నేపాల్‌ మీదుగా హైదరాబాద్‌కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ | Pakistani To Hyderabad Via Nepal Detained By Police | Sakshi
Sakshi News home page

నేపాల్‌ మీదుగా హైదరాబాద్‌కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ

Apr 25 2025 9:37 PM | Updated on Apr 25 2025 9:54 PM

Pakistani To Hyderabad Via Nepal Detained By Police

హైదరాబాద్:  పహెల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ నడుమ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న  వేళ హైదరాబాద్‌కు వచ్చిన పాక్ జాతీయుడు పోలీసులకు చిక్కాడు. మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి.. హైదరాబాద్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను కలిసేందుకు ఫయాజ్ భారత్ కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.  

ఎటువంటి వీసా లేకుండా  నేపాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు ఫయాజ్. అయితే ప్రస్తుతం పాకిస్తానీయులను వెనక్కి పంపించే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై ఓ కన్నేసి ఉంచాయి. ఈ క్రమంలోనే ఫయాజ్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌  పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ యువకుడ్ని మరింత లోతుగా విచారించనున్నారుపోలీసులు. అతను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్‌ జాతీయులు తమ దేశానికి వెళ్లిపోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ.. ముందుగా అప్రమత్తమయ్యారు.  పాకిస్తాన్‌ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఇక వారు రాష్ట్రాల నుంచి ఖాళీ చేసి పాక్‌ కు వెళ్లిపోవాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో భార్యను కలవడానికి వచ్చి పోలీసులకు పాకిస్తాన్‌ జాతీయుడు చిక్కడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement