ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ: ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవతల దీవెనలు ప్రజలపైన నిండుగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుదర్శన్‌, ఉపసర్పంచ్‌ ఆకుతోట తిరుపతి, నాయకులు పన్నాటి శ్రీనివాస్‌, రొంటాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement