Jayashankar
-
రాష్ట్రస్థాయిలో జిల్లా ఏ సంవత్సరంలో ఏ స్థానం..
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత ఒక శాతం పెరిగినప్పటికీ రాష్ట్రస్థాయి స్థానంలో తగ్గింది. గతేడాది 15వ స్థానంలో నిలవగా.. ఈసారి తగ్గడం గమన్హారం. బాలురతో పోలిస్తే బాలికలు ఒక శాతం పైచేయి సాధించారు. జిల్లాలో 66 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10మంది ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులు 550కిపైగా మార్కులు సాధించారు. ప్రైవేట్కు దీటుగా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3,221 మంది విద్యార్థుల పాస్ జిల్లాలో 121 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటినుంచి 3,443మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 3,221 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 1,725 మందికి 1,606మంది (93.10శాతం) ఉత్తీర్ణులు కాగా.. బాలికల విభాగంలో 1,718మందికి 1,615మంది (94శాతం) ఉత్తీర్ణులయ్యారు. 222మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో ఫెయిలయ్యారు.పరీక్ష రాసిన విద్యార్థులు 3,443 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 3,221సాధించిన శాతం 93.52ఫెయిల్ అయిన విద్యార్థులు 222వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 66సంవత్సరం సాఽధించిన స్థానం 2016–17 14 2017–18 5 2018–19 7 2021–22 8 2022–23 5 2023–24 16 2024–25 22 (ప్రస్తుతం) కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించలేదు. ఉత్తీర్ణత శాతం పెరిగినా తగ్గిన స్థానం పలువురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి మార్కులు 66 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత -
చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: వచ్చే స్పెషల్ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న చెక్బౌన్స్ కేసులను పరిష్కరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు ఆదేశించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బ్యాంకులు, కోర్టులలో పెండింగులో ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసులను పరిష్కారం చేయడానికి బ్యాంకు మేనేజర్లు, న్యాయవాదులు కలిసిరావాలని అన్నారు. ఆర్థిక నేరాలను కట్టడి చేయడం అవసరమన్నారు. జూన్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్లో పెద్దఎత్తున పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, న్యాయవాదులు రవీందర్, విష్ణువర్ధన్రావు, రాజేందర్, కవిత, ప్రియాంక, శివకుమార్, రాకేష్, రమేష్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. అతలాకుతలం
భూపాలపల్లి రూరల్/కాటారం/ రేగొండ: జిల్లా కేంద్రంతో పాటు రేగొండ, కాటారం, మహాముత్తారం మండలాల్లో బుధవారం రాత్రి అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులకు జిల్లా కేంద్రంలోని సుభాష్కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ వద్ద చెట్టు కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. ఎస్ఎం కొత్తపల్లిలో కర్ణాటకపు రమేష్కు చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. రేగొండ మండలం కొత్తపల్లి (బీ)లో ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. బాగిర్తిపేట క్రాస్ రోడ్డు నుంచి మూల కొత్తపల్లి వరకు రోడ్డుకిరువైపులా చెట్టు నేలవాలడంతో ఎస్సై సందీప్కుమార్ చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. భూపాలపల్లి, రేగొండ, మహాముత్తారం, కాటారం మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహాముత్తారం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపడింది. దీంతో కేంద్రం వద్ద ఉన్న రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. -
దేవాలయాల అభివృద్ధికి కృషి..
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి రూరల్: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీలో బుధవారం పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ గుడి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పెద్దకుంటనల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోద్దన్నారు. అధికారుల సేవలు మరువలేనివి భూపాలపల్లి: జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, బీసీ సంక్షేమ అధికారి శైలజ జిల్లాకు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. నారాయణరావు, శైలజ ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం రాత్రి ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే, కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై వారిని సన్మానించారు. -
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
ప్రభుత్వ విద్యాసంస్థల్లో టాప్ టెన్ విద్యార్థులు ● జిల్లా మొదటి స్థానంలో గజ్జెల సంధ్య 586 మార్కులు, గణపురం ఎంజేపీ ● జి.శివాంజలి 572 భూపాలపల్లి కేజీబీవీ ● నల్లాల మణిదీప్ 572 కాటారం ట్రైబల్ వెల్ఫేర్ ● కె.మేఘన 558 ఇస్సిపేట జెడ్పీహెచ్ఎస్ ● ఎస్కే.సన 556, గంగారం మోడల్ స్కూల్ ● బండారి శివయాదవ్ 555, ఎస్.ఈఽశ్వర్ 555, భూపాలపల్లి మైనార్టీ గురుకులం ● కె.లక్ష్మిప్రసన్న 554 దామెరకుంట సోషల్ వెల్ఫేర్ ● కె.అజయ్ 551, జంగేడు జెడ్పీహెచ్ఎస్ ● జె.ప్రగతి 550 మేడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ● హట్కారి అంజలి 540 గొల్లబుద్దారం జెడ్పీహెచ్ఎస్93.52 శాతం -
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
టేకుమట్లలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యంరహదారులపైనే.. జిల్లాలోని పలు మండలాల్లో నెల రోజుల క్రితం నుంచే వరికోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం చేతికి రావడంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు, ఖాళీ ప్రదేశాలు, గ్రామాల్లోని ప్రధాన రహదారులపై ఆరబోసుకుంటున్నారు. ఆరబెట్టే ప్రాంతానికి ధాన్యం తరలించడానికి రైతులకు రవాణాభారం అధికమవుతుంది. అంతేకాకుండా ధాన్యం రోడ్లపై ఆరబోయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.న్యూస్రీల్ -
నేడు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయంలో నేడు(బుధవారం) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పోచమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని మూడు రోజులుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం హోమం, కుంకుమార్చన, సాయంత్రం శట్కోనం పూజ నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. నేడు ఉదయం 9 గంటలకు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఏరియాలో పర్యటించిన సెక్యూరిటీ జీఎం భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సెక్యూరిటీ జీఎం లక్ష్మినారాయణ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఏరియాలోని సింగరేణి భూములు, ఖాళీ స్థలాలు, బొగ్గు నిల్వలు, సోలార్ ప్లాంట్ భద్రతలను పరిశీలించి, సీసీ కెమెరాలను పర్యవేక్షించి రికార్డులను తనిఖీచేశారు. బొగ్గు దొంగతనం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్తో చర్చించారు. స్థలాలు కబ్జా కాకుండా చూసేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి భూపాలపల్లి: ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. టేకుమట్ల పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ, మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై పింగలి అమరేందర్రెడ్డికి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పూలమాలవేసి, శాలువాతో సత్కరించి గృహోపకరణాలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న పోలీస్ ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, రత్నం, కిరణ్, శ్రీకాంత్, అమరేందర్రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం భూపాలపల్లి అర్బన్: సింగరేణి వర్క్పీపుల్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియాలోని అంబేడ్కర్ స్టేడియంలో మంగళవారం ఉచిత వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ ఎస్వోటు జీఎం పోశమల్లు హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి కూడా ఉపయోగపడుతాయన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల పిల్లలు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ శిబిరం ద్వారా పిల్లలు సెల్ ఫోన్, టీవీలకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులకు సూచించారు. సెల్ఫోన్ ద్వారా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు జోతి, అరుణ్ప్రసాద్, యూనియన్ నాయకులు బేతెల్లి మధుకర్రెడ్డి, మోటపలుకుల రమేష్, సీనియర్ పీఓ శ్రావణ్కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్, కోచులు తిరుపతి, రఘువీర్, శరత్, నెహ్రూ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాంఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. పంట కోసిన తర్వాత వరి ధాన్యం చాలా తేమతో కూడుకొని ఉంటుంది. పది, పదిహేను రోజులు ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. సరైన ఫ్లాట్ఫాంలు లేక రోడ్డపైన, ఖాళీ ప్రదేశాల్లో ధాన్యం ఆరబెడుతున్నాం. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధాన్యం ఆరబోతకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. ఫ్లాట్ఫాంల నిర్మాణానికి సహకరించాలి. – తిరుపతిగౌడ్, రైతు, వెంకట్రావుపల్లి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే.. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కల్లాల నిర్మాణానికి అవకాశం ఉండేది. మూడేళ్లుగా ఆ పథకం నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే రైతులకు తెలియజేస్తాం. – నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి● -
జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు
సాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకున్నా దరిమిలా...పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితునిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్లు రాలేదని కొందరు...మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చడం వల్ల పిల్లల మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు. హనుమకొండ12,010వరంగల్9,237జయశంకర్ భూపాలపల్లి6,2383,4493,134 8,194మానుకోట దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్తో ముందుకెళ్లొచ్చు పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు -
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి...
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. – డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి నది పుష్కరాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ వీఐపీ ఘాటు విస్తరణ పనులు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు, టెంట్ సిటీ ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాలు, వంద గదుల గెస్ట్హౌస్, జాయ్రైడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో పనుల పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, రవాణా, వైద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ వీఐపీ ఘాట్ వద్ద టెంట్ సిటీ, ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్టు, స్టాళ్లు, కిడ్స్ జోన్ తదితర ఏర్పాటు చేసేందుకు స్థలాలకు మార్కింగ్ చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. వీఐపీ ఘాట్ వెళ్లే రహదారి నిర్మాణానికి మార్కింగ్ చేయాలన్నారు. హెలికాప్టర్లో జాయ్రైడ్ చేసేందుకు కౌంటర్ ఏర్పాటుచేయాలని తెలిపారు. పుష్కరాల్లో భక్తులకు ప్రత్యేక ఘాట్లు, తాత్కాలిక వసతి కేంద్రాలు, ఆరోగ్య శిబిరాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్టేజీ ఏర్పాట్లు, విద్యుద్ధీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి విద్యుద్ధీకరణ చేయాలని సూచించారు. విధుల్లో ఉండే సిబ్బందికి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పార్కింగ్, ఆర్టీసీ ప్రదేశాల్లో సురక్షిత తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. భక్తులు నదిలోకి వెళ్లడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎండోమెంట్కు సంబంధించిన శ్రాద్ధ మండపం, సరస్వతిమాత విగ్రహం పనులు, ప్రసాదం కౌంటర్ పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో అసహనం వ్యక్తం చేశారు. మే 4వరకు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ కనకదుర్గా ప్రసాద్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు తిరుపతిరావు, వెంకటేశ్వర్లు, నిర్మల, ఆబ్కారీ ఈఎస్ శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. మే 4వరకు పూర్తిచేయాలని ఆదేశం కలెక్టర్ రాహుల్శర్మ -
పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా..
నా పేరు సమ్మక్క. నాకు పక్షవాతం వచ్చి ఒక కాలు, ఒక చేయి పడిపోయింది. నడవలేని, నిలబడలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ కోసమని గణపురంలో చాలాసార్లు అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ సదరం సర్టిఫికెట్ కావాలన్నరు. జిల్లా ఆస్పత్రికి పోగా 65 శాతం వికలాంగత్వం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చిర్రు. దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో చాలాసార్లు దరఖాస్తు చేసిన. అయినా పింఛన్ రాకపోవడంతో కలెక్టరేట్కు వస్తున్నా. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడుసార్లు దరఖాస్తు ఇచ్చిన. అయినా పింఛన్ మంజూరు కాలేదు. నాకు భూమి జాగా లేదు. ఆస్పత్రిలో చూయించుకోవడం, ఇంటి ఖర్చులకు ఇబ్బంది అయితాంది. – చివిటిబోయిన సమ్మక్క, చెల్పూరు, గణపురం -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
భూపాలపల్లి అర్బన్: ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబును ఎస్పీ కిరణ్ ఖరే మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలో న్యాయ, రక్షణ సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. సివిల్ కోర్టులో చలివేంద్రం ప్రారంభం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రవణరావు, రాజ్ కుమార్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు భూపాలపల్లి అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్ఖరే అభినందించారు. నేడు కలెక్టర్ సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతి నది పుష్కరాల అభివద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించనున్నారు. సివిల్స్ ర్యాంకర్కు సన్మానం భూపాలపల్లి అర్బన్: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జితేంద్ర నాయక్ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులను అభినందించారు.మేడే వాల్పోస్టర్ ఆవిష్కరణ భూపాలపల్లి అర్బన్: మే 1వ తేదీన నిర్వహించనున్న మేడే ఉత్సవాల వాల్ పోస్టర్ను ఏఐటీయూసీ నాయకులు సోమవారం ఏరియాలోని వివిధ గనులలో ఆవిష్కరించారు. ఏరియాలోని కేటీకే ఒకటవ గనిలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ హాజరై మాట్లాడారు. మేడేను అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ చందర్, శ్రీనివాసు, చంద్రమౌళి, సదయ్య, నరేష్, అరుణ్ పాల్గొన్నారు. -
‘ఇరిగేషన్’లో ఏసీబీ గుబులు!
ఏసీబీ రంగప్రవేశం.. ఆందోళనలో ఇంజనీర్లు.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్పై దాడులు నిర్వహించడం నీటిపారుదలశాఖను కుదిపేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం దాడులు నిర్వహించి... శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఆయన వద్ద ప్రాథమికంగా రూ.200 కోట్ల మేరకు అక్రమాస్తులుంటాయని భావించిన ఏసీబీ ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారుల ఆస్తుల గురించి కూడా ఏసీబీ ఆరా తీస్తుందన్న ప్రచారం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాక్షిప్రతినిధి, వరంగల్ : నీటిపారుదలశాఖలోని కొందరు ఇంజనీర్లలో మళ్లీ ఏసీబీ కలకలం మొదలైంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనలో పడ్డారు. మేడిగడ్డ మొదలుకుని కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పలు ప్యాకేజీ పనుల్లో లొసుగులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఆ కమిటీ ప్ర భుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పరిధిలోని వివిధ కేడర్లలో ఉన్న 17 మందిపై క్రిమినల్ కేసులు, 30 మందిపై శాఖాపరమైన చర్యలను సిఫారసు చేశారు. ఇ దే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అ ధికారులు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గు ర్తించి ప్రాజెక్టు ఎండీ హరీరామ్ ఇళ్లలో సోదాలు ని ర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. విచారణలతో ఉక్కిరిబిక్కిరి... మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు ప్రకటించారు. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు సహా 17 మంది ఉన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో ఉన్న ఇంజనీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా తేల్చుకోలేక ఉన్నతాధికా రులు పెండింగ్లో పెట్టారు. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా, శాఖాపరమైన చర్యలా? క్రిమినల్ చర్యలా? అన్నది తేలలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్న పలువురు ఇంజనీర్లు విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చర్చనీయాంశంగా ఎండీ హరీరామ్పై దాడులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడి వాళ్లే.. ఇప్పటికే 17మందిపై క్రిమినల్ కేసులు 30మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు తాజాగా ఏసీబీ దాడులకు దిగడంతో కలకలం -
ఉపాధి కల్పిస్తామని ఉసురు తీస్తున్నారు..
గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్లో తమ గ్రామ సమస్యపై అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారి మాటల్లోనే.. 2003 సంవత్సరంలో భూగర్భ గని ఏర్పాటులో భాగంగా సింగరేణి యాజమాన్యం మా వ్యవసాయ భూములను తీసుకొని పరిహారం చెల్లించింది. ఇప్పుడు ఆ గనిని తొలగించి ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ 3 ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో బాంబు బ్లాస్టింగ్ల మూలంగా మా ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. చిన్నచిన్న గుడిసెలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. భారీ వాహనాల రాకపోకలు, బాంబు బ్లాసింగ్లతో గాలి కాలుష్యమై మా ఊరి వాళ్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. కొంతమంది శ్వాసకోస ఇబ్బందులకు గురై మృతి చెందారు. భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక ఇక్కడ మేము ఉండలేమని, మా గ్రామాన్ని సేకరించి పరిహారం చెల్లించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మా గ్రామాన్ని తరలించి పునరావాసం, ప్యాకేజీ అందజేయాలి. -
చెరువుల్లో మట్టి దోపిడీని అరికట్టాలి..
కాటారం సబ్ డివిజన్ పరిధి పలు చెరువుల్లోని మట్టిని కొందరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా చెరువులను చెరబడుతున్నారు. పలుమార్లు తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కాటారం పరిధిలోని పోతులవాయి శివారులోని నల్లగుంట, విలాసాగారం, శంకరంపల్లి, దేవరాంపల్లి, పరికిపల్లి చెరువుల్లో ప్రతీరోజు రాత్రి జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాల మూలంగా చెరువులు దెబ్బతింటున్నాయి. ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించా. – ఆత్కూరి శ్రీకాంత్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి రూరల్: బాల్యవివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్ట్రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ వెల్పేర్ అసోసియేషన్ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగ రాజ్కుమార్ ఆదేశానుసారం జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రాల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడమంటే చిన్న పిల్లలపై అత్యాచారాలు ప్రోత్సహించడం లాంటిదన్నారు. పూజారులు, ఫాస్టర్లు, ముస్లిం మతపెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి మేజర్లు అయితేనే వివాహాలు జరిపించాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించిన రూ.లక్ష జరిమానతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ప్రతిజ్ఞ చేయించామన్నారు.జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శాస్త్రాల తిరుపతి -
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
కాళేశ్వరం/పలిమెల: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహదేవపూర్ మండలకేంద్రం, పలిమెల మండలకేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, అనిల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వ్యవసాయ అధికారి సుప్ర జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ -
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ హాస్టళ్లు, మెస్లను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు. హన్మకొండ: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటివద్ద నుంచి పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొత్తగా వాట్సాప్ చాట్బాట్ను తీసుకువచ్చింది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా తమ సమస్యను సులువుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
యువత సన్మార్గంలో నడవాలి
పలిమెల: యువత చెడు వ్యసనాలు, బెట్టింగ్లకు దూరంగా ఉంటూ వారి భవిష్యత్ను తీర్చిదిద్దుకునేలా సన్మార్గంలో నడవాలని ఎస్పీ కిరణ్ఖరే సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాలు గడ్చిరోలి (మహారాష్ట్ర), బీజాపూర్ (ఛత్తీస్గఢ్), ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను సోమవారం పలిమెల మండలకేంద్రంలో ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు. అనంతరం ఎస్పీ కిరణ్ఖరే మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. సరిహద్దు ప్రజలు, యువతతో మమేకమవ్వడమే ప్రజా భరోసా టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో 105 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్, కాటారం సీఐలు రామచందర్ రావు, నాగార్జునరావు, పలిమెల ఎస్సై జె.రమేష్, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
మే 5న అర్చక పోస్టులకు పరీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టులకు మే 5న రాతి, మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల దేవాదాయశాఖ ఐదు అర్చక పోస్టుల కోసం నోటిఫికేషన్ వేసి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 41మంది దరఖాస్తులు ఈఓ కార్యాలయంలో సమర్పించారు. మే 5న హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో పరీక్ష నిర్వహించనున్నారు. మే 15నుంచి జరుగు సరస్వతి పుష్కరాల వరకు అర్చకుల నియామకం చేయడానికి దేవాదాయశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అకాల వర్షం కాటారం: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. గ్రామాల్లో రైతులు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొంత మేర తడిసింది. రాత్రిపూట ధాన్యం కుప్పలపై పరదాలు కప్పి తడవకుండా రక్షించుకోవడానికి నానా పాట్లు పడ్డారు. వర్షాభావ సూచనలతో రైతులు అప్రమత్తమయ్యారు. -
రోడ్డు మధ్యలో ‘బోరు’
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మారింది పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్ల వ్యవహారం. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించింది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ రోడ్డులో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో బోరును అలాగే వదిలేశారు. రోడ్డు మధ్యలో అడ్డుగా ఉన్న బోరును చూసినవారంతా నవ్వుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు మధ్యలో బోరును వదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. – కాళేశ్వరం -
ముమ్మరంగా నిర్మాణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతినది పుష్కరాల కోసం (వీఐపీ) జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బేస్స్టాండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.కోటితో సరస్వతిమాత విగ్రహం, చుట్టూర నలుగురు వేదమూర్తుల విగ్రహాలు, లాన్ నిర్మించనున్నారు. సరస్వతిమాత విగ్రహం తమిళనాడులోని మహాబలిపురంలో తుది మెరుగులు దిద్దుకున్నట్లు ఆలయవర్గాలు పేర్కొంటున్నాయి. మే మొదటివారంలో విగ్రహాన్ని హైడ్రాలిక్తో స్టాండ్ బేస్పై ఎరక్షన్ చేయడానికి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్తి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్రోడ్లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు కట్టిపడేసిన ఆటాపాట.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు ఆపరేషన్ కగార్ను ఆపాలి, నక్సల్స్తో చర్చించాలి.. తీర్మానానికి సభ ఆమోదం అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం మృతులకు నివాళి అర్పించి.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. -
నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాం
భూపాలపల్లి అర్బన్/భూపాలపల్లి రూరల్: నిరుద్యోగ సమస్యను రూపు మాపుతామని, నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్లో ఆదివారం మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి ప్రారంభించారు. జాతీయ, రాష్ట్రస్థాయిలోని సుమారు 75 కంపెనీల నిర్వాహకులు పాల్గొనగా 12వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికై న 280మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. కలెక్టర్ పంజాబ్ నుంచి, ఎస్పీ మహారాష్ట్ర నుంచి వచ్చి మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని విడనాడాలని స్పష్టంచేశారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన వల్ల జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ జిల్లాలో 10వేల మందికి పైగా నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి యువతకు సమాచారాన్ని చేరవేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్ ఇక ఖతమే!● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక – IVలోu -
పలిమెలలో వాలీబాల్ టోర్నమెంట్
భూపాలపల్లి: ఈ నెల 28వ తేదీ నుంచి పలిమెల మండలంలో పోలీస్ ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర సరిహద్దులో గల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి కింద రూ.25వేలు, రెండవ బహుమతి రూ.15వేలు, మూడవ బహుమతి రూ.10వేలతో పాటు ట్రోఫీలు బహుకరిస్తామన్నారు. టోర్నమెంట్కు ఎంట్రీ ఫీజు లేదన్నారు. క్రీడాకారులకు భోజన వసతి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 73961 47071, 73069 07549 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ కిరణ్ ఖరే -
భరోసా నింపని ఉపాధి..
కాటారం: గ్రామాల్లో వలసలు నివారించి పేదలకు ఉన్న ఊరిలోనే పని చూపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉపాధిహామీ పథకం నిరుపేద కూలీలకు భరోసా నింపడం లేదు. మూడేళ్లుగా వచ్చిన నూతన మార్పులతో పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. క్షేత్రస్థాయిలో పనులు చేసిన కూలీలకు రోజుల తరబడి వేతనాలు అందకపోవడంతో పాటు పనులకు వద్దామని అనుకునే అర్హులైన కూలీలకు జాబ్కార్డుల మంజూరు నిలిచిపోయింది. దీంతో ఇటు పనిచేసిన కూలీలు, అటు ఉపాధి పొందాలని అనుకునే కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పనులు నిర్వహించినప్పటికీ కూలీలకు కూలి గిట్టుబాటు అవడం లేదు. ఇలా అనేక లోటుపాట్లతో ఉపాధిహామీ పథకంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా నిలిచిన ఉపాధి వేతనాలు.. జిల్లాలో 2.41లక్షల మంది కూలీలు ఉండగా.. 1.31లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఫాంఫండ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, బ్యాగ్ ఫిల్లింగ్, మొక్కల సంరక్షణ చర్యల పనులను కూలీలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూలీలకు ఇప్పటివరకు కూలి డబ్బులు అందలేదు. ఒక్కో కూలీకి సగటున రూ.1500నుంచి రూ.2వేల వరకు కూలి డబ్బులు అందాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు జాప్యంలో అధికారులకు సైతం పూర్తి సమాచారం లేదు. కూలీలకు వేతనాలు ఎప్పుడు జమ అవుతాయనే స్పష్టత కరువైంది. అసలే వేసవికాలం కావడంతో కూలీలు ఇతర పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలి డబ్బులు వస్తేనే వారి కుటుంబ పోషణ ముందుకు సాగుతోంది. రోజుల తరబడి కూలి డబ్బులు చేతికి రాక ఉపాధి కూలీలు తమ పూట గడుపుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ కూలీల నుంచి మాత్రం స్పష్టత రావడం లేదు. నూతన జాబ్కార్డుల ఊసే లేదు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కారణంగా ఉపాధిహామీ పథకానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. కనీసం 20రోజుల పనిదినాలు చేసి ఉండాలనే నిబంధనతో కూలీలు అధికంగా ఉపాధి పనులవైపు మొగ్గు చూపుతున్నారు. జాబ్కార్డు కలిగిన కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉండటంతో నూతన జాబ్కార్డులు, వేరుగా జాబ్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో కొంతకాలంగా జిల్లాలో నూతన జాబ్కార్డుల మంజూరు నిలిచిపోయింది. రెండేళ్ల క్రితం జాబ్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటికీ జాబ్కార్డు మంజూరు కాలేదని సమాచారం. జాబ్కార్డులో పేరు మార్పు, తొలగింపు లాంటి సవరణలకు సైతం అవకాశం లేకుండా పోయింది. దీంతో అర్హులైన నిరుపేద కూలీలు సైతం ఉపాధి పనులకు దూరమవుతున్నారు. ఇప్పటివరకు నూతన జాబ్కార్డుల కోసం సుమారు 200పైచిలుకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఖాతాల్లో జమ అవుతాయి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో మూడు నెలలకు సంబంధించిన ఉపాధి కూలీల వేతనాలు నిలిచిపోయాయి. పనులు చేసిన కూలీల ఖాతాల్లో త్వరలోనే కూలి డబ్బులు జమవుతాయి. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వ ఆదేశాలతో నూతన జాబ్కార్డుల జారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అనుమతి రాగానే నూతన కార్డులు మంజూరు చేస్తాం. – నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి 2,41,6671,09,84324412గ్రామపంచాయతీలు జాబ్కార్డుల సంఖ్యమూడు నెలలుగా కూలీలకు అందని డబ్బులు మంజూరుకు నోచుకోని నూతన జాబ్కార్డులు ఆందోళనలో ఉపాధిహామీ కూలీలు -
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
● కలెక్టర్ రాహుల్శర్మ కాటారం/మల్హర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటాయని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం, మల్హర్ మండలం కొయ్యూరులో శనివారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతుకు భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశం భూ భారతి పోర్టల్లో ఉంటుందని భూములకు సంబంధించిన వివరాలను ఎవరికి వారు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు. వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలుగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం ఉమ్మడి వరంగల్ టార్గెట్ 2.50 లక్షల మంది జన సమీకరణలో నాయకుల తలమునకలు సాయంత్రం 4.30 గంటలలోపు సభకు చేరేలా ప్లాన్ 5.30 గంటల సమయంలో వేదికపైకి అధినేత కేసీఆర్ -
ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్
భూపాలపల్లి అర్బన్: ఏరియా వర్క్షాపు ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీగా దాసరి శ్రీనివాస్ను నియమించినట్లు బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ తెలిపారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఫిట్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అబ్దుల్ ఖాదర్, ఎలక్ట్రిషన్ సేఫ్టీ కమిటీ సభ్యులుగా జి.కొమురయ్య, రమేష్, పిల్లి రవి, వర్క్ కమిటీగా కరుణాకర్, శ్రీనివా స్, గరిగ రమేష్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్, విజేందర్, రవికుమార్ పాల్గొన్నారు. ఫార్మసిస్టుల హర్షం భూపాలపల్లి అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఫార్మసిస్టుల హోదాను ఫార్మసీ ఆఫీసర్స్గా మార్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఫార్మసీ కౌన్సిల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పు భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య విద్య, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న ఫార్మసిస్టు గ్రేడ్–2లను ఫార్మసీ ఆఫీసర్స్గా, ఫార్మసిస్టు గ్రేడ్–1లను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్స్గా, ఫార్మసీ సూపర్వైజర్లను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్స్గా మార్పు చేస్తూ ఈ నెల 25వ తేదీన జీఓ జారీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రికి కృతజ్ఙతలు తెలిపారు. వృత్తి విద్య కోర్సులకు శిక్షణ భూపాలపల్లి అర్బన్: జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి విద్య కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి మారుతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డ్రైవాల్ అండ్ ఫాల్స్ సీలింగ్ టెక్నిషియన్, వెల్డింగ్ అండ్ ప్రాబ్సికేషన్ టెక్నిషియన్, ఆటోమొబైల్ అండ్ టూ వీల్లర్స్, ఎక్సకవేటర్ ఆపరేటర్, ఫుడ్ బెవరేజీస్ అసిస్టెంట్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ హోటల్ మేనేజ్మెంట్, ఆఫీసర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, ఫీల్ట్, టెక్నిషియన్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడు నెలల శిక్షణ, భోజన వసతి సదుపాయం, నిపుణుల ద్వారా సాఫ్ట్ స్కిల్ శిక్షణ, శిక్షణ పొందిన అనంతరం ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అడ్మిషన్ కోసం సంబంధిత కోర్సులో విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఆసక్తి, అర్హత గల వారు ఏరియాలోని ఎంవీటీసీ కార్యాలయంలో సంపద్రించాలన్నారు. సర్వే పనుల అడ్డగింత మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకపోతే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సునీత, ఆర్ఐ శివరామ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియామకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న దేవాదాయశాఖ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో చేసుకున్నారు. అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్అఫీషియో(అర్చక)తో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంథనికి చెందిన కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ అవధాని మోహన్శర్మకు పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. -
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి అవరణలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్కు గురవుతారు. ● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది ● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ● పసిపిల్లలు డల్గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. ● అందుకే పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ● పిల్లలు ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి. ● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి. -
సభను జయప్రదం చేయాలి
టేకుమట్ల: ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను మోసంచేస్తున్న కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రజలను సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల ను నిత్యం మోసంచేస్తున్నారన్నారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చలో వరంగల్ కార్యక్రమానికి మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కశ్మీర్ పహల్గాం పర్యాటకుల మృతికి సంతాపంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మా జీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ఆది రఘు, బందెల నరేష్, ఉమేందర్రావు, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలిగిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెం కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్కు చూపించాలి. – కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్ -
ఎండను ఎదుర్కొందాం..
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలుఉమ్మడి వరంగల్జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మే నెలలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం పది గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..డీహైడ్రేషన్కు గురికావొద్దు.. భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఓపెన్కాస్టులోని పని ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొంత అధికంగా ఉంటుంది. మొదటి షిప్టులో పనిచేసే కార్మికులు పూర్తిగా ఎండలోనే పనిచేయాల్సి ఉంటుంది. కార్మికులు డీహైడ్రేషన్కు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఐదు లీటర్లకు మించి చల్లటి నీరు తాగాలి. ప్రతి రోజు ఓఆర్ఎస్, మజ్జిగ తాగాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. తలపాగ ఉపయోగించడం మంచిది. ఆయిల్ ఫుడ్ తినొద్దు. ఎండలో పనిచేయడం వలన నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడి బారి, నాలుక ఆరిపోతుండడం, వాంతులు, విరోచనాలు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండ దెబ్బకు గురైన వెంటనే నీడకు చేర్చి చల్లగా ఉండే పలుచని దుస్తులను వేయాలి. తడి గుడ్డతో తుడవాలి. ప్రమాద తీవ్రత అఽధికంగా ఉంటే సింగరేణి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ పద్మజ, సింగరేణి ఏరియా ఆస్పత్రి ఏసీఎంఓ -
వాహనాలు జరభద్రం..!
ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనంలోనైనా ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజన్ ఆయిల్ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్డుల్లో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం ఉంటుంది. – ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్ -
కొనుగోళ్లపై రైతుల్లో ఆవేదన
భూపాలపల్లి రూరల్: ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో చాలా ఆవేదన ఉందని, ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. రైతులకు నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 4 సంఘాలు ఎంపిక ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025, రైతు ఉత్పత్తి సంఘాల అభివృద్ధి’ అనే అంశంపై కలెక్టర్ రాహుల్శర్మ అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ వ్యవసాయరంగాన్ని సహకార రంగంతో ముడివేసి జాతీయస్థాయిలో సుమారు 10వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు భారత సహకార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా తెలంగాణలో 311 సంఘాలను ఎంపిక చేశారని.. వాటిలో మన జిల్లాలో నాలుగు సంఘాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్, సింగిల్ విండో చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఉపేక్షించం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మలేరియా నియంత్రణకు చర్యలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రతి ఏడాది మలేరియా కేసులు నమోదవుతున్నాయని వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ మధుసూదన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలు గ్రామాలు ఏజెన్సీలో ఉండటం వలన సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని.. దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇంటి పరిసరాల్లో మురికి నీరు, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మలేరియా పట్ల అవగాహన కల్పించిన పలువురికి ఈ సందర్భంగా అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, ఉమాదేవి, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి ప్రైవేటీకరణను రద్దుచేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టి జీఎం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం సింగరేణి గనులను వేలం వేయడం వలన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్పరం కాకుండా సింగరేణికి కేటాయించాలని కోరారు. కార్మిక వాడల్లో మెరుగైన తాగునీటిని అందించాలని, సింగరేణిలోనే కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, అవినాష్, మధు, కుమారస్వామి, వెంకట్రాజం, సుంకరి గోవర్దన్, మొగిలి, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలి
హన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకో వాలి. తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడూ తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, కషాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్, వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్) -
మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కులాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీకేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్డువెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి. – నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట -
వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త!
ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎం.పవన్కుమార్ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు. – డాక్టర్ ఎం.పవన్కుమార్, ఎండీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, భూపాలపల్లి ● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది. ● తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి ● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి. ● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది. ● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్, ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్స్) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్ సలహా తీసుకోవాలి. ● డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. ● డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయరాదు. ● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
చిట్యాల/మొగుళ్లపల్లి: భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టం తీసుకువచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల, మొగుళ్లపల్లి మండలకేంద్రాల్లో గురువారం భూ భారతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆధార్ ఎలా ఉందో భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులపై ఆర్డీఓ విచారణ చేసి అర్హత ఉన్న వారికి భూహక్కులు జారీచేస్తారని అన్నారు. టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, పంగిడిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్దార్ సునీత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీదేవి, వైస్ ఛైర్మన్ రఫీ, పీఏసీఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, టేకుమట్ల మండల ప్రత్యేకాధికారి శైలజ, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 27న మెగా జాబ్మేళా భూపాలపల్లి రూరల్: ఈనెల 27వ తేదీన జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్మేళాను నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. జాబ్ మేళా నిర్వహణపై సింగరేణి అధికారులతో పుష్ప గార్డెన్లో గురువారం ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. జాబ్మేళాకు సుమారు 15వేల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. జాబ్మేళాను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్పీ సంపత్రావు, జిల్లా, మండల, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్శర్మ -
28నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 28వ తేదీ నుంచి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలతో పాటు పట్టణ, సమీప గ్రామాలకు చెందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆసక్తిగల విద్యార్థులు ఆధార్కార్డు జిరాక్స్తో పాఠశాలలో సంప్రదించాలని సూచించారు. మహిళకు ఆపరేషన్.. క్యాన్సర్ గడ్డ తొలగింపు భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం నూతన వైద్యానికి శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రానికి చెందిన అల్లూరి రాధ కొద్దిరోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుంది. వారం రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చింది. పలు రకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఆపరేషన్లో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్కుమార్ అభినందించారు. కాల్వల పనుల అడ్డగింత కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ఆదివారంపేట చెరువు నుంచి సాగు నీటి సరఫరా కోసం చేపట్టనున్న కాల్వల నిర్మాణం భూ సర్వేను గుమ్మాళ్లపల్లి వద్ద రైతులు గురువారం అడ్డుకున్నారు. కాల్వల నిర్మాణం కోసం తాము విలువైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తమకు న్యాయం చేకూరదని అభ్యంతరం తెలిపారు. కాల్వల నిర్మాణం అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. సర్వే అధికారులు నచ్చజెప్పినప్పటికీ రైతులు ఒప్పుకోలేదు. సర్వేలో డీఐ రాములు, సర్వేయర్లు రామకృష్ణ పాల్గొన్నారు. 29న హేమాచల క్షేత్రంలో జాతర వేలంమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 29న జాతర బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో మే 8 నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) ఆత్యంత వైభవంగా జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుట్టపై జరిగే పది రోజుల జాతరలో, జాతర ప్రారంభానికి ముందు మే 1నుంచి 31వరకు నెల రోజులు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరిపేందుకు దేవాదాయశాఖ ద్వారా అనుమతి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.లక్ష లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారు చేసి విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు (పుట్టు వెంట్రుకలు) పోగు చేసుకునేందుకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కలకు రూ.10 వేలు చెప్పుల స్టాండ్కు రూ.5 వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5 వేలు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 నుంచి 28 వరకు దేవస్థానం కార్యాలయంలో రూ.500 చెల్లించి కొటేషన్ కొనుగోలు చేయాలని సూచించారు. కొటేషన్ కొన్న వారికి మాత్రమే, షెడ్యూల్లో పొందుపర్చిన దరావత్తు సొమ్ము డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ హైదరాబాద్ వారి తుది ఆమోద ఉత్తర్వుల మేరకు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం హేమాచల క్షేత్రం ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీ కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పు న టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లా కు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మల్లయ్య, కై లాష్లు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారంనుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. ‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు.. ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులుడీసీసీ పీఠం కోసం పోటాపోటీ.... ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీ కమిటీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలనుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజు, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డిలు కీలకం కానున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్నే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడి నిర్ణయం కీలకంగా కానుంది. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి
భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కర పనుల ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలతో గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కర పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పర్యవేక్షణ చేయలేకపోతే జిల్లా విడిచి వెళ్లాలని.. జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పనుల పర్యవేక్షణకు ఒక్కో జిల్లా అధికారికి పర్యవేక్షణ అధికారులుగా నియమించామని, ప్రతి రోజు పనులు పర్యవేక్షణ చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత పుష్కరాలు చేయడం మన లక్ష్యమని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవగాహనకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యర్ధాలు నిర్వహణకు ఇన్సినినేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలకు మెడికల్ క్యాంపులు భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాలలో ఏర్పాటు చేసే క్యాంపులు, సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు. ఆర్థోపెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ను నియమించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ వివరించారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం) ర్యాలీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రత్యేకాధికారుల నియామకం కాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతినది పుష్కరాల పనులను వేగవంతం చేయడం కోసం కలెక్టర్ రాహుల్శర్మ పర్యవేక్షణకు గురువారం ప్రత్యేకాధికారులను నియమించారు. అధికారులు నిత్యం పనుల పురోగతిని సమీక్షించి, వాట్సాప్ గ్రూపుల్లో పనుల వివరాలు, ఫొటోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంది. కాళేశ్వరానికి ప్రపంచ సుందరీమణులు? పుష్కరాలకు ప్రపంచ సుందరీమణులను ఆహ్వానించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఆలోచన చేసినట్లు సమాచారం. మే 14న ములుగు జిల్లా రామప్ప ఆలయానికి 30మంది ప్రపంచ సుందరీమణుల బృందం రానున్న షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో వారిని కాళేశ్వరాలయానికి ఆహ్వానించడానికి బుధవారం కాళేశ్వరంలో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో చర్చకు వచ్చి ఆ శాఖ ఉన్నతాధికారి ఫోన్ ద్వారా సంప్రదించినట్లు సమాచారం.కలెక్టర్ రాహుల్ శర్మ -
సివిల్స్ ర్యాంకర్ను సన్మానించిన జీఎం
భూపాలపల్లి అర్బన్: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన బానోతు జితేంద్రనాయక్ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తన కార్యాలయంలో సన్మానించారు. జితేంద్రనాయక్ తండ్రి ఏరియా వర్క్షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేంద్రనాయక్తో పాటు అతడి తల్లిదండ్రులను జీఎం శాలువతో సత్కరించారు. సింగరేణి ఉద్యోగి కుమారుడు సివిల్స్లో ప్రతిభకనబర్చడం సంతోషకరమైన విషయమని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎస్వోటు జీఎం పోషమల్లు, అధికారులు వెంకటరమణ, జోతి, అరుణ్ప్రసాద్, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సేవాభావంతోనే ప్రతిభకు గుర్తింపు
ములుగు: ఉన్నత చదువులు చదివి సేవాభావం కలిగి ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80.12శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రణవి, రితీష్ నాయక్, స్ఫూర్తి, నితీష్, కీర్తన, చైత్రను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మా ట్లాడుతూ ఎంత నేర్చుకున్నాం.. అనేది ముఖ్యం కాదని.. నేర్చుకున్నది ఎవరికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యమని అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయడానికి ముందుకురావాలని తెలిపారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుతో పాటు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అసిఫాబాద్ జిల్లాలు ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో స్థానాల్లో నిలవడం అభినందనీయమన్నారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలతో అవార్డులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.జడ్జి బాధ్యతల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణబాబు బదిలీ కాగా ఆయన స్థానంలో రమేష్బాబు వరంగల్ నుంచి బదిలీ చేశారు. ఇప్పటివరకు విధులు నిర్వర్తించిన నారాయణబాబు హనుమకొండకు బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి దంపతులు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సన్మానించారు. పుష్కరాలకు 40 ఎకరాల్లో పార్కింగ్ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల కోసం 40 ఎకరాల్లో మూడు చోట్ల పార్కింగ్ స్థలాలను పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. విఐపీ ఘాటు వద్ద 25 ఎకరాలు, ఇప్పలబోరు సమీపంలో 15 ఎకరాలు, హనుమాన్ నగర్ వద్ద 5 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. అవే కాకుండా హరితహోటల్ సమీపంలో కూడా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. -
దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియ న్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగా లు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మల్లయ్య, కమలాకర్, మహేష్ శేఖర్ పాల్గొన్నారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జ్లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసిన ట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న నేతలను అడి గి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్చా ర్జ్ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కు చెందిన పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలుసభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్నాయ క్, నన్నపనేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కరాబు రాజు నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పత్తి పంటను సాగుచేయగా అధిక వర్షాలకు దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో పత్తి పంటను తొలగించి నాలుగు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోత కోసి ఆరేందుకు పొలంలోనే ఉంచాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పు అంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజుకు సమాచారం అందించారు. రైతులంతా కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితంలేకుండాపోయింది. నాలుగు ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.4 లక్షల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. అలాగే మరో రైతు సూదనబోయిన కృష్ణకు చెందిన రెండు ఎకరాలల్లోని మొక్కజొన్న పంట కోసి పొలంలో ఆరబెట్టగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి
భూపాలపల్లి రూరల్: కాశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టించిన మరణకాండను ప్రతిఒక్కరూ ఖండించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి అన్నారు. కాశ్మీర్లో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ అధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతరం నిశిధర్రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడికి బీజేపీ ప్రభుత్వం ధీగాటుగా సమాధానం చెబుతుందన్నారు. దాడిలో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోరుతూ మౌనం పాటించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, రాజమౌళిగౌడ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి -
6
సివిల్స్లో మెరిశారు..రాష్ట్రస్థాయిలోజిల్లాకువ స్థానం● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలనే లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్ ప్రభుత్వ కళాశాలల్లో టాపర్లు వీరే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల స్థాయిలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ప్రథథమ సంవత్సరంలో జిల్లా ప్రథమ స్థానంలో ఎంపీసీ గ్రూప్లో భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కె.రోహిత్ 470 మార్కులకు 463 మార్కులు, బైపీసీలో మెడల్ స్కూల్ కొర్కిశాలకు చెందిన నేహ 440కి 407 మార్కులు, సీఈసీలో భవాని 500కి 437 మార్కులు, ద్వితీయ సంవత్సరం బైపీసీలో కేజీబీవీ టేకుమట్లకు చెందిన ఎం.శిరిష 962, ఎంపీసీలో మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల మోడల్ స్కూల్కు చెందిన నిఖిత 928, సీఈసీలో ఎన్.శ్రీంజి 831 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 73శాతం, ప్రథమ సంవత్సరంలో 58శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ త సాధించారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ సంవత్సరంలో 6వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గింది. జిల్లాలో 35 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 3,491మంది విద్యార్థులు ఉండగా 2,309 మంది పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలో 5 ప్రభుత్వ జూనియర్, 6 మోడల్, 5 ప్రైవేట్, 2 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, 10 కేజీబీవీ, 2 సోషల్ వెల్ఫేర్, 1 మైనారిటీ, 4 బీసీ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో వచ్చిన ఫలితాలు 2024–25 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 1,820 మంది విద్యార్థులకు 1,077 మంది (59శాతం) ద్వితీయ సంవత్సరంలో 1,671 మందికి 1,232 మంది విద్యార్థులు (73శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే మెరుగు.. జిల్లా 2022–23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 19వ, 2023–24లో 8వ స్థానంలో ఉండగా ఏడాది రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 58 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అత్యధికంగా మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. కేజీబీవీల్లో 83శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 10 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 458 మంది విద్యార్థులు హాజరుకాగా 384మంది ఉత్తీర్ణులై 83శాతం సాధించారు. ప్రథమ సంవత్సరంలో 266 మందికి 212 ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 192మందికి 173 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. టేకుమట్ల, మల్హర్, మొగుళ్లపల్లి కేజీబీవీల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. అధ్యాపకుల కృషితోనే.. జిల్లాలో ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో 73 శాతం మార్కులు సాధించడం సంతోషకర విషయం. జిల్లాలో గత రెండేళ్లుగా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. వారి ప్రేరణతోనే మార్కుల శాతం పెరిగింది. ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తాం. – వెంకన్న, ఇంటర్ విద్యానోడల్ అధికారి– వివరాలు 10లోuఇంటర్ సెకండియర్లో 73శాతం ఉత్తీర్ణత ప్రథమ సంవత్సరంలో 58శాతం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉత్తమ మార్కులు బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత జిల్లాలోని ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే అధిక సంఖ్యలో పాసయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 68.46 శాతం, బాలురు 43.58శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.32 శాతం, బాలురు 65.2శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రతిభ కనబరిచారు. ఉత్తీర్ణత సాధించడంలో బాలురు వెనుకబడిపోయారు.మే 22నుంచి సప్ల్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని ఇంటర్ విద్యానోడల్ అధికారి వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రీకౌంటింగ్ చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. -
దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
భూపాలపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల విచారణ ప్ర క్రియ, మండలస్థాయిలో విచారణ టీముల ఏర్పాటుపై ఎల్డీఎం, డీఆర్డీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షే మ శాఖల అధికారులు, ఎంపీడీఓ లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల విచారణ ప్రక్రి య ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ని ష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగా లని, పొరపాట్లకు తావులేకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆయా శా ఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చట్టాల అమలు బాధ్యత కలెక్టర్లదే.. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. మన్ననలు పొందాలి... విధుల నిర్వహణలో ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
‘భూ భారతి’తో ప్రజలకు మేలు
చిట్యాల: భూ భారతి చట్టంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూ భారతి చట్టంపై మంగళవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతి చట్టం రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉందన్నారు. ఽగత ప్రభుత్వంలో ధరణిలో అప్పీలు చేయడానికి అవకాశం లేదని సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉండడం వల్ల పది సంవత్సరాలు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థకు తీరని కళంకం తెచ్చారన్నారు. వచ్చే నెలలో మన జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి భూ భారతి చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. జూన్ 2నుంచి చట్టం అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి హక్కులు కల్పిస్తామని అవినీతి రహిత సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక మార్పునకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భూ భారతి చట్టంలో రూల్స్ ఫ్రేమ్ చేశారని అన్నారు. అనంతరం నవాబుపేట, మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
రేగొండ: తలపై రోకలి బండతో కొట్టి కన్న కొడుకును తండ్రి కడతేర్చిన ఘటన మండలంలోని రేపాకపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేపాకపల్లి గ్రామానికి చెందిన కాసం మొండయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఓదెలు (35) 108 వాహనం డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఓదెలుకు పరకాల మండలానికి చెందిన దేవితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొన్ని సంవత్సరాల నుంచి కోడలితో మొండయ్య అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓదెలు పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటుండగా తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఎలాగైనా కొడుకును అడ్డు తొలగించి కోడలిని దక్కించుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం ఓదెలు తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా తలపై రోకలిబండతో కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు రేగొండ పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్యాల సీఐ మల్లేష్ పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. పెళ్లిరోజు వేడుకల్లో గొడవ మరుసటి రోజే విషాదం -
సివిల్స్లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రంజెటివ్గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి ఎలాంటి శిక్షణ లేకుండా ప్రిపేర్.. ● సివిల్స్లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
‘సువిధ్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిధ్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షన్ముణ ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
‘మేఘా’కే టెంట్సిటీ నిర్మాణం?
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టి తాత్కాలిక టెంట్సిటీ నిర్మాణం పనులు మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టనున్నట్లు సమాచారం. రూ.83లక్షల వ్యయంతో భక్తుల కోసం వీఐపీ (సరస్వతి)ఘాటు వద్ద నిర్మాణం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. దీంతో టూరిజంశాఖతో నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆ సంస్థ శ్రద్ధ చూపలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మేఘా సంస్థతో తాత్కాలిక టెంట్సిటీ నిర్మాణాలు సుమారు 50వరకు నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దేవస్థానం గుడిమాన్యం ఆరు ఎకరాల స్థలాన్ని టెంట్సిటీకి అప్పగించి, ఆ భూమిలో మిర్చి పంట వేసిన రైతులకు రూ.4లక్షల వరకు పరిహారం అందజేసిన విషయం తెలిసిందే. -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్రెడ్డి అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్రెడ్డి, మధుకర్రెడ్డి,ఎం.సతీశ్కుమార్ అభినందించారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పెర్’కు ప్రథమ ర్యాంకు
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పెర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
భూముల సర్వే అడ్డగింత
● పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన భూపాలపల్లి రూరల్: మల్హర్ మండలం తాడిచెర్ల ఓసీ నుంచి గణపురం మండలం చెల్పూరు జెన్కో వరకు నిర్మిస్తున్న కన్వేయర్ బెల్డ్ సర్వే పనులను రైతులు మంగళవారం అడ్డుకున్నారు. కన్వేయర్ బెల్డ్ కోసం పచ్చని సాగు భూములు ఇవ్వబోమని, బెల్ట్ తోవను గ్రామం పక్కనుంచి తీసుకోవాలని పనులను అడ్డుకొని పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. గ్రామంనుంచి కన్వేయర్ బెల్ట్ వేయడం వలన బెల్ట్నుంచి సుమారుగా రెండు కిలోమీటర్లు బొగ్గు ద్వారా వాతావరణం కలుషితమై పంటలు పండవన్న విషయం అందరికీ తెలుసన్నారు. అధికారులు మాత్రం బెల్ట్ కింద కోల్పోయిన భూముల వరకు మాత్రమే 2013 జీఓ ప్రకారం మాత్రమే పరిహారం ఇస్తామని చెబుతున్నారన్నారు. బెల్ట్ కింది భూములతో పాటు బెల్ట్నుంచి రెండు కిలో మీటర్లు వరకు ఉన్న సాగు భూములకు 2013 జీఓ ప్రకారం కాకుండా ఇప్పటి మార్కెట్ ధర చెల్లిస్తే భూములను ఇస్తామని తెలిపారు. గ్రామంలో సుమారుగా 25 కుటుంబాలు ఉంటాయని, గ్రామాన్ని తరలిస్తే ఇన్నిరోజులు కలిసున్న తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, అధికారులు, ఆర్ఆర్ ప్యాకేజీలు ఇస్తామని రైతులను విభజిస్తూ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి చర్చలు జరపాలని కోరారు. అధికారులు రైతులతో మాట్లాడకుండా గ్రామంలో సర్వేలు నిర్వహిస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాతో హెచ్చరించారు. నిరసనలో రైతులు విప్లవకుమార్రెడ్డి, రొంటాల బాపురెడ్డి, సుధాకర్రెడ్డి, సద్దిమహేష్, రొంటాల దేవేందర్, కొకురే రంజిత్కుమార్, రమ, జ్యోతి, గొడుగు సదయ్య, గజ్జి ఒదెలు, బాల్రెడ్డి, జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
అవే సమస్యలు..
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువభూపాలపల్లి: ప్రజావాణికి భూ సమస్య, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వినతులే వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే స మస్యలు కూడా కలెక్టరేట్కే వస్తున్నాయి. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్ సెల్లో మొత్తం 52 దరఖాస్తులు వచ్చాయి. వాటిని అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్తో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఎక్కడా అమలు కావడంలేదు. రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజావాణిల్లో దరఖాస్తులు ఇస్తున్నా. కనీసం ఒక్క జిల్లాలో అమలు చేసి పదిమందికి అవకాశం ఇచ్చినా నా ఉద్యమానికి ఫలితం దక్కుతుంది. – కట్ట ప్రసాద్, జాతీయ దివ్యాంగుల హక్కుల న్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడుడ్రిప్ సామగ్రి సరిగా ఇవ్వలేదు నాకున్న ఎనిమిది ఎకరాల్లో 2022–2023 సంవత్సరంలో పామాయిల్ తోట సాగు చేసిన. సబ్సిడీపై డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. డ్రిప్ కంపెనీ వారు ఓ రోజు రాత్రి నా వ్యవసాయ భూమి దగ్గర సామగ్రి దించిపోయారు. తెల్లవారుజామున చూస్తే అందులో మొత్తం సామగ్రి లేదు. దీంతో అధికారులు, డ్రిప్ కంపెనీ వారిని అడిగితే ఎవరూ స్పందించలేదు. నా సొంత డబ్బులతో పనులు చేయించుకున్న. హార్టికల్చర్ అధికారులపై చర్య తీసుకోవాలి. – సామల వెంకటేశ్వర్లు, చల్లగరిగె, చిట్యాల భూమి, పింఛన్ సమస్యలే ఎక్కువ గ్రీవెన్స్లో 52 వినతులు దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు: కలెక్టర్ రాహుల్ శర్మ -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్ధూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్ధూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్ధేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్ఫర్ట్స్తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
‘భూ భారతి’తో భూములకు హక్కులు
భూపాలపల్లి: నూతన భూ భారతి చట్టంతో భూముల హక్కులకు భద్రతతో పాటు భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఎస్ఆర్ గార్డెన్లో జరిగిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ధరణి పేరుతో ప్రజల భూములను దోపిడీ చేశారని, అనేక అక్రమాలు చేసి వాళ్ల కడుపులు నింపుకున్నారని ఆరోపించారు. కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామంలో సుమారు 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పాస్బుక్లు రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నూతన చట్టం ప్రకారం వారందరికీ హక్కులు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. భూ భారతితో అన్ని రికార్డులు పకడ్బందీగా నమోదు చేయబడతాయన్నారు. సాగులో ఉంటే విచారణ నిర్వహించి పట్టా ఇచ్చే అవకాశం ఉందన్నారు. భూ భారతి చట్టంలో లబ్ధిదారులకు మేలు చేసే విధంగా రూపొందించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇక పకడ్బందీగా భూ రికార్డులు కలెక్టర్ రాహుల్ శర్మ -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఇప్పటికే పనుల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో నీటి సామర్ధ్యం నిశితంగా గమనిస్తూ ఉండాలని, గడిచిన 21 రోజుల నుంచి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామని, 13 సెంటిమీటర్లు నీరు తగ్గిందన్నారు. గత మే నెలలో గోదావరి నీటి మట్టం 94 మీటర్ల 540 సెంటిమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేష్, డీఈలు పాల్గొన్నారు. అలాగే జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్లకు జిల్లా అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ రాహుల్శర్మ సరస్వతి పుష్కరాల పనుల పురోగతిపై సమీక్ష -
గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు
కాజీపేట అర్బన్ : గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్హాల్ కాంప్లెక్స్లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్షాప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఇందుకు ఈ వారం రోజుల వర్క్షాప్ వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్ -
పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం
వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సు బేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జగ్గి శ్యామల. 2020లో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తుండగా, శ్యామల వ్యవసాయ కూలీ పనికి వెళ్తుంది. కులాంతర వివాహం ద్వారా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు సాయం అందకపోగా దరఖాస్తు పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు తెలపడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందించింది.న్యూస్రీల్ -
స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని, డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్లు ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నమన్నారు. అనంతరం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు బుర్ర అశోక్, జితేందర్, వినోద్, రమేష్, విజయ్, ప్రశాంత్, విక్రమ్, రాజేష్, రాజు, సదానందం, సునిల్, తదితరులు పాల్గొన్నారు. -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి, శ్యామ్నగర్, కొత్తపల్లి(ఎస్ఎం) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ ప్రతీ గ్రామం నుంచి 100 మందికి తక్కువ కాకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు కళ్లెపు రఘుపతిరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం చిట్యాల: హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దూద్పల్లి, లక్ష్మీపూర్తండా, ఒడితల, పాశిగడ్డతండా, గోపాలపూర్ గ్రామాల్లో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై హాజరై మాట్లాడారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు పూజలు నిర్వహించారు. -
లీకేజీలు.. పట్టవా..!
భూపాలపల్లి మున్సిపల్ పరిధి రెడ్డికాలనీ, పోలీస్ హెడ్క్వార్టర్స్ ప్రాంతం, బీఆర్ఎస్ కార్యాలయ ప్రాంతం, హనుమాన్నగర్, కృష్ణకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు, గేట్ వాల్స్ నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ పరిస్థితి జిల్లాకేంద్రంలో నెలల తరబడి నుంచి కొనసాగుతోంది. లీకేజీలతో సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సప్లై సిబ్బందికి తెలిసినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు. మరమ్మతులు చేయాలని కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు. అధికారులు సైతం నామమాత్రంగా పర్యటించి చేతులు దులుపుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య తలెత్తకముందే లీకేజీలను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. – భూపాలపల్లి అర్బన్ -
వక్ఫ్ భూములపై కుట్ర
భూపాలపల్లి రూరల్: వక్ఫ్ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి, వెంటనే వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆదివారం జిల్లాకేంద్రంలో జామా మసీదు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీకి మద్దతుగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముస్లిముల ఆస్తులను హరించే కుట్ర అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, కురిమిల్ల శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
శివాలయ నిర్మాణానికి విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గ్రామానికి చెందిన కాల్వ రాజారెడ్డి రూ.1,11,116 కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిళ్ల సత్యనారాయణరెడ్డి, మోత్కూరి నరేష్, కాల్వ సమ్మిరెడ్డి, మోత్కూరి రాజు, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం, పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి కాటారం: కాటారం మండలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భారత ఐక్య యువజన సమాఖ్య(యూవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను యూవైఎఫ్ఐ నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా కాటారంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాయకుల, అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకునే వారు లేరన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా నాయకులు దెయ్యం పోచయ్య, ఎంసీపీఐ నాయకులు రాజమణి, రమ్య, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పరీక్షలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ఆదివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ పరీక్షకు 369 మంది విద్యార్థులకు గాను 346 మంది, టెన్త్ పరీక్షకు 197మంది విద్యార్థులకు గాను 172మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి 163వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక లారీలు ఒకదాని వెనుకాల ఒకటి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
సభకు భారీగా తరలిరావాలి
భూపాలపల్లి రూరల్: ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగసభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పిలుపునిచ్చారు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి, వజినపల్లి, గొర్లవీడు, గుడాడ్పల్లి, కొంపెల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్లెపు రఘుపతిరావు, సాగర్రెడ్డి, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు నీలంబరం, గుడాడ్పల్లి మాజీ సర్పంచ్ ఐలయ్య, మందల రవీందర్రెడ్డి, పింగిలి రవీందర్రెడ్డి పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి -
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేగొండ: ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్, దామరంచపల్లి, చిన్నకొడెపాక, విజ్ఙయ్యపల్లి, రాజక్కపల్లి, బాలయ్యపల్లి, జగ్గయ్యపేట, చెంచుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి గులాబీ జెండాతో రజతోత్సవ సభకు తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హమీద్, నాయకులు జూపాక నీలాంబరం, కానుగంటి శ్రీనివాస్, ఐలయ్య, మహేందర్, యుగందర్ పాల్గొన్నారు. పెయింటర్ను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద కల్వర్టు సైడ్ వాల్పై బీఆర్ఎస్ వాల్పెయింట్ను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పేరుతో వేయడాన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే పెయింటర్ను అడ్డుకున్నారు. -
గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి
చిట్యాల: గర్భిణులు, బాలింతలు సంవృద్ధిగా పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భం దాల్చిన నుంచి వేయి రోజుల వరకు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ ఆరు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ జయశ్రీ , ఒడితల వైద్యురాలు మౌనిక, ఎస్సై ఈశ్వరయ్య, ఎంఈఓ రఘుపతి మాట్లాడారు. అనంతరం ముగ్గురు గర్భిణులకు సీమంతం, ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన, ఐదుగురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మంజుల, సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు, ఆశలు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
కాటారం: భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాటారం మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం భూ భారతి, నూతన ఆర్ఓఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. రైతులు అడిగిన ప్రశ్నలను కలెక్టర్, అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని.. నిర్దేశ సమయంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ భారతి చట్టంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, కలెక్టర్ అక్కడి నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్కు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు భూ చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదాబైనామాకు సంబంధించి ఇతరులతో చర్చించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఆధార్కార్డు లాగే భూదార్కార్డు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు భూ భారతిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్దార్ నాగరాజు, నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ బాబు, ఆర్ఐ వెంకన్న, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ పాల్గొన్నారు. కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనాథ్, డీఎం రాములు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మపనుల్లో నాణ్యత పాటించాలి కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్మాణాలపై వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాళేశ్వరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం పరిశీలించి, నిర్దేశిత సమయానికి సరస్వతి పుష్కరాల పనులను పూర్తిచేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున తాత్కాలిక, శాశ్వత ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్, ఎస్సై తమాషారెడ్డి, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రటి ఎండలో కాలినడకన.. కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విజయలక్ష్మి, సబ్కలెక్టర్ మయాంక్సింగ్లతో పాటు ఇతర అధికారులు 41 డిగ్రీల ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం సుమారు 600మీటర్లు కాలినడక వీఐపీఘాటు వద్దకు వెళ్లారు. పనుల పరిశీలన అనంతరం తిరిగి అదేదారిలో నడుచుకుంటూ వచ్చారు. -
తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025క్రీడల్లో శిక్షణ.. ‘దేశం బలిష్టం కావాలంటే యువత మైదానాల్లో చెమట చిందించాలి’ అని ఓ కవి చెప్పినట్లు.. విద్యార్థులు మైదానాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణ కోసం కరాటే, కుస్తీ పట్టడం నేర్చుకోవచ్చు. జిల్లా క్రీడల, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో, హనుమకొండలోని జేఎన్ఎస్లో పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు, నిర్వాహకులు కోరుతున్నారు. పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాలి● ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. ● సెల్ఫోన్ను దూరం పెట్టాలి.. పుస్తకాలను చేరువ చేయాలి ● ఆ బాధ్యత తల్లిదండ్రులదే..సజీవ కళ చిత్రలేఖనం.. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. కొన్ని వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలు నేర్పుతున్నారు.నృత్య, సంగీతంలో.. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తక పఠనం.. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేథను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్లలను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్రోడ్డులోని జూపార్క్, సైన్స్సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ జిల్లా వికాసతరంగణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు వ్యాసరచన, భగవద్గీత శ్లోకం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ ఇస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వలంటీర్గా సేవలందించవచ్చు. ఆర్ఎస్ఎస్, ఎన్ఎస్ఎస్లో విద్యార్థులు శిక్షణ తీసుకుని ఉమ్మడి జిల్లా విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.. ప్రస్తుతం టెక్నాలజీ వెంట పరిగెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. ఇస్రో ప్రతీ యేటా వర్క్షాప్ నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థులను ఎంపిక చేస్తోంది. స్థానికంగా ఉన్న కంప్యూటర్ శిక్షణలో చేరి కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవాలి. పుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్ -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోuu -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంగపేట: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆలయాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఆకాంక్షతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీకత్క పనిచేస్తున్నారన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని, ఆ సదస్సులో అర్చక ఉద్యోగుల దూపదీప నైవేద్యం, అర్చకుల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలను ప్రయాగ్రాజ్లో నిర్వహించిన తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు చేయాలనే సంకల్పంతో ఏర్పా ట్లు చేస్తున్నారన్నారు. భక్తులు తరలివచ్చి పవిత్రమైన పుణ్య స్నానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక జేఏసీ గౌరవ అధ్యక్షుడు ముక్కామల రాజశేఖర్ శర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
317జీఓ బాధితులకు న్యాయం చేయాలి
భూపాలపల్లి అర్బన్: 317 జీఓ బాధితులకు వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించి న్యాయం చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పులి దేవేందర్ కోరారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు. ఆర్థిక నష్టం లేనటువంటి 317 జీఓ బాధితులకు న్యాయం చేసి వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్, నాయకులు చంద్రయ్య, వెంకటేష్, రమేష్, పున్నంచందర్, సాగర్, తాడిచర్ల రవి పాల్గొన్నారు. -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈకార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు. సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ -
ప్లీనరీ వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ 21న హైదరాబాద్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుతూ.. మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సాంబ లక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్లోని సీతాఫల్ మండిలో ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు గుర్తించి కార్డులు, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులు సునితారెడ్డి, ప్రసన్న శారద, రాజేశ్వరి, రమాదేవి, లక్ష్మి, లత, పుష్ప పాల్గొన్నారు. -
ఏసు బోధనలు మానవాళికి దిక్సూచి
భూపాలపల్లి అర్బన్: ఏసుప్రభు బోధనలు ప్రపంచ మానవాళికి దిక్సూచి అని సీఎస్ఐ ఫాస్ట్రేట్ కమిటీ చైర్మన్ రెవరెండ్ ఎం.కనకరత్నం తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చితో పాటు జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకరత్నం మాట్లాడుతూ.. మానవులంతా క్షమాగుణం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో సీఎస్ఐ చర్చి సంఘ సెక్రటరీ దుప్పటి మొగిలి, ట్రెజరర్ రవికుమార్, స్టీవార్డు ఇమ్మానియేల్ అమ్మగారు సంకీర్తన, సీ్త్రల మైత్రి, యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే15 నుంచి 26 వరకు జరుగు సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన రూ.కోటితో చేపట్టిన ఎన్పీడీసీఎల్ విద్యుత్ లైన్ల ప్రగతిని ఆ శాఖ సీఈ రాజుచౌహాన్ పరిశీలించారు. శుక్రవారం ఆయన కాళేశ్వరంలో జరుగుతున్న విద్యుత్ పనులను పరిశీలించారు. సలహాలు, సూచనలు అందజేశారు. పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎస్ఈ మల్చూర్ నాయక్, డీఈ పాపిరెడ్డి, ఏడీఈ నాగరాజు, ఏఈ శ్రీకాంత్ ఉన్నారు. మట్టి తరలిస్తున్న లారీల అడ్డగింత కాటారం: శంకరాంపల్లి నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను శుక్రవారం గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. మట్టి తరలింపు నిలిపేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, పలువురు దళారులు గ్రామ సమీపంలోని చేల నుంచి అనుమతులు లేకుండా నిత్యం మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. చేలలో సుమారు 20 ఫీట్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి మున్ముందు రోజుల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో మట్టి లారీలు గ్రామం మధ్య నుంచి తిరుగుతుండటంతో దుమ్ము అధికంగా లేవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగజాల అశోక్, బోనగిరి శ్రీకాంత్ పాల్గొన్నారు. కేసీఆర్ను కలిసిన జక్కు శ్రీహర్షిణి కాటారం: మాజీ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ను తన నివాసంలో కలిశారు. శ్రీహర్షిణి జన్మదినం సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ముందునడవాలని, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కేసీఆర్ సూచించినట్లు శ్రీహర్షిణి తెలిపారు. కష్టపడి పని చేస్తే రానున్న రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ మాట ఇచ్చినట్లు శ్రీహర్షిణి పేర్కొన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్ ఉన్నారు. వేముల శంకర్కు డాక్టరేట్ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఐటీ మాస్టర్ స్కిల్ హబ్ డైరెక్టర్, వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపకుడు వేముల శంకర్కు స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ (యూఎస్ఏ) వారు అంతర్జాతీయ డాక్టరేట్ అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో అవార్డును అందజేశారు. -
వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాకు కేటాయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డెరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. భూపాలపల్లి ఏరియాను శుక్రవారం సందర్శించి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధించాలని ఆదేశించారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బొగ్గు రవాణ లక్ష్యం కూడా తప్పక సాధించాలని అధికారులను కోరారు. ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన భూ సేకరణ, మట్టి వెలికితీయడంలో ఎదురయ్యే ఇబ్బందులు తక్షణమే పరిష్కరించుకొ ని ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కార్మికులకు వైద్య సదుపాయం, ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఓసీ–2 పీఓ వెంకటరామరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, ఓసీ–3 పీఓ భిక్షమయ్య పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ -
మోక్షం ఎప్పుడో..!
సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్● 2020 సంవత్సరంలో స్వీకరణ.. ● ఇప్పటివరకు పట్టా పాస్బుక్లు లేవు ● కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ ● జిల్లావ్యాప్తంగా 51,347 దరఖాస్తులు ● భూభారతిపైనే ఆశలు..భూమి మార్పిడి సాదాబైనామాల కోసం దరఖాస్తుకు ప్రభుత్వం మొదట 2020 అక్టోబర్ 31వ వరకు గడువు విధించగా మరోమారు నవంబర్ 10వరకు పెంచింది. ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల కంటే ముందు అక్టోబర్ 28వరకు జిల్లాలో 1,896 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనంతరం 51,347 మంది సాదాబైనామాల కోసం దరకాస్తు చేసుకున్నవారు అయోమయంలో పడ్డారు. కోర్టు ఆదేశాలతో ఇప్పటి వరకు దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. కొత్త చట్టం ప్రకారం మార్గదర్శకాలు వస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పట్టాపాసుపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.భూపాలపల్లి అర్బన్: సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించి ఐదేళ్లు కావస్తుంది. వాటికి ఇప్పటివరకు మోక్షం కలుగడం లేదు. ధరణి సమస్యల పరిష్కారానికి నోచుకున్నప్పటికీ సాదాబైనామా గురించి గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తెల్ల కాగితాలపై రాసుకున్న క్రయవిక్రయాల భూముల క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్లో రైతుల నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో తెల్ల కాగితాలపై రాసుకుని విక్రయాలు జరిపిన కాగితాలపై తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వారంతా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 51,347 దరఖాస్తులు అందాయి. నాటినుంచి దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించి కొత్త పట్టాలు మంజూరు చేయాలని రైతులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ‘భూమాత’ను ప్రారంభించింది. ఇప్పటివరకు క్రమబద్ధీకరణ, పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు పనిష్కారం అవుతాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు 2014 జూన్ 2కు ముందు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్కు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. 2020 అక్టోబర్ 31వరకు వివిధ మండలాల నుంచి వచ్చాయి. మొదట వ్యవసాయ భూములు, గ్రామీణ ప్రాంతాల్లోని వాటికి మాత్రమే అవకాశం కల్పించింది. అనంతరం నవంబర్ 1నుంచి 10వరకు గడువు పొడిగించింది. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల వారికి సాదాబైనామాలకు అవకాశం కల్పిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీల్లోని వారికి కూడా అవకాశం కలిసి వచ్చింది. పది రోజుల వ్యవధిలోనే 51,347 వరకు దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించి క్రయవిక్రయదారుల ఆమోదంతో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్లు ఉంటాయని దరఖాస్తుదారులు భావిస్తున్న సమయంలో కోర్టు ఆదేశాలతో అయోమయంలో పడ్డారు. పాత రెవెన్యూ చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించడంతో అప్పుడే ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో సాదాబైనామాలు నిలిచిపోయాయి. గత చట్టంతో తిరకాసు.. -
చిన్న షెడ్డు అయినా ఏర్పాటు చేయాలి..
