాష్ట్రానికి రప్పించి, లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కృషి జరుగుతోందని వివరించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్లో పర్యటించి రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోవడమే కాక ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారని తెలిపారు. మూడో దశలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలకు తోడు రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని, జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని భట్టి వెల్లడించారు. మరో నాలెడ్జ్ సిటీతో 5 లక్షల మందికి లబ్ధి నాటి ప్రధాని రాజీవ్ గాంధీ దూరదృష్టితో దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికితే, హైదరాబాద్లో అప్పటి కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి హైటెక్ సిటీకి పునాదులు వేశారని భట్టి గుర్తు చేశారు. కాగా, ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా మరో నాలెడ్జి సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. కాగా, జాబ్మేళాలో 97 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా 5,827 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2,325 మందిని ఎంపిక చేసి, కొందరికి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేంరాజు పాల్గొన్నారు. -
టీచర్లకు వేసవిలో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి జిల్లా అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలో నైపుణ్యం గల శిక్షకులను (రిసోర్స్ పర్సన్స్) గుర్తించాలని సూచించారు. దీనికోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో జిల్లా విద్యాశాఖాధికారి కన్వినర్గా, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్, క్వాలిటీ కో–ఆర్డినేటర్, ముగ్గురు సబ్జెక్టు నిపుణు లు సభ్యులుగా ఉంటారు.శిక్షణ కార్యక్రమాన్ని గతం కన్నా భిన్నంగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రిసోర్స్ పర్సన్ ఎంపికకు ప్రామాణికాలను రూ పొందించింది. వచ్చిన దరఖాస్తులను అనేక కోణాల్లో వడపోసి ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ముందుగా రిసోర్స్ పర్సన్స్కు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తారు. వీళ్లు జిల్లా, మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. రిసోర్స్ పర్సన్ ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సూచించారు. ఎందుకీ శిక్షణ? కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే సహా అనేక జాతీయ సర్వేల్లో రాష్ట్ర విద్యా ప్రమాణాలు తగ్గినట్టు తేలింది. చదవడం, రాయడంలో కనీస ప్రమాణాలు కన్పించడం లేదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి ముందుగా టీచర్లలో మార్పు తేవాలని విద్యాశాఖ భావిస్తోంది.విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధన చేయడం, మారుతున్న బోధన విధానాలను అనుసరించడం, సిలబస్లో మార్పులను అవగతం చేసుకోవడంతో పాటు సాంకేతిక విద్యా విధానాలపై శిక్షణ ఇస్తారు. ఢిల్లీలో సరికొత్త బోధన మెళకువలు అనుసరిస్తున్నారు. కేరళలో డిజిటల్ విద్యపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. మహారాష్ట్రలో పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాలపై అంచనాలను రూపొందిస్తున్నారు. ఇదే స్థాయిలో తెలంగాణలోనూ ముందుగా టీచర్ల బోధన పటిమను పెంచేలా శిక్షణ ఇస్తారు. అర్హులకే అవకాశంరిసోర్స్ పర్సన్ ఎంపికలో బోధన అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కనీసం పోస్టు–గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉండాలని విద్యాశాఖ సూచించింది. గతంలో శిక్షణ ఇచ్చిన అనుభవం, సబ్జెక్టులో నైపుణ్యం, అత్యాధునిక బోధన ప్రమాణాల్లో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు. ప్రతి సబ్జెక్టు నుంచి నలుగురిని ఎంపిక చేస్తారు. వీరిని ఎంపిక చేసేప్పుడు ఒక్కో అంశానికి కొన్ని మార్కులను ఎంపిక కమిటీ ఇస్తుంది.ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. సబ్జెక్టు నైపుణ్యం, కమ్యూనికేషన్ ప్రజెంటేషన్, బోధనలో నైపుణ్యం, డిజిటల్ టూల్స్ వాడుతూ బోధించటం వంటి ఒక్కో విభాగానికి పది మార్కులు కేటాయిస్తారు. ఇన్నోవేటివ్ ప్రాక్టీస్, ట్రైనింగ్ అవసరాలపై ఇచ్చే ప్రజెంటేషన్కు ఒక్కో దానికి ఐదు మార్కుల చొప్పున ఉంటాయని అధికారులు తెలిపారు. -
Telangana: నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. రెండు సంవత్సరాలకు కలిపి 9 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 60 లక్షల సమాధాన పత్రాలకు 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ ప్రక్రియ పూర్తయింది.తర్వాత మార్కుల ఆన్లైన్ ఫీడింగ్, ట్రయల్ రన్ కూడా వారం రోజుల క్రితమే నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి సమయం కోసం అధికారులు ఇంత కాలంగా నిరీక్షిస్తున్నారు. కాగా, ఫలితాల రోజే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీని కూడా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ‘సాక్షి’లో వేగంగా ఫలితాలు.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను వేగంగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు ఫలితాల కోసం www. sakshieducation.com వెబ్సైట్కు లాగిన్ అవ్వొచ్చు. -
కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తెలంగాణ, ఒసాకా, ప్రపంచం కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. హైదరాబాద్కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. కలిసి పనిచేద్దాం.. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం..’అంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. జపాన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సోమవారం ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ‘ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉంది. తెలంగాణ, జపాన్ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం. మా ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి..’అని సీఎం చెప్పారు. బయో, ఐటీ రంగాల్లో గుర్తింపు: శ్రీధర్బాబు ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎల్రక్టానిక్స్, టెక్స్టైల్ పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ నగరం ఆధారపడుతుందని పేర్కొన్నారు. జపాన్కు చెందిన మరుబెని కార్పొరేషన్తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్)తో పాటు రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని, ఆర్ఆర్ఆర్కు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)కు మధ్య ఉన్న జోన్లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా పెవిలియన్ ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ తన ప్రత్యేకపెవిలియన్ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్రెడ్డి..మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సోమవారం దీనిని ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకో మారు ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. అయితే ఈ ఎక్స్పోలో భారతదేశం నుంచి పాల్గొన్న తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. కిటాక్యుషు నుంచి సీఎం బృందం ఒసాకా చేరుకుంది. కాగా ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది. తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రం అడుగులు వేయనుంది. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలం.. రేవంత్ సర్కార్ సీరియస్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలంపై సీఎం రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. సెక్రటేరియట్ భద్రత ఏర్పాట్లు, సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాల నిఘాపై జీఏడీ ఆరాతీ తీసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి ఎంట్రీ ,ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎస్పీఎఫ్పై జీఏడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సెక్రటరియేట్ మొత్తం 246 సీసీ కెమెరాలు మరో 30 కెమెరాలు పెట్టే యోచనలో ఉన్నట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలతో పాటు కీలకమైన 6వ అంతస్తులో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ ప్రజలు ఎంట్రీ అయ్యే సౌత్ ఈస్ట్ గేటుతో పాటు ఇన్సైడ్ ఎంట్రీ వద్ద మరోసారి చెకింగ్ చేయనుంది.సెక్రటరియేట్లో రెండంచెల భద్రత వలయాన్ని ఎస్పీఎఫ్ మోహరించింది. -
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
హైదరాబాద్: గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అబిడ్స్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్? అని ఈటల ప్రశ్నించారు.‘కాంగ్రెస్ నైజం దేశ వ్యాప్తంగా బట్టబయలైంది. మరొకవైపు కార్పోరేట్లరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయొద్దని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిచ్చింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి. కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి. మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు.ముఖ్యమంత్రి గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ కనపడటలేవు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఉడిపోతున్నాయి. కేసీఆర్ హయంలోనే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యే వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు’ అని ఈటల విమర్శించారు.. -
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
హైదరాబాద్,సాక్షి: తీన్మార్ మల్లన్న ఖబడ్దార్. సీఎం రేవంత్రెడ్డిపై మరోసారి నోరు జారితే ఊరుకునేది లేదని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. గత వారం నిర్వహించిన బీసీ చైతన్య సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలపై సోమవారం తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. సీఎం రేవంత్ను విమర్శించే స్థాయి తీర్మార్ మల్లన్నకు లేదన్నారు. దమ్ముంటే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెట్టు సాయి కుమార్ (Mettu Saikumar) ఇంకా ఏమన్నారంటే.. 'తెలంగాణ రాజకీయ వ్యభిచారి ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్ మల్లన్నే. నేను రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల నాయకత్వం పెంపొందించేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారు. ఎన్నిసార్లు రేవంత్ కాళ్ళు మొక్కావో గుర్తులేదా. అధిష్టానం రాష్ట్ర రాజకీయ నాయకులను ఒప్పించి రేవంత్ నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారు.స్పీకర్ ఫార్మార్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నీ దమ్ము ఏంటో నిరూపించుకో. ఎన్ని పార్టీలు మారావో గుర్తుందా. బీసీల ముసుగులో చిల్లర పనులు చేస్తూ బిసిలను ఇబ్బందులకు గురి చేయడానికి సిగ్గుండాలి. నీది నా కంటే దిగువ స్థాయి.. సీఎం రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా నీ స్థాయికి తగ్గట్లు మాట్లాడటం నేర్చుకో. బీజేపీ నేతలకు గులాంగిరి చేసుకో. ఉదయం బీజేపీ, సాయంత్రం బీఆర్ఎస్ భజన చేసుకో’ అని ధ్వజమెత్తారు.చదవండి: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట -
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మందు బాబులకు అలర్ట్. హైదరాబాద్లో మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. -
కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి..
నిజాంపేట్(మేడ్చల్ జిల్లా): కుటుంబ కలహాలా! లేక అనారోగ్యమో తెలియదుకాని.. ఆ ఇల్లాలు తనువు చాలించాలనుకుంది. తనతో పాటు తన నాలుగేళ్ల కూతురును సైతం తీసుకెళ్లాలని.. కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి తాను తాగి, కూతురుకు కూడా తాగించింది. దీంతో కూతురు మృతి చెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, హరితా ఆర్కేడ్ అపార్ట్మెంట్లో నంబూరి సాంబశివరావు, కృష్ణా పావని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురు జెశి్వక ఉంది. సాంబశివరావు ఐటీ ఉద్యోగికాగా, పావని గృహిణి. ఈ నెల 18న శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పావని కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగింది. కూతురు జెశి్వకకు కూడా తాగించింది. దీంతో ఆరోజు రాత్రి ఇద్దరూ పలు మార్లు వాంతులు చేసుకున్నారు. రాత్రి ఇంటికి వచి్చన భర్తకు పావని ఈ విషయం చెప్పలేదు. శనివారం ఉదయం కూడా వాంతులు అవుతుండటంతో పావని భర్తకు ఈ విషయం చెప్పింది. దీంతో సాంబశివరావు వెంటనే వారిని కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. జెశి్వక పరిస్థితి విషమించడంతో రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి మరింత విషమించడంతో సాయంత్రం జెశ్విక మృతి చెందింది. పావని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సాంబశివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పావని తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం పావని గత కొద్ది సంవత్సరాలుగా మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు. -
తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట.. ఎఫ్ఐఆర్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్పై ఉట్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను తాజాగా హైకోర్టు కొట్టేసింది. దీంతో, కేటీఆర్కు ఉపశమనం దక్కింది.వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్పై ఉట్నూరు పీఎస్లో కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం 25వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఊట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
దుండిగల్(హైదరాబాద్): ఓఆర్ఆర్పై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన భాను ప్రకాశ్ (36), నళినికంఠ బిస్వాల్ (37)లు స్నేహితులు. వీరు తమ కుటుంబాలతో కలిసి రాజేంద్రనగర్ మంచిరేవులలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మేడ్చల్ నుంచి పటాన్చెరు వైపు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భాను ప్రకాశ్, బిస్వాల్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను ప్రకాశ్ భార్య సాయి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తుతో పాటు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. -
బెట్టింగ్ యాప్స్లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్.. షాద్నగర్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్ యాప్స్ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్థెమ్ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాణాలు బలి.. సీరియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్ ఆన్లైన్ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్కు అలవాటుపడిన పవన్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్ సైతం అమ్మేశాడు. బెట్టింగ్ విషయంలో నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. ఈ గేమింగ్ యాప్స్లో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్సైట్స్ను రిజిస్టర్ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు. లింకుల ద్వారానే యాప్స్ చలామణి.. ఈ యాప్స్ను నిర్వాహకులు ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్స్లో హోస్ట్ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్థెమ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్థెమ్ పని చేస్తుంది. రోజుకు విత్డ్రా రూ.500.. ఈ బెట్టింగ్, గేమింగ్లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్కు సంబంధించిన వర్చువల్ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్ జీపీఎస్ యాప్స్ను ఇన్స్టల్ చేసుకుంటున్నారు. -
Hyderabad: మధ్యాహ్నం ఎండలు.. సాయంత్రం ఈదురు గాలులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గత మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో పూర్తిగా చల్లబడుతోంది. ఇక వర్షం ప్రారంభమైతే అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. విద్యుత్ వైర్ల తెగిపడుతున్నాయి. రోజువారీగా సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 36 నుంచి 39 డిగ్రీల వరకు, కనిష్టంగా 26.5 నుంచి 20.8 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ మేర వీస్తున్నాయి. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. నగరంలో ఉదయం 7 గంటల నుంచే ఎండ పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. మరో వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఆదివారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుండటంతో వరుసగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
కీసర: మైదానంలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం రాంపల్లిదాయరలో చోటుచేసుకుంది. కీసర సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన ఎం.ప్రణీత్ (32) కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి రాంపల్లిదాయర సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రణీత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చి గుండెపోటుతో మృతి చెందడంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కీసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయ కక్షతోనే నా పేరు తొలగించారు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కున్న తన పేరును తొలగించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. నార్త్ స్టాండ్ నుంచి అజహరుద్దీన్ పేరును తొలగించాలంటూ అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించిన నేపథ్యంలో బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.పదేళ్లపాటు ఇండియన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా, 19 ఏళ్లు క్రికెటర్గా సేవలందించానని పేర్కొన్నారు. కొంత మంది కావాలని రాజకీయం చేసి లార్డ్స్ క్రికెట్ క్లబ్తో కోర్టుల్లో పిటిషన్¯ వేయించారని ఆరోపించారు. తనపై వచి్చన పలు ఆరోపణలను గతంలోనే కోర్టు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక హైదరాబాదీగా దేశం గర్వించే స్థాయికి ఎదిగానని, కుట్రలకు న్యాయపరంగా సమాధానం చెప్తానని అన్నారు. ఉదయం నుంచి తనకు వేలాదిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని, నార్త్ స్టాండ్స్కు తన పేరును తొలగించడాన్ని వారు ఖండిస్తున్నారని అన్నారు. ఆనాడు క్రికెట్ అభిమానుల కోరిక మేరకే తన పేరును స్టాండ్స్కు పెట్టారని గుర్తు చేశారు. అజారుద్దీన్ పేరు తొలగింపుపై అభిమానుల ఆందోళన.. క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఉప్పల్ స్టేడియంలో నార్త్స్టాండ్ నుంచి తొలగించాలంటూ అంబుడ్స్మెన్ కోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అజారుద్దీన్ అభిమానులు బంజారాహిల్స్లో ధర్నా చేశారు. అజారుద్దీన్ను కావాలంనే కొంత మంది రాజకీయ కక్షలతో వేధిస్తున్నారని ఇలాగే కొనసాగితే హెచ్సీఏ ముందు తాము ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. -
రెండు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర– దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం తెలిపింది.జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మరింత పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం ఆదిలాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.8 డిగ్రీ సెల్సియస్గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 43.5 25.2 భద్రాచలం 39.4 29.0 దుండిగల్ 38.7 27.2 హకీంపేట్ 38.5 27.5 హనుమకొండ 40.0 25.5 హైదరాబాద్ 38.8 26.5 ఖమ్మం 40.4 27.0 మహబూబ్నగర్ 40.0 30.1 మెదక్ 41.8 23.8 నల్లగొండ 40.0 24.4 నిజామాబాద్ 43.1 27.2 రామగుండం 41.4 26.2 -
డిగ్రీ కాలేజీల ఎదురీత..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య విషయంలో విద్యార్థుల ఎంపికల్లో మార్పుల కారణంగా రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సాధారణ డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవటంతో చాలా కాలే జీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కావటంలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కాలేజీల్లోనే 40 శాతం సీట్లు నిండితే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. మిగతా జిల్లాల్లో అంతకంటే చాలా తక్కువగా ఉంటున్నాయి.వందకుపైగా కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదవుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో యాజమాన్యాలు కాలేజీల మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి. అడ్మిషన్లు తగ్గటం ఒక సమస్య అయితే.. రూ.5 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండటం కాలేజీలను మరింత కుంగదీస్తోంది. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణల వైపు అడుగులేయటం గ్రామీణ ప్రాంత డిగ్రీ కాలేజీలను మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. అఫిలియేషన్కూ వెనకడుగు రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 362 ఉండగా, మిగతా జిల్లాల్లో 692 ఉన్నాయి. గత ఏడాది 150 కాలేజీలు కొన్ని కోర్సుల్లో, సెక్షన్లలో అఫిలియేషన్ తీసుకునేందుకు వెనుకాడాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉందని నిర్వాహకు లు అంటున్నారు. అన్ని కాలేజీల్లో కలిపి 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. ఇందులో ఏటా సగటున 2.20 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. దోస్త్ పరిధిలోని కాలేజీల్లో 3,85,573 సీట్లు ఉండగా, గతేడాది 2,12,188 సీట్లు భర్తీ అయ్యాయి.ఇంటర్ ఉత్తీర్ణులంతా డిగ్రీలో చేరినా ఇంకా 70 వేల సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులను ఆకర్షించటంలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీని గ్రామీణ ప్రాంత కాలేజీలు తట్టుకోలేకపోతున్నాయి. తమ ఇళ్లకు సమీపంలోని కాలేజీల్లోనే చదవాలనుకునే విద్యార్థులు ఆర్ట్స్ గ్రూపులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో సైన్స్ గ్రూపుల్లో చేరికలు నామమాత్రంగా ఉంటున్నాయి. గత మూడేళ్లలో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో చేరికలు 42 శాతం తగ్గిపోయాయి. ముఖ్యంగా సైన్స్ గ్రూపుల్లో ఈ పరిస్థితి ఉంది. కొత్త కోర్సులతో చిక్కులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి కోర్సులు తీసుకొస్తున్నారు. కామర్స్లోనూ కంప్యూటర్ కోర్సుల కాంబినేషన్ వస్తోంది. రాజధానికి సమీపంలో ఉండటం వల్ల ఈ కోర్సుల బోధకులు దొరకుతున్నారు. విద్యార్థులు కూడా రాజధానిలో ఉంటే ఇతర కోర్సులు నేర్చుకోవచ్చని, పార్ట్టైం ఉద్యోగాలు దొరుకుతాయని ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు.గ్రామీణ కాలేజీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కంప్యూటర్ కోర్సులకు లెక్చరర్ను తీసుకోవాలంటే నెలకు కనీసం రూ.50 వేల వేతనం ఇవ్వాలి. ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. ఇదంతా చేస్తే ఫీజులు పెంచాలి. ఫీజులు పెంచితే విద్యార్థులు చేరే పరిస్థితి లేదు. ఈ కారణంగా కొత్త కోర్సుల జోలికి వెళ్లడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సిలబస్ మార్చాలని నిర్ణయించింది. 20 శాతం కంప్యూటర్ అనుసంధానిత సిలబస్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతా కాలేజీల మనుగడకు ప్రమాదంగా మారే పరిస్థితి కని్పస్తోంది. -
కేసీఆర్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం
సాక్షి, హైదరాబాద్/ అత్తాపూర్: కల్వకుంట్ల చంద్రశేఖర్రావును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవటం తెలంగాణ సమాజానికి చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవలసిన బాధ్యత తెలంగాణ సమాజంపైనే ఉందని తెలిపారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు తరలివచ్చి కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు.వారికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు కేసీఆర్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ మళ్లీ వెనక్కు తీసుకెళ్తోందని మండిపడ్డారు. ‘మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో మనకు జరిగిన నష్టం తక్కువ. మన ఓటమితో తెలంగాణ సమాజానికి ఎక్కువ నష్టం జరిగింది.స్వరాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఈ రికార్డును ఎవరూ చెరపలేరు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వారి అజ్ఞానం. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. దండయాత్రలు చేసిన రాజులు కూడా ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పరు’అని కేటీఆర్ అన్నారు. బీజేపీకి మత పిచ్చి లేపడమే తెలుసు ‘దేశంలో మత పిచ్చి లేపడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ వెనక్కి పోయినట్టే.. మోదీ నాయకత్వంలో దేశం వెనక్కి పోతుందని అన్నారు. ‘మత పిచ్చి మంచిది కాదు. సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. హిందువులు ప్రమాదంలో ఉన్నారట! 2014 వరకు మంచిగా ఉన్న హిందువులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారట. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లేని పంచాయితీ ఇప్పుడు ఎందుకు కొత్తగా పెడుతున్నారు? రాజకీయం కోసం దేశాన్ని విడగొడుతున్నారు. మంచి పనులు చేసి ఓట్లు అడగాలి. హిందూ, ముస్లిం, పాకిస్తాన్, జై శ్రీరాం, మోదీ.. ఈ ఐదు పదాలు చెప్పకుండా ఓట్లు అడిగేటోళ్లు ఎవరైనా ఉన్నారా? తెలంగాణకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ శత్రువులే’అని కేటీఆర్ విమర్శించారు. గరీబోళ్ల ఇండ్లపైకే హైడ్రా బుల్డోజర్లు హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘హైడ్రాతో ఆస్తులు కాపాడుతాం అంటున్నారు. చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, కేవీపీ రామచంద్రర్రావు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇళ్లను మాత్రం ముట్టరు. అల్కగా దొరికే గరీబోని పైకి బుల్డోజర్లు పంపుతున్నారు. రైతుబంధు, తులం బంగారం, రుణమాఫీ, స్కూటీలకు పైసల్లేవు కానీ.. మూసీకి మాత్రం లక్షన్నర కోట్లు ఇస్తారట’అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ఎకో టౌన్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎకో టౌన్ ఏర్పాటు, అలాగే సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, పర్యావరణ పునరుద్ధరణ వంటి రంగాల్లో సహకారం కోసం ప్రముఖ జపనీస్ ఎకో టౌన్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) రూపంలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది.ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమిటా హోల్డింగ్స్ వంటి కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. సీఎం ఎ.రేవంత్రెడ్డి నేతృత్వంలో జపాన్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ బృందం ఆదివారం అక్కడి కిటాక్యుషు నగరాన్ని సందర్శించి ఈ మేరకు పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్, కిటాక్యుషు నగరాల మధ్య బలమైన బంధానికి ఈ ఒప్పందాలు నిదర్శనమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.రెండు నగరాల మధ్య పరస్పర సహకారం కోసం మేయర్ కజుషియా టేకుచి ఆలోచన మేరకు ‘సిస్టర్ సిటీ’ఒప్పందం చేసే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. సత్వర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, పర్యావరణ పరిరక్షణ పట్ల తామే నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు కలిసి పనిచేయనుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. నగరాలు, సమాజాల మధ్య వారధి కోసం.. ‘రెండు నగరాలు, సమాజాల మధ్య వారధి నిర్మించడానికి మనం చేతులు కలిపాం. ఇది భవిష్యత్తు తరాలకు ప్రయోజనకరం. స్వచ్ఛత, పచ్చదనం, సుస్థిరత, సర్క్యులర్ ఎకనామీ మన ఉమ్మడి లక్ష్యాలు. చిత్తశుద్ధితో చేసే ఆవిష్కరణలతో ఏం సాధించగలమో మీ పర్యావరణహిత నగరం చూస్తే అర్థం అవుతోంది. హైదరాబాద్ నగరంలో సున్నా స్థాయి కర్బన ఉద్గారాల (నెట్ జీరో)తో ఫ్యూచర్ సిటీని ఇదే తరహాలో నిర్మించాలని కోరుకుంటున్నా..’అని సీఎం తెలిపారు. గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. మెట్రో రైలు, ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విమాన సేవలు ప్రారంభించాలి హైదరాబాద్–కిటాక్యుషు నగరాల మధ్య నేరుగా విమాన సేవలను ప్రారంభించాలని అక్కడి మేయర్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. జపనీస్ భాష పాఠశాలను హైదారాబద్లో స్థాపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన యువతను తమకు అందించాలని, అక్కడి మేయర్ కోరడంతో సీఎం ఈ మేరకు సూచన చేశారు. మా వద్ద నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వారికి జపనీస్ భాష నేర్పిస్తే మీ అవసరాలు తీరుతాయి..’అని చెప్పారు. రెండు పక్షాల మధ్య జరిగిన ఒప్పందాలను నిర్దిష్ట గడువుల్లోగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నిరంతరం చర్చించాలని, సంప్రదింపులతో పురోగతి సాధించాలని నిర్ణయం తీసుకున్నారు. కలిసి పనిచేస్తాం: కిటాక్యుషు మేయర్ రేవంత్ బృందం అంతకుముందు ఓసిన్–ఓసాకా ప్రాంతం నుంచి కిటాక్యుషు నగరానికి బుల్లెట్ ట్రైన్లో చేరుకుంది. చారిత్రాత్మక కోకుర క్యాజిల్ వద్ద నగర మేయర్ కజుíÙయా టేకుచి వారికి సాంప్రదాయ స్వాగతం పలికారు. సమురాయ్ ఖడ్గ వీరులు, టైకో డ్రమ్ బృందాల సభ్యులు ఆటపాటలతో ఆలరించారు. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా కిటాక్యుషు ఉంది. అదే ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో ఒకటిగా ఉంది. ఈ అంశాన్ని మేయర్ టేకుచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కిటాక్యుషు ప్రభుత్వం ..తెలంగాణ, హైదరాబాద్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు వివరించారు. కిటాక్యుషు నగరంలో ఒకప్పుడు అత్యంత కలుíÙతమైన మురాసకి నదిని అత్యంత స్వచ్ఛమైన నదిగా పునరుద్ధరించారు. దీని అధ్యయనంలో భాగంగా సీఎం బృందం ఓ మ్యూజియాన్ని సందర్శించింది. నడక ద్వారా నదీ తీరాన్ని పరిశీలించింది. -
రాష్ట్రమంతా ‘నెట్టిల్లు’
సాక్షి, హైదరాబాద్: ఒకే ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్.. మీ నట్టింట్లోని టెలివిజన్ తెరను కంప్యూటర్గా (వర్చువల్ డెస్క్ టాప్) మార్చేస్తుంది. వైఫై సేవ లతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వస్తుంది. మీ టీవీని, లేదా సెల్ఫోన్ను సీసీ కెమెరాలతో అనుసంధానించుకోవచ్చు. కేబుల్ టీవీ చానళ్లతో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీ శాట్ చానళ్లు కూడా చూసేందుకు వీలవుతుంది. కేబుల్ ఆపరేటర్కు మీరు నెలా చెల్లించే మొత్తంలోనే వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, ఓటీటీ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.తక్కువ ఖర్చు తో అపరిమిత హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను నిరంతరం వినియోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుంది. ‘భారత్ నెట్’ప్రాజె క్టులో భాగంగా ఈ తరహా సౌకర్యాన్ని త్వరలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది. రూ.300కే కనెక్షన్ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్తో పాటు పలు ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ)తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 5,001 గ్రామ పంచాయతీలను ఓఎఫ్సీతో కనెక్ట్ చేసింది. టీ ఫైబర్ పనులను పూర్తి చేసి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2028 నాటికి రూ.500 కోట్ల మేర ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించడంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసేందుకు తాజాగా టీ ఫైబర్ దరఖాస్తులు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిద్వారా లోకల్ కేబుల్ ఆపరేటర్లతో పాటు సుమారు 20 వేల మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి లభించనుంది. తొలి విడతలో సాంకేతిక సమస్యలు భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా తొలి విడత రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓఎఫ్సీ నెట్వర్క్ పనులు ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామ పంచాయతీలకు ఓఎఫ్సీని వేసే బాధ్యతను బీఎస్ఎన్ఎల్కు అప్పగించారు. ఓఎఫ్సీ కేబుల్ లైన్లతో గ్రామాలను అనుసంధానించినా, నిర్వహణ లోపంతో (ఓవర్ ది ఎయిర్) స్తంభాలపై వేసిన కేబుల్ లైన్లను ఇష్టారీతిన తొలగించడం, ఓఎఫ్సీని కత్తిరించడం మూలంగా లైన్లు దెబ్బతిని కనెక్టివిటీ ప్రశ్నార్దకంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇదే తరహా సమస్యలు తలెత్తడంతో ‘భారత్ నెట్’రెండో దశలో ఓఎఫ్సీ లైన్లు వేయడంలో ఏ తరహా సాంకేతికతను అనుసరించాలనే స్వేచ్ఛను రాష్ట్రాలకు కేంద్రం వదిలేసింది. రింగ్ టెక్నాలజీ వైపు తెలంగాణ మొగ్గు భారత్ నెట్ రెండో దశలో తెలంగాణ ఒక్కటే ఓఎఫ్సీని భూగర్భంలో వేసే ‘రింగ్ టెక్నాలజీ’వైపు మొగ్గు చూపింది. రెండో దశలో భాగంగా రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్ల మేర ఓఎఫ్సీ విస్తరించగా, మరో 3,500 కిలోమీటర్ల పొడవునా కేబుల్స్ వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ‘రింగ్ టెక్నాలజీ’విజయవంతం కావడంతో భారత్ నెట్ ప్రాజెక్టు మూడో దశలో అన్ని రాష్ట్రాలు రింగ్ టెక్నాలజీ అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా రింగ్ టెక్నాలజీ ద్వారా ఓఎఫ్సీ విస్తరణకు అయ్యే ఖర్చును భారత్ నెట్ ప్రాజెక్టు భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో దశలోనే రింగ్ టెక్నాలజీ అనుసరించేందుకు తాము వెచ్చించిన రూ.1,779 కోట్లను కనీసం వడ్డీలేని రుణంగా అయినా ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. 4 గ్రామాల్లో ఉచితంగా ప్రయోగం టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల్లో డిజిటలైజేషన్ చేపట్టాం. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణపేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాం. ఈ బాధ్యతను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి 3 నెలల పాటు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అందిస్తాం. తర్వాత ఒక్కో వినియోగదారుడి నుంచి కనిష్టంగా సుమారు రూ.300 చొప్పున వసూలు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో 70శాతం గృహాల్లో 30 శాతం లోకల్ కేబుల్ ఆపరేటర్లు, 31శాతం డీటీహెచ్, మరో 39 శాతం ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ ఉంది. ఈ గృహాలన్నింటినీ భవిష్యత్తులో టీ ఫైబర్ పరిధిలోకి తీసుకువచ్చి నామమాత్ర చార్జీలతో అపరిమిత నిరంతర హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తాం. 15 జిల్లాల్లో డిజిటల్ కనెక్టివిటీ పనులు చివరి దశలో ఉన్నాయి. – వేణు ప్రసాద్, ఎండీ, టీ ఫైబర్ టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రస్తుత స్థితి పనులు పూర్తయిన జిల్లాలు: మహబూబ్నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ పనులు పురోగతిలో ఉన్న జిల్లాలు: నల్లగొండ, నాగర్కర్నూల్ మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి భారత్ నెట్ మొదటి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తిన జిల్లాలు: మేడ్చల్– మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి అటవీ అనుమతులో పనులు ఆగిన జిల్లాలు: ఆదిలాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు ప్రస్తుతం పనుల పరిస్థితి మొత్తం పంచాయతీలు ః 12,751 పనులు పూర్తయినవి ః 5001 పనుల పురోగతి ః 3888 అటవీ అనుమతులు కావాల్సినవి ః 773 భారత్ నెట్ మొదటి దశ సమస్యలు ః 3089 హెచ్ఎండీఏ పరిధిలో పనులు కావాల్సినవిః 1.1కోట్ల జనాభా (18 లక్షల గృహాలు) అపరిమితంగా ఇంటర్నెట్ నాలుగు నెలల క్రితం మా కాలనీలో స్మార్ట్ టీవీ ఉన్నవారికి టీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చారు. మొదట యూట్యూబ్ మాత్రమే వచ్చేది. వైఫై ద్వారా నెట్ సౌకర్యం అంతంత మాత్రమే వచ్చింది. నెల తర్వాత కొన్ని చానల్స్ ఆన్ అయ్యాయి. ప్రస్తుతం యూట్యూబ్, గూగుల్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్లు అందుబాటులోకి వచ్చాయి. వైఫై స్పీడ్ కూడా దాదాపు 20 ఎంబీపీఎస్కు పెరిగింది. జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఆప్టిక్ ఫైబర్ ద్వారా సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలకు ప్రతినెలా రూ.700 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వచ్చేది. టీ ఫైబర్కు ప్రస్తుతం ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. – మిట్టే చంద్రశేఖర్, మద్దూర్, నారాయణపేట జిల్లా అప్పుడప్పుడు సిగ్నల్స్ సమస్య వస్తోంది.. ఫైబర్ నెట్ వినియోగంలో కొంత సిగ్నల్స్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కరెంట్ పోయి వచ్చిన సందర్భాల్లో సిగ్నల్స్ రావడానికి 20 నిమిషాల సమయం పడుతోంది. అయితే సిగ్నల్స్ సమస్య వచ్చినప్పుడు గ్రామంలో ఫైబర్ నెట్ ఆపరేట్ చేసే వ్యక్తికి తెలియజేయగానే వెంటనే వచ్చి సరిచేస్తున్నారు. గ్రామంలో నెట్ వినియోగించుకోవడం తెలియని వారికి వివరంగా తెలియజేస్తున్నారు. – వెంకటేశ్వర్ గౌడ్, సంగుపేట, సంగారెడ్డి జిల్లా -
రూ.17.51 లక్షలతో డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వంతోపాటు అనేక రాష్ట్రాలు నిరుపేదలకు ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోంది. అయితే, వీటి నిర్మాణ వ్యయం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు మించదు. కానీ, దేశంలోని అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటైన సిక్కింలో పేదలకు ఏకంగా రూ.17.51 లక్షలతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇంటితోపాటు సోఫా, రెండు బీరువాలు, ఓ టీవీని కూడా ఉచితంగా ఇస్తోందట. తెలంగాణ గృహనిర్మాణ శాఖకు చెందిన ఎస్ఈ స్థాయి అధికారులు చైతన్య, ఈశ్వరయ్య కేంద్రప్రభుత్వ స్టడీ టూర్లో భాగంగా ఇటీవల సిక్కిం వెళ్లి, ఆ పేదల ఇళ్లను పరిశీలించారు. సకల సదుపాయాలు పేదలకు ఉచిత ఇళ్లు అంటే ప్రభుత్వాలు ఏదో కొంత మొత్తం ఇచ్చి మమ అనిపించటం చూస్తుంటాం. కానీ, సిక్కిం ప్రభుత్వం మాత్రం సకల సౌకర్యాలతో పేదలకు ఉచిత ఇళ్లు అందిస్తోంది. సిక్కిం గరీబ్ ఆవాస్ యోజన పథకంలో భాగంగా 678 చదరపు అడుగుల వైశాల్యంతో ఇల్లు నిర్మించి ఇస్తోంది. ఇందులో రెండు పడకగదులు, వంటశాల, లివింగ్ రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇదంతా మామూలే. కానీ, లబ్ధిదారుల కోసం ఒక సోఫా, రెండు స్టీల్ బీరువాలు, ఓ టీవీ సెట్ను కూడా ప్రభుత్వం అందిస్తుండటం విశేషం. ఈ సకల సౌకర్యాల ఇంటికి అక్షరాలా రూ.17.51 లక్షలు ఖర్చవుతోందట. ఇలాంటివి పది వేల ఇళ్లు నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అవాక్కైన అధికారులు ఈ పథకం తీరు చూసి స్టడీ టూర్కు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు. ఒక చిన్న రాష్ట్రం ఇంత భారీ వ్యయంతో పథకాన్ని అమలు చేస్తున్న తీరును ఆసక్తితో పరిశీలించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మిజోరం, మహారాష్ట్ర, త్రిపుర, నాగాలాండ్, అస్సాం అధికారులతోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, హడ్కో ప్రతినిధులు కూడా ఈ టూర్ లో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయంతోపాటు రాష్ట్రప్రభుత్వ సొంత నిధులతో ఈ పథకం అమలవుతోంది.కొండ ప్రాంతం కావటంతో ఈ ఇళ్ల నిర్మాణంలో సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మిస్తున్నట్టు చైతన్య తెలిపారు. అక్కడ రూ.1.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మరో ఇళ్ల పథకం కూడా ఉందని చెప్పారు. పేదల్లో అతి పేదలు, వార్షిక ఆదాయం రూ.లక్ష మించని వారికి ఖరీదైన ఇళ్ల పథకాన్ని వర్తింపచేస్తున్నారని వెల్లడించారు. -
ఆర్టీసీలో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారి వివిధ కేటగిరీల్లో నియమకాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పోస్టుల భర్తీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది. తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయి. ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు తెలంగాణ ఆర్టీసీలో ప్రసుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా సగటున 200 మంది రిటైర్ అవుతుండటంతో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ చేపట్టాలని ఏడెనిమిది నెలల క్రితమే ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం 3,038 పోస్టులకే అనుమతి ఇచ్చింది. అయితే తాము నియామక పరీక్షలకు రూపొందించుకున్న కేలండర్ ఆధారంగానే ఆర్టీసీలో పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయా సంస్థలు ప్రకటించాయి.దీంతో వెంటనే నియామకాలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావటంతో, అది తేలిన తర్వాతే నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగి, రోస్టర్ పాయింట్లపై స్పష్టత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది.కీలకమైన డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చూడనుంది. మరో రెండు నెలల్లో ప్రక్రియ మొదలవుతుందని, నాలుగు నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జోనల్ పోస్టులు, రీజియన్ పోస్టుల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది. బోర్డులు అడగ్గానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అప్పటి వరకు ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో.. ప్రస్తుతం ఆర్టీసీలో 1,600 డ్రైవర్పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో 1,500 మంది ఔట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మ్యాన్పవర్ సప్లయిర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని మూడు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది.తాజాగా రెగ్యులర్ డ్రైవర్ల నియామకం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైన వారు, రెగ్యులర్ నియామకాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరు శిక్షణ పొంది ఉన్నందున, రెగ్యులర్ నియామకాల్లో వీరికి ఆయా బోర్డులు ప్రాధాన్యం ఇచ్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.త్వరలో భర్తీ ప్రక్రియ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలి సారి భర్తీ ప్రక్రియ చేపడుతున్నాం. 3,038 ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్ను సిద్ధం చేసుకున్నాయి. వాటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
Smita Sabharwal: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!
సాక్షి, హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐతో రూపొందించిన ఓ ఫేక్ ఫోటోను ‘హాయ్ హైదరాబాద్’ అనే హాండిల్ గత మార్చి 31న సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేయగా, ఈ పోస్టును స్విత సబర్వాల్ షేర్ చేశారు.హెచ్సీయూలో ఉన్న మష్రూమ్ రాక్, దాని ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, రెండు జింకలతో ‘గిబీ్ల ఆర్ట్’ తరహాలో ఏఐతో రూపొందించిన ఆ చిత్రానికి ‘సేవ్ హెచ్సీయూ..సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ’ వంటి నినాదాలను జోడించి ‘హాయ్ హైదరాబాద్’ పోస్టు చేయగా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి స్మిత సబర్వాల్ పోస్టు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఈ వ్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమె నుంచి వివరణ కోరుతూ ఈ నెల 12న నోటిసులు జారీ చేయగా, ఆమె తగ్గేదే లే అంటూ తన సోషల్ మీడియా యాక్టివిజాన్ని కొనసాగిస్తున్నారు. ‘చట్టానికి కట్టుబడి ఉండే పౌరురాలిగా గచ్చిబౌలి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్) చట్టం కింద ఇచి్చన నోటిసులకు నా స్టేట్మెంట్ను ఈ రోజు ఇచ్చారు.ఆ పోస్టును 2వేల మంది షేర్ చేశారు. వారందరిపై ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించారా? అని స్పష్టత సైతం కోరిన. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే, కొందరిని లక్ష్యంగా చేసుకోడం ఆందోళనకలిగించే అంశం. చట్టం ముందు సమానత్వం, తటస్థట వంటి సూత్రాల విషయంలో రాజీపడినట్టు అర్థం అవుతుంది.’ అని ఆమె శనివారం ‘ఎక్స్’ వేదికగా కొత్త పోస్టు పెట్టడంతో మరింత వేడి రాజుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు సంబంధించిన వార్తను సైతం కొన్ని రోజుల ముందు షేర్ చేశారు.‘ప్రభుత్వం ధ్వంసం చేసిన 100 ఎకరాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికతో రండి. లేకుంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదు’ అని సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వాఖ్యాలు ఆ వార్తలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నోటిసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ‘ఎక్స్’ వేదికగా కొందరు చేసిన పోస్టులను సైతం ఆమె షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో ఓ వృద్ధుడు దూషిస్తున్న వీడియో పోస్టు చేసినందుకు గాను ఇటీవల అరెస్టై విడుదలైన ‘యూట్యూబ్’ మహిళా జర్నలిసు్ట రేవతి సైతం స్మిత సబర్వాల్కు మద్దతుగా ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టగా, దానిని సైతం ఆమె షేర్ చేశారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్ పంతం వీడకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడం గమనార్హం. ఆమెకు బీఆర్ఎస్ మద్ధతుదారులు మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.వివాదాలు కొత్త కాదు... స్మితా సబర్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిజంతో తరుచూ వార్తల్లో ఉంటున్నారు. బిల్కీస్ బాను సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆమె చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. బీజేపీ మద్ధతుదారులు ఆమెకు వ్యతిరకంగా అప్పట్లో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఇక నకిలీ వికలాంగ సర్టిఫికేట్తో పూజా ఖేద్కర్ అని యువతి ఐఏఎస్ కావడం ఇటీవల తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల నియామకాల్లో వికలాంగుల కోటాను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టులను చాలా మంది తప్పుబట్టారు. ఐఏఎస్లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని, వికలాంగులతో సాధ్యం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయగా, వికలాంగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆమెకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేయగా, ఆమె వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యాలకు చర్యలు తీసుకోలేమని కోర్టు కొటి్టవేసింది.ఓడిన వారి కోసమేనా ఏడ్పు..? : సీఎం సీపీఆర్వో ప్రశ్నస్మిత సబర్వాల్ వ్యవహారంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో) బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. స్మిత సబర్వాల్ పేరును ప్రస్తావించకుండా ఆమె వైఖరీని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఆ ఐఏఎస్ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకు వచ్చినట్టు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారోచ్చా? అప్పుడు(బీఆర్ఎస్ హయాంలో) ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికించి, వన్యప్రాణులను తరమింది వీరే.ఇప్పుడు తప్పుబట్టడంలో మర్మం ఏందో ?. అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన(బీఆర్ఎస్) వారి కోసమా?’ అని బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ జరిగిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 25లక్షల చెట్టను నరికివేశారని, పర్యావరణ అనుమతులు లేకుండా మిషన్ భగీరథ పనులు చేపట్టారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా షేర్ చేస్తూ ఆమె ద్వంద వైఖరీని ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది.-మహమ్మద్ ఫసియుద్దీన్, సీనియర్ జర్నలిస్ట్, సాక్షి -
కూల్డ్రింక్లో విషం కలిపి.. కన్నతల్లే..
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్లో ఓ అపార్ట్మెంట్లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని.. తమ కూతురు జశ్వికకు కూల్డ్రింక్లో ఎలుకల మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త.. భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. -
‘ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది’
హైదరాబాద్: కంపెనీల సెక్రటరీలు దేశ కార్పోరేట్ రంగానికి రూపు రేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. నగరంలో ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఐసీఎస్ఐ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా)హైదరాబాద్ చాప్టర్ నూతన భవానికి భూమి పూజ చేసిన కిషన్రెడ్డి అనంతరం మాట్లాడారు.‘ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోంది.సత్యం వద(సత్యం పలుకు), ధర్మం చర(ధర్మం ఆచరించు) సూత్రం ఆధారంగా ICSI పనిచేస్తోంది.ప్రతి కంపెనీ సెక్రటరీ ప్రతిరోజు ఈ సూత్రాన్ని ఆధారంగా పని చేస్తే దేశ వ్యాపార రంగం నిజాయితీ పారదర్శకతతో ముందుకు సాగుతుంది.ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుంది. ఈ విజయం మీలాంటి ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే సాధ్యమైంది. ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి, కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను వారి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు. సమాజంతోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని విషయం గుర్తుంచుకోవాలి.భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా కంపెనీ ICSI లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
Uppal: నార్త్ స్టాండ్ పేరు తొలగింపు.. స్పందించిన అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుకుంటోందంటూ టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పదేళ్లకు పైగా భారత క్రికెట్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపానని.. అలాంటి తన పట్ల అసోసియేషన్ ఇలా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డాడు.కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్కాగా ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నార్త్ స్టాండ్ (North Stand) పేరుకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ స్టాండ్కు అజారుద్దీన్ పేరు ఉండగా... ఇప్పుడు అతడి పేరును తొలగించాలని అంబుడ్స్మన్ జస్టిస్ (రిటైర్డ్) వి.ఈశ్వరయ్య శనివారం ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా.. ఈ స్టాండ్కు సంబంధించి ఇకపై స్టేడియం అధికారిక కార్యక్రమాల్లో గానీ టికెట్లపై గానీ అజహర్ పేరును వాడరాదని ఆయన హెచ్సీఏకు సూచించారు. కాగా భారత క్రికెటర్గా, కెప్టెన్ అజహర్ చేసిన సేవలను గుర్తిస్తూ 2019లో ఈ స్టాండ్కు అతడిపేరు పెట్టారు.అయితే ఆ సమయంలో స్వయంగా అజహర్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ హోదాలో తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) కిందకు వస్తుందని.. పైగా జనరల్ బాడీ అనుమతి లేకుండానే ఇది చేశారంటూ లార్డ్స్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ అనంతరం అంబుడ్స్మన్ ఈ మేరకు తన తీర్పును వెలువరించారు.మీ ముఖం మీదే నవ్వుతారుతాజాగా ఈ విషయంపై మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. ‘ది హిందూ’తో మాట్లాడుతూ.. ‘‘ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అనే అంశానికి ఆస్కారమే లేదు. ఈ విషయమై నేను ప్రస్తుతం ఎలాంటి కామెంట్ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను..క్రికెట్ ప్రపంచం హెచ్సీఏ ముఖం మీదే నవ్వుతుంది. వారి తీరు అలా ఉంది మరి!.. పదిహేడేళ్ల క్రికెట్ కెరీర్.. పదేళ్లకు పైగా జాతీయ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాను. హైదరాబాద్లో క్రికెటర్ల పట్ల ఇదిగో.. ఇలాగే వ్యవహరిస్తారు. ఇది చాలా విచారకరం. మేము కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం’’ అని అజారుద్దీన్ తెలిపాడు.మరోవైపు... నార్త్ స్టాండ్ పేరుకు సంబంధించి ఫిర్యాదు చేసిన ది లార్డ్స్ క్రికెట్ క్లబ్ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ‘‘నిబద్ధత, నిష్పాక్షితకు ఈ తీర్పు నిదర్శనం. పారదర్శకంగా వ్యవహరించిన అధికారులకు మా ధన్యవాదాలు’’ అని క్లబ్ కోశాధికారి సోమ్నా మిశ్రా ‘ది హిందూ’తో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కెరీర్ ఇలాకాగా హైదరాబాద్కు చెందిన మహ్మద్ అజారుద్దీన్ 1984- 2000 సంవత్సరం మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 99 టెస్టులాడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 6215 పరుగులు సాధించాడు. ఇందులో 22 శతకాలు ఉన్నాయి.అదే విధంగా.. టీమిండియా తరఫున 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్.. ఏడు సెంచరీల సాయంతో 9378 పరుగులు సాధించాడు. రైటార్మ్ మీడియం పేసర్ అయిన అతడు.. వన్డేల్లో 12 వికెట్లు కూడా తీశాడు.చదవండి: అశుతోష్ శర్మపై మండిపడ్డ ఇషాంత్ శర్మ.. వేలు చూపిస్తూ వార్నింగ్! కారణం ఇదే.. -
యూత్లోనయా ట్రెండ్, F3 : ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్
జనరేషన్ మారింది.. యూత్ లైఫ్స్టైల్ మారింది.. ఆలోచనాతీరు మారింది.. ఆధునికత రూపంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్ త్రీ కీలకంగా మారింది. ఒకప్పుడు ఖలీల్ వాలీ హవేలీలు, మొగలాయి వంటకాలు, చార్మినార్ బజార్లకు ప్రసిద్ధి అయిన నగరం ఇప్పుడు మోడరన్ కల్చర్కు కేంద్రంగా మారుతోంది. పార్టీ గేమ్స్ అనేవి మోడరన్ యూత్ ఫన్ థీమ్స్గా మారాయి. ముఖ్యంగా ‘స్నూకర్‘, ‘పూల్‘, ‘డార్ట్‘, ‘షాఫుల్ బోర్డు‘, ‘బోర్డ్ గేమ్స్‘ లాంటి గేమ్స్ పబ్స్, లాంజ్లలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గేమ్స్ హైదరాబాద్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలిప్రాంతాల్లో మొదలై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హై ఎండ్ జోన్లను దాటింది. – సాక్షి, సిటీ బ్యూరోపార్టీ గేమ్స్ మానసిక విశ్రాంతి, స్నేహితులతో కాలక్షేపానికి మాత్రమే కాకుండా సోషల్ కనెక్టివిటీకి వేదికగా మారాయి. వాటితోపాటు వచ్చిన ఫుడ్, మ్యూజిక్, డ్రింక్ కల్చర్ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఇది ఫుడ్ + ఫన్ + ఫ్రెండ్స్ = ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అనే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ గేమ్స్ ద్వారా యువత మానసికోల్లాసం పొందడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ను కాపాడుకోవడం జరుగుతోంది. ఉద్యోగాల ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ‘నైట్ ఔట్‘ అంటే కేవలం ఫుడ్ కాకుండా, ఆటలతో కలిపిన ఎంటర్టైన్మెంట్ను సూచిస్తోంది. నగరంలో స్నూకర్, పూల్ లాంజ్లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హిమాయత్ నగర్లలో అందుబాటులో ఉండగా డార్ట్, షాఫుల్ బోర్డు గేమ్స్ గండిపేట్, ఫైనాన్షియల్ డిస్ర్టిస్క్ట్, కొండాపూర్లో బోర్డ్ గేమ్స్, సాఫ్ట్ గేమింగ్ లాంజ్లు మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్లో యువతను ఆకర్షిస్తున్నాయి. బ్రిటన్ టు భారత్... పార్టీ గేమ్స్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి భారత్లోకి వచ్చింది. ముఖ్యంగా యూరప్లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ పురుడు పోసుకుంది. అక్కడి పబ్ సంస్కృతిలో భాగంగా బిల్లియర్డ్స్, పూల్, డార్ట్ వంటి గేమ్స్ ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ఈ సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. హైదరాబాద్ వంటి ఐటీ హబ్లలో ఇది వేగంగా వ్యాపించింది. ఉద్యోగులకు ఈ గేమ్స్ రిలాక్సేషన్తోపాటు టీమ్ బాండింగ్ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఇదొక స్టేటస్ సింబల్... ఇప్పుడు పబ్కి వెళ్తే కేవలం మ్యూజిక్, డ్రింక్స్ కాదని, మినీ టోర్నమెంట్లు, ఫ్రెండ్స్ సర్కిల్ మధ్య స్నూకర్ మ్యాచ్లు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ గేమ్స్ను కార్పొరేట్ పార్టీలలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. యువతలో ఇది ఒక స్టేటస్ సింబల్గా కూడా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్పేస్లు గేమింగ్ కల్చర్తో ముడిపడి, సాంస్కృతిక మార్పునకు సూచికలుగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతితో సమన్వయం సాధిస్తూ, నగరం తనదైన శైలితో ముస్తాబవుతోంది.ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫ్రీ లేదా ప్లే అండ్ పే... నగరంలోని ఐక్యూ లాంజ్, స్ట్రైకర్ క్లబ్, ది హోపరీ, హార్ట్ కప్ కాఫీ, గేమర్స్ డెన్, సోబో కేఫ్ వంటి వాటిలో ఇలాంటి పార్టీ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు నిర్వాహకులు ఈ గేమ్స్ తమ కస్టమర్లకు ఉచితంగా ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తే, మరికొందరు మాత్రం ప్లే అండ్ పే అంటూ చార్జ్ చేస్తున్నారు. మరికొందరైతే రీ చార్జ్ గేమింగ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రాంగోపాల్పేట(హైదరాబాద్): వ్యభిచార ముఠా వ్యవహారాన్ని రాంగోపాల్పేట పోలీసులు రట్టు చేసి ఇద్దరు విటులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి డబ్బులు సంపాధిస్తున్నట్లు గుర్తించారు. రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు.. రాంగోపాల్పేట పీజీరోడ్డు, బాపూబాగ్ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈనెల 18న పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరు విటులతో పాటు ఇద్దరు యువతులను రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చినట్లు సదరు యువతులు తెలిపారు. ఉదోగ్య ప్రయత్నంలో ఉండగా స్వప్న అనే యువతి పరిచయం అయిందని, చేతన్ అనే వ్యక్తితో కలిసి ఈ భవనంలో ఉంటున్నామని వివరించారు. పట్టుబడిన విటులు నగరానికి చెందిన మహ్మయద్ అవియాజ్ (32), ఫహాద్ హుస్సేన్ (25)పై కేసులు నమోదు చేశారు. యువతులను షెల్టర్హోంకు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు స్వప్న, చేతన్ కోసం గాలిస్తున్నామన్నారు. నిర్వాహకురాలు స్వప్న వాట్సాప్, ఫోన్ నంబర్ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచార గృహానికి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
బీఆర్ఎస్.. రాం రాం! .. మరి కాంగ్రెస్ వైఖరేమిటో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంగా మారనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నిక జరగనుంది. తగిన బలం లేకపోయినప్పటికీ, బీజేపీ తమ అభ్యరి్థని బరిలో దింపడంతో పోలింగ్ అనివార్యంగా మారింది. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. కాంగ్రెస్కు సంబంధించి ఎంఐఎంకు స్నేహహస్తం కోసమే పోటీకి దింపలేదని కూడా ప్రచారంలో ఉంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కలిసిమెలిసి గెలిచిన ఆ రెండు పారీ్టలూ ఈ ఎన్నికలోనూ అదే వైఖరి పాటించనున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంగా ఇచి్చన హామీ మేరకు సైతం కాంగ్రెస్ రంగంలో దిగలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బీఆర్ఎస్ దూరం.. ఎంఐఎంతో విభేదాల్లేని బీఆర్ఎస్.. ఆ పార్టీకికి మద్దతు ఇస్తుందా, లేక పోలింగ్కు గైర్హాజరవుతుందా అని ఆలోచిస్తున్న రాజకీయ పరిశీలకుల ఆలోచనలకు తెర దించుతూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ పోలింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. విప్ జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కాంగ్రెస్ దారెటు ? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోలింగ్లో పాల్గొంటుందా, లేక అది సైతం పోలింగ్కు దూరంగా ఉంటుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే.. కాంగ్రెస్ పోలింగ్లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఎంఐఎంకు వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి ఓట్లేసే అవకాశం లేదు. మిగిలింది ఎంఐఎం మాత్రమే అయినందున కాంగ్రెస్ పోలింగ్లో పాల్గొంటే ఆ పార్టీ మెజార్టీ పెరుగుతుందే తప్ప దానికి ఓటమి అంటూ లేదని చెబుతున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో బీజేపీకి 25 ఓటర్ల బలం ఉండగా, ఎంఐఎం బలం 49గా ఉంది. అంటే దాదాపు రెట్టింపు బలం. కాబట్టి ఎంఐఎం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అనూహ్య పరిణామం ఏమైనా జరిగేనా? ఇదే తరుణంలో అనూహ్యంగా ఏమైనా జరగనుందా ? అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అందుకు కారణం ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలో గెలవాలనే తలంపుతోనే బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపిందని చెబుతున్నారు. అంతే కాదు.. పోలింగ్కు సంబంధించి సన్నాహక సమావేశం, మాక్పోలింగ్ వంటివి సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పారీ్టకి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడూ ఒకటేనన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మరో కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం ఎంఐఎంను ఓడించేందుకు పార్టీలకతీతంగా ఓట్లేయాలని పిలుపునిచ్చారు. విప్ ఉండదా? ఈ నేపథ్యంలోనే తమ పార్టీ పోలింగ్ను బహిష్కరిస్తుందని కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఎన్నిక నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సమాచారం మేరకు అసలు విప్ అంటూ ఉండదు. అయినా విప్ జారీ చేస్తామనడం పారీ్టవారు కట్టుతప్పకుండా ఉండటానికేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, బీజేపీ తగిన వ్యూహరచన చేసిందని వినిపిస్తోంది. గెలుస్తామనే ధీమాలోనే ఆ పార్టీ ఉందని, అందుకే ఈ ఎన్నిక కోసమే గ్రేటర్ పరిధిలోని ఎంపీలు కిషన్రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఎక్స్అఫీíÙయో సభ్యులుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రోజుకో మలుపుతో ‘స్థానిక’ ఎన్నిక రసకందాయంగా మారింది. పోలింగ్ వరకు ఇంకా ఏం జరగనుందోనన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. -
అద్దె చెల్లించమన్నందుకు ట్రాన్స్జెండర్లతో హల్చల్
హైదరాబాద్: అద్దె వివాదంలో ఇంటి యజమానిపైకి ట్రాన్స్ జెండర్లతో పాటు రౌడీలను పంపించి దౌర్జన్యానికి దిగిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో నివాసం ఉంటున్న మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఇందుకూరి నిర్మలాదేవికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనక భవనం ఉంది. ఈ భవనాన్ని గత ఏడాది జూన్లో ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీకి లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ముందుగానే అడ్వాన్స్ చెల్లించడంతో పాటు నెలనెలా అద్దె ఇస్తానంటూ ఆద్య ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు, మాజీ ఐఏఎస్ కుమారుడు గొబ్బూరు సాయి కృష్ణకిషోర్ చెప్పారు. కాగా యజమాని నిర్మలాదేవికి, సాయి కృష్ణకిషోర్ మధ్య అద్దె విషయమై గొడవ జరుగుతోంది. దీనికితోడు గతంలో బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న అధ్యాస్ జూనియర్ కాలేజీకి సంబంధించిన 16 నెలల అద్దె బకాయిలు ఉండడంతో గత ఫిబ్రవరిలో ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో నిర్మలాదేవిని కలిసిన కృష్ణకిషోర్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ఎన్టీఆర్ భవన్ పక్కనున్న కొత్త భవనాన్ని ఇవ్వాలని కోరాడు. అయితే తనకు గతంలోనే అద్దె సరిగా ఇవ్వలేదని, గతంలో అనేక వివాదాలు ఉన్నందున కళాశాల ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని చెప్పింది. అయితే అప్పటికే ఈ భవనాన్ని ఇంటరీ్మడియట్ సెంటర్గా ప్రకటించడంతో చివరి క్షణంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఏకంగా జిల్లా కలెక్టర్ కోరడంతో అందుకు ఆమె అంగీకరించింది. కాగా పరీక్షల అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని నిర్మలాదేవి కోరినా పట్టించుకోకపోవడంతో నాలుగురోజుల క్రితం ఆమె వచ్చి తాళాలు వేసుకుంది. శనివారం మధ్యాహ్నం నిర్మలాదేవి అక్కడ ఉండగా సుమారు 10మంది రౌడీలతో పాటు హిజ్రాలు ఒక్కసారిగా భవనంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించడమేగాక నిర్మలాదేవిని బయటకు తరిమివేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు ట్రాన్స్ జెండర్లు, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మలాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గొంతుకోసి..కత్తులతో పొడిచి..
హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా చోటు చేసుకున్న వివాదం హత్యకు దారి తీసిన సంఘటన షాద్నగర్ శివారులో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. శంషాబాద్ ఇన్చార్జి, రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న షాద్నగర్ లింగారెడ్డిగూడెం శివారులోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమీపంలో జాతీయరహదారి పక్కన కత్తిపోట్లకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన షాద్నగర్, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుడి చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన కిలారి సాయిరాహుల్(23) గుర్తించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన సాయి రాహూల్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. 11 విన్నర్స్ అనే ఆన్లైన్ క్యాసినో బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నగరంలోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న తన ఊరికే చెందిన చిన్ననాటి స్నేహితుడు శాఖమురి వెంకటేష్కు కూడా బెట్టింగ్ అలవాటు చేశాడు. ఈ క్రమంలో వెంకటేష్ రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల క్రితం కూడా సాయిరాహుల్ మరోమారు అదే గేమ్స్లో డబ్బులు పెట్టి తిరిగి సంపాదించుకుందామని చెప్పి వెంకటే‹Ùతో రూ. 3 లక్షలు బెట్టింగ్ పెట్టించాడు. అయితే డబ్బులు పోవడంతో వెంకటేష్ తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని సాయిరాహుల్పై ఒత్తిడి చేశాడు. దీంతో సాయిరాహుల్ తనను డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు. భయంతోనే హత్యకు కుట్ర.. గతంలోనూ ఓ మారు సాయిరాహుల్ రూ. 20 వేల విషయమై వెంకటేష్పై బీరుబాటిల్తో దాడి చేశాడు. ఆ తర్వాత తిరిగి స్నేహితులయ్యారు. సాయి తనను హత్య చేస్తాడనే భయంతో వెంకటేష్ తనతో కలిసి హాస్టల్లో ఉంటున్న స్నేహితులతో కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకు రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పి కొంత అడ్వాన్స్గా ఇచ్చాడు. దీంతో వారు సురారం వెళ్లి కత్తులు కొనుగోలు చేసి అద్దెకారు తీసుకున్నారు. ఈ నెల 12 సాయిని బెట్టింగ్ పేరుతో లింగారెడ్డిగూడెం రప్పించారు. అతడికి మద్యం తాగించి గొంతుకోయడంతో పాటు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం బహదూర్పల్లి గండిమైసమ్మ సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకుని అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వెంకటేష్ శనివారం ఉదయం ఆ«రాంఘర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. మిగతా నలుగురు నిందితులతో పాటు కారును అద్దెకిచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి మూడుఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. కేసును చేధించిన షాద్నగర్ సీఐ విజయ్కుమార్, ఎస్ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు. -
Telangana: ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎస్.కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాభ వన్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేస్తారు.కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కానున్నారు. విద్యార్థులు/తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్సైట్ ్టtgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. -
‘వక్ఫ్’పై దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఓ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ చట్టాన్ని మోదీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకొనేలా దేశవ్యాప్తంగా అన్నదాతలు పోరాడిన స్ఫూర్తితో నల్ల చట్టాన్ని ఉవసంహరించే వరకు దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షతన జరిగిన సభలో డీఎంకే ఎంపీ మహ్మద్ అబ్దుల్లా, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ హఫీజ్ ఖాన్, బీఆర్ఎస్ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్ ఆఘా, మౌలానా మతీనుద్దీన్ ఖాద్రీ, మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు. 11 ఏళ్లుగా ముస్లింలపై అణచివేత.. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మతపరమైన విధానాలు, సంప్రదాయాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే అంబేడ్కర్ కంటే తనను తాను గొప్పగా భావిస్తున్న ప్రధాని మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కానీ వాస్తవానికి అంబేడ్కర్ కాలి ధూళికి కూడా మోదీ సరిపోరని వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ 11 ఏళ్లుగా దేశాభివృద్ధిని మరిచి ముస్లింలను అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు.వక్ఫ్ సవరణ చట్టంతో మసీదులు, ఆస్తులను కాజేయడానికి ప్రయతిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 500కుపైగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వపరం చేశారని మండిపడ్డారు. గతంలోనే బోహ్రా వర్గం వక్ఫ్ బిల్లు నుంచి మినహాయించాలని కోరిందని.. కానీ సవరణ చట్టంపై బోహ్రా వర్గం సంతృప్తిగా ఉన్నట్లు మోదీ ఫొటోలకు పోజులిస్తున్నారని ఆయన విమర్శించారు. ముస్లింలను విభజించడం ద్వారా బలహీనపరిచేందుకు మోదీ చేస్తున్న కుటిలయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే నల్ల చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించిన ఒవైసీ.. ఈ విషయంలో కోర్టులు తమకు న్యాయం చేస్తాయనే విశ్వాసం ఉందన్నారు. నిరసనల కోసం కార్యాచరణ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 30న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 నిమిషాలు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపాలని కోరింది. అలాగే మే 18న రౌండ్ టేబుల్ సమావేశాలు, మే 22న హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లో మహిళల బహిరంగ సభ, మే 25న అన్ని జిల్లాల్లో మానవహారం, జూన్ 1న అన్ని జిల్లాల్లో ధర్నాలు, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. -
‘పచ్చ’పార్టీ కబ్జాకాండ
గచ్చిబౌలి/హఫీజ్పేట్ (హైదరాబాద్): స్వరాష్ట్రమే కాదు..పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను చెరబడుతున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.3 వేల కోట్లు పలికే ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టారు. నకిలీ డాక్యుమెంట్లతో దొడ్డిదారిన యాజమాన్య హక్కులు పొందారు.దీనిపై ఒకవైపు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. ఫాంహౌస్, విల్లాలు నిర్మిస్తూ విలువైన భూమిలో పాగా వేశారు. షెడ్లు, కార్యాలయాలు నిర్మించారు. దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులుండగా, ఇటీవలి మరికొన్ని ఫిర్యాదులు సైతం రావడంతో హైడ్రా కదిలింది. ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట్ సర్వే నంబర్ 79లో ఎమ్మెల్యే, మరికొందరు కలిసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాల్లో కొన్నిటిని కూల్చివేసింది. 39 ఎకరాలు దర్జాగా కబ్జా హఫీజ్పేట్ సర్వే నంబర్ 79కి సంబంధించిన రికార్డులలో 39.06 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే బై నంబర్తో రికార్డులు సృష్టించిన వసంత కృష్ణప్రసాద్, మరి కొంతమంది ఆ భూమిని ఆక్రమించారు. చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిపై ఎన్నో ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ (సీఎస్ 14/58) పెండింగ్లో ఉంది. స్టేటస్కో పాటించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా ఏళ్ల క్రితమే నిర్మాణాలు ప్రారంభించి 19 ఎకరాలలో విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు.మిగతా 20 ఎకరాలలో షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. పలు కార్యాలయాలు, గెస్ట్హౌస్ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిపై కేసులు ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. కాగా అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఈ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారనే విమర్శలు ఉన్నాయి. ఫైనల్ డిక్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని ఈ పిటిషన్ విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ నేపథ్యంలోనే భూముల కబ్జాపై గత మూడు నెలలుగా మరిన్ని ఫిర్యాదులు అందడంతో శనివారం పోలీస్ బందోబస్తుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూమిలోని షెడ్లు, కార్యాలయాలతో కూడిన నిర్మాణాలను కూల్చివేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే శిక్షార్హులని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులపై మియాపూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ.. హఫీజ్పేట్ సర్వే నంబర్ 79లోని 39 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలానికి 79/1 బై నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలంలో విల్లాలకు అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడంలో అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 39.08 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో ఇప్పటికీ ప్రభుత్వభూమి (పోరంబోకు)గానే ఉండటం గమనార్హం. రాయదుర్గంలోనూ హైడ్రా కొరడా తాము రోజూ ఆడుకునే స్థలంలోకి రానివ్వడంలేదని, అక్కడ చెరువు కూడా మాయమైందని, రహదారుల నిర్మాణం చేపడుతున్నారని క్రికెట్ ఆడే కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. శనివారం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నంబర్ 5/2లోని ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అందులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఓ చోట ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ భూమిపై ఆక్రమణ కేసులు ఉన్నట్లుగా అక్కడ బోర్డులు ఉన్నప్పటికీ, ప్లాట్ల కొనుగోలుకు తమను సంప్రదించాలంటూ కొందరు (నార్నే ఎస్టేట్స్) ఫోన్ నంబర్లతో సహా ఏర్పాటు చేసిన బోర్డులు హైడ్రా అధికారులు గుర్తించారు. -
ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందా? గత రెండు నెలల్లో నమోదైన వినియోగ ధరల సూచీ (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) ద్రవ్యోల్బణం ఇదే విషయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ప్రజల చేతిలో డబ్బులు తగ్గిపోవటంతో వారి కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మార్చి నెలలో తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 1.06 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ స్థాయి లో ఇది సగటున 3.34 శాతంగా ఉంది.ఫిబ్రవరిలో కూడా జాతీయస్థాయిలో ద్రవ్యోల్బణం 3.32 శాతం ఉండగా.. తెలంగాణలో 1.31 శాతం మాత్రమే నమోదైంది. వరుసగా రెండునెలల పాటు అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావటం ప్రమాద సంకేతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ తర్వాత ఢిల్లీ (1.48 శాతం), జార్ఖండ్ (2.08 శాతం), ఆంధ్రప్రదేశ్ (2.50 శాతం)లో మార్చిలో తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.ఇక అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో 6.59 శాతంతో కేరళ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (4.44 శాతం), ఛత్తీస్గఢ్ (4.25 శాతం) జమ్ముకశ్మిర్ (4 శాతం), మహారాష్ట్ర (3.86 శాతం) నిలిచాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2 నుంచి 4 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలు ఆర్థికపరంగా బాగున్నట్టుగా పరిగణిస్తారు. తక్కువ ఉన్నా సమస్యే.. పైపై అంచనాలు, అంశాలవారీగా చూస్తే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపించినా.. అందుకు వ్యవస్థీకృతంగా బలీయమైన సమస్యలు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావటానికి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గుదల, వస్తువులకు డిమాండ్ తగ్గడం కారణం కావొచ్చని పేర్కొంటున్నారు. అయితే, రాబోయే నెలల్లోనూ ద్రవ్యోల్బణం తీరుతెన్నులు పరిశీలిస్తే తప్ప ఒక స్పష్టమైన నిర్ధారణకు రాలేమని అంటున్నారు. రానున్న నెలల్లోనూ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైతే అది వాస్తవ పరిస్థితుల ఆధారంగా జరుగుతుందని భావించవచ్చని చెబుతున్నారు.వ్యవసాయ రంగమూ దెబ్బతిందిరాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వివిధ పథకాల కింద నగదు బదిలీ అంతగా జరగడం లేదు. వ్యవసాయరంగం కూడా కొంతమేర దెబ్బతిన్నది. దీంతో ప్రజలు వస్తువులను కొనలేని పరిస్థితి వచ్చి వాటికి డిమాండ్ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం తగ్గినట్టుగా కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదల రేటు తగ్గింది. తలసరి ఆదాయం కూడా పడిపోవడంతో మార్చిలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. కోవిడ్ సమయంలో తప్ప దేశంలో ఎక్కడా జీఎస్టీ వసూళ్లు తగ్గిన సందర్భాలు లేవు. –డి.పాపారావు, ఆర్థిక విశ్లేషకుడు. -
మన యువతకు జపాన్లో ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైపుణ్యం ఉన్న యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా అక్కడి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్లో అధిక ఉద్యోగావకాశాలున్న రంగాలను గుర్తించి, ఆయా ఉద్యోగాలకు తెలంగాణ యువతను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్)’ ద్వారా పంపించడానికి వీలుగా అక్కడి రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.జపాన్కు చెందిన టెర్న్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో టామ్కామ్ శనివారం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతకుముందు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కాగా టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో నియామకాలు చేపడుతుంది.ఇక రాజ్ గ్రూప్ జపాన్లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ త్సుకుయి కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గతంలో టామ్కామ్తో కలిసి పని చేసింది. తాజా ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంలో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది. ఈ రెండు జపనీస్ సంస్థలు రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువతకు అందించనున్నాయి.హెల్త్కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ రంగంలో (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ) 100 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థల ప్రతినిధులు వివరించారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు: సీఎం తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, త్వరలోనే తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. టోక్యోలోని తెలుగు సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ను పరిశీలించామని, తాము రాష్ట్రంలో మూసీ నది ప్రక్షాళన చేయాలని భావిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని చెప్పారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్తంభించే పరిస్థితులు ఉత్పన్నం అవుతుంటే, అది చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అని సీఎం ప్రశ్నించారు.మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆర్ కీలకం‘హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నా. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి. పరిశ్రమలు పెరగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగితే ప్రపంచంతోనే మనం పోటీ పడొ చ్చు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆ నందం ఏమిటో మీకు తెలుసు..’ అని రేవంత్ అన్నారు. -
ఇక ఆపుకోనక్కర లేదు
సాక్షి, హైదరాబాద్: నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి.. మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందనే భయం. మూత్ర విసర్జనకు వెళ్లాలంటే రైలు ఆగే స్టేషన్ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలైనా పట్టొచ్చు. ఇది రైళ్లను క్షేమంగా గమ్యం చేర్చే లోకో పైలట్లు, సహాయ లోకోపైలట్ల దుస్థితి.ముఖ్యంగా మహిళా లోకోపైలట్ల ఆవేదనపై సాక్షి పత్రిక ‘ఆపుకోలేని ఆవేదన’పేరిట కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వే శాఖ నిర్ణయించింది. రైళ్ల ఇంజిన్ క్యాబిన్ (లోకో)లలో యూరినల్స్, ఏసీ వసతి, ఆధునిక ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీంతో లక్షన్నర మంది లోకో, అసిస్టెంట్ లోకోపైలట్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. యూరినల్స్ ఏర్పాటు ప్రారంభం కొత్తగా తయారు చేసే అన్ని లోకో క్యాబిన్లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్లోని లాలాగూడ, మౌలాలి లోకోòÙడ్లతోపాటు కాజీపేట, విజయవాడ, గుత్తిలలోని లోకోòÙడ్లలో ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్సు రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే 42 లోకోమోటివ్లలో ఏర్పాటు చేశారు. ఇంజిన్ను పరిశీలించేందుకు వీలుగా ఉన్న కారిడార్లో చిన్న క్యాబిన్ ఏర్పాటుచేసి, అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటు చేస్తున్నారు. లోకోమోటివ్లలో నీటి వసతి ఉండదు కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ కోచ్ నాలుగు రోజులకోసారి స్పెషల్ క్లీనింగ్కు షెడ్డుకు వెళ్తుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్ధాలను తొలగిస్తారు. కానీ, లోకోమోటివ్ 90 రోజులకోసారి మాత్రమే షెడ్డుకు వెళ్తుంది. అప్పటి వరకు వ్యర్ధాలు నిల్వ ఉంచలేరు. ఎర్గోనామిక్ సీట్లు.. గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తే నడుము, వెన్నెముఖ నొప్పులొస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్ సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచినీళ్లు కూడా తాగేవాళ్లం కాదుపురుషులతో సమానంగా ఈ కష్టతరమైన పనిచేయటాన్ని సవాల్గా తీసుకుని ఈ ఉద్యోగంలో చేరా. కానీ లోకోమోటివ్లలోని ప్రతికూల పరిస్థితులు ఈ సవాల్ను మరింత కఠినతరం చేశాయి. మంచినీళ్లు తాగితే మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందన్న భయంతో నీరు కూడా తాగకుండా పనిచేస్తూ వస్తున్నాం. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం మాకు పెద్ద వరం లాంటిదే. - డి.దుర్గాభవాని, సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేయాలి దశాబ్దాల మా సమస్యలకు పరిష్కారంగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. యూరినల్స్కే పరిమితం కాకుండా, టాయిలెట్ వసతి కూడా ఏర్పాటు చేస్తే సమస్యకు పూర్తి పరిష్కారం లభించినట్టవుతుంది. - పి.రవీందర్, చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ -
ర్యాంకర్లూ కటాఫ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్ పర్సంటైల్ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.గతేడాది జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్గా నిలవగా అజయ్రెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలోనూ టాపర్గా నిలిచాడు. భారీగా దరఖాస్తులు... జేఈఈ మెయిన్–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్డ్కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్ కేటగిరీలో 93.102 పర్సంటైల్గా కటాఫ్ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్ పర్సంటైల్ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిలిపేసింది. ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్డ్’కు రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి. -
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి ఘటనలో తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఐఏఎస్ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు?. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.‘‘అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. అప్పుడు కనిపించని తప్పు.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో?.. అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా?’ అంటూ సీపీఆర్వో ట్వీట్ చేశారు.ఆ IAS అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు. .??అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా. .??అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (CMO లో Irrigation బాధ్యతలు నిర్వహించిన) వీరే. . ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో. .?? అసలు… pic.twitter.com/0KnHYAVeg5— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 19, 2025కాగా, స్మితా సబర్మాల్ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్లో ఆమె విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపై తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు. హాయ్ హైదరాబాద్ పోస్టును రీట్వీట్ చేశా. 2 వేల మంది అదే పోస్ట్ను షేర్ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్?. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా?’’ అని ట్వీట్ చేశారు. -
బంజారాహిల్స్లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్ చేస్తోంది. -
Hyderabad: నిమ్స్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తులో మంటలు ఎగిసిడుతున్నాయి. నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
World Liver Day: సురక్షితమైన జీవనానికి కాలేయ ఆరోగ్యం అనివార్యం
హైదరాబాద్: ఆరోగ్యకరమై, సురక్షితమైన జీవనానికి కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాలేయ ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉంటే కాలేయ వ్యాధుల నియంత్రణ కష్టమేమి కాదనీ ఆలివ్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్. పరాగ్ దశత్వార్ అన్నారు. అంతర్జాతీయ కాలేయ దినోత్సవం సందర్భంగా ఆలివ్ హాస్పిటల్ యాజమాన్యం కాలేయ వ్యాధులపై పౌరులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. గ్యాస్ట్రో, హెపటాలజీ వైద్య బృందంతో కాలేయాన్ని సంరక్షించుకునే అంశాలపై చర్చించారు. శరీర జీవక్రియలలో కీలక పాత్ర పోషించే కాలేయంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు సూచించారు.కాలేయ వ్యాధులు, నివారణ, నియంత్రణ చర్యలపై అవగాహన కలిగి ఉంటే ప్రాణప్రాయ పరిస్థితులే దరిచేరవని ఆసుపత్రి కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ పరాగ్ దశత్వార్ అన్నారు. ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ, కాలేయ వ్యాధులు, ఇన్ ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్, జీఐ మాలిగ్నెన్సీ వంటి వ్యాధులకు చికిత్స చేయడంలో అనుభవం కలిగి కాలేయ ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయన మాట్లాడారు. " కాలేయం నిర్విషీకరణ, జీర్ణక్రియ, పోషక నిల్వ, రక్తం గడ్డకట్టడం వంటి ముఖ్యమైన విధులకు బాధ్యత వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి. ఏటా లక్షలాది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. హెపటైటిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురౌతున్నారు. పోషకాహారం, కొవ్వు, చక్కెర, సోడియంను పరిమితం చేస్తే కాలేయ వాపు గణనీయంగా తగ్గుతుంది.మెడిటరేనియన్ డైట్ వంటి ఆహారాలు నాన్-ఆల్కహాలిక్ ప్యాటీ లివర్ వ్యాధులను తిప్పికొట్టవచ్చు. కాలేయ సంబంధిత వ్యాధుల ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. నగరీకరణ జీవనశైలి, మద్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి కారణాలతో కాలేయ ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. కాలేయాన్ని సంరక్షించుకునేందుకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల ఆహారాన్న తీసుకోవాలి. మద్యపాన వినియోగం తగ్గించడం, క్రమం తప్పని శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువు, హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండటం వంటి అలవాట్లతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటితోపాటు అదనంగా హెపటైటిస్ A, Bలకు టీకాలు వేయడం కీలకం అన్నారు. కాలేయ వ్యాధులకు ప్రత్యేక సంరక్షణతో సమగ్రమైన, అధిక నాణ్యతను అందించే లక్ష్యంలో ఆలివ్ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో, ఆసుపత్రి రోగులకు సాధ్యమైనంతఉత్తమమైన ఫలితాలను నిర్ధారించడానికి సాధారణ స్క్రీనింగ్ ద్వారా అధునాతన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి." అని అన్నారు.ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది.ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్థులైన వైద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత యొక్క బంగారు ప్రమాణం అయిన నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్కేర్ నుండి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. -
‘మోదీకి దాసోహమైంది మీరు కాదా?’
హైదరాబాద్: దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నది మీరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నదని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు.. మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోదీకి దాసోహమయ్యారు.మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసింది. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్, పదేళ్లలో మోదీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రశ్నించడం హాస్యాస్పదం. కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా?, బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారు.సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే కేటీఆర్ తాపత్రయపడుతున్నారు’ అని విమర్శించారు మహేష్ గౌడ్. -
బీఆర్ఎస్ బండారం బట్టబయలు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ బండారం బయటపడిందని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంను గెలిపించేందుకే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉందని ఆరోపించారు. భాగ్యనగర్ను మజ్లిస్కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని రాజాసింగ్ ఆరోపణలు గుప్పించారు. భాగ్యనగర్లో బీఆర్ఎస్ను పాతరేస్తాం. మజ్లిస్ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లేనంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అన్నారు. ఓటింగ్లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు.కాగా, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్కట్ చేస్తున్నామని.. ఓటింగ్కు దూరంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. -
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. 17 నెలల కాలంలో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను బాయ్కట్ చేస్తున్నామని.. ఓటింగ్కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను కేటీఆర్ ఆదేశించారు. విప్ ధిక్కరిస్తే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.హెచ్సీయూ భూ కుంభకోణం వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటూ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే.. రేవంత్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చిందన్న.. కేటీఆర్.. బీఆర్ఎస్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందన్నారు.చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూ, హైడ్రా, మూసీ పేరుతో అరాచకాలు సృష్టిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ను ఒక్క మాట కూడా అనరని.. హెచ్సీయూ భూములపై ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. -
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్ఫ్రాంక్ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.👉ఇదీ చదవండి: హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. గ్రేటర్లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది. -
మేమేం పాపం చేశామమ్మా..
(హైదరాబాద్) జీడిమెట్ల: ఎందుకమ్మా.. ఇంత దారుణానికి ఒడిగట్టావు. గోరుముద్దలు తినిపించి.. అల్లారుముద్దుగా పెంచి.. అనురాగాన్ని పంచి నీ ప్రాణానికి ప్రాణంగా చూశావు. కానీ.. ఇంతలోనే మా ప్రాణాలు తీసి నీవూ చనిపోయావెందుకమ్మా! కష్టమొస్తే నాన్నకు చెబితే తీర్చేవాడు కదా. మాకు ఆరోగ్య సంబంధ సమస్యలు, నీకూ అనారోగ్యం.. వీటిని తట్టుకోలేక నీ ఇద్దరు పిల్లల ఊపిరి తీశావు. మేమేం పాపం చేశామమ్మా.. అంటూ ఆ ఇద్దరు చిన్నారి బాలురు తమ హృదయావేదనను ఇలాగే వెలిబుచ్చేవారేమో! గురువారం జీడిమెట్ల పీఎస్ పరిధిలోని బాలాజీ లే అవుట్లో తల్లి తేజస్విని తన ఇద్దరు కుమారులు ఆశిష్రెడ్డి (7), హర్షిత్రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి.. ఆ తర్వాత అపార్ట్మెంట్పై నుంచి కిందికి దూకి తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ విషాదాంత ఘటనతో స్థానికులను కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఈ దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలే కనిపించాయి. ఆ కుటుంబంలో తీరని శోకమే నిండుకుంది. మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే తేజస్విని ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. మాతృమూర్తి ఆదిలోనే ఇలా తమ ప్రాణాలను తీస్తుందని ఊహించే స్థితిలో లేని ఆ ముక్కుపచ్చలారని ఆమె ఇద్దరు కుమారులు ఆఖరి ఘడియల్లో ఎంతటి క్షోభ అనుభవించారో.. పాపం పసి పిల్లలు! -
వాళ్లందరిపైనా ఇలాగే చర్యలు తీసుకుంటారా?: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్మాల్ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్లో ఆమె విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపై తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. ‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు. హాయ్ హైదరాబాద్ పోస్టును రీట్వీట్ చేశా. 2 వేల మంది అదే పోస్ట్ను షేర్ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. .. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్?. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా?’’ అని అన్నారామె. ఇదిలా ఉంటే.. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈనెల 12నే నోటీసులు జారీ అయ్యాయి. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోలను ఆమె సోషల్మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే నోటీసులు అందుకున్నాక కూడా ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని రీట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
హైదరాబాద్లో శ్రీచైతన్య సంస్థల క్రీడోత్సవం
క్రీడలతో మానసిక ఉత్తేజం పెరిగి విద్యార్థులు మరింత ఉత్సాహం, ఉత్తేజం తెచ్చుకుంటారని తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికార సంస్థ అధ్యక్షుడు కె. శివ సేనారెడ్డి అన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిర్వహించిన డా. బి. ఎస్. రావు స్మారక రాష్ట్రస్థాయి క్రీడా పోటీల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే మహిళల వాలీబాల్ జట్టు కోచ్ ఎం.సి. షాజియా, జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు గొంగడి త్రిష ప్రత్యేక అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించారు.హైదరాబాద్లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ క్రీడా ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 640 శ్రీ చైతన్య పాఠశాలలు పాల్గొన్నాయి. అందులోని తెలంగాణలోని 7 జోన్లకు చెందిన 80 బ్రాంచీల మధ్య ఫైనల్స్ నిర్వహించబడ్డాయి. 63,919 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, జోనల్ స్థాయికి అర్హత పొందిన ప్రతి జోన్కు చెందిన 110 మంది విద్యార్థుల్లో నుంచి ఎంపికైన 800 మంది విద్యార్థులు ఈ ఫైనల్స్లో పాల్గొన్నారు.సీనియర్, జూనియర్ విభాగాల్లో వాలీబాల్, థ్రోబాల్, బ్యాడ్మింటన్తో పాటు అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్పుట్ తదితర ఈవెంట్లలో పోటీలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభను, క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులు విజేతలకు అభినందనలు తెలుపుతూ, మానసిక అభివృద్ధిలో క్రీడల ప్రాధాన్యతను వివరించారు.విజేతలను అభినందించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడెమిక్ డైరెక్టర్ సీమ.., శారీరక మరియు మానసిక అభివృద్ధి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయని, క్రీడల వల్ల విద్యార్థుల అకడమిక్ పనితీరు మెరుగవుతుందన్నారు. ఈ పోటీలను సంస్థ స్థాపక ఛైర్మన్ డా. బి. ఎస్. రావు గారిని స్మరించుకుంటూ నిర్వహించామని, చిన్ననాటి నుంచే పోటీ స్పూర్తిని విద్యార్థుల్లో నాటడం శ్రీచైతన్య సంస్థల ప్రధాన ఉద్దేశ్యమని డైరెక్టర్ సీమ తెలియజేశారు. ఈ కార్యక్రమం విద్యా రంగాన్ని క్రీడలతో మేళవించి, విద్యార్థులకు హోలిస్టిక్ డెవలప్మెంట్ వేదికగా నిలిచింది. -
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంఎస్ఎన్ రియాల్టీ అద్భుతమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్ను ‘వన్’ను నిర్మించనుంది. 7.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది.40 లక్షల చ.అ.లలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో 5 టవర్లు, ఒక్కోటి 55 అంతస్తుల్లో ఉంటుంది. 5,250 చ.అ. నుంచి 7,460 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 655 యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నీ 4 బీహెచ్కే యూనిట్లే ఉండే ఈ ప్రాజెక్ట్లో చ.అ. ధర రూ.11 వేలుగా ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్కు రెండు బాల్కనీలు, లార్జ్ డెక్ ఉంటుంది. గండిపేట చెరువు వ్యూ ఉండే ఈ ప్రాజెక్ట్లో 1.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉంటుంది.ఇందులో 30కి పైగా ఆధునిక వసతులు ఉంటాయి. మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా డెక్, స్కై సినిమా, ఆక్వా జిమ్, వెల్నెస్, లైఫ్స్టైల్ జోన్లతో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, పికిల్బాల్, ప్యాడిల్ బాల్ కోర్టులు, బౌలింగ్ అల్లే, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లు ఉంటాయని ఆయన వివరించారు. నగరంలో వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ.లలో ప్రాజెక్ట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. -
బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్కు కోల్కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది. -
కూతురే.. కుమారుడిగా..
హైదరాబాద్: దేశంలోనే ప్రసిద్ధి గాంచిన వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ డాక్టర్ వెంకట్ రామ్నర్సయ్య (82) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం చిక్కడపల్లి వివేక్నగర్లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుమార్తె శాంతి తండ్రి చితికి నిప్పటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందుకు తల్లి లక్ష్మితో పాటు శాంతి భర్త నవీన్ చక్రవర్తి ఆమోదం తెలపడంతో శుక్రవారం అంబర్పేట శ్మశాన వాటికలో ఆయన దహన సంస్కారాలు పూర్తి చేశారు. రామ్నర్సయ్య వృత్తి రీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి మాత్రం వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ. వైల్డ్లైప్ ఫొటో గ్రఫీలో అప్పటి కాంగ్రెస్ అగ్రనేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు ఆయన గురువు కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దిగి్వజయ్సింగ్, డాక్టర్ వెంకట్ కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఆయన తీసిన పులుల ఫొటోలతో దేశంలోనే టాప్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్గా పేరు తెచి్చపెట్టాయి. అంతేగాకుండా పులులపై ఆయన ఓ పుస్తకాన్ని కూడా రాశారు. -
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి. -
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలే టార్గెట్గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పలు భవనాలను కూల్చివేస్తోంది.వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఇంజాపూర్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించింది. దీంతో, రోడ్డు ఆక్రమణపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు.. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఫ్రీకాస్ట్ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మరోవైపు.. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. హఫీజ్పేట్ సర్వే నెంబర్-79లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది. వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీగా పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేశారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా (HYDRA) చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
Hit And Run: స్విగ్గీ డెలివరీ బాయ్ దుర్మరణం
హైదరాబాద్: కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువకుడు వేసవి సెలవుల్లో స్విగ్గీబాయ్గా చేరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన కుతాడి జీవన్ కుమార్ (21) కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వేసవి సెలవులు ఉండటంతో నగరానికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్గా చేరాడు. తన తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ కావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో నగరానికి వచ్చి పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పుప్పాలగూడ ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ సమీపంలో జీవన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడిన అతడిపై నుంచి వెనకగా వచ్చిన టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, టిప్పర్ల డ్రైవర్లు పరారయ్యారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తార్నాక చౌరస్తా రీ ఓపెన్ .. జంక్షన్ జాం!
హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలం పాటు మూసివేసిన తార్నాక జంక్షన్ (సిగ్నల్)ను శుక్రవారం రీ ఓపెన్ చేశారు. ఇంత కాలం ఓయూ క్యాంపస్ నుంచి లాలాపేట వైపు వెళ్లే వారు యూ టర్న్ నుంచి రాకపోకలు సాగించేవారు. సిగ్నల్ సిస్టమ్ను పునరుద్ధరించడంతో ఓయూ వైపు నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులు నేరుగా సిగ్నల్ వద్ద ఆగి వెళుతున్నారు. హబ్సిగూడ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనదారులకు యథావిధిగా రైల్వే డిగ్రీ కళాశాల వద్ద యూ టర్న్ తీసుకువెళ్లాలనీ ట్రాఫిక్ పోలీసులు అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేశారు. గుడ్ ఫ్రైడే హాలీ డే రోజే ఇలా ఉంటే ఇక వర్కింగ్ డే మరింత వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు లాలాపేట వైపు సెయింటాన్స్ స్కూల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. తార్నాక, లాలాపేట రోడ్డులో వాహనాల రద్దీ తార్నాక జంక్షన్ పునరుద్ధరణతో రోజంతా ట్రాఫిక్ జాం నెలకొంది. ఓయూ క్యాంపస్ నుంచి తార్నాక, లాలాపేట ప్రధాన రహదారిలో వాహనాలు బారులు తీరాయి. లాలాపేట రోడ్డు విస్తరణ పనులు దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్నాయి. విస్తరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఫలితంగా ఈ మార్గంలో దాదాపు అర కిలో మీటర్ మేర ట్రాఫిక్జాం నెలకొంది.యూటర్న్తోనే ట్రాఫిక్కు చెక్ గతంలో ఉన్న యూ టర్న్తో తార్నాక జంక్షన్లో వాహనాల రద్దీ తగ్గింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగింది. పెరిగిన వాహనాల సంఖ్యను అధికారులు పొరపాటుగా అంచనా వేశారు. తార్నాక జంక్షన్ విస్తరణ, రోడ్ల విస్తరణ చేపట్టకుండా రీఓపెన్ చేయడం సరికాదు. అధికారులు పునరాలోచించాలి. – సూరి, ద్విచక్ర వాహనదారు రోడ్డు విస్తరణ చేపడితేనే.. తార్నాక చౌరస్తా నుంచి లాలాపేట వరకు రోడ్డు ఇరుకుగా మారింది. వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం చెందారు. ప్రస్తుతం ఉన్న రోడ్డులోనే చిన్నపాటి డివైడర్లు ఏర్పాటు చేసి జంక్షన్ను ఓపెన్ చేయడంతో వాహనాల రద్దీ నెలకొంది. – రవి. లాలాపేట, వాహనదారు -
ఒక్క వానకే కకావికలం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం పగలంతా మండిన ఎండలు.. సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్తోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం నగరంలోని కంచన్బాగ్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 7.9, చారి్మనార్లో 7.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోని పలుచోట్ల వరద నీరు భారీగా చేరడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి దుబ్బాకలో 10 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు జనగామ జిల్లా ఆలింపూర్లో వాన పడుతుండటంతో తలదాచుకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన చలువ పందిరి కిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే పిడుగు పడగా, ఆ ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న కొందరికి వైద్యులు సీపీఆర్ చేశారు. కాగా, కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో పిడుగు పడి 40 గొర్రెలు మృతిచెందాయి. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు బాధితుడు కడారి దేవయ్య తెలిపాడు. జనగామ జిల్లా చేర్యాలలో పిడుగుపాటుకు మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి.నేడు, రేపు అక్కడక్కడా వానలురాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం నిజామాబాద్లో 42.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, దుండిగల్లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కమీషన్ల కోసమే ఏజెంట్ల కక్కుర్తి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరిట ఏజెంట్లు వేసే ఉచ్చులో యువత ఈజీగా చిక్కుకుంటోంది. విదేశాల్లో కొలువు చేసి బాగా స్థిరపడాలన్న వారి ఆశను కొందరు ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. థాయ్లాండ్లో డేటా ఎంట్రీ, ఇతర ఉద్యోగాల్లో చేర్చుతామని ఒక్కొక్కరి నుంచి రూ.50 –రూ.60 వేలు కమీషన్లు తీసుకొని అక్కడకు పంపుతున్నారు. ఆ తర్వాత వారిని ఒక బంగ్లాదేశీయుడి ద్వారా మయన్మార్, కాంబోడియాలోని చైనీయులు నడిపే సైబర్నేర ముఠాలకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో వారి నుంచి కూడా కమీషన్లు తీసుకుంటారు.ఈ మొత్తం వ్యవహారంలో బంగ్లాదేశ్కు చెందిన ఓ వ్యక్తి కీలకంగా ఉన్నట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తులో గుర్తించారు. రాష్ట్రానికి చెందిన 24 మందిని గత నెలలో మయన్మార్ ఆర్మీ రెస్క్యూ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మయన్మార్ ముఠా నుంచి బయట పడి ఇండియాకు వచ్చిన వనస్థలిపురానికి చెందిన సాయికార్తీక్ ఫిర్యాదుతో టీజీసీఎస్బీ మరో కేసు నమోదు చేసింది. అన్ని కేసు ల్లో కీలకంగా వ్యవహ రించిన స్థానిక ఏజెంట్లపై టీజీసీ ఎస్బీ అధికారులు ఫోకస్ పెంచారు. ఇప్పటికే ఎనిమిది మంది ఏజెంట్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా ఏజెంట్లలో ఒకరైన బషీర్ అహ్మద్ నుంచి సేకరించిన వివరాల మేరకు బంగ్లాదేశ్కు చెందిన రియాజ్ఖాన్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు గుర్తించారు. అందరిదీ అదే కథ ఆర్థిక అవసరాలు తీరక, విదేశాల్లో కొలువుల కోసం ప్రయత్నించే వారిని కొందరు ఏజెంట్లు టార్గెట్ చేస్తున్నారు. థాయ్లాండ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలికాలర్ జాబ్స్ ఉన్నాయని, కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే అక్కడకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని నమ్మబలుకుతున్నారు. అక్క డి కంపెనీల ప్రతినిధులతో జూమ్ ఇంటర్వ్యూలు నిర్వహి స్తున్నారు. ఎదుటి వ్యక్తులు తమ వలలో పడ్డట్టు గుర్తించిన తర్వాత, మొదట థాయ్లాండ్కు పంపుతున్నారు. ‘అక్కడ విమానం దిగగానే.. కంపెనీ ప్రతినిధి వచ్చి మిమ్మల్ని కలు స్తాడు.. మీరు పనిచేసే చోటకు తీసుకెళతాడు’అని చెబుతు న్నారు. ముందు చెప్పినట్టుగానే సైబర్ ముఠాకు చెందిన వారు ఎయిర్పోర్టుకు వచ్చి భారత్ నుంచి వచ్చిన యువ కులను రిసీవ్ చేసుకుంటారు.వెంటనే వారి నుంచి పాస్ పోర్టును తీసుకొని ఆ తర్వాత మయన్మార్లోని కేకే3 పార్క్ ప్రాంతంలోని సైబర్ ముఠాల కాల్ సెంటర్లకు పంపుతు న్నారు. ఇలా భారత్ నుంచి మనుషులను అక్రమంగా రవాణా చేసినందుకు ఒక్కో ఏజెంట్కు రూ.50 నుంచి రూ.60వేల వరకు సైబర్ముఠాలు ఇస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని రియాజ్ఖాన్ హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా చేస్తున్నట్టు టీజీసీఎస్బీ అధికారులు గుర్తించారు. అటు అమాయకులైన యువకుల నుంచి రూ.50 నుంచి రూ.60 వేల వరకు, అటు సైబర్ ముఠాల నుంచి రూ. 60 వేల వరకు ఈ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు.ఇలా సైబర్ ముఠాలకు చేరిన యువకులతో చైనా సైబర్ ముఠాలు క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు సహా పలు రకాల ఆర్థిక మోసాలపై తర్ఫీదు ఇచ్చి మరీ చేయిస్తున్నారు. ఈ వ్యవహారం నచ్చక ఎదురు తిరిగితే పాస్పోర్టు ఇచ్చేందుకు రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని చిత్రహింసలు పెడుతు న్నారు. మయన్మార్, ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్లలో బయటపడుతున్న కొందరు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇలా తెలంగాణకు చేరిన బాధితుల నుంచి ఫిర్యా దులు తీసుకోవడంతోపాటు ఈ మయన్మార్ ముఠాలపై టీజీసీఎస్బీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.