మానవత్వం, ‍ప్రకృతి మధ్య సంభాషణను నృత్య రూపకంగా..! | Hyderabad will host classical dance at Sri Venugopala Swamy Temple | Sakshi
Sakshi News home page

మానవత్వం, ‍ప్రకృతి మధ్య సంభాషణను నృత్య రూపకంగా..!

Jan 1 2026 5:31 PM | Updated on Jan 1 2026 5:39 PM

Hyderabad will host classical dance at Sri Venugopala Swamy Temple

పరంపర ఫౌండేషన్ హైదరాబాద్ జనవరి 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు నార్సింగిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో భారతీయ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన దివ్య సమ్మేళనాన్ని నిర్వహించనుంది.  ఈవెంట్‌లో వివర్త: ట్రాన్స్‌ఫర్మేషన్స్','పరమమ్ అనే రెండు ప్రదర్శనలు ఉంటాయి. USAలోని కళా మందిర్‌కు చెందిన సుజాత శ్రీనివాసన్ నృత్యం, సంగీతం ద్వారా మారుతున్న వాతావరణం, భావోద్వేగ ప్రయణాన్ని ప్రదర్శించనున్నారు. 

ఒక్క ప్రశ్నతో మొదలై..మానవత్వం ప్రకృతి మధ్య సంభాషణను ఎలా పరిశీలిస్తుందనేది ఈ ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. పపరమం, కొరియోగ్రఫీ అమెరికాలోని నాట్యాంజలి కూచిపూడి నృత్య పాఠశాలకు చెందిన శ్రీలత సూరి, సూర్యాష్టకం, మీనాక్షి పంచరత్నం, భూదేవి వరాహ ప్రీమియర్ వంటి ఆధ్యాత్మిక అంశాలతో కూడిన కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ 45 నిమిషాల ప్రదర్శన దైవిక, సహజ ప్రపంచాన్ని కలుపుతుంది. ఈ శాస్త్రీయ నృత్య  ప్రదర్శన  బలం, దయ, రక్షణ థీమ్‌లను హైలైట్ చేస్తుంది.

(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement