
14న మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని మెడికల్ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ మహేష్ పేర్కొన్నారు. గురువారం మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్ను మెడికల్ కౌన్సిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రక్తదానం చేసేందుకు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు సన్నీ డేవిస్ తదతరులు పాల్గొన్నారు.
పోస్టర్ను ఆవిష్కరిస్తున్న దృశ్యం