
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం రేపాయి. గోదాంలో డబ్బుల కట్టలను చూసి బోయిన్పల్లి పోలీసులు షాకయ్యారు. పలు బ్యాంకులకు చెందిన డబ్బును ఏటీఎంలలో డిపాజిట్ చేయకుండా ఆ నోట్ల కట్టలను ఏజెన్సీలు.. గోదాంలో నిల్వ ఉంచాయి. రూ.8 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకు అధికారులతో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జీతాలు చెల్లించకపోవడంతో కొన్నాళ్ల నుంచి సిబ్బంది విధుల బహిష్కరించారు. దీంతో గత కొద్ది రోజులుగా గోదాంలోనే కోట్ల రూపాయల నగదు ఉండిపోయాయి. ఏజెన్సీ నిర్వాహకులు గోదాంలో పెట్టి వదిలేశారు.