ఉదయ్పూర్లో స్వయంగా కంపెనీ సీఈవో తన ఉద్యోగిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆందోళన రేపింది. తాజాగా ఇంటికి చేరేందుకు బస్కోసం వేచి వున్న మహిళను బలవంతంగా కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్నకు పాల్పడిన వైనం కలకలం రేపింది. హర్యానిలోని ఫరీదాబాద్లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.
సోమవారం అర్ధరాత్రి 28 ఏళ్ల వివాహిత మహిళ ఇంటికి వెళ్లడానికి వాహనం కోసం వేచి ఉంది. ఇంతలో ఒక వ్యాన్లో వచ్చిన ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఆమె సమాధానం చెప్పకుముందే వాహనంలోకి బలవంతంగా లాగేశారు. అలా రెండు గంటలకు పైగా కదులుతున్న వాహనంలోనే ఆమెపై లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అరిచి గోల చేస్తోంటే చంపేస్తామని బెదిరించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, SGM నగర్లోని రాజా చౌక్ సమీపంలో కదులుతున్న వ్యాన్లో నుండి మహిళను విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. చివరికి బాధిత మహిళ తన సోదరికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆమె ముఖంపై 12 దాకా కుట్లు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, ఆ మహిళ తీవ్ర షాక్కు గురైందని వైద్యులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు, వారు ఉపయోగించిన వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు.
సంఘటనకు ఒక రోజు ముందు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆ మహిళ తనకు ఫోన్ చేసి, తల్లితో గొడవ అయిందనీ, తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని మూడు గంటల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పిందని బాధితురాలి సోదరి తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్ధల కారణంగా వేరుగా నివసిస్తోంది.
ఇదీ చదవండి: అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి


