reaction
-
కొమ్మినేని అరెస్ట్ పై వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ.. బిగ్ బాస్ దివి రియాక్షన్
-
కొమ్మినేని అరెస్ట్ ను ఖండిస్తున్నాం: అనంత వెంకట్రామిరెడ్డి
-
కొమ్మినేనిపై SC, ST కేసు ఎలా పెడతారు? అక్రమ అరెస్ట్ పై సీనియర్ జర్నలిస్టుల ప్రశ్న
-
కొమ్మినేని అక్రమ అరెస్ట్ పై కన్నబాబు రియాక్షన్
-
VVR కృష్ణం రాజు వ్యాఖ్యలపై పోతిన మహేష్ రియాక్షన్
-
బాబు ఓవర్ కాన్ఫిడెన్స్.. KK సర్వే షాక్
-
గేట్లు బద్దలు కొట్టారు.. తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: తొక్కిలాసట ఘటన దురదృష్టకరమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారని.. 33 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. స్టేడియం దగ్గరకు లక్ష మందికి పైగా అభిమానులు వచ్చారు. ఇంత భారీగా జనం వస్తారని ఊహించలేదన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారికి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. స్టేడియం కెపాసిటి 35 వేల మంది మాత్రమే. కానీ మూడు లక్షలకు పైగా అభిమానులు తరలివచ్చారు’’ అని సిద్ధరామయ్య అన్నారు.మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని సిద్ధరామయ్య ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వాన్నే నిందిస్తూ ఉంటారు. ఈ విషాద ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోంది. అభిమానులు గేట్లను బద్దలు కొట్టడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగింది’’ అని సిద్ధరామయ్య తెలిపారు.కాగా, ఈ దుర్ఘటనపై ఆయన ‘ఎక్స్’లో కూడా ట్వీట్ చేశారు. ఈ వార్త తనను షాక్కు గురిచేసిందన్నారు. ఐపీఎల్ కప్ గెలిచిన ఆనందం.. ఈ దుర్ఘటనతో చెదిరిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. చిన స్వామి స్టేడియానికి అంచనాలకు మించి అభిమానులు రావడం వల్లే ఇలా జరిగిందన్నారు.ಬೆಂಗಳೂರಿನ ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಆರ್ಸಿಬಿ ತಂಡದ ಗೆಲುವಿನ ಸಂಭ್ರಮಾಚರಣೆ ವೇಳೆ ನೂಕುನುಗ್ಗಲು ಉಂಟಾಗಿ ಹಲವರು ಪ್ರಾಣ ಕಳೆದುಕೊಂಡು, ಮತ್ತೆ ಕೆಲವರು ಗಂಭೀರ ಗಾಯಗೊಂಡ ಸುದ್ದಿ ಕೇಳಿ ತೀವ್ರ ಆಘಾತವಾಗಿದೆ. ಈ ದುರಂತದ ನೋವು ಗೆಲುವಿನ ಸಂಭ್ರಮವನ್ನೂ ಅಳಿಸಿಹಾಕಿದೆ. ಮೃತರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ, ಗಾಯಗೊಂಡು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ…— Siddaramaiah (@siddaramaiah) June 4, 2025ఈ తొక్కిసలాటపై కర్ణాటక ప్రజలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్షమాపణ చెప్పారు. స్టేడియం కేపాసిటికి మించి భారీగా అభిమానులు వచ్చారని దీంతో.. పోలీసులకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.. డీకే మీడియాకు తెలిపారు. -
టీడీపీ మహానాడుపై వైఎస్ఆర్ సీపీ నేతల రియాక్షన్
-
కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్
-
కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన కవిత
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది’’ అంటూ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025 హరీష్రావు రియాక్షన్.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్రావు స్పందిస్తూ.. ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమన్నారు. ‘‘కల్పిత కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గెలుచుకోవు. కేటీఆర్కు అండగా నిలబడతాం. కేటీఆర్ ఏసీబీ కేసులో సత్యం గెలుస్తుంది’’ అని హరీష్రావు అన్నారు. -
‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు. -
కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్
-
కేసీఆర్కు కవిత లేఖ.. ఆది శ్రీనివాస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ముసలం తారాస్థాయికి చేరుకుందని.. కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో లుకలుకలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందంటూ మేం చెబుతున్న మాటలను కవిత సమర్థించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ సిద్దమతున్నారని కవిత చెప్పకనే చెప్పింది. బీజేపీపైన పల్లెతు మాట మాట్లాడకుండా.. కేసీఆర్ వ్యవహరించిన తీరును కవిత కడిగి పారేసింది’’ అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.‘‘భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడటం వల్లనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు కవిత అంగీకరించారు. కవిత పచ్చి నిజాలు మాట్లాడారు.. ఆ మాటలనే మేం చాలా కాలంగా చెబుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నియంతృత్వ వైఖరిని కూడా కవిత నిలదీశారు. పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఒక్కరే ప్రసంగించడాన్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరిని ఆయన కూతురే తప్పుపడుతోంది. ఇక ప్రజలకు వాళ్లేమీ సమాధానం చెబుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని కవిత తేల్చి చెప్పింది’’ అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.‘‘పార్టీ నాయకులను కలవకుండా ఏకపక్ష పోకడలకు పోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. కవిత లేఖ పైన బీఆర్ఎస్ నాయకత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలి. మా సీఎం రేవంత్ రెడ్డి మీద ఒంటి కాలిపైన లేస్తున్న కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలి. కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. కల్వకుంట్ల కుటుంబంలో లుకలుకలు ఉన్నాయి. అలిగిన హరీష్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ బతిమాలుకున్నాడు...కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మాత్రమే పరిమితం అయిందని తేలింది. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడి గురించి కూడా కవిత ప్రశ్నిస్తే బాగుంటుంది. పంపకాలు, పదవుల్లో తేడా వచ్చి కుటుంబంలో లేఖలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ పని ఇక అయిపోయింది. కేటీఆర్.. ముందు నీ ఇళ్లు సరిదిద్దుకో. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోనే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. కేసీఆర్ తీరును ఆయన కూతురే తప్పుపడుతోంది.. ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలి.’’ అంటూ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. -
కూటమి నేతలు దిగజారిపోతున్నారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ పై సీరియస్
-
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై
-
మాధవి రెడ్డీ.. ఇది జగన్ అడ్డా.. నీ ఆటలు సాగవు
-
మా మదర్సాపై బాంబులు పడ్డాయి! పూంచ్ ముస్లింల ఆవేదన..
