అరకిలోమీటర్ వరకు లాక్కెళ్లిన నిందితులు
హైదరాబాద్: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అరకిలోమీటరు వరకు లాక్కెళ్లడంతోపాటు అతనిపైనే కారును పోనిచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన మేరకు.. రాంపల్లి నీలగిరి హోమ్స్లో నివాసముంటున్న సతీష్(45), విజయ్కుమార్, రాజులు ఈ నెల 9న కారులో వెళుతుండగా మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా దూసుకువచ్చిన కారు వీరి కారును బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.
దీంతో వీరు వేగంగా వెళ్లి ఆ కారును అడ్డుకున్నారు. సతీష్ ఆ కారుకు ఎదురుగా నిలబడ్డాడు. అయితే నిందితులు వేగంగా వచ్చి సతీష్ను ఢీకొట్టడంతో అతను బానెట్ను గట్టిగా పట్టుకున్నాడు. అయినా అలాగే సుమారు అర కిలోమీటరు వరకు లాక్కెళ్లారు. అదుపుతప్పి సతీష్ పడిపోవడంతో నిర్దాక్షిణ్యంగా అతనిపైనే కారుపోనిచ్చారు. ఈ సంఘటనలో సతీష్ తీవ్రంగా గాయడ్డాడు. గమనించిన స్థానికులు కారును అడ్డుకొని అందులో ఉన్న మహేష్ తరుణ్లకు దేహశుద్ధి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.


