కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ | Pralhad Joshi Takes Charge as Union Education Minister | Sakshi
Sakshi News home page

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకరణ

Jul 26 2026 1:24 PM | Updated on Jul 26 2026 1:45 PM

Pralhad Joshi Takes Charge as Union Education Minister

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భారీ నిరసనలు, జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన మరుసటి రోజే, ఆదివారం నాడు ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాను ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖను సమర్పించినట్లు ప్రధాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

జంతర్‌మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్న విద్యార్థి సంఘం (సీజేపీ) ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రులు జగత్ ప్రకాష్ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిరసనకారుల ప్రధాన డిమాండ్లపై ఇరువర్గాల మధ్య సానుకూల అంగీకారం కుదరడంతో ఈ ఆందోళనను విరమించినట్లు ప్రకటించారు. ప్రధాన్ రాజీనామా అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఈ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. కర్ణాటకలోని బీజాపూర్‌లో 1962 నవంబర్ 27న జన్మించిన ప్రహ్లాద్ జోషి, హుబ్బళ్ళిలో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.

రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో అనుభవం గడించిన ఆయన, కర్ణాటకలో కీలక బీజేపీ నేతగా ఎదిగారు. 2004 నుంచి ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రితో పాటు, 2024 ఎన్నికల తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి కీలక పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఇది కూడా చదవండి: పోలీసుల అణచివేతపై హోంమంత్రికి రాహుల్ లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement