‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం.. | - | Sakshi
Sakshi News home page

‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం..

Apr 24 2025 8:41 AM | Updated on Apr 24 2025 8:41 AM

‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం..

‘కళింగ’ వేదికగా వస్త్ర వైభవం..

ఏప్రిల్‌ 27 వరకు కొనసాగనున్న నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వైవిధ్యం కలిగిన వస్త్ర ఉత్పత్తులు నగరం వేదికగా అలరిస్తున్నాయి. నగరంలోని బంజారాహిల్స్‌ వేదికగా కళింగ కల్చరల్‌ సెంటర్‌లో ఏప్రిల్‌ 27 వరకు కొనసాగనున్న ‘నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో’ నగరవాసులకు నాణ్యమైన, విలక్షణమైన వస్త్రర సోయగాలను చేరువ చేస్తోంది. ఈ ఎక్స్‌పోలో విభిన్న రకాల పట్టు డిజైన్లతో పాటు కాటన్‌ డిజైన్‌ దుస్తులు, డిజైనర్‌ బ్లౌజ్‌లు, కుర్తీలు తదితర భారతీయ వస్త్ర వైభవాలు నేత కార్మికుల ద్వారా 50 శాతం వరకు తగ్గింపుతో అందించబడుతున్నాయి. ఇందులోని మహారాష్ట్ర స్వచ్ఛమైన పైథానీ సిల్క్‌ చీరలు, కర్ణాటక – బెంగళూరు సిల్క్‌, సాఫ్ట్‌ సిల్క్‌ తదితరాలు వస్త్ర ప్రియులను ఆకర్షిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement