breaking news
Hyderabad Latest News
-
వ్యూస్ కోసం విలువలు వదిలేస్తారా?
వ్యూస్, లైక్స్తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును ఫణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం? ఇది విలువలను వదిలేయడంతో సమానం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. అలా చేయడం బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు..చట్టరీత్యా నేరం. బాలబాలికల్ని ఇలాంటి కంటెంట్లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్ప్లాయిటేషనే అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్ను తొలగించకున్నా, భవిష్యత్తులో అప్లోడ్ చేసినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇలాంటి వీడియోలు, రీల్స్ గమనిస్తే 1930కు ఫోన్ చేసి లేదా (cybercrime. gov.in) ద్వారా ఫిర్యాదు చేయండి. పిల్లల బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యతే. – వీసీ సజ్జనర్, నగర కొత్వాల్ -
జూబ్లీహిల్స్లో గెలుపే లక్ష్యం
తెలంగాణకు కేసీఆర్ కుటుంబం ద్రోహం చేసింది ● తెలంగాణ ఇచ్చింది సోనియానే.. ● ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వెంగళరావునగర్: రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, వాటిని గుర్తించిన సోనియా గాంధీ చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని మహమ్మద్ ఫంక్షన్హాల్, సోమాజిగూడ డివిజన్ పరిధిలోని శాలివాహననగర్ ఫంక్షన్హాల్లో గురువారం జరిగిన బూత్కమిటీ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే..కేసీఆర్ కుటుంబం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సన్నబియ్యం ఇచ్చింది, కేవలం మన రాష్ట్రంలో మాత్రమేనని, ఈ ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో చివరి ఓటరు ఓటు వేసే వరకు బూత్ కమిటీ ఇన్చార్జిలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈవీఎంలకు తాళాలు వేసిన తర్వాతనే రిలాక్స్ కావాలని సూచించారు. జూబ్లీహిల్స్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది.. పీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ జనాభా నిష్పత్తిని బట్టి తెలంగాణాలో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. చివరి వరకు కూడా తాము ఇచ్చిన మాటకు నిలబడి ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు లక్ష మెజార్టీ రావాలంటే కనీసం 70 శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేయాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని ఆయా పార్టీలను నమ్మవద్దన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగానికి వస్తే తమకేమి చేశారని, ఎందుకు మీకు ఓటు వేయాలని ప్రశ్నించాలని మంత్రులు సూచించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్యాదవ్ మాట్లాడుతూ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చిందని, అధిస్టానం గౌరవం నిలబెట్టాలంటే ఇక్కడ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. గత పదేళ్ళలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి మాట దేవుడెరుగు నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు అన్యాయమే ఎక్కువగా జరిగిందన్నారు. శుక్రవారం జరగనున్న నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, కార్పొరేటర్లు సి.ఎన్.రెడ్డి, విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ సంజయ్గౌడ్, సీనియర్ నాయకులు భవానీశంకర్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఓట్చోర్ సంతకాల సేకరణ పత్రాలను పంపిణీ చేశారు. -
రోడ్ సేఫ్టీపై స్పెషల్ డ్రైవ్
● రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు 16 వేల పాట్హోల్స్కు మరమ్మతులు సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలి వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ సీరియస్గా దృష్టిసారించింది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని రాత్రింబవళ్లు మరమ్మతు పనులు ముమ్మరంగా చేస్తోంది. వర్షాలు తెరిపినివ్వడంతో పగలూ రేయీ పనులు చేస్తున్నట్లు, మిషన్మోడ్లో పనులు జరుగుతున్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు 18 వేలకు పైగా పాట్హోల్స్ గుర్తించగా, ఇప్పటి వరకు దాదాపు 16 వేల పాట్హోల్స్ పనులు పూర్తయినట్లు చీఫ్ ఇంజినీర్ రత్నాకర్ సహదేవ్ (మెయింటనెన్స్) తెలిపారు. నగర ప్రజల ప్రయాణం సాఫీగా సాగేందుకు, ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉండేందుకు రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పగలూ రేయీ పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలకనుగుణంగా, తిరిగి వర్షాలు రాకముందే వందశాతం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాట్హోల్స్ పూడ్చివేతల పనులతోపాటు క్యాచ్పిట్స్ రిపేర్లు, దెబ్బతిన్న మూతల మార్పిడి, సెంట్రల్ మీడియన్ల మరమ్మతులు సైతం జరిగేలా చీఫ్ ఇంజినీర్ వరకు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 805 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 388 మూతల మార్పిడితో పాటు పలు ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ పనులు కూడా జరిగినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. జోన్ల వారీగా వివరాలు.. ఎల్బీనగర్ జోన్లో 3042 పాట్హోల్స్, చార్మినార్ జోన్లో 2415, ఖైరతాబాద్ జోన్లో 24539, శేరిలింగంపల్లి జోన్లో 1763, కూకట్పల్లి జోన్లో 2508,సికింద్రాబాద్ జోన్లో పాట్హోల్స్ మరమ్మతులు పూర్తయినట్లు కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ప్రజలకు ఇళ్ల నుంచి పని ప్రదేశాలకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా , ట్రాఫిక్ జామ్లు కాకుండా రోడ్ల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి
శ్రీనగర్కాలనీ: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందని, ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచిన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రజలు తగు బుద్ది చెప్పాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డలో బీజేపీ బూత్స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాంటే బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని కోరారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉందని, నియోజకవర్గంలో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ, అవినీతిని అధికం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో చేరుతారని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి పార్టీ ఫిరాయింపులతో వారి అవినీతిని కాపాడుకుంటున్నారని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. మజ్లిస్ పార్టీకి అభివృద్ధి, ప్రజా సమస్యలు అవసరం లేదని, కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తుందని ఆరోపించారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలికే పార్టీ మజ్లిస్ అని అన్నారు. జూబ్లీహిల్స్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి దీపక్రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ గౌతమ్రావు, సారంగపాణి, ఎర్రబల్లి ప్రదీప్రావు, డాక్టర్ చేకూరు హనుమంతనాయుడు, విజయ్కుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.. కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి -
అమీర్పేటలో ముంపు సమస్యకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ఏమాత్రం వర్షం కురిసినా రహదారులన్నీ జలమయం అవుతాయి. అమీర్పేట చుట్టుపక్కల ప్రాంతాల విషయం విడిగా చెప్పక్కర్లేదు. ఇక్కడి సమస్యల్ని అధ్యయనం చేసిన హైడ్రా నాలాల పూడిక తీతే తొలి పరిష్కారంగా గుర్తించింది. జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ముందుకు వెళ్లింది. ఫలితంగా మైత్రీవనంతో పాటు గాయత్రినగర్ చుట్టపక్కల ప్రాంతాల్లో ముంపు సమస్య తప్పింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. జూబ్లీహిల్స్, గాయత్రీ హిల్స్, యూసుఫ్గూడ, కృష్ణానగర్, మధురానగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు అమీర్పేట నుంచి ముందుకు వెళ్లడానికి అనేక అడ్డంకులు ఉండేవి. దీంతో ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల రహదారిపై భారీగా నిలిచిపోయేవి. అమీర్పేట జంక్షన్లో సారథీ స్టూడియోస్, మధురానగర్ వైపు నుంచి వచ్చే పైపులైన్లు కలుస్తాయి. దీంతో ఎగువ నుంచి వరదతో పాటు భారీ మొత్తంలో చెత్త కూడా వాటి ద్వారా అక్కడకు చేరుతోంది. అలా దశాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్పేట జంక్షన్లో ఆరు పైపులైన్లు పూడుకుపోయాయి. దీంతో కొంత మొత్తంలోనే వరద నీరు ముందుకు సాగేది. శ్రీనివాస నగర్ వైపు వరద కాలువ పైన కాంక్రీట్తో వేసిన పైకప్పు తెరచి పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. పరుపులు, దిండ్లు ఇలా చెత్తతో మూసుకుపోయిన పైపులైన్లను తెరచింది. ఇప్పటి వరకూ దాదాపు 45 ట్రక్కుల మట్టిని తొలగించింది. దీంతో ఇటీవల అక్కడ 10 సెంటీమీటర్ల వర్షం పడినా ఇబ్బంది కలగలేదు. మరో మూడు పైపు లైన్లలో కూడా పూడికను తొలగిస్తే 15 సెంటీమీటర్ల వర్షం పడినా అమీర్పేటలో వరద ముంచెత్తదని అధికారులు చెప్తున్నారు. ఇదే మాదిరి నగరంలోని ముంపు సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కల్వర్టులు, అండర్గ్రౌండ్ పైపు లైన్లలో పూడికను తొలగించి పరిష్కారం చూపాలని రంగనాథ్ సూచించారు. అమీర్పేటలో వరద ముప్పు తప్పించేందుకు అనుసరించిన విధానం నగరంలోని అనేక ప్రాంతాలకు అనుసరణీయమని తెలిపారు. పూడుకుపోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలావరకు వరద సమస్యకు పరిష్కారం అవుతుందని అన్నారు. పనులు పర్యవేక్షిస్తున్న రంగనాథ్నాలాల్లోని పూడిక తొలగించడంతో తీరిన ఇబ్బంది ఊపిరి పీల్చుకున్న మైత్రీవనం, గాయత్రి నగర్... -
పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
వెంగళరావునగర్: త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి అధికారి ఆర్.వి.కర్ణన్ తెలియజేశారు. యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని యూసుఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మారుతీనగర్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల, ఇంజనీరింగ్స్ కాలనీలోని దక్ష స్కూల్స్లో ఏర్పాటు చేసిన 18 పోలింగ్ స్టేషన్లను ఆయన నిశితంగా పర్యవేక్షించారు. అనంతరం కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. కమిషనర్ వెంట జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రజినీకాంత్రెడ్డి తదితర సిబ్బంది ఉన్నారు. -
భర్త మృతిని తట్టుకోలేక..
దశదినకర్మలోపే భార్య మృతి అబ్దుల్లాపూర్మెట్: భర్త దశదిన కర్మ రోజే భార్య అంత్యక్రియలు నిర్వహించిన విషాద ఘటన అబ్దుల్లాపూర్మెట్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్లో నివాసముంటున్న సీనియర్ జర్నలిస్ట్ మేడపాటి బాబ్జీ(62) ఈనెల 5న గుండెపోటుతో చనిపోయారు. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన జయప్రద(58) మనోవేదనతో అస్వస్థతకు గురైంది. ఈక్రమంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా 14న చనిపోయింది. తెల్లవారితే తండ్రి దశదినకర్మ చేయాల్సిన పిల్లలు తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ మామిడి సోమయ్య తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
పోలీసు అమరవీరుల స్థూపం పనుల పరిశీలన
గన్ఫౌండ్రీ: గోషామహల్ పోలీస్ స్టేడియంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను గురువారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. డీజీపీ వెంట అదనపు డీజీ పీ మహేష్ భగవత్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్, నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తదితరులు ఉన్నారు. పనులు పరిశీలిస్తున్న డీజీపీ శివధర్రెడ్డి -
గల్లీ గల్లీ మోత మోగాల్సిందే..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో ఇక గల్లీ గల్లీ ప్రచార హోరు కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేక రథాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార రథ చక్రాలు కదం తొక్కనున్నాయి. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, పాలనను కీర్తిస్తూనే, మరోవైపు ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రత్యేకంగా రూపొందించిన పాటలతో ఈ రథాలు ప్రజల్లోకి వెళ్లనున్నాయి. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం కార్యకర్తలు ప్రచార రథాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించేలా వ్యూహం రూపొందిస్తున్నారు. అలాగే సీనియర్ నేతలు కూడా ప్రచార రథాలపైనే కదన రంగంలోకి దూకుతారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలు.. -
ప్రైవేట్ బస్సు బీభత్సం
రాజేంద్రనగర్: హిమాయత్సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. 100 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న బస్సు టైర్ పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలిపై వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అటుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టి 10 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ నుంచి నగరానికి వస్తున్న ప్రైవేట్ బస్సు గచ్చిబౌలి ప్రాంతంలో ప్రయాణికులను దింపి ఔటర్ మీదుగా ఎగ్జిట్ 17 నుంచి రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాకు వెళ్లాల్సి ఉంది. ఉదయం అప్పా నుంచి హిమాయత్సాగర్కు వస్తుండగా బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించే క్రమంలో ఫుట్పాత్ను ఢీకొట్టి విద్యుత్ స్తంభంతో పాటు చెట్లను ఢీకొని రోడ్డు అవతలివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో శంషాబాద్ కూరగాయల మార్కెట్లో కూరగాయలు అన్లోడ్ చేసి వెళుతున్న బొలెరోను ఢీకొట్టి రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. రోడ్డు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్తో పాటు బస్సు డ్రైవర్ అందులోని 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే గాయాలతో ఉన్న డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. బొలెరో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు. ● టైర్ పేలడంతో ఘటన ● డివైడర్ అవతలి వైపు ఉన్న బొలెరోను ఢీకొట్టిన వైనం -
డీసీసీలో యువతకు పెద్దపీట
చందానగర్: నిబద్ధత, క్రమశిక్షణ, సమర్ధత ఉన్న నాయకుడినే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ సభ్యుడు తిరునెల్వేలి పార్లమెంట్ సభ్యుడు రాబర్ట్ బ్రూస్ అన్నారు. గురువారం శేరిలింగపల్లి నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన హఫీజ్పేట్ డివిజన్ పరిధి హుడా కాలనీ ఎంఎస్పీ కన్వెన్షన్ సెంటర్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు, తిరునెల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్, పీసీసీ ఉపాధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ కార్యకర్త అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరించేందుకు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని.. డీసీసీ కమిటీలోనూ వారికి పెద్దపీట వేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. -
45 రోజుల్లో 1061 ఫోన్లు రికవరీ
గచ్చిబౌలి: చోరీకి గురైన, అనుకోకుండా పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి అన్నారు. 45 రోజుల్లో 1061 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రికవరీ సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ ఫోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం పోర్టల్లో పొందుపరిచి ఫోన్ను రికవరీ చేసేందుకు వీలుంటుందన్నారు. వ్యక్తి గత, ఆర్థిక సమాచారం ఫోన్లలోనే ఉంటుందని, ఆలస్యం చేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. త్వరగా ఫిర్యాదు చేయకపోతే ఆ ఫోన్ను తప్పుడు పనులకు వాడితే మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా జగ్రత్తగా ఉండాలంటే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు 13,423 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. 45 రోజుల్లో రూ.3.20 కోట్ల విలువైన 1061 ఫోన్లను సీఈఐఆర్ ఫోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. మాదాపూర్ సీసీఎస్ 240, బాలానగర్ సీసీఎస్ 188, మెడ్చెల్ సీసీఎస్ 195, రాజేంద్రనగర్ సీసీఎస్ 233, శంషాబాద్ సీసీఎస్ పోలీసులు 205 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో క్రైమ్స్ ఏడీసీపీ రాంకుమార్, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వర్ రావు, ఇన్స్పెక్టర్లు సంజీవ్, రవి కుమార్, రాజేష్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..
చిలకలగూడ : ఎక్కువ అద్దె చెల్లిస్తామని నమ్మించి కార్లను అద్దెకు తీసుకుంటారు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించి, ఆపై వాటిని అక్రమంగా తక్కువ ధరకు విక్రయించడమేగాక వాహన యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.80 లక్షల విలువైన ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఠాణాలో గురువారం అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ శశాంక్రెడ్డి, ఎస్హెచ్ఓ అనుదీప్లతో కలిసి ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ నామాలగుండు ఉప్పరిబస్తీకి చెందిన సంగిశెట్టి ప్రవీణ్కుమార్ డ్రైవర్గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సులువుగా డబ్బులు సంపాదించేందుకు తార్నాకకు చెందిన అమరేందర్, మహ్మద్ రిజ్వాన్తో జత కట్టాడు. శ్రీలక్ష్మీ లాజిస్టిక్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. కార్ల యజమానులను సంప్రదించి తమకు వాహనాలు అద్దెకు ఇస్తే సెవెన్ సీటర్కు నెలకు రూ.25వేలు, ఫైవ్ సీటర్కు రూ. 20 వేలు అద్దె చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. రెండు నెలల పాటు సక్రమంగా అద్దె చెల్లించి ఆ తర్వాత మొహం చాటేస్తారు. సదరు వాహనాలను తక్కువ ధరకు విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు. నెల అద్దె లేదా వాహనం ఇవ్వాలని అడిగిన యజమానులపై బెదిరింపులకు దిగేవారు. అంబర్పేటకు చెందిన జ్ఞానేశ్వర్ తన ఎర్టిగా కారును మూడు నెలల క్రితం వారికి అద్దెకు ఇచ్చాడు. అద్దె డబ్బులు, వాహనం తిరిగి ఇవ్వకపోవడంతో మోసయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఇదే తరహాలో పలువురి నుంచి అద్దెకు తీసుకున్న వాహనాలను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు సంగిశెట్టి ప్రవీణ్కుమార్, అమరేందర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహ్మద్ రిజ్వాన్ కోసం గాలిస్తున్నారు. కేసును చేధించిన చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్, ఎస్ఐలు రవికుమార్, ఆంజనేయులు, సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డులు అందించారు. ఇద్దరు నిందితుల రిమాండ్ పరారీలో మరొకరు ఏడు వాహనాలు స్వాధీనం -
గ్లోబల్ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ
లాలాపేట: గ్లోబల్ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీ అమలు చేసి తెలంగాణ టూరిజాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీలోని కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘ గ్లోబల్ టూరిజం ఏ న్యూ అవెన్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ‘ అంశంపై చేపట్టిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు, అధ్యాపకుల పాత్ర ఎనలేనిదన్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగాల కల్పనలో టూరిజం పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. టూరిజంలో దేశం, తెలంగాణ వెనుకబడి ఉన్నాయన్నారు. సింగపూర్, దుబాయ్తో పోటీ పడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో చారిత్రక కట్టడాలు, సుందరమైన ప్రదేశాలు, నదీ జలాలు, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. టూరిజంలో మౌలిక వసతులు లేక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేడానికి కొంత ఉపయోగపడిందన్నారు. పదేళ్లుగా టూరిజం పాలసీ లేదు. గత 64 ఏళ్ల కాలంలో 22 మంది ముఖ్యమంత్రులు పాలనలో రాష్ట్రంలో ఉన్న రూ. 70 వేల కోట్లు అప్పులు ఉంటే, గత ప్రభుత్వ హయాంలో రూ. 8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. గడచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో టూరిజం పాలసీ లేదని సీఎం రేవంత్రెడ్డి హయాంలో ప్రత్యేక టూరిజం పాలసీని రూపొందించామన్నారు. ప్రస్తుతం టూరిజం ద్వారా వస్తున్న ఆదాయం రూ.12 కోట్లు మాత్రమే అన్నారు. టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. తద్వారా పర్యాటక రంగాన్ని, తెలంగాణ సంస్కృతి, కళలను అభివృద్ది చేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రముఖ ప్రాత పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేలా నూతన విధానలను ఆవిష్కరించాలని కోరారు. వారంలో రెండు రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించి అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ టూరిజంపై రూపొందించిన హిందీ పాటను స్వయంగా తన సెల్ఫోన్ ద్వారా విద్యార్థులకు వినిపించారు. ● మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణలో ప్రకృతి ప్రసాదించిన ఆకుపచ్చ తెలంగాణ, సస్యశ్యామలమైన తెలంగాణగా పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఓయూ విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. పర్యాటక ప్రాంతాలపై సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసేలా ఓ ప్రత్యేకమైన ఆధునిక విధానాన్ని రూపొందించాలని కోరారు. ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఓయూ ఆర్ట్స్ కళాశాలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం సదస్సు సావనీర్ను ఆవిష్కరించారు. ఓయూ వైస్ చాన్సలర్ ప్రొ కుమార్ అధ్యక్షతన జరిగిన ఐపీఈ డైరెక్టర్ ప్రొ శ్రీనివాసమూర్తి, సదస్సు చైర్మన్ ప్రొ గంగాధర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. డి. చెన్నప్ప, కన్వీనర్లు కృష్ణచైతన్య, ఇంద్రకాంతి శేకర్, ప్యాట్రిక్, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యాటకరంగం అభివృద్ధితోప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన ఓయూ విద్యార్థులు టూరిజాన్ని ప్రమోట్ చేయాలి -
మిగతా ఐదు చెరువులకూ పునరుజ్జీవం తేవాలి
సాక్షి, సిటీబ్యూరో: బతుకమ్మకుంటను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పుడు మిగిలిన ఐదు చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధి, పునరుజ్జీవం నవంబర్ నాటికి పూర్తి కావాలంటూ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో రెండు చెరువుల వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు, కూకట్పల్లిలోని నల్లచెరువుల వద్దకు వెళ్లిన ఆయన పలు సూచనలు చేశారు. ఈ రెండు చెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి తమ్మిడికుంటలోకి వచ్చే ఇన్లెట్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్, బయట వైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని... చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. వేలాది నివాసాల మధ్య ఉన్న కూకట్పల్లి నల్లచెరువు వద్ద స్థానికులు సేదతీరేలా అభివృద్ధి చేయాలని రంగనాథ్ సూచించారు. మురుగునీటిని డైవర్ట్ చేసేందుకు నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జలమండలి అధికారులను కోరారు. గతంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు ఆక్రమణలను తొలగించిన తర్వాత 27 ఎకరాలకు పెరిగిందని వివరించారు. సిబ్బందికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు తమ్మిడికుంట, నల్లకుంట చెరువు పనుల పరిశీలన -
బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ కన్ను
రూ.18 లక్షల సరుకు స్వాధీనం చేసుకున్న టీమ్ సాక్షి, సిటీబ్యూరో: దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ అధికారులు కన్నేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ బృందానికి రూ.18 లక్షల విలువైన సరుకు చిక్కినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. బొగ్గులకుంటకు చెందిన శ్యామ్ కుమార్ సుగంధి సిద్ధ అంబర్బజార్లో ఓ గోదాం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా అందులో భారీగా బాణాసంచా నిల్వ ఉంచారు. జనావాసాల మధ్య ఈ గోదాం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నగర వ్యాప్తంగా ఉన్న బాణాసంచ అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొన్ని రోజులుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈస్ట్జోన్ బృందానికి శ్యామ్ కుమార్ గోదాంపై సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి, పి.నాగార్జున తమ బృందాలతో దాడి చేసి శ్యామ్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.18 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకుని కేసును అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. -
ప్రభాకర్ పనేనా..?
సాక్షి, సిటీబ్యూరో: అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ చోరీ వెనక ‘కాలేజీ దొంగ’ బత్తుల ప్రభాకర్ పాత్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అవకాశాన్ని కొట్టపారేయలేమని చెప్తున్న రాచకొండ పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంతరాష్ట్ర ఘరానా దొంగ గత నెల 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇళ్లతో పాటు కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 86 కేసులు ఉన్నాయి. ప్రభాకర్ ఎస్కేప్పై అక్కడి దేవరపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇతగాడి కోసం ఏపీ పోలీసులు దాదాపు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభాకర్ సుదీర్ఘకాలం హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖరీదైన నివాసాల్లో జీవించాడు. ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అనేక మందితో సన్నిహితంగా మెలిగాడు. కాలేజీలను టార్గెట్గా చేసుకుని వరుసపెట్టి చోరీ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ఇతడి కదలికలు పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులపై కాల్పులకు కూడా తెగపడ్డాడు. ఏపీలోనూ ఇతడిపై కేసులు ఉండటంతో పీటీ వారెంట్పై అక్కడి పోలీసులు తీసుకువెళ్లారు. గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న ఇతగాడు నగరానికి వచ్చి మళ్లీ కాలేజీలను టార్గెట్ చేశాడా? అనే కోణంలో రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో గచ్చిబౌలి ప్రాంతంలో అరెస్టు గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ -
రక్షణ రంగం సాంకేతికతతో పురోగమిస్తున్న భారత్
మణికొండ: రక్షణ రంగంలో మన దేశం సాంకేతికతను విరివిగా వినియోగించి రాణిస్తున్నదని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్, మెటీరియల్స్) అన్నారు. గండిపేటలోని చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కళాశాలలో శుక్రవారం చైతన్య ఆస్ట్రా, సీబీఐటీ ఏరోస్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే కాస్మోకాన్–2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతను రక్షణరంగం పూర్తి స్థాయిలో వినియోగిస్తుందన్నారు. డీఆర్డీఓ లాంటి సంస్థలలో అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. భవిష్యత్తు ఇంజనీర్లు మరింత ఉన్నత సాంకేతికతను కనుగొనేందుకు పరిశోధన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలు, ఆలోచనలు, వృత్తి జీవితానుభవాలను పంచుకున్నారు. విద్యార్థుల ఆసక్తిని పరీక్షించేలా వారికి పలు ప్రశ్నలను సందించి సమాధానాలను రాబట్టారు. అంతకు ముందు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ వర్చువల్గా తన సందేశాన్ని ఇచ్చారు. ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు మాట్లాడుతూ... పరిశోధన, నవీనత పట్ల సీబీఐటీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాస్మోకాన్ కన్వీనర్ ఆకాశ్ కోటి, ఆస్ట్రా అధ్యక్షుడు టి.జై సాయి దిపేష్, ఉపాధ్యక్షుడు హర్షిత్ వర్మ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్లు ఇప్పటి వరకు కొనసాగించిన పరిశోధనలు, సాధించిన విజయాలను వివరించారు. డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్వీ హరప్రసాద్ -
‘బ్రిలియంట్’లో రూ.1.07 కోట్ల చోరీ
అబ్దుల్లాపూర్మెట్: నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.1.07 కోట్లు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ విద్యాసంస్థకు చెందిన మూడు కాలేజీల్లో సిబ్బంది నాలుగు రోజులుగా ఫీజు డబ్బులు వసూలు చేశారు. అకౌంటెంట్ సెలవులో ఉండటంతో రూ.1.07 కోట్ల నగదును గురువారం కాలేజీ ఆవరణలోని ఆఫీసు బీరువాలో భద్రపర్చి, ఎప్పటిలాగే తాళాలు వేసి సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు వచ్చిచూడగా మెయిన్ డోర్ ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. ఆఫీసు రూమ్ వద్దకు వెళ్లగా బీరువా తలుపులు తెరిచి ఉండటం, అందులోని డబ్బు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కళాశాల ఏఓ కేశినేని కుమార్తో పాటు పీఎస్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దుండగులు మెయిన్ డోర్ను ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాలతో పాటు డీవీఆర్ బాక్స్ను సైతం ఎత్తుకెళ్లారు. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ అశోక్రెడ్డి కాలేజీకి చేరుకుని పలువురు సిబ్బందిని విచారించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజీలో పెద్ద మొత్తంలో డబ్బు చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. ఫీజు డబ్బులను కాలేజీ ఆఫీసులోభద్రపర్చిన సిబ్బంది బీరువా తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన దుండగులు -
దుబాయి ఎయిర్పోర్టులో తెలంగాణ వాసికి అస్వస్థత
లక్డీకాపూల్: ముంబై నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరిన నిజామాబాద్ వాసి ఒకరు దుబాయ్ ఎయిర్పోర్టులో అస్వస్థతకు గురయ్యారు. అతన్ని ఆదుకోవాలంటూ భార్య సీఎం ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ పట్టణం మహబూబ్ బాగ్కు చెందిన సయ్యద్ బాబా(38) అనే వ్యక్తి గల్ఫ్లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న ముంబై నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో దుబాయ్ ఎయిర్పోర్టులో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది అతన్ని రషీద్ హాస్పిటల్లో చేర్పించి మానవత్వం ప్రదర్శించారు. కాగా అతన్ని ఇండియాకు తిరిగి రప్పించాలని బాబా భార్య సమీనా బేగం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి సోదరుడు చోటుతో కలిసి వచ్చిన ఆమె ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బీఎల్ సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. సయ్యద్ బాబా అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్నారు. దుబాయిలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నయీమ్, కొట్టాల సత్యం, నారా గౌడ్లు రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
బాలిక సాహసం..ఉడాయించిన దొంగ
సాక్షి, సిటీబ్యూరో: తమ పొరుగింట్లో చోరీకి యత్నించిన దొంగను ఓ బాలిక తరిమికొట్టింది. దొంగతనాన్ని నివారించి అందరి ప్రశంసలు అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..చింతల్, భగత్సింగ్ నగర్, రోడ్ నంబర్ 12లోని ఓ ఇంట్లో కావలి భవానీ అనే 13 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. తమ కింద పోర్షన్లో ఉమా మహేశ్వరి, చంద్రశేఖర్ దంపతులు నివసిస్తుండగా..వారు గురువారం రాత్రి బయటకు వెళ్లడం చూసి ఓ 20 ఏళ్ల యువకుడు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించాడు. కిందింట్లో అలికిడి గమనించిన భవానీ అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు అని నిలదీయడంతో యువకుడు బయటకు పరుగెత్తాడు. భవాని అంతటితో వదిలి పెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివర ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు తరుముతూ వెళ్లింది. సీసీ కెమెరా రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతోపాటు కాలనీ వాసులు భవానిని ప్రశంసించారు. -
జలమండలి ఖాతాలో మరో పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డు, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డులు అందుకున్న జలమండలి.. మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్టీఐ కేసుల్లో ఉత్తమ సేవలకు తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యాక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సిబ్బంది మెడపై..‘ఈవీ’ కత్తి!
గ్రేటర్ పరిధిలో త్వరలో రోడ్డెక్కనున్న 275 అద్దె బస్సులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో దశలవారీగా రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ సిబ్బంది మనుగడకు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కాలుష్యరహిత, పర్యావరణహితమైన, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)లు వేలాదిమంది సిబ్బంది మెడపై కత్తిగా వేలాడనున్నాయి. ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. త్వరలో మరో 275 వరకు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో 2,800 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ బస్సుల కోసం కొత్తగా పది డిపోలను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. మరోవైపు రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ బస్సుల చార్జింగ్ పేరిట ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికులపై చార్జీల భారాన్ని మోపింది. ఈ క్రమంలోనే దశలవారీగా సిబ్బందికి సైతం ఉద్వాసన పలికే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ– బస్సులతో గ్రేటర్ హైదరాబాద్లోని 25 డిపోల్లో వివిధ స్థాయిల్లో పని చేసే సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సు ల పేరిట జరిగే ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకించేందుకు కార్మిక సంఘాలు ఆందోళనకు సన్నద్ధమవుతున్నాయి. ఒక బస్సుతో ఐదుగురికి నష్టం.. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ (పీఎం ఈ– డ్రైవ్) పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ సంస్థలకు చెందిన డ్రైవర్లే ఈ బస్సులను నడుపుతారు. దీంతో ఆర్టీసీకి ప్రత్యేకంగా డ్రైవర్ల అవసరం ఉండదు. మెకానిక్లు, టెక్నీషియన్లు తదితర సిబ్బంది అవసరం కూడా ఉండదు. కండక్టర్ల అవసరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఒక బస్సుకు ఐదుగురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్, ఒక కండక్టర్తో పాటు మెకానిక్, టెక్నీషియన్, సూపర్వైజర్లు ఉన్నారు. ఈ లెక్కన నగరంలోని అన్ని డిపోల్లో 15,000 మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు 6,000 మంది డ్రైవర్లే. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పెద్ద సంఖ్యలో నష్టపోయేది కూడా డ్రైవర్లే కావడం గమనార్హం. ఆ తరువాత మెకానిక్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలకు కూడా ప్రమాదం పొంచి ఉండనుంది. ● ఈ క్రమంలో హైదరాబాద్లో పని చేసే సిబ్బందిని జిల్లాల్లో సర్దుబాటు చేయడంతో పాటు, ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారిని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఒత్తిడి చేసేలా ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ డిపోలు కూడా ప్రైవేట్ బస్సుల నిర్వహణకు పరిమితం కానున్నాయి. ప్రస్తుతం హెచ్సీయూ డిపోను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం వినియోగిస్తున్నారు. కంటోన్మెంట్, రాణిగంజ్, కూకట్పల్లి, హయత్నగర్ తదితర డిపోల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలో అన్ని డిపోల్లోనూ హైటెన్షన్ విద్యుత్ సదుపాయం కలిగిన చార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ డిపోలన్నీ ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్, పార్కింగ్ అవసరాలకు వినియోగిస్తారు. అప్పుడు వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది అవసరం ఉండదు. కేంద్రం సబ్సిడీ ప్రైవేటుకేనా? ● ప్రజారవాణా రంగంలో ఈవీలను ప్రోత్సహించేందుకు ఈవీ బస్సులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. పీఎం –ఈ డ్రైవ్లో భాగంగా ఒక్కో బస్సుపై సుమారు రూ.35 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. రూ.కోటికిపైగా ఖరీదైన ఈ– బస్సులను కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థలకే రాయితీ లభిస్తుందని, దీనివల్ల ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం ఉండబోదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ● ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీయే చార్జింగ్, పార్కింగ్ సదుపాయాన్ని అందజేస్తోంది. ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో మాత్రం కిలోమీటర్కు సుమారు రూ.57 చొప్పున ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగానూ ఆర్టీసీకి లాభదాయకం కాదని, అద్దె ప్రాతిపదికన నడపడం కంటే సొంతంగా ఈవీలను సమకూర్చుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. మరోవైపు ప్రస్తుతం నగరంలో సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.వీరిలో 16 లక్షల మంది వరకు మహిళలే ఉన్నారు. వారి ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వం చెల్లించే రీయింబర్స్మెంటే ఆర్టీసీకి ప్రధాన ఆదాయం. నగదు రూపంలో లభించేది తక్కువే. ఉచిత ప్రయాణాలపై ప్రభుత్వ చెల్లింపులు నిలిచిపోయినా, ఆలస్యమైనా ఆర్టీసీ దారుణంగా నష్టపోతుంది. ప్రభుత్వ కుట్రలను సహించబోం.. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని నమ్ముకొని బతుకుతున్న కార్మికులను బయటకు పంపించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ఈ పరిణామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతాం. – ఈదరి వెంకన్న, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులకు ప్రణాళికలు ప్రశ్నార్థకంగా 15,000 మంది ఉద్యోగుల భవిష్యత్ దశలవారీగా ఆర్టీసీ సొంత బస్సులకు ఉద్వాసన ఎలక్ట్రిక్ వాహనాల కోసమే ఏర్పడనున్న కొత్త డిపోలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ -
ఆగేనా! అంతర్గత పోరు
సాక్షి, సిటీబ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. యువనేత నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ.. పార్టీ కొత్త, పాత శ్రేణుల్లో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు పార్టీకి పెను సవాల్గా మారాయి. ఈ పరిస్థితితో పార్టీ నేతలతో పాటు కేడర్ స్థాయిలోనూ గందరగోళం నెలకొంది. రెండు నెలలుగా మంత్రులు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరిట సుడిగాలి పర్యటనలు చేసినప్పటికీ.. పాత, కొత్త కేడర్ను ఏకతాటిపై తేచ్చేందుకు ప్రయత్నించకపోవడంతో విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారోనని రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.ఎడమొహం.. పెడమొహమే..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమై.. రాజకీయ వాతావరణం వేడేక్కి మూడు, నాలుగు మాసాలు కావస్తునప్పటికీ.. కాంగ్రెస్లోని కొత్త, పాత కేడర్లో సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో చాలెంజ్గా తీసుకొని ముందస్తుగానే గెలుపు మార్గాలను సుగమం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను రంగంలోకి దింపింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొత్త, పాత క్యాడర్ మధ్య ఆధిపత్య పోరు కోసం అమాత్యుల ముందే అమీతుమీలకు దిగడం వంటి ఘటనలు కొనసాగాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహులు సైతం మంత్రుల పర్యటన కార్యక్రమాలకు పరిమితమై కనీసం పలకరింపు కూడా లేకుండా ఎవరికి వారే యమునా తీరే విధంగా వ్యవహారించడం విస్మయానికి గురిచేసింది. అభ్యర్థిత్వం ఖరారు అనంతరం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది.ఆశావహుల్లో అసంతృప్తి..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి కనబర్చిన ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. వీరిలో కాంగ్రెస్లో కొత్తగా చేరిన నేతలతో పాటు దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న నేతలు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి , విద్యావేత్త భవానీ శంకర్ తదితరుల టికెట్ ఆశించి విఫలమయ్యారు. వీరి అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా తయారైందన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
వైద్యం ముసుగులో గంజాయి దందా
సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసమంటూ మెడికల్ వీసాపై వచ్చిన ఓ నైజీరియన్ గంజాయి దందా ప్రారంభించాడు. వీసా గడువు ముగిసినా, పాస్పోర్టు ఎక్స్పైర్ అయినా ఇక్కడే తిష్ట వేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యం లభించకపోవడంతో డిపోర్టేషన్ విధానంలో బలవంతంగా తిప్పి పంపినట్లు డీసీపీ వైవీఎస్ సుధీంద్ర గురువారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓనురా సోలమన్ చిబుజ్ కొన్నాళ్లు తన స్వస్థలంలో చిరు వ్యాపారిగా బతికాడు. 2014 ఆగస్టు 14న మెడికల్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. ఆ ఏడాది సెప్టెంబర్ 23 వరకే వీసా గడువు ఉంది. పాస్పోర్టు సైతం 2016 జనవరి 16న ఎక్స్పైర్ అయిపోయింది. అయినప్పటికీ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో మూడేళ్ల పాటు పని చేశాడు. గత ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్ వచ్చి అత్తాపూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పుణె, ముంబైల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ నుంచి తక్కువ ధరకు గంజాయి ఖరీదు చేసుకుని వచ్చేవాడు. ఆ సరుకును నగరంలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.ఇటీవల టోలిచౌకి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోలమన్ను హెచ్–న్యూ అదుపులోకి తీసుకుంది. ఇన్స్పెక్టర్ జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు నేతృత్వంలోని బృందం విచారించింది. వీసా, పాస్పోర్టు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సహకారంతో డిపోర్టేషన్ చేసింది. -
చలో బస్భవన్.. ఉద్రిక్తత
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఉదయం 8గంటల నుంచే పోలీసులు భారీ ఎత్తున మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్భవన్ నలువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అటు వీఎస్టీ నుంచి, ఇటు చిక్కడపల్లి, సికింద్రాబాద్, ఇందిరాపార్కు తదితర ప్రాంతాల నుంచి ఆందోళనకారులు బస్భవన్ వైపు రాకుండా చర్యలు చేపట్టారు. దీంతో సాధారణ ప్రజల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 10.30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్రావు ఆర్టీసీ క్రాస్రోడ్స్కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను, బారికేడ్లను దాటుకొని బస్భవన్ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లకు తరలించారు. కేటీఆర్, హరీష్రావులతో చిక్కడపల్లి ఏసీపీ రమేష్, గాంధీనగర్ ఏసీపీ యాదగిరిలు మాట్లాడి బస్భవన్లో ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేసేందుకు లోపలికి పంపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
స్థిరమైన, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యం
రాయదుర్గం: రాష్ట్రంలో స్థిరమైన, సమగ్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి క్రాంతి అన్నారు. ‘టూరిస్ట్ పోలీస్ ఓరియంటేషన్ అండ్ సెన్సిటైజేషన్’ అంశంపై వారం రోజుల పాటు గచ్చిబౌలిలోని ‘నిథమ్’ క్యాంపస్లో టూరిజమ్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని కీలక పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా టూరిజమ్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిథమ్ ప్రిన్సిపల్ ఎంకెగణేష్, నిథమ్ ఫ్యాకల్టీడాక్టర్ నీరజ్గోయల్, మిషెల్లీ జే ఫ్రాన్సిస్, యాదగిరి, ఇతర అధికారులు, టీఎస్టీడీసీ అధికారులు, శిక్షణ పొందిన టూరిజమ్ పోలీసులు పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్మ స్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చునని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అపోలో కేన్సర్ సెంటర్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ, డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి కేన్సర్పై రాసిన ‘ఐ యామ్ సర్వైవర్’(నేను కేన్సర్ను జయించాను) అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. హిందీ అనువాద ‘మైనే కేన్సర్ కో జీతా హూ’ పుస్తకావిష్కరణ సభ బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్(ఢిల్లీ) శివకుమార్ పట్టాభిరామన్, విజయ్ ఆనంద్ రెడ్డిలతో కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో 30 ఏళ్ల అనుభవాన్ని ఈ పుస్తక రూపంలో ప్రజలకు తెలపడం అభినందనీయమన్నారు. కేన్సర్ పేరు చెబితే భయపడే పరిస్థితుల నుంచి, వ్యాధిని ఎలా జయించొచ్చు అనే విషయాలను పుస్తకంలో స్పష్టంగా వివరించడం మంచి పరిణామన్నారు. ఆత్మ స్థైర్యంతో కేన్సర్ను జయించొచ్చు అనే నిజాన్ని ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తెలిపినందుకు అభినందనలు అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేన్సర్ మహమ్మారిపై దండయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ పుస్తకం ద్వారా ప్రతి రోగి ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. ఈ పుస్తకంలో కేన్సర్ను జయించిన 108 మంది విజయగాథలను, వారి అనుభవాలను పొందుపరిచినట్లు పుస్తక రచయిత డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. రోగుల జీవితంపై ప్రేమను ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో ‘ఐ యామ్ సర్వైవర్’ పుస్తకావిష్కరణ -
శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ..
కంటోన్మెంట్: శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్పల్లి కంసాలి బజార్లో బి. ప్రవీణ్ కమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసంఉంటున్నాడు. బంధువుల ఇంట్లో బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 6న కుటుంబంతో కలిసి మహబూబ్నగర్కు వెళ్లారు. బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలు తెరిచి ఉన్నాయి. 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేలు విలువ చేసే పంచలోహ విగ్రహం, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణ మూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. -
సంస్కృతి,సంప్రదాయాలను పరిరక్షించాలి
బన్సీలాల్పేట్: భారత దేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అసలైన దేశ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ సుప్రసిద్ధమైన స్కందగిరి దేవాలయంలో జరుగుతున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు గురువారం రాత్రి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆవి మన వేద విజ్ఞానంతో ముడిపడి ఉన్నాయన్నారు. సనాతన ధర్మం వేదంతో ముడిపడి ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు దశాబ్ధాలుగా ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలబడిందని దానికి వేదమే ప్రమాణికమన్నారు. ఇతర దేశస్తులు మన సంపదను దోచుకొని పొయారు గాని మన జీవన ప్రమాణానికి ఆధారమైన వేదజ్ఞానాన్ని మన నుంచి విడదీయలేకపొయారన్నారు. వేద పాఠశాలతో పాటు ఆధునిక విజ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ను అభినందిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వేదాలు, శాస్త్రాలను గౌరవిస్తూ విద్యార్ధులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షతన వహించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ట్రస్ట్ రజతోత్సవాల సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైర్మెన్ తూములూరి శాయినాథ్ శర్మ, ప్రధాన కార్యదర్శులు పసుమర్తి బ్రహ్మానంద శర్మ, చింతపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
మధురం..56 ఏళ్ల జ్ఞాపకం
గురువును సత్కరించిన పూర్వ విద్యార్థులు అంబర్పేట: విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఆత్మీయంగా సత్కరించారు. 56 ఏళ్లు గడిచినా విద్య నేర్పిన గురువును వారు విస్మరించలేదు. 1969లో కేశవ్ మెమోరియల్ స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టారు కె.యాదవరెడ్డి (ప్రముఖ కవి నిఖిలేశ్వర్)ని శిష్యులు సత్కరించి ఆత్మీయతను పంచారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు శివంరోడ్ లోని ఓ హోటల్ వేదికై ంది. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో 1969 బ్యాచ్ విద్యార్థులు ప్రొఫెసర్ రుద్ర సాయిబాబా, డాక్టర్ భగవత్ రెడ్డి, సత్యనారాయణ, డి.ఎస్.ఎన్ మూర్తి, మల్లాది రాఘవ, జగన్రావుతో పాటు మరో 25 మంది పాల్గొన్నారు. -
అపార్ట్మెంట్ రెండో అంతస్తులో కొండ చిలువ
నిజాంపేట్: బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో భారీ కొండ చిలువు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఈ నెల 8న రెండో అంతస్తులోని ఓ గదిలో కొండ చిలువును గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు స్నేక్ టీమ్కు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి కొండ చిలువను బంధించారు. అనంతరం దానిని సమీపంలోని అడవిలో వదిలేశారు. నిందితుడిపై కేసు నమోదు సైదాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...ఐఎస్సదన్ డివిజన్ పరిధిలో ఓ బాలిక కుటుంబంతో సహా నివాసం ఉంటోంది. వారి ఇంటి సమీపంలో ఓ యువకుడు (24) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా బాలిక తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉంది. అదే అదనుగా భావించిన సదరు యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్: పరిమితికి మించి బంగారం, వెండి ఆభరణాలతో పట్టుబడిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన బిన్సన్ డేవిస్ అనే ప్రయాణికుడి కదలికలను గమనించిన సీఐఎస్ఎఫ్ అధికారులు చేతి సంచి క్షుణ్ణంగా పరిశీలించడంతో అందులో 2.80 కేజీల బంగారు ఆభరణాలు, 3 కేజీల వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు గుర్తించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఐటీ అధికారులు ఎయిర్పోర్టుకు చేరుకుని వారిని విచారిస్తున్నారు. కుత్బుల్లాపూర్: ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. తూర్పు గోదావరి జిల్లా, చింతపల్లికి చెందిన వినయ్దుర్గ (19) మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ వర్సిటీ హాస్టల్లోనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ వార్డెన్ రాజేంద్ర గదులను తనిఖీ చేస్తుండగా 010 గది లోపల నుంచి గడియపెట్టినట్లు గుర్తించాడు. దీంతో గది తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూడగా వినయ్ దుర్గ టవల్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు బద్దల కొట్టి వినయ్దుర్గను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీ విక్రయానికి పండ్ల వ్యాపారుల యత్నం
పట్టుకున్న సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ సాక్షి, సిటీబ్యూరో: ఝార్ఖండ్ నుంచి వలస వచ్చి నగరంలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తుపాకీ విక్రయానికి యత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ అతడితో పాటు మరొకరిని పట్టుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. ఝార్ఖండ్కు చెందిన విజయ్ యాదవ్ నగరానికి వలసవచ్చి లింగంపల్లిలో నివసిస్తున్నాడు. వివిధ బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పండ్లు విక్రయిస్తూ జీవస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు నాటు తుపాకుల్ని తీసుకువచ్చి విక్రయించాలని భావించాడు. మూడు నెలల క్రితం బీహార్ వెళ్లి అక్కడి సోను కుమార్ నుంచి రూ.58 వేలకు 0.7 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్ ఖరీదు చేసుకువచ్చాడు. దీన్ని నగరంలోని అసాంఘిక శక్తులకు అమ్మడానికి సహకరించాల్సిందిగా సంతోష్నగర్లో ఉంటున్న తోటి పండ్ల వ్యాపారి బుంటి కుమార్ యాదవ్ను కోరారు. కొన్ని రోజులుగా ఇతగాడు ఆ అక్రమ ఆయుధం అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏసీపీ జి.వెంకటేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి.బిక్షపతి నేతృత్వంలోని బృందం ఫలక్నుమా ప్రాంతంలో వలపన్ని బుంటి కుమార్ను పట్టుకుంది. విజయ్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి తుపాకీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఫలక్నుమా పోలీసులకు అప్పగించింది. -
ఆగాలి కాలుష్యం
నగరంలో ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరింది. ఫలితంగా కన్ను, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎన్నిరకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ గాలి నాణ్యతను పెంచడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలమవుతోంది. నగర దారులపై పాదచారులు, మోటారు సైకిల్, బస్సుల్లో ప్రయాణించే వారికి నరకప్రాయంగా మారుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నిర్మాణ, పారిశ్రామిక ప్రాంతాల్లో అవస్థలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు ఇసుక, మట్టిదిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఉదయం సమయంలో కాస్త ఎండ కాయడంతో తడారిపోయి వాహనాలు వెళ్లినపుడు ఇసుక, మట్టి, ధూళి కణాలు సాధారణ ప్రయాణికుల కళ్లలో పడుతున్నాయి. ఎల్బీనగర్, కోకాపేట్, ఉప్పల్, మాదాపూర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో ఇది మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం వంటి పారిశ్రామిక వాడల్లోనూ వాయు కాలుష్యం గరిష్ట స్థాయిలను సూచిస్తోంది. సాధారణంగా పీఎం10 ధూళి కణాలు 0 నుంచి 50 ఉండాల్సి ఉండగా, నగరంలోని కోకాపేట్ ప్రాంతంలో బుధవారం 232గా నమోదయ్యింది. పీఎం2.5 సోమాజిగూడలో 200గా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్మాణ రంగం వృద్ధిలో ఉన్న ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. పెద్ద సంఖ్యలో లారీలు మట్టి, ఇసుక, గ్రావెల్, సిమెంట్, ఇతరాలు తరలించే క్రమంలో కనీస నిబంధనలు పాటించడంలేదు. దీనిపై అటు జీహెచ్ఎంసీ, ఇటు కాలుష్య నియంత్రణ మండలి ఎవరూ పట్టించుకోవడం లేదు. చర్యలు అంతంతే.. వాయు కాలుష్యానికి కారణమవుతున్న వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో అడపదడప తనిఖీలు చేపట్టడం, నోటీసులిస్తున్నారు. అరుదైన సందర్భాల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం కొన్నాళ్లకు తిరిగి అదే పరిశ్రమ రీఓపెన్కు ఎన్ఓసీ జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అధికారుల తీరు పై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిచేయని పరికరాలు.. వాయు నాణ్యత కొలతల కోసం కాలుష్య నియంత్ర ణ మండలి ఏర్పాటు చేసిన పరికరాలు కొన్ని చోట్ల పనిచేయడం లేదు. బుధవారం నాచారం, ఐఐటీహెచ్ కంది ప్రాంతాల్లో గాలి నాణ్యత నివేదికలే అందుబాటులో లేవు. నగరం నడిబొడ్డున ఉన్న సన త్నగర్లో పీఎం 10 వివరాలు నమోదు చేయలేదు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు.. గాలిలో దూళికణాల సంఖ్య పెరిగినపుడు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకై టిస్, ఆస్తమా జబ్బుల ప్రభావం పెరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి ఎక్కువ ఇబ్బంది. చల్లని కాలం, ఆపై గాలిలో నాణ్యత తగ్గితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సైతం ఈ గాలి ప్రమాదమే. తొలుత జలుబు చేసి, అది న్యుమోనియాగా మారొచ్చు. ధూళి కణాలు కళ్లలో పడినా ఇబ్బందికరమే. మోటారు సైకిల్పై వెళ్లే సమయంలో కళ్లజోడు ధరించడం మంచిది. – ప్రొ.టి. ప్రమోద్ కుమార్, పల్మనాలజిస్టు ఇటీవల వర్షాలతో రోడ్లపై పేరుకుపోయిన ఇసుక, మట్టి కళ్లల్లోకి దుమ్ము, ఇసుక రేణువులు శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు -
ఎన్నికల ప్రవర్తన నియమావళి.. ‘జూబ్లీహిల్స్’ వరకే
షేక్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఆర్ఓ కార్యాలయం సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ప్రవర్తన నియమావళి)పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రవర్తన నియమావళికి లోబడే ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. నియమావళి ఉల్లంఘిస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రాపర్టీలపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఏర్పాటు చేయవద్దన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీ లపై ప్రచార ప్రకటనలు పెడితే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే తొలగించిన ప్రదేశాలలో అనుమతి లేకుండా మళ్లీ ప్రచార ప్రకటనలు పెడితే బాధ్యులపై కేసులతో పాటు వాటిని తొలగించేందుకయ్యే ఖర్చును కూడా బాధ్యుల పార్టీ ఖాతాల్లో వేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే .. ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని లేదా మెట్రోపాలిటన్ నగరాలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉంటే ఎన్నికల ప్రవర్తన నియామవళి కేవలం ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిందన్నారు. ఈ నిబంధనల ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర రాజధానితో పాటు మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నందున కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. షేక్పేట తహసీల్దార్ ఆఫీస్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వ రావు, రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, రాజకీయ పార్టీల తరఫున కె.నందేశ్ కుమార్ (బీఎస్పీ), కొల్లూరు పవన్ కుమార్, ఎల్.దీపక్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐఎం), పి.రాజేశ్ కుమార్, మహ్మద్ వాజీద్ హుస్సేన్, ఎ.రాఘవేందర్ (కాంగ్రెస్), ఎ. శ్రీనివాస్ గుప్తా, కె. మాధవ్, కిషోర్ గౌడ్ (బీఆర్ఎస్), ప్రశాంత్ రాజ్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఎంఐఎం) పాల్గొన్నారు. 13 నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో రాజకీయ ప్రచార ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ,జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. -
‘పోస్ట్’ చేసే ముందు ఒక్క క్షణం!
● మనోభావాలను దెబ్బతీయొద్దని హితవు ● తప్పుడు సమాచార ప్రచారం వద్దని హెచ్చరిక డిజిటల్ అవేర్నెస్ చేపడుతున్న కొత్త కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా డిజిటల్ అవేర్నెస్కు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి హ్యాష్ట్యాగ్ పాస్ బిషోర్ పోస్టు (పోస్టు చేసే ముందు ఒక్కక్షణం) అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన బుధవారం కీలక సందేశాన్ని పోస్టు చేశారు. సోషల్మీడియా ప్రతి ఒక్కరినీ శక్తిమంతుల్ని చేసిందని, సమాచారాన్ని పంచుకోవడానికి, ఎదుటి వారిని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ విషయాన్ని లేదా సమాచారాన్ని సెండ్ (పంపడం)... షేర్ చేయడానికి ముందు ఒక్క క్షణం ఆగి మూడు విషయాలను ఆలోచించాలని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ పోస్టు ఎవరినైనా బాధ పెడుతుందా..? ఇందులోని సమాచారం నిజమైనదేనా? సోషల్మీడియాలో ఓ వ్యక్తిని ఉద్దేశించి పెట్టే సమాచారం ఆయన ఎదురుగానూ వ్యాఖ్యానించగలవా? అనేవి సరి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా షేర్ చేసిన కొన్ని అంశాలు ఎదుటి వారి కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయనే విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ రెస్పాన్స్బుల్గా ఉండాలని, ఏదైనా షేర్ చేసేముందు కచ్చితంగా ఆలోచించాలని సజ్జనర్ స్పష్టం చేశారు. వారంలో 85 లక్షల వ్యూస్.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే సజ్జనర్ తన ఖాతాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. యువతకు సైతం దగ్గర కావాలనే ఉద్దేశంతో ‘ఎక్స్’తో పాటు ఇన్స్ట్రాగాంలోనూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. గతంలో హ్యాష్ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఓ ఉద్యమాన్నే నడిపి ప్రత్యేక చట్టం కావడానికి తన వంతు కృషి చేశారు. యువతను ఈయన సొంత ఇన్స్ట్రాగాం ఖాతాను గడిచిన వారం రోజుల్లో 85 లక్షల మంది వీక్షించారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ఫొటోకు ఇన్స్ట్రాగాంలో 12 లక్షలు, ‘ఎక్స్’లో 2 లక్షల వ్యూస్ వచ్చాయి. సజ్జనర్ ‘ఎక్స్’ ఖాతాకు వారం రోజుల్లో 15 లక్షల మంది రియాక్ట్ అయ్యారు. సోషల్మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని నగర పోలీసు అధికారిక హ్యాండిల్స్కు ట్యాగ్ చేస్తున్న ఆయన ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్ వద్ద ఓ విదేశీ మహిళను వేధించిన వీడియో ఇటీవల వైరల్గా మారింది. దీన్ని క్షేత్రస్థాయి అధికారులకు పంపిన సజ్జనర్ పూర్తి స్థాయి విచారణ చేయించి మూడేళ్ల క్రితం నాటిదిగా నిర్ధారించారు. -
కోడ్ కూసింది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్ నియోజక వర్గంలోని ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను బల్దియా సిబ్బంది తొలగిస్తున్నారు. బుధవారం రాజకీయ నేపథ్యమున్న విగ్రహాలను దుస్తులతో మూసివేశారు. ఆయా కూడళ్లలోని పార్టీ జెండాలను సైతం తొలగించారు. ఇప్పటికే బస్టాప్లలో ఉన్న ఫ్లెక్సీలను, బస్తీల్లో ఉన్న రాజకీయ నేతల ఫ్లెక్సీలను కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. మరో వైపు గోడలపై రాసిన రాతలను చెరిపేసేందుకు రంగులను తీసుకొచ్చి సిబ్బంది శ్రమిస్తున్నారు– ఫిలింనగర్ జూబ్లీహిల్స్లో.. -
నకిలీ గేమింగ్ యాప్తో మోసం
● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నకిలీ గేమింగ్ ఫ్లాట్ఫామ్లతో అమాయకులను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్ నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ శోభన్ కుమార్తో కలిసి సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ బుధవారం వివరాలు వెల్లడించారు. నవీన్కుమార్, సందీప్ కుమార్, పృథ్వీ రామరాజు, పవన్ వెంకట నాగభరద్వాజ్, రామాంజనేయులు ముఠాగా ఏర్పడి టెలిట్రాం, వాట్సాప్ గ్రూప్లలో డాడ్జ్ బుక్777 అనే నకిలీ గేమింగ్ ఫ్లాట్ఫామ్ను ఫ్లాట్ఫామ్లను నిర్వహించేవారు. బాధితులను నుంచే కాజేసే సొమ్మును నిర్వహించేందుకు అవసరమైన బ్యాంక్ ఖాతాల కోసం ఈ ముఠా నకిలీ పేర్లు, చిరునామా, ఆధార్ కార్డ్లతో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లలో 120కు పైగా బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. గేమింగ్ ఫ్లాట్ఫామ్లలో నకిలీ లాభాలను చూపించి, బాధితుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్మును వసూలు చేసేవారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వివిధ ఖాతాలలో ఉన్న రూ.14 లక్షల సొమ్ముతో పాటు రెండు ల్యాప్టాప్లు, 30 సెల్ఫోన్లు, చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్లు, సిమ్కార్డ్లను స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు మధ్యలో ఆగిన బస్సు
గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు నిలిచిపోవడంతో సీవీఆర్ న్యూస్ వైపు నుంచి వచ్చే వాహనాలతో పాటు జర్నలిస్టు కాలనీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్ నెం. 45 జంక్షన్లోని బారికేడ్లను తొలగించి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళే వాహనాలను ముందుకు పంపించారు. బస్సును టోయింగ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కదలకపోవడంతో మెకానిక్ను తీసుకొచ్చి బస్సుకు రిపేర్ చేయించి తరలించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ నర్సింగ్రావు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పంపించే వరకు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. -
పరిహారంతో పాటు ఇంటి స్థలం
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో టీజీఐఐసీకి భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, టీజీఐఐసీ అధికారుల సమక్షంలో బుధవారం భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని బాధితులు కోరారు. పరిహారం తీసుకున్న వారి జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్మినేడులో వెంచర్ ఏర్పాటు చేసి పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ టీం సభ్యుడు శ్రావన్, ఎల్మినేడు భూ కమిటీ నాయకులు శ్రీకాంత్రెడ్డి, మహేందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్లెండేల్ అకాడమీ విద్యార్థులకు సీఎం అభినందన
బండ్లగూడ: సింగపూర్లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే(జీఈడీ) 2025లో మిడిల్ స్కూల్ విభాగంలో సన్సిటీలోని గ్లెండేల్ అకాడమీ విద్యార్థులు బంగారు పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యార్థులను అభినందించి సన్మానించారు. గ్రీన్ గ్లెన్ గార్డియన్స్ బృందంలో ఆరాధ్య దుద్దిళ్ల శ్రీపాదరావు(6వ తరగతి), నిగమా పెన్మెట్సా(6వ తరగతి), సయ్యద్ అలిజా జైఆమా(6వ తరగతి), రాహిని సమ్హిత వర్మ దంతులూరి(7వ తరగతి), జేడెన్ డి రోజారియో(7వ తరగతి) ఉన్నారు. ఈ బృందం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 పాఠశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులతో పోటీపడ్డారు. ది గుడ్ ఫుడ్ మూవ్మెంట్ అనే తమ ప్రాజెక్టును కై జెన్ (నిరంతర అభివృద్ధి) అనే అంశం కింద ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారు సేంద్రియ వ్యవసాయం, స్ధిరమైన వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల కలిగి హానికర ప్రభావాలు, పర్యావరణపరమైన బాధ్యతాయుత పద్ధతుల అవసరం, పర్యావరణ అవగాహన పెంపు కోసం ప్రాక్టికల్ లెర్నింగ్ ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ... తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలతో స్థిరమైన అభివృద్ధి పట్ల కట్టుబాటుతో తెలంగాణను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ విద్యార్థులు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ మిను సలూజా తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్పై ఫిర్యాదు
పహాడీషరీఫ్: ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఖాజా పాషా కోరారు. ఈ మేరకు బుధవారం పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కలిసి మెలసి ఉంటున్న ప్రజల నడుమ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాజాసింగ్ యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఎన్నో మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ను కలిసిన వారిలో పార్టీ నాయకులు అబ్దుల్ ఖదీర్, మహ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
మహా అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్థమైంది. హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు పెరిగిన దృష్ట్యా అందుకనుగుణంగా కార్యకలాపాల నిర్వహణ కోసం జోనల్ వ్యవస్థను విస్తరించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీఏ సేవలను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో సంస్థాగతమైన పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టారు. ఈమేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీ నియామకం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించారు. హెచ్ఎండీఏ పరిధిని 7,257 చ.కి.మీ. నుంచి 10,526 చ.కి.మీ. వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలు హెచ్ఎండీఏలో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రణాళికాబద్ధమైన మహానగరం నిర్మాణం, అభివృద్ధి దృష్ట్యా కార్యకలాపాలను వికేంద్రీకరించనున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి–1, శంకర్పల్లి–2, మేడ్చల్–1, మేడ్చల్–2 జోన్ల పరిధిలో హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగం సేవలను అందజేస్తోంది. కొత్తగా పెరిగిన పరిధిని దృష్టిలో ఉంచుకొని మరో నాలుగు జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కూడా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకనుగుణంగా అధ్యయనం చేసి నివేదికను అందజేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. లక్ష్యాలు ఇలా.. ● అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్ఎండీఏను సంస్థాగతంగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ● జోనల్ వ్యవస్థలను విస్తరించడంతో పాటు జోనల్స్థాయి కమిషనర్లను కూడా నియమించనున్నారు. తద్వారా అన్ని రకాల నిర్మాణరంగ అనుమతులు, లే అవుట్లు జోనల్ స్థాయిలోనే అందజేస్తారు. దీంతో మెట్రోపాలిటన్ కమిషనర్ వ్యూహాత్మక ప్రణాళిక, విధాన రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుంది. ● హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. మహానగర అభివృద్ధే ధ్యేయం.. పునర్వ్యవస్థీకరణ, జోనల్ స్థాయిలో సేవల వికేంద్రీకరణ ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ గ్రీన్ఫీల్డ్ రోడ్లు,ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధివంటి ప్రధానమైన కార్యకలాపాలపై కమిషనర్ దృష్టి కేంద్రీకరించనున్నారు. మరోవైపు సమర్థ ల్యాండ్పూలింగ్ పథకాన్ని అమలు చేయడంతో పాటు, ఏకీకృత బిల్డింగ్, డెవలప్మెంట్ కోడ్ను రూపొందించడం, మాస్టర్ప్లాన్–2050 రూపకల్పన, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వంటి లక్ష్యాల దిశగా కార్యాచరణ చేపట్టనున్నారు. హెచ్ఎండీఏ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం ట్రిపుల్ ఆర్ వరకు జోనల్ వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కన్సల్టెన్సీ సాంకేతిక, ఆర్థిక బిడ్లపై దరఖాస్తులకు ఆహ్వానం కన్సల్టెంట్ల ఎంపిక ఇలా.. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించారు. కన్సల్టెంట్ ఎంపిక క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసీబీఎస్) పద్ధతిలో 80:20 నిష్పత్తిలో జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్పీలో పేర్కొన్న అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అర్హత సాధించిన బిడ్డర్ల ఫైనాన్షియల్ బిడ్లను మాత్రమే తెరిచి తుది ఎంపిక చేపడతారు. -
‘సోషల్’ వార్.. పొలిటికల్ పోరు!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లను పెయిడ్ చానెళ్లుగా మార్చిన పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వైరి పార్టీపె విమర్శలు, ప్రతివిమర్శల్ని మరింత ముమ్మరం చేయనున్నాయి. ఓవైపు తమ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థి పార్టీ లోపాల్ని అంతకంటే వేగంగా ఎండగడుతున్నాయి. వాయువేగంతో అవి వాట్సప్ గ్రూపు ల్లోనూ షేర్ అవుతుండటంతో ఏ కామెంట్ ఎప్పుడు వైరల్గా మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ప్రకటించింది. కాంగ్రెస్లో అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. నామినేషన్ల దాఖలుకు కూడా ఇంకా సమయముంది. ఇంతెందుకు ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే.. ఇప్పటికే కొంతకాలంగా బీఆర్ఎస్, కాంగెరస్ ఒకదానిపై మరొకటి సోషల్మీడియా వేదికగా తీవ్ర యుద్ధమే చేస్తున్నాయి. తమ పార్టీల పేరిట, పార్టీ సైన్యాల పేరిట ప్రత్యర్థులపై ఇవి విసురుతున్న విమర్శనాస్త్రాలు ప్రజల అరచేతిలోని మొబైల్కు తీరిక లేకుండా చేస్తున్నాయి. ఎవరి సత్తా వారిదే.. అధికార పార్టీ కాంగ్రెస్ తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తదితరాల అప్డేట్స్ను చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలు, నిర్వాకాలు అంటూ రూపొందించిన దృశ్యాల్ని ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటినుంచో బలంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను తూర్పారబడుతోంది. ‘అప్పుడెట్లుండె పాలన.. ఎప్పుడేమైంది? అంటూ ప్రజల్లో కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. అంతేకాదు.. ప్రజాభిప్రాయాల పేరిట అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండూ వేటికవిగా తమ అనుకూల చానెళ్ల ద్వారా తమ పార్టీకే ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. సొంతంగా వాట్సప్ చానెళ్లనూ నిర్వహిస్తున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు, పెయిడ్ క్యాంపెయిన్లు, కంటెంట్ క్రియేషన్, రాజకీయ వ్యూహాల్లో ప్రధాన భాగమయ్యాయి. రీల్స్తో రిప్లయ్లు.. వీడియోలతో ప్రచారం, రీల్స్తో రిప్లయ్లు, ట్రెండ్గా మారాయి. ఇక ఆ పార్టీల సోషల్మీడియా టీమ్స్, వారియర్స్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఇదంతా రూ.కోట్ల మేర ప్రచారమని సంబంధిత రంగం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో సగటు ఓటర్లు సైతం సోషల్మీడియాకు ప్రభావితమవుతున్నారు. ఏ పార్టీ ప్రచారం విస్తృతంగా ఉంటే దాని వలలో పడే పరిస్థితి ఏర్పడింది. పార్టీలకు సైతం గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కంటే సోషల్ మీడియా కామెంట్ సెక్షన్, ఫీడ్బ్యాక్, లైక్స్, కీలకంగా మారాయి. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్ రాజకీయాలు హ్యాష్ట్యాగ్స్తో జరుగుతున్నాయి. ఓటర్లు స్క్రోల్స్, థంబ్నెయిల్స్తో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి పార్టీల తొందర నామినేషన్లు ప్రారంభం కాకున్నా,అభ్యర్థులెవరో తెలియకున్నా.. క్షేత్రస్థాయి కంటే సోషల్ మీడియాలో ముమ్మరం రాజకీయ వ్యూహంలో రీల్స్, పెయిడ్ క్యాంపెయిన్లు దూసుకుపోతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ -
సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే...
ఇక కఠిన చర్యలు తప్పవు సాక్షి, సిటీబ్యూరో: సెల్ఫోన్ డ్రైవింగ్ కారణంగా 2023లో 23 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... ముగ్గురు అసువులు బాశారు. మరో 26 మంది క్షతగాత్రులయ్యారు. ఒకప్పుడు కేవలం సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపే డ్రైవర్లు మాత్రమే రోడ్లపై కనిపించే వాళ్లు. అయితే ప్రసుత్తం మారిన పరిస్థితుల నేపథ్యంలో సెల్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్యా పెరిగింది. ఈ విషయాన్ని గమనించిన నగర కొత్వాల్ సజ్జనర్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూసే, ఇయర్ ఫోన్లు వినియోగించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులకు స్పష్టం చేశారు. తప్పనిసరిగా మారిపోయిన సెల్ఫోన్... మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్ వినియోగించడం తీవ్రమైన ఉల్లంఘన. ఒకప్పుడు ఈ ఉల్లంఘనలను గుర్తించడం, బాధ్యుతలపై చర్యలు తీసుకోవడం ట్రాఫిక్ పోలీసులకు తేలిగ్గా సాధ్యమయ్యేది. అయితే ఇటీవల కాలంలో యాప్ ఆధారంగా నడిచే బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, గిగ్ వర్కర్లు వచ్చిన తరవాత పరిస్థితులు మారిపోయాయి. వీరి కార్యకలాపాలకు సంబంధించి బుకింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు, పికప్ దగ్గర నుంచి డ్రాపింగ్ వరకు అంతా యాప్ ఆధారంగానే సాగుతుంది. దీంతో ఈ రంగంలో ఉన్న ప్రతి డ్రైవర్ సెల్ఫోన్ను చూడటం, మాట్లాడటం అనివార్యంగా మారిపోయింది. దూరప్రాంతాల సర్వీసుల్లో వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లు సైతం తమ ప్రయాణికులతో సంప్రదింపులు జరపడానికి సెల్ఫోన్ వినియోగించాల్సి వస్తోంది. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సైతం చాలా సందర్బాల్లో సెల్ఫోన్ డ్రైవింగ్ను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ‘ఇయర్’తో ఇంకో సమస్య వస్తోంది... నగర వ్యాప్తంగా ఇయర్ ఫోన్ డ్రైవింగ్ సైతం సాధారణ అంశంగా మారిపోయింది. ప్రధానంగా యువతే ఈ రకంగా వాహనాలు నడుపుతున్నారు. ఇయర్ ఫోన్లు, బ్లూటూత్, బడ్స్, పోర్డ్స్ చెవిలో పెట్టుకుని ముందుకుసాగుతుంటారు. బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, గిగ్ వర్కర్లు కూడా ఇది తప్పనిసరిగా మారిపోయింది. సెల్ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇలాంటి ఇయర్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చార్జ్షీట్లు సైతం దాఖలు చేసినా... ఒకప్పుడు సెల్ఫోన్ డ్రైవింగ్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన వారికి ట్రాఫిక్ పోలీసుల కేవలం జరిమానా మాత్రమే విధించే వారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా పరిగణించేవి, వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ముప్పు తీసుకువచ్చేవి. సెల్/ఇయర్ ఫోన్ డ్రైవింగ్కు ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కేటగిరీలోకి చేర్చారు. ఈ ఉల్లంఘనులకు కేవలం జరిమానా విధించడం కాకుండా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని 2018లో నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ కంటే ప్రమాదకరమైంది కావడంతో తొలిదశలో ఇయర్ ఫోన్ డ్రైవింగ్పై దృష్టి పెట్టారు. కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేయడానికి అనువుగా దీనికంటూ ఎంవీ యాక్ట్లో ప్రత్యేక సెక్షన్ లేదు. దీంతో ప్రమాదకరంగా వాహనం నడపటం (సెక్షన్ 184) కింద అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో ఆ విధానం అటకెక్కడంతో మళ్లీ జరిమానాలకే పరిమితం అయ్యారు. సిటీలో సెల్ఫోన్ డ్రైవింగ్ కేసులు ఇలా.. ఏడాది నమోదైన కేసులు 2014 13,008 2015 27,333 2023 58,056 2024 78,108 ‘బ్లూటూత్’ను ఎలా గుర్తిస్తారో? అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు ‘ఇయర్ ఫోన్’ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వీరి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం చార్జ్షీట్ దాఖలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆరుగురిని రెండు రోజుల చొప్పున జైలు శిక్ష కూడా విధించింది. ద్విచక్ర వాహన చోదకుడు ఇయర్ఫోన్/సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే గుర్తించడం తేలికే. వీరితో పాటు కార్లలో వెళ్తున్న వారు బ్లూటూత్స్, బర్డ్స్ వాడుతున్న వారిని పట్టుకోవడం ఎలా అన్నదే ప్రధాన సమస్య. మరోపక్క బైక్ ట్యాక్సీలు, క్యాబ్లు, ఆటోలు, గిగ్ వర్కర్లకు ఈ సెల్ఫోన్ అనివార్యమైన సాధనంగా మారిపోయింది. ఇలాంటి వాళ్లు ఆ ఫోన్ను తమ వృత్తికోసమే వాడుతున్నారా? వీడియోలు చూస్తున్నారా? అనేది గుర్తించడం కష్టసాధ్యం. ఇటీవల కాలంలో కార్లలో బ్లూటూత్స్ వినియోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా పట్టుకుంటారు? ఇలాంటి వాహనాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున మ్యూజిక్ వినే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది కీలకంగా మారింది. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఈ–వీల్చైర్
శంషాబాద్: శారీరక ఇబ్బందులతో నడవలేని ప్రయాణికుల కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ–(ఎలక్ట్రానిక్) వీల్చైర్ను మంగళవారం నుంచి ఎయిర్పోర్టు నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రెస్టో ఎయిర్సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ–వీల్చైర్లు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిపార్చుర్ ఫోర్కోర్ట్ నుంచి ఎస్హెచ్ఏ వద్ద నున్న డీఎఫ్ఎండీ పాయింట్ వరకు వీటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. తనిఖీల అనంతరం అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులకు వీటి సేవలు అందుబాటులో ఉంటాయని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. -
హీటెక్కిన జూబ్లీహిల్స్
ఉప ఎన్నికల నేపథ్యంలో గరం.. గరం ● ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ● అంతర్గత కుమ్ములాటలతో సతమతం ● తుది దశకు చేరుకున్న అభ్యర్థుల ఎంపికసాక్షి, సిటీబ్యూరో: ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ హీటెక్కింది. ఈ నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. మరోవైపు సొంత పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు కేడర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకరి బలహీనతలను మరొకరు బయట పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రధాన పక్షాలు రంగంలోకి దిగి ఒకరి వైఫల్యాలను మరొకరు ఎండగడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు పడరాని పాట్లు పాడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా? అన్న విధంగా పోరు కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కాగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ చేతిలో బీసీ కార్డు.. అధికార కాంగ్రెస్ ఉప ఎన్నికలో బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీసీ అభ్యర్థినే బరిలోకి దింపుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమా ర్ గౌడ్ ప్రకటించారు. మరోవైపు అధిష్టానానికి పంపిన షార్ట్ లిస్ట్లో ముగ్గురు బీసీలు, ఒకరు ఓసీ ఉన్నారు. బీసీ అభ్యర్థిత్వం ప్రాధాన్య క్రమంలో ఓసీ అభ్యర్థి బరి నుంచి తప్పించినట్లయింది. ము గ్గురు బీసీల్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాత్రం తాను టికెట్ రేసులో లేనంటూనే.. అధి ష్టానం నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రచార దూకుడు.. అభ్యర్థి ఎంపికలో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రచారానికి దిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకొని రంగంలోకి దిగారు. అధికార కాంగ్రెస్పై వ్యతిరేకత. మాగంటి గోపీనాథ్ సేవలు, మహిళా సానుభూతి పవనాలు గెట్టేక్కిస్తాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో చేజారకుండా ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంది. బలోపేతానికి బీజేపీ కసరత్తు.. భారతీయ జనతాపార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండడంతో ఆ పార్టీకి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ.. రాష్ట్రంలో పెరిగిన బలంతో ఈసారి కాంగ్రెస్సే తమకు పోటీ అని భావిస్తోంది. ఇప్పటికే కమలనాథులు రంగంలోకి దిగి సుడిగాలిలా పర్యటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆర్.రామకృష్ణ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరా రు కోసం ఆ పార్టీ అభిప్రాయ సేకరణ చేస్తోంది. -
యాక్ట్..బిగ్ బాస్కెట్!
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్..నిత్యావసరాల డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్ పేర్లు చెప్పి సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేశారు. మొత్తం రూ.3.06 లక్షలు కోల్పోయిన బాధితులు సోమ, మంగళవారాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బహదూర్పురకు చెందిన యువకుడు (30) ఈ నెల ఒకటిన వైఫై సేవల కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. అందులో యాక్ట్ ఫైబర్ కస్టమర్ కేర్ పేరుతో కనిపించిన నెంబర్కు ఫోన్ చేశాడు. దీన్ని అందుకున్న వ్యక్తి మరో నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేయమని చెప్పారు. యువకుడు ఫోన్ చేయడానికి ముందే ఆ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. యాక్ట్ ఫైబర్ ప్రతినిధిగా మాట్లాడిన అవతలి వ్యక్తి వైఫై రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ పే ద్వారా రూ.2 చెల్లించాలని కోరాడు. ఆపై రిజిస్ట్రేషన్ను ఖరారు చేయడానికి 90500, 8500 కోడ్స్ టైప్ చేయాలని సూచించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు అలానే చేయగా..గూగుల్ పే ద్వారా అతడి ఖాతా నుంచి రూ.90,500, రూ.8,500 సైబర్ నేరగాడి ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీనిపై ఫోన్ ద్వారా బాధితుడు అవతలి వ్యక్తిని ప్రశ్నించాడు. అది పొరపాటున జరిగి ఉంటుందని, 24 గంటల్లో రీఫండ్ కావడానికి పేస్యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. బాధితుడు అలా చేయగానే..దాని ద్వారా సైబర్ నేరగాడు మరో రూ.10 వేలు స్వాహా చేశాడు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయించి, సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా... యూసుఫ్గూడకు చెందిన మరో వ్యక్తికి (36) గత నెల 30న ఓ వెబ్సైట్లో అతి తక్కవ ధరలకు నిత్యావసరాల సరఫరా పేరుతో ఉన్న ప్రకటన చూశాడు. దాని ద్వారా తనకు అవసరమైన కొన్ని సరుకులు ఆర్డర్ చేశాడు. ఈ నెల 2న బాధితుడికి ఓ ఫోన్కాల్ వచ్చింది. నిత్యావసరాల సరఫరా సంస్థ బిగ్ బాస్కెట్ కస్టమర్ కేర్ ప్రతినిధిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆర్డర్ చేసిన వస్తువులు పంపడానికి నగదు చెల్లించాలని సూచించాడు. దీనికోసం ఏపీకే ఫైల్ను వాట్సాప్ ద్వారా పంపి క్లిక్ చేయమని కోరారు. బాధితుడు అలా చేయడంతో ఆ ఫైల్ అతడి ఫోనులో నిక్షిప్తమై, దాని యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతికి వెళ్లిపోయింది. ఆపై బాధితుడు నిత్యావసరాల నిమిత్తం చెల్లించాల్సిన రూ.360 ఆన్లైన్లో పే చేశాడు. ఫోన్ యాక్సస్ మొత్తం సైబర్ నేరగాడి చేతిలో ఉండటంతో ఈ ఓటీపీలు, పిన్ నెంబర్లు అతడు సంగ్రహించగలిగాడు. ఆ వివరాలను వినియోగించుకున్న సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి రూ.1.97 లక్షల కాజేశాడు. ఈ రెండు ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.ఈ పేర్లతో ఇరువురిని మోసం చేసిన నేరగాళ్లు ఇద్దరు బాధితుల నుంచి రూ.3.06 లక్షలు స్వాహా సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా కేసులు నమోదు -
జిల్లా ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు: ఆర్వీ కర్ణన్
లక్డీకాపూల్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఫిర్యాదుల కమిటీనీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లా పరిధిలో ప్రయాణం చేసే పౌరులు పరిమిత మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలని ఆయన సూచించారు. నగరంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు (ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు (ఎస్ఎస్టీ) నిరంతరం తనిఖీలు చేపడుతూ.., అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకుంటాయన్నారు. సరైన ఆధారాలు చూపకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నగదు జప్తుకు సంబంధించి జిల్లా ఫిర్యాదుల కమిటీకి తగిన ఆధారాలు పౌరులు చూపితే ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించి జప్తు చేసిన నగదును తిరిగి అందజేస్తామన్నారు. జిల్లా ఫిర్యాదుల కమిటీ సభ్యులు, వారి మొబైల్ నంబర్లు ఇలా ఉన్నాయి.. కేఏ మంగతాయారు, అదనపు కమిషనర్ (ఎస్టేట్స్), జీహెచ్ఎంసీ, 91776 08271, (కమిటీ చైర్ పర్సన్), ఎస్.వెంకటేశ్వర్రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఎన్నికల వ్యయం పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్ 91212 40116, (కమిటీ కన్వీనర్), వసుంధర, డిప్యూటీ డైరెక్టర్, డీటీఓ, 98490 44893, (సభ్యురాలు). జిల్లా ఫిర్యాదుల కమిటీ కార్యాల యం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం (3వ అంతస్తు, ట్యాంక్ బండ్)లోని అదనపు కమిషనర్ (ఎస్టేట్స్) చాంబర్లో ఉంటుందని, ఫిర్యాదుదారులు, పౌరులు ఈ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆర్వీ కర్ణన్ సూచించారు. -
మెట్రో కిటకిట
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రాకపోకలతో సోమవారం నగరంలోని పలు మెట్రోస్టేషన్లు, మెట్రోరైళ్లు కిటకిటలాడాయి. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు నగరానికి తిరిగి చేరుకోవడంతో వివిధ ప్రాంతాల్లో మెట్రోస్టేషన్లలో రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి పలు ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్నవాళ్లు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో ఎల్బీనగర్ మెట్రో వద్ద ఉదయం నుంచి ఇంచుమించు మధ్యాహ్నం వరకు ప్రయాణికుల సందడి నెలకొంది. అలాగే నగరంలోని ప్రధాన మెట్రో స్టేషన్లైన నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, అమీర్పేట్, రాయదుర్గం, లక్డీకాపూల్, ఖైరతాబాద్, కూకట్పల్లి, మియాపూర్ తదితర స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు దసరా అనంతరం శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా నగరవాసులు సొంత ఊళ్ల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. తిరుగుప్రయాణం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్ మేరకు అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కేంద్రాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సివచ్చిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న రైళ్లతో సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్లలో సందడి కనిపించింది. సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ, వరంగల్, కరీంనగర్, తదితర ప్రధాన రహదారుల్లోని శివారు ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా వాహనాలు స్తంభించాయి. -
అక్రమ లేఔట్లు... రహదారుల ఆక్రమణలు!
సాక్షి, సిటీబ్యూరో: అనుమతి లేని లేఔట్లతో పాటు ఆక్రమణలకు గురవుతున్న రహదారులపై పలువురు హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా 41 ఫిర్యాదులు అందాయి. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్రిచ్ ప్రాంతంలోని సర్వే నం.83లో ఉన్న వరకుంట చెరువు కబ్జాల నిరోధించాలని, నిజాంపేట సర్వే నం.233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. మాజీ సైనికోద్యోగికి జవహార్నగర్లో ప్రభత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేరని ఆయన కుమారుడి ద్వారా ఫిర్యాదు అందింది. అయ్యప్ప సొసైటీలో 28వ ప్రధాన రహదారి 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సి ఉండగా ఆక్రమణలకు గురైందని, అక్కడి డబ్బాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో ఖాళీ చేయించినా మళ్లీ డబ్బాలు పెట్టారని, వీటిని తీయమంటే రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బౌరంపేటలోని సర్వే నం. 166/3లోని ప్రభుత్వ భూమిలో ఎగువన ఉన్న వెంచర్ల కోసం రహదారి నిర్మిస్తున్నారని ఫిర్యాదు అందింది. హయత్నగర్ మండలంలోని ఆదిత్యనగర్–బాలాజీ నగర్ మధ్య రెండు లింకు రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, పార్కు స్థలం కూడా కబ్జా అయిందని ఆదిత్యనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైడ్రాను కోరింది. మేడిపల్లి మండలం సాయిప్రియానగర్లో 2500 ప్లాట్లతో లే ఔట్ వేశారు. ఇందులో 2 వేల గజాల్లో ఉండాల్సిన పార్కును కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.హైడ్రాను అభినందించిన హైకోర్టు...హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పని తీరును హైకోర్టు అభినందించిందని అధికారులు సోమవారం ప్రకటించారు. తమ విభాగం చెరువుల అభివృద్ధిని యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చినట్లు పేర్కొన్నారు. బతుకమ్మకుంటను అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం వ్యాఖ్యానించినట్లు ప్రకటించింది. బతుకమ్మకుంట ఆ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచిందని, గచ్చిబౌలిలోని మల్కం చెరువును చూసినా ఆహ్లాదంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు హైడ్రా పేర్కొంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇంటి స్థలాలు, భూములు ఉంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకురావాలని హైకోర్టు అభిప్రాయపడినట్లు తెలిపారు. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణ సందర్భంలో ఇది చోటు చేసుకుందని హైడ్రా తెలిపింది. -
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై నకిలీ దందా!
సాక్షి, సిటీబ్యూరో: వాహనాల హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)లపై నకిలీ వెబ్సైట్లు దందా కొనసాగిస్తున్నాయి. కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు పాతవాహనాలకు సైతం హెచ్ఎస్ఆర్పీని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ మేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చర్ (ఎస్ఐఏఎం–సయామ్) అనే సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్ల ఏర్పాటు పైన 15 రాష్ట్రాల్లో ఈ సయామ్ సంస్థ సేవలందజేస్తోంది. వాహనదారులు సయామ్ వెబ్సైట్లో హెచ్ఎస్ఆర్పీ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం నిర్ణీత గడువు మేరకు కొత్త నెంబర్ప్లేట్లను అందజేస్తారు. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రం షోరూమ్లలోనే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఏపీ తదితర రాష్ట్రాల్లో సయామ్ ద్వారా పెండింగ్ వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను అందజేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం మాత్రం హెచ్ఎస్ఆర్పీపైన ఇప్పటి వరకు ఎలాంటి తుదిగడువును విధించలేదు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు ‘సయామ్’ పేరిట నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఇటీవల వాహనదారులకు పెద్ద ఎత్తున నోటీసులు అందజేశారు. హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపైన భారీ ఎత్తున జరిమానా విధించనున్నట్లు ‘ఆర్టీఏ చలాన్ల’ పేరిట వాహనదారులకు నోటీసులు ఇచ్చి గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో రవాణాశాఖ అప్రమత్తమైంది.హెచ్ఎస్ఆర్పీ కోసం తాము ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదని పేర్కొంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఈ గందరగోళంకొనసాగుతూనే ఉంది. ‘సయామ్’ వెబ్సైట్ను పోలిన విధంగా ఒకటి, రెండు అక్షరాలను మార్చి మాయాజాలం సృష్టిస్తున్నారని, అలాంటి వెబ్సైట్ల నుంచి వచ్చే మెసేజ్లను చూసి మోసపోవద్దని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.గ్రేటర్లో 45 లక్షలకు పైగా పెండింగ్...వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు హెచ్ఎస్ఆర్పీని తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2013లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ఈ పథకం ఏళ్లకు ఏళ్లుగా నత్తనడకన సాగుతుంది. తెలంగాణలో సుమారు 65 లక్షలకు పైగా వాహనాలు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. వాటిలో 45 లక్షల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. 2019 వరకు నమోదైన అన్ని వాహనాలకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హెచ్ఎస్ఆర్పీని అమర్చాలని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కానీ నగరంలో మాత్రం ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని, దీంతో తాము ఇప్పటి వరకు ఎలాంటి తుది గడువును విధించలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. మొదట్లో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఏర్పాటు చేసుకోవాలంటూ వెలువడిన ఒక ఉత్తర్వు వాహనదారులను గందరగోళానికి గురిచేసింది. దీంతో చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ‘సయామ్’ ద్వారా ఈ పథకం అమలు జరుగుతున్న క్రమాన్ని అవకాశంగా తీసుకొని నకిలీవెబ్సైట్లు రంగంలోకి దిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఇప్పటికీ తప్పనిసరి కాదు...‘హెచ్ఎస్ఆర్పీపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి గడువు విధించలేదు. భవిష్యత్తులో గడువు విధించే వరకు హెచ్ఎస్ఆర్పీ కోసం ఎలాంటి వెబ్సైట్లను ఆశ్రయించవలసిన అవసరం లేదు. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే స్పష్టమైన విధివిధానాలను విడుదల చేస్తాం. అప్పటి వరకు వాహనదారులు ఎలాంటి గందరగోళానికి, ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు’. అని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.నాణ్యతపై సందేహాలు....హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లలో నాణ్యత లేకపోవడం వల్ల కూడా వాహనదారులు విముఖత చూపుతున్నారు.తెలుపురంగు ప్లేట్లపై నెంబర్లను ఎంబోజింగ్ చేసి నలుపురంగు పెయింట్ వేస్తారు.కానీ ఈ రంగు ఎక్కువ కాలం ఉండడం లేదు.ప్లేట్లు కూడా నాసిరకంగా ఉండి తొందరగా దెబ్బతింటున్నాయి. సొట్టలు పడుతున్నాయి. విరిగి ముక్కలవుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా మరో కారణం.రూ.లక్షల ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసి ఇలాంటి నాసిరకం ప్లేట్లు అమర్చుకునేందుకు అయిష్టత చూపుతున్నారు.కానీ 2019 నాటికి నమోదైన అన్ని వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ తప్పనిసరి అన్న సుప్రీంకోర్టు ఆదేశాల దృష్ట్యా కదలిక వచ్చింది. -
నగరా మోగింది!
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ కానుండగా, నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించిన వివరాల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్తో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అది వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నప్పటికీ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మాత్రం ఎన్నికల కోడ్ వర్తించదు. –సాక్షి, సిటీబ్యూరోనోటిఫికేషన్: 13 అక్టోబర్ (సోమవారం)నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి దాదాపు 980 మంది ఓటర్లుంటారునియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరున్నదీ, లేనిదీ ఈఆర్ఓ కార్యాలయంలోకానీ, బూత్లెవెల్ అధికారి వద్ద కానీ, ఓటర్ హెల్ప్లైన్ యాప్లోకానీ, సంబంధిత వెబ్సైట్లలో కానీ పరిశీలించుకోవాల్సిందిగా కర్ణన్ సూచించారు.జాబితాపై ఏవైనా అభ్యంతరాలున్నా, జాబితాలో పేరు లేకున్నా నామినేషన్ల చివరి రోజుకు పదిరోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం కోసం 1950 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు.ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వం గుర్తించిన, ఫొటో కలిగిన 12 రకాల ఐడీల్లో ఏదైనా ఒకదాన్ని వినియోగించుకోవచ్చునన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బందినోడల్ ఆఫీసర్లు: 19 మందిసెక్టార్ ఆఫీసర్లు: 38 సెక్టార్లకు 55 మంది నియామకంతోపాటు రిజర్వులో కొందరిని ఉంచారు.రిజర్వుతోసహ మొత్తం పోలింగ్ సిబ్బంది: 2,400వీరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు: 600 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 600 మంది, ఇతర సిబ్బంది 1200 మంది.ఈవీఎంలు, వీవీప్యాట్లుకంట్రోల్ యూనిట్లు: 826, బ్యాలెట్ యూనిట్లు: 1494, వీవీప్యాట్లు: 837.రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇప్పటికే మొదటిదశ తనిఖీ పూర్తయిందన్నారు.ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)షెడ్యూలు జారీతోనే ఎన్నికలప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ప్లాన్ రెడీ అయిందని పేర్కొన్నారు.ఎన్ఫోర్స్మెంట్ కోసం 9 ఫ్లై యింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాల కనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు. ఫిర్యాదులకోసం కాంటాక్ట్ నెంబర్ 1950 , కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తాయన్నారు. సీజ్ చేసిన నగదు పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఇంకా..శారీరక వికలాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వారికి వీల్చైర్ సదుపాయం, వాలంటీర్ల ద్వారా ఇళ్లనుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి, తిరిగి ఇళ్లవద్ద దింపే సదుపాయం.పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వార్తాపత్రికలు, టీవీల్లో మూడు పర్యాయాలు ప్రకటించాలి.రాజకీయ పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాల్ని 48 గంటల్లో వెబ్సైట్, సోషల్మీడియా,పత్రికలు, టీవీల ద్వారా వెల్లడించాలి. ‘నో యువర్ క్యాండిడేట్స్’ యాప్ ద్వారా కూడా ప్రజలు అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చు.మీడియా ఫేక్న్యూస్ ప్రచారం చేయొద్దు. సంబంధిత అధికారుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. వదంతుల్ని ప్రచారం చేయవద్దు.ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్లుజిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వ్యవహరిస్తుండగా, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్గా సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ బాధ్యతలు నిర్వహిస్తారు. నామినేషన్లను ఆర్డీవో కార్యాలయంలో స్వీకరిస్తారు. జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈఆర్ఓగా వ్యవహరిస్తారు. జాయింట్ పోలీస్ కమిషనర్ నోడల్ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరగనుంది.ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీ సజ్జనర్ తెలిపారు. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు డిపాజిట్ చేయాలని సూచించారు.407 పోలింగ్ కేంద్రాలు139 భవనాల్లోని 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్లు, టాయ్లెట్స్, తాగునీరు, లైటింగ్, పోలింగ్ కేంద్రమని సూచించే బోర్డులు, వీల్చైర్లు, తదితర సదుపాయాలుంటాయన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఆయా పార్టీల నుంచి బూత్లెవెల్ ఏజెంట్లున్నారన్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి 219 మంది, కాంగ్రెస్ నుంచి 132 మంది ఉన్నారని, ఇతర పార్టీలవి పెండింగ్లో ఉన్నాయన్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి 407 మంది బీఎల్ఓలు, 38 మంది సూపర్వైజర్లను నియమించినట్లుపేర్కొన్నారు.21,003 ఎపిక్ కార్డులు జనరేట్ కాగా, 8,491 కార్డుల ముద్రణ పూర్తయిందని, మిగతావి ఆయా దశల్లో ఉన్నాయన్నారు. 8,491 కార్డుల్ని పోస్టు ద్వారా పంపిణీ చేసినట్లు కర్ణన్ తెలిపారు. -
‘హైడ్రా’మా నేనా?
సాక్షి, సిటీబ్యూరో: సెప్టెంబర్ 21: గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల స్థలం ప్రభుత్వానిదని ప్రకటించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీకి ఆధీనంలో ఉన్న 11 ఎకరాల చుట్టూ ఉన్న షీట్లను తొలగించి ఫెన్సింగ్ వేసింది.సెప్టెంబర్ 23:ఆ స్థలం తనదేనని, పట్టా భూమి కొనుగోలు చేశానని ప్రకటించిన ఆరికపూడి గాంధీ హైడ్రా అక్కడ వేసిన ఫెన్సింగ్ తొలగించారు. దాని స్థానంలో గతంలో మాదిరిగానే బ్లూషీట్లు ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అక్టోబర్ 1:ఆరికపూడి గాంధీ చెరలో ఉన్న ప్రభుత్వం భూమినీ పరిరక్షించాలంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా సహా వివిధ విభాగాలకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ స్థలం తనదేనని, ఆరోపణలు చేస్తే కోర్టు కీడుస్తానంటూ గాంధీ ప్రకటించారు. హైడ్రా మాత్రం ఈ భూమి విషయంలో మిన్నకుండిపోయింది.పక్షం రోజులు సాగిన ఈ ఎపిసోడ్లో నష్టపోయింది మాత్రం 260 నిరుపేద కుటుంబాలే. గాజులరామారంలోని సర్వే నెం.307లో ఉన్న ప్రభుత్వ భూమిలోని వెంచర్లు, లే ఔట్లకు సంబంధించిన ఈ నిర్మాణాలను హైడ్రా గత నెల 21న తొలగించింది. ప్రగతినగర్ వైపు కబ్జా చేసిన వారిలో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల యజమానులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సర్వే నెంబర్లో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు నాటి సర్కారు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ ఆస్తుల పంపకాల్లో జాప్యం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయంపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఆరు నెలల పాటు సాగిన విచారణలో భాగంగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో ఐదారుసార్లు సమావేశమై అనేక విషయాలు గుర్తించింది.బాధ్యులపై చర్యలేవి?ఈ భూమిలో ప్రగతినగర్ వైపు బడాబాబులు వెంచర్లు, లే ఔట్లు వేశారని, సర్వే నంబర్లు 329/1, 342ల్లో ఉన్న భూమిని 60 గజాలు, 120 గజాల చొప్పున ప్లాట్లు వేసిన రౌడీషీటర్లు, స్థానిక నేతలు పేదలకు విక్రయించారు. జగద్గిరిగుట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీటర్గా ఉన్న షేక్ అబిద్... లక్ష్మి మురళి హుస్సేన్ పేరుతో ఈ విక్రయాలు జరిపారు. బోడాసు శ్రీనివాస్ (డాన్ శీను), ఏసుబాబు, సయ్యద్ గౌస్ బాబు, మనీష్, దేవా తదితరులూ భూమిని ఆక్రమించి, ప్లాట్లుగా అమ్మేశారు. వీరికి స్థానిక రెవెన్యూ అధికారులు సహకరించారు. వీటిలో నిర్మించిన గదులను కొందరు అద్దెలకు కూడా ఇచ్చారు. ఇలా ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న 12 ఎకరాల వెంచర్తో పాటు 20 ఎకరాల లే ఔట్ను హైడ్రా తొలగించింది. నిర్మాణాలను కూల్చివేసిన అందుకు బాధ్యులైన అధికారులపై మాత్రం చర్యలు తీసుకోలేదు.హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆర్ఎల్ఆర్...హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమిలో 11 ఎకరాలు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ బంధువుల పేర్లపై ధరణిలో చేర్చింది ప్రభుత్వ భూమి అంటూ బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి (ఆర్ఎల్ఆర్) హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ పేరిట ఉన్న 11 ఎకరాలను ఎప్పుడో విక్రయించి వెళ్లిపోయిన జాహెద్ బేగం, షేక్ ఇమామ్, ఇశాన్ అమీన్ను తీసుకొచ్చి వారి పేరిట భూమిని కొన్నట్లు చూపించారని ఆరోపించారు. గత బుధవారం హైడ్రా కమిషనర్కు కలిసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ భూ ఆక్రమణకు పాల్పడిన ఆరికపూడి గాంధీపై ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు గత నెల 21న తమ భూమిలో చేపట్టిన కూల్చివేతలపై తాము హైకోర్టును ఆశ్రయించామని ఆరికపూడి గాంధీ అదే రోజు ప్రకటించారు. దీనిపై హైడ్రా ఆ భూమిలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు హైడ్రా వ్యూహం ఎలా ఉంటుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. చంచల్గూడ నివాసి మృతి
చాదర్ఘాట్: అమెరికాలోని చికాగో ఇవన్స్టంగ్ ప్రాంతంలో నివాసముంటున్న చంచల్గూడకు చెందిన సిరాజ్ మొతీబ్ మహ్మద్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన మేరకు.. కుటుంబ సభ్యులు పది సంవత్సరాల క్రితం అక్కడే సెటిలయినట్లు స్థానికులు తెలిపారు. వరుస సంఘటనలతో అమెరికాలో ఉంటున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.చెరువులో పడి మహిళ మృతిమోతీనగర్: మతిస్థిమితం లేని ఓ మహిళ సున్నం చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి తెలిపిన మేరకు.. బోరబండ సైట్ 3లో మానిక్కర్ ఆండాళు (49) నివాసముంటోంది. ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుమారుడు నవీన్కుమార్ బంధువులు, మిత్రులు, పరిసర ప్రాంతాల్లో విచారించినా జాడ తెలియరాలేదు. దీంతో 5న బోరబండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించగా అల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సున్నం చెరువులో ఆమె మృత దేహం లభించింది.వేడుకల్లో విషాదం..చిన్నారి మృతిఅమీర్పేట: నూతన గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. సనత్నగర్ ఉదయ్నగర్ కాలనీలో శ్రీరాములు భార్య మానస, కుమార్తెలు మేఘన(8),ప్రణవితో కలిసి ఉంటున్నాడు. సుభాష్నగర్లో ఉండే సమీప బంధువు వెంకటస్వామి గృహ ప్రవేశానికి శ్రీరాములు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు.రాత్రి ఎనిమిది గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు టెర్రస్పై ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఇంటి డెకరేషన్ లైట్ల తీగలు తాకి మేఘన స్పృహ కోల్పోయింది. వెంటనే సనత్నగర్లోని ప్రైయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.డివైడర్ ఢీకొని వ్యక్తి మృతిమల్లాపూర్: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండంగా డివైడర్ను ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన మేరకు.. చెంగిచర్ల గణేష్నగర్ కాలనీకి చెందిన చేర్యాల హైమావతి చిన్న కుమారుడు దిలీప్కుమార్ (31) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం స్నేహితుడి బర్త్డే వేడుకలకు వెళ్లాడు. ఇంటికి ఆలస్యంగా వస్తానని తల్లికి చెప్పాడు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 4.25 ఐఐసీటీ గేటు వద్ద యాక్టీవా పై(టీఎస్08జీఏ9032) వస్తుండగా ఫుట్పాత్ను ఢీ కొట్టాడు. దీంతో దిలీప్ కుమార్ తలకు తీవ్ర గాయ కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.నగరంలో ఫేక్ డాక్టరేట్ల కలకలం– నిందితుడి అరెస్ట్లక్డీకాపూల్ : నకిలీ డాక్టరేట్ సర్టిఫికెట్లు ఇస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్రభారతి వద్ద పెద్దిటి యోహాన్ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..గుంటూరు జిల్లా గురుజాలకి చెందిన పెద్దిటి యోహాన్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ పేరిట గత కొంత కాలంగా డాక్టరేట్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్ ద్వారా డాక్టరేట్లు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేలు తీసుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో పలువురికి ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేశారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని యోహాన్ను అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యోహాన్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు సైఫాబాద్ పోలీసులు తెలిపారు. -
నగరం.. రోడ్లు ఛిద్రం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసలే నాసిరకం పనులు.. ఆపై ఏకధాటి వర్షాలు.. వరదలు.. ఇంకేముంది గ్రామీణ రహదారులను ఛిద్రం చేశాయి. మారుమూల గ్రామీణ రోడ్లే కాదు.. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. ఇటు ఎల్బీనగర్ నుంచి అటు బాటసింగారం వరకు విజయవాడ రహదారిపై అడుగుకో గుంతతేలింది. అష్ట వంకరలు తిరిగి.. అనేక మలుపులతో నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న బీజాపూర్ జాతీయ రహదారి (అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల వరకు) పూర్తిగా దెబ్బతింది. శంషాబాద్ నుంచి షాద్నగర్ వరకు ఉన్న బెంగళూరు జాతీయ రహదారి సహా పహడీషరీఫ్ నుంచి ఆమనగల్లు వరకు విస్తరించి ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి, బీఎన్రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా మాల్ వరకు విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ రోడ్డు, షాద్నగర్ నుంచి తాండూరు వెళ్లే మార్గం, కోకాపేట నుంచి శంకర్పల్లి మీదుగా చేవెళ్ల వెళ్లే మార్గం ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్ల భవనాలశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు అటు వైపు దృష్టిసారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాకపోకలకు ఇబ్బందులుఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పాటు రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో రోడ్డుపై ఉన్న తారు, సీసీ దెబ్బతిని కంకర తేలుతోంది. దెబ్బతిన్న ఈ రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. -
అడిగిన సమాచారం ఇవ్వండి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేవారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఎక్సైజ్శాఖ హైదరాబాద్ డిఫ్యూటీ కమిషనర్ అనిల్కుమార్రెడ్డి సూచించారు. ఈ మేరకు సంబంధిత ఎకై ్సజ్ స్టేషన్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ టీమ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, రెండేళ్లలో మద్యం అమ్మకాల వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని చెప్పారు.అలాగే దరఖాస్తుల సమూనాలో తప్పులు లేకుండా సహకరించాలన్నారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అబ్కారీ భవన్లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్లో దాఖలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా డిస్ప్లే చేయాలని ఎకై ్సజ్సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు.26న ప్రెస్క్లబ్ ఎన్నికలులక్డీకాపూల్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న క్లబ్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని ప్రెస్క్లబ్ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి చెప్పారు. 2025–27 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోనున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా దొడ్డా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి సభ్యత్వ రెన్యువల్, అన్ని బకాయిలు చెల్లించిన రెగ్యులర్ సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని చెప్పారు. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు(జనరల్), ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శుల పదవులతో పాటు కోశాధికారి, పది మంది కార్యనిర్వాహక సభ్యులు (8 మంది సాధారణ సభ్యులు, రెండు మహిళా రిజర్వ్ స్థానాలు) ఎన్నికలు జరుగుతాయన్నారు.గాలిలో పల్టీలు కొట్టిన కారు● ఫ్లైఓవర్పై స్తంభాన్ని ఢీకొట్టి..మరోకారుపై పడి...● ఐదుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమంకేపీహెచ్బీకాలనీ: జేఎన్టీయూ–హైటెక్ సిటీ రోడ్డులో అతివేగంగా వెళ్తూ ఓ కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడమే కాకుండా గాలిలోకి పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ జోధ్పూర్ ప్రాంతానికి చెందిన వికాస్శర్మ, శాంతను స్నేహితులు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్డులో నివాసం ఉండే శాంతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. వికాస్శర్మ ఇంటీరియర్ డిజైనర్. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి మియాపూర్ ప్రాంతంలో మద్యం తాగారు. సోమవారం తెల్లవారుజామున జేఎన్టీయూ వైపు నుంచి హైటెక్ సిటీ వైపు టాటా కర్వ్ కారులో ఇరువురూ వెళ్తున్నారు. ఆ సమయంలో వికాస్శర్మ డ్రైవింగ్ చేస్తున్నాడు. నెక్సెస్ మాల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న వీరు ఫ్లైఓవర్ దిగే క్రమంలో అతివేగంగా వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. వీరు ప్రయాణిస్తున్న కారు గాల్లోకి ఎగిరి హైటెక్ సిటీ వైపు నుంచి–జేఎన్టీయూ వైపు వెళ్తున్న టాటా సిట్రాన్ ఎలక్ట్రిక్ కారుపై పడింది. ఈ కారులో నానక్రాంగూడలోని ఐసీఐసీఐ బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న ప్రియను దింపేందుకు సంస్థకు చెందిన కారును అఖిల్రెడ్డి నడుపుతుండగా సెక్యూరిటీగార్డ్గా వచ్చిన సాహిల్కుమార్ కూడా ఉన్నారు.ఈ ఘటనలో స్నేహితులు వికాస్శర్మ, శాంతన్తో మరో కారులోని అఖిల్రెడ్డితో పాటు అందులో ఉన్న ప్రియ, సాహిల్కుమార్లు తీవ్రంగా గాయపడ్డారు.కార్లను నడుపుతునన వికాస్శర్మ,అఖిల్రెడ్డిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదుగురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నేడు పలుచోట్ల నీటి సరఫరాకు అంతరాయంసాక్షి,సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరాచేసే సింగూరు జలాశయం సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ కు మణికొండ కల్వర్టు వద్ద పీఎస్సీ పైపు లైన్ దెబ్బతిని ఏర్పడిన భారీ లీకేజీ మరమ్మతులు పనులు నేపథ్యంలో మంగళవారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి వర్గాలు తెల్పాయి. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, షేక్ పేట్, హకీంపేట్, తౌలిచౌకి, కాకతీయ నగర్ లోని కొన్ని ప్రాంతాలు, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్, కార్వాన్, ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. -
మద్యం మత్తులో భార్యను కొట్టిన భర్త
గౌలిపురా: మద్యం మత్తులో భర్త కొట్టడంతో నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. భవానీనగర్ తలాబ్కట్టా సిద్దిఖీనగర్ సమద్ హోటల్ ప్రాంతానికి చెందిన సయీద్ ఉన్నీసా (28), మహ్మద్ ఫెరోజ్ ఖాన్లు దంపతులు. వీరికి నలుగురు పిల్లలు. కాగా ఫెరోజ్ ఖాన్ తరచూ మద్యం తాగి వస్తుండటంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గత నెల 30న ఫెరోజ్ ఖాన్ మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో ఫరోజ్ ఖాన్ భార్య సయీద్ ఉన్నీసాను కొట్టాడు. ఈక్రమంలో మరుసటిరోజు (ఈ నెల 1న) సాయంత్రం సయీద్ ఉన్నీసా తన నలుగురు పిల్లలను తీసుకొని కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఫెరోజ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
గొడవ వద్దన్నందుకు దాడి..వ్యక్తి మృతి
ఘట్కేసర్: పిల్లలను గొడవపడొద్దు అన్నందుకు ఓ పిల్లాడి తండ్రి అతడిపై దాడిచేశాడు. ఈ సంఘటనలో బాధితుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని అవుషాపూర్లో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన మేరకు.. అవుషాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అమీర్ (34) రాళ్లు కొట్టుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఇంటిలో ఉండగా సమీపంలో నివసించే షన్ను పిల్లలు అసీనా, అజ్మెద్, సయ్యద్ అలీ కుమారుడు అబు గొడవ పడ్డారు. శబ్దం విన్న సయ్యద్ అమీర్ బయటకు వచ్చిన గొడవ పడొద్దని అబుకు సూచించాడు.గొడవ వద్దన్నందుకు...గొడవ పడొద్దన్నాడనే విషయాన్ని అబు తన తండ్రి సయ్యద్ అలీకి చెప్పడంతో అతడొచ్చి సయ్యద్ అమీర్పై దాడికి దిగాడు. చుట్టు పక్కల వారు ఇరువురిని శాంత పరిచి ఇంటికి పంపించి వేశారు. అనంతరం అర్థగంట తర్వాత ఛాతి నొప్పితో పాటు వాంతులు కావడంతో కుటుంబీకులకు సయ్యద్ అమీర్ తెలిపాడు. అతడి శరీరానికి చెమటలు పట్టడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.జాతీయ రహదారిపై నిరసన...అకారణంగా దాడి చేసి ప్రాణం తీసిన సయ్యద్ అలీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు బాఽధితులు పోస్ట్మార్టం అనంతరం జాతీయ రహదారిపై మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చచెప్పి పంపించి వేశారు. కాగ ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పంధం జరిగినట్లు సమాచారం. -
మురుగు శుద్ధిలో ముందడుగు
● నేడు 39 అమృత్ ఎస్టీపీలకు సీఎం శంకుస్థాపన ● ఆరు ఎస్టీపీలను ప్రారంభించనున్న రేవంత్రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: దక్షిణాసియాలోనే వంద శాతం మురుగును శుద్ధి చేసే తొలి నగరంగా రికార్డు సృష్టించేందుకు మహా హైదరాబాద్ సిద్ధమవుతోంది. రాబోయే పదేళ్ల వరకు ఉత్పత్తయ్యే మురుగును సైతం శుద్ధి చేసేందుకు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి అడుగులు వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద మంజూరైన ఎస్టీపీల నిర్మాణాలకు సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో సుమారు 972 ఎమ్మెల్డీల సామర్థ్యంతో నిర్మించే ఎస్టీపీల పనులకు శుక్రవారం అంబర్పేట వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరో 6 ఎస్టీపీలను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండేళ్లలో నిర్మాణాలు పూర్తయ్యేలా.. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద మంజూరు చేసిన 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను రెండు ప్యాకేజీల కింద నిర్మాణాలను పూర్తి చేసేలా జలమండలి చర్యలు చేపట్టింది. మొత్తం ఎస్టీపీల్లో ఒకటి పీపీపీ మోడ్లో.. మిగిలిన రెండు ప్యాకేజీల్లో 38 హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్)విధానంలో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలు, ప్యాకేజీ–2లో 22 ఎస్టీపీలు నిర్మిస్తారు. మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.3,849.10 కోట్లు. ఇందులో ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ. 2,569.81 కోట్లు. 15ఏళ్ల పాటు నిర్వహణకు రూ. 1,279.29 కోట్లు వెచ్చించనున్నారు. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30శాతం, రాష్ట్రం 30 శాతం, నిర్మాణ సంస్థ 40 శాతం నిధులు సమకూర్చనుంది. వచ్చే పదేళ్లలో..రాబోయే పదేళ్లలో మురుగు ఉత్పతి 2,815 ఎమ్మెల్డీ కావచ్చని జలమండలి అంచనా వేస్తోంది. అమృత్ 2.0 కింద 39 ఎస్టీపీలు పూర్తయితే 2,850 ఎమ్మెల్డీలను శుద్ధి చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 1950 మిలియన్్ లీటర్ గ్యాలన్ల (ఎమ్మెల్డీ) మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,650 ఎమ్మెల్డీ ఉంటుంది. ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా 1,444 ఎమ్మెల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తోంది. మరో 332. 5 ఎమ్మెల్డీ సామర్థ్యం గల ఆరు ఎస్టీపీలు నిర్మాణాలు పూర్తయి అందుబాటులో రానున్నాయి. మిగిలిన రెండు పూర్తయితే దాదాపు 1,878 ఎమ్మెల్డీల మురుగు శుద్ధి చేయవచ్చు. కాగా.. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్లో భాగంగా మూసీ నదిపై సుమారు 62 ఎస్టీపీల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. మూసీ పక్కన అంబర్పేట్లో ఎస్టీపీ -
ఓయూలో ఎన్నికల హోరు
జోరందుకున్న ఉద్యోగ సంఘాల ప్రచారం లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగాల సంఘాల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 27న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురువారం ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అబ్దుల్ ఖదీర్ ఖాన్, బి. వెంకటేష్ ప్యానెల్ 43 హామీలతో రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓయూలోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ ఖదీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి బి.వెంకటేష్లు మాట్లాడుతూ.. తమ ప్యానెల్లోని 9 మందిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలిస్తే ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు పాటుపడతామన్నారు. ఉద్యోగులందరికి హెల్త్ కార్డులు, సీపీఎస్, ఓపీఎస్ విధానం అమలు చేయిస్తామన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
బతుకమ్మకుంట ప్రారంభోత్సవం నేడు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంటను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బతుకమ్మ కుంటను ఓ పిక్నిక్ స్పాట్గా అభివృద్ధి చేసి.. చుట్టూ పిల్లల ప్లే ఏరియాతో పాటు అనేక ఆకర్షణలు అందుబాటులోకి తెచ్చారు. వృద్ధులు సేద దీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వాకింగ్ చేసే వారి కోసం చెరువు చుట్టూ నడక దారి, ఆక్రమణలకు తావు లేకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ చెరువు వరద నీటితో నిండు కుండను తలపిస్తుండటంతో బోటు షికారు కూడా అందుబాటులోకి వచ్చింది. బతుకమ్మకుంటను సీఎం నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. బతుకమ్మ ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్నారు. ఈ కుంట అభివృద్ధికి హైడ్రా తీసుకున్న చొరవకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. విద్యుద్దీపాల మధ్య బతుకమ్మ కుంట -
మద్యం దుకాణాలకు టెండర్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మద్యం దుకాణాలకు ఔత్సాహిక వ్యాపారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గురువారం నోటిఫికేషన్ వెలువడింది. రెండేళ్ల కాలానికి డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొత్త లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఈసారి కూడా షాపుల కేటాయింపులో ఎస్సీ (10శాతం), ఎస్టీ (5శాతం), గౌడ (15 శాతం) కులస్తులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.3 లక్షలు. అక్టోబర్ 23న షాపుల వారీగా లక్కీ డ్రా తీస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. సరూర్నగర్ ఎకై ్సజ్ పరిధిలో 138 మద్యం షాపులు ఉండగా, వీటిలో 25 గౌడ కులస్తులకు, 11 ఎస్సీలకు, ఎస్టీలకు 2 ఖరారు చేశారు. మిగిలిన షాపులను జనరల్ కేటగిరీలో ప్రకటించారు. శంషాబాద్ ఎకై ్సజ్ పరిధిలో 111 మద్యం షాపులు ఉండగా.. 9 గౌడ్స్కు, 6 ఎస్సీలకు కేటాయించారు. -
బైక్పై సీఎండీ బస్తీబాట!