-
ఆపరేషన్ సిందూర్ పై జమ్మూ సీఎం రియాక్షన్
-
పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చెయ్యాలి
-
ఆపరేషన్ సిందూర్ పై భారతీయుల రియాక్షన్
-
ఆపరేషన్ సిందూర్.. మధుసూదన్ కుటుంబ సభ్యుల రియాక్షన్
-
ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్ వెడ్డింగ్గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్హ్యారీ, మేఘన్ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్కాస్ట్లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్కాస్ట్లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర? -
పాకిస్తాన్ కొడుకుల్ని.. రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ
-
ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఎస్ఏ(NDSA) రిపోర్ట్పై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించారు. రూ.లక్ష కోట్లతో నాసిరకం ప్రాజెక్ట్ నిర్మించారని.. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని.. వచ్చే కేబినెట్లో ఎన్డీఎస్ రిపోర్ట్పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని.. చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు..మీరే కట్టారు. అబద్ధాలతో బీఆర్ఎస్ బతకాలనుకుంటుంది. నిర్మాణం చేసిన వాళ్లు.. చేయించిన వాళ్లు రైతులకు ద్రోహం చేశారు. బీఆర్ఎస్ రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై అధ్యయనం చేస్తాం. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకునేందుకు కట్టారు’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
రివేంజ్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా..!
-
పహల్గామ్ ఘటనపై సజ్జల రామకృష్ణా రెడ్డి రియాక్షన్
-
జమ్మూ కాశ్మీర్ ఘటనపై జగన్ రియాక్షన్
-
సరైన అవగాహన లేకుండానే DSC నోటిఫికేషన్
-
భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. భూమన అభినయ్ రెడ్డి రియాక్షన్
-
గోరంట్ల మాధవ్ కేసులో పోలీసుల సస్పెండ్.. పేర్ని నాని రియాక్షన్
-
చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్ పై అంబటి రియాక్షన్
-
గోరంట్ల మాధవ్ ని ఎక్కడ దాచిపెట్టారు? అరెస్ట్ పై అంబటి రియాక్షన్
-
షర్మిల ఆరోపణలపై అంబటి రాంబాబు రియాక్షన్..
-
నాగాంజలి మృతి బాధాకరం: మార్గాని భరత్
-
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్పై 26శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్ను ప్రకటించారు. -
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రియాక్షన్..
-
మీ దొంగ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
-
విచారణపై శ్యామల ఫస్ట్ రియాక్షన్
-
ఏసీబీ కేసు నమోదు చేయటంపై ఎక్స్ లో విడదల రజినీ పోస్ట్
-
MLC మర్రి రాజశేఖర్ రాజీనామాపై విడదల రజిని స్ట్రాంగ్ రియాక్షన్
-
విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే ఎలా? కృష్ణ మందహాసం
సరిగ్గా యుద్ధం ఆరంభం కాబోతుండగా, అర్జునుడు అకస్మాత్తుగా అశ్రునయనాలతో ‘నేను ఈ యుద్ధం చేయ లేను!’ అనేశాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ‘తం ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ.’ సమాధానం విషయం తరవాత. తనకు అత్యంత ఆప్తుడూ, మహావీరుడూ అంతటి విషాదగ్రస్థుడై ఉంటే, అచ్యుతుడికి చిరునవ్వు ఎందుకు వచ్చినట్టు అంటే చాలా కారణాలు కనిపిస్తాయి. సమ్మోహనకరమైన చిరునవ్వు శ్రీకృష్ణుడి సహజ లక్షణం. ఆయన నల్లనివాడూ, నవ్వు రాజిల్లెడి మోమువాడూ కదా! అదొక కారణం.ఎన్నో ఆశలు తన మీద పెట్టుకొని, ఇంత సేన యుద్ధంలోకి దిగ గానే, తమ పక్షంలో అందరికంటె గొప్పవీరుడు ‘నేను యుద్ధం చేయను, పొ’మ్మంటే, సామాన్యుడయితే కోపావేశంలో మునిగి పోయేవాడు. కానీ, విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే, తల పెట్టిన కార్యం తలకిందులవుతుందని ఆ ఘటనాఘటన సమర్థుడికి బాగా తెలుసు. కనక ఆయన చిరునవ్వు చెదరలేదు.శ్రీకృష్ణుడి చిరునవ్వుకు ముఖ్య కారణం అర్జునుడి ఆవేదన వెనక ఉన్న అజ్ఞానమూ, అమాయకత్వమూ! ‘నేను స్వజనాన్ని చంపితే పాపాన్ని పొందుతాను!’ అన్న అభ్యంతరం ఆధ్యాత్మిక దృష్ట్యా అన్నివిధాలా అవక తవకగా ఉంది. ఆయన ‘నేను, నేను’ అని అహంకరిస్తు న్నాడు, ‘నేను’ అంటే ఎవరో గ్రహించకుండా. ‘స్వజనం, బంధుమిత్రులూ’ అంటూ ‘మమ’కారం చూపుతున్నాడు, ఆత్మస్వరూపుడైన తనకు స్వజనం–పరజనం అన్న పరి మితులు లేవని విస్మరించి! ‘చంపటం’ గురించి వాపోతు న్నాడు, చావు గురించిగానీ, చంపేదెవరూ, సమసేదెవరూ అని గానీ సరైన ఎరుక లేకుండా! ‘పాపం తగులుతుంద’ని బాధపడుతున్నాడు, ఎటువంటి కర్మల వల్ల పాప పుణ్యాలు చుట్టుకొంటాయో, ఎలాంటి కర్మలవల్ల పాప పుణ్యాల బంధనాలను తప్పించుకోవచ్చో మరచిపోయి! మహామహా వీరులు కూడా జగన్మాయకు అతీతులు కాలేరు గదా అన్న స్ఫురణ కలిగి, మాధవుడి ముఖాన ముందొక మందహాసం వెలిగింది. ఆ తరవాత వివరంగా గీతాబోధ చేశాడు.– ఎం. మారుతి శాస్త్రి -
జగదీష్రెడ్డి సస్పెన్షన్.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డిని స్పీకర్ సస్పెన్షన్ చేయడంతో నెక్లెస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రేపు(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.ఢిల్లీలో రేవంత్ ఆదేశాలతో తమ గొంతు నొక్కారు. ఒక సభ్యుడి గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్దాలపై జగదీష్రెడ్డి ప్రశ్నించారు. సభలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. జగదీష్రెడ్డి సంయమనం పాటించారు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘జగదీష్రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోంది. తప్పు చేయకపోయినా స్పీకర్పై గౌరవంతో విచారం వ్యక్తం చేస్తామని చెప్పాం. మా వాదనను కూడా వినిపించుకోలేదు. తప్పు మాట్లాడి ఉంటే ఆ వీడియోలు బయటపెట్టాలి. జగదీష్రెడ్డి చేసిన తప్పుపై వివరణ కూడా తీసుకోలేదు’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. -
ఇది కదా జగన్ బ్రాండ్ అంటే
-
రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి తీన్మార్ మల్లన్నది కాదు: సీతక్క
-
రెడ్ బుక్ రాజ్యాంగంతో మీడియాపై ఆంక్షలు
-
బడ్జెట్ పై ఏపీ ప్రజల రియాక్షన్.. సూపర్ మోసం
-
అంకెల గారడీ తప్పితే అమలులో శూన్యం.. బడ్జెట్ పై గురుమూర్తి రియాక్షన్
-
అరెస్ట్ పై పోసాని ఫస్ట్ రియాక్షన్
-
ప్రశ్నించే గొంతులను అణచివేయడమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం
-
పోసాని అరెస్ట్ ను ఖండించిన YSRCP నేతలు
-
ఏపీలో ఉన్నామా..? అఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?: విశ్వేశ్వర్ రెడ్డి
-
పోసాని అరెస్ట్ పై పోతిన మహేష్ సీరియస్ రియాక్షన్..
-
నెతన్యాహు వార్నింగ్..దిగొచ్చిన హమాస్
టెల్అవీవ్:బందీగా తీసుకెళ్లిన షిరి బిబాస్ మృతదేహం కాకుండా వేరే మృతదేహాన్ని హమాస్ పంపడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనేనని, దీనికి ప్రతిగా హమాస్ను మొత్తమే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉగ్రవాద సంస్థ హమాస్ వెంటనే మెట్టుదిగి వచ్చింది. బందీ షిరి బిబాస్ మృతదేహాన్ని వెంటనే ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది.తాము షిరిబిబాస్ మృతదేహాన్ని గుర్తుపట్టామని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.కాగా, హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ తీసుకెళ్లిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది.మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్,అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్ది కాదని వెల్లడించింది.మహిళ మృతదేహం ఇతర బందీల పోలికలతో కూడా సరిపోలడం లేదని తెలిపింది. -
పవన్ కళ్యాణ్ కుంభమేళా ఫోటోలపై ట్రోల్స్.. పోతిన మహేష్ రియాక్షన్
-
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా... అంటా ముద్రగడ ఇంటిపై దాడి.. అంబటి రియాక్షన్
-
Sakshi Poll: కేంద్ర బడ్జెట్పై జనం ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యం అంటూ ఆదాయపు పన్ను శ్లాబ్ల్లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు.ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్గా ప్రధాని మోదీ అభివర్ణించారు. బడ్జెట్లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.కేంద్రం చెప్పినట్లు ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతికి లాభం చేకూర్చేదేనా? అంటూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో సాక్షి పోల్ క్వశ్చన్కు భారీ సంఖ్యలో ప్రజలు స్పందించారు. అవును, కాదు, ఫిఫ్టీ.. ఫిఫ్టీ అనే ప్రశ్నలకు అధిక శాతం మంది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ శాతం మాత్రమే ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మిగిలిన శాతం ఫిప్టీ.. ఫిప్టీ అని తెలిపారు. -
ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందన
-
ప్రభుత్వ సదన్ బాలికల ఒంటిపై గాయాలు.. మత్తుమందు ఇచ్చి.. వరుదు కళ్యాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి.. ఈటల స్ట్రాంగ్ రియాక్షన్
-
రద్దీలో వద్దనుకున్నా.. అంతలో దుర్ఘటన
మద్దిలపాలెం: రద్దీగా ఉండడంతో క్యూలోంచి బయట వెళ్లిపోదాం అనుకున్నంతలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తన భార్య రజని ప్రాణాలు కోల్పోయిందని భర్త గుడ్ల లక్ష్మారెడ్డి భోరుమంటూ విలపించారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా వెళ్తున్న సమయంలో రద్దీ అధికమవ్వడంతోపాటు గేట్లు తెరిచారని, దీంతో జనం ఒక్కసారిగా క్యూలో కదలడం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయిందని మద్దిలపాలేనికి చెందిన మృతురాలు రజని భర్త లక్ష్మారెడ్డి వాపోయారు. రెండు గంటల తర్వాత జాడ తెలిసింది ‘తొక్కిసలాటలో తప్పిపోయిన రజని కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాడలేదు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఫోన్కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే వున్న ఆటో డ్రైవర్ ఫోన్ ద్వారా కాల్ చేస్తున్న పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు. రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్పింపిచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియక ఆటో ద్వారా అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి ఉంది’అంటూ బోరున విలపించారు. అమెరికా నుంచి హుటాహుటిన వచ్చిన హర్షవర్ధన్ రెడ్డి.. తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రజనీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేడు అంత్యక్రియలు అమెరికా నుంచి మృతురాలి తమ్ముడు శనివారం విశాఖ వస్తున్నారు. అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని భర్త లక్ష్మారెడ్డి తెలిపారు. -
తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం: చిర్ల జగ్గిరెడ్డి
-
తిరుమల ఘటనపై మార్గాని భరత్ సీరియస్ రియాక్షన్
-
ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
-
తిరుపతి తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ వింత వ్యాఖ్యలు
-
గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఘటన.. పవన్ కళ్యాణ్ కు మార్గాని భరత్ కౌంటర్
-
మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇంత నీచానికి దిగజారతారా జర్నలిస్టుల సంఘం ఫైర్
-
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై మాధవీలత రియాక్షన్
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా: ఎంపీ డీకే అరుణ
-
అల్లు అర్జున్ ఇష్యూపై స్పందించిన డీజీపీ జితేందర్
-
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి
-
ఆండ్రోమెడాలో వెలుగుల పున్నమి
సువిశాల విశ్వంలో ఎన్నెన్నో నక్షత్ర మండలాలు (గెలాక్సీలు)న్నాయి. మన నక్షత్ర మండలాన్ని పాలపుంత (మిల్కీవే) అంటారన్నది తెలిసిందే. మనకు సమీపంలో ఉన్న అతిపెద్ద నక్షత్ర మండలం ఆండ్రోమెడా. ఈ గెలాక్సీలో అరుదైన దృశ్యాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) బృందం కెమెరాలో బంధించింది. గెలాక్సీలోని నక్షత్రాలపై ఉన్నట్టుండి పేలుడు సంభవించి భిన్న రంగులతో కూడిన అత్యధిక కాంతి వెలువడడాన్ని నోహ్వై అంటారు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో ఇలాంటి నోహ్వై నుంచి పరారుణ ఉద్గారాలను తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంపై అమర్చిన అ్రల్టావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (యూవీఐటీ) ద్వారా ఈ ఉద్గారాలను చిత్రీకరించారు. నోహ్వై సాధారణంగా బైనరీ నక్షత్ర వ్యవస్థలో సంభవిస్తూ ఉంటుంది. భూమి పరిమాణంలో ఉన్న మరుగుజ్జు నక్షత్రం మరో నక్షత్రానికి సమీపంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఈ పరిణామాన్ని చూడొచ్చు. ఒక నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తితో మరో నక్షత్రంలోని పదార్థాన్ని ఆకర్షిస్తే శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ రియాక్షన్ జరుగుతుంది. దాంతో హఠాత్తుగా మిరుమిట్లు గొలిపే వెలుగుతో నక్షత్రంపై పేలుడు సంభవిస్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో నోహ్వై నుంచి 42 దాకా అ్రల్టావైలెట్ ఉద్గారాలను గుర్తించడం విశేషం. వీటిపై మరింత అధ్యయనం చేస్తున్నారు. ఈ వివరాలను అస్ట్రో ఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. నక్షత్ర మండలాల గురించి తెలుసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుందని భావిస్తున్నారు. నోహ్వై రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో అ్రల్టావైలెట్, ఎక్స్–రే మిషన్లలో పరిశోధనలకు సైతం ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెహమాన్ విడాకుల కారణం పై క్లారిటీ ఇచ్చిన మోహినిడే
-
సాక్షిపై కేసు.. కన్నబాబు రియాక్షన్
-
విజయవాడ లడ్డు ఇష్యూ.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
స్వతంత్ర సిట్ దర్యాప్తుపై వైవీ సుబ్బారెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
-
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన మా అధ్యక్షుడు విష్ణు
-
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రాంగోపాల్ వర్మ
-
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి. ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. Alexis Lorenze suffering reactions from 3 vaccines administered to her: meningitis, pneumonia, and tetanus at UCI Medical Center (Anaheim California). I'd give this woman a lot of C to begin with. #VaccineSideEffects https://t.co/whOja2HeGs pic.twitter.com/Hwy1wVuVir— Robert, C.N., Pharm Tech. (@Robertvegan7) September 17, 2024తన పరిస్థితిపై లోరెంజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని, బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్ల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లోరెంజ్ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్ నర్సు వెల్లడించారు. -
టీడీపీ 100 రోజల పాలనపై ప్రజల రియాక్షన్
-
టీడీపీ పట్టాభి కామెంట్స్ కి వేణుగోపాలరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
నందిగం సురేష్ అరెస్ట్ పై సుదాకర్ బాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
జస్టిస్ హేమ కమిటీ నివేదికపై సమంత రియాక్షన్
-
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పై కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్షన్
-
