కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి.. | road incident Kushaiguda | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి.. అతనిపైనే నడిపి..

Feb 15 2026 8:01 AM | Updated on Feb 15 2026 8:01 AM

road incident Kushaiguda

     అరకిలోమీటర్‌ వరకు లాక్కెళ్లిన నిందితులు  

 

హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ  పోలీసులు తెలిపిన  మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్‌లో  నివాసముంటున్న సతీష్‌(45), విజయ్‌కుమార్, రాజులు ఈ నెల 9న  కారులో వెళుతుండగా మల్లాపూర్‌ ఎలిఫెంట్‌ సర్కిల్‌ వద్ద  వెనుక నుంచి అతి వేగంగా  దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.

 దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు.  సతీష్‌ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్‌ను ఢీకొట్టడంతో అతను బానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్‌ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్‌ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని  అందులో ఉన్న  మహేష్‌ తరుణ్‌లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు  ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement