సౌర విద్యుత్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

భూపాలపల్లి రూరల్‌: ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్‌ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా భూపాలపల్లి మండలం కొంపల్లి రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు వ్యవసాయ వినియోగం కోసం సౌర విద్యుత్‌పై దృశ్య–శ్రవణ ప్రదర్శన, వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్‌ కేంద్రాలు వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు, సౌర ఆధారిత సాగునీటి పద్ధతుల ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సతీష్‌, కొంపల్లి సర్పంచ్‌ సడల శ్రీకాంత్‌, కొంపల్లి తండా సర్పంచ్‌ నిర్మల, గూడాడ్‌పల్లి సర్పంచ్‌ దారురి శారద, భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుడు రమేష్‌, విద్యుత్‌ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement