కరీంనగర్, రాజన్న సిరిసిల్లా: జిల్లాలో ఓ పాము కలకలం రేపింది. వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందున్న బెల్లం దుకాణం సమీపంలో దాదాపు 10 అడుగుల పాము ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఆలయంలోని భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ తీవ్రంగా శ్రమించి, సాహసోపేతంగా ఆ పామును పట్టుకోవడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.


