
క్రీడారంగ అభివృద్ధికి కృషి
మంత్రి పొన్నం ప్రభాకర్
గన్ఫౌండ్రీ: క్రీడారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఎల్బీస్టేడియంలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి–20 క్రికెట్ చాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రికెట్ ఖేలో–నషా చోడో అనే నినాదంతో, నో డ్రగ్స్– నో బెట్టింగ్ అంటూ క్రికెట్ పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి, స్పోర్ట్స్ సెల్ ఇన్చార్జి పొన్నం తరుణ్ గౌడ్, శక్తి సూపర్ షీ కోఆర్డినేటర్ కె.విద్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.