మల్హర్: ప్రజలకు అన్నికాలాల్లో ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మండలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పని చేసి వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.
మండలంలో 8,495 జాబ్కార్డులు..
మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామాల్లో 8,495 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటీలో కూలీల సంఖ్య 18,873 ఉండగా ఉన్నారు. మూడు రోజులుగా1600 పై చిలుకు కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకే కూలీలు పనులుకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. కొద్దిరోజులగా ఉపాధి హామీ పనులకు కూలీలు సంఖ్య పెంచడానికి ఉపాధిహామీ ఏపీఓ హరీష్, టీఏలు నిత్యం గ్రామాల్లోకి వెళ్లి జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనులకు రావాలని అవగాహన కల్పించారు. దీంతో రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతుంది.
పనికి వెళ్తున్న 1634 మంది కూలీలు
అవగాహన కల్పిస్తున్న అధికారులు


