ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌ రియాక్షన్‌ | Minister Uttam Kumar Reddy Reaction To The Ndsa Report | Sakshi
Sakshi News home page

ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌ రియాక్షన్‌

Apr 25 2025 3:15 PM | Updated on Apr 25 2025 3:18 PM

Minister Uttam Kumar Reddy Reaction To The Ndsa Report

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌డీఎస్ఏ(NDSA) రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్‌ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్‌ ఎందుకూ పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌ తేల్చిందని.. వచ్చే కేబినెట్‌లో ఎన్‌డీఎస్‌ రిపోర్ట్‌పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్‌ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్‌ఎస్‌ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

 

Advertisement
 
Advertisement
Advertisement