అతి తెలివితేటలు వద్దు.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం
-
Bangladesh Crisis: అది స్వయం కృతాపరాధం: తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, తరువాత ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్లో ఆశ్రయం పొందడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్లాంవాదులను ప్రసన్నం చేసుకునేందుకే హసీనా బంగ్లాదేశ్ నుంచి బయటపడ్డారని, ఆమె కూడా విద్యార్థి ఉద్యమంలో భాగమైనట్లు ఉన్నదని తస్లీమా ఆరోపించారు.తస్లీమా నస్రీన్ ఒక ఆన్లైన్ పోస్ట్లో ‘ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు, హసీనా నన్ను 1999లో నా దేశం నుంచి వెళ్లగొట్టారు. అప్పట్లో నేను మరణశయ్యపై ఉన్న మా అమ్మను చూసేందుకు బంగ్లాదేశ్కు వెళ్లాను. ఆ తరువాత నన్ను తిరిగి బంగ్లాదేశ్కు రానివ్వలేదు. ఒకవిధంగా చూస్తే ఆమె ఇస్లామిస్టు ఉద్యమంలో భాగమయ్యారు. అదే ఇప్పుడు ఆమెను దేశం విడిచివెళ్లేలా చేసింది’ అని అన్నారు. షేక్ హసీనా మిలటరీ విమానంలో భారతదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ఆశ్రయం పొందేందుకు లండన్కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇస్లాంవాదులకు మద్దతుగా నిలిచేందుకు, అవినీతికి పాల్పడే వ్యక్తులకు ఆమె ప్రోత్సాహం అందించారని’ తస్లీమా ఆరోపించారు.తస్లీమా నస్రీన్ 1994లో ‘లజ్జ’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దీనిపై మత ఛాందసవాద సంస్థల నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా ఆమె బంగ్లాదేశ్ విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఈ పుస్తకాన్ని బంగ్లాదేశ్లో నిషేధించారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ బుక్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. తస్లీమా నస్రీన్ దేశం విడిచి వెళ్లిన సమయంలో హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటి నుంచి రచయిత తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్కు దూరంగా ఉన్నారు. -
Article 370 Removal: అది మా అజెండాలో ఉంది: బీజేపీ నేతలు
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రక ఘట్టానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు బీజేపీ నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు.ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ‘ఇది మా(బీజేపీ) ఎజెండాలో ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీని కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు. నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించి స్థానికులకు స్వేచ్ఛ కల్పించారు’ అని అన్నారు. #WATCH | Raipur: Chhattisgarh CM Vishnu Deo Sai says "Today is the third Monday of the 'Sawan' month. I want to extend my wishes to the people of the state. I am travelling to to Kawardha along with Deputy CM Vijay Sharma wherein we will offer prayers to Lord Shiva..."On 5… pic.twitter.com/VC0jJIDzXh— ANI (@ANI) August 5, 2024 జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ‘2019, ఆగస్టు 5 న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా జమ్ముకశ్మీర్లోని ప్రతి వ్యక్తికి హక్కులు లభించాయి. ఆర్టికల్ 370 తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు జమ్ముకశ్మీర్ ప్రజలకు ద్రోహం చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ ‘వన్ ఇండియా-బెస్ట్ ఇండియా’ సంకల్పాన్ని నెరవేర్చారు’ అని అన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఆర్టికల్ 370, 35ఏలను తొలగించడం ద్వారా జమ్ము, కశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రవాదం అదుపులోకి వచ్చింది. వేర్పాటువాదులు జైలులో ఉన్నారు. స్థానికులు ఉపాధి పొందుతున్నారు. లోయలో శాంతి నెలకొంది’ అని అన్నారు. #WATCH | On the 5th anniversary of the abrogation of Article 370, former Deputy CM of Jammu and Kashmir and BJP leader Nirmal Singh says, "Today is a very historic day. Today on 5 August 2019, the Parliament removed Article 370 and 35A and implemented the Constitution of India in… pic.twitter.com/WY27a5DVZR— ANI (@ANI) August 5, 2024 -
బడ్జెట్ పై తెలంగాణ నేతల రియాక్షన్
-
టీడీపీ నేతలపై జక్కంపూడి రాజా ఫైర్
-
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్లో వైరల్గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. -
ట్రంప్ భద్రత పెంపు.. దాడిపై రిపబ్లికన్ పార్టీ నేతల రియాక్షన్
-
ట్రంప్ ను చంపే కుట్ర.. సాక్షి టీవీతో ఎన్నారైలు
-
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీటింగ్ పై ఎంపీ లక్ష్మణ్ రియాక్షన్
-
పిన్నెల్లి అరెస్ట్ పై గోపిరెడ్డి రియాక్షన్
-
వైఎస్ఆర్ సీపీ కార్యాలయం కూల్చివేతపై అంబటి రాంబాబు రియాక్షన్
-
ఎన్నికల ఫలితాలపై కొరముట్ల శ్రీనివాసులు రియాక్షన్
-
ఓటమిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఇచ్చిన హామీలను కూటమి అమలు చేయాలి
-
నా రాజకీయ ప్రయాణం జగనన్నతోనే..
సాక్షి,పాడేరు: ‘న్యాయవాది వృత్తిలో ఉన్న నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన్ను మోసం చేస్తే నాకు పుట్టగతులుండవు’ అని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగనన్న రాజకీయ భిక్షతో గెలిచిన తన రాజకీయ ప్రయాణం చివరి వరకు ఆయనతోనేనన్నారు. పార్టీ మారుతున్నాననే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. వైఎస్ జగన్ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తనను గెలిపించిన పాడేరు నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తానని, కొంతమందిలా తాను రూ.కోట్లకు అమ్ముడుపోయే రాజకీయ నాయకుడిని కాదన్నారు. 2029లో వైఎస్సార్సీపీదే అధికారమని, జగన్ను సీఎంగా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు సురే‹Ùకుమార్, కిల్లు కోటిబాబునాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్మదర్శి సీదరి మంగ్లన్నదొర, పార్టీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పలు పంచాయతీల సర్పంచ్లు వంతాల రాంబాబు, బసవన్నదొర, మాజీ సర్పంచ్లు పాంగి సత్తిబాబు, శరభ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు డీపీ రాంబాబు పాల్గొన్నారు. -
ఎన్నికల ఫలితాలపై జగ్గిరెడ్డి రియాక్షన్
-
ఎవరు అధైర్య పడవద్దు
-
ఎన్నికల ఫలితాలపై పిల్లి సూర్యప్రకాష్ రియాక్షన్
-
ఓటమిపై జక్కంపూడి రాజా రియాక్షన్
-
పవన్ కళ్యాణ్ గెలుపుపై ముద్రగడ రియాక్షన్
-
ఓటమిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి రియాక్షన్
-
ఓటమిపై మేకపాటి విక్రమ్ రెడ్డి రియాక్షన్
-
మళ్లీ వైఎస్ఆర్ సీపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ పై కొమ్మినేని రియాక్షన్
-
ఎగ్జిట్ పోల్స్ పై ఆచంట ఎమ్మెల్యే రియాక్షన్
-
ఎగ్జిట్ పోల్స్ పై పాడేరు ఎమ్మెల్యే రియాక్షన్
-
మళ్లీ సీఎం జగన్ ప్రభంజనం
-
జగన్ 2.0.. 4వ తేదీన రాష్ట్రంలో ఫ్యాన్ సునామీ
-
ఎగ్జిట్ పోల్స్ పై KK రాజు రియాక్షన్
-
ఎగ్జిట్ పోల్స్ పై రాయదుర్గం ఎమ్మెల్యే రియాక్షన్
-
బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధంలేదు: సినీ నటి హేమ
-
జగన్ మాటలతో కూటమిలో వణుకు..చంద్రబాబును ప్రజలు నమ్మలేదు
-
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
-
సన్రైజర్స్ పరుగుల సునామీ.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ (ఫొటోలు)
-
చంద్రబాబు మేనిఫెస్టోపై.. అవినాష్ రెడ్డి రియాక్షన్
-
సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే కుట్రలు: దేవినేని అవినాష్
-
సీఎం జగన్ పై దాడి...జోగి రమేష్ ఆగ్రహం
-
సీఎం జగన్ దాడి పై రాపాక స్ట్రాంగ్ రియాక్షన్...
-
సీఎం జగన్ పై దాడి...వైఎస్ఆర్ సీపీ నేతల ఆగ్రహం
-
సీఎం జగన్ దాడిపై ముద్రగడ స్ట్రాంగ్ రియాక్షన్..
-
సీఎం జగన్ పై జరిగిన దాడి వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి
-
సీఎం జగన్ దాడిపై పోతిన మహేష్ రియాక్షన్...
-
ఓటమి భయంతో పిరికిపందలు చేసే పని...
-
సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
సీఎం జగన్ పై దాడి...కేశినేని నాని క్లారిటీ..
-
షర్మిల వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి రియాక్షన్..
-
చంద్రబాబు పేరు ఎత్తగానే అవ్వ రియాక్షన్...
-
నా గెలుపు ఎవరు ఆపలేరు
-
చంద్రబాబుపై నారా భువనేశ్వరి వ్యాఖ్యలు..రోజా రియాక్షన్
-
పుల్వామా దాడికి ఐదేళ్లు... ఆ రోజు ఏం జరిగింది?
2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ ఐదేళ్ల క్రితం ఫిబ్రవరి 14న పాక్ ఎటువంటి దాడికి పాల్పడిందో, దానికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ఇప్పుడొకసారి గుర్తుచేసుకుందాం. ఐదేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది. 2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ, కాశ్మీర్లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్తాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్తాన్ సైన్యం అభినందన్ వర్థమాన్ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ అప్పటివరకూ పాక్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ను బ్లాక్లిస్ట్లో చేర్చేందుకు మనీలాండరింగ్పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది. -
చిత్రాన్ని చూసే ప్రేక్షకులు భావోద్వేగాలకు గురవుతారు: సజ్జల
-
రేవంత్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఇదే
-
లేటు వయసులో గర్ల్ఫ్రెండ్తో బిడ్డకు తండ్రి: నటుడి రియాక్షన్ వైరల్
హాలీవుడ్ నటుడు , లెజెండ్ రాబర్ట్ డి నీరో లేటు వయసులో తండ్రి కావడంపై స్పందించారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న నీరో , గర్ల్ ఫ్రెండ్ టిఫనీ చెన్తో కలిపి గత ఏడాది ఏప్రిల్లో 79 ఏళ్ళ వయసులో ఏడో బిడ్డగా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రిగా తాను పొందుతున్న ఆనందాలను, అనుభూతి గురించి మాట్లాడారు. తన పాప గియా చూసినపుడు చాగా తనకు సంతోషంగా ఉంటుదని, ఈ వయసులో సాధ్యమైనంత ఎక్కువ సమయం పాపతో గడపాలని కోరుకుంటున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాను ఒక్కసారి చూస్తే అన్నీ మటు మాయం... తన పాప చాలా అందంగా ముద్దుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 80 ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడం పెద్ద విశేషమే అంటూ మురిసిపోయాడు. “I'm an 80-year-old dad, and it's great. And I want to be around for as long as I can to enjoy it.” Robert De Niro gets emotional talking about his baby daughter during an interview with AARP. pic.twitter.com/C1PHzxetnP — AP Entertainment (@APEntertainment) January 25, 2024 ఇప్పటికే ‘గాడ్ ఫాదర్-2’ సినిమాకు రాబర్ట్ డి నీరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2024 ఆస్కార్ నామినేషన్ లిస్టులో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో మరో అవార్డు అందుకున్నాడు. రాబర్ట్ డి నీరో రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య డయానే అబాట్ ద్వారా ఇద్దరు పిల్లలు, కుమార్తె డ్రేనా , కుమారుడు రాఫెల్ ఉన్నారు. అలాగే మోడల్-నటి టౌకీ స్మిత్తో జూలియన్ ,ఆరోన్ అనే కవలలకు జన్మనిచ్చాడు. దీంతో పాటు రాబర్ట్ డి నీరోకు అతని మాజీ భార్య గ్రేస్ హైటవర్తో కుమారుడు ఇలియట్ ,కుమార్తె హెలెన్ గ్రేస్ ఉన్నారు.వీరిలో ఇద్దరు హాలీవుడ్ లో పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఏడో సంతానంగా టిఫనీ చెన్ , నీరోకు పాప గియా పుట్టింది. -
కేశినేని నాని రాజీనామాపై కొడాలి నాని రియాక్షన్
-
నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్
సాక్షి, ములుగు: తాను ఎక్కడికి పారిపోలేదు.. ఎవరిపైనా దాడి చేయలేదని నాస్తికుడు బైరి నరేష్ అన్నారు. తాను దాడి చేశానన్న వార్తలో నిజం లేదన్నారు. కాగా, అయ్యప్ప భక్తుని కారుతో ఢీకొట్టిన ఘటనలో ఏటూరు నాగారం పీఎస్లో బైరి నరేష్పై కేసు నమోదైంది. అయ్యప్ప భక్తుడిని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం మంగపేట వైపు వెళ్తుండగా నరేష్ వాహనం ప్రమాదానికి గురైంది. జీడివాగు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సకాలంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ అవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు. వాహనం ప్రమాదంపై మరో కేసు నమోదైంది. బైరి నరేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. బైరి నరేష్ స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు. ఏడాది కిందట.. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హిందూ సంఘాలు, అయ్యప్ప స్వాముల ఫిర్యాదు నేపథ్యంతో కేసు నమోదు అయ్యింది. దాదాపు 45 రోజుల పాటు నరేష్ చర్లపల్లి జైలులో ఉన్నాడు. కోడంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చాక కూడా నరేష్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హనుమకొండలో మరోసారి అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు పోలీసుల విచారణలో బైరి నరేష్ అంగీకరించాడు. -
హరిరామ జోగయ్య లేఖపై పేర్ని నాని కామెంట్స్
-
ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ రూపంలో తన స్పందన తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కోర్టు ఆమోదించిందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది. 2029, ఆగస్టు 5న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైందని సుప్రీంకోర్టు సమర్ధించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ఆశ, పురోగతికి ఐక్యతకి ఇది అద్భుతమైన ప్రకటన. భారతీయులు గౌరవించే ఐక్యతా సారాంశాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది. జమ్మూకశ్మీర్, లడఖ్లోని ప్రజల కలలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు వాటి ప్రయోజనాలను అందజేయాలని నిశ్చయించుకున్నాం. ఈరోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు..ఇది ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకోసం బలమైన, మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే తమ సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. Today's Supreme Court verdict on the abrogation of Article 370 is historic and constitutionally upholds the decision taken by the Parliament of India on 5th August 2019; it is a resounding declaration of hope, progress and unity for our sisters and brothers in Jammu, Kashmir and… — Narendra Modi (@narendramodi) December 11, 2023 ‘ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత పేదలు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం, అత్యాధునిక విద్యా మౌలిక సదుపాయాలను కల్పించడం, పేదలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు? After the abrogation of #Article370, the rights of the poor and deprived have been restored, and separatism and stone pelting are now things of the past. The entire region now echoes with melodious music and cultural tourism. The bonds of unity have strengthened, and integrity… — Amit Shah (@AmitShah) December 11, 2023 -
మంత్రి పదవిపై సీతక్క ఎమోషనల్..
-
రేవంత్ రెడ్డి చదువుకున్న బడి ఇదే..!
-
బీఆర్ఎస్ ఓటమిపై హరీష్రావు, కవిత రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ ఓటమిపై హరీష్రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హరీష్రావు అన్నారు. బీఆర్ఎస్ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. చదవండి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి Jai KCR !! Jai BRS !! Dear BRS family, thank you for all the hardwork !! Special thanks to all the social media warriors for the fight you put up !! Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2023 -
ఎగ్జిట్ పోల్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్షన్
-
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు: భట్టి విక్రమార్క
-
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత..రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రియాక్షన్
-
ఓబీసీ సర్టిఫికెట్ దుమారం: శరద్ పవార్ కౌంటర్
Sharad Pawar నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ఒక సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరద్పవార్ స్పందించారు. కులాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, కులాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని మంగళవారం ప్రకటించారు. తన కులం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను ఏనాడూ కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు.. చేయను కూడా అని పవార్ ప్రకటించారు. కానీ సమాజంలోని సమస్యలను పరిష్కారం తాను చేయాల్సింది చేస్తానని పవార్ వెల్లడించారు. ఓబీసీ సామాజికవర్గం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే తాను పుట్టిన కులాన్ని దాచిపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే మరాఠా కమ్యూనిటీ కోటాపై మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని దన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లపై యువత సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందని కానీ ఈ విషయంలో నిర్ణయాధికారం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ఎన్సీపీ ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇది నకిలీదని ఇప్పటికే దీన్ని కొట్టిపారేశారు. శరద్ పవార్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఉండేవా ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. ఇది ఫేక్ సర్టిఫికెట్ అని శరద్ పవార్ మద్దతుదారు వికాస్ పసల్కర్ గట్టిగా వాదించారు. అసలు శరద్ పవార్ అలాంటి సర్టిఫికెట్ ఏదీ తీసుకోలేదని ఆయన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని మండిపడ్డారు. నాగ్ పూర్ కేంద్రంగా ఇలా జరుగుతోందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఇటీవల రాష్ట్రమంతటా తీవ్ర హింసకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠా సంఘం పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం వివాదానికి దారి తీసింది. -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్
నటి రష్మిక్ డీప్ ఫేక్ వీడియో ఉదంతం, ఫేక్ న్యూస్, తప్పుడు వీడియోలు, ఫోటోలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. అభ్యంతరకరంగా మార్ప్ చేసిన రష్మిక వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వయంగా బిగ్బీ దీనిపై ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరంగా పరిణ మిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి సోషల్ మీడియా సంస్థలకు కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాజాగా ప్రముఖ గాయని, మీటూ ఉద్యమానికి భారీ మద్దతిచ్చిన చిన్మయి శ్రీపాద కూడా ఎక్స్ (ట్విటర్)లో స్పందించారు. డీప్ ఫేక్ వీడియో రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశాను. ఈ వీడియోతో నిజంగా ఆమె కలవరపడుతునట్టు కనిపిస్తోందన్నారు. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో, అమ్మాయిలను వేధించేందుకు ఒక సాధనంగా మారుతోంది... వారిని భయపెట్టేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా తీవ్రమైన ఆయుధంగా డీప్ ఫేక్స్ మారబోతోందన్నారు. అలాగే అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ, డీప్ ఫేక్ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న గ్రామం లేదా పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఏంటి? అంటూ చిన్మయి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జైలర్ సినిమాలోని సెన్సేషనల్ ‘నువ్వు కావాలయ్యా’ పాట విడుదల తరువాత వచ్చిన ఒకప్పటి హీరోయిన్ సిమ్రన్ ఫేక్ వీడియోను ప్రస్తావించారు. ఏఐ మాయ అంటూ సిమ్రన్ ఇన్స్టాలో షేర్ చేసేదాకా దాదాపు ఎవ్వరికీ దీని గురించి తెలియదు.. అంటూ ఈ ఫేర్ వీడియో గురించి చిన్నయి గుర్తు చేశారు. అంతేకాదు డీప్ఫేక్ల ప్రమాదం, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలకు , బాలికలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మార్పింగ్ ఫోటోలతో అమ్మాయిలను, మహిళా రుణ గ్రహీతలను వేధిస్తున్న లోన్ యాప్ల అరాచకాలను ఆమె ప్రస్తావించారు. ఎంతో కొంత పరిజ్ఞానం, శిక్షణ ఉంటే తప్ప డీప్ ఫేక్ను సాధారణ ప్రజలు గుర్తించడం కష్టం అంటూ తప్పుడు కథనాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు. Several months ago, a video of one of our most favourite actors in an AI avatar performed to Kaavaalaa from Jailer released - only it wasn’t her. It was a Deep Fake. Nobody knows for sure whether Ms Simran had consented in advance to her likeness to be used in the Deep Fake AI… — Chinmayi Sripaada (@Chinmayi) November 6, 2023 View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga)