నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ | - | Sakshi
Sakshi News home page

నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ

Jan 30 2026 8:27 AM | Updated on Jan 30 2026 8:27 AM

నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ

నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ

బన్సీలాల్‌పేట్‌: రైల్వే అభివృద్ధి, మనుగడకు నిరంతర సంస్కరణలు, నైపుణ్యాలు కీలక భూమిక పొషిస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీ వాస్తవ అన్నారు. సికింద్రాబాద్‌ బోయిగూడ రైల్‌ కళారంగ్‌లో గురువారం దక్షిణ మధ్య రైల్వే 70వ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో నిర్ణీత కాల పరిమితితో కూడిన సంస్కరణలు అవసరమన్నారు. కాలానుగుణంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జీఎం ..రైల్వే ఉత్తమ సేవలందించిన సిబ్బంది,అధికారులకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్యప్రకాష్‌, సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శ్రీ ఆశిష్‌ మెహ్రోత్రా పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎంసంజయ్‌కుమార్‌ శ్రీ వాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement