
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు. ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడిగిస్తారని చర్చ సాగింది.. కానీ ప్రభుత్వం.. కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్
గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్గా శశాంక్ గోయల్
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెకట్రరీగా టీకే శ్రీదేవి
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్
యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకట్రావు
పరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈవోగా జయష్ రంజన్
ప్యూచర్ సిటీ కమిషనర్గా శశాంక
కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్
జెన్కో సీఎండీగా హరీష్
హెల్త్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ
పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్
పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఇలంబర్తి
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిల
సెర్ప్ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవి
ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డి
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా హేమంత్సహదేవ్ రావు
టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఫణీంద్రారెడ్డి
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్గా కధిరవన్
హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్
హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి