కర్ణాటక: తాగిన మత్తులో ఉన్న మందుబాబులు బైక్ను నేరుగా ఆస్పత్రిలోకి తీసుకువచ్చిన సంఘటన బీదర్లోని బ్రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంగా ఉన్న స్నేహితుడిని బైక్పై ఎక్కించుకున్న మందుబాబు వాహనాన్ని వేగంగా నడుపుతూ ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి అదే వేగంతో రోగుల వార్డులోకి దూకించాడు. ఈ హఠాత్ పరిణామంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
#Karnataka #Breaking
Youth Ride Motorcycle into Bidar Hospital Emergency Ward, Detained by Police#Bidar: Two allegedly intoxicated youths created panic at the Bidar Institute of Medical Sciences (BRIMS) District Hospital by riding a motorcycle into the Emergency Ward late on… pic.twitter.com/7xHLkqe7Ze— Mahesh M Goudar (@IamMGoudar) July 25, 2026