బస్సుల కోసం రోడ్డు మీద, షాపుల ఎదుట వేచి చూస్తూ.. ఎండాకాలంలో ఎండకు, వానాకాలంలో వానకు చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్టాండ్ను నిర్మించి కూడా ప్రారంభించలేదు. తొందరగా బస్టాండ్ను ప్రారంభించి బస్సులు అక్కడికే వచ్చేటట్టు చేస్తే మాకు ఇబ్బంది ఉండది. మేము కూడా బస్టాండ్లోనే కూర్చొని ఉంటాం కదా. – కంచు చంద్రమ్మ, తిరుమలాపూర్, చిట్యాల, ప్రయాణికురాలు బస్టాండ్ను ప్రారంభించాలి.. బస్టాండ్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం, వానాకాలంలో షాపుల ఎదుట నిలబడాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్ను ప్రారంభించి అక్కడి నుంచే బస్సుల రాకపోకలు సాగిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. – మౌనిక, మొగుళ్లపల్లి, ప్రయాణికురాలు● -
జాతీయ రహదారిపై దుర్శెన చెట్టే దిక్కు..
పక్క ఫొటోలో కనిపిస్తున్నది రేగొండ మండల కేంద్రం. చిట్యాల, టేకుమట్ల, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన వారు వివిధ పనుల నిమిత్తం ఈ సెంటర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. జాతీయ రహదారిలో రేగొండ మండల కేంద్రం ఉంటుంది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఇక్కడ బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న దుర్శెన చెట్టు కింద నిలబడి తమ రాకపోకలను సాగిస్తున్నారు. సమీపంలోనే చెరువు శిఖం భూమి, ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు తలుచుకుంటే బస్టాండ్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డులో గల ఓ పెట్రోల్బంకు. గత నెల 25న స్కై బ్లూ రంగు గల కియా కారులో బంకులోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించగా పెట్రోల్ బంక్ మేనేజర్ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లతో డీజిల్ కొట్టించుకున్నారు. రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ కొట్టించుకున్న సదరు వ్యక్తులు స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యిల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయడం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్గడ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆటకట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెందిన సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరార్ పెట్రోల్ బంకులకు బురిడీ కొట్టించి జల్సాలు మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
మొగుళ్లపల్లి: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు లేని వారికి అన్యాయం జరుగవద్దన్నారు. లబ్ధిదారుడికి లక్ష రూపాయలు జమ అయినట్లు ఆమె తెలిపారు. ఆమెవెంట హౌజింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి సుమత ఉన్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి చిట్యాల: మండలంలోని ముచినిపర్తి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మిస్తున్న మోడల్ ఇంటి నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ ఎన్.విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవాలని సూచించారు. బేస్మెంట్ వరకు పూర్తిచేసిన వారికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమఅవుతున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, ఏఈ రామలింగం, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు. కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ మృతి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం మాజీ సర్పంచ్, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గంట రామ్నారాయణగౌడ్ (70) అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనకు భార్య లత, కుమార్తె సుజాత ఉన్నారు. భవన నిర్మాణానికి కృషి చేస్తా.. భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించే ది కాకతీయ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లారీలు కొన్న ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించుకొని అసోసియేషన్లో చేర్పించుకోవాలని అన్నారు. లారీ యాజమానులే ట్రాన్స్ఫోర్ట్ ఏర్పాటు చేసుకొని బొగ్గు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల చంద్రయ్య, గౌరవ అధ్యక్షుడు చెరుకుతోట శ్రీరాములు, ఉపాధ్యక్షుడు కౌటం సురేందర్, ప్రధాన కార్యదర్శి ఎండీ అన్వర్ పాషా, సహాయ కార్యదర్శి ఎనగంటి రమేష్, కోశాధికారి తాళ్లపల్లి తిరుపతిరావు, టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట రవి యాదవ్, లారీ ఓనర్లు పాల్గొన్నారు. సమష్టిగా ఉంటేనే సమస్యల పరిష్కారం భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాప్ అందరూ కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. ఏరియాలోని కేటీకే ఓసీ–3 లో ఏఐటీయూసీ ఏడీసీ ఆధ్వర్యంలో గురువారం కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉంటేనే అనేక సమస్యలు పరిష్కరించబడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజేందర్, ఆసీఫ్ పాషా, శ్రీని వాస్, సుధాకర్ రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీని గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా కేతిరి సారయ్య, జిల్లా అధ్యక్షుడిగా కేతిరి రాజు, ప్రధాన కార్యదర్శిగా రెవెల్లి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేతిరి రవీందర్, ఉపాధ్యక్షులుగా పలువురు ఎన్నికయ్యారు. -
రైతుల పాలిట ‘భూ భారతి’ వరం
గణపురం: భూ భారతి చట్టం రైతుల పాలిట వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి చట్టం భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మే నెలలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోనున్నట్లు చెప్పారు. ధరణి ద్వారా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గణపురం మండలంలో జెన్కో, సింగరేణి సంస్థలలో భూములు కోల్పోయిన నిర్వాసిత ప్రజలు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో 10,900 ఎకరాలకు పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ చట్టం ద్వారా వారి సమస్య తీరుతుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో 70నుంచి 80శాతం సమస్యలు భూములకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, ఆర్డీఓ రవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీడీఓ భాస్కర్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ కార్యాలయంలో గురువారం దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సంఽబందితశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం వీఐపీ ఘాటు, ప్రధానఘాటుల వద్ద శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈఈ, డీఈ, ఏఈఈలు పాల్గొన్నారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ -
ఎనిమిదేళ్లుగా నిరుపయోగం...
ప్రయాణికుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో ఎనిమిదేళ్ల క్రితం బస్టాండ్ను నిర్మించారు. ఇప్పటివరకు ఆ బస్టాండ్ను ప్రారంభించలేదు. దీంతో అక్కడికి బస్సుల రాకపోకలు సాగడం లేదు. చిట్యాల మండల కేంద్రం మీదుగా రైతులు క్రిమి సంహారక మందులు, విత్తనాల కోసం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు నిత్యం వందలాది మంది పరకాల, హనుమకొండ, భూపాలపల్లి పట్టణ ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్టాండ్ ప్రారంభించకపోవడం, బస్సులు చిట్యాల సెంటర్ నుంచే తిరిగి వెళ్తుండటంతో ప్రయాణికులు అక్కడే ఉన్న షాపుల ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
డీజీపీఎస్ పరికరంతో సర్వే వేగిరం
భూపాలపల్లి: సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు డీజీపీఎస్ పరికరం సహకరిస్తుందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రూ.16.78 లక్షల విలువ గల డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) పరికరాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కుసుమకుమారికి కలెక్టర్ అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయవచ్చన్నారు. జిల్లాలో పరిశ్రమలు, రహదారుల నిర్మాణం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయడానికి డీజీపీఎస్ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. సిబ్బందికి ఇది మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుందని, ప్రాధాన్యతను గుర్తించి సర్వేలో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. పంట నష్టం నివేదిక అందజేయాలి.. అకాల వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, వాణిజ్య పంటల నివేదిక అందజేయాలని కలెక్టర్ రాహుల్శర్మ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నివేదిక రూపకల్పనపై ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పంట నష్టం అంచనాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రైతులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఏఓ వీరునాయక్, జిల్లా ఉద్యానవన శాఖాధికారి సునీల్కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
మహాముత్తారం అడవిలో పులి కలకలం
కాటారం: మహాముత్తారం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పులి అటవీ ప్రాంతంలోకి వచ్చిందనే పుకార్లతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా స్తంభంపల్లి(పీకే), మద్దిమడుగు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో పులి అడుగులను అటువైపు వెళ్లిన పలువురు గుర్తించారు. సమాచారం అందుకున్న దూదేకులపల్లి రేంజర్ రాంమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు (ప్లగ్ మార్క్స్)ను నిర్ధారించారు. కానీ, అవి తాజా పాదముద్రలు కావని.. నాలుగు రోజుల క్రితం పులి ఇటువైపుగా వెళ్లినట్లుగా ఉన్నాయని రేంజర్ తెలిపారు.అగ్నిప్రమాదాలపై ఆస్పత్రుల్లో అవగాహనభూపాలపల్లి అర్బన్: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై మాక్డ్రిల్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది నరేందర్, సురేష్, కల్యాణ్, నవీన్కుమార్, వెంకటయ్య పాల్గొన్నారు.రజతోత్సవ సభను విజయవంతం చేయాలిభూపాలపల్లి అర్బన్: ఈ నెల 27న హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మున్సిపాలిటీ పరిధీలోని జంగేడు, వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, కాశీంపల్లి, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి ఆకుదారివాడల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వెంకటరాణిసిద్దు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, నాయకులు జనార్ధన్, రాజులు పాల్గొన్నారు.చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రభూపాలపల్లి అర్బన్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజిరెడ్డి, మంద నరసింహరావు డిమాండ్ చేశారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్హౌజ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ, బీఎంఎస్లు మినహా ఇతర పార్టీలు, సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 51 శాతం మంది కార్మికులు సమ్మెను అంగీకరిస్తేనే సమ్మె చేయాలని, సీఎంపీఎఫ్ కాంట్రీబ్యూషన్ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం. 12 గంటలకు పని వేళలను పెంచడం, లేబర్ ఇన్స్పెక్టర్ను ఫెసిలిటేటర్గా మార్చడం వంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అప్రెంటీస్ విధానం ద్వారా కార్మికులను నియమించుకుంటూ వారితో ఏళ్ల తరబడి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. సంస్థకు రావాల్సిన బాకాయిలను చెల్లించడం లేదని, సింగరేణికి ప్రైవేట్ గనులను అప్పగించాలని ఎటువంటి పోరాటం చేయడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడం లేదని తెలిపారు. ఐదేళ్ల తర్వా త జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో సీఎండీ పాల్గొనకపోవడం హాస్యస్పాదమన్నారు. గు ర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కంపేటి రాజయ్య, రమేష్, శివరాంరెడ్డి, ప్రవీణ్కుమార్, రవి, దినేష్ పాల్గొన్నారు. -
ఎలుగుబంటి మృతి కేసులో ఒకరి అరెస్ట్
కాటారం: మహాముత్తారం మండలం యత్నారం అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మృతి చెంది కళేబరం లభ్యమైన కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పెగడపల్లి రేంజర్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. యత్నారం కొండెంగలవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 14న పలువురు గ్రామస్తులు ఎలుగుబంటి కళేబరం గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి పక్కనే విద్యుత్ తీగ ఉచ్చు ఉండటంతోపాటు మాంసం, గోర్లు తీసుకెళ్లిన దుండగులు కేవలం కళేబరం మిగిల్చారు. పంచనామా, పోస్టుమార్టం చేయించిన అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు కోణాల్లో విచారణ ప్రారంభించిన అధికారులు ఎలుగుబంటి మృతికి సంబంధం ఉందని యత్నారం గ్రామానికి చెందిన మంగూనాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం కాటారంలోని పెగడపల్లి రేంజ్ కార్యాలయంలో మంగునాయక్ అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని రేంజ్ అధికారి తెలిపారు. కాగా, మంగూనాయక్ అరెస్ట్ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రేంజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మంగూనాయక్పై అక్రమంగా అధికారులు కేసు పెట్టారని కుటుంబ సభ్యులు ప్రమీల, జగత్సింగ్, సురేందర్ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తడి ఎక్కువగా ఉందని, నీవు ఒప్పుకొని కేసు నీపై వేసుకుంటే బెయిల్కు అయ్యే ఖర్చులు సగం తాము భరిస్తామని అటవీశాఖ అధికారులు తనను ఇబ్బంది పెట్టారని అరెస్ట్ అయిన మంగూనాయక్ విలేకర్ల ఎదుట ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వేడుకున్నాడు.అక్రమంగా కేసు పెట్టారని కుటుంబ సభ్యుల ఆరోపణ -
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
కాటారం: మహాముత్తారం మండలం స్తంభంపల్లి, రేగులగూడెం, బోర్లగూడెం గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై బుధవారం డీటీఎఫ్ సీఐ రాజసమ్మయ్య, ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై పేర్కొన్నారు. 20 లీటర్ల గుడుంబా, 35 కిలోల చక్కెర స్వాధీనపర్చుకొని 1,100 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘భూ భారతి’ సదస్సులకు ఏర్పాట్లు చేయండి
భూపాలపల్లి: నూతన రెవెన్యూ చట్టం భూ భారతిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండలస్థాయిలో సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ.. తహసీల్దార్లను ఆదేశించారు. ఐడీఓసీ సమావేశపు హాల్లో బుధవారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లతో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టం భూ భారతిపై రూపొందించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన సదస్సులకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేలా గ్రామాల్లో టామ్ టామ్ వేయించాలన్నా రు. రెవెన్యూ శాఖలో పని చేసే ప్రతీ ఉద్యోగికి ఈ నూతన చట్టంపై సమగ్రమైన, స్పష్టమైన అవగాహ న ఉండాలని తెలిపారు. ‘భూ భారతి చట్టం – రైతు ల చుట్టం’ అనే నాలుగు పేజీలతో కూడిన పుస్తకా న్ని తహసీల్దార్లకు అందజేశారు. అంతకుముందు భూ భారతి చట్టం విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కా టారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకటించిన కలెక్టర్.. జిల్లాలో నిర్వహించనున్న భూ భారతి అవగాహన సదస్సుల షెడ్యూల్ను కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. ఈ నెల 17వ తేదీన గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక, 19న కాటారం రైతు వేదిక, 21న భూపాలపల్లి పట్టణంలోని ఏఎస్ఆర్ గార్డెన్, 22న చిట్యాల రైతు వేదిక, 23న ఉదయం 10 గంటలకు మొగుళ్లపల్లి రైతు వేదిక, మధ్యాహ్నం 2 గంటలకు టేకుమట్ల ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్, 24న మహాముత్తారం మండలం బోర్లగూడెం రైతు వేదిక, 25న ఉదయం రేగొండ రైతు వేదిక, మధ్యాహ్నం గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక రైతు వేదిక, 26న మల్హర్రావు మండలం కొయ్యూరు రైతు వేదిక, 28న ఉదయం మహదేవపూర్ రైతు వేదిక, మధ్యాహ్నం పలిమెల ప్రాథమిక పాఠశాల ఆవరణలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మధ్యాహ్నం జరిగే సదస్సుకు హాజరయ్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీడ, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల మంజూరుకు విచారణ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు విచారణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పొరపాట్లుకు తావులేకుండా నిరుపేద లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని 145 గ్రామ పంచాయతీల పరిధిలో 33,089 దరఖాస్తులు, మంథని నియోజకవర్గ పరిధిలోని 84 గ్రామ పంచాయతీల్లో 18,634, మొత్తంగా 51,723 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని.. జాబితాను తిరిగి గెజిటెడ్ అధికారి ద్వారా సూపర్ చెక్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ నరేష్, గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ షెడ్యూల్ విడుదల -
రేషన్కార్డు దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూపాలపల్లి: కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులకు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీఓసీలోని తన చాంబర్లో రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ, ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన, గ్రామసభల్లో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే విచారణ చేసి అర్హత మేరకు మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. అవి ప్లాస్టిక్ బియ్యం కాదని, పోర్టిఫైడ్ బియ్యమని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు కేసులు నమోదు చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
భూపాలపల్లి: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్లో డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే ఈమేరకు వినతి పత్రం అందించారు. అనంతరం భూపాలపల్లి నియోజకవర్గంలో నష్టపోయిన పంటల గురించి వివరించారు. మంగళవారం కురిసిన అకాల వర్షంతో వరి, మిర్చి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి, బాధిత రైతులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.డిప్యూటీ సీఎంను కోరిన ఎమ్మెల్యే గండ్ర -
కాళేశ్వరం ఆర్చి నిర్మాణ పనుల ప్రారంభం
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన ఆర్చి నిర్మాణ పనులు ఎన్హెచ్ 353(సీ) ప్రధాన రహదారిపైన బుధవారం ప్రారంభమయ్యాయి. 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భారీ యంత్రాలు, పరికరాలు, మోటార్లు ఆర్చి కింద నుంచి వెళ్లేందుకు వీలుగా లేకపోవడంతో మేఘా ఇన్ఫ్రా సంస్థ కూల్చివేసింది. ఆ సమయంలో సదరు నిర్మాణ సంస్థ రూ.25 లక్షలు దేవస్థానానికి పరిహారంగా చెల్లించింది. అప్పటి నుంచి ఆర్చి నిర్మాణంపై దేవాదా యశాఖ దృష్టిసారించలేదు. ఈక్రమంలో మే 15 వ తేదీ నుంచి 26 వరకు జరిగే సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్చి పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్బాబు, దేవదాయశాఖ ప్రి న్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించడంతో ఈఓ మహేష్ పనులు ప్రారంభించారు. పిల్లర్లకో సం జేసీబీతో తవ్వకాల చేపట్టారు. కాగా, రూ.32 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు.2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తొలగింపు -
ఎప్పుడో..!
కలగానే భూపాలపల్లి ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్లుఠాణాల ఏర్పాటు ● తొమ్మిదేళ్ల క్రితం సర్కారుకు ప్రతిపాదనలు ● ముందుకు కదలని ఫైలు ● ఇబ్బందుల్లో వాహనదారులు, మహిళలు మహిళా స్టేషన్ ఏది..? 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో పురుషులు 2,07,998 మంది ఉండగా.. మహిళలు 2,08,765 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు అయి ఉంటుంది. జిల్లాలో మహిళా పోలీస్స్టేషన్ లేకపోవడంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబపరమైన, వేధింపులకు సంబంధించి సమస్యలను నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తెలిపేందుకు ఇబ్బందిపడాల్సి వస్తుంది. మహిళా స్టేషన్ను ఏర్పాటు చేస్తే కుటుంబ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.భూపాలపల్లి: జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు కలగానే మారింది. జిల్లా ఏర్పాటైన సమయంలో ఇక్కడి పోలీసు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపగా స్టేషన్ల ఏర్పాటు నేటికీ కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా జిల్లావాసులు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. -
ఉద్యోగ ఉత్తర్వుల అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా సింగరేణి కారుణ్య నియమాక ఉద్యోగాలు పొందిన వారికి మంగళవారం ఉద్యోగ ఉత్తర్వులు అందజేసినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి తెలిపారు. జీఎం కార్యాలయంలో ఇన్చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, అధికారులు రవి, అరుణ్ప్రసాద్, రాజు, యూనియన్ నాయకులు రమేష్, మధుకర్రెడ్డి పాల్గొన్నారు. డీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక భూపాలపల్లి అర్బన్: డెమెక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించినట్లు ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు చాప బాబుదొర తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా చిలువేరు అశోక్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కార్యదర్శులుగా వీరేశం, బొజ్జనాయక్, వీరన్న, ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్స్గా సుదర్శనం, జయ, రమణరెడ్డి, లక్ష్మణ్నాయక్, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, సుదర్శన్, వెంకటేశ్వరచారి, అడిట్ కమిటీ కన్వీ నర్గా దేవేందర్రెడ్డి, సభ్యులుగా మొండయ్య, జయప్రకాశ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముగిసిన ‘టెన్త్ స్పాట్’ విద్యారణ్యపురి: కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో ఈ నెల 7వ తేదీనుంచి ప్రారంభమైన టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మంగళవారం సాయంత్రం ముగిసింది. అన్ని సబ్జెక్టులు, ఒకేషనల్ కోర్సుల పరీక్షల జవాబుపత్రాలు కలిపి 2,27,403 జవాబుపత్రాలు వచ్చాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి ఎస్ఏలు, ఎస్జీటీలను స్పాట్ విధులకు కేటాయించారు. సీఈలుగా 113మంది, ఏఈలుగా 676మంది ఎస్ఏలు, 224మంది ఎస్జీటీలు స్పెషల్ అసిస్టెంట్లుగా విధుల్లో పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి క్యాంపు ఆఫీసర్గా, 8మంది పీజీహెచ్ఎంలు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించారు. ఈ నెల 30న లేదా మే మొదటివారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐక్యతతోనే సమస్యల పరిష్కారం భూపాలపల్లి అర్బన్: కార్మికుల ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించబడుతాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గని లో రమేశ్ మంగళవారం కార్మికులను కలిసి వా రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ స్టాప్ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా కమిటీ ఉండాలని, మైన్స్, ఏరియా వారీగా ఏర్పాటు చేసి మైనింగ్ స్టాప్ను బలోపేతం చే యాలన్నారు. ఈ నెల 20న ఏరియాలోని కొమురయ్య భవన్లో మైనింగ్ స్టాప్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపా రు. ఈ సమావేశాన్ని నాయకులందరూ సకా లంలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు తిరుపతి, ఆసిఫ్పాషా, సుధాకర్రెడ్డి, రామచందర్, నారాయణమూర్తి, అఖిల్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రయాణికురాలికి తీవ్రగాయాలు కాటారం: ఆర్టీసీ బస్సు దిగబోయి కిందపడిపోయి మహిళ తీవ్రగాయాలపాలైన ఘటన కాటారం మండలం మేడిపల్లి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులి స్వరూప బస్వాపూర్ సమీపంలోని నాయకపల్లి వద్ద తన కూతురుని చూడటానికి భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో వచ్చింది. బస్వాపూర్ స్టేజ్ దాటిన తర్వాత స్వరూప బస్సు ఆపాలని డ్రైవర్, కండక్టర్ను కోరింది. డ్రైవర్ బస్సు నిలుపననడంతో సదరు మహిళ బతిమిలాడింది. మేడిపల్లి టోల్గేట్ సమీపానికి బస్సు చేరుకోగా కండక్టర్ స్వరూపను దిగమని చెప్పాడు. ఆమె దిగుతుండగా డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో స్వరూప బస్సు మెట్లపై నుంచి కిందపడింది. కాలు మడిమపై నుంచి బస్సు టైరు వెళ్లింది. తీవ్రగాయమై రక్తస్రావం అవగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగానే స్వరూప గాయాలపాలైనట్లు ఆమె బంధువులు ఆరోపించారు. -
భూ భారతిపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి: భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు అన్ని మండలాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్ తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంగళవారం అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతీ మండలంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాల చేపట్టాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో భూ భారతి చట్టం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి చట్టంపై ప్రజలకు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేద కుటుంబాలను ఎంపిక చేయాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuతాత్కాలిక ట్రాఫిక్ స్టేషన్తో కొంత ఉపశమనం.. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్ 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడింది. అప్పటినుంచి భూపాలపల్లి పట్టణం దినదినం అభివృద్ధి చెందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, కేటీపీపీ, సింగరేణి పరిశ్రమలతో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుంది. బొగ్గు, ఇసుక లారీలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటమే కాక పలువురు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పలువురు యువకులు ట్రిబుల్ రైడింగ్తో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను గుర్తించిన ఎస్పీ కిరణ్ ఖరే గతేడాది ఫిబ్రవరిలో తాత్కాలిక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లో పనిచేసే పలువురు సిబ్బంది, ఒక ఎస్సైని కేటాయించారు. వారి విధి నిర్వహణ మూలంగా కొంతమేరకు సమస్య పరిష్కారం అయినప్పటికీ పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.ప్రతిపాదనలకే పరిమితం.. జిల్లా ఏర్పాటు సమయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్.భాస్కరన్ జిల్లాకేంద్రంలో ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్ అవసరాన్ని గుర్తించి స్టేషన్ల ఏర్పాటుకోసం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ప్రస్తుత జిల్లా ఎస్పీ కిరణ్ఖరే సైతం మరోమారు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్, మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటుచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పరిశీలనలో ఉంది.. జిల్లాకేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్స్టేషన్, మహిళా స్టేషన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఆ ఫైలు పరిశీలనలో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. – కిరణ్ ఖరే, ఎస్పీ ●న్యూస్రీల్ -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రమేశ్బాబు
వరంగల్ లీగల్/భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. హనుమకొండ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సీహెచ్.రమేశ్బాబు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు రానున్నారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.నారాయణబాబు వరంగల్ జిల్లా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా బదిలీ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎండీ అబ్దుల్ రఫీ, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 23 వరకు నూతన స్థానంలో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నారాయణబాబు బదిలీ -
గారెపల్లి రిజర్వాయర్ పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా కాటారం మండలం గారెపల్లిలో చేపడుతున్న రిజర్వాయర్ 2 బండు పనులను మంగళవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని నిర్వాసిత రైతులు ప్రాజెక్ట్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. భూమి కోల్పోయి, పంట నష్టపరిహారం అందక తమ కుటుంబాలు రోడ్డునపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించేంత వరకు పనులు సాగనివ్వబోమని రైతులు తెల్చిచెప్పారు. ప్రాజెక్ట్ డీఈఈ ఉపేందర్ రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామని డీఈఈ రైతులకు వివరించారు. పరిహారం అందేవరకు పనులు చేపట్టవద్దని రైతులు తెగేసి చెప్పడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మ్యాన్ రైడింగ్ పొడిగించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే–5వ గనిలో మ్యాన్ రైడింగ్ను పొడిగించాలని కోరుతూ.. సీఐటీయూ నాయకులు మంగళవారం ఏరియా ఇన్చార్జ్ జీఎం వెంకటరామరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు మాట్లాడుతూ.. భూగర్భ గనిలో సరిపడా మ్యాన్ రైడింగ్ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. 21వ లెవల్ నుంచి 31వరకు కాలినడకన వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. అనేక సంవత్సరాలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, మలినాలు తాగే నీటిలో కలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంపేటి రాజయ్య పాల్గొన్నారు. -
ఘనంగా హోమం, జలాదివాసం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపనలో భాగంగా మంగళవారం ఉదయం ఆవాహిత దేవతా మండల మూల మంత్ర హోమములు, విగ్రహ స్నపనము, జలాధివాసం కార్యక్రమాన్ని భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు రామకృష్ణ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శయ్యాధివాసము, ధాన్యాధివాసము ఫల పుష్ప ఆదివాసములను విగ్రహాలకు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతలు ప్రత్యేక హోమాలను నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోమశాలను ఏర్పాటు చేసి వేదమంత్రాల మధ్య దంపతులతో హోమాలు చేపట్టారు. నేడు అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప పంచలోహవిగ్రహంతో పాటు ఇతర విగ్రహాలను బుధవారం ఉదయం 11గంటలకు ప్రతిష్ఠించనున్నట్లు బ్రహ్మశ్రీ మల్లావజ్జల రామకృష్ణశర్మ తెలిపారు. గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు శివలింగం, మాలికపురత్తమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నాగేంద్రస్వామి, గణపతి, నందీశ్వరులకు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
రోడ్డుకు అడ్డంగా గుంతతీసి నిరసన
రేగొండ: రోడ్డుకు అడ్డంగా గుంత తీసి ఓ జేసీబీ యాజమాని నిరసన తెలిపిన ఘటన కొత్తపల్లిగోరి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. గత ప్రభుత్వంలో కొత్తపల్లిగోరి మండలంలోని జమ్షేడ్బేగ్పేట వద్ద దాదాపు రూ.3 కోట్ల రూపాయలతో బ్రిడ్ఙి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ బీటీ రోడ్డు మినహా బ్రిడ్ఙి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. సదరు కాంట్రాక్టర్ బ్రిడ్ఙి నిర్మాణం కోసం ఉపయోగించిన జేసీబీ యాజమానికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో మంగళవారం తాత్కాలిక రోడ్డు, బ్రిడ్ఙి రోడ్డుకు అడ్డంగా గుంత తీసి తన నిరసనను తెలిపాడు. దీంతో ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన అధికారులు గుంతలను పూడ్చడంతో యఽథావిధిగా వాహనాల రాకపోకలు సాగాయి. -
ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు పాటించాలి
భూపాలపల్లి: ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులు వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చలువ కళ్లద్దాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వేసవిలో అతినీల లోహిత కిరణాల వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, ప్రతీ ఒక్కరు కళ్లద్దాలు, టోపీలు తప్పకుండా వాడాలన్నారు. విధుల్లో ఉన్నప్పుడు ప్రతీ అర్ధగంటకు ఒకసారి మంచినీరు తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఎ.సంపత్రావు, సీఐ డి.నరేష్కుమార్, ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
మే 14న రామప్పకు మిస్వరల్డ్ టీం
ములుగు: మే 14న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం రానున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావుతో కలిసి రామప్పలో చేపట్టనున్న ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రపంచ సుందరీ పోటీలలో పాల్గొననున్న పలు దేశాలకు చెందిన మహిళలు రామప్ప సందర్శనకు వస్తున్న తరుణంలో ములుగు జిల్లా ప్రవేశ మార్గమైన మహ్మద్గౌస్పల్లి నుంచి జంగాలపల్లి వరకు, జంగాలపల్లి నుంచి రామప్ప వరకు, రామప్ప నుంచి హరిత హోటల్ వరకు పంచాయతీరోడ్డు ఇంజనీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా మరమ్మతులు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పర్యటన వివరాలను తెలుసుకొని ఏర్పాట్ల విషయంలో ఎప్పటికప్పుడు ఫొటోలు వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా ముందుకుసాగి ప్రపంచ మిస్ వరల్డ్ టీం పర్యటనను విజయవంతంగా ముగించాలని సూచించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీఎస్పీ రవీందర్, పురావస్తు శాఖ అధికారులు, వెంకటాపురం(ఎం) మండల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలి కలెక్టర్ టీఎస్ దివాకర -
అంబేడ్కర్ జయంతి వేడుకలు
భూపాలపల్లి అర్బన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 జయంతి వేడుకలను జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్శర్మ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పంచశీల పతాకావిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ. అంబేడ్కర్ కారణంగానే అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. వచ్చే అంబేడ్కర్ జయంతి నాటికి అంబేడ్కర్, జ్యోతిరావుపూలే కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, అదనపు ఎస్పీ బోనాల కిషన్, డీఎస్పీ సంపత్రావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునిత, దళిత సంఘాల నాయకులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని.. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు. -
‘బిల్ట్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి’
ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని కమలాపురంలో గల మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బాధావత్ రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పొద్దునూరు యాదగిరి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట మానవహక్కుల వేదిక నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. 2014లో మూతపడిన బిల్ట్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఐటీడీఏ నుంచి కమలాపూర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులతో పాదయాత్రను నిర్వహించారు. 1977 లో ఏపీ రేయాన్స్గా మొదలైన ఫ్యాక్టరీ బిల్ట్గా రూపాంతరం చెంది అనేక లాభాలను గడించిందని తెలిపారు. అనంతరం నష్టాలు వస్తున్నాయనే సాకుతో 2014లో బిల్ట్ను మూసివేశారని తెలిపారు. దీంతో దాదాపు 2వేల మంది రోడ్డున పడ్డారని వివరించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బిల్ట్ ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమాన్ ప్రసాద్, పద్మజ, పాలకుర్తి శ్రీనివాస్, లవ కుమార్, సమ్మయ్య, యుగేందర్, శంకర్, కరీంనగర్ జిల్లా బాధ్యులు మధు, అచ్యుత్, సదానందం, ఖమ్మం జిల్లా బాధ్యులు ఆదినారాయణ, బిల్ట్ కార్మికులు పాల్గొన్నారు. -
అగ్నిమాపకశాఖ సూచనలు
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గి పుల్లలను ఆర్పివేసిన తర్వాత పారేయాలి. చెత్త, గడ్డి, ఎండిన చెట్లు, పూరిపాకల వద్ద వీటిని వేయరాదు. ● ఎక్కువ రోజులు ఇంట్లో లేని సమయంలో విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. ● వంట గదిలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ● గృహాలకు గడ్డి వాములు 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. ● పూరింట్లో నివసించే వారు వంట పూర్తయిన వెంటనే పొయ్యిలో నిప్పును ఆర్పేయాలి. ● వేసవిలో ఉదయం 8గంటల లోపు, సాయంత్రం 6గంటల తరువాత కట్టెల పొయ్యిలను ఉపయోగించాలి. ● గ్యాస్ సిలెండరుకు దగ్గరలో పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి మండే వస్తువులను ఉంచరాదు. ● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలి. ● అపార్ట్మెంట్లు, కర్మాగారాల గోదాములు, గిడ్డంగులలో అగ్నిమాపక శాఖ సూచనలు విధిగా పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు. -
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuఅవగాహన కార్యక్రమాలు ● అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ● ఈనెల 14న జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాలను సందర్శించి సిబ్బంది కుటుంబ సభ్యులతో సమీక్షలు నిర్వహించారు. ● 15న ప్రధాన కూడలి ప్రాంతాలైన బస్స్టేషన్, షాపింగ్ ఏరియాలు, మార్కెట్, సినిమా థియేటర్ అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ● 16న హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన సదస్సులు ● 17న అపార్ట్మెంట్లు, గ్యాస్ కంపెనీలు, విద్యుత్ శాఖ కార్యాలయాలు సందర్శించి ఫైర్ సేఫ్టీ పరికరాల పనితీరును పరిశీలించి వారికి అవగాహన కల్పిస్తారు. ● 18న పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్స్ నిర్వాహకులకు.. ● 19న దుకాణ సముదాయాలు, ఫంక్షన్హాళ్లు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లలో అవగాహన నిర్వహిస్తారు. ● 20న అగ్నిప్రమాదాలపై సమావేశం నిర్వహించి ప్రమాదాలు సంభవిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుతులు అందజేయనున్నారు.వారోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఫైర్ సిబ్బంది భూపాలపల్లి అర్బన్: సూరీడు నేలకొచ్చినట్టు ఎండలు మంట రేపుతున్నాయి. జనానికి సెగలు పుట్టిస్తున్నాయి. సామాన్య ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ సమయంలోనే చిన్నపాటి అజాగ్రత్తతో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంది. తద్వారా సర్వం బుగ్గి అవుతోంది. తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఎండా కాలం, మండించే కాలం కాబట్టి అప్రమత్తత అవసరమని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క అగ్నిమాపక కేంద్రం భూపాలపల్లిలో ఉంది. గతేడాది రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల మేర నష్టం జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 41 అగ్నిప్రమాదాలు జరగగా వాటిల్లో సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4కోట్ల మేర నష్టం జరిగింది. అగ్నిప్రమాదాల్లో రూ.5 కోట్ల ఆస్తిని సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఏ చిన్నపాటి ప్రమాదం వాటిల్లినా తీవ్రంగా నష్ట పోవాల్సి రావడంతో అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖాధికారులు విశేష కృషి చేస్తున్నారు.న్యూస్రీల్సమయస్ఫూర్తి అవసరం ప్రస్తుతం ఎండలు అధికమయ్యాయి. ఈ సమయంలో అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో అధికశాతం తీరప్రాంత గ్రామాలు, మారుమూల ప్రాంతాలు కావడంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా అంతా బుగ్గి అవుతుంది. గతంలో తీరప్రాంత గ్రామాల్లో అగ్నిప్రమాదాలు జరిగి భారీ నష్టం జరిగింది. ప్రమాదాలు జరిగిన సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే నష్టాన్ని నివారించవచ్చు.అప్రమత్తతతోనే అగ్నిప్రమాదాల నివారణ నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర నష్టం జిల్లాలో అగ్నిప్రమాద వారోత్సవాలు ఆరంభం 14నుంచి 20వరకు అవగాహన సదస్సులు -
అకాల వర్షం.. పంట నష్టం
ఈ ఫొటోలో ఉన్న రైతు దంపతులు కొండగొర్ల చిన్న దుర్గయ్య, దుర్గ. ఇద్దరు కలిసి రామన్నగూడెం శివారులో 5ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. పంట కోతదశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయింది. పంట సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏటూరునాగారం: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పొట్ట దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోగా పంటంతా నేలవాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, రొయ్యూర్, శంకరాజుపల్లి, ముళ్లకట్ట, చెల్పాక, చిన్నబోయినపల్లి, గోగులపల్లి, శివాపురం ప్రాంతాల్లో వరిపంట నేలవాలడంతో పాటు ధాన్యం నేలరాలింది. పంట చేతికొచ్చే తరుణంలోనే మాయదారి వర్షం నట్టేట ముంచిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదిలా ఉండగా మిర్చి కాయలను కోతకోసి కల్లాల వద్ద ఆరబెట్టగా తడిసిపోయింది. దీంతో మిరపకాయలు మచ్చలు రావడం, తొడిమె ఊడిపోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉండబోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడితోటల్లోని కాయలు సైతం గాలివానకు రాలిపోయాయి. పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటల పరిశీలన మండల పరిధిలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి సుమారువెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నేటినుంచి సర్వే మొదలవుతుందని ఏఓ వేణుగోపాల్ తెలిపారు. రైతులు అధైర్య పడకుండా పంటను కాపాడుకునే సూచనలను వివరించినట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటలను పరిశీలించి నష్టాన్ని సర్వేచేసి నివేదిక అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రాజు, రవి, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. వరి పంట సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి. అకాల వర్షం రైతులను కోలుకోలేకుండా దెబ్బతీసింది. వందలాది ఎకరాలల్లోని వరిపంట నేలబారింది. పొట్టదశలో ఉన్న వరిపంట వర్షం దాటికి కంకులు రాలి నీటిలో మునిగి పోయాయి. పంటను కోసే పరిస్థితి లేకుండా పోయింది. వరిపొలాలను చూస్తే దుఖం ఆగడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. – సునారికాని శ్రీనివాస్, రైతు, ఏటూరునాగారం వందలాది ఎకరాల్లో నేలవాలిన వరిపైరు కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటకు దెబ్బ ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు -
కలెక్టర్ల సమావేశంలో రాహుల్శర్మ
భూపాలపల్లి: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమావేశంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.చెక్కు అందజేత భూపాలపల్లి అర్బన్ : రెండేళ్ల క్రితం మోరంచపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహాలక్ష్మి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుఫున మంజూరైన చెక్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం అందజేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో రూ.5లక్షల చెక్కును గడ్డం శ్రీనివాస్కు అందజేశారు. జార్జిరెడ్డి స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి కాటారం: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి విప్లవ స్ఫూర్తిని అందిపుచ్చుకొని యువత ఉద్యమాల్లోకి రావాలని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపుయాదవ్ అన్నారు. జార్జిరెడ్డి వర్ధంతిని కాటారం మండలకేంద్రంలో సోమవారం యూవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కల బాపు మాట్లాడుతూ దేశంలో యువత మారక ద్రవ్యాలకు అలవాటుపడి తమ విలువైన జీవితాలను కోల్పోతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగి యువత మత, ప్రాంతీయ పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులై నిజమైన విప్లవ ప్రజా పోరాటాలను నీరుగార్చుతున్నారని పేర్కొన్నారు. జార్జిరెడ్డి చూపిన విప్లవ ఆలోచనతో భగత్సింగ్, చేగువేరా, అల్లూరి సీతారామరాజు, కొమురంభీం, గోపాల్రెడ్డి విప్లవ స్ఫూర్తితో భారత ఐక్య యువజన సమాఖ్య, యూవైఎఫ్ఐ యువతి యువకులను సంఘటితం చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంతెన రాజశేఖర్, కాల్వల సమ్మయ్య, కళ్లెం రమేశ్, రవీందర్ పాల్గొన్నారు. రామప్పలో మెక్సికో దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ డేనియల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరుడిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్లు తాడబోయిన వెంకటేశ్, సాయినాథ్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని కొనియాడారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వాజేడు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో సోమవారం వాల్పోస్టర్లు వెలిశాయి. మండల పరిధిలోని కొప్పునూరు కాలనీ, ఘణపురం గ్రామాల మధ్యన ఉన్న వంతెనకు అంటించారు. ‘మమ్మల్ని బతక నివ్వండి, నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చల విడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఇదేనా మీ సిద్ధాంతం’ అంటూ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పలు రకాల హెచ్చరికలతో వాల్పోస్టర్లలో రాసి ఉంది. -
యువత మత్తుకు బానిస కావొద్దు
● ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం: డ్రగ్స్ని తరిమికొడదామని.. యువత మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని రామన్నగూడెంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్, ఫొక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ పొందిన నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందాలు గ్రామంలో సోమవారం తనిఖీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్కు బానిసలుగా మారితే విలువైన జీవితాలు ఆగం అవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోకి అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడుమార్గంలో పయణించకుండా మంచి మార్గంవైపు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం
రమ్మీ యాప్ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – డాక్టర్ బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్లైన్ గేమ్స్పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. – కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ● -
రక్కసి
‘రమ్మీ’ గేమింగ్ ముసుగులో ఆన్లైన్ జూదం సాక్షిప్రతినిధి, వరంగల్: ● ‘నా ఫ్రెండ్ రూ.500 పెట్టి రూ.1,500 గెలిచాడు. నేనూ ట్రై చేశా. 5 రోజుల్లో రూ.8,000 పోయాయి. చివరికి సెల్ఫోన్ అమ్మేశా.’ – ఇంజనీరింగ్ విద్యార్థి, వరంగల్ ● ‘నాకు డబ్బు రావడం ప్రారంభమైన తర్వాత ఆడి రెఫరల్ గ్రూపులు క్రియేట్ చేశా. నా అకౌంట్లో డబ్బులు జమవుతాయని మెసేజ్ వచ్చింది. ఆఖరికి నా ఖాతా ఫ్రీజ్ అయ్యింది.’ – డిగ్రీ విద్యార్థి, నర్సంపేట .. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రమ్మీ గేమింగ్ యాప్ల సంస్కృతి పెరుగుతోంది. రమ్మీ యాప్లు యువత జీవితాలపై బలమైన దాడి చేస్తున్నాయి. ‘గేమింగ్’ ముసుగులో జూదపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుని అప్పులు మూటగట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాప్ల వ్యాప్తి.. ఉమ్మడి వరంగల్లో 2022 తర్వాత రమ్మీ యాప్ విష సంస్కృతి విచ్చలవిడి అయ్యింది. ప్రధానంగా నగరంలోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలతోపాటు మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట తదితర పట్టణాల్లో ఈయాప్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ‘రమ్మీ కల్చర్’, ‘ఎ 23 రమ్మీ’, వెల్త్ రమ్మీ’, ‘జంగిల్ రమ్మీ’.. వంటి యాప్లు టాప్–డౌన్లోడెడ్గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా ‘100 శాతం గెలుపు ట్రిక్స్’, ‘మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్’.. తదితర పేర్లతో ఇన్ఫ్లుయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు. అందరూ టార్గెటే.. యూత్ నుంచి గృహిణుల దాకా.. అన్ని వర్గాలను ఈ రమ్మీ యాప్లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేక మంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రైసిటీ పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రైవేట్ టీచర్లు, క్లర్కులు, ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వర్గాలు, గృహిణులు ‘టైమ్ పాస్’గా మొదలుపెట్టి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో భారీగా డబ్బులు కోల్పోయిన సుమారు 20 మందికి పైగా వివిధ ప్రాంతాల్లో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. గేమ్ మాఫియా.. ‘బ్రోకర్’ వ్యవస్థ ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో రమ్మీ గేమ్ యాప్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నదని, వాటి పట్ల ఆకర్షితులు కావొద్దని సైబర్ క్రైమ్ పోలీస్లు ఇప్పటికి చాలా సార్లు హెచ్చరించారు. ప్రధానంగా వరంగల్ ట్రై సిటీలో మూడు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా రెండు లక్షల రూపాయల వరకు రోజువారీ బెట్టింగ్ జరుగుతున్నట్లు సైబర్ పోలీసుల అనుమానం. ఈగ్రూపులకి ‘మాస్టర్ బ్రోకర్లు’ నిధులు సమకూరుస్తూ యువతకు ‘విజయం’ చూపించి మాయ చేస్తున్నట్లు సమాచారం. హెల్ప్ డెస్క్ ప్రారంభించినప్పటికీ.. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ 2024లో ‘గేమింగ్ యాప్ మోసాల’పై స్పెషల్ హెల్ప్లైన్ ప్రారంభించింది. డిజిటల్ డిటాక్స్ క్యాంపెయిన్ ద్వారా పదుల సంఖ్యలో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే యాప్లు విదేశీ సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా మారుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తద్వారా వారించే వారికన్నా గేమ్ యాప్లు వినియోగించే వారే ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. కేరాఫ్గా మారిన ఉమ్మడి వరంగల్ ‘టైమ్ పాస్’తో మొదలు.. అప్పుల ఊభిలోకి ప్రాణాలు తీసుకుంటున్న యువత అవగాహన కల్పిస్తున్నా మారని తీరు -
శాంతి చర్చలు జరపాలి
భూపాలపల్లి రూరల్: మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య విజ్ఞపి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు వేదిక, జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, దుర్గా ప్రసాద్, కర్ణాటకపు సమ్మయ్య, మోటపలుకుల రమేష్, మారెపల్లి మల్లేష్, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కలలు సాకారం భూపాలపల్లి రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలను, కలలను బీజేపీ ప్రభుత్వం సాకారం చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరామారావు అన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు ఆధ్వర్యంలో బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విజయరామారావు మాట్లాడుతూ అంబేడ్కర్ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపన్న, కన్నం యుగదీశ్వర్, లింగంపల్లి ప్రసాదరావు, బట్టు రవి, దుప్పటి భద్రయ్య, సయ్యద్ గాలిప్, దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి, రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. శ్రీపాదరావు గొప్ప నాయకుడు భూపాలపల్లి రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీపాదరావు రాష్ట్రానికే గాక మంథిని నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు అని టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు అన్నారు. శ్రీపాదరావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి పేరును నిలబెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముంజాల రవీందర్, మధుకర్రెడ్డి, తిరుపతి గౌడ్, ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు 14వ తేదీ చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. 14వ తేదీ సెలవు అయినప్పటికీ రాజీవ్ యువ వికాసం పథకానికి చివరి తేదీ కావడంతో దరఖాస్తులు చేయడానికి పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తుల కొరత రాకుండా తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆఫ్లైన్లో వచ్చే దరఖాస్తుదారులకు దరఖాస్తు ముట్టినట్లు రశీదులు ఇవ్వాలని, వచ్చిన ప్రతీ దరఖాస్తు ఆన్లైన్ చేయడంతో పాటు జాగ్రత్తగా భద్రపరచాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
కాటారం: ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం పర్యటించిన మంత్రి శ్రీధర్బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో నిర్మించిన కాటారం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం కాటారం సబ్ డివిజన్లోని పలు మండలాలకు సంబంధించిన వైకుంఠరథాలను మంత్రి ప్రారంభించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.3,12,64,235 చెక్కును సభ్యులకు అందజేశారు. 243 మంది లబ్ధిదారులకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ధన్వాడలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన అదనపు ఉప విద్యుత్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధన్వాడ ప్రభుత్వ పాఠశాలకు వంద డెస్క్ బెంచీలను మంత్రి అందజేశారు. సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం.. నిరుపేద ప్రజలు సైతం సన్న బియ్యం అన్నం తినాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్న బియ్యం పంపిణీ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఆదివారం మండల పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్బాబు మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన వాంకుతోడు సమ్మక్క అనే లబ్ధిదారురాలు ఇంట్లో కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి, అధికారులు తండావాసులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవారు సంతోషంగా ఉండాలనే భావనతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు వెంట డీపీఓ నారాయణ, డీఆర్డీఓ నరేశ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్రెడ్డి, చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తదితరులు ఉన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు -
మెట్లమార్గంలో రక్షణేది!
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం రాజగోపురం ఎదుట ఎండ తీవ్రతతో గ్రైనేట్ వేడెక్కి కాళ్లకు రక్షణ లేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తీవ్రతతో ఆదివారం మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చి భక్తులు ఆలయంలో దర్శనం చేసుకొని తిరిగి బయటకు వచ్చేటప్పుడు కాళ్లు కాలిపోతుంటే భక్తులు పరుగులు తీశారు. దేవస్థానం అధికారులు కనీసం మ్యాట్లు, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో మెట్ల మార్గం గుండా విద్యుత్ వెలుగులు లేకపోవడంతో భక్తులు మెట్లు ఎక్కుతూ జారిపడుతున్నారు. రాజగోపురం చుట్టుపక్కల కూడా లైట్లు ఉన్నా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ వెలుగులు, ఎండ తీవ్రత తట్టుకుని నడిచి వెళ్లేలా మ్యాట్లు ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించాలని కోరుతున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కృషి
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావురేగొండ: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, జిల్లా, మండల నాయకులు సంపత్రావు, మేకల భిక్షపతి, పట్టెం శంకర్, బొజ్ఙం రవి, గండ్ర రమణారెడ్డి, షాబీర్, భలేరావు మనోహర్రావు, వీరబ్రహ్మం, కోగిల క్రాంతి, ఎడ్ల మల్లారెడ్డి, ముద్దమల్ల రవి పాల్గొన్నారు. పరామర్శ.. రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో బండి అశోక్కు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు ఆదివారం దగ్ధమైంది. దీంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించి, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్రావు, నడిపల్లి శ్రీనివాసరావు, శ్రీధర్, రజినీకాంత్ ఉన్నారు. -
ఆరోగ్యశాఖలో అలసత్వం వహించొద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వైద్యారోగ్యశాఖ కార్యక్రమాల్లో అలసత్వం వహించొద్దని రాష్ట్ర వైద్యారోగశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ సేవలు, వ్యాధినిరోధక టీకాలు, ఎన్సీడీ, లెప్రసీ, టీబీ ఇతర కార్యక్రమాల నిర్వహణలో అలసత్యం వహించొద్దని సూచించారు. ప్రాణహిత పుష్కరాల మెడికల్ క్యాంపు యాక్షన్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీప్యూటీ డీఎంహెచ్ఓ, పోగ్రాం అధికారులు కొమురయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ సందీప్, సపోర్టింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. మెరుగైన సేవలందించాలి రేగొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించాలని, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు జరిగే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. కుష్టు, టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికి త్స అందించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను శిశువులందరికీ సకాలంలో వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ, ల్యాబ్, డెలివరీ, ఓపీ రిజిష్టర్ను తనిఖీ చేశారు. డీఎంహెచ్ఓ మధుసూదన్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీదేవి, డాక్టర్ హిమబిందు, హెల్త్ సూపర్వైజర్లు సుధ, వినోద లక్ష్మీ, రాజేందర్, రాము, ఫార్మసిస్ట్ సులక్షణ, సిబ్బంది పాల్గొన్నారు.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ -
దళితబంధు నిధులు విడుదల చేయాలి
● రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు కాటారం: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళతబంధు పథకంలో భాగంగా ఎంపికై న లబ్ధిదారులకు మంజూరైన నిధులు విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం కాటారంలో దళితబంధు ధర్మయుద్ధం మహాధర్నా నిర్వహించా రు. చింతకాని క్రాస్ నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీ చేపట్టిన లబ్ధిదారులు ప్రధానకూడలి లో జా తీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టా రు. ఈ సందర్భంగా సాధన సమితి జిల్లా అధ్యక్షు డు నమూండ్ల సంపత్ మహారాజ్ మాట్లాడుతూ దళితబంధు లేదా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేర కు అంబేడ్కర్ అభయహస్తం అమలు చేయాలన్నా రు. పెండింగ్లో ఉన్న నిధులను ఎంపికై న లబ్ధిదా రుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. చదువుకున్న దళిత మహిళలకు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని, దివ్యాంగులకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. దళితబంధు నిధుల విడుదలకు కలెక్టర్ హామీ ఇవ్వాలని భీష్మించారు. సుమా రు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగడంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సైలు నరేశ్, మహేందర్.. ఆందోళన విరమింపజేశారు. ఆందోళనలో జక్కయ్య, వెంకయ్య, మధుకర్, శ్రీనివాస్, చందు, నగేశ్, రాజు, రామన్న, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువు
కాటారం/కాళేశ్వరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంపై చిత్తశుద్ధి లేదని, రాజ్యాంగాన్ని ప్ర జల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఏ మాత్రం చేయ డం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బహుజన సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రా జ్యాంగ స్థూపాన్ని మహదేవపూర్ మండలం సూరా రంలో మాజీ సర్పంచ్ నాగుల సుజాత–లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ శ్రీహర్షిణిరాకేశ్తో కలిసి ఈ శ్వర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఈశ్వర్ మాట్లాడుతూ.. బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం, కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రజల్లో చైతన్యం, హక్కులపై అవగాహన లేకుంటే ధైర్యంగా ముందుకెళ్లలేరని తెలిపారు. ఇన్నేళ్లుగా పరిపాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు తెలిస్తే తమని ప్రశ్నిస్తారనే కుట్ర పాలకుల్లో దాగిఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్దాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అంబేడ్కర్ను ఒక సామాజికవర్గానికే అంటగట్టడం సమంజసం కాదన్నారు. రా జ్యాంగంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా రచించారని, కేవలం ఎస్సీలకు మాత్రమే మేలు చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రా ష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. పుట్ట మధు మాట్లాడుతూ మంథనిలో 40 ఏళ్లుగా పాలించిన ఒకే కుటుంబం ప్రజ లకు ఏం చేసిందో చెప్పాలన్నారు. సొంత ఖర్చులతో ప్రధాన కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డిని అభినందించారు. రాకేశ్ , శ్రీనివాస్, కిరణ్, తిరుపతి, శ్రావణ్, గీతాబాయి, శ్రీలక్ష్మిచౌదరి, శ్రీనివాసరావు, గీత, లక్ష్మణ్ పాల్గొన్నారు.మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ -
ఆరోగ్యం పదిలమేనా..?