ఎల్సీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు సాక్షి, సిటీబ్యూరో: పెండింగ్లో ఉన్న విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఇంజినీర్లకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. నూతన సర్వీసులు, టైటిల్ ట్రాన్స్ఫర్, సోలార్ నెట్ మీటరింగ్, పీఎం సూర్యఘర్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులను పెండింగ్లో పెట్టిన ఇంజినీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా గురువారం పాతబస్తీలోని మెఘల్పురా, బేహరుపియాబస్తీ, గొల్లఖిడికి బస్తీల్లో ఆయన బైక్పై పర్యటించారు. ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ నరహింహులును వెనుక సీట్లో కూర్చొబెట్టుకుని ఆయన బైక్ నడుపుతూ మార్గంమధ్యలో పలువురు వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 593 ఎల్టీఎం(అపార్ట్మెంట్లు/ లే అవుట్ల) దరఖాస్తులపై సమీక్షించారు. కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులంతా శనివారం ఇస్తున్న లైన్ క్లియరెన్స్(ఎల్సీ)లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక నుంచి వారానికి ఒక రోజు (శనివారం) మాత్రమే ఎల్సీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎల్సీ ఇచ్చిన సమయంలోనే లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్లకు రిపేర్లు, ఏబీ స్విచ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
‘పవర్’ఫుల్ పోస్టులే కావాలి
● బదిలీ స్థానాల్లో విధులకు అధికారులు నో ● బల్దియాలో అంతర్గత బదిలీలతో కొత్త సమస్యలు అలా లేకుంటే పని చేసేందుకు ససేమిరా సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. తాను బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలం నుంచే అంతర్గత బదిలీల చర్యలు చేపట్టారు. వాటివల్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించినప్పటికీ సత్ఫలితాలు కనిపించడం లేదు. స్వల్ప కాలంలోనే తరచూ బదిలీలతో కొందరు.. ఉన్నత స్థానాల్లోంచి వాటికంటే తక్కువ అధికారం ఉన్న స్థానాల్లో నియమించారని కొందరు.. అసలు పనులే చేయడం లేదు. తమ స్థాయికి తగిన పోస్టులివ్వలేదని కొందరు డ్యూటీలకు రావడమే మానేశారు. ఆ మాటకొస్తే.. కర్ణన్ను కమిషనర్గా నియమించాక జీహెచ్ఎంసీలో ఆయన కంటే సీనియర్ అయిన ఐఏఎస్ అధికారి ఒకరు జీహెచ్ఎంసీకే రాలేదు. దాంతో ప్రభుత్వం ఆయనను రాష్ట్రస్థాయి పోస్టుకు బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, సర్కిళ్ల పరిధుల్లో డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న వారిని ఆ స్థాయి కంటే తక్కువ స్థాయివిగా భావించే జాయింట్ కమిషనర్లుగా నియమించడంతో కొందరు అసలు విధులకే రాకుండా మానేశారు. కొందరు తప్పదన్నట్లు సదరు పోస్టుల్లో చేరినా అసలు పనులు మాని, తాము కోరుకున్న పోస్టుల కోసం సచివాలయం చుట్టూ, మంత్రుల చుట్టూ, ఇతరత్రా రాజకీయనేతల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఓ విభాగంలో ముగ్గురు జాయింట్ కమిషనర్లను నియమిస్తే.. ఇద్దరు తమకిచ్చిన పనులు మాని పైరవీల వేటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి తక్కువ.. కొందరికి ఎక్కువ ● మరోవైపు కొందరు ఉన్నతాధికారులకు మాత్రం అదనపు భారం పడుతోంది. వాస్తవానికి జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీహెచ్ఎంసీ స్థాయిలో కమిషనర్ కంటే కూడా జోనల్ స్థాయిలో వారికే ఎక్కువ పనులుంటాయి. అలాంటిది కొందరు జోనల్ కమిషనర్లకే ఇతరత్రా విభాగాల అదనపు బాధ్యతలు కూడా అప్పగించడంతో వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. బాగా పని చేస్తారని బరువంతా వారిపైనే మోపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక జోనల్ కమిషనర్..మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కీలక స్థానంలో ఉన్నారు. మరో జోనల్ కమిషనర్కు కీలకమైన జోనల్ బాధ్యతలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ కీలకమైన ఐటీ, రెవెన్యూ విభాగాల బాధ్యతలున్నాయి. ● అధిక నిర్మాణాలతో పాటు అధిక పనులుండే మరో జోనల్ కమిషనర్కు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విభాగం బాధ్యతలప్పగించారు. వారందరూ ప్రతిరోజూ రెండు పోస్టుల నిర్వహణకు గాను దూరంగా ఉన్నప్పటికీ రెండు కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి. ఇదే తరుణంలో ప్రధాన కార్యాలయంలోని కొందరు అడిషనల్ కమిషనర్లకు మాత్రం పేరుకు మాత్రం రెండేసి విభాగాలున్నప్పటికీ, వాటిల్లో చేసేందుకు పెద్దగా పనేమీ ఉండదు. అయినప్పటికీ, విద్యుత్ విభాగానికి మాత్రం అడిషనల్ కమిషనర్ లేరు. నగరంలో అత్యంత సమస్యాత్మక అంశాల్లో వీధిదీపాల సమస్య ప్రధానమైనది. అయినప్పటికీ, వీధిదీపాలను పర్యవేక్షించేందుకు విద్యుత్ విభాగానికి అడిషనల్ కమిషరే లేదు. చేసేవారికి అదనపు భారం. చేయని వారికి నామమాత్రం. ఇంకొందరు ఎక్కడుంటారో, ఏంచేస్తారో తెలియదు. పోస్టు మాత్రం జీహెచ్ఎంసీలో ఉంటుంది. ఇదీ జీహెచ్ఎంసీ తీరు. -
మెట్రోకు గుడ్బై
ఆ రైల్తో అనుబంధానికి బీటలు సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్ మెట్రో రైల్తో ఎల్అండ్టీ అనుబంధానికి బీటలు వారాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణ నుంచి వైదొలగనున్నట్లు ఎల్అండ్టీ సంస్థ గురువారం మరోసారి స్పష్టంగా తేల్చిచెప్పింది. ఏటేటా పెరుగుతున్న నష్టాలు, ప్రభుత్వం నుంచి ఆశించిన రాయితీలు లభించకపోవడం, ప్రాజెక్టు ప్రారంభమైన కొద్ది కాలానికే కోవిడ్ విజృంభించడం వంటి వివిధ కారణాలతో ఆ సంస్థ సుమారు రూ.5,500 కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో మెట్రో భారాన్ని మోయడం తమ వల్ల కాదని ఇప్పటికే పలు దఫాలుగా స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రానికి రాసిన లేఖలోనూ అదే విషయాన్ని వెల్లడించింది. ఈ లేఖలోని వివరాలను ‘సాక్షి’ ముందే వెల్లడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేయడంతో పాటు, ఎల్అండ్టీతో ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని, ప్రభుత్వంతో మరే విధమైన ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేయడంతో భాగ్యనగర మెట్రోకు ఎల్అండ్టీకి ఉన్న బంధం ముగిసిపోయింది. అడుగులు ఇలా.. ● హైదరాబాద్లో ప్రజారవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మెట్రో నిర్మాణానికి చర్యలు చేపట్టింది. నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధిని, నగరంలో లాస్ట్మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకొని మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే మెట్రో ఎంతో అవసరమని గుర్తించారు. మెట్రో ప్రాజెక్టు వల్ల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని, దాంతో మిగతా రంగాల్లోనూ నగరంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2007లో కేంద్రం నుంచి ఆమోదం పొంది పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టును ప్రారంభించారు. ● 2010 సెప్టెంబర్లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వంతో ఎల్అండ్టీ ఒప్పందం కుదుర్చుకుంది. అయిదేళ్లలో ప్రాజెక్టును నిర్మించి 30 ఏళ్లపాటు రైళ్లను నడపనున్నట్లు ఆ ఒప్పందంలో పేర్కొంది. ఈ లెక్కన 2015 నాటికి మెట్రో రైళ్లు అందుబాటులోకి రావాలి. కానీ మరో రెండు సంవత్సరాలు ఆలస్యంగా 2017లో రైళ్లు పట్టాలెక్కాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే 9 ఏళ్లుగా ఎల్అండ్టీయే రైళ్లను నడుపుతోంది. మూడు కారిడార్లలో 69 కి.మీ.మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ల మధ్య ప్రతిరోజు 57 రైళ్లు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. కొన్ని స్టేషన్లకు లాస్ట్మైల్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. చాలావరకు వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేకపోవడం, సరైన కనెక్టివిటీ సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. మరో 21 ఏళ్లు అవకాశం ఉన్నా.. ఒప్పందం ప్రకారం ఎల్అండ్టీకి మరో 21 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగానే మెట్రో కారిడార్లకు ఇరువైపులా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఎల్అండ్టీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చినట్లు అంచనా. పలుచోట్ల మాల్స్ నిర్మించి అద్దెలకు ఇచ్చారు. రాయదుర్గం వద్ద మరో ప్రైవేట్ సంస్థకు సబ్లీజ్కు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సంస్థ వెదొలగడం ఖరారైన నేపథ్యంలో ఒప్పందంలోని వివిధ అంశాలపై ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ముందుగానే వెల్లడించిన ‘సాక్షి’ నిర్వహణ నుంచి ఎల్అండ్టీ వెనకడుగు ప్రభుత్వంతో ఒప్పందానికి నిరాకరణ ముగిసిన 9 ఏళ్ల ఒప్పందం -
గల్ఫ్లో చిక్కుకున్న మా నాన్నను కాపాడండి
పంజగుట్ట: ఏజెంట్, తోటి ఉద్యోగుల చేతితో మోసపోయి గత రెండేళ్లుగా గల్ఫ్లో చిక్కుకుపోయిన తన భర్తను ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ, రాంనగర్కు చెందిన అమీనా సౌఘాత్ అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం తన నలుగురు పిల్లలతో కలిసి సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు .. తన భర్త మొహమ్మద్ గౌస్ మిర్యాలగూడ పట్టణంలో ఆటో నడుపుకునే వాడని, 2023 మార్చ్ 21న దుబాయ్కు చెందిన సమీర్ అనే ఏజెంట్ ద్వారా రూ. 1.20 లక్షలు ఖర్చు పెట్టి దుబాయ్లోని యాక్షన్ ఇంటర్నేషనల్ సర్వీస్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా ఉద్యోగానికి వెళ్లినట్లు తెలిపింది. కొన్ని నెలల పాటు వారు అతడిని బాగానే చూసుకున్నారన్నారు. ఆ తర్వాత సమీర్ అతని వద్ద పనిచేసే విక్కి అలియాస్ హిమాన్షు, డ్రైవర్ అలి అనే ముగ్గురు వ్యక్తులు దుబాయ్లోని కార్యాలయంలో అపాయింట్మెంట్ తీసుకోవాలని, బ్యాంక్ అకౌంట్, వసతి పేరుతో కొన్ని పత్రాలపై మొహమ్మద్ గౌస్తో సంతకాలు, పాస్పోర్టు, వీసా, ఇక్వామా తీసుకున్నారని తెలిపారు. సదరు డాక్యుమెంట్ల ఆధారంగా తన భర్త గౌస్ పేరుతో క్రెడిట్కార్డులు, పర్సనల్ లోన్లు తీసుకుని మోసం చేశారన్నారు. ఈ విషయం తన భర్త తనకు ఫోన్ చేసి చెప్పాడని గత 18 నెలలుగా అతను స్నేహితుల వద్ద తలదాచుకుని మసీదు వద్ద ఒకపూట భోజనం చేస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్పోర్టు, వీసా లేక ఎక్కడా పనిచేసుకోలేక బయటికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుండటంతో తాము ఇప్పటివరకు రూ. 80 వేలు పంపించామని ఇక పంపే స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తన భర్తను ఇండియాకు రప్పించేలా చూడాలని వేడుకున్నారు. సమావేశంలో మొహమ్మద్ గౌస్ తల్లి మొహమ్మద్ అఫ్జలున్నిసా బేగం, పిల్లలు అనీసా విసాల్, అర్షక్ వసీల్, అరూబా వాఫియా, ఆసిల్ వాఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
యువతి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
కీసర: నవ వధువును బలవంతంగా తీసుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో శ్వేత అనే యువతిని ఆమె తల్లిదండ్రులు బుధవారం బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్ అతడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం కీసర పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ శ్వేత కిడ్నాప్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శ్వేత ఆచూకీ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్.ఐ శ్రీనివాస్రెడ్డితో శ్వేత తండ్రి ఫోన్లో మాట్లాడించారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆమెను కీసర పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి భర్తకు అప్పగించనున్నట్లు తెలిపారు. -
సైబర్ నేరగాళ్లపై సస్పెక్ట్ షీట్స్
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఈ తరహా నేరగాళ్లను కట్టడి చేసేందుకు సిటీ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పదే పదే ఈ నేరాలు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరవనున్నారు. ఈ మేరకు ఈ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్గా (ఎస్హెచ్ఓ) ఉన్న ఏసీపీ అందరూ ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్స్పెక్టర్లకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కేటుగాళ్లపై నిరంతర నిఘా ఉంచడానికి, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సిటీలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో పట్టుబడుతున్న నిందితుల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో సస్పెక్ట్ షీట్స్ లక్ష్యం ఎంత వరకు నెరవేరుతుందనేది వేచి చూడాల్సిందే. బీఎన్ఎస్ అమలులోకి రావడంతో.. రౌడీలపై రౌడీషీట్, చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ (సీడీసీ) షీట్, సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్, భూ కబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరవడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీసు మాన్యువల్లో అవకాశం ఉంది. నిర్ణీత కాలంలో ఒకటి కంటే ఎక్కువ నేరాలు చేసే రిపీటెడ్ అఫెండర్లపై వీటిని తెరుస్తారు. అయితే సైబర్ నేరాలు చేసే వారిలోనూ అనేక మంది రిపీటెడ్ అఫెండర్లు ఉంటున్నారు. ఒకరే అనేక నేరాలు చేస్తుండగా... పదేపదే చేస్తున్న వాళ్లూ ఉంటున్నారు. వీరి పైనా సస్పెక్ట్ షీట్స్ తెరిచే అవకాశం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు దక్కింది. దీంతో పదేపదే, అనేక నేరాలు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పైనా సస్పెక్ట్ షీట్స్ను తెరవనున్నారు. పటిష్ట నిఘా, పర్యవేక్షణకు అవకాశం... ఇప్పటి వరకు అసాంఘిక శక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్స్లో స్వల్ప మార్పులతో సైబర్ క్రైమ్ అధికారులు ఈ సస్పెక్ట్ షీట్లు నమోదు చేయనున్నారు. వీటిలో సదరు నేరగాడికి సంబంధించిన ఫొటో, చిరునామా, నమోదై ఉన్న కేసులు, నేరం చేసే విధానం సహా పూర్తి సమాచారం పొందుపరుస్తారు. ఈ వివరాలను తమ వద్ద ఉంచుకోవడంతో పాటు సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసు స్టేషన్కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఆయా చోట్ల పోలీసు అధికారులు మారినప్పటికీ వీరిపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. నేరగాడి చిరునామా మారినప్పుడల్లా ఈ షీట్ను ఆ పరిధిలోని ఠాణాకు పంపిస్తారు. ఆ పోలీసులు సహకరిస్తారా..? నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో అరెస్టు అవుతున్న నిందితుల్లో బయటి రాష్ట్రాల వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి నేర చరిత్ర లేని వీరు బయటి ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై ఇక్కడ షీట్ తెరిచినా ఉపయోగం లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి నేరగాళ్లపై షీట్లు తెరవడంతో పాటు ఆ వివరాలను వారు నివసిస్తున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలోని వస్తుందో ఆ జిల్లా ఎస్పీలకు లేఖ ద్వారా నివేదించాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్న అనేక పోలీసు విభాగాలు నేరగాళ్లతో ములాఖత్ అయి ఉంటున్నాయి. ఈ కారణంగానే వాళ్లు ఎంత వరకు సమర్థంగా నిఘా ఉంచుతారు, ముందస్తు చర్యలు తీసుకుంటారన్నది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే... ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న, సాధారణ, సోషల్మీడియా వేదికగా జరిగే సైబర్ నేరగాళ్లపై తెరిచిన సస్పెక్ట్ షీటర్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లలో ఉంచడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం సాధ్యం కాదనే వాదన ఉంది. సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరి చూసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారి వివరాలను పోలీసు అధికారిక వెబ్సైట్లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఈ షీట్లు తెరవాలనే నిర్ణయం వెనుక మరో కోణం ఉందని, సోషల్ మీడియా గొంతు నొక్కాలనే ప్రయత్నం ఉందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అనునిత్యం నిఘా, పర్యవేక్షణ కోసం ఇలా నేరగాళ్లలో బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువ షీట్లు తెరిచినా వారిపై చర్యలు సాధ్యం కాని అంశమే -
గుండెపోటుతో రచయిత వెంకట్గౌడ్ మృతి
గాంధీ కళాశాలకు భౌతికకాయం అప్పగింత సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ (52) గురువారం ఉదయం గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ విద్యానగర్లో మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన వెంకట్గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రతోపాటు తెలంగాణ అస్థిత్వం, సంస్కృతి, సంప్రదాయాలపై పలు రచనలు చేశారు. మృతుని కోరిక మేరకు కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఆయన నేత్రాలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సేకరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మెడికల్ జేఏసీ కన్వీనర్ వేణుగోపాల్ గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు రామారావు గౌడ్, సత్యంగౌడ్, గౌడ జేఏసీ చైర్మన్ అంబాల నారాయణగౌడ్, ముద్దగోని రాంమోహన్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ తొడపనూరి సత్యగౌడ్, బూర వెంకట్గౌడ్ పాల్గొన్నారు. ‘వెంకట్గౌడ్ మృతి తెలంగాణకు తీరని లోటు’ తెలంగాణ వాది, ప్రముఖ రచయిత కొంపల్లి వెంకట్గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అసామాన్యమని, రచనల ద్వారా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తన సాహిత్య జీవితాన్ని సాగించారని అన్నారు. -
సమష్టి పోరాటంతోనే సమస్యల పరిష్కారం
ముషీరాబాద్: నిరుద్యోగుల సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతున్న అశోక్ అమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని కోరుతూ అశోక్ భార్య సునీత నిరుద్యోగులతో కలిసి విద్యానగర్ బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై అశోక్ తెగించి కొట్లాడుతున్నారన్నారు. 12 రోజులుగా అమరణ నిరాహార దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అణిచివేస్తే భారీ మూల్యం తప్పదన్నారు. అశోక్కు ఏమి జరిగినా ప్రభుత్వనిదే బాధ్యతని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి వారి సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మూడేళ్లు ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆలోగా నిరుద్యోగ సమస్య లేకుండా చూడాలన్నారు. రాజకీయ కోణంలో కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని ఆయన వెనుక నిరుద్యోగ యువత ఉందన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అశోక్తో చర్చించి అమరణ నిరాహార దీక్షను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సొంత హాస్టల్స్ సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. జీవో నెంబర్ 29ని రద్దు చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నందునే అమరణ నిరాహార దీక్షకు అశోక్ దిగాడని 12 రోజులుగా ఒక్క మంత్రి కూడా దీనిపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే అశోక్తో చర్చలు జరపాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గ్రూప్–1 అభ్యర్థి ఝాన్సీ రాణి మాట్లాడుతూ ఏడాది తిరిగేలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి దసరా లోపు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నీలా వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య -
అధికారుల్లోనూ ‘జూబ్లీహిల్స్’ గుబులు?
● ఎల్బీనగర్ జడ్సీ హేమంత్ కేశవ్పాటిల్కు అదనపు బాధ్యతలు ● కత్తిమీద సాములా మారిన ఎన్నికల నిర్వహణ ఉప ఎన్నికల విధులు ఐఏఎస్ అధికారికి అప్పగింత సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్..! స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న సాధారణ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడిది అందరి గుండెల్లోనూ గుబులు రేపుతోంది. ఓవైపు రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ గెలవాలనే తలంపుతో అధికార కాంగ్రెస్తో పాటు తమ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదనే టార్గెట్తో బీఆర్ఎస్ ఇప్పటికే తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి దక్కకుండా చేసేందుకు అన్ని విధాలుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముక్కోణపు పోటీ అయినప్పటికీ.. ఇక్కడ జరగనున్నది ముక్కోణపు పోటీ అయినప్పటికీ, బీజేపీ తగిన సమయంలో బహిరంగంగా రంగంలోకి దిగుతుందనే అభిప్రాయాలున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో వైరి పక్షానికి సమాధానమివ్వాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ భావిస్తున్నాయి. గెలిచిన వారు కేవలం తమ గెలుపని చెప్పడమే కాదు.. ఓడిన వారిని ‘ఇక మీ పనైపోయింది’ అని ఎగతాళి చేసేందుకు ఇదే మంచి తరుణమనుకొని పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మంత్రులు వరద సమస్యలు పరిష్కరిస్తామంటూ బురదనీటిలో పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా బూత్స్థాయి వరకు శిక్షణనిస్తున్నారు. ప్రతీ అంశం సూక్ష్య స్థాయిలో.. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తిప్పలు పడటం కొంత సహజమే అయినా.. ఈ ఎన్నిక నిర్వహణ అధికారుల్లోనూ గుబులు రేపుతోంది. అందుకు కారణం రాబోయే కాలంలో జరగబోయే రాజకీయ పరిణామంగా ఈ ఎన్నికలను భావిస్తున్న పార్టీలు.. ఓటర్ల జాబితాలో చేరికలు, తొలగింపుల నుంచి ప్రతి అంశాన్నీ సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. ఎవరి వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో తెలియదు. ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియదు. ఎన్నికల సంఘం నుంచి పరిశీలకులుగా వచ్చేవారూ స్ట్రాంగ్గా ఉంటారనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగిస్తే మేలనే తలంపుతో కాబోలు ఈ ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషర్ బాధ్యతల్ని ఐఏఎస్ అధికారికి అప్పగించారు. ఉత్తర్వులు వెంటనే అమలులోకి.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్కు ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగం అడిషనల్ కమిషనర్గా ఉన్న కె.అలివేలు మంగతాయారుకు ఎన్నికల విభాగం స్థానే స్పోర్ట్స్ విభాగాన్ని అప్పగించారు. ఎన్నికల విభాగంతోపాటు ఆమె నిర్వహిస్తున్న ఎస్టేట్స్ విభాగాన్ని యథాతథంగా ఉంచారు. గత జూన్లో అడిషనల్ కమిషనర్ల బదిలీల సందర్భంగా యూబీడీ అడిషనల్ కమిషనర్ వి.సుభద్రాదేవికి స్పోర్ట్స్ విభాగం అదనపు బాధ్యతలప్పగించడం తెలిసిందే. -
శరవేగంగా హఫీజ్పేట్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
సాక్షి, సిటీబ్యూరో: హఫీజ్పేట్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.29.21 కోట్లు కేటాయించింది. వేగంగా వృద్ధి చెందుతున్న గ్రేటర్ పశ్చిమ ప్రాంతాలు, ఐటీ కంపెనీలు స్టేషన్కు దగ్గరగా ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. జంట నగరాల్లో సబర్బన్ రైల్వేస్టేషన్లలో హఫీజ్పేట్ గ్రేడ్– 3లో ఉంది. ఈ స్టేషన్ నుంచి సగటున రోజుకు 9 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 60 ఎంఎంటీఎస్, 8 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్లాట్ఫాం పైకప్పు అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు, ప్లాట్ఫాం ఉపరితలం అభివృద్ధి, సర్క్యులేటింగ్ ఏరియా, సూచీ బోర్డులు, విద్యుత్తు లైటింగ్, భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో అధునాతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
మేఘ విస్ఫోటం
● ఊహించని రీతిలో వర్షాలు ● స్వల్ప వ్యవధిలో 10 సెంటీమీటర్ల పైనే ● ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం నమోదు నగరం నెత్తిన కుంభవృష్టి సాక్షి, సిటీబ్యూరో మహా నగరాన్ని పక్షం రోజులుగా మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) వెంటాడుతోంది. ఒక్కో రోజు.. ఒక్కో ప్రాంతంలో ఆకాశానికి చిల్లుపడినట్లు కుంభవృష్టి కురుస్తోంది. అతి స్వల్ప వ్యవధిలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. పగలంతా ఉష్ణతాపం ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతమై కుండపోత బెంబేలెత్తిస్తోంది. పది రోజుల క్రితం అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీ ప్రాంతంలో అతి తక్కువ సమయంలో 18 సెంటీమీటర్లపైగా వర్షపాతం నమోదు కాగా.. అదేతరహా ప్రతి రోజూ 10 సెంటీమీటర్ల తగ్గకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకస్మికంగా ఊహించని స్థాయిలో కురుస్తున్న వర్షంతో సిటీజనులు వణికిపోతున్నారు. స్వల్ప సమయంలోనే.. అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటంగా వాతావరణ శాఖ పరిగణిస్తోంది. కేవలం నిమిషాల వ్యవధిలో ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్లలోపు అత్యధిక తీవ్రతతో భారీ వర్షం కురుస్తోంది. ఇది సాధారణ వర్షపాతం కన్నా చాలా వేగంగా, అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. ఇది ప్రధానంగా గంటల వ్యవధిలో కురిసే వర్షం కాదు, కేవలం నిమిషాల్లోనే మొత్తం వర్షం కురిసిపోతుంది. గంట వర్షపాతం పరిశీలిస్తే.. కనీసం 10 సెంటీమీటర్లు (100 మిల్లీమీటర్ల) లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే భారీ వర్షం ఆకస్మిక వరదలకు దారితీస్తాయి.. కానీ.. స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటి క్లౌడ్ బరస్ట్గా పరిగణించలేమని, కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్ బరస్ట్ పేర్కొనవచ్చని వాతావరణ శాఖ పేర్కొంటోంది. మేఘాల సాంద్రత పెరిగి.. మేఘాల సాంద్రత పెరిగి (బరువెక్కి) ఒక్కసారిగా విస్ఫోటంపై కుంభవృష్టి వర్షం కురుస్తొంది. క్లౌడ్ బరస్ట్ ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా, ఇది క్యుములోనింబస్ మేఘాల వల్ల సంభవిస్తుంది. మేఘాలు భూమి ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల వరకు నిలువుగా వ్యాపించి ఉంటాయి. మేఘాలలో నీటి ఆవిరి, నీటి బిందువులు, మంచు కణాలు అధిక మొత్తంలో నిల్వ ఉంటాయి. వాతావరణంలో అసాధారణ తేమ శాతం ఉన్నప్పుడు వేడిగా ఉండే గాలి పైకి వెళ్లేటప్పుడు చల్లబడి మేఘాలను ఏర్పరుస్తుంది. గాలి వేగంగా పైకి కదిలే కొద్దీ.. క్యుములోనింబస్ మేఘాలు భారీగా, నిలువుగా పెరుగుతాయి. మేఘాలలో ఎక్కువ మొత్తంలో నీటి బిందువులు మంచు కణాలు నిల్వ అవుతాయి. మేఘాలలోని పైభాగాన ఉన్న శీతల గాలులు నీటి బిందువులను కిందికి పడకుండా అడ్డుకుంటాయి. వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశలో మేఘం తనలో ఉన్న నీటి మొత్తాన్ని నిలుపుకోలేనప్పుడు, మొత్తం నీరు ఒకేసారి ఒక నీటి స్థూపంలా కిందికి విపరీతమైన వేగంతో పడిపోతుంది. అంచనా వేయడం కష్టమే క్లౌడ్ బరస్ట్ను అంచనా వేయడం చాలా కష్టమని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది చాలా చిన్న ప్రాంతంలో, తక్కువ సమయంలో సంభవిస్తుంది. సాధారణ వాతావరణ రాడార్ వ్యవస్థలు వీటిని కచ్చితంగా గుర్తించలేవు. కొన్ని ఆధునిక వాతావరణ ఉపగ్రహాలు, రాడార్లు, సూపర్ కంప్యూటర్ల సహాయంతో వీటిని అంచనా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధిక వర్షపాతం 42.3 శాతానికిపైగా గ్రేటర్ పరిధిలో ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా 42.3 శాతం వర్షపాతం నమోదైంది. ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. మొదటి రెండు నెలలు సాధారణ వర్షం కంటే లోటు వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత వర్షాలు ఊపందుకున్నాయి. వరసగా కుండపోత వర్షాలు ఈ సీజన్కు ఊపిరిపోసినట్లయింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్న్ ఒకటి నుంచి సెప్టెంబర్ 24 వరకు సాధారణంగా 593.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 844.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా అమీర్పేట్ 83 శాతం నమోదైంది. తిరుమలగిరి మండలంలో మాత్రం సాధారణం కంటే కేవలం 4 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదు ఇలా.. అర్బన్ మండలం సాధారణ కురిసిన శాతం వర్షపాతం వర్షపాతం (మి.మీ) (మి.మీ) అమీర్పేట్ 617.7 1130.6 83 ముషీరాబాద్ 599.6 1052.9 76 ఖైరతాబాద్ 610.4 1048.7 72 మారేడుపల్లి 596.0 1000.0 68 సికింద్రాబాద్ 595.2 992.5 67 మల్కాజిగిరి 536.2 883.1 65 శేరిలింగంపల్లి 609.1 973.7 60 షేక్పేట్ 595.1 944.5 59 హిమాయత్నగర్ 518.0 881.2 52 హయత్నగర్ 560.6 833.2 49 కాప్రా 535.7 799.9 49 కుత్బుల్లాపుర్ 605.4 891.8 47 కూకట్పల్లి 634.0 892.4 41 ఉప్పల్ 583.5 817.3 40 నాంపల్లి 601.1 833.5 39 సరూర్నగర్ 575.4 795.1 38 బండ్లగూడ 574.8 789.4 37 అల్వాల్ 537.1 719.8 34 ఆసిఫ్నగర్ 602.9 807.4 34 బహదూర్పురా 579.1 761.3 31 -
ఇంతకీ ఏం చేద్దాం?
సీఎం తిరిగే కేబీఆర్ పార్కు రోడ్డులో వరద సమస్య బంజారాహిల్స్: రెండు రోజుల క్రితం భారీగా కురిసిన కుండపోత వర్షానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని రహదారులన్నీ నడుం లోతు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఎక్కడి వరద అక్కడే అన్న చందంగా రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్కు సైతం అడ్డంకిగా మారాయి. సచివాలయం నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి 13 నిమిషాల్లో వెళ్లాల్సిన ముఖ్యమంత్రి సోమవారం రాత్రి 1.15 గంటల సమయంలో తీవ్ర ట్రాఫిక్ మధ్యలో నుంచి వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వరద నీటితో పాటు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులతో పాటు కేబీఆర్ పార్కు చుట్టూ పొంగిపొర్లుతున్న వరద సమస్య తీవ్రంగా మారింది. కేబీఆర్ పార్కులో చెరువులతో పాటు కుంటలు నిండిపోయి వరదంతా రోడ్ల పైకి వస్తుండడంతో సమస్య తీవ్రమైంది. సీఎం రేవంత్రెడ్డి సైతం నడిరోడ్డులో ఆగిన కాన్వాయ్లో నుంచి ఈ పరిస్థితిని గమనించారు. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు వరదనీటికి చెక్ పెట్టేందుకు ఒకవైపు హైడ్రా అధికారులు, ఇంకోవైపు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యను పరిశీలిస్తున్నారు. ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. కేబీఆర్ పార్కులోంచి వస్తున్న వరదను శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ వైపు మళ్లించే యత్నాలపై కసరత్తు జరుగుతోంది. నెలరోజుల క్రితమే కేబీఆర్ పార్కు వద్ద భారీగా వరద నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ పర్యటించి కొత్త పైపులైన్లు వేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. యథావిధిగా రోడ్లను వరద ముంచెత్తుతూనే ఉంది. రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడ పర్యటించారు. ఇంతవరకు పనుల్లో కదలిక లేదు. తాత్కాలికంగా వరదను మళ్లించేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు ఇందిరానగర్ వైపు రోడ్డును తవ్వగా గుంతలన్నీ వరదతో నిండిపోయాయి. ఆ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దామా అని జలమండలి జీఎం ప్రభాకర్తో పాటు మేనేజర్లు రాంబాబు తదితరులు బుధవారం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పర్యటించారు. వీవీఐపీ రోడ్లలో వరదనీటి కాలువల వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ రోడ్డు కళ్లకు కడుతోంది. ఇదీ పరిస్థితి.. ● చాలాచోట్ల వరదనీటి కాలువల్లోకి డ్రైనేజీ పైప్లైన్లను కలిపినట్లు గుర్తించారు. ఐ ట్రిపుల్ సీ వద్ద ఎన్నడూ లేనంతగా నడుంలోతు నీరు నిలిచిపోతూ ట్రాఫిక్ను మళ్లించాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతుందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ● మరోవైపు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు రెండువైపులా ఇంతవరకు వరదనీటి కాలువలే నిర్మించలేదని తేలింది. దీని ప్రభావమే వరద రోడ్లను ముంచెత్తుతున్నట్లుగా నిర్ధారించారు. ● కేబీఆర్ పార్కులో నుంచి వస్తున్న వరదను కాలువల్లోకి తరలిద్దామంటే ఎక్కడా వాటి ఆచూకీ కనిపించడం లేదు. ● మంత్రులు తిరిగినా, ప్రజాప్రతినిధులు పర్యటించనా, అధికారులు పరిశీలిస్తున్నా సీఎం రేవంత్ తిరిగే రోడ్డులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ఈ సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. ● పైపులు వేద్దామంటే ఈ రోడ్డులో గంట పాటు తవ్వినా వేలాది వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇరిగేషన్, హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారు తప్ప వరద ముంపు నుంచి ఈ రోడ్డును కాపాడలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఓ వైపు మంత్రులు.. ఇంకోవైపు అధికారుల పర్యటనలు అధికారుల తర్జన భర్జనలు.. ఇంజినీర్లకు మింగుడుపడని వ్యవస్థ ఎంత వెతికినా కానరాని పరిష్కార మార్గాలు కేబీఆర్ పార్కులో చెరువులా నిండి రోడ్లపైకి పారుతున్న నీరు -
ఇక తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్
సాక్షి, సిటీబ్యూరో: తెలుగుతల్లి స్థానంలో తెలంగాణ తల్లిని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును సైతం తెలంగాణ తల్లిగా మార్చింది. నగరంలోని సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు లోయర్ ట్యాంక్బండ్ నుంచి సెక్రటేరియట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, మెహిదీపట్నం తదితర ప్రాంతాలవైపు వెళ్లేందుకు పయ్రాణించే తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. అది సైతం హడావుడిగా టేబుల్ అజెండాలో చేర్చి ఆమోదించింది. ఇటీవలే అన్నపూర్ణ పేరిట ఉన్న రూ.5 భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చడం తెలిసిందే. ఫ్లై ఓవర్ పేరు మార్పుతో సహా 14 అజెండా అంశాలు, 10 టేబుల్ అజెండా అంశాలతో కలిపి మొత్తం 24 అంశాలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. కమిషనర్ కర్ణన్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఆమోదం పొందిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవీ.. అల్వాల్ సర్కిల్లోని చిన్నరాయుని చెరువు నుంచి దినకర్ నగర్ వరకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. మల్లేపల్లిలో రూ. 4.85 కోట్ల వ్యయంతో ఫుట్బాల్ గ్రౌండ్ ఆధునికీకరణ. మౌలాలిలో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయ భవనం ఒకటో అంతస్తులో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు. సుబాష్ చంద్రబోస్ నగర్, ఆదిత్య నగర్ (మాదాపూర్)లో రూ. 2.80 కోట్ల వ్యయంతో శ్మశాన వాటికల అభివృద్ధి. శిల్పా హిల్స్ (ఎస్సీ శ్మశాన వాటిక), కృష్ణానగర్ (హిందూ శ్మశాన వాటిక)ల అభివృద్ధి. అంచనా వ్యయం రూ.2.40 కోట్లు. వీధిదీపాల నిర్వహణ ప్రస్తుతం నిర్వహిస్తున్న వారికే మరో మూడు మాసాల పొడిగింపు. ట్రేడ్ బోర్డ్స్/ప్రకటన లైసెన్స్ల జారీ అధికారం డిప్యూటీ కమిషనర్లకు అప్పగింత. అప్పీల్ అధికారులుగా జోనల్ కమిషనర్లు. ఐటీ వింగ్ ద్వారా ప్రకటన మాడ్యూల్ సవరణ. సమావేశంలో పాల్గొన్న మేయర్, కమిషనర్ తదితరులు తెలుగు తల్లి పేరు మార్పునకు ఆమోదం మొత్తం 24 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఓకే -
కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి..
ప్రేమ వివాహం చేసుకుందని కూతురిపై అక్కసు కీసర: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న తమ కూతురిని అత్తారింటి నుంచి బలవంతంగా సినీఫక్కీలో ఆమె తల్లిదండ్రులు ఈడ్చుకెళ్లారు. అడ్డువచ్చిన బాధితురాలి భర్త, ఆయన కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపల్లికి చెంది జలగం ప్రవీణ్, ఇదే గ్రామానికి చెందిన శ్వేత ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం నచ్చని యువతి తల్లిదండ్రులు ప్రవీణ్ నుంచి తమ కూతురును ఎలాగైనా విడదీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం శ్వేత తల్లిదండ్రులు బాల నర్సింహ, మహేశ్వరి, మేనమామ మోహన్, తమ్ముడు సాయితో పాటు మరికొందరు ఉదయం 9 గంటల సమయంలో ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. ప్రవీణ్తో పాటు ఆయన తల్లి, కుటుంబ సభ్యుల కళ్లలో కారం చల్లి, తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేశారు. శ్వేతను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. ప్రవీణ్ పాటు ఆయన తల్లికి గాయాలయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమపై దాడికి పాల్పడి శ్వేతను బలవంతంగా కిడ్నాప్ చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు ప్రవీణ్ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. అత్తారింటి నుంచి ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు అడ్డొచ్చిన భర్త, కుటుంబ సభ్యులపై దాడి కీసర పరిధిలో సినీ ఫక్కీలో ఘటన -
ఆస్తి తగాదాలతో కక్ష..బాబాయ్ను హత్యచేసిన యువకుడు
● గంటల వ్యవధిలోనే నిందితుల పట్టివేత ● ఇద్దరిని రిమాండ్కు తరలించిన పోలీసులు రాజేంద్రనగర్: ఆస్తి తగాదాల నేపథ్యంలో స్నేహితుడితో కలిసి బాబాయ్ను చంపిన యువకుడిని రాజేంద్రనగర్ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక ప్రాంతానికి చెందిన మినాజుద్దీన్(35) గతంలో బతుకు తెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. హఫీజ్బాబానగర్లో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మినాజుద్దీన్ సోదరుడు ఎం.ఎం.పహాడీ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం అతను మృతి చెందాడు. గ్రామంలోని పొలం విషయమై మినాజుద్దీన్కు, అన్న కుటుంబానికి మధ్య గొడవ జరుగుతుంది. మంగళవారం రాత్రి మినాజుద్దీన్ పహాడీలోని సోదరుని ఇంటికి వెళ్లి వదినతో మాట్లాడాడు. అప్పుడే బయటి నుంచి వచ్చిన అన్న కుమారుడు ఆర్భాజ్ (19) ఇదే విషయమై చర్చించారు. గత వారం ఆర్భాజ్ ఓ విందుకు హాజరైన సమయంలో అక్కడే ఉన్న మినాజుద్దీన్ మధ్య మాటామాట పెరిగింది. ఆస్తి విషయంలో అడ్డు వస్తే ప్రాణాలను సైతం తీస్తానని మినాజుద్దీన్..ఆర్భాజ్ను హెచ్చరించాడు. దీనిని మనుసులో పెట్టుకున్న ఆర్భాజ్ మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన మినాజుద్దీన్తో మాట్లాడాడు. అనంతరం ఆర్భాజ్ తన స్నేహితుడు సులేమాన్కు ఫోన్ చేసి కారు తీసుకొని రమ్మన్నాడు. సులేమాన్ డ్రైవర్ కావడంతో కారు తీసుకొని ఎం.ఎం.పహాడీకి చేరుకున్నారు. ముగ్గురు కలిసి కారులో బయలుదేరగా..ఆర్భాజ్, మినాజుద్దీన్లు మొదట ఆరాంఘర్లోని ఓ హోటల్లో టీ తాగారు. అనంతరం సులేమాన్ కారు నడపగా...ముగ్గురూ మాట్లాడుకుంటూ అర్ధరాత్రి నాంపల్లికి చేరుకున్నారు. నాంపల్లి ప్రాంతంలో మద్యం తాగి తిరుగు ప్రయాణమయ్యారు. మద్యం మత్తులో గ్రామంలోని పొలం విషయమై మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే కత్తిని తన వద్ద ఉంచుకున్న ఆర్భాజ్ తన ముందు సీట్లో కూర్చున్న మినాజుద్దీన్ గొంతు కోశాడు. విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం శవాన్ని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సబ్ రోడ్డుపై వేసి ఇంటికి వెళ్లిపోయారు. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మినాజుద్దీన్ మృతదేహాన్ని చూసి స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ను రప్పించి పూర్తి వివరాలను సేకరించారు. నిందితుడి వద్ద ఉన్న సెల్ఫోన్, గుర్తింపు కార్డులతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మినాజుద్దీన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారంతో ఆర్భాజ్ను పట్టుకొని విచారణ చేయగా తన స్నేహితుడు సులేమాన్తో కలిసి హత్య చేసినట్లు వెల్లడించాడు. నిందితులు ఉపయోగించిన కారుతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇరువురిని రిమాండ్కు తరలించారు. -
ముక్కు..నోరు మూసుకోవాల్సిందే!
సుల్తాన్బజార్: ఇప్పుడు కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్తే ముక్కు..నోరు మూసుకోవాల్సిందే. లేదంటే కంపు వాసనతో కడుపులో తిప్పడం ఖాయం. ఎందుకంటే ఆస్పత్రి ప్రాంగణంలో మురుగునీరు వరదలా మారి ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురుగునీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వెయ్యి మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందుతుంటారు. అయితే ఆసుపత్రిలోని క్యూలైన్ వద్ద, ఆసుపత్రి క్యాంటీన్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిల్వ ఉంటున్నది. ప్రభుత్వం పంపిణీ చేసే ఆహారం సైతం మురుగునీటిలోనే రోగులకు అందజేస్తుండడంతో దుర్వాసనతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. వారం రోజులుగా ఆసుపత్రిలో మురుగు నీరు ప్రవహిస్తుండడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం మూసీ నదిని తలపిస్తోంది. డీఎంఈ దృష్టికి వెళ్లినా... మురుగు నీటి దుర్గంధం కారణంగా ఆసుపత్రికి వచ్చే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగం నయం చేసుకునేందుకు వస్తే కొత్త వ్యాధులు సోకుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు సైతం దుర్వాసన భరించలేక మాస్క్లు పెట్టుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం డీఎంఈ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రిని సందర్శించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పినా ఆసుపత్రి, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఈఎన్టీ ఆసుపత్రిలో మురుగునీటి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. పొంగిపొర్లుతున్న డ్రైనేజీ నీరు దుర్వాసనతో రోగుల బెంబేలు వారం రోజులుగా ఇదే దుస్థితి పట్టించుకోని ఆసుపత్రి, జీహెచ్ఎంసీ అధికారులు -
రసవత్తరంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఎన్నికలు
అబిడ్స్: నగరంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్బాబు ఏకగ్రీవంగా ఎన్నికై నప్పటికీ మిగతా పాలకవర్గ కార్యవర్గానికి ఈ నెల 26న శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఎగ్జిబిషన్ సొసైటీకి ఎన్నికలు జరుగుతాయి. దాదాపు ప్రతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ ఈ సంవత్సరం అధ్యక్ష పదవి మినహా ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, 7 మంది మేనేజింగ్ కమిటీ సభ్యుల పోస్టులకు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు రావడంతో శుక్రవారం ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గంలోని కొందరి నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన సభ్యులు కొత్త పాలకవర్గం కావాలని, మార్పు కోరుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే కొంతమంది సభ్యులు లిఖిత పూర్వకంగా వివరణలు కోరినప్పటికి ప్రస్తుత పాలకవర్గం ఇప్పటి వరకు సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తుంది. వారి ఏకపక్ష నిర్ణయాలపై రాబోయే జనరల్బాడీ సమావేశంలో ప్రశ్నించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కొంత మంది సభ్యులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా స్టాళ్ల అద్దెలు, ప్రవేశ రుసుములను పెంచి తాము ఆదాయాన్ని పెంచినట్లు కొంతమంది పేర్కొనగా..అధికమంది సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. స్టాళ్ల అద్దెను గత రెండు మూడు సంవత్సరాలలో అడ్డగోలుగా పెంచడంతో పలు రాష్ట్రాల నుంచి వచ్చే స్టాళ్ల నిర్వాహకులు, పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలలకే ఆర్థిక సహాయం? ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 20 విద్యాసంస్థలు తెలంగాణ రాష్ట్రం నలుమూలలా కొనసాగుతున్నాయి. కానీ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్ని విద్యాసంస్థలకు పంపిణీ చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిద్దరు సభ్యులు తమకు నచ్చిన కళాశాలలకు పెద్ద ఎత్తునఫండ్స్ ఇస్తూ మిగతా కళాశాలలకు ఫండ్స్ ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒకరిద్దరు సభ్యులు కొన్ని సంవత్సరాలుగా అన్నీ తామై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారి నియంతృత్వ వైఖరితోనే ఎన్నికలు అనివార్యమయ్యాయని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. కాగా 1938 సంవత్సరంలో అప్పటి నిజాం కాలంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడింది. 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీకి 277 మంది సభ్యులు ఉన్నారు. రేపు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఇప్పటికే అధ్యక్ష పదవి ఏకగ్రీవం మిగతా పదవులకు తప్పని పోటీ -
బత్తుల ప్రభాకర్ ఎక్కడ?
గచ్చిబౌలి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి సోమవారం రాత్రి ఎస్కేప్ అయిన అంతరాష్ట్ర నేరగాడు బత్తుల ప్రభాకర్ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతడు ఆఖరుసారిగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 1న చిక్కాడు. ఇళ్లతో పాటు కాలేజీలను టార్గెట్గా చేసుకుని చోరీలు చేసే ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 86 కేసులు ఉన్నాయి. ప్రభాకర్ ఎస్కేప్పై అక్కడి దేవరపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇతగాడి కోసం ఏపీ పోలీసులు దాదాపు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభాకర్ సుదీర్ఘకాలం హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖరీదైన నివాసాల్లో జీవించాడు. ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అనేక మందితో సన్నిహితంగా మెలిగాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీ పోలీసులు అతడి కోసం నగరంలోనూ గాలిస్తున్నారు. మరోపక్క ఈ కరుడుగట్టిన ఖరీదైన దొంగ మరో నేరం చేయకుండా పట్టుకోవాలని నిర్ణయించుకున్న మూడు కమిషనరేట్ల అధికారులు సీసీఎస్, టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ బృందాలను అప్రమత్తం చేశాయి. ప్రిజం పబ్ వద్ద ఇతడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ప్రభాకర్ కోసం గాలించే బృందాల వద్ద కచ్చితంగా తుపాకీ ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆరా తీస్తున్న మూడు కమిషనరేట్ల అధికారులు -
కుండపోత బీభత్సం
నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు. వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాిఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. – సాక్షి, సిటీబ్యూరోరాత్రి 12 గంటల వరకు వర్షపాతం ఇలా.. -
హైడ్రాలో ప్రజాపాలన దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు గుర్తిస్తూ వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. బుద్ధ భవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన రంగనాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ‘1948 సెప్టెంబరు 17న భారత ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సందర్భం నాటి పోరాట పటిమకు నిదర్శనం. దాన్ని ప్రజాపాలనకు హారతి పట్టిన రోజుగా అభివర్ణించవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రతి ఏటా ఆ రోజున ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి. హైడ్రాలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి. వారి సమస్యల పరిష్కా రానికి పెద్దపీట వేయాలి. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే’ అని రంగనాథ్ అన్నారు. -
7న హెచ్సీయూ 25వ స్నాతకోత్సవం
రాయదుర్గం: వచ్చే నెల 7న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) 25వ స్నాతకోత్సవాన్ని గచ్చిబౌలి శాంతి సరోవర్లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హెచ్సీయూ చాన్స్లర్ జిస్టిస్ ఎల్ నర్సింహ్మరెడ్డి, వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర శాస్త్ర , సాంకేతిక మంత్రిత్వశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారు. సుమారు 1,700 మంది గ్రాడ్యుయేట్లకు వివిధ కోర్సులలో డిగ్రీలు, ప్రతిభ చాటిన వారికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవంలో వ్యక్తిగతంగా డిగ్రీలను పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని హెచ్సీయూ అధికారులు సూచించారు. -
హైదరాబాద్ను అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచంలోనే హైదరాబాద్ను అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఉద్యోగుల నుద్దేశించి మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం రాజరిక, నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలనకు అడుగులు పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 50 వేలకు పైగా పేద కుటుంబాలకు ఇటీవల రేషన్కార్డులను పంపిణీ చేశామన్నారు. మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ ప్రక్షాళన, హై సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే మేటి నగరంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అదనపు కమిషనర్లు కె. వేణు గోపాల్, గీతా రాధిక, సీసీపీ శ్రీనివాస్ , చీఫ్ ఇంజినీర్లు సహదేవ్ రత్నాకర్, నిత్యానంద్, విజిలెన్స్ ఏఎస్పీ సుదర్శన్ , డీఎస్పీ నరసింహరెడ్డి, ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం పాల్గొన్నారు. -
ఎవరిది పాపం.. ఎవరికి శాపం ?
ఎన్నేళ్లయినా తప్పని నాలా చావులుసాక్షి, సిటీబ్యూరో ముషీరాబాద్ పార్సీగుట్ట ప్రాంతంలో దినేశ్, మల్లేపల్లి అఫ్జల్ సాగర్ ప్రాంతంలో అర్జున్, రామ అనే ముగ్గురు యువకులు నాలాల్లో గల్లంతై నాలుగు రోజులైనా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ మొక్కుబడి ప్రకటనలు తప్ప అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు వివిధ ప్రభుత్వ విభాగాలు అందుకు కారణం తాము కాదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. నాలాల వెంబడి ఉండే పేదలు, అమాయకుల ప్రాణాలు నాలాల్లో కలిసిపోతున్నాయి. కనీసం కడసారి చూసుకుందామనుకున్నా.. మృతదేహాలు జాడ కనిపించడం లేదు. దాదాపు 15 వేల ఆక్రమణలు.. నగరంలో నాలాల సమస్యలు ఈనాటివి కావు. వరద ముప్పునకూ అవే కారణం కావడంతో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాల నుంచీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు మారడం.. రూ.కోట్లు ఖర్చయ్యాయి తప్ప పాతికేళ్లయినా ప్రజల ప్రాణాలు పోవడం ఆగలేదు. అసలు నాలా సమస్య పరిష్కారానికి కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూషన్స్ నివేదికలే కీలకమైనా.. నేతలు తమ ఓట్ల కోసం వాటికి డీవియేషన్లు చేశారు. దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లేకుండా పోయింది. డ్రోన్లతో సహ వివిధ సర్వేలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 15వేల ఆక్రమణలు తొలగించనిదే సమస్య పరిష్కారం కాదు. నిధులు సైతం రూ.20వేల కోట్లు అవసరం. కానీ.. ఆక్రమణలు తొలగిస్తే ఓట్లు రాలవనే తలంపుతో ఏ ప్రభుత్వంలోని వారైనా ప్రత్యామ్నాయంగా పనులు దారి మళ్లించడమో, నాలాలను విస్తరించే బదులు లోతు పెంచడమో వంటి ఆలోచనలే చేశారు. ఇందుకు ఏపార్టీ మినహాయింపు కాదు. అధికార యంత్రాంగం సైతం ఎప్పుడో సంభవించే ప్రమాదాల కోసం అంత భారీ పనులు నెత్తికెత్తుకోలేమనే ఆలోచనలే చేశాయి. దాంతో సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లేకుండాపోయింది. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా.. దాదాపు రూ. 15వేల కోట్లు ఖర్చయ్యే పరిష్కారాల బదులు ఖర్చు తగ్గే ప్రణాళికలు వేశారు. ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీ(వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) పేరిట దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ, కనీస భద్రత చర్యలు మాత్రం గాలికొదిలారు. అశ్రద్ధ.. నిర్లక్ష్యం ఇటీవలే బంజారాహిల్స్లో నాలా కప్పు కూలి లారీ దిగబడింది. అదృష్టవశాత్తూ అప్పుడు ప్రాణాపాయం తప్పింది. ఆ ఘటనతోనైనా అప్రమత్తమయ్యారా? అంటే కాలేదనే చెప్పాలి. నాలాలకు ఎక్కడ కప్పులు సరిగా లేవో, ఎక్కడ రిటైనింగ్ వాల్స్ దెబ్బతిన్నాయో తనిఖీలు చేసి తగిన మరమ్మతులు చేయడం.. కనీసం సదరు ప్రాంతాల్లో మెష్లు, హెచ్చరికల బోర్డుల వంటివి ఏర్పాటు చేసినా ప్రమాదకర నాలా ఉన్నట్లు తెలుస్తుంది. కనీసం ఆ పనులు కూడా చేయలేదు. గొప్పయితే తాము.. తప్పయితే కాదు ఇటీవల నాలాలకు సంబంధించిన బాధ్యతలు కూడా హైడ్రాకు అప్పగించడంతో జీహెచ్ఎంసీ నాలాలపై దృష్టి సారించడంలేదు. నాలాల్లో పూడికతీత పేరిట ఏటా రూ.50 కోట్లకు పైగా ఖర్చవుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. చెత్త పనులూ కారణమే.. నగరంలోని నాలాల్లో నానాల రకాల చెత్త కుమ్మరిస్తున్న ప్రజలు కూడా సమస్యలకు కారకులే. ఆహార వ్యర్థాల నుంచి మొదలు పెడితే పరుపుల దాకా నాలాల్లో కుమ్మరిస్తుండటంతో వర్షాలొచ్చినప్పుడు పొంగిపొర్లుతున్నాయి. అవగాహన లేమి చాలామంది అధికారులకే నగరంలోని నాలాల గురించి సరైన అవగాహన లేదు. ఏ నాలా ఎక్కడ మొదలై, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. నాలాలకు సంబంధించిన ఇన్వెంటరీ కూడా లేకపోవడం శోచనీయం. ఆక్రమణలు ప్రధాన కారణం ఇక నాలాల ఆక్రమణలకు అంతే లేదు. నాలాలను ఆక్రమించి పలు బహుళ అంతస్తుల భవనాలు నగరంలో కోకొల్లలు. నాలా అంచుల వెంబడే ఉన్న భవనాలకూ లెక్కేలేదు. ప్రజలు సైతం.. నాలాల ప్రాంతాల్లో ఉండే ప్రజలు సైతం ఆస్తుల సేకరణకు అంగీకరించడం లేదు. ఎంతోకాలంగా ఉంటున్న సొంత స్థలాన్ని వదులుకోవడానికి వారు ససేమిరా అంటున్నారు. ప్రమాదాలు జరిగినా తమకే కదా .. అంటున్న వారూ ఉన్నారు. వేలాది కిలోమీటర్లు నగరంలో అక్కడా ఇక్కడా అని కాదు. అన్ని ప్రాంతాల్లో దాదాపు 5వేల కిలోమీటర్ల మేర నాలాలున్నాయి. అధికారుల లెక్కల మేరకు.. నాలాల పొడవు: 1302 కిలోమీటర్లు మేజర్ నాలాల పొడవు : 393 కిలోమీటర్లు బఫర్జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు: 28,000 కప్పుల్లేవ్.. రక్షణ చర్యల్లేవ్ రెండు మీటర్లలోపు వెడల్పు ఉండే నాలాలన్నింటికీ పైకప్పులుండాలి. కానీ, చాలా ప్రాంతాల్లో లేవు. నేరేడ్మెట్ నాలాలో పడి బాలిక మరణించినప్పుడు అన్నింటిికీ పైకప్పులు వేస్తామని ప్రకటించినా, ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. ముషీరాబాద్ నాలాకు కూడా పైకప్పు లేదు. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుండే నాలాల్లో ప్రజలు పడిపోకుండా, వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వాటిని విస్మరించారు. ఏదీ నాలా సేఫ్టీ ? గతంలో ప్రతియేటా వర్షాకాలానికి ముందే తమ పరిధిలోని నాలాలన్నింటినీ ఇంజినీర్లు స్వయంగా కాలినడకన తిరిగి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతచర్యలు తీసుకునేలా చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో, పూర్తిస్థాయిలో కాకపోయినా ప్రమాదాల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం నాలా సేఫ్టీ అనేది పూర్తిగా విస్మరించారు. దారుస్సలాం వద్ద నాలా దుస్థితి ముగ్గురు గల్లంతై నాలుగు రోజులు ఇప్పటికీ ఆచూకీ దొరకని దైన్యం తిలా పాపం తలా పిడికెడు వైనం రూ.కోట్లు ఖర్చయినా తీరని సమస్యలు -
లోన్ తీసుకుని లూటీ చేశారు!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. బాధితులు ఊహించని, వారి ఊహకు అందని విధంగా పంజా విసురుతున్నారు. సెల్ఫోన్లలోని ఏపీకే ఫైల్స్ పంపి, వారి ఖాతాలకు ఖాళీ చేస్తున్న నేరాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే బాధితుల నెట్ బ్యాంకింగ్ను వాడి, వారి ప్రయేయం లేకుండానే వారి పేరుతో రుణం తీసుకుని, ఖాతాలో పడిన తర్వాత, సేవింగ్స్తో కలిపి కాజేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఈ పంథాలో రూ.12.75 లక్షలు కోల్పోయిన సికింద్రాబాద్ వ్యక్తి ఈ నెల 2న సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తాజాగా రూ.13 లక్షలు కోల్పోయిన మరో బాధితుడు బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మారేడ్పల్లి ప్రాంతానికి చెందిన బాధితుడి (45) ఫోన్కు సైబర్ నేరగాళ్లు ఇటీవల ‘ఈ చలాన్ ఆర్టీఓ.ఏపీకే’ పేరుతో ఉన్న లింకు పంపారు. దీనిపై అవగాహన లేని ఆ బాధితుడు అది ఈ–చలాన్లకు సంబంధించిన యాప్ అని భావించి క్లిక్ చేశారు. ఆ వెంటనే అందులో ఉన్న ఏపీకే ఫైల్ బాధితుడి ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇలా బాధితుడి ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఆయనకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నెట్ బ్యాంకింగ్ను యాక్సస్ చేశారు. ‘పే యూ మనప్పుడు ఫిన్’ పేరుతో ఉన్న వారి ఖాతాను బెనిఫిషియరీ అకౌంట్గా యాడ్ చేసుకున్నారు. లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు సైతం నేరగాళ్లు చూడగలగటంతో బాధితుడి నెట్ బ్యాంకింగ్ ద్వారానే రూ.12.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం మంజూరై బాధితుడి ఖాతాలో పడింది. దీంతో పాటు అప్పటికే ఖాతాలో ఉన్న సేవింగ్స్ రూ.50 వేలు కలిపి మొత్తం రూ.13 లక్షలు స్వాహా చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు వరుసపెట్టి అందుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. అతడి ఫోన్ అధ్యయనం చేసిన అధికారులు ఈ ఏపీకే ఫైల్తో కూడిన యాప్ గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏపీకే ఫైల్ ద్వారా కథనడిపిన కేటుగాళ్లు బాధితుడి ప్రమేయం లేకుండానే రుణం మొత్తం రూ.13 లక్షలు స్వాహా చేసిన వైనం -
‘మణి’కొండ చుట్టే‘అవినీతి అనకొండలు’!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని ‘మణి’కొండ చుట్టే ‘అవినీతి అనకొండలు’ పాగా వేశాయి. ఇప్పటి వరకు ఎవరికీ కన్పించకుండా పుట్టలో దాగి ఉన్న ఈ అనకొండలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చి ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం రూ.నాలుగు లక్షలు తీసుకుంటూ వారం రోజుల క్రితం నార్సింగి మున్సిపల్ కార్పొరేషన్ టీపీఓ మణిహారిక ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోకముందే..మంగళవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇబ్రహీంబాగ్ ఆపరేషన్స్ ఏడీఈ అంబేద్కర్ను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా బుధవారం ఆయన సన్నిహితుడిగా పేరొందిన చేవెళ్ల ఏడీఈ రాజేష్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది. బాత్రూంలో రూ.20 లక్షల నగదు సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తప్పించినా..తప్పుకోకుండా... ఏడీఈ అంబేద్కర్ 1998లో ఏపీఎస్ఈబీ ద్వారా ఖమ్మంలో తొలి పోస్టింగ్ సంపాదించారు. ఆ తర్వాత డిప్యూటేషన్పై జీహెచ్ఎంసీకి ఏఈగా వచ్చారు. ఏడీఈగా పదోన్నతి పొందిన తర్వాత డిస్కంలోకి అడుగుపెట్టారు. పటాన్చెరు, కేబీహెచ్పీ, గచ్చిబౌలిలో కీలక పోస్టుల్లో పని చేశారు. ఆయన సర్వీసు అంతా ఫోకల్ పోస్టుల్లోనే కొనసాగారు. అయితే ఇబ్రహీంబాగ్, మణికొండ, గచ్చిబౌలి డివిజన్లపై గత ఏడాది డిస్కం ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహా అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడటంతో ఈ అంశాన్ని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సీరియస్గా తీసుకున్నారు. అప్పట్లోనే గచ్చిబౌలి డీఈని బదిలీ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో ఏడీఈ అంబేద్కర్ను సైతం మరో చోటికి బదిలీ చేశారు. ఆయినా..వెళ్లకుండా ప్రభుత్వంలోని పెద్దలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఆయన అదే పోస్టులో కొనసాగుతూ వచ్చారు. సాధారణంగా మూడేళ్లు ఫోకల్ పోస్టులో పని చేస్తే..ఆ తర్వాత ఆ పోస్టులో ఉంచరు. కానీ ఏడీఈ అంబేద్కర్ విషయంలో ఇవేవీ అమలు కాలేదు. ఏడీఈగా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతి నెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతూ..తన బినామీలతో యూజీ కేబుల్ వర్క్ చేయించి పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన ఇళ్లు సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. చేవెళ్ల ఏడీఈ ఇంట్లోనూ సోదాలు? ఇబ్రహీంబాగ్ డివిజన్ చిలుకూరు సెక్షన్ ఏఈగా పని చేసి, ఇటీవలే పదోన్నతిపై చేవెళ్ల వెళ్లిన ఏడీఈ రాజేష్... అంబేద్కర్కు సన్నిహితుడని సమాచారం. మారేడుపల్లిలో నివాసం ఉంటున్న రాజేష్ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. బాత్రూమ్లో రూ.17 లక్షల నగదు సహా కీలక స్థిరాస్తి డాక్యుమెంట్లు లభించినట్లు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు ఈ అంశాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఏసీబీ వలకు వరుసగా చిక్కుతున్న అవినీతి తిమింగలాలు.. నార్సింగి టీపీఓ అంశాన్ని మర్చిపోక ముందే తాజాగా మరొకరు సంచలనం సృష్టించినఏడీఈ అంబేద్కర్ ఉదంతం చేవెళ్ల ఏడీఈ ఇంట్లోనూ తాజాగా సోదాలు? -
నాలాలపై ఆక్రమణలు తొలగించాలి
నాంపల్లి: భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల క్రితం వరదలో కొట్టుకుపోయిన అఫ్జల్సాగర్ మాన్గార్ బస్తీకి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలను బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అఫ్జల్సాగర్ నాలా పరివాహక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. నాలాలో గల్లంతైన వారిని గుర్తించేందుకు సెర్చ్ ఆపరేషన్ను వేగవంతం చేయాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. అలాగే హబీబ్నగర్ నాలా, అఫ్జల్సాగర్ నాలాల వెంబడి ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. మురికివాడలపై ప్రత్యేక దృష్టిని సారించాలని, కూలడానికి సిద్ధంగా ఉన్న వాంబే గృహాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఆవాసం కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. మురికివాడల్లో స్వచ్ఛత కనపించడం లేదని, మురికి కూపంలా మారిన బస్తీలను కాస్త పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పూడికతీత పనులు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, దోమలు, ఈగలు విజృంభించకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అఫ్జల్సాగర్, మాన్గార్ బస్తీల భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆసిఫ్నగర్ తహసీల్దార్ జ్యోతి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జిల్లా అధ్యక్షులు లంకల దీపక్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్చంద్ర, డివిజన్ అధ్యక్షులు మధు, స్థానిక బీజేపీ నేతలు గోపి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదేశాలు అఫ్జల్సాగర్ నాలా బాధితులకు పరామర్శ -
ఆటోల దొంగ అరెస్ట్
మేడ్చల్ రూరల్: చెడు వ్యసనాలకు బానిసై..డబ్బుల కోసం ఆటోలను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం..లింగాపూర్ గ్రామానికి చెందిన కొరుపతి శ్రీరాములు అలియాస్ రాము కొంత కాలంగా దుండిగల్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాము తన జల్సాలు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా స్టీరింగ్ లాక్ (తాళం) లేని ఆటోలను దొంగిలించేందకు ప్లాన్ వేసుకుని మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో ఆటోలను దొంగలించారు. ఇటీవల మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఆటో దొంగిలించగా పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న రామును అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అతని వద్ద నుండి మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్కు తరలించారు. -
అందుబాటులోకి టెలీ రోబోటిక్ సర్జరీలు
సాక్షి, సిటీబ్యూరో: ‘రోబోటిక్ సర్జరీలు చేశాం..టెలీ సర్జరీల గురించి విన్నాం...ఈ రెండింటిని కలపి సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఖచ్చితత్వంతో కూడిన టెలీ రోబోటిక్ సర్జరీ చేయడం కొత్త టెక్నాలజీ’ అని ప్రీతీ కిడ్నీ ఆసుపత్రి ఎండీ చంద్రమోహన్ అన్నారు. బుధవారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే కిడ్నీ సమస్య ఉన్న 16 నెలల బాలుడికి చికిత్స చేయాల్సి వచ్చిందన్నారు. అయితే గురుగ్రాంలో ఉన్న తాను కొండాపూర్ ప్రీతి ఆసుపత్రిలో ఉన్న బాలునికి టెలీ–రోబోటిక్ పద్ధతిలో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశానని చంద్రమోహన్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. మరో కేసులో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఓ మహిళకు గర్భసంచి తొలగించిన తరువాత సమస్య రావడంతో తమను సంప్రదించారని, ఆమెకు టెలీ–రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ప్రీతి ఆసుపత్రి ఈడీ డా.రూప, సీఈఓ రంగప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
మ్యాన్హోల్లో పడిన చిన్నారి..
తప్పిన ప్రాణాపాయం యాకుత్పురా: పాఠశాలకు వెళ్తున్న ఓ చిన్నారి ప్రమాదశాత్తు డ్రైనేజీ మ్యాన్హోల్లో పడి స్వల్ప గాయాల పాలైన ఘటన గురువారం యాకుత్పురాలో జరిగింది. యాకుత్పురా గంగానగర్ నాలా మౌలా కా చీల్లా ప్రాంతానికి చెందిన సల్మాన్ కుతూరు జైనాబ్ ఫాతిమా (5) స్థానిక పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. గురువారం ఉదయం నానమ్మతో కలిసి పాఠశాలకు బయలుదేరింది. రోడ్డుపై ఉన్న మ్యాన్హోల్ పైకప్పు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. దీంతో ఆమె నానమ్మ, స్థానికులు వెంటనే చిన్నారి ఫాతిమాను పైకి లాగి కాపాడారు. స్వల్ప గాయాల పాలైన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జలమండలి, హైడ్రా విభాగాల అధికారులు సిబ్బందితో మౌలాకా చీల్లా ప్రాంతాంలో డ్రైనేజీ మ్యాన్హోళ్ల పూడికతీత పనులు చేపట్టి పైకప్పు వేయకుండా వదిలేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తర్గట్టీ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ ఖాద్రీ డిమాండ్ చేశారు. మ్యాన్హోల్లో పడిపోతున్న చిన్నారి ఫాతిమా -
పని మనుషులే ప్రాణాంతకులై..
కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది మూసాపేట: కూకట్పల్లిలోని స్వాన్లేక్ అపార్టుమెంట్లో గృహిణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇంటి పని మనుషులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నా యి.. స్వాన్లేక్ అపార్టుమెంట్ 13వ అంతస్తులోని 1,311 బ్లాక్లో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు నివాసముంటున్నారు. బాలానగర్, జీడిమెట్లలో స్టీల్ సామాను వ్యాపారాన్ని రాకేష్ అగర్వాల్, తన కుమారుడు శుభంతో నిర్వహిస్తు న్నారు. రాకేష్ భార్య రేణు (50) ఇంట్లోనే ఒక్కరే ఉండేవారు. వీరి కూతురు తమన్నా అహ్మదాబాద్లో ఎంబీఏ చదువుతోంది. కొన్ని నెలల క్రితం రేణు అగర్వాల్కు అనారోగ్యంగా ఉండటంతో బరువు పనులు చేసుకోలేకపోతున్నారు. దీంతో పని మనిషిని నియమించుకోవాల్సి వచ్చింది. వీరు నివసించే పై అంతస్తులో ఉండే బంధువుల ఇంటిలో పని చేస్తున్న రోషన్కు తెలిసిన వ్యక్తి హర్ష్ (20)ని 11 రోజుల క్రితం రేణు ఇంటితో పా టు మరో ఇంట్లో పనిలో కుదిర్చాడు. వీరు రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉండేవారు. రేణు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఆమెను హత్య చేయాలని పథకం రచించారు. ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఇదే అపార్ట్మెంట్లోని 14వ అంతస్తులో బంధువుల ఇంటిలో రోషన్ 11 నెలలుగా పని మనిషిగా చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు ఉండటం, రేణు ఇంటిలో ముగ్గురు కుటుంబ సభ్యులే ఉండటాన్ని గమనించాడు. రేణు భర్త రాకేష్, కుమారుడు శుభం ఉదయమే బయటకు వెళ్లేవారు. దీంతో రేణు ఒక్కరే ఇంట్లో ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన రోషన్, హర్ష్లు ఇద్దరూ కలిసి రేణు హత్యకు పథకం పన్నారు. బుధవారం రేణు భర్త, కుమారుడు బయటికి వెళ్లిన అనంతరం అదను చూసుకున్న నిందితులు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి.. కుక్కర్తో తలపై మోది.. లాకర్ కోడ్ చెప్పాలంటూ హింసించారు. రెండు చేతులపై కత్తి గాట్లు, కడుపులో పొడిచిన గాట్లు, మెడను అత్యంత కిరాతకంగా కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. రేణు హత్య అనంతరం అనుమానితులిద్దరూ అక్కడే స్నానం చేసి దుస్తులు మార్చుకుని ఇంటికి తాళం వేసి లిఫ్ట్ నుంచి సెల్లార్లోకి వెళ్లారు. ఇంటి యజమాని స్కూటీపై బ్యాగ్తో పాటు ఇద్దరు పరారయ్యారు. లాకర్ ఓపెన్ చేసి డబ్బులు ఎంత మొత్తం దొంగిలించారో తెలియడంలేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం వెల్లడించలేదు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సుమారు 2 గంటల పాటు చక్కర్లు కొట్టి, స్కూటీని హఫీజ్పేటలో వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. స్నానం చేసి మరీ నింపాదిగా వెళ్లటంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం.. సుమారు 5 టీంలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్, ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు, బాచుపల్లి డీఐ, కూకట్పల్లి డీఐ, కేపీహెచ్బీ డీఐలు టీములుగా ఏర్పడి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. స్కూటీపై పరారవుతున్న అనుమానితులు కూకట్పల్లి పరిధిలో గృహిణి దారుణ హత్య మర్డర్ అనంతరం స్నానం చేసి బ్యాగ్తో పరారీ 5 టీంలతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం?
● ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం ● నాలా ప్రాంతాల్లోనూ అశ్రద్ధే.. ప్రాణాలు పోతున్నా అంతేనా వర్షాలు కురుస్తున్నా తెరిచి ఉంచుతున్న మ్యాన్హోళ్ల మూతలు సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయా ప్రభుత్వ విభాగాలు చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గురువారం ఐదేళ్ల బాలిక మ్యాన్హోల్ గుంతలో పడటమే ఇందుకు నిదర్శనం. సకాలంలో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రతియేటా వర్షాకాలానికి ముందే వానలతో ప్రమాదాలు సంభవించకుండా నాలా ప్రాంతాల్లో భద్రత చర్యలు పరిశీలించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కప్పులు వేయడం, మెష్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆపనులు సవ్యంగా జరగడం లేదు. దాంతో పిల్లలు, పాదచారులు, కార్మికులు నాలాల్లో పడి మరణిస్తున్నారు. భద్రత కరువు తగిన రక్షణ ఏర్పాట్లు, భద్రత చర్యలు లేకపోవడంతోనే ఏడాది క్రితం కవాడిగూడ నాలాలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు సంవత్సరాల్లో ఓల్డ్బోయిన్పల్లిలో ఆనంద్సాయి, నేరేడ్మెట్లో సుమేధ, యాకుత్పురాలో జకీర్ అబ్బాస్ తదితర బాలలు నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. హైడ్రా నిర్వాకం గురువారం ఉదయం రెయిన్బజార్ డివిజన్ మౌలాకాచిల్లా ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక స్కూల్కు వెళ్తూ మూత లేకుండా ఉన్న మ్యాన్హోల్లో పడిపోయింది. బాలిక నానమ్మ, స్థానికులు గుర్తించి వెంటనే.. పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. జీహెచ్ఎంసీ నిర్వాకం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ మ్యాన్హోల్ పనులు తాము చేయడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. హైడ్రా సిబ్బంది మ్యాన్హోల్ను శుభ్రం చేసేందుకు బుధవారం మూత తెరిచారు. తిరిగి దాన్ని మూసివేయకుండా అలాగే వదిలేసి వెళ్లారు. సమన్వయ లేమి.. వరుస వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మ్యాన్హోళ్లు, నాలాల్లో పూడికతీత తదితర పనుల్ని జీహెచ్ఎంసీ చేసేది. రోడ్లపై నిల్వ నీటిని తోడిపోసేది. చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలో హైడ్రాకు మంచి పేరు రావడంతో వర్షాకాల సమస్యల పరిష్కార బాధ్యతల్ని కూడా జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించారు. దీంతో జీహెచ్ఎంసీ కేవలం రోడ్లపై గుంతల్ని మాత్రమే పూడస్తోంది. మిగతా పనులు చేయడం లేదు. నాలాలు, మ్యాన్హోల్స్, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైడ్రాకు సరైన అవగాహన లేదు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినప్పటికీ, విభాగాల మధ్య అధికారుల మధ్య అది సాధ్యమవుతున్నట్లు లేదు. హైడ్రా సిబ్బంది మిగతా విభాగాల కంటే తామే గొప్ప అనేవిధంగా పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
వీధిలో చెత్త వేశారో.. మీ ఇంటికి పోలీసులొస్తారు
● 2024 అక్టోబర్ 11: మాసబ్ట్యాంక్ ప్రాంతంలో అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్తకుప్ప నుంచి ఓ వీఽధికుక్క మాంసం తీసుకువెళ్తుండగా... ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయిందని తేలింది. ● 2025 ఫిబ్రవరి 12: టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ దేవాలయంలోనూ మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయం కొద్దిసేపట్లోనే దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అవాంఛనీయ ఘటలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మాంసం అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి చుట్టు పక్కల సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చెత్త కుప్పలో పడేసిన వ్యర్థాల నుంచి ఓ పిల్లి తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు వెలుగులోకి వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో నగరంలో తరచూ చోటుచేసుకుంటున్న ఇలాంటి ఉదంతాల నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎవరి ప్రమేయం, ఎలాంటి దురుద్దేశం, కుట్ర లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈ తరహా ఘటనలు శాంతిభద్రతల సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. గణేష్, దుర్గా నవరాత్రుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద ఇలా జరిగితే పరిస్థితులు చేతులు దాటిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, మాంసం ఆహార వ్యర్థాలు వేయడమే వీటికి మూలమనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిషేధం ఉన్నా పట్టించుకోని ప్రజలు... బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడంపై ఏళ్లుగా నిషేధం ఉంది. ఇలా చేసిన వారికి జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణీత మొత్తం జరిమానా విధించే అవకాశమూ ఉంది. గతంలో బల్దియా అధికారులు ఇంటింటికీ చెత్త డబ్బాలు కూడా పంచి పెట్టారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే విధానమూ అమలులో ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక మంది బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తున్నారు. గార్బేజ్ల వద్దే కాకుండా కాస్త ఖాళీ కనిపిస్తే చాలు అక్కడ డంప్ చేస్తున్నారు. ఇళ్ల నుంచి తీసుకువచ్చి పడేసే ఈ చెత్తలో ఆహార వ్యర్థాలు, మాంసం కూడా ఉంటున్నాయి. ఇలా బహిరంగ ప్రదేశాల్లో పారేసే చెత్తను క్లియర్ చేయడం, అలా వేయకుండా నియంత్రించడంలో జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన స్థాయిలో చర్యలు తీసుకోవట్లేదు. ఫలితంగానే ఎన్ని స్వచ్ఛ అవార్డులు గెల్చుకున్న నగరమైనా ఇప్పటికీ ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తుంటాయి. రంగంలోకి దిగిన పోలీసు విభాగం.. ఈ చెత్త వల్ల ఉత్పన్నం అవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం నియంత్రించాలని నిర్ణయించింది. దీనికోసం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను వినియోగించుకుంటోంది. ప్రతి ప్రాంతంలోనూ కాకపోయినా.. కొన్ని సున్నిత, కీలక ప్రాంతాలపై దృష్టి పెడుతోంది. ప్రధానంగా రెండు వర్గా లు, ప్రార్థన స్థలాలు ఉన్న చోట్ల ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా చెత్త వేస్తున్న వారిని స్థానిక పోలీసులు గుర్తించనున్నారు. ఆపై వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి సిఫార్సు చేయడమో, సిటీ పోలీసు చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవమో చేయనున్నారు. ప్రధానంగా వెస్ట్, సౌత్, సౌత్ వెస్ట్ జోన్లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ చర్య ల వల్ల అవాంఛిత ఘటనలు నిరోధించడంతో పా టు స్వచ్ఛ హైదరాబాద్ను సాధించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తీవ్ర ఇబ్బందులు తెస్తున్న ఆహార, మాంస వ్యర్థాలు కొన్నిసార్లు శాంతిభద్రతల సమస్యల వరకు.. నిఘా వేసి ఉంచాలని నగర పోలీసుల నిర్ణయం సీసీ కెమెరాలను సైతం వినియోగిస్తున్న కాప్స్ -
రూ.1000 కోట్ల మోసం..
ఇద్దరు నిందితుల అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: వ్యవస్థీకృత ఆర్థిక నేరాల నెట్వర్క్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్రేక్ చేశారు. కృత్రిమ మేధ ఆధారిత పెట్టుబడుల పేరిట సుమారు రూ.1,000 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఘరానా కేటుగాళ్లను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన గడ్డం వేణుగోపాల్, కర్ణాకటకు చెందిన శ్రేయాస్ పాల్ ఇరువురు కలిసి సైబరాబాద్ కేంద్రంగా నకిలీ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఐఐటీ క్యాపిటల్ టెక్నాలజీస్, ఏవీ సొల్యూషన్స్, శ్రీనివాస్ అనలిటిక్స్, ట్రేడ్ బుల్స్ టెక్నాలజీస్ వంటి రకరకాల పేర్లతో ఆన్లైన్లో నకిలీ కంపెనీలను నిర్వహిస్తున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నకిలీ సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రిజిస్ట్రేషన్లను సైతం సృష్టించారు. మధ్యతరగతి ఇన్వెస్టర్లను, ఐటీ నిపుణులు, రిటైర్డు ఉద్యోగులను నమ్మించేందుకు ప్రీమియం ఆఫీసులు, హోటళ్లలో సెమినార్లలో నిర్వహించేవారు. పెట్టుబడులపై ఏటా 84 శాతం రాబడిని అందిస్తామని మాయమాటలు చెప్పారు. స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్, కల్పిత ట్రేడింగ్ డాష్బోర్డ్ల ముసుగులో 2022 నుంచి 2025 మధ్య కాలంలో సుమారు 3 వేలకు పైగా బాధితుల నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులను వసూలు చేశారు. ఇన్వెస్టర్ల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును 21 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. ఆయా సొమ్ముతో ప్రాపర్టీలు, లగ్జరీ వాహనాలు, బంగారం కొనుగోలు చేశారు. ఈమేరకు పలువురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులు గడ్డం వేణుగోపాల్, శ్రేయాస్ పాల్లను అరెస్టు చేశారు. 20 మందికి పైగా ఏజెంట్లు, కన్సల్టెంట్లు, టెక్నికల్ డెవలపర్లు, వెబ్సైట్ నిర్వాహకులు ఈ నెట్వర్క్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం
జూబ్లీహిల్స్ టికెట్పై ఎమ్మెల్యే దానం వ్యాఖ్యలు బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆదర్శనగర్లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేస్తారని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి’ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. స్పందిస్తూ.. అవన్నీ ఊహాగానాలు కావచ్చన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, టికెట్ ఎవరికి వచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పని చేస్తామన్నారు. ప్రసుత్త పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎంతో అవసరమన్నారు. కొంతకాలంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దానం నాగేందర్ నిలిచే అవకాశం ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం అండదండ ఉండడంతో పాటు మైనార్టీ వర్గాల్లో సైతం ఆయనకు మంచి పరపతి ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దానం నాగేందర్కు సుమారు 85,000 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన జూబ్లీహిల్స్లో సులభంగా గెలిచే అవకాశం ఉందంటూ పార్టీ పెద్దలు సైతం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. -
14.9 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరి అరెస్టు సికింద్రాబాద్: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.18.47 లక్షల విలువచేసే 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు సాయీశ్వర్గౌడ్, సారస్వత్లు వెల్లడించిన వివరాల ప్రకారం..ఢిల్లీ చాందినీ చౌక్కు చెందిన చంద్రప్రకాశ్ అనే ఫుట్పాత్ వస్త్రవ్యాపారి, అదేప్రాంతానికి చెందిన జమీలాఖాతూన్లు స్నేహితులు. చంద్రప్రకాశ్ మాదకద్రవ్యాల వినియోగానికి బానిస అవగా, జమీలాఖాతూన్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వీరిరువురు గంజాయి రవాణా వ్యాపారం చేసి పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా చంద్రప్రకాశ్కు ఫేస్బుక్ ద్వారా ఫరాన్ఖాన్ అనే గంజాయి వ్యాపారి పరిచయం అయ్యాడు. అతని ద్వారా విజయనగరం వెళ్లిన వీరిద్దరు 14.9 కిలోల గంజాయి ప్యాకెట్లు సేకరించి విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఢిల్లీ రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాలులో వేచిచూస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ఇరువుర్ని రిమాండ్కు తరలించి గంజాయి విక్రయించిన ఫరాన్ఖాన్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. -
హెచ్సీఎస్సీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమ్మిట్–2025 నిర్వహించాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. ఈ నెల 18, 19 తేదీల్లో జల విహార్ కేంద్రంగా జరుగనుంది. దీనికి సంబంధించిన లోగోను నగర ట్రాఫిక్ విభాగం చీఫ్ జోయల్ డెవిస్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్లో వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులతో పాటు సాధారణ ప్రజలు సైతం పాల్గొనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షిత నగరాన్ని సాకారం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి కీలక సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు. ప్రైవేటు బస్సులో కీచక డ్రైవర్ శివాజీనగర (బెంగళూరు): బస్సులో ఒంటరిగా ప్రయాణించిన బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక డ్రైవర్కు బాలిక కుటుంబీకులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున బెంగళూరులో బసవేశ్వర సర్కిల్లో జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రైవేటు స్లీపర్ బస్సు బయల్దేరింది. అందులో ఓ బాలిక (15) బెంగళూరుకు వస్తోంది. మొబైల్ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో చార్జింగ్ చేయాలని డ్రైవర్ను కోరింది. కొంతసేపటి తరువాత బాలిక మొబైల్ ఇవ్వాలని అడిగితే, ముద్దివ్వాలని డ్రైవర్ ఆరిఫ్ (41) బాలికను ఒత్తిడి చేశాడు. తరువాత బాలిక తన సీటు వద్దకు వెళ్లి నిద్రపోయింది. డ్రైవర్ బాలిక వద్దకు వెళ్లి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది తట్టుకోలేక బాలిక తల్లికి ఫోన్ చేసి చెప్పింది. బస్సు సిటీకి రాగానే బాలిక తల్లి, సోదరుడు బస్సు నిలిపి డ్రైవర్ ఆరిఫ్ను ప్రశ్నించారు. డ్రైవర్ తప్పయిపోయిందంటూ చేతులెత్తి మొక్కి వేడుకున్నాడు. బాలిక కుటుంబీకులు అతన్ని చితకబాదారు. ఇంతలో పోలీసులు చేరుకొని డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ● ఒంటరి బాలికపై లైంగిక వేధింపులు ● చితకబాదిన కుటుంబీకులు ● హైదరాబాద్ టు బెంగళూరు బస్సులో ఘటన -
జింక కొమ్ముల విక్రయానికి యత్నం
సాక్షి, సిటీబ్యూరో: అరుదైన యాంటిలోప్ సెర్వికాప్రా జాతికి చెందిన జింక కొమ్ములు విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రెండు కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహ్మద్ ఖలీముద్దీన్ అలియాస్ సలీం వృత్తిరీత్యా తాపీ మేస్త్రి. బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చిన ఇతగాడు షహీన్నగర్లో ఓ పాన్షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సదాశివపేటకు రాకపోకలు సాగిస్తూ మేసీ్త్ర పని కూడా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడ ఓ ఇంటి కూల్చివేత పనులు చేస్తుండగా ఇతడికి జింక కొమ్ములు దొరికాయి. వీటిని సొంతం చేసుకుని సలీం నల్లరంగు కవర్లో చుట్టి నగరానికి తీసుకువచ్చాడు. తొలినాళ్లల్లో ఆ కొమ్ముల నుంచి చిన్న ముక్కలు వేరుచేసి పొడి చేసేవాడు. దీన్ని వినియోగిస్తే ఎముకలు పటిష్టం కావడంతో పాటు కొన్ని రోగాలు తగ్గుతామని నమ్మబలికి విక్రయించే వాడు. ఇటీవల రెండు కొమ్ముల్నీ విక్రయించాలని భావించిన సలీం ఖరీదు చేసే వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. దీనిపై తూర్పు మండల టాస్క్ఫోర్స్కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ ఎ.నాగార్జున నేతృత్వంలో ఎస్సైలు ఎం.అనంతాచారి, ఎస్.కరుణాకర్రెడ్డి తమ బృందాలతో వలపన్ని సలీంను పట్టుకున్నారు. అతడి నుంచి రెండు జింక కొమ్ములు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ -
‘విజయ్ శంకర్లాల్ జ్యువెలరీ’ నగలు దొరికాయి
● రూ.1.50 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం లక్డీకాపూల్: బషీర్బాగ్లోని విజయ్ శంకర్లాల్ జ్యువెలరీలో ఈ నెల 5న చోరీకి గురైన రూ.1.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొరికాయని, ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. గురువారం ఆమె ఇక్కడ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబైకి చెందిన రోనక్ చడ్వా గత ఏప్రిల్లో జ్యువెలరీ షాపులో పనికి చేరాడు. తనతో పాటు బెట్టింగ్లో నష్టపోయిన మహ్మద్ హస్నైన్ హబియాతో కలిసి కుట్రపన్ని ఈ నెల 5న జ్యువెలరీ షాపులో దొంగతనం చేశారు. దీనిపై 7న బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్తో కలిసి సైఫాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆభరణాలను రోనక్, మహ్మద్ హస్నైన్ హబియా దొంగిలించినట్లు గుర్తించి అరెస్టు చేశామని, నేరస్తులను ఏసీజేఎం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఆభరణాలన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నగరంలో నగల దుకాణాల్లో పనిచేసే వారిని సమగ్రంగా విచారించిన తర్వాతే నియమించుకోవాలని డీసీపీ సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ బీ.ఆనంద్ ,సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ కే. రాఘవేందర్, డీఐ ఎన్. రాజేందర్, డీఐ సైఫాబాద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
‘జూబ్లీహిల్స్ లయన్స్’ సేవలు భేష్
మాదాపూర్: విద్యార్థుల సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ సేవాతత్పరతను చాటుకుంది. ఈ మేరకు మాదాపూర్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం ఐరన్ షెడ్ నిర్మించారు. శనివారం ఈ షెడ్ను లయన్స్ జిల్లా గవర్నర్ 320డి లయన్ అమర్నాథ్రావు ప్రారంభించారు. ఈ నిర్మాణానికి లయన్ గిరిజారెడ్డి, డాక్టర్ పి.సీత, జయశ్రీ మూర్తి, జ్వాలా వైష్ణవి, మండవ శిల్ప విరాళాలు అందించారు. విద్యార్థుల సౌకర్యం కోసం నిర్మించిన ఈ షెడ్..విద్యాభివృద్ధికి లయన్స్క్లబ్ చూపుతున్న అంకితభావానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు లయన్ కోనేరు రామసుందరి, కార్యదర్శి లయన్ రిందా దేవి, హెడ్మాస్టర్ మోహన్రావు, నరసింహరాజు, రామమోహన్, సౌభాగ్య, మర్రి ప్రవీణ్, ఈవీ రమణ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన... మాదాపూర్లోని మండల ప్రాథమిక పరిషత్ స్కూల్లో లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి అధ్వర్యంలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ నాగరాజు, నరసింహరాజు, పద్మావతి త్రిపురనేనిలు మానసిక ఆరోగ్యంపై మార్గనిర్దేశం చేయగా, తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అంబర్పేట్ నిపుణులు విద్యార్థులకు సైబర్క్రైమ్స్, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్, కెరీర్ ప్రోగ్రెస్పై సుశ్మిత, సైబర్ ముప్పు, హ్యాకింగ్పై రాహుల్ వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ క్లబ్ అధ్యక్షుడు కోనేరు రామ సుందరి, హెడ్మాస్టర్ బసవలిగం తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ స్కూల్లో ఐరన్ షెడ్ ఏర్పాటు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన -
శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలోఅసాధారణ వృద్ధి
● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాలాపేట: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం అసాధారణ వృద్ధిని సాధిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. ఈ మేరకు సీఎస్ఐఆర్–ఐఐసీటీలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ 6వ ప్రాంతీయ సదస్సులో రెండో రోజు గురువారం గవర్నర్ పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. దేశంలో పరిశోధనలు, పేటెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. స్థిరమైన, నైపుణ్యంతో కూడిన సమానమైన ఆర్థికాభివృద్ది కోసం నూతన ఆవిష్కరణలు పెరగాలన్నారు. పరిశోధన, అభివృద్ధిని సులభతరం చేయడానికి విద్యా వ్యవస్థను సంస్థాగతంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, పద్మ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్, నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ వి.కె సారస్వత్, నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వివేక్ కుమార్ సింగ్, పలువురు శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..
బహదూర్ పురా: అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్లైన్ అధికారులకు ఏటా రూ.10 వేలు నగదు పురస్కారం అందిస్తామన్నారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు వృథా కానివ్వమన్నారు. గురువారం నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు ఆవరణలోని అమరవీరుల విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, రాష్ట్ర అటవీ ప్రధాన అధికారిణి డాక్టర్ సువర్ణలతో కలసి పాల్గొన్నారు. స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 1984 సంవత్సరం నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పచ్చదనం పెంపులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘వన మహోత్సవం’ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నమన్నారు. వనమహోత్సవం ద్వారా మన రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటికే నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారుల కృషి అభినందనీయమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేనిచోట, దట్టమైన అడవుల్లో వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అడవులను కాపాడుతున్నారన్నారని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలను స్మరించుకోవాలన్నారు. డీజీపీ డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ..అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాటిని కాపాడటమే అమరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి డాక్టర్ సువర్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు, పీసీపీఎఫ్ జౌహరి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, అడిషనల్ పీసీపీఎఫ్లు సి.శరవనణ్, , ప్రియాంక వర్గీస్, జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్, క్యురేటర్ జె.వసంత, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డాక్టర్ జి. రామలింగం, జీహెచ్ఎంసీ అర్బన్ ఫారెసీ్ట్ర డైరెక్టర్ సుభద్రాదేవి, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) డా.ఎం.ఎ. హకీమ్, డిప్యూటీ క్యురేటర్ బర్నోబా, అసిస్టెంట్ డైరెక్టర్ (వెట్) శ్రీనివాస్ , మాజీ క్యూరేటర్లు ఎ.శంకరన్, రాజశేఖర్, మాజీ డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, అసిస్టెంట్ క్యురేటర్లు నాజియా తబుసుమ్, ఎన్.లక్ష్మణ్, ఈపీఆర్ఓ హనీఫుల్లా, జూ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకం
కవాడిగూడ: స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిదాయకమని రాజ్యసభ సభ్యులు అనిల్కుమార్ యాదవ్ అన్నారు. గురువారం రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో స్వామి వివేకానంద హ్యుమన్ ఎక్స్లెన్సీ సిల్వర్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా సంప్రీతి దివస్ పేరిట యూత్ కన్వెన్షన్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అనిల్కుమార్ యాదవ్ మాట్లాడారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో చేసిన ప్రసంగం ప్రపంచాన్నే ఆకర్షించిందన్నారు. ఆయన స్ఫూర్తితో రామకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశంలోని ఆధ్యాత్మికత, సహనం, ఐక్యత వంటి అంశాలను తన ప్రసంగం ద్వారా వివేకానందుడు ప్రపంచానికి చాటారని తెలిపారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొన దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో హాజరుకాలేక పోయారని, భవిష్యత్తులో సీఎంను తీసుకొచ్చే బాధ్యత తనదే అని అనిల్కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కలకత్తా రామకృష్ణ మఠం అధ్యక్షులు నిత్య ముక్తానంద స్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎంపీ అనిల్కుమార్ యాదవ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ -
సవ్యమైన జాబితాకు సహకరించండి!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పార్టీల ప్రతినిధుల సమావేశంలో కర్ణన్ సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓటర్ల తుది జాబితాను సవ్యంగా సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సంక్షిప్త సవరణకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఈ నెల 2వ తేదీన ప్రచురించామన్నారు. ఆ మేరకు నియోజకవర్గంలోని 139 లొకేషన్లలో 407 పోలింగ్స్టేషన్ల పరిధిలో 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ వివరాలతో కూడిన జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ), జీహెచ్ఎంసీ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్లను నియమించాలి ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)ను నియమించి, జాబితా సవరణ పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేందుకు భాగస్వాములు కావాలని పార్టీల ప్రతినిధులను కోరారు. ఓటరుగా నమోదు చేసుకోండి దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఉందని, ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న, అర్హులైన పౌరులు ఆ తేదీలోగా తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాలని రాజకీయ పార్టీలను కర్ణన్ కోరారు. జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాలనుకున్నా అదే తేదీ(సెప్టెంబర్ 17)లోపు దరఖాస్తు ఫారాలు సమర్పించాలన్నారు. ఈ నెల 30న తుది జాబితా ఇప్పటివరకు ఫారం–6, 6ఎ, 7, 8ల ద్వారా వచ్చిన 2,855 దరఖాస్తులు, అభ్యంతరాల్లో 246 (8.62 శాతం) దరఖాస్తులను పరిష్కరించామని కర్ణన్ తెలిపారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయ్వంశీ, అదనపు కమిషనర్(ఎలక్షన్స్) మంగతాయారు హాజరయ్యారు. నందేశ్ కుమార్(బహుజన్ సమాజ్ పార్టీ), పి.వెంకటరమణ, పవన్ కుమార్(భారతీయ జనతా పార్టీ), విజయ్ మల్లంగి (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం.శ్రీనివాసరావు (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా–మార్క్సిస్టు), రాజేశ్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), వై.జయసింహ, కె.మాధవ్ (భారత్ రాష్ట్ర సమితి), కె.జోగేందర్ సింగ్, ప్రశాంత్ యాదవ్ (తెలుగుదేశం పార్టీ), సయ్యద్ ముస్తాక్ (ఎఐఎంఐఎం) తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు హైదరాబాద్ జిల్లాలో జీఐఎస్ ఆధారిత నజరి నక్ష తయారీ కార్యాచరణ ప్రణాళికపై కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. -
ఆటో దొంగను పట్టించిన వాట్సాప్ గ్రూప్
బంజారాహిల్స్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటో చోరీకి గురికాగా, ఈ వైనాన్ని సదరు ఆటోడ్రైవర్ తమ ప్రాంతానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. దీంతో గ్రూప్ సభ్యులు ఈ విషయాన్ని షేర్ చేయడంతో గంటన్నర వ్యవధిలోనే ఆల్వాల్లో దొంగతనానికి గురైన ఈ ఆటో బంజారాహిల్స్లో పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. బొల్లారం రిసాలబజార్లో నివసించే ఝార్ఖండ్కు చెందిన బిపిన్రాజ్యాదవ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆటోను తన ఇంటి ముందు పార్క్ చేశాడు. సోమవారం ఉదయం బయటికి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీపి పరిశీంచగా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోను చోరీ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని ఝార్ఖండ్కు చెందిన తమవారందరితో కలిసి ఉన్న ‘ఝార్ఖండ్ ఏక్ తా సమాజ్’ వాట్సాప్ గ్రూపులో చోరీకి గురైన ఆటోతో పాటు సీసీ ఫుటేజీని కూడా పోస్ట్ చేశాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దీపక్కుమార్ అనే ఝార్ఖండ్ వాసి మరిన్ని గ్రూపుల్లో దీనిని పోస్ట్ చేశాడు. బొల్లారంలో ఉంటున్న ఝార్ఖండ్కు చెందిన కల్లుకుమార్ అనే ఆటోడ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుని బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లో స్టార్ ఆస్పత్రికి వచ్చాడు. అదే రోడ్డులో బిపిన్ పోగొట్టుకున్న ఆటో పక్కన పార్కింగ్ చేసి కనిపించడంతో పాటు ఓ వ్యక్తి ఆటోకు అంటించిన స్టిక్కర్లను తొలగిస్తూ కనిపించాడు. దీనిని గుర్తించిన కల్లుకుమార్ వీడియో తీసి మళ్లీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. చోరీకి గురైన తన ఆటో ఇదేనంటూ, వెంటనే అక్కడికి వెళ్లాలంటూ వాట్సప్లో రిక్వెస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన బంజారాహిల్స్లో నివసిస్తున్న ఝార్ఖండ్ వాసులు రోడ్డునెంబర్–10లోని ఆటో వద్దకు చేరుకున్నారు. ఆటోపై స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆటోతో పాటు దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఆల్వాల్ పోలీసులకు నిందితుడి అప్పగింత.. నిందితుడిని పట్టుకున్న ఝార్ఖండ్ వాసు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించగా వారు అతడిని ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. విచారణలో దొంగతనం చేసిన యువకుడు జీడిమెట్ల పరిధిలోని రొడామిస్ట్రీకాాలనీకి చెందిన రోహిత్గా గుర్తించారు. సదరు ఆటోను అతను తన స్నేహితుడు రఘురామ్కు ఇవ్వగా రఘురామ్ తన బంధువులకు ఎక్కించుకుని బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి వచ్చి ఝార్ఖండ్వాసులకు చిక్కాడు. ఇలా ఒక వాట్సాప్ గ్రూప్ గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టించగా, పోలీసులు సైతం ఊపిరిపీల్చుకున్నారు. ఝార్ఖండ్ వాసుల వాట్సాప్ గ్రూప్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. దొంగను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగింత.. బంజారాహిల్స్లో ఘటన.. -
మెట్రో మహా విస్తరణ
2050 నాటికి 31 రూట్లు, 662 కి.మీ. సాక్షి, సిటీబ్యూరో: వచ్చే ఇరవై ఐదేళ్లలో మెట్రో మహా విస్తరణకు ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర అవసరాలకు అనుగుణంగా 31 కారిడార్లలో 662 కి.మీ. వరకు పొడిగించే అవకాశం ఉంది. మాస్టర్ప్లాన్–2050లో భాగంగా హెచ్ఎండీఏ కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్(సీఎంపీ) కోసం లీ అసోసియేట్స్కు ముసాయిదా ప్రణాళిక రూపకల్పన బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ ముసాయిదా నివేదికను రూపొందించింది. త్వరలోనే తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పుడున్న మూడు కారిడార్లు, రెండోదశలో నిర్మించనున్న 8 కారిడార్లతో కలిపి 2050 నాటికి 31 కారిడార్లలో మెట్రో సదుపాయం అవసరమని పేర్కొంది. మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా, మెట్రో విస్తరణ ఎంతో కీలకమని తెలిపింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 86 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలో ఈ సంఖ్య కోటికి చేరనుంది. ప్రజారవాణా సదుపాయాలను విస్తరించడం ద్వారా మాత్రమే వ్యక్తిగత వాహనాలను ని యంత్రించవచ్చని లీ అసోసియేట్స్ స్పష్టం చేసింది. దశలవారీగా విస్తరణ... కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం 2024వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుతం నగర జనాభా 1.55 కోట్లు ఉన్నట్లు ఉంటుందని అంచనా. 2050 నాటికి 2.71 కోట్ల నుంచి 3.90 కోట్లకు చేరుకోవచ్చనే అంచనాల మేరకు 7,250 చ.కి.మీ.పరిధిలో మెట్రో విస్తరణకు ఈ సంస్థ ప్రణాళికలను రూపొందించింది. ట్రాఫిక్ సర్వే విశ్లేషణలు, జనాభా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాల డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా మెట్రో విస్తరించవలసి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కి.మీ. వరకు మెట్రో సదుపాయం ఉంది. కొత్తగా ప్రతిపాదించిన రెండోదశ పూర్తయితే మరో 8 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి రానుంది. దీంతో సుమారు 200 కి.మీ. వరకు మెట్రో సేవలు విస్తరిస్తాయి. ప్రస్తుతం 5 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నారు. రెండో దశ పూర్తయితే మరో 10 లక్షల మందికి ఈ సదుపాయం లభించనుంది. 2040 నాటికి మెట్రో మూడోదశలో 340 కి.మీ.లు చేపట్టాలని లీ అసోసియేట్స్ సూచించింది. అప్పటివరకు మరో 15 లక్షల మందికిపైగా కొత్తగా వచ్చి చేరే అవకాశం ఉంది. 2050 నాటికి 662 కి.మీ. పూర్తి చేస్తే 75 లక్షల మందికిపైగా ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. హెచ్ఎంఏ డెవలప్మెంట్ ప్లాన్... ● హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రస్తుతం 11 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాల్లోని 104 మండలాలు, 1,355 గ్రామాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) ఏర్పడింది. ● జాతీయ పట్టణ రవాణా పాలసీకి అనుగుణంగా భవిష్యత్తులో ప్రజారవాణా సదుపాయాలు, రహదారులు, మెట్రో వంటి ప్రాజెక్టుల విస్తరణ లక్ష్యంగా కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లాన్(సీఎంపీ)ని సిద్ధం చేస్తున్నారు. ● ఈ మేరకు 2050 నాటికి మెట్రోరైలుకు ట్రాఫిక్ డిమాండ్ ఏ స్థాయిలో ఉండనుందనే అంశంపై ఆధారపడి మెట్రో విస్తరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మొదటి, రెండు దశలు కాకుండా లీ అసోసియేట్స్ ప్రతిపాదించిన రూట్లు (కి.మీ) ఇవే.. 75 లక్షల మందికి పైగా ప్రయాణికులు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్–2050 ప్రణాళికలు 2030 నుంచి 2050 నాటికి దశలవారీగా విస్తరణ 7,257 చ.కి.మీ.పరిఽధిలో మెట్రో అవసరం లీ అసోసియేట్స్ నివేదికలో వెల్లడి ఈసీఐఎల్–కీసర: 12.6 ఆరాంఘర్–రేతిబౌలి: 10 ఓఆర్ఆర్ శంషాబాద్–కొత్తూర్–షాద్నగర్: 26 నానక్రాంగూడ జంక్షన్–నార్సింగ్–శంషాబాద్: 25.4 శంషాబాద్ ఓఆర్ఆర్–తుక్కుగూడ –పెద్దఅంబర్పేట్: 40 పెద్దఅంబర్పేట్– ఘట్కేసర్ –మేడ్చల్ జంక్షన్: 45 మేడ్చల్ ఓఆర్ఆర్–దుండిగల్–పటాన్చెరు: 30 పటాన్చెరు ఓఆర్ఆర్–కోకాపేట్–నార్సింగ్ ఓఆర్ఆర్: 37.4 బీహెచ్ఈఎల్–బాచుపల్లి–కొంపల్లి–దమ్మాయిగూడ: 37.4 మెట్టుగూడ–మల్కాజిగిరి–ఈసీఐఎల్: 8.0 బోయిన్పల్లి–బాలానగర్–హైటెక్సిటీ: 14 విప్రో సర్కిల్–గోపన్పల్లి–బీహెచ్ఈఎల్: 11.2 పటాన్చెరు–ఇస్నాపూర్ (ఓఆర్ఆర్): 6.0 హయత్నగర్–పెద్దఅంబర్పేట్: 15 ఎంజీబీఎస్– అంబర్పేట్–ఘట్కేసర్: 35 అమీర్పేట్–బాలానగర్–దుండిగల్: 20 హబ్సిగూడ–నాచారం–ఓఆర్ఆర్ ఘట్కేసర్: 17.7 లక్డీకాఫూల్–గచ్చిబౌలి–మియాపూర్: 25 నానల్నగర్–లంగర్హౌస్–మొయినాబాద్: 21 మలక్పేట్ మెట్రో–ఐఎస్సదన్–ఒవైసీ హాస్పిటల్: 4.5 -
హైదరాబాద్ పోలీసులకు క్రికెట్ స్టేడియం!
● నాలుగు ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదన ● పోలీసులకు ఉచితంగా, ఇతరులకు అద్దెకు.. అంబర్పేట లేదా ఆరాంఘర్ చౌరస్తాలో ఏర్పాటుకు యోచన సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీసులకు సొంతంగా ఓ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావాలని పోలీసు శాఖ భావిస్తోంది. అంబర్పేటలోగానీ, ఆరాంఘర్ చౌరస్తాలోగానీ నిర్మించే ఈ స్టేడియాన్ని పోలీసు విభాగం అధికారులు, సిబ్బంది ఉచితంగా, సాధారణ పౌరులు అద్దెకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టేడియం క్రీడావసరాలకు మాత్రమే వినియోగించనున్నారు. గతంలో స్టేడియం ఉన్నప్పటికీ... సిటీ పోలీసు విభాగం కొన్ని దశాబ్దాల క్రితం గోషామహల్లో శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం నిర్మించింది. అయితే ఇందులో అసరమైన వసతులు లేకపోవడంతో పోలీసు శిక్షణలు, డ్రిల్స్తోపాటు కొన్ని క్రీడలు, కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే వినియోగించేవారు. అయితే అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని ఈ ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంది. మొత్తం 43 ఎకరాల 37 గంటలు ఉన్న ఈ స్టేడియం స్థలం నుంచి 31 ఎకరాల 39 గుంటలు ఆసుపత్రికి సేకరించి... 11 ఎకరాల 38 గుంటలు పోలీసు అవసరాలకు కేటాయించింది. ఉస్మానియా ఆస్పత్రి కోసం గోషామహల్ స్టేడియం ప్రాంగణం నుంచి స్థలం తీసుకుంటున్నందున, దీనికి ప్రతిగా ఆరాంఘర్ ప్రాంతంలో 12 ఎకరాలను పోలీసు విభాగానికి కేటాయించింది. పరిశీలనలో ఆ రెండు ప్రాంతాలు... గోషామహల్ వద్ద పోలీసు విభాగానికి కేటాయించిన స్థలంలో ట్రాక్తోపాటు అశ్వాల కోసం స్టేబుల్స్, పోలీసు జాగిలాల కోసం కెన్నల్స్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అంబర్పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ(పీటీసీ) ప్రాంగణంలో చాలా భాగం ఖాళీగా ఉంది. అయితే అక్కడకు రాకపోకలు సాగించడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. గోషామహల్ స్టేడియం స్థలానికి ప్రతిగా ఆరాంఘర్ చౌరస్తాలో ప్రభుత్వం కేటాయించిన 12 ఎకరాల స్థలంలో రాష్ట్రస్థాయి బ్యారెక్స్, ప్లేగ్రౌండ్, డ్రిల్ ఏరియా నిర్మించాలని డీజీపీ కార్యాలయం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందులో నుంచి నాలుగు ఎకరాలను క్రికెట్ స్టేడియం కోసం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం విమానాశ్రయం, ఇన్నర్ రింగ్రోడ్, ఔటర్ రింగ్రోడ్ నుంచి రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది. వినియోగం.. ఆదాయం.. ఈ క్రికెట్ స్టేడియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, శుభకార్యాలకు ఇవ్వరు. క్రికెట్ ఆడటానికి, శిక్షణ ఇవ్వడానికి అనువుగా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్టేడియంలో పోలీసు స్పోర్ట్స్ మీట్స్తోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది వారాంతాలు, ఇతర సమయాల్లో క్రికెట్, ఇతర క్రీడలు ఆడుకోవడానికి ఉచితంగా అందిస్తారు. ఔత్సాహికులైన యువకులు, క్రీడాకారులు ఈ గ్రౌండ్ను అద్దెకు తీసుకోవచ్చు. ఇప్పటికే పెట్రోల్ బంకులు తదితరాల ద్వారా పోలీసు వెల్ఫేర్ ఫండ్కు ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఈ స్టేడియాన్ని క్రీడావసరాలకు అద్దెకు ఇవ్వడం ద్వారానూ ఆదాయం పొందవచ్చని పోలీసు విభాగం యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దీని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఇష్టారాజ్యంసాక్షి, రంగారెడ్డిజిల్లా: ౖఫెర్సేఫ్టీ సహా అనుమతి లేని ఇరుకైన భవనాల్లో ఏర్పాటు చేసిన పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రోగుల సేవలో తరించాల్సిన కొంత మంది వైద్యాధికారులు ఆస్పత్రుల తనిఖీల పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్లకు అనుమతుల జారీ సహా పాత ఆస్పత్రులకు లైసెన్సుల పునరుద్ధరణ పేరుతో ఇలా నోటీసులు జారీ చేసి, అలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపించి, ఆస్పత్రి, పడకలు, స్కానింగ్ మిషన్లు, లేబోరేటరీల నిష్పత్తిని బట్టి వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడిని మళ్లీ సంపాదించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అర్హత, అనుభవం లేకపోయినా గుట్టుగా అవయవమార్పిడి, సంతాన సాఫల్యం వంటి ఖరీదైన చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరుపై నిఘా పెట్టాల్సిన జిల్లా ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు తయారైంది. భారీగా ముడుపులు జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్హోమ్లు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మూడు వేలకుపైగా ఉన్నట్లు అంచనా. వీటిలో 2,500 వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అను మతులు పొందాయి. మరో 400 వరకు ఎలాంటి అనుమతులు లేని క్లినిక్లు ఉన్నట్లు అంచనా. అర్హతలు, అనుమతులు లేకుండా చికిత్స చేస్తున్న ఆస్ప త్రులు, వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద, యునానీ కోర్సులు చేసిన వారు అల్లో పతి వైద్యులుగా.. ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యు లుగా చలామణి అవుతున్నారు. ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన చోట ఇన్పేషంట్లకు చికిత్స లు అందిస్తున్నారు. అబార్షన్లతో పాటు కుటుంబ నియంత్రణ, సున్తీ వంటి చికిత్సలు చేస్తున్నారు. అధిక రక్తస్రావం సహా ఇతర కారణాలతో ఆయా బాధితులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి నకిలీ వైద్యులను, ఆస్పత్రులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు గుర్తించి, కేసులకు సిఫార్సు చేస్తోంది. ఆ బాధ్యతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగిస్తోంది. ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నారు. ఆస్పత్రు ల లైసెన్సులు రద్దు చేయక పోగా, కొద్ది రోజులకే వాటిని తిరిగి తెరిపిస్తున్నారు. ఇందుకు ఒక్కో ఆస్ప త్రి నుంచి భారీగా ముడుపులు ముడుతున్నట్లు తెలిసింది. కందుకూరు, షాద్నగర్ డివిజన్ల పరిధిలో అక్రమ వసూళ్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటేషన్లపై అడ్డదారిలో వచ్చిన ఓ వైద్యురాలు.. గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే డిప్యూటీ డీఎంహెచ్ఓగా కొనసాగుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకరి పేరున.. మరొకరు నిజానికి ఏ వ్యక్తి పేరునైతే ఫార్మసీ, ల్యాబ్లకు లైసెన్స్ పొందుతారో ఆ వ్యక్తి విధిగా అందుబాటులో ఉండాలి. కానీ మెజార్టీ కేంద్రాల్లో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండటం లేదు. కనీస అర్హత లేని వారితో రక్త, మూత్ర వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండానే అటెండర్లు మందులు ఇచ్చేస్తున్నారు. కీలకమైన స్కానింగ్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. రేడియాలజిస్టుకు బదులు ఎక్సరే టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులతో పరీక్షలు చేయిస్తున్నారు. కడుపులో ఉన్నది ఆడో మగో ముందే చెబుతూ పరోక్షంగా అబార్షన్లకు కారణమవుతున్నారు. జిల్లాలో 700పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, వీటిలో మెజార్టీ సెంటర్లలో కనీస అర్హత ఉన్నవారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మూడు నెలలకోసారి మెడికల్ షాపుల నుంచి అసోసియేషన్ ప్రతినిధులే వసూలు చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ముడుపులు ముట్టజెబుతున్నట్లు తెలిసింది. -
అన్నదాతలప్రయోజనాలే ముఖ్యం
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సాక్షి, సిటీబ్యూరో: రైతుల ప్రయోజనాల కోసం మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్ను సందర్శించిన ఆయన బత్తాయి రైతులతో ముచ్చటించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్ర భుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమ లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల పనితీరును కమిషన్ సమీక్షిస్తుందని చెప్పారు. కోహెడలో త్వరలోనే మార్కెట్ నిర్మా ణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కమిషన్కు విన్నపం కొత్తపేట నుంచి పండ్ల మార్కెట్ను తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారానికి మార్చినప్పటికీ, వ్యాపారానికి అనువైన వాతావరణం లేదని కమిషన్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, మార్కెట్ యార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు సునీల్రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర చారి, సభ్యులు అంజయ్య, మధుసూదన్రావు, రఘుపతిరెడ్డి, లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, నర్సింహ, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతోపాటు మార్కెట్ ఈఈ ప్రసాద్ రావు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, ఫ్రూట్ ట్రేడర్స్ అఽధ్యక్షుడు మహ్మద్ తాజ్, ఉపాధ్యక్షుడు అచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1.92 కోట్ల ‘పాత కరెన్సీ’ స్వాధీనం
● నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ ● మరికొందరి కోసం కొనసాగుతున్న గాలింపు సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘకాలం తర్వాత నగరంలో మరోసారి రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు పట్టుబడ్డాయి. 2016లో డీమానిటైజేషన్ తర్వాత దాదాపు రెండున్నరేళ్ల పాటు ఈ కేసులు నమోదైనా... ఆ తర్వాత తగ్గిపోయాయి. తాజాగా సోమవారం రాత్రి నలుగురిని అదుపులోకి తీసుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.1.92 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో సూత్రధారులతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. డీమానిటైజేషన్ సమయంలో ప్రభుత్వం పాత కరెన్సీ మార్పిడికి అవకాశం ఇచ్చింది. బ్యాంకులతో పాటు కొన్ని పోస్టాఫీసుల్లోనూ ఆధార్ సహా ఇతర ఆధారాలు సమర్పించి నగదు మార్పిడి చేసుకోవడానికి, బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే బ్లాక్ కరెన్సీ కలిగిన అనేక మంది అప్పట్లో మార్పిడి, డిపాజిట్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వారికోసం పని చేసిన కొన్ని ముఠాలు కమీషన్ ప్రాతిపదికన వీటిని మార్పిడి చేశాయి. మరికొందరు మార్పిడి పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుని ఉడాయించారు. కొందరు సూడో పోలీసులు, ఖాకీలు సైతం ఈ దందాలు నడిపారు. 2016–18 మధ్య ఇలాంటి కేసులు అనేకం నమోదయ్యాయి. అయితే కరోనా ప్రభావంతో అమలులోకి వచ్చిన లాక్డౌన్ తర్వాత ఇలాంటి మోసాలు, వ్యవహారాలు, కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. అప్పుడప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఓ ఉదంతమే సోమవారం బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు కమీషన్ తీసుకుని పాత కరెన్సీని మార్చి, కొత్త రూ.500, రూ.200, రూ.100 నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మిన కొందరు తమ వద్ద ఉన్న నగదును ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి పంపారు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో వలపన్నారు. శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వీరిచ్చిన సమాచారంతో వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా... అందులో రూ.1.92 కోట్ల పాత కరెన్సీ లభించింది. ఇందులో అత్యధికం రూ.1000 నోట్లే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి విచారణ నేపథ్యంలో ఈ కరెన్సీని మార్పిడి కోసం ఇచ్చిన వారు, మారుస్తామంటూ ఒప్పందం చేసుకున్న వారు మరి కొందరు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్లోని ఓ ఇంట్లో మరికొందరు అనుమానితులు ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించింది. దీంతో వారితో పాటు ఇతర నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఈ కరెన్సీ మూలాలు, మొత్తం ఎంత ఉందనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ నలుగురు నిందితులను అధికారులు టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. -
వదల బొమ్మాళీ.. వదల!
రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినా కదలని ఇన్చార్జ్సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర తూనికలు, కొలత శాఖ లెక్క తప్పింది. తూకాలు, మోసాలపై పర్యవేక్షణేమో గానీ, పరిపాలనపరమైన వ్యవహారాల్లో సైతం జవాబుదారీతనం కొరవడింది. సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో రెగ్యులర్ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ నెలరోజుల క్రితం వరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అధికారి మాత్రం చాంబర్ను వదలా.. కదలా.. అంటూ యధావిధిగా ఫైళ్లను పరిశీలిస్తుండటం ఉద్యోగ వర్గాల్లో చర్చనీంశంగా మారింది. ఇటీవల తూనికల, కొలతల శాఖలో పలువురికి పద్నోతులు కల్పిస్తూ రాష్ట్ర కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్–1 డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్(డీఐ)కి అసిస్టెంట్ కంట్రోలర్(ఏసీ)గా పదోన్నతి కల్పించి ప్రధాన కార్యాలయంలోని పరిపాలన విభాగంలో హెడ్క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్గా రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారు. జూలై 31న పదోన్నతి పొందిన సదరు అధికారిణి తక్షణమే రిపోర్టు చేసి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్గా విధులు నిర్వహించిన వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఎసీ)ల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ, రెగ్యులర్ అధికారిణి డ్యూటీలో చేరినప్పటికి 25 రోజులుగా సదరు అధికారి మాత్రం కార్యాలయానికి త్వరగా వచ్చి ప్రధాన సీటుపై కూర్చుంటూ ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు హెడ్ క్వార్టర్ ఏసీగా వ్యవహరించిన సదరు అధికారి సీనియర్ కావడం, మరోవైపు పలువురు ఉద్యోగుల పదోన్నతి ఫైళ్ల వ్యవహారం ఉండటంతో ఆయన అనుభవం తనకు సహకారంగా ఉంటుందని సదరు అధికారిణి కూడా మిన్నుకుండినట్లు సమాచారం. అయితే వారం రోజుల క్రితం పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో రెగ్యులర్ అధికారిణి ఆఫీస్కు ఆయన కంటే ముందుగానే వచ్చి ప్రధాన కుర్చీలో కూర్చుంటున్నారు. అయినా సదరు అధికారి మరో సాధారణ కుర్చీలో కూర్చొని ఫైళ్లు పరిశీస్తూ చాంబర్ను వదలక పోవడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర కంట్రోలర్ కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. హాజరెట్లెట్టా..? ప్రధాన కార్యాలయంలో హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్తి అదనపు బాధ్యతలను నుంచి నుంచి తప్పుకున్నా వరంగల్లోని రెగ్యులర్ ఏసీ విధులకు హాజరు కాకుండా హెడ్ క్వార్టర్లోనే ఉండిపోవడంతో హాజరు నమోదుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పోస్టింగ్లో కాకుండా ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తే, న్ఆన్ డ్యూటీ హెడ్ ఆఫీస్ (ఓడీహెచ్) అని హాజరు పట్టికలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులైతే మాత్రం ఆ శాఖాధిపతి అనుమతి తప్పనిసరి. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి ఫైళ్లు తిరగేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఇటీవల జరిగిన ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో కూడా చేతివాటం ప్రదిర్శంచినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదనపు బాధ్యతల మాటున తప్పిదాలెన్నో.. సదరు అధికారి పలు నిబంధనలు సైతం తుంగలో తొక్కి పదోన్నతులు, కొత్త పోస్టింగ్ల్లో పలు జిమ్మిక్కులు చేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. పదోన్నతులతో కొత్త స్థానాల్లో చేరినవారు కొద్ది నెలలకే తాము కోరుకున్న చోటుకు బదిలీ చేయడం గమనార్హం. వాస్తవంగా బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. అయినా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 20న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్లు కేటాయించారు. పదోన్నతుల ద్వారా పోస్టింగ్లో చేరి శిక్షణ పూర్తి చేసిన తర్వాత కొందరికి పోస్టింగ్ మార్చి కోరుకున్న స్థానాల్లో బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఇలా.... ● పదోన్నతి ద్వారా హైదరాబాద్ సీసీ–1 ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ లభించిన ఉద్యోగికి జనగామాకు, హెడ్ క్వార్టర్ హైదరాబాద్–1 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా పోస్టింగ్లో చేరిన మరో ఉద్యోగికి రంగారెడ్డి జిల్లా ఆఫీస్కు బదిలీ చేశారు. ● మేడ్చల్–మల్కాజిగిరి డీఐ పోస్టు సస్పెన్షన్తో ఖాళీ కాగా, ఆ స్థానంలో నల్లగొండ డీఐకి బదిలీపై పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవంగా బదిలీలపై నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టుకు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ, నేరుగా బదిలీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ● నిబంధనల ప్రకారం నిషేధిత కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేయాలంటే కూడా ప్రభుత్వం ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ, తూనికలు, కొలతల శాఖ పరిపాలనా విభాగం నిబంధనలను తుంగలోకి తొక్కి సిఫార్సులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు జరగడంతో ట్రెజరీ అండ్ అకౌంట్ విభాగం వారి వేతనాల చెల్లింపు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అదే చాంబర్లో నెలరోజులుగా విధులు సాక్షాత్తు ప్రధాన కార్యాలయంలో నిబంధనలు తూచ్ గతంలో పోస్టింగ్, పదోన్నతుల్లో చేతివాటం ఆరోపణలు పట్టని తూనికలు, కొలతల శాఖ రాష్ట్ర కంట్రోలర్ -
రైలుకిందపడి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: రైలు కింద పడి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ డేవిడ్రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఘట్కేసర్–బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లభించిన గుర్తింపుకార్డు ఆధారంగా మృతురాలిని ఘట్కేసర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐ అండ్ డీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దుంపటి హితవర్షిణి(20)గా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన అంజన్న కుమార్తె హిత వర్షిణి ఘట్కేసర్లోని కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతోంది. సెలవుల కారణంగా మూడు రోజుల క్రితం ఆర్మూర్కు వెళ్లిన ఆమె ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్కు చేరుకుంది. అక్కడి నుంచి మెట్రో రైలు ఎక్కి ఉప్పల్ స్టేషన్లో దిగింది. ఉప్పల్ నుంచి ఆటోలో ఘట్కేసర్ చేరుకున్న హితవర్షిణి సమీపంలోని ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు పట్టారు. ప్రేమ వ్యవహారమే కారణమా..? లక్సెట్టి పేటలో యువకుడి ఆత్మహత్య కాగా హిత వర్షిణి (20) వినయ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. హితవర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే వినయ్ సోమవారం మధ్యాహ్నం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. -
కోకాపేటలో చకచకా
ప్రారంభోత్సవాలు.. ఆవిష్కరణ.. వీక్షణలతో సీఎం రేవంత్రెడ్డి సందడి చేశారు. ముందుగా ఆయన సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కోకాపేటలో టోల్గేట్ను ప్రారంభించారు. 4.55 గంటలకు గండిపేటకు చేరుకుని గోదావరి జలాల తరలింపుపై జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని వీక్షించారు. నగర వ్యాప్తంగా గతంలో నిర్మించిన 12 రిజర్వాయర్లను ప్రారంభించారు. అనంతరం గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం సభా వేదికపైకి వచ్చిన ఆయన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. సభ అనంతరం ముఖ్యమంత్రి 5.30 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. కొత్తగా ప్రారంభించిన కోకాపేట టోల్గేట్ ద్వారా ఔటర్ రోడ్డు మీదుగా వెళ్లారు. – మణికొండ -
నేత్రదానం మహాదానం: సజ్జనార్
గోల్కొండ: నేత్రదానంపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ వి.సి.సజ్జనార్ అన్నారు. 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సోమవారం మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. సుధీర్ఘకాలంగా నేత్రదానంపై సరోజినీదేవి ఆసుపత్రి వారు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నేత్రదానం వల్ల మరొకరికి కంటి చూపు ప్రసాదించవచ్చన్నారు. తమ వంతు కృషిగా బస్టాండ్లు, బస్డిపోల వద్ద నేత్రదాన ఆవశ్యకతపై పోస్టర్లు అతికించామని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా వైద్యకళాశాల సూపరిండెంటెంట్ డాక్టర్ రాజారావు, సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత, ఎంపీసీడీ సభ్యురాలు డాక్టర్ కళావతి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాత అల్లు అరవింద్కు షోకాజ్ నోటీసులు
బంజారాహిల్స్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన భవనానికి ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో సినీ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన 8–2–293/82/775/ఏ లో 996 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్ ఉంది. సదరు స్థలంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ కార్యాలయం కొనసాగుతోంది. ఈ భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్ 4 అనుమతులు పొందారు. అయితే అనుమతులకు విరుద్ధంగా ఒక అంతస్తును అక్రమంగా నిర్మించారు. ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ పేర్కొన్నారు. ప్లాన్కు విరుద్ధంగా అక్రమ అంతస్తు ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు. -
‘మహా’ వర్షపాతం
ఈ సీజన్లో 31 శాతం అధికం ● గ్రేటర్లో ఇప్పటివరకు 61 సెం.మీ. ● ఆగస్టులోనే ఎక్కువ వర్షాలు సాక్షి, సిటీబ్యూరో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వానలే వానలు. కుండపోత వర్షాలు కురియడంతో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3 శాతం వర్షపాతం నమోదైంది. ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ మొదటి రెండు నెలలు వెనుకపట్టు పట్టాయి. సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదు కాగా, గత నెలలో వానలు ఊపందుకున్నాయి. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాలి. అయితే 617.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా అమీర్పేట్, ఖైరతాబాద్లలో 56 శాతం, శేరిలింగంపల్లిలో 54 శాతం నమోదైంది. అయితే తిరుమలగిరి మండలంలో మాత్రం సాధారణం కంటే 0.7 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మాత్రం 20 నుంచి 40 శాతానికిపైగా అత్యధికంగా వర్షం కురిసింది. మొత్తం మీద 90 రోజుల్లో సగటున 35 రోజులు వర్షాలు పడ్టాయి రెవెన్యూ జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ● హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు సాధారణంగా 477.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురువాల్సి ఉండగా 622.2 మిల్లీమీటర్లు నమోదైంది. సగటున 32 శాతం అధికంగా కురిసింది. ● రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం 400.6 మిల్లీమీటర్లకుగాను 612.6 మిల్లిమీటర్లు కురిసింది. సగటున 53శాతం అత్యధికంగా నమోదైంది. ● మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం 454.3 మిల్లీమీటర్లు నమోదు కావల్సి ఉండగా, 592.7 మిల్లీమీటర్లు కురిసింది. సగటున సాధారణం కంటే 30 శాతం అధికంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వర్షాకాల సీజన్లో సాధారణం కంటే అత్యధికంగా నమోదు ఇలా.. అర్బన్ మండలం సాధారణ వర్షపాతం కురిసిన వర్షపాతం శాతం (మిల్లీమీటర్లలో..) (మిల్ల్లీమీటర్లలో..) అమీర్పేట 489.6 762.3 56 ఖైరాతాబాద్ 481.6 760.1 56 శేరిలింగంపల్లి 490.4 755.9 54 ముషీరాబాద్ 471.0 677.9 44 బండ్లగూడ 457.7 648.6 42 షేక్పేట 472.2 659.7 40 మేడిపల్లి 478.5 662.8 39 కూకట్పల్లి 508.8 699.9 38 సరూర్నగర్ 441.2 607.9 36 రాజేంద్రనగర్ 466.6 632.3 36 కుత్బుల్లాపుర్ 487.8 596.5 36 సికింద్రాబాద్ 475.8 638.6 34 కాప్రా 411.6 544.8 32 అంబర్పేట 460.0 602.4 31 ఉప్పల్ 467.3 596.6 28 -
కొత్త కార్డులకు రేషన్ పంపిణీ షురూ
సాక్షి, సిటీబ్యూరో: ఆశావహుల పరేషాన్ వీడింది. కొత్త రేషన్ కార్డుల లబ్ధి అందింది. కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ సోమవారం ఆరంభమైంది. సుమారు లక్షన్నర కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. మూడు నెలలుగా రేషన్కార్డులు మంజూరవుతున్నా నెలవారీ కోటా మాత్రం కేటాయించలేదు. పౌర సరఫరాల శాఖ పాత కార్డులకు జూన్లోనే ఒకేసారి మూడు నెలలు కోటా కేటాయించి పంపిణీ చే సింది. తాజాగా పాత కార్డుదారులతోపాటు కొత్త కార్డుదారులకు సైతం సెప్టెంబర్ కోటా కేటాయించి విడుదల చేసి పంపిణీ ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుదారులు ఉదయం నుంచే ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు క్యూ కట్టారు. అర్బన్లో 13.88 లక్షలకుపైనే కుటుంబాలు గ్రేటర్ పరిధిలో ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలు సుమారు 13.88 లక్షలపైనే కాగా, అందులో సుమారు కోటిన్నరకుపైగా లబ్ధిదారులుగా ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుకు ఆరు కిలోల చొప్పన సన్నబియ్యం ప్రతి నెలా కోటా విడుదలవుతోంది. ప్రతి నెలా 15వ తేదీ వరకు సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ సాగుతోంది. ఈ నెల కొత్త కార్డుదారులు నెలవారీ కోటా డ్రా చేయడానికి పోటీ పడ్డారు. ఉచితంగా సన్న బియ్యం అందడంతో కొత్త కార్డుదారుల్లో ఆనందం వ్యక్తమైంది. -
జీహెచ్ఎంసీ ప్రజావాణికి 122 అర్జీలు
లక్డీకాపూల్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 అర్జీలు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 36, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్ 6, ఇంజనీరింగ్, ఫైనాన్స్ అకౌంట్ 5 విభాగాలకు చొప్పున, ఎలక్షన్, విజిలెన్స్ విభాగాలకు రెండు చొప్పున, యు.బి.డి, అడ్మినిస్ట్రేటివ్, యు.సి.డి., హెల్త్ విభాగాలకు ఒకటి, ఫోన్ ఇన్ ద్వారా 3 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఆరు జోన్లలో మొత్తం 59 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 25, శేరిలింగంపల్లి జోన్లో 13, సికింద్రాబాద్ జోన్ లో 11, ఎల్బీనగర్ జోన్ లో 06, చార్మినార్ జోన్ లో 04 ఫిర్యాదులు అందాయి. కమిషన్ ఆర్.వి.కర్ణన్ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికిగాను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల విన్నపాల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు పంకజ, సత్యనారాయణ, వేణు గోపాల్, రఘు ప్రసాద్, సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ ఎస్.పి (విజిలెన్స్) సుదర్శన్, సి.ఈ. రత్నాకర్, హౌసింగ్ సి.ఈ. నిత్యానంద, అడిషనల్ సి.సి. పి.లు గంగాధర్, వెంకన్న, ప్రదీప్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అబ్దుల్ వకీల్, సి.వి.ఓ. మహేష్ కులకర్ణి పాల్గొన్నారు. -
ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?
సాక్షి ,సిటీబ్యూరో: ‘ఫ్యూచర్’కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఫ్యూచర్ సిటీలో చేపట్టే నిర్మాణాలకు ఇంకా అనుమతులు లభించలేదు. లే అవుట్లు, నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, నిర్మాణ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇప్పటివరకు దాని కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. మరోవైపు ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ఉన్న ప్రాంతాల్లో గతంలో డీటీసీపీ అనుమతులు ఇచ్చింది. అయితే ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించడంతో డీటీసీపీ ఆ బాధ్యతల నుంచి వైదొలిగింది. నిబంధనల మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ)యే అన్ని రకాల ప్రొసీడింగ్స్ను అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను సైతం వెలువరించింది. కానీ, క్షేత్రస్థాయి, ప్లానింగ్ విభాగంలో తగినంత నిపుణులు, సిబ్బంది లేకపోవడం వల్ల ఆ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు. సాంకేతికంగా ఎఫ్సీడీఏ సంస్థ నుంచే అనుమతులు లభిస్తాయి. అంతర్గతంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ, ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.అభివృద్ధికి ఆటంకాలు...‘రూ.కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేశాం. లే అవుట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, ప్రొసీడింగ్స్ లభించకపోవడం వల్ల వడ్డీల రూపంలో పెద్ద ఎత్తున నష్టపోతున్నాం’అని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. డీటీసీపీ పరిధిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రొసీడింగ్స్ లభించాయని, ఫ్యూచర్ సిటీలో మాత్రం సుమారు ఏడాది కాలంగా ప్రతిష్టంభన నెలకొందని అన్నారు. ఈ ప్రతిష్ఠంభన కారణంగాపెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలే కాకుండా సాధారణ, మధ్య తరగతి వర్గాలు సైతం ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఎఫ్డీసీఏ, హెచ్ఎండీఏల మధ్య కొరవడిన సమన్వయం వల్లే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా వందలకొద్దీ దరఖాస్తులు పెండింగ్ జాబితాలోనే ఉన్నాయి. గతంలో డీటీసీపీ వద్ద దరఖాస్తు చేసు కున్న ఫైళ్లను సైతం హెచ్ఎండీఏకు బదిలీ చేశారు. ‘ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న హెచ్ఎండీఏ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ యధావిధిగా కొనసాగుతోంది. హెచ్ఎండీఏ నుంచే అనుమతులు లభిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలనలో మాత్రం జాప్యం జరుగుతోంది’అని ఫ్యూచర్ సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఈ కాలయాపన వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంటున్నారు.765 చ.కి.మీ.లలో బ్రేక్● హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిని రీజినల్ రింగ్రోడ్డు వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 7,250 చ.కి.మీ.ల నుంచి 10,472 చ.కి.మీ.ల వరకు హెచ్ఎండీఏ కార్యకలాపాలు విస్తరించాయి.● ఫ్యూచర్ సిటీ పరిధిలోని 765 చ.కి.మీ.పరిధిలో ఉన్న 56 గ్రామాల్లో మాత్రం అనుమతులకు బ్రేక్ పడింది.● గతంలో డీటీసీపీ పరిధికి చెందిన ఈ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అనుమతులు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైన తరువాతనే ఆటంకాలు ఎదురుకావడం గమనార్హం.● గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.● రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు రెండు దశల్లో గ్రీన్ఫీల్డ్ నిర్మాణం చేపట్టనున్నారు.● ఈ క్రమంలో రియల్ ఎస్టేట్రంగం పరుగులు తీస్తుందని భావించిన సంస్థలు, వ్యక్తులకు ప్రొసీడింగ్స్ లభించకపోవడం గమనార్హం. -
నిమజ్జనానికి సర్వం సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నగరవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం ఆయన నెక్లెస్ రోడ్డు మార్గంలో పీపుల్స్ ప్లాజా, సన్ రైజింగ్ పాయింట్, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మకుంట, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్లలో నిమజ్జన ఏర్పాట్లను అదనపు కమిషనర్ రఘుప్రసాద్తో కలిసి పరిశీలించారు. బారికేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 20 ప్రధాన చెరువులతోపాటు చిన్న విగ్రహాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నిధులను జీహెచ్ఎంసీ కేటాయించిందని చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. హైడ్రా, పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్లో 9 బోట్లను, డీఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని వివరించారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేశ్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీమ్లు నియమించామని చెప్పారు. స్వచ్ఛతపై దృష్టి.. వేడుకల్లో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, 14,486 మంది శానిటేషన్ వర్కర్స్ మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లు ఉపయోగించి 3 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను డంపింగ్ యార్డు కు తరలించామని చెప్పారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో 39 మొబైల్ టాయిలెట్లు, ఊరేగింపు మార్గంలో మొత్తం 56,187 తాత్కాలిక వీధిదీపాలు సిద్ధం చేసినట్లు వివరించారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేలా అంబులెన్స్లతో సహా 7 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 90 శాతానికిపైగా గుంతల పూడ్చివేత రోడ్డు సేఫ్టీ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 90 శాతానికిపైగా గుంతలను పూడ్చివేశామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న మిగతా గుంతలను ఇంజనీరింగ్ విభాగం పూడ్చుతుందన్నారు. సకాలంలో విగ్రహాలను తరలించాలి సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా కమిషనర్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేశ్ ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజి పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. 303 కిలోమీటర్ల మేర నిమజ్జన శోభాయాత్ర ఊరేగింపు మార్గాల్లో రోడ్లకు మరమ్మతులు.. 3 షిఫ్టుల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు.. విధుల్లో 14,486 మంది సిబ్బంది నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ -
కూడళ్ల సుందరీకరణ
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ సుందరీకరణ చేపట్టామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం గన్పార్క్ జంక్షన్, బీఆర్కే భవన్ దగ్గర సుందరీకరణను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ సురేఖలతో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ గన్ పార్క్ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా డిజిటల్ మెకానిజంతో కూడిన అత్యాధునిక డైనమిక్ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశామని చెప్పారు. బీఆర్కే భవన్ కూడలిని రకరకాల ఆకారాలతో ప్రజలకు విజ్ఞానం, అహ్లాదకరమైన వాతారణం, సంతోషాన్ని కలిగించే విధంగా తీర్చిదిద్దామన్నారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లను సైతం రానున్న రోజుల్లో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. – లక్డీకాపూల్ -
నిమజ్జనోత్సవం విషాదాంతం
● వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి ● దుండిగల్లో చెరువులో ఆటో పడి తండ్రీ కొడుకు దుర్మరణం ● హిమాయత్ సాగర్లో యువకుడి మృతి దుండిగల్: వినాయకుడిని నిమజ్జనం చేసిన అనంతరం ప్రమాదవశాత్తు ఆటో చెరువులో పడి తండ్రి, కొడుకు మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుండిగల్, శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన డొక్క శ్రీనివాస్(34) ఆటోలో ఆకు కూరలను విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య సోని, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి ఇంటి పక్కనే కాలనీకి చెందిన చిన్నారులు వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు శ్రీనివాస్ సాయం కోరడంతో అతను తన పెద్ద కుమారుడు జాన్ వెస్లీ(07)తో కలిసి వినాయకుడిని తీసుకుని స్థానిక నాగులూరు పెద్ద చెరువుకు వచ్చాడు. అనంతరం చిన్నారులు వినాయకుడిని మెట్ల మార్గంలో తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. వారు చెరువు కట్టపైకి చూడగా ఆటో కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటారని భావించి నడుచుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో.. నిమజ్జనం కోసం వెళ్లిన భర్త, కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ భార్య సోని మండప నిర్వాహకులను ఆరా తీయగా తమకు తెలియదని చెప్పారు.దీంతో ఆమె స్థానికులతో కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయికి అంటిన రంగుతో గుర్తించి.. నాగులూరు చెరువు కట్ట చిన్నగా ఉండడంతో ఆటో ముందుకు వెనుకకు తిప్పే క్రమంలో కట్టపై ఉన్న రాయికి ఆటో ట్రాలీ తగిలి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి ఉంటుందని పోలీసులు గుర్తించారు. రాయికి తగలిన మరక ఆధారంగా పోలీసులు, డీఆర్ఎఫ్ బృందం నాలుగు గంటల పాటు శ్రమించి చెరువులో నుంచి ఆటోతో పాటు తండ్రి, కొడుకుల మృతదేహాలను వెలికి తీశారు. వెనక్కి తీస్తున్న క్రమంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లడం.. రెండు వైపులా డోర్లు లాక్ కావడంతో నీళ్లలో నుంచి బయటకు వచ్చే ఆస్కారం లేకపోవడంతో తండ్రి, కొడుకులు మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి.. రాజేంద్రనగర్: ఇంట్లో ప్రతిష్టించిన గణనాథున్ని హిమాయత్సాగర్లో నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్(28) తన ఇంట్లో ప్రతిష్టించిన గణనాథున్ని నిమజ్జనం చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడితో కలిసి బైక్పై హిమాయత్సాగర్కు వచ్చాడు. సాగర్లో గణేషుడిని నిమజ్జనం చేసేందుకు దారి లేకపోవడంతో చౌడమ్మ గుట్ట ప్రాంతంలోని చెరువు కట్టకు చేరుకున్నాడు. హిమాయత్సాగర్లో గణేష్ నిమజ్జనాలపై నిషేధం ఉన్నందున చెట్ల పొదల గుండా నీటి వద్దకు వెళ్లిన సాయికుమార్ కాలు జారడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు. రోడ్డుపై ఉన్న స్నేహితుడు దీనిని గుర్తించి కేకలు వేయడంతో స్థానికులు, వాహనదారులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రి సాయి కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా నిర్వహించి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వలస కూలీల పిల్లలే టార్గెట్
చిన్నారుల కిడ్నాప్ ముఠా అరెస్ట్ ● నర్సింగ్ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ రిజ్వానా ఆధ్వర్యంలో దందా ● పిల్లలు లేని వారికి విక్రయం ● సంతానలేమిని ఆసరాగా చేసుకుని రూ. లక్షలు వసూలు ● ఇద్దరు చిన్నారులను రూ. 4.5 లక్షలకు విక్రయించిన తండ్రి ● ఆరుగురు చిన్నారులను కాపాడిన చందానగర్ పోలీసులు ● నలుగురు నిందితుల అరెస్ట్, రూ. ఐదు లక్షల నగదు స్వాధీనం గచ్చిబౌలి: రైల్వే స్టేషన్ల సమీపంలో వలస కూలీల పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. గత నెల 25న లింగంపల్లిలోని పోచమ్మ ఆలయ సమీపంలో ఆడుకుంటున్న అఖిల్ (05) అనే చిన్నారి కనిపించకపోవడంతో మర్నాడు అతడి తల్లిదండ్రులు చందానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా బాలుడు కిడ్నాప్కు గురైనట్లు గుర్తించారు. దీంతో బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులు పటాన్చెరుకు చెందిన చిలుకూరి రాజు, మూసాపేట్కు చెందిన నర్సింహారెడ్డి, పటాన్చెరుకు చెందిన మహ్మద్ అసీఫ్, సిద్ధిపేటలో నర్సింగ్ క్లీనిక్ నిర్వాహకురాలు డాక్టర్(బీఏఎంఎస్) రిజ్వానాను అరెస్ట్ చేశారు. పటాన్చెరుకు చెందిన మరో నిందితుడు బాలరాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లే కేంద్రాలు.. గత ఐదేళ్లుగా ఈ ముఠా రైల్వే స్టేషన్ల సమీపంలో నివాసం ఉంటున్న వలస కూలీల పిల్లలను టార్గెట్గా చేసుకుని కిడ్నాప్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అఖిల్ కిడ్నాప్ కేసు విచారణలో మరిన్ని కిడ్నాప్ కేసులు వెలుగులోకి వచ్చాడయి. అఖిల్ను కిడ్నాప్ చేసిన ముఠా రూ. 7 లక్షలకు సిరిసిల్లా జిల్లా, జిల్లెల గ్రామానికి చెందిన సిరవేని లక్ష్మీకి విక్రయించినట్లు డీసీపీ తెలిపారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోనే చిలుకూరి రాజు మరో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేశాడు. 2024 ఆగస్టు 17న బాలమణి కుమారుడు అరుణ్(02)ను కిడ్నాప్ చేసి గొల్లపల్లికి చెందిన సుజాతకు రూ.2.10 లక్షలకు విక్రయించాడు. 2025లో లింగంపల్లిలో అమ్ములు(8 నెలలు) అనే చిన్నారిని ఎత్తుకెళ్లి సిరిసిల్ల జిల్లా నామాపూర్కు చెందిన లక్ష్మికి రూ.3.5 లక్షలకు విక్రయించారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో లాస్య(05) అనే బాలికను అపహరించి సంగారెడ్డి జిల్లా, రాయపల్లికి చెందిన మాధవికి రూ.42 వేలకు విక్రయించారు. కన్న తండ్రే అమ్మేశాడు.. పటాన్చెరు చెందిన నల్ల బాలరాజు తన కుమారుడు ఆద్విక్(02), కుమార్తె ప్రియ(01)లను నిందితుడు మహ్మద్ ఆసీఫ్కు రూ.4.5 లక్షలకు విక్రయించాడు. అతను ఆద్విక్ను రూ.2.5 లక్షలకు పటాన్చెరు గొల్లపల్లికి చెందిన మెట్టు దుర్గాకు, కుమార్తె ప్రియను రూ.2 లక్షలకు ఉస్మాన్నగర్కు చెందిన సింగోలి మహేశ్వరికి విక్రయించాడు. ఆరుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు ఈ ముఠా విక్రయించిన ఆరుగురు చిన్నారులను చందానగర్ పోలీసులు కాపాడారు. వారిలో నలుగురిని రంగారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్కు అప్పగించారు. నలుగురు చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించగా మరో ఇద్దరు చిన్నారులు అమ్ములు, లాస్య తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు తెలిపారు. పక్కాగా..పకడ్బందీగా.. క్లినిక్ మాటున దందా.. సిద్దిపేటలో నర్సింగ్ క్లినిక్ నిర్వహిస్తున్న రిజ్వానా ఆధ్వర్యంలో ఈ ముఠా ఐదేళ్లుగా కిడ్నాప్లకు పాల్పడుతోంది. సంతానం లేని వారు రిజ్వానా సంప్రదించిన వెంటనే ఆమె ముఠాకు సమాచారం అందిస్తుంది. దీంతో నర్సింహా రెడ్డి రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఉన్న చిన్నారులను గుర్తించి రాజుకు తెలియజేస్తాడు. రాజు వారిని కిడ్నాప్ చేసి ఆసీఫ్కు సమాచారం అందిస్తాడు. రాజు రిజ్వానా ఇచ్చిన అడ్రస్లో సంబందిత వ్యక్తులకు చిన్నారులను అప్పగించి నగదు తీసుకునేవాడు. అఖిల్ను విక్రయించిన కేసులో రాజు రూ.3.5 లక్షలు, ఆసీఫ్ రూ.2 లక్షలు, రిజ్వానా రూ.1.5 లక్షలు పంచుకున్నట్లు తెలిపారు. ఎన్ని కిడ్నాప్ ముఠాలతో రిజ్వానాకు సంబంధం ఉంది అనే అంశంపై విచారణ చేపడతామని డీసీపీ తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చందానగర్ ఇన్స్పెక్టర్ ఎస్.విజయ్, డీఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నష్ట’మర్ కేర్!
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లో సంప్రదించి నష్టపోయింది ఒకరైతే... అంతకుచిక్కకుండా అమేజాన్ పే రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ మారిపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయారు మరొకరు. ఈ ఇద్దరు నగరవాసులు ఇచ్చిన ఫిర్యాదులతో సోమవారం వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆజంపుర ప్రాంతానికి చెందిన వ్యక్తి (69) గత నెల 26న బ్లింకిట్ యాప్ ద్వారా మేకప్ కిట్ ఆర్డర్ ఇచ్చారు. తమకు వచ్చిన వస్తువులు దెబ్బతిని ఉన్నట్లు గుర్తించిన అతను వాటిని రిటర్న్ చేసేందుకు బ్లింకిట్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన ఓ నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ అసలైనదిగా భావించిన బాధితుడు దానిని సంప్రదించాడు. ఆ కాల్ అందుకున్న వ్యక్తి తాను బ్లింకిట్ యాప్ ప్రతినిఽధిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి సమస్య విని.. ఆ ఉత్పత్తులు రీప్లేస్ చేస్తానంటూ హామీ ఇచ్చాడు. ఆపై కొంతసేపటికి వాట్సాప్ ద్వారా సంప్రదించిన మరో వ్యక్తి తాను బ్లింకిట్ తరఫు నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. బాధితుడి నుంచి ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. దానికి ఓ లింకు పంపిన అతగాడు దీన్ని వినియోగించి పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాడు. బాధితుడు అలానే చేయడంతో ఆ లింకులో ఉన్న యాండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్ ఆమె ఫోన్లో నిక్షిప్తమైంది. దీని ఆధారంగా ఆమె యూపీఐ యాప్స్ వాడిన నిందితులు వాటి నుంచి రూ.4193 కాజేశారు. దీనిని గుర్తించిన బాధితుడు ఫోన్ ద్వారా బ్లింకిట్ ప్రతినిధిగా చెప్పుకున్న వ్యక్తిని సంప్రదించాడు. ఏదో పొరపాటు జరిగిందని చెప్పిన అతగాడు ఆ మొత్తం కూడా రిఫండ్ అవుతుందని చెబుతూ ఈసారి బాధితుడి కుమార్తె ఫోన్లో డౌన్లోడ్ చేయించాడు. అదే పంథాలో ఆమె ఖాతాలో ఉన్న రూ.98,001 కాజేశారు. ఇలా మొత్తం రూ.1,02,194 కోల్పోయిన బాధితుడు ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించి, సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. మరో ఉదంతంలో చాంద్రాయణగుట్టకు చెందిన యువకుడు (37) అంతుచిక్కని సైబర్ నేరంలో రూ.1,11,740 కోల్పోయాడు. గత నెల 14న సదరు యువకుడు తన అమేజాన్ పే ఖాతాలోకి గిఫ్ట్ ఓచర్ల ద్వారా రూ.1,12,500 యాడ్ చేసుకున్నాడు. దీంతో పాటు తన వద్ద ఉన్న మొత్తాన్ని వెచ్చించి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నుంచి అమేజాన్ యాప్ ద్వారా రెండు ఐదు గ్రాముల బంగారు నాణేలు ఆర్డర్ చేశారు. 17న ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన ఆ సంస్థ యువకుడు వెచ్చించిన మొత్తాన్ని అతడి అమేజాన్ పే ఖాతాకు బదిలీ చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు అమేజాన్లో అతడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ మారిపోయింది. ఆపై అందులో ఉండాల్సిన రూ.1,11,740 మాయమయ్యాయి. 19న అమేజాన్ సంస్థను సంప్రదించిన బాధితుడు ఈ విషయం తెలుసుకున్నాడు. ఎట్టకేలకు దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నేరం ఎలా జరిగింది? రిజిస్టర్డ్ నెంబర్, మెయిల్ ఐడీ ఎలా మారాయి? తదితర అంశాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. గూగుల్లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నిజమైనదిగా నమ్మి సంప్రదించిన నగర బాధితుడు ఇద్దరికి ఏపీకే ఫైల్స్ పంపి రూ.1.02 లక్షలు స్వాహా అంతుచిక్కని అమేజాన్ పే ‘మార్పిడి’ లావాదేవీలు నగర సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసులు నమోదు -
‘ఖజానా’ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
చందానగర్: ఖజానా జ్యువెలరీ దోపిడీ ఘటనలో మరో ఇద్దరు దొంగలను గుజరాత్లోని అంకలేశ్వర్లో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు. ఖజానా దొంగతనం కేసులో ఆరుగురు నిందితులు పాల్గొనగా..ఒకడు సహకరించాడు. వీరిలో ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ షాలను ఈ నెల 15న పుణేలో అరెస్ట్ చేయగా, అనిష్కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్లను 19వ తేదీన పుణేలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రిన్స్ కుమార్ భారతి, రోహిత్ కుమార్ రజాక్ అలియాస్ రోహిత్ భాటియా (ఖజానాలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయం చేసిన వ్యక్తి)లను గుజరాత్లో శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు (17) మైనర్ కావడంతో బిహార్లో అదుపులో తీసుకొని అక్కడి కోర్టులోనే హాజరుపర్చారు. కాగా వారి వద్ద నుంచి 1915 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక పిస్తోల్ను స్వాధీనం చేసుకోగా, ప్రధాన నిందితుల వద్ద నుంచి కిలోన్నర వెండి ఆభరణాలు, ఒక పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రిన్స్ కుమార్ భారతీ అరు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. రోహిత్ కుమార్ రజాక్పై బిహార్ రాష్ట్రం సరణ్ జిల్లాలో దోపిడీ కేసు నమోదై ఉంది. నిందితులను పట్టుకోవడంలో సైబరాబాద్ ఎస్ఓటీ, సీసీఎస్, లా అండ్ ఆర్టర్ పోలీసులు తీవ్రంగా శ్రమించారంటూ వారిని సీపీ అభినందించారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావుసాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతో పాటు సోమవారం నుంచి ఇంటింటికీ జ్వరాల సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆశాలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి జ్వర పీడితులను గుర్తించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. సమన్వయంతో పని చేయాలి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఎంహెచ్ఓ సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంల సమన్వయంతో పంచాయతీ, మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగీ, చికున్ గున్యా మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వర్షాలకు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. వర్షం నీరు నిలువ ఉంచకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ షికాహయత్, డాక్టర్ విజయ పూర్ణిమ, జల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలనే పూజిద్దాం
సనత్నగర్: గణేష్ చతుర్ధి వేడుకల సందర్భంగా భక్తులు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ కోరారు. పర్యావరణ అనుకూలమైన గణేష్ విగ్రహాలను పూజించాలంటూ రూపొందించిన అవగాహన ప్రచార పోస్టర్లను శనివారం సచివాలయంలోని ఆమె ఛాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నుంచి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకు మారాలన్నారు. మట్టి గణేష్ విగ్రహాలను తయారుచేసి ఇంట్లో, నివాస ప్రాంతాల్లో పూజిద్దామన్నారు. పూజల్లో ఉపయోగించే పూలు, మూలికలను కంపోస్ట్ చేయాలని, బయోడిగ్రేడబుల్ కాని పదార్థాలను నీటి వనరుల్లో వేయకూడదని చెప్పారు. 2025 గణేష్ చతుర్ధికి సంబంధించి టీజీ పీసీబీ మట్టి గణేష్ విగ్రహాల ప్రచారం నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అలాగే జీహెచ్ఎంసీతో పాటు వివిధ జిల్లాల్లో పీసీబీ ఆధ్వర్యంలో 3.24 లక్షలకు పైగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపడుతునట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి.రవి, చీఫ్ ఇంజనీర్ రఘు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ టీజీపీసీబీ ఆధ్వర్యంలో 3.24 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ -
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఉప్పల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకు మండప నిర్వాహకులు, భక్తులు, కాలనీ అసోసియేషన్లు సహకరించాలని మల్కాజ్గిరి డీసీపీ పద్మజా రెడ్డి సూచించారు. పండుగ సమీపిస్తున్న కొద్ది నగరంలో హడావుడి పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీస్ గస్తీని కూడా పెంచామన్నారు. వినాయక మండప నిర్వాహకులతో శనివారం సాయంత్రం ఉప్పల్ భగాయత్లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వినాయక ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అన్నారు. మెరుగైన భద్రతకోసం మండపాల వద్ద అన్ని సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు చక్రపాణి, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు భాస్కర్, గోవింద్ రెడ్డి, రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిందితుడిని శిక్షించి మాకు న్యాయం చేయండి
మూసాపేట: కూకట్పల్లిలోని దయార్గూడలో హత్యకు గురైన సహస్ర తల్లిదండ్రులు, బంధువులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీస్ డౌన్డౌన్, ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్, ఇన్స్పెక్టర్ కె.వి.సుబ్బారావు, పోలీస్ సిబ్బంది కలిసి బాలిక తల్లిదండ్రులను, బంధువులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపచేశారు. వారిని పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం బాలుడిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా అతడికి సపోర్టు చేశారని, వారికి కూడా శిక్ష పడాలని కోరారు. ఇలాంటి కడుపుకోత మరే తల్లిదండ్రులకు రాకూడదన్నారు. బాలిక తల్లి రేణుక మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి హత్య చేస్తే భయపడే విధంగా చట్టాలు రావాలని, ఇలా వదిలేస్తే ఇంకా ఎంతమంది తల్లులకు కడుపుకోత ఉంటుందోనని అన్నారు. తన పాప ఏమి అన్యాయం చేసిందని అన్ని కత్తి పోట్లు పొడవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. సహస్ర పేరిట కొత్త చట్టం తీసుకురావాలి: బక్కి వెంకటయ్య ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దయార్గూడలో బాలిక నివాసానికి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి సహస్ర కుటుంబ సభ్యులకు అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పారు. సహస్ర పేరుమీదనే బలమైన చట్టం తీసుకు వచ్చేలా ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు. కొత్త చట్టం వస్తేనే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని, భయం ఉంటుందని అన్నారు. కాగా కూకట్పల్లి పోలీస్స్టేషన్ వద్ద బాలిక తల్లిదండ్రులను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఏ. పాల్ పరామర్శించారు. ఇలాంటి కష్టం మరొకరికి రాకూడదంటే కొత్త చట్టాలు తీసుకురావాలని అన్నారు. సహస్ర తల్లిదండ్రుల డిమాండ్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ ముందు ధర్నా.. రాస్తారోకో -
గొప్ప దార్శనికుడు పీవీఆర్కే ప్రసాద్
ఉప్పల్: దివంగత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ గొప్ప దార్శనికుడు, సంస్కర్త అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పద్మశ్రీ డా.డి హనుమాన్ చౌదరి కొనియాడారు. ధర్మం కోసం నిత్యం పరితపించేవాడని గుర్తు చేసుకున్నారు. పీవీఆర్కే ప్రసాద్ 85వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉప్పల్ భగాయత్లోని ఐ ఫోకస్ కార్యాలయంలో మిషన్ చీఫ్ కో–ఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పూర్తి సభ’కు హనుమాన్ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రసాద్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేసి మంచి పేరు సంపాదించారన్నారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నోమార్పులు తీసుకు వచ్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని నమ్మేవారని గుర్తు చేశారు. దళితులు, మత్స్యకారులను టీటీడీ ఖర్చులతో రప్పించి తిరుమలలో స్వామి వారి దర్శనం చేయించే వారని గుర్తు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రసాద్ కృషిని గుర్తించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వయంగా ప్రశంసించారన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు, శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం ట్రస్టీ డా.సి.విజయ రాఘవాచార్యులు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీఆర్కే ప్రసాద్ సతీమణి గోపిక తదితరులు పాల్గొన్నారు.పద్మశ్రీ హనుమాన్ చౌదరి -
ఏఐ టెక్నాలజీతో
జలమండలి వినియోగదారులకు సేవలుసాక్షి, సిటీబ్యూరో: తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో అధునాతన సాంకేతికతతో సేవలందిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ జలమండలి..తాజాగా వినియోగదారుల ఫిర్యాదులను సైతం త్వరితగతిన పరిష్కరించడానికి ఏఐ (కత్రిమ మేధ) సాంకేతికతను వినియోగిస్తోందని ఎండీ అశోక్రెడ్డి వెల్లడించారు. ఈమేరకు గత సంవత్సర కాలంలో మెట్రో కస్టమర్ కేర్ (ఎంసీసీ)లో నమోదైన ఫిర్యాదులు, ట్యాంకర్ బుకింగ్ వివరాలను ఏఐ సాంకేతికత ద్వారా కొన్ని రోజులగా ఐటీ విభాగపు అధికారులు విశ్లేషిస్తున్నారని చెప్పా రు. కాగా జలమండలి కస్టమర్ కేర్కు గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి..ఇప్పటివరకు 6 లక్షల 50 వేలకు పైగా వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందగా, 12 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన టాప్ 10 మంది వినియోగదారులను గుర్తించారు. ప్రగతినగర్లోని సౌహితి ఎంకే రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులు 674 ట్యాంకర్లను బుక్ చేసినట్టు తేల్చారు. ప్రగతినగర్లో పర్యటన ప్రగతీనగర్ లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించి స్థానికులతో ముచ్చటించారు. గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 15 రోజులకోసారి నీటి సరఫరా జరిగేదని, తరువాత జలమండలి పరిధిలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మంచి నీరు సరఫరా జరుగుతుందని వివరించారు. రోజు విడిచి రోజు నీటి సరఫరా అందేలా చూడాలని స్థానికులు ఎండీకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ప్రగతినగర్ సంపునకు ప్రత్యేక ఫీడర్ మెయిన్ను అభివద్ధి చేస్తే ఈ సమస్య తీరిపోతుందని, దానికి రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు ఎండీకి వివరించారు. ప్రతిపాదనలను పరిశీలించిన ఎండీ వెంటనే పనులు చేపట్టాలని ఆమోద ముద్ర వేశారు. ప్రగతి నగర్లో అత్యధికంగా వాటర్ ట్యాంకర్లను బుక్ చేసిన సౌహితి ఎంకే రెసిడెన్సీ అపార్టుమెంటును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో కలిసి సందర్శించారు. ప్రాంగణంలో పాడైన బోర్ వెల్ను గుర్తించి..వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాలమైన అపార్టుమెంటు ఆవరణలో కొన్ని ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి ఆవరణలోని బోరు పనిచేసే అవకాశం ఉంటుందని వివరించారు. అవసరమైన సాంకేతిక సహాయం జలమండలి స్థానిక అధికారులు అందజేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ఆనంద్ నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్ర మోహన్, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఎండీ అశోక్రెడ్డి వెల్లడి అత్యధిక ట్యాంకర్లు బుక్చేసిన అపార్టుమెంట్ సందర్శన -
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: నగర శివారులోని జంట జలాశయాలు నిండుకుండున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువన నీరు విడుదల చేస్తుండగా.. బుధవారం సాయంత్రం ఉస్మాన్సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. పరీవాహక ప్రాంతాల్లోని నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది.హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం : 1,763.50 అడుగులుప్రస్తుత నీటిమట్టం : 1,763.00 అడుగులుఇన్ఫ్లో : 1600 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో : 1,017మొత్తం గేట్లు : 17ఎత్తిన గేట్లు : 1 గేటు మూడు అడుగుల మేరఉస్మాన్సాగర్పూర్తి స్థాయి నీటి మట్టం : 1,790 అడుగులుప్రస్తుత నీటిమట్టం : 1,788.60 అడుగులుఇన్ఫ్లో : 1200 క్యూసెక్కులుఅవుట్ఫ్లో : 220మొత్తం గేట్లు : 15ఎత్తిన గేట్లు : 2 గేట్లు.. అడుగు మేర -
శాంతిని నెలకొల్పడంలో పీస్ కమిటీలు కీలకం
నగర కొత్వాల్ సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల పాత్ర కీలకమని సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన అన్ని జోన్లకు సంబంధించిన పీస్ కమిటీల సభ్యులతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఉన్న ఆడిటోరియంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ‘నగరంలో మొత్తం 1500 మంది పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉన్నారు. వివిధ వర్గాల మధ్య అవగాహన, సహకారాన్ని పెంపొందించడంలో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఎంతో దోహదపడుతోంది. నగరానికే ప్రత్యేకమైన ‘గంగా–జమునా తెహజీబ్’ను (వివిధ మతాల మధ్య సామరస్యం) నిలబెట్టడానికి ఈ కమిటీలు ఎంతో కృషి చేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ తమ ఏరియాలో శాంతిని నెలకొల్పడానికి కమిటీ సభ్యుల సేవలు అవసరం. శాంతి భద్రతలను పరిరక్షించడానికి స్థానిక పోలీసులకు సహకరించాలి. ఈ కమిటీల సభ్యుల కృషి వల్లే నగరానికి మంచి పేరు వచ్చింది. పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల్లో యువకులను కూడా చేర్చుకోవాలి. పోలీసు అధికారులు సమాజంలోని సభ్యులతో కలిసి, వారి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్తేనే సరైన పోలీసింగ్ సాకారం అవుతుంది’ అని అన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సిటీ పోలీసులకు మద్దతుగా ఉంటూ, రాబోయే పండుగలు శాంతియుత వాతావరణంలో జరిగేలా, సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించడానికి, ప్రజల్లో సామరస్య భావం, ఐక్యత నెలకొల్పడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఎస్పీ డీసీపీ కె.అపూర్వ రావు తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం: కమిషనర్
వెంగళరావునగర్: నగరంలోని కాలనీలు, బస్తీలు నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ సర్కిల్–19 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత, ప్రజారోగ్యం.. ఈ రెండూ విడదీయరాని అంశాలని, పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వానలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కర్ణన్ సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, జానకమ్మతోట, రహమత్నగర్, ఎస్సీఆర్ హిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కర్ణన్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్రావు, హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్రెడ్డి, ఏసీపీ ప్రసీద, డీఈఈ భద్రు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎస్ఎస్ఆర్ షెడ్యూల్
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) షెడ్యూల్ విడుదల చేసిందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఎస్ఎస్ఆర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్లకు అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 25 వరకు వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు తుది జాబితా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వివిధ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సూచనలు స్వీకరించి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధులు మర్రి శశిధర్ రెడ్డి, కొల్లూరి ప్రవీణ్ కుమార్, పి.వెంకటరమణ, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి కె.సందేశ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మల్లంగి విజయ్, సీపీఎం ప్రతినిధి ఎం.శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాజేష్ కుమార్, మహ్మమద్ వాజిద్ హుస్సేన్, తెలుగు దేశం పార్టీ ప్రతినిధి ప్రశాంత్ రాజు యాదవ్, ఎంఐఎం నుండి సయ్యద్ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. -
విన్నావా.. వినాయకా!
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) బదులు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని పంపిణీ చేయాలన్న జీహెచ్ఎంసీ ఆలోచన మంచిదే. ప్రతిమలను ఉచితంగానే పంపిణీ చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. ఆ సంస్థలను సంప్రదించకుండా జీహెచ్ఎంసీ ఖజానా నుంచే అందుకు నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమవడం ఆరోపణలకు తావిస్తోంది.ఇప్పటికే జీహెచ్ఎంసీ చెరువుల ప్రక్షాళన, తదితర కార్యక్రమాల కోసం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్ నిధులతో పనులు చేస్తోంది. కోట్లాది రూపాయలతో ఆ పనులు చేస్తున్న జీహెచ్ఎంసీకి.. మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సీఎస్సార్ నిధులు వినియోగించుకోవాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలోనే పనులు చేస్తూ ఏటా కోట్ల రూపాయల పనులు పొందుతున్న సంస్థలు సైతం స్వచ్ఛందంగా వాటంతట అవే ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. కనీ సం ఆ సంస్థలను సంప్రదించినా జీహెచ్ఎంసీకి రూ పాయి ఖర్చు లేకుండా, ఖజానాపై ఎలాంటి భారం పడకుండా ప్రజలకు ఉచితంగానే మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం సాధ్యమయ్యేది.టెండర్లకు వెళ్లేందుకే..ఎల్–1 ధరలకు మట్టి వినాయక విగ్రహాలను సరఫరా చేసే సంస్థలు టెండరులో పాల్గొనాల్సిందిగా బల్దియా తాజాగా నోటిఫికేషన్ వెలువరించింది. అది ఏమైనా ఆ రంగంలో పని చేస్తున్నవారందరూ వినియోగించుకునేలా ఉందా? అంటే అదీలేదు. కేవలం రెండు రోజుల గడువులో కేవలం వ్యక్తిగతంగానే టెండర్లు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హులైన వారిని ఎంప్యానెల్కు ఎంపిక చేశాక మూడు రోజుల్లో విగ్రహాలను నిర్ణీత ప్రాంతాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టెండరులో పాల్గొనేందుకు ఆన్లైన్ అవకాశమూ ఇవ్వలేదు. ఏవైనా సందేహాలుంటే సంప్రదించాలంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవారే లేరు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ‘ఆస్థాన కళాకారుల’ కోసమే ఈ టెండర్లు పిలిచినట్లుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తూతూమంత్రంగా..గతంలోనూ ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలని ప్రకటనలు గుప్పించినప్పటికీ.. ఒప్పందం మేరకు తయారు చేయాల్సినన్ని చేయలేదనే ఆరోపణలున్నాయి. తయారైన వాటిని ఎన్ని చోట్ల ఎవరికి పంపిణీ చేశారో తెలియదు. కొన్ని చెత్త కుప్పల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఆ మాత్రం దానికి జీహెచ్ఎంసీ ఖజానా నుంచి ఖర్చు చేయడం ఎందుకనే విమర్శలు వెల్లువెత్తినా.. జీహెచ్ఎంసీ ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు.ఇలా చేయాల్సింది..ఒకవేళ నిజంగానే చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటే ఇందిరా మహిళాశక్తి పేరిట క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయిస్తున్న జీహెచ్ఎంసీ.. సెల్ఫ్హెల్ప్ గ్రూపు మహిళా సంఘాల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయించి పంపిణీ చేస్తే.. అటు వారికి ఉపాధి, ఇటు పర్యావరణహితమూ సాధ్యమయ్యేవని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.ఏవి ఎన్నో వివరాలేవి?గతంలో మాదిరిగానే 8 అంగుళాలవి, 1 అడుగు, 1.5 అడుగుల మట్టి విగ్రహాలు నిర్ణీత వ్యవధిలోగా అందించాలని పేర్కొన్నప్పటికీ, ఏ సైజువి ఎన్నో వివరాల్లేవు. అంటే అవసరాన్ని బట్టి విగ్రహాల సంఖ్యను పెంచుతారో, తగ్గిస్తారో చెప్పలేని పరిస్థితి. దీంతో.. విగ్రహాల పేరిట ఈసారి ఎన్ని నిధులు ఖర్చు చేయనున్నారో తెలియదు. గతంలో రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు.ఇవీ ధరలు..గరిష్టంగా ఏ సైజు విగ్రహాలకు ఎంత చెల్లిస్తారో వివరాలిలా ఉన్నాయి.● 8 అంగుళాల విగ్రహం: రూ. 33.39● 1 అడుగు విగ్రహం: రూ.136.50● 1.5 అడుగు విగ్రహం: రూ.339.15 -
అరిస్తే.. కరుస్తా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వీధి కుక్కల బెడద వేధిస్తోంది. గల్లీల్లో ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకునే పిల్లల నుంచి, దారిన పోయే పెద్దల వరకూ దాడి చేసి ప్రాణాలు తోడేస్తున్నాయి. మోటారు సైకిల్పై వెళ్లే వారిని సైతం వెంబడిస్తున్నా యి. దొరికితే పిక్కలు పీకేస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజు కు సరాసరిన 100 కేసులు వస్తున్నాయి. నెలలో కనీసం ఒకటి నుంచి రెండు రేబిస్ కేసులు నమోదవుతున్నాయంటే కుక్కకాట్ల తీవ్రను అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీ ‘ఏబీసీ’ కార్యక్రమంపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.‘భౌ’గోళిక సమస్యలతో..కుక్కలు నిత్యం తిరిగే వారిని గుర్తిస్తాయి. కొత్త వ్యక్తులు వచ్చినా, కొత్త జీవాలు వచ్చినా వాటిలో తమ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని భావిస్తుంటాయి. జీహెచ్ఎంసీ జంతు జనన నియంత్రణ ఆపరేషన్లు చేపట్టిన తర్వాత ఒక ప్రాంతంలో పట్టిన కుక్కలను వేరే ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కొంత మంది కుక్కను కొన్నాళ్లకు విసుగొచ్చి మధ్యలో దూరం తీసుకెళ్లి విడిచిపెట్టేస్తున్నారు. దీంతో అవి ఒంటరిగా మారిపోతున్నాయి. వాటికి భౌగోళిక సమస్యలు (టెరిటోరియల్ బిహేవియర్) వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అక్కడుండే కుక్కలు కొత్తగా వచ్చినవాటిపై దాడి చేస్తున్నాయి. దీంతో వాటిల్లో అభద్రతా భావం నెలకొంటోంది. ఒకరకమైన ఉద్రేకమైన భావనలోకి వెళిపోతుంది. మనుషులను, జంతువులను శత్రువులుగా చూస్తుంది. సరైన ఆహారం, ఆవాసం లేకపోవడం సమస్యలతో దాడులకు తెగబడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిర్మానుష్య ప్రాంతాలు దాటాలంటే భయపడాల్సివస్తోంది.రూ.30 కోట్లు ఖర్చు చేసినా..ఒక్కో కుక్క ఒక దఫా 7 నుంచి 8 పిల్లలకి జన్మనిస్తుంది. జీహెచ్ఎంసీ, జంతు సంక్షేమ సంఘాలు జంతు జనన నియంత్రణ (ఏబీసీ), యాంటీ రేబిస్ కార్యక్రమాలను చేపడుతున్నాయి. సిటీ పరిధిలో 20 లక్షలకుపైగా కుక్కలు ఉండగా ఏటా సుమారుగా 50 వేల నుంచి 60 వేల వీధి కుక్కలను పట్టుకుని, జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నారు. ఏబీసీ కోసం గత రెండేళ్లలో రూ.30 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోతున్నారు.రేబిస్ ప్రాణాంతకమే..చల్లని వాతావరణంలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోంది. వీధి కుక్కల్లో ఒక కుక్కకు రేబిస్ సోకినా, అది గుంపులో కలవడం అన్నింటికి వైరస్ సోకుతోంది. మాస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. రేబిస్ వ్యాధి ప్రాణాంతకంగానే పరిణమిస్తుంది. రేబిస్ సోకిన కుక్కకు గొంతులో కండరాలు బిగుసుకుపోతాయి. నీరు, ఆహారం, చివరికి లాలాజలం కూడా మింగడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతుంది. ఆ కుక్క కరిసి నా, దాని లాలాజలం మనుషుల శరీరంపై ఉన్న గా యాలపై పడినా రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది.నియంత్రణ ఒక్కటే మార్గంగ్రేటర్లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వాటిని నియంత్రణ ఒక్కటే మార్గం. జంతు కుటుంబ నియంత్రణ (ఏబీసీ)ఆపరేషన్ల సంఖ్యను, సంరక్షణ కేంద్రాలను పెంచాలి. కుక్క కరిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. వెంటనే డైద్యుడిని సంప్రదించి, (ఏఆర్బీ)యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కరిచిన కుక్కను గుర్తించి మున్సిపల్ వారికి అప్పగించాలి.– డా. డి.అశోక్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ -
సినీ కార్మికులు రోడ్డున పడ్డారు
బంజారాహిల్స్: వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో వేలాది మంది కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. షూటింగ్లు జరగకపోవడంతో పూట గడవడంలేదు. ఇంటి అద్దెలు చెల్లించే పరిస్థితి లేకుండాపోయింది. అప్పు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.30 శాతం వేతనాలు పెంచాలంటూ..నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాల్సి ఉంటుంది. గత జూన్ 30న ఈ గడువు ముగిసింది. జూలై 1 నుంచి పెంచిన 30 శాతం వేతనాలతో సినీ కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది. వేతనాల పెంపునకు ఫిలిం ఛాంబర్ వెనుకడుగు వేసింది. తమకు మూడు నెలల గడువు కావాలంటూ కోరింది. నెల గడవకముందే తాము 15 శాతం వేతనాలు పెంచుతామని అది కూడా మూడు విడతలుగా పెంచుతామని ఫైటర్లు, డ్యాన్సర్లు, టెక్నీషియన్లకు మాత్రం పెంచేది లేదంటూ మెలిక పెట్టింది. దీంతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు సాధ్యం కాని షరతులకు ఒప్పుకోలేదు. ఫలితంగా రెండు వారాల నుంచి సినీ పెద్దలకు కార్మిక యూనియన్ నాయకులకు చర్చలు జరుగుతున్నా అవి ఫలప్రదం కావడం లేదు. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇంటి అద్దెలు కట్టాలంటూ కొందరు, పిల్లల ఫీజులు చెల్లించలేక ఇంకొందరు.. ఇలా సినీ కార్మిక లోకం కన్నీరు పెడుతోంది. గత మూడు రోజుల నుంచి కొందరు సినీ పెద్దలు ఫిలిం ఫెడరేషన్ నాయకులతో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఫిలిం ఫెడరేషన్ అనుబంధంగా ఉన్న జూనియర్ ఆర్టిస్ట్లు, లైట్మెన్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మేకప్ ఆర్టిస్ట్లు, డ్రైవర్లు.. తదితర కార్మికులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అద్దె ఇల్లు ఖాళీ చేయాలంటున్నారుషూటింగ్లు ఉంటేనే ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు చెల్లించగలుగుతాం. ఇప్పుడు ఇంటి అద్దె కూడా కట్టలేక చాలా మంది కార్మికులు చేతులెత్తేశారు. ఇప్పటికై నా సినీ పెద్దలు మా విషయంలో పెద్ద మనసుతో ఆలోచించి మా డిమాండ్లు నెరవేర్చాలి. – లలిత, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్అన్నీ కొర్రీలేమా డిమాండ్లు నెరవేర్చడంలో కొర్రీలు పెడుతున్నారు. ఆదివారం ప్రభుత్వ సెలవుల్లో ఫుల్ కాల్షీట్లు ఇస్తారు. ఇవి ఇచ్చేది లేదంటూ పెద్దలు చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. మా కార్మికుల విషయానికి వచ్చేసరికి ఎందుకింత పట్టుదలగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. - చంద్రకళ, జనరల్ సెక్రటరీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ -
ఎలక్షన్ కమిషన్ ‘మోదీ కమిషన్’గా మారింది
పంజగుట్ట: దేశంలో హిందుత్వ, ఫాసిస్టు విధానాల అమలులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ను మోదీ కమిషన్గా మార్చిందని పలువురు వక్తలు విమర్శించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం, జాగో నవ భారత్, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘వుయ్ డిమాండ్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్–ఫెయిర్ ఎలక్షన్స్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ చంద్రకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత చలపతిరావు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజాలంలో ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగ యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నారని, బిహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఎన్నికల కమిషన్ కొత్త నాటకం ఆడుతుందని, అందులో భాగమే ఓటర్ల సవరణ అని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర బాడీగా ఉండాలని, అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించారు. ఒకప్పుడు ఎన్నికల్లో ఫిజికల్ రిగ్గింగ్ జరిగేదని, ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. సమావేశంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, జానకి రాములు, పోటు రంగారావు, వి.శ్రీనివాస్, సోహ్రాబేగం, పాశం యాదగిరి, బండి దుర్గా ప్రసాద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల విమర్శ -
పుస్తకాలు, పత్రికలు చదవండి
● విద్యార్థులకు హైడ్రా కమిషనర్ సూచన ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాలు, దిన పత్రికలను చదడం అలవాటుగా చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రంగనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సానుకూల థృక్పథంతో భవిష్యత్కు మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రమం తప్పకుండ తరగతులకు హాజరుకావాలన్నారు. విద్యార్థుల జీవితంలో 90 శాతం విజయం కష్టపడి పని చేయడం వల్ల, 5 శాతం స్మార్ట్ వర్క్, 5 శాతం నెట్ వర్కింగ్ వల్ల లభిస్తుందన్నారు. సోషల్ మీడియాపై ఆధారపడకుండ పుస్తకాలను చదవడం అలవాటుగా పెట్టుకోవాలని విద్యార్థులకు చూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.చంద్రశేఖర్, ఇంజినీరింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ సుమన్ సిన్హా, ఇంజినీరింగ్ డీన్ ప్రొ.ఎ.కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.మంగు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శ కాచిగూడ: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. బుధవారం బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. సమస్యలను సంబంధిత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్రెడ్డి మాట్లాడుతూ నగర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ‘ఛలో సెక్రటేరియట్ – సేవ్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా నీళ్లు విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ ఎన్.గౌతంరావు, ఆనంద్గౌడ్, శ్రీనివాస్,శ్యామ్ సుందర్, రాజశేఖర్, మేకల సారంగపాణి, సందీప్, కొంతందీపిక, కేశబోయిన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
ఫెయిలయ్యాననే దిగులుతో బాలుడి ఆత్మహత్య
హస్తినాపురం: ఇంటర్లో ఫెయిలవడంతో కొద్ది నెలలుగా మనస్తాపం చెందిన ఓ బాలుడు ఫ్యాన్కి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శారదనగర్కాలనీలో నివాసం ఉంటున్న పావని, అనిల్కుమార్ దంపతుల పెద్ద కుమారుడు ఉమామహేశ్వర్ (17) గత మార్చిలో రాసిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల డిప్రెషన్కు లోనయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లి రాత్రి 11 గంటలకు వచ్చి ఒంటరిగా తన బెడ్రూంలో పడుకున్నాడు. మధ్య రాత్రి అనిల్కుమార్ చిన్న కుమారుడికి వాంతులు కావడంతో వాష్రూంకు తీసుకెళ్లేందుకు ఉమా మహేశ్వర్ పడుకున్న బెడ్రూం డోర్ను కొట్టగా డోర్ లాక్చేసుకుని ఉన్నాడు. అతని సెల్ఫోన్కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో బెడ్రూం తలుపులు పగలగొట్టి చూడగా ఉమామహేశ్వర్ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కిందకి దించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. మృతుని తల్లి పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
రాజీవ్ గాంధీని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ఖైరతాబాద్: పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి దేశ భవిష్యత్ను నిర్ణయించే అవకాశం కల్పించారని, కంప్యూటర్ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్గాంధీ స్పూర్తితోనే ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందన్నారు. తాము కూడా రాజీవ్ బాటలో నడుస్తూ సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో పేదల కలలు సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమన్నారు. జయంతి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొని రాజీవ్కు నివాళులర్పించారు. రాజీవ్గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ను ప్రధానిని చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
సచివాలయంలో అరుదైన పక్షి
ఆఫ్రికన్ గ్రే ప్యారెట్గా గుర్తించిన అటవీశాఖ సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయానికి బుధవారం అరుదైన అతిథి వచ్చింది. సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయం పేషీ సిబ్బంది వద్దకు ఓ అరుదైన పక్షి వచ్చి వాలింది. వాతావరణం చల్లగా ఉండటం, వర్ష ప్రభావం వల్ల..ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి సచివాలయానికి చేరింది. దీనిపై కార్యాలయంలోని సిబ్బంది అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ పక్షిని ఆఫ్రికన్ గ్రే ప్యారెట్గా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
కొత్వాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కోర్టు
సాక్షి, సిటీబ్యూరో: అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలు కలిగిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్ల సమస్యను పరిష్కరించారు. పోలీసుస్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన కొత్వాల్ ఆయా గ్యాంగ్లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం పది పోలీసుస్టేషన్లకు సంబంధించిన 11 గ్యాంగ్లకు చెందిన 101 మందిని విడిగా విచారించారు. అందులో ఆరు గ్యాంగ్లు తమ పెద్దలు, కుటుంబీకుల సమక్షంలో శాంతియుతంగా రాజీ చేసుకున్నామని కొత్వాల్కు తెలిపాయి. మిగిలిన గ్యాంగ్లు భవిష్యత్తులో కూడా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లయితే వారితో బాండ్ రాయించుకుంటామని తెలిపారు. ఆపై ఈ కోర్టు విచారణను తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ కోర్టుకు స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వరావుతో పాటు పది ఠాణాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. -
వరదతో వణుకు!
సాక్షి, సిటీబ్యూరో/బండ్లగూడ జంట జలాశయాల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది. గురువారం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి 9,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, దిగువకు 12,046 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అంతకు ముందు 11 గేట్లు ఎత్తి క్రమంగా రెండు గేట్లు మూసి వేశారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట్) రిజర్వాయర్కు 2,800 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.50 అడుగులు చేరింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యంత్రాంగాలు, హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యహరించాలని ఆయన సూచించారు. సర్వీస్ రోడ్డుపై.. హిమాయత్సాగర్ వరద గేట్లను ఎత్తిన ప్రతిసారి సర్వీస్ రోడ్డును మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రతిసారి ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోతోంది. ప్రవాహం తగ్గిన తర్వాత కొత్త రోడ్డు నిర్మాణం తప్పం లేదు. వరద ప్రవాహానికి సంబంధం లేకుండా రోడ్డును కొంతపైకి లేని నిర్మించాలని స్థానికుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. అప్రమత్తం చేసిన అధికారులు.. వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో అధికారులు మూసీ, ఈసీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజ లను అప్రమత్తం చేశారు. ప్రజలు ఎవరు పరీవాహక ప్రాంతాల్లో ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశా రు. మైక్ల ద్వారా, వాట్సప్ గ్రూప్లు తదితర వాటి ని ఉపయోగించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ముప్పు దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కొంత మంది స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇళ్లల్లోకి వరద నీరు.. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ, ఈసీ నదుల నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు లోత ట్టు ప్రాంతాలలోని ప్రజలను కాపాడేందుకు సహా య చర్యలు చేపట్టారు. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యటన ఈసీ, మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఆర్డీఓ వెంకట్రెడ్డి, తహసీల్దార్ రాములు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న 40 మంది బాధితులను బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలకు తరలించారు. కొందరు దగ్గరలోని వారి బంధువుల ఇళ్లలోకి వెళ్లారు. వారికి భోజనాలు, ఇతర వసతులు కల్పిస్తామని అధికారులు తెలిపారు. నీటి ఉద్ధృతితో కూలిన వాకింగ్ ట్రాక్ ఉప్పల్: ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో గురువారం మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఉప్పల్ నాగోల్ వంతెన వద్ద పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పల్ మినీ శిల్పారామం అభివృద్ధిలో భాగంగా మూసీకి సమాంతరంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ వరద ధాటికి పూర్తిగా మునిగిపోయింది. కొన్ని చోట్ల మూసీలోకి కూలి పోయింది. ఈ వాకింగ్ ట్రాక్ కూలిపోవడం ఇది రెండోసారి. వరద నీటితో మునిగిపోయిన ఇళ్లు జంట జలాశయాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహం హిమాయత్ సాగర్ 9 గేట్లు ఎత్తివేత మూసీలోకి 12,046 క్యూసెక్కుల నీటి విడుదల అధికారులను అప్రమత్తం చేసిన జలమండలి ఎండీపూర్తి స్థాయి నీటి మట్టం : 1,763.50 అడుగులు ప్రస్తుత నీటి స్థాయి : 1,763.20 అడుగులు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు ప్రస్తుత సామర్థ్యం : 2.855 టీఎంసీలు ఇన్ ఫ్లో : 9000 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 12046 క్యూసెక్కులు మొత్తం గేట్ల సంఖ్య : 17 ఎత్తిన గేట్ల సంఖ్య : 9 (నాలుగు అడుగుల మేరకు) హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు -
ఔటర్ సర్వీసు రోడ్డుపైకి దొర్లిపడిన బండరాళ్లు
వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం మణికొండ: నార్సింగి నుంచి పోలీస్ అకాడమీ ఔటర్ సర్వీసు రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో భారీ బండరాయితో పాటు మరో చిన్నరాయి గురువారం సాయంత్రం సర్వీసు రోడ్డుపైకి దొర్లుకుంటూ వచ్చాయి. సర్వీసు రోడ్డు ఓ వైపు నుంచి పడి మధ్యలో డివైడర్పై నుంచి దాటి అవతలి రోడ్డు వరకు వెళ్లాయి. ఆ సమయంలో రెండు వైపుల నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. మంచిరేవుల 60 గజాల ఇందిరమ్మ కాలనీ పక్కనే ఔటర్ సర్వీసు రోడ్డు నిర్మాణ సమయంలో కొంత మేర గుట్టను తొలగించారు. పక్కనున్న గుట్టలను అలాగే వదిలివేయటంతో అవి వర్షాకాలం సమయంలో కూలుతున్నాయని స్థానికులు తెలిపారు. గురువారం రెండు రాళ్లు కూలగా మరో మూడు ప్రమాదకరంగానే రోడ్డును ఆనుకునే ఉన్నాయన్నారు. రోడ్డుపైకి వచ్చిన రాళ్లను ఔటర్ రింగ్ రోడ్డు నిర్వాహకులు వెంటనే తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మరోసారి ప్రమాదం జరగకముందే వాటిని తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రకృతి పిలిచింది!
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం. ఆపై వరుస సెలవులు. ఇంకేముంది ‘చలో టూర్’ అంటూ చెక్కేస్తున్నారు సిటీ టూరిస్టులు. వర్షాకాలం దృష్ట్యా పర్యాటకుల అభిరుచికి తగిన ప్యాకేజీలతో ముందుకొస్తున్నాయి పర్యాటక సంస్థలు, మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లోపు తిరిగి నగరానికి చేరుకొనేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్లో వర్షాకాలాన్ని ఆహ్లాదంగా గడిపేందుకు నగర పర్యాటకులు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను సందర్శించేందుకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కూడా భారీ రద్దీ కనిపిస్తోంది. వీకెండ్స్లో ముందస్తు బుకింగ్లతో పాటు తత్కాల్ టికెట్ బుకింగ్లకు కూడా అనూహ్యమైన డిమాండ్ ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అన్ని సదుపాయాలతో రోడ్డు మార్గంలో, విమానయానంలో ప్రత్యేక ప్యాకేజీలను అందజేస్తున్నట్లు హిమాయత్నగర్ ప్రాంతానికి చెందిన ఓ పర్యాటక సంస్థ ప్రతినిధి చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా చాలా మంది కేరళ, గోవా వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. అంతర్జాతీయ టూర్లలో వీసా అవసరం లేని దేశాలకు పర్యాటకులు ‘క్యూ’ కడుతున్నారు. దీవుల్లో విహారం.. ● వీసా అవసరం లేని దేశాలకు, ఆన్లైన్ అరైవల్ వీసా సదుపాయం ఉన్న దేశాలకు టూరిస్టుల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. మలేసియాలోని లంకావి వంటి దీవుల్లో విహరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇండోనేషియాలోని బాలి వంటి దీవులకు కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తరలి వెళ్తున్నట్లు ఐఆర్సీటీసీ అధికారి ఒకరు తెలిపారు.ఈ మేరకు ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్లాండ్ దేశాలకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లైట్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ● హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. మలేసియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్, మాల్దీవులు, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలు ఇప్పుడు టాప్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతకాలంగా వియత్నాం పర్యాటకులకు గమ్యస్థానంగా మారింది. తక్కువ బడ్జెట్లో ఇంటిల్లిపాదీ సందర్శించేందుకు అనుగుణంగా ఉండడంతో ఆ దేశానికి బుకింగ్లు ఎక్కువగా వస్తున్నట్లు కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. మరోవైపు దీవుల విహారంలో మాల్దీవులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేరళ ఎవర్గ్రీన్.. మాన్సూన్ టూర్కు ఎక్కువగా కేరళకు వెళ్తున్నారు. అలెప్పి వంటి పర్యాటక ప్రదేశాల్లో పచ్చదనాన్ని, జలపాతాలను సందర్శించి సేదదీరుతున్నారు. ‘హైదరాబాద్ నుంచి చాలా దూరం వెళ్లి ఫామ్ హౌస్లలో, రిసార్ట్లలో కొద్ది రోజులు గడపడం కూడా ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. అలాంటి టూర్లకు కూడా ఎక్కువ మంది తరలి వెళ్తున్నారు. కేరళ తర్వాత గోవా టూర్లు టాప్లో ఉన్నాయి. వేసవిలోనే కాదు, వర్షాకాలంలోనూ గోవాను ఎంపిక చేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్ నెలాఖరు వరకు మాన్సూన్ టూర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది టూర్ ఆపరేటర్లు 20 నుంచి 25 శాతం తగ్గింపు ధరలతో ప్యాకేజీలను అందజేస్తున్నారు. వరుస సెలవులు.. వర్షాలు.. చలో మాన్సూన్ టూర్ ఆకట్టుకుంటున్న డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాకేజీలు జలపాతాలు, దీవులపై పర్యాటకుల ఆసక్తి కేరళ, గోవా, ఇండోనేషియా, వియత్నాంకు ప్రయాణాలు -
నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
యాకుత్పురా: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్తో కలసి పలు ప్రాంతాల్లోని నాలాలను పరిశీలించారు. యాకుత్పురా ముర్గీనాలా, యశ్రఫ్నగర్, మౌలాకాల్లా, తలాబ్ కట్టా, గంగానగర్ నాలాలను పరిశీలించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీటి సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి సమస్యలు రాకుండా నాలాల పూడికతీత పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచి సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. వారితో పాటు తలాబ్చంచలం, పత్తర్గట్టీ, రెయిన్బజార్ డివిజన్ల కార్పొరేటర్లు డాక్టర్ సమీనా బేగం, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహ్మద్ వసీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.