బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలోని ప్రతి వీధిలోనూ పానీపూరీ స్టాళ్లు కనిపిస్తుంటాయి అయితే అవి ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతున్నాయి. కర్ణాటక ఆహార భద్రత, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్డీఏ) అధికారులు ప్రధానంగా పెద్ద వాణిజ్య సంస్థలపై దృష్టి సారిస్తుండటంతో, చిన్న తరహా వీధి వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం వీధి వ్యాపారులు గ్లౌజులు, ఏప్రాన్లు ధరించడం తప్పనిసరి అయినప్పటికీ, చాలా మంది పాటించడం లేదు.
పెద్ద హోటల్స్తో పోలిస్తే చిన్న వ్యాపారులు కూడా ఆహారాన్ని తాజాగానే తయారు చేస్తారు. మాంసం, కూరగాయల వంటి పాడైపోయే పదార్థాలను సమమానునుసాయం తీసుకురావడం వల్ల నిల్వ ఉంచే అవసరం తగ్గి, అపరిశుభ్రత ముప్పు కొంతవరకు తగ్గుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గాంధీ బజార్లోని ‘సుగుణ’ అనే చిన్న తినుబండారాల యజమాని మాట్లాడుతూ, ‘మేము ప్రతిరోజూ ఇంట్లోనే తాజా ఆహారాన్ని తయారు చేసి ఇక్కడ విక్రయిస్తాము. స్థలం లేని కారణంగా డిస్పోజబుల్ పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తాం’ అని తెలిపారు.
రాజరాజేశ్వరి నగర్లో మాంసాహార స్టాల్ నడుపుతున్న నవీన్ మాట్లాడుతూ, చికెన్ను ఎక్కువ సేపు బయట ఉంచలేమని, అవసరమైతేనే వేడి చేస్తామని, వీకెండ్లలో సమీపంలోని హోటళ్లలో నిల్వ చేస్తామని చెప్పారు. పానీపూరీ విక్రేత సోమన్న మాట్లాడుతూ ‘గ్లౌజులు వేసుకుంటే పానీపూరీని కలపడం, అందించడం అసౌకర్యంగా ఉంటుంది. గోళ్లు కత్తిరించుకుని, ఏప్రాన్ ధరించి పరిశుభ్రతను పాటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. చుర్మురి విక్రేత శ్యాము మాట్లాడుతూ, ఫుట్పాత్పై వ్యాపారం చేయడం వల్ల ఎలుకలు, బొద్దింకల వంటి సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. చెరకు రసం విక్రేతలు కూడా ఈగలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. వీధి ఆహార నాణ్యతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నా, వ్యాపారుల జీవనోపాధి, నిబంధనల మధ్య సంఘర్షణ కొనసాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: బెంగాల్లో దారుణం: కాంగ్రెస్ నేత, కుమారుని కిరాతక హత్య!