చిన్నారుల హెల్త్పై ప్రత్యేక దృష్టికాటారం: అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఆరేళ్లలోపు చిన్నారుల్లో కంటి, మానసిక సమస్యలను ముందస్తుగా గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వరల్డ్ హెల్త్ డే సందర్భంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి వైద్య సిబ్బంది శ్రీకారం చుట్టారు. మూడు నెలల కాలంలో జిల్లాలోని అంగన్వాడీల్లోని మొత్తం చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 10,364 మంది చిన్నారులు జిల్లాలోని 643 అంగన్వాడీ కేంద్రాల్లో 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గల 10,364 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కంటి, మానసిక సమస్యల గుర్తింపు పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు రెండు విడతల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో విడతగా అంగన్వాడీ చిన్నారులకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులే ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. సరైన పర్యావేక్షణ లేకపోవడంతో వీరిలో కంటి, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వీటిని చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించాలని ప్రభుత్వం ఓ యోచనకు వచ్చింది. ప్రతీ చిన్నారికి వైద్య పరీక్షలు.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఆరేళ్ల లోపు చిన్నారులు ప్రతీ ఒక్కరి కంటి, మానసిక వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. నాలుగు బృందాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది రోజుకు 80 నుంచి 100 మంది చిన్నారులను పరీక్షిస్తున్నారు. సమస్య గుర్తించిన వారికి అవసరమైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటాం. ఈ వైద్య పరీక్షలు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. – డాక్టర్ ప్రమోద్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారిజిల్లా వివరాలు.. అంగన్వాడీల్లో ఆరోగ్య పరీక్షలు జిల్లాలో నాలుగు బృందాల ద్వారా వైద్య పరీక్షలు మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికరోజుకు 80 నుంచి 100 మందికి.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల్లో అనారోగ్య, పౌష్టికాహార సమస్యలను నివారించేందుకు బాలామృతం, కోడిగుడ్లు లాంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అయినప్పటికీ చిన్నారుల్లో నేత్ర సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో వైద్యపరీక్షలు కీలకం అని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు వైద్య బృందాలు ప్రతి రోజు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి 80 నుండి 100 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించి వారి మానసిక, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వైద్యబృందం గుర్తించిన అంశాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,500 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. -
గోదావరికి పౌర్ణమి హారతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరికి పౌర్ణమి సందర్భంగా హారతి కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు, సిబ్బంది మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కాలినడకన గోదావరికి తరలివచ్చారు. అక్కడ గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి పాలు, పసుపు, కుంకుమ, పూలతోపాటు సారె సమర్పించారు. అనంతరం అర్చకులు మూడు హారతులతో హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ డి.శ్రీనివాస్, స్వచ్ఛంద సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: రేపు(సోమవారం) జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే నిర్వహించన్ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని అధికారులు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల నాయకులు, కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని అధికారి సునీత పిలుపునిచ్చారు. గుండెపోటుతో ఎంపీడీఓ మృతి మొగుళ్లపల్లి: స్థానికంగా ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ మహబూబ్ హుస్సేన్(61) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వస్థలం హనుమకొండ జిల్లా పరకాల అయినప్పటికీ కుటుంబ అవసరాల రీత్యా హనుమకొండ పట్టణంలో నివాసముంటూ విధులకు హాజరయ్యేవారు. విధి నిర్వహణలో బాధ్యతయుతంగా ఉంటూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారని పేరుంది. వచ్చే నెలలో పదవి విరమణ చేయనుండగా.. ఇంతలోనే గుండెపోటుతో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఆయన మృతిపై కార్యాలయ సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. టర్పెంట్ ఆయిల్ తాగి బాలుడి మృతి కాటారం: టర్పెంట్ ఆయిల్ తాగి 21 నెలల బాలుడు మృతి చెందిన ఘటన కాటారం మండలం ధన్వాడలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మాజీ ఎంపీటీసీ బోడ మమత నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు బోడ సుహాన్ (21 నెలలు) తల్లి మమతతోపాటు ఇంటి పక్కన వారింటికి వెళ్లాడు. మమత గుమ్మాలకు ముగ్గులు వేసే పనిలో నిమగ్నమవగా సుహాన్ ఆడుకుంటూ పెయింట్లో కలిపే టర్పెంట్ ఆయిల్ తాగాడు. కొంత సమయానికి సుహాన్ కిందపడిపోగా గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పేకాట స్థావరాలపై దాడి మల్హర్: మండలంలోని నాచారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈమేరకు 17 మంది వద్ద నుంచి రూ.1.50 లక్షలు, 5 బైకులు, 17 సెల్ ఫోన్లు, 52 ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ శనివారం తెలిపారు. 17 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘కక్ష సాధింపు కోసమే వక్ఫ్ బిల్లు’ భూపాలపల్లి అర్బన్: ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్కుమార్ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శని వారం సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాజ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడు తూ.. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు కోసమే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టా న్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ చట్టాన్ని చా లా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతి రేకిస్తున్నప్పటికీ టీడీపీ, జేడీయూ పార్టీల సహకారంతో ఓటింగ్ ద్వారా చట్టాన్ని ఆమోదం చేసుకున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డుకు ఇతర మతస్తులు సాయం చేయకుండా ఈ చట్టం తీసుకురావడం సరికాదన్నారు. హిందువులు, ఇతర మతస్తులు.. బోర్డుకు ఆర్ధికంగా సహా యం చేయాలంటే వారు కూడా మతం మారా లని చట్టం తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, యాకూబ్ పాషా, కృష్ణ, శేఖర్, రజియా, శ్రీలత, స్వరూప, తదితరులు పాల్గొన్నారు. -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీత క్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాల ని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలుపెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల ను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మహబూ బాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనంబాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహి ళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. -
ఉచిత విద్య అవకాశాన్ని వినియోగించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పిపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్లో అందిస్తున్న ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను జిల్లాలోని విద్యార్థులు వినియోగించుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే లక్ష్యంతో ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4, 5 ,6 తరగతి విద్యార్థులు అర్హత పరీక్ష రాసి 5, 6, 7 తరగతుల్లో ప్రవేశం పొందాలని సూచించారు. 80 మార్కులతో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలుగు, గణితం, ఆంగ్లం పరిసరాల విజ్ఞానం నుంచి ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత పొందిన విద్యార్థులకు వారు ప్రవేశం పొందిన తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతోపాటు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. గ్రామీణ నిరుపేదలు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు అర్హులని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వెబ్సైట్ http:// forms. gle/ uhxD4 Dj8 oyxMUdPM7లో గూగుల్ ఫామ్ నింపి పేరు నమోదు చేసుకోవాలని, వివరాలకు 99124 62762, 95534 05934, 99491 74837 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు సల్ల సంపత్, సుకుమార్, సరిత పాల్గొన్నారు. -
భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలి
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియలో వేగంపెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ భూ సేకరణ విభాగం అధికారులకు సూచించారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లి, గూడూరు గ్రామాల్లో కొనసాగుతున్న భూ సేకరణ సర్వేను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భూ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. పలువురు నిర్వాసిత రైతులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. భూ సేకరణకు అధికారులకు రైతులు సహకరిస్తే కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని.. తద్వారా సాగు నీరందుతుందని తెలిపారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ సేకరణ సర్వేలో అడ్డంకులు అధిగమించి సేకరణ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణలో పాటించాల్సిన నిబంధనలు, విధానం గురించి భూ సేకరణ అధికారులకు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ వెంకన్న, భూ సేకరణ అధికారులు, ఇరిగేషన్ ఏఈఈలు, సిబ్బంది ఉన్నారు.అదనపు కలెక్టర్ అశోక్కుమార్ -
మీసేవలో సర్వర్ డౌన్
వెంకటాపురం (కె) : రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు రాగా మీసేవ కేంద్రంలో శుక్రవారం సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీంతో దరఖాస్తు దారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సోమవారం ఒక్కరోజే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో దరఖాస్తులు చేస్తుడడంతో కేంద్రం నిర్వాహకులు రాత్రి 9గంటల వరకు సర్వర్ పని చేస్తే ఆన్లైన్లో నమోదు చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక పూర్తి చేసిన అన్ని పత్రాలను ఇచ్చి వెళ్లాలని మీసేవ సిబ్బంది తెలుపుతున్నారు. దరఖాస్తుకు రెండ్రోజుల గడువు ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రంగంలోకి దిగిన దళారులు
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లోuగతంలో వందలాది మంది బాధితులు జిల్లాకేంద్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తామని, డబుల్బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని ప్రత్యక్ష్యంగా గత ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చిన వారిలో కొంత మందికి లబ్ధిచెందగా ఇంకా కొంత మంది బాధితులు సంబంధిత వ్యక్తుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తించేలా చేస్తామని దళారులు మోసం చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులపై గతంలో పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిన ఘటనలు ఉన్నాయి. ● రూ.లక్షల్లో వసూళ్లకు ప్రణాళిక.. ● గతంతోనూ మోసపోయిన బాధితులు2023 సంవత్సరంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగాలు పెట్టిస్తామని పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్పీ స్పందించి కేసు నమోదు చేయించారు. 24మంది నుంచి సుమారు రూ.50లక్షలకుపైగా వసూలు చేశారు. 2024 జూలై 18న ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు, పట్టణానికి ఇద్దరు మధ్యవర్తులను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. ఇదే మాదిరిగా జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో బాధితులు ఫిర్యాదులు చేశారు. భూపాలపల్లి అర్బన్: అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. ప్రభుత్వం కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టిందంటే చాలు.. కొందరి పంట పండినట్లే. దరఖాస్తుల స్వీకరణ మొదలునుంచే ఆశావహులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు. అమాయక ప్రజలు వారి మాటలకు ఆకర్షితులై ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందాలని లక్షలు సమర్పించి మోసపోతున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రులు దళారులను ఆశ్రయించవద్దని సూచించినా.. మోసపోతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్బెడ్రూం ఇళ్లు, దళితబందు, కార్పొరేషన్ లోన్లు, ఇతరత్రా పథకాల కోసం చోటా, మోటా, బడా నాయకులు లబ్ధిదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసిన తర్వాత పథకాల లబ్ధి దరిచేరకపోవడంతో బాధితులు గొడవలకు దిగారు. పరువుపోవడంతో పాటు రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో కొంతమంది వెంటనే బాధితులకు వారినుంచి వసూలు చేసిన డబ్బులను గుట్టుచప్పుడు కాకుండా ముట్టజెప్పిన ఘటనలు జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంటింటి సర్వే ఇప్పటికే పూర్తయింది. అధికారులు అర్హుల ఎంపికలో తలమునకలై ఉండగా, దళారులు వసూళ్లకు తెరలేపారు. ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ లబ్ధిపొందాలనే వారిని గుర్తించి వారి ఆశలను వీరంతా సొమ్ము చేసుకుంటున్నారు. ఏ పథకం దరిచేరాలన్నా రేషన్కార్డు ప్రామాణికంగా ఉండటంతో జిల్లాలో రేషన్కార్డుల కోసం చాలామంది అర్హులు, అనర్హులు(ఉద్యోగస్తులు) దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ఆర్థికంగా ఉన్నవారికి సైతం రేషన్కార్డులు ఇప్పిస్తామని రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారిస్తే అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతం నుంచీ ఇదే పరిస్థితి.. న్యూస్రీల్ -
నల్లబ్యాడ్జీలతో నిరసన
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్కాస్ట్కు 500మీటర్ల పరిధిలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడిచర్ల, కాపురం జెన్కో భూ నిర్వాసితుల సాధన కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి మాట్లాడుతూ.. డేంజర్ జోన్ భూముల సేకరణపై స్పష్టత లేకుండానే ఓపెన్కాస్ట్ ఏఎమ్మాఆర్ కంపెనీ అధికారులు 100 మీటర్ల పరిధిలో మట్టిని డంపింగ్ చేయడానికి ప్రయత్నించడంతో అడ్డుకొని వెనక్కి పంపించినట్లు తెలిపారు. నిరసనగా తాడిచర్ల చింతలకుంట వద్ద ఉపాధి పనులు చేస్తున్న డేంజర్ జోన్కు సంబంధించిన ఉపాధి కూలీలతో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. నల్లబ్యాడ్జీలు ధరించి పనిచేయడం ఐక్యతను నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం స్పందించి డేంజర్ జోన్ ఇళ్లను సేకరించి, నష్టపరిహారం, పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసచారి
భూపాలపల్లి అర్బన్: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వలబోజు శ్రీనివాసచారి ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 71 ఓట్లు ఉండగా 70మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ నిర్వహించి 6గంటల వరకు కౌంటింగ్ నిర్వహించారు. కూనురు సురేష్కుమార్పై వలబోజు శ్రీనివాసచారి 20ఓట్ల మోజారిటీతో అధ్యక్షుడిగా గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఆనందరావుపై విలా శ్రావణ్రావు 17ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా సంగెం రవీందర్, కోశాధికారిగా రాజ్కుమార్, ఈసీ మెంబర్లుగా రమేష్నాయక్, రాకేష్, ప్రశాంత్, రవీందర్, మహిళా సభ్యురాలిగా సుధారాణి ఎన్నికయ్యారు. కోర్టు ఏర్పాటుకు కృషి చేశా.. జిల్లా కోర్టు, సివిల్ కోర్టుల ఏర్పాటుకు మొదటి నుంచి కృషి చేశాను. అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసి కోర్టు ఏర్పాటు చేయాలని కోరాను. కోర్టు ఏర్పాటుకు ముందు పరకాల, హనుమకొండ, ములుగు, మంథని కోర్టులకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాటి సేవలను గుర్తించి న్యాయవాదులు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. న్యాయవాదులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – శ్రీనివాసచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డివిజినల్ అధికారి సత్తయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్డ్రిల్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మంటలకు మరింత తోడునందించే పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని దూరంగా పడేయాలని అన్నారు. విద్యుత్ సరఫరా సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే కర్ర సాయంతో తొలగించాలన్నారు. కరెంట్ సరఫరా ఉన్న వస్తువులపై వెంటనే నీరు పోయొద్దని తెలిపారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే 101, 87126 85772 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం మండలంలోని జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సత్తయ్య వివరించారు.ఈ కార్యక్రమంలో లీడ్ ఫైరింగ్ ఆస్పత్రి రవికుమార్ పాల్గొన్నారు.డివిజినల్ అధికారి సత్తయ్య -
ఓపెన్కాస్టు తవ్వకాలను అడ్డుకుంటాం
భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి గ్రామంలో అధికారులు కూల్చేసిన రేకులషెడ్లు, పెంకుటిళ్లకు నష్టపరిహారం చెల్లించకుంటే కేటీకే–2 ఓపెన్ కాస్ట్ గని తవ్వకాలను అడ్డుకుంటామని బాధితులు తెలిపారు. కూల్చేసిన ఇళ్ల వద్ద శుక్రవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితులకు నష్టపరిహారం సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేయటంలో తీవ్రంగా నష్టపోయినట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు చల్లూరి సమ్మయ్య, సెగ్గం సిద్ధూ ఆరోపించారు. 2008లో ఓసీపీ–2 కోసం గడ్డిగానిపల్లి గ్రామంలో భూములను పూర్తిగా సింగరేణి స్వాధీనం చేసుకుని, గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయన్నారు. ఇంతవరకు వేరే ఏరియాకు తరలించకపోవడం వల్ల ఓపెన్కాస్ట్ నుంచి ఏర్పడుతున్న దుమ్ము ధూళితో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు కొందరు వారి పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే రాత్రి పూట సింగరేణి, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వచ్చి కూల్చేయడం సరైంది కాదన్నారు. ఈ మేరకు అడ్డుకున్న కొంతమంది మహిళలను అధికారులు బెదిరించడంతో పాటు సెల్ఫోన్లు బలవంతంగా తీసుకుని, మొత్తం 65 ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా కూల్చేసిన ఇళ్లకు పరిహారం చెల్లించకుంటే ఓసీపీ–2 పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రత్నాకర్, సదానందం, కుమార్, ప్రభుదాస్, మధుకర్, దేవేందర్, సంతోష్, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
పరీక్షల పేరుతో వసూళ్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్త పరీక్షల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను డాక్టర్లు పరీక్షించి వివిధ రకాల రక్త పరీక్షలు రాస్తున్నారు. అందులో భాగంగా కొంతమందికి ‘ఎలక్ట్రోలైట్స్’ రక్త పరీక్షను కూడా రాస్తున్నారు. రక్త పరీక్షకు సంబంధించి పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బయట చేసుకోవాల్సి ఉంటుందని ల్యాబ్ టెక్నీషియన్లు రోగులకు చెబుతున్నారు. ఈ పరీక్ష ప్రైవేట్ ల్యాబ్లో చేయాలంటే రూ.800 ఉంటుందని వసూళ్లు చేస్తున్నట్లు పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లో రూ.300నుంచి రూ.500వరకు ఖర్చు అవుతుండగా అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయకుండానే హైదరాబాద్, వరంగల్కు చెందిన ల్యాబ్ ప్యాడ్స్పై సొంతంగానే ప్రింట్ తీసి పేషెంట్లకు అందజేస్తూ మోసం చేస్తున్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు నర్సింగ్ అధికారులు ఈ దందాకు తెరలేపినట్లు ఆస్పత్రిలో చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. ఆస్పత్రిలో టెస్టు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్కు పంపకతప్పడం లేదు. త్వరలో నేరుగా ప్రైవేట్ ల్యాబ్ వారితో మాట్లాడి వారి వచ్చి నమూనాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఇందుకు అయ్యే ఖర్చు ఆస్పత్రి నుంచి చెల్లిస్తాం. అక్రమ దందాను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీనిపై విచారణ చేస్తున్నాం. – డాక్టర్ నవీన్కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పూర్తిస్థాయి మందులు నిల్వ ఉండాలి
ములుగు/ములుగు రూరల్ : ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందుల నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు పేర్కొన్నారు. శుక్రవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం, ములుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ఓఆర్ఎస్, జింక్ కార్నర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మందుల నిల్వల రిపోర్టులను రోజు వారిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రాల మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ జితేందర్, నవ్య, సూపర్వైజర్ దేవమ్మ, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, నర్సమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు గోదావరికి హారతి కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరికి శనివారం(నేడు) సాయంత్రం 5.30గంటలకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు హారతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. -
వాతావరణం
కవి కష్టజీవి పక్షానే ఉండాలి కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్ అన్నారు. జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ, వేడిగాలులు ఉంటాయి. రాత్రి చలిగా ఉంటుంది.– 8లోuత్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. స్లాట్ బుకింగ్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన వరంగల్ రూరల్, వరంగల్ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్ బుకింగ్పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు.