breaking news
Karimnagar District Latest News
-
ఏకగ్రీవ యత్నం.. ఎన్నిక అనివార్యం
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి పంచాయతీ (జనరల్ స్థానం) ఎన్నికల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన పార్టీల నాయకుల జోక్యంతో గ్రామంలోని దేవాలయం నిధికి విరాళాలు భారీగా వచ్చి చేరాయి. మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెంకట్రావుపల్లి వివిధ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఉపసంహరణకు గడువు లోపు అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోలేదు. రూ.25.25లక్షలకు వేలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులు ఏకగ్రీవం కోసం బహిరంగ వేలం వేశారు. వేలంలో ముగ్గురు అభ్యర్థులు పాల్గొనగా.. తలా రూ.2లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో చివరకు కాంగ్రెస్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి తన భార్య అనిత తరఫున రూ.25.25లక్షలు చెల్లించేందుకు అంగీకరించాడు. వేలం పూర్తయ్యాక.. ఓడిన అభ్యర్థుల డిపాజిట్ను వారికి తిరిగి ఇచ్చి కృష్ణారెడ్డి భార్యకు పోటీగా ఎవరూ ఉండరాదని గ్రామస్తులంతా బాండ్ పేపర్పై సంతకాలు చేసి ఏకగ్రీవం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మొత్తాన్ని తొలి విడతగా గ్రామ శివాలయం అకౌంట్లో జమ చేశారు. సీన్లోకి బీఆర్ఎస్ అభ్యర్థి.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించి.. కృష్ణారెడ్డి చెల్లించిన మొత్తానికి సమానంగా రూ.25.25లక్షల చెక్కును పార్టీ తరఫున అందించారు. దీంతో బీఆర్ఎస్ తరఫున కన్నెబోయిన విజేందర్ బరిలో నిలిచినట్లయ్యింది. మరోవైపు కృష్ణారెడ్డి చెల్లించిన రూ.25.25లక్షలు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన రూ.25.25 లక్షలు శివాలయం అకౌంట్లోకి వచ్చి చేరాయి. అదే సమయంలో తన భార్య ఏకగ్రీవమైందన సంతోషం కృష్ణారెడ్డికి లేకుండాపోయింది. ప్రస్తుతం అనిత, విజేందర్తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా ముద్ధమల్ల లక్ష్మి బరిలో నిలిచారు. -
చొప్పదండి పరిశోధకుడికి అంతర్జాతీయ గుర్తింపు
చొప్పదండి: పోరస్ మీడియంలో హైపర్బోలిక్ టాంజెంట్ నానోఫ్లూయిడ్ ప్రవాహంపై పరిశోధనకు గాను చొప్పదండికి చెందిన కళ్లెం శ్రీనివాస్రెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హైపర్బోలిక్ టాంజెంట్ ప్లోలో కంప్యూటేషనల్ అనాలిసిస్ అనే శీర్షికతో శ్రీనివాస్రెడ్డి చేసిన పరిశోధనకు ప్రతిష్టాత్మక క్యూ1, క్యూ2 ర్యాంక్ గల జర్నల్స్లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. శ్రీనివాస్రెడ్డి చేసిన అధ్యయనాలు అణు రియాక్టర్ శీతలీకరణ, మెటలర్జీ, భౌగోళిక ప్రాసెస్లు, అంతరిక్ష సాంకేతికత వంటి అనేక అధునాతన పరిశ్రమల్లో ఉపయోగపడే విలువైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి. నాన్లీనియర్ సమీకరణాలను పరిష్కరించడంలో ఉన్న క్లిష్టతను అధిగమించి ఈ పరిశోధన ద్వారా థర్మో ఫ్లూయిడ్ వ్యవస్థల రూపకల్పన, విశ్లేషణ, ఆప్టిమైజేషన్లో గణనీయమైన పురోగతిని సాధించినట్లు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శాసీ్త్రయ నైపుణ్యంతోపాటు పరిశోధనలో నవ్యత, అత్యుత్తమ ప్రచురుణా ప్రమాణాలు కలగలిసిన ఈ అధ్యయనం భారతీయ పరిశోధకుల అంతర్జాతీయ ప్రతిష్టను మరింతగా పెంచిందని అభిప్రాయపడ్డారు. గీతం యూనివర్శిటీ ద్వారా ఆయన ఈ పరిశోధనలో పాల్గొన్నారు. జూలై 30న మాథమెటిక్స్, స్టాటిక్స్ విభాగం ద్వారా ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు. -
పంచాయతీ
ఇయ్యాల్నే తొలివిడతసాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్: గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,224 గ్రామాలకు గాను మొదటి విడతలో భాగంగా 389 గ్రామాల్లో అధికారులు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలవారీగా కలెక్టర్లు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం జిల్లా, మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రితో మధ్యాహ్నమే బయల్దేరి ఎన్నికలు జరగనున్న గ్రామాలను చేరుకున్నారు. కరీంనగర్ 28 గ్రామాలు, పెద్దపల్లిలో 15, జగిత్యాల 21, సిరిసిల్లలో 41 గ్రామాలు 500 లోపు ఓట్లున్నాయి. తక్కువ ఓటర్ల కారణంగా వీటి ఫలితాలు మధ్యాహ్ననికి వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కరీంనగర్లో ఇలా.. కరీంనగర్లో తొలి దశలో భాగంగా 5 మండలాల్లోని 92 గ్రామాల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 3 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా.. 866 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 276 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 590 వార్డులకు యధావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల్లోని జెడ్పీ హైస్కూళ్లలో, కరీంనగర్ రూరల్కు సంబంధించి కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో డిస్ట్రిబ్యూష న్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను బుధవారం స్వయంగా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పోలింగ్ బూత్కు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి, చెక్ లిస్ట్ను తనిఖీ చేసుకోవాలని, ఇబ్బందులుంటే రూట్ ఆఫీసర్ను సంప్రదించాలని ఆదేశించారు. -
వర్సిటీలో ఘనంగా ఎథ్నిక్ డే
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలోని కామర్స్ కళాశాలలో బుధవారం ఘనంగా ఎథ్నిక్ డే నిర్వహించారు. ఈ వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేశ్కుమార్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉట్టి కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యార్థులు సంప్రదాయాలను మరవొద్దని, జాతి గౌరవాన్ని పెంపొందించే ఆచారాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఆచారాలకు సంబంధించిన పండుగలను జరుపుకొని జాతి ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు కట్టుబడి ఉండి దేశ సంస్కృతిని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్కుమార్, ప్రిన్సిపాళ్లు రమాకాంత్, సుజాత, అధ్యాపకులు నజిముద్దీన్ మున్వర్, పద్మావతి, శ్రీవాణి, కృష్ణకుమార్, తిరుపతి, మనోజ్కుమార్, నరేశ్, పరశురాం, సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ వీసీ, ఇతర అధికారులు, విద్యార్థినులు ఉత్సాహంగా పట్టు చీరలు, ధోవతులు, కుర్తాలు, పైజామాలు వంటి సంప్రదాయ వస్త్రధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
గెలిచినోడే మనోడు!
హుజూరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు.. ముగ్గురు పోటీ పడుతున్నారు. వారి కి ఆ పార్టీ నేతలు సర్ది చెప్పలేక గెలిచినోడే మనోడు అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రధానంగా అధికార పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. సర్ది చెప్పినా వినకపోవడంతో పోటీ అనివార్యమైంది. గెలిచి రండంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసొచ్చి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు మధ్య లోకల్ వార్ నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. లోకల్ వార్.. జిల్లాలో మొదటి, రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే.. ఓటర్లు ఎవరికి మద్దతిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ రెండు వర్గాలు పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం దీటుగానే తలపడుతున్నారు. ఇరువర్గాలు బలంగా ఉన్న గ్రామాల వైపు పార్టీ కీలక నేతలు చూసీచూడనట్టుగానే వదిలేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా డబుల్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తోంది. అయితే పలువురు అభ్యర్థులు పార్టీ మద్దతు మాకంటే మాకే ఉందని ప్రచారం చేయడమే గాక.. ప్రచారం వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పార్టీ జెండాలతోనే ప్రచారం పార్టీల రహితంగా జరిగే ఎన్నికలే అయినా.. అభ్యర్థులు మాత్రం పార్టీల జెండాలతోనే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ స్థానికంగా అవగాహనతోనే పోటీ చేస్తున్నాయి. మద్యం, డబ్బు పంపిణీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మద్యం, డబ్బు ఏరులై పారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే మద్యం పంపిణీ జోరుగా సాగుతుండగా.. ఓటర్లకు పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేలతోపాటు క్వార్టర్, ఓ మోస్తరు పంచాయతీల్లో మందుతోపాటు రూ.500, చిన్న గ్రామాల్లో మందు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం సంతోషం
● చాడ వెంకట్రెడ్డి చిగురుమామిడి: గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల రావడం సంతోషించదగిందని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్లో యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణతోపాటు నిరుద్యోగులకు లక్షన్నర ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక టీం లీడర్గా సీఎం రేవంత్రెడ్డి సక్సెస్ అయినట్లు అని అన్నారు. సీపీఐ బలపర్చిన అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గూడెం లక్ష్మి, తేరాల సత్యనారాయణ, మండల సహాయకార్యదర్శి బూడిద సదాశివ, నాయకులు బొలుమల్ల రాజమౌళి, అనిల్, జంపయ్య పాల్గొన్నారు. కరీంనగర్: పెరుక సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెరుక కుల కుటుంబ సమగ్ర డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్కుమార్ కరీంనగర్లో ప్రారంభించారు. జిల్లా సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక ఇంపీరియల్ కన్వెన్షన్లో జరిగింది. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బస్వ వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దొంగరి మనోహర్, సుంకరి ఆనంద్, కీత విజయ్కుమార్, చుంచు ఉషన్న, దొరిశెట్టి వెంకటయ్య, కందుల సంధ్యారాణి, బరుపాటి సంపత్, అల్లం రాజేశ్వర్మ, పోకల నాగయ్య, రేణ మల్లయ్య, వనపర్తి మల్లయ్య, సాయిని దేవన్న, పెట్టాం సంపత్, దాసరి అశోక్, మీసా శ్రీనివాస్, తమ్మిశెట్టి రవి, వంగల మధు, కరుకూరి మల్లేశ్ పాల్గొన్నారు. -
ఓటేసే ముందు ఆలోచించండి..
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లె ప్రగతికి పాటుపడుతోంది.. పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమేనని, ఇప్పటివరకు గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవేనని స్పష్టం చేశారు. రైతు వేదిక నుంచి శ్మశాన వాటిక దాకా.. రోడ్ల నిర్మాణం మొదలు వీధిదీపాల దాకా.. ఆఖరికి గ్రామాల్లో జరిగే పారిశుధ్య పనులకు సైతం కేంద్ర నిధులే వెచ్చిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని విమర్శించారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా, చేసిన పనులకు బిల్లులియ్యకుండా సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చింది బీఆర్ఎస్సేనని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి పైసలిస్తున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా చిచ్చుపెడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే.. ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నయా పైసాఇయ్యలేదు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు.. నన్ను కోసినా నయా పైసా రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే చెబుతున్నడు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనూ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇయ్యలేదు.. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కేంద్ర మంత్రిగా ఎంపీ లాడ్స్ నిధులున్నాయి.. సీఎస్సార్, ఎంపీ లాడ్స్ సహా అనేక రూపాల్లో పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న.. భవిష్యత్తులోనూ కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తెస్తానని తెలిపారు. -
అందుబాటులోకి ‘మ్యాంగోమాస్టర్’
జగిత్యాలఅగ్రికల్చర్: తెగుళ్ల బారి నుంచి మామిడి తోటలను కాపాడుకునేందుకు రైతులు నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తుంటారు. చెట్లు ఎత్తుగా ఉంటే పిచికారీ చేయడం చాలా ఇబ్బంది. ఈ క్రమంలో రైతుల ఇబ్బందులు తప్పించేందుకు మ్యాంగో మాస్టర్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం 42 హెచ్పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్కు బిగించుకోవచ్చు. యంత్రం ద్వారా పొగమంచులాగా నీటి బిందువులు మామిడి ఆకులపై పడతాయి. చెట్టు ఎంత ఎత్తు ఉన్నా మందును సమంగా పిచికారీ చేస్తుంది. 25 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల అడ్డంతో మందును సమర్థవంతంగా పిచికారీ చేస్తుంది. యంత్రం బరువు 220 కిలోలు. గంటకు 3 వేల లీటర్ల మందును చెట్లపై పిచికారీ చేస్తుంది. యంత్రానికి కంప్యూటరైజ్డ్ బ్యాలెన్స్డ్ ఫ్యాన్ సిస్టం రివర్స్గా ఉంటుంది. తద్వారా యంత్రం నడిచేటప్పుడు చెట్ల ఆకులు, భూమి మీది గడ్డిని ఫ్యాన్లలోకి లాక్కోకుండా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వద్ద కంప్యూటరైజ్డ్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. కూలీల అవసరం లేకుండానే మందు పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుంది. మామిడి తోటల్లో పిచికారీ యంత్రం కూలీల సమస్యకు చెక్ -
చీరకు నిప్పంటుకొని వృద్ధురాలు సజీవ దహనం
కోరుట్లరూరల్: సంగెం గ్రామానికి చెందిన గోపిడి హన్మక్క(81) చీర కొంగుకు నిప్పంటుకొని సజీవ దహనమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మక్క ఆదివారం ఉదయం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చీర పూర్తిగా కాలి శరీరానికి నిప్పంటింది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొదుతూ బుధవారం మృతిచెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేటీఆర్ కాన్వాయ్ తనిఖీ
తంగళ్లపల్లి: సిరిసిల్లలో పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు కాన్వాయ్ను బుధవారం జిల్లా శివారులోని జిల్లెల్ల చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిబంధనల ప్రకారం కేటీఆర్ కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేసి తర్వాత అనుమతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కారు దిగి అధికారులకు సహకరించారు. 14న తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని తేజస్ ఐఐటీ/నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 14న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్–2025ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ సీహెచ్ సతీశ్రావు తెలిపారు. కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాలలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 10 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 81063 10960, 81063 66661, 98494 66661లో సంప్రదించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ జి.కిషన్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మీ పల్లెను మాట్లాడుతున్నా..
సిరిసిల్ల: అప్పుడే తెల్లారుతోంది. మంచుతెరలు కమ్ముకున్నాయి. సూర్యుడి లేలేత కిరణాలు పల్లెముంగిలికి చేరుతున్నాయి. ఈరోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రారాజువి. పోటీ చేసిన అభ్యర్థులంతా నీ చుట్టూ చేరి చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇది. బయలుదేరు.. ఓటు అస్త్రాన్ని సంధించు. ఊరికి ఉపకారం చేసే అభ్యర్థిని సర్పంచిగా గెలిపించు. వంగి వంగి దండాలు పెట్టిన అభ్యర్థులంతా మట్టి కరువాలి. మన తలరాతలను మార్చే మంచోడికి ఓటేయ్యి. ఎన్నికల రోజు కాబట్టి నా మనసు ఊరుకో లేక.. మీకో లేఖ రాస్తున్నా..! ఊరుకు సర్పంచే సుప్రీం ఒక్కసారి ఆలోచించండి. ఊరికి సర్పంచే సుప్రీం. పల్లె మారాలి.. ప్రగతి పల్లవించాలంటే మీ ఓటుతోనే సాధ్యం. సర్పంచిగా పోటీచేసిన అభ్యర్థులు చెప్పే మాయమాటలు నమ్మకండి. అరచేతిలో వైకుంఠం.. చూపించే మాటల గారడి అభ్యర్థుల సంగతి చూడండి. ఐదు వందలకో, వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, ఓ చీరకో ఓటును అమ్మకండి. ఆ నవ్వు వెనక నయవంచనను గుర్తించండి గతంలో ఏం జరిగిందో ఆలోచించండి. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వాళ్లు అబద్ధపు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతుండ్రు. కులం, మతం, వాడకట్టు పాటలు పాడి మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపం ఏంటో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆ నవ్వు వెనక ఉన్న నయవంచనను గుర్తించండి. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. ఎన్నెన్నో చెప్పి గెలిచాక ఊరి అభివృద్ధిని మరిచి గ్రామసభలు పెట్టకుండా.. సమస్యల ప్రాధాన్యతను గుర్తించకుండా.. ప్రజల బాధలను పట్టించుకోకుండా కాంట్రాక్టులు చేసి సంపాదించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా? ఏదైనా పని పడి వెళ్తే ఇంటి గేటవుతల నిలబెట్టే వారిని గెలిపించాలా? ఇకనైన కళ్లు తెరవండి. దండం పెట్టాడని ఓటేస్తే... మళ్లీ ఓట్ల సీజన్ దాకా కనిపించడు. ఆత్మసాక్షిగా ఓటేయండి మీకు అందుబాటులో ఉండి సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. గతంలో ఊరి సర్పంచులుగా ఎన్నికై న వారు ఏం చేశారో ఆలోచించండి. అందుకే ఎన్నికల వేళ మీ అందరికీ ఓ విన్నపం. మీకు మంచి పనులు చేసే సర్పంచిని, వార్డు సభ్యులనే ఎన్నుకోండి. మీకు మేలు చేసే వారిని మరవద్దు. తెలంగాణలో ఓ సామెత ఉంది. కళ్ల ముందు కనిపించే కూట్లో రాయి తీయనోడు.. ‘ఎక్కడో ఉండే ఏట్లో రాయి తీస్తడా..’ అని. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ‘తిన్న రేవును తలవాలంటారు’ అందుకే చెబుతున్నా. మీకు మంచి చేసిన వారిని విస్మరించొద్దు. కులమనో.. ప్రాంతమనో... ఓటు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఊరందరి సమస్యలను తనవిగా భావించే వారినే ఎన్నుకోండి. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దిగమించిన సంగతి మీకు తెలుసు. పింఛన్ కోసం వెళ్తే పైసలు గుంజిన సంగతి ఎరుకే. అన్నింటికి మించి తాగేందుకు నీరు ఇవ్వని వారు.. ఒక్క వీధిదీపమైనా పెట్టని వారు.. ఎందరో ఉన్నారు. సహజ సంపదను దోచెటోళ్లు వాగు ఇసుకను, గుట్టల రాళ్లను, మొరం, అడవులను దోచి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి సంపాదించినోళ్లూ ఉన్నారు. మీ క్షేమం.. నా సంక్షేమాన్ని చూసుకునే మంచి వారు అందలమెక్కాలి. ఇక లెవ్వు.. చలి కాలమని.. పనికాలమని ఓటు వేయకుండా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఉండొద్దు. మీ ఓటే వజ్రాయుధం. నీతివంతులకు పట్టం కడితే... మీ ఊరూ, వాడ బాగవుతుంది. అవినీతిపరులను, డబ్బులిచ్చినోడికి ఓటేస్తే ఇక ఐదేండ్లు అతడి అవినీతికి లైసెన్సిచ్చినట్లవుతుంది. ఇంకో మాట ఈ రోజు పోలింగ్ పగలు ఒంటిగంట వరకు ఉంటది. ఈలోగా నువ్వు పోలింగ్ కేంద్రానికి వెళ్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే అంతే.. సంగతి.. ఇంకో మాట ఈ సారి రెండు ఓట్లు ఉంటయి. బ్యాలెట్ పత్రాలు రెండు ఇస్తారు. ఒక్క గులాబి రంగు సర్పంచి ఓటు.. ఇంకోటి తెల్లరంగు పత్రం వార్డు సభ్యుడి ఓటు సరిగ్గా గుర్తును చూసి ఓటేయండి.. మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వేయండి. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా మొర ఆలకించినందుకు మీ అందరికీ నా దండాలు.. ఇక ఉంటాను. ఇట్లు మీ అందరి సంక్షేమాన్ని కోరే మీ పల్లె తల్లి -
గుండెపోటుతో అభ్యర్థి మృతి
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీలో నిలిచిన ముత్యాల చంద్రారెడ్డి(46) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చంద్రారెడ్డికి వార్డు సభ్యుడిగా పోటీచేసే అవకాశం రావడంతో గ్రామంలోని 8వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నిలిచారు. బుదవారం ఉదయం కూడా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈదునూరి బానేశ్, భాగ్య, దుర్గమ్మ, రుద్ర, నర్మదపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి రుద్ర, మరో నలుగురిని కొరికింది. ఇందులో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడినవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. పిచ్చి కుక్కల బారినుంచి తమను రక్షించాలని కాలనీవాసులతోపాటు సీపీఎం నాయకులు రామాచారి, భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, మల్లేశ్, నాగలక్ష్మి డిమాండ్ చేశారు. -
మెడికల్ రిప్ ఆత్మహత్య
● వెంటాడిన బట్టల షాపు అప్పులు ● వడ్డీలు కట్టలేక మనస్తాపం చొప్పదండి: పట్టణంలోని మసీద్ రోడ్డుకు చెందిన కటుకం శరత్చంద్ర(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్చంద్రకు దివ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్లుగా కుటుంబంతో కరీంనగర్లో కిరాయికుంటున్న శరత్ మెడికల్ రిప్గా పని చేస్తున్నాడు. శరత్ తల్లిదండ్రులు కూడా కరీంనగర్లోనే నివాసముంటున్నారు. గతంలో కరీంనగర్లోని విద్యానగర్లో బట్టల షాపు పెట్టి శరత్ నష్టపోయాడు. అప్పుల బారిన పడ్డాడు. లోన్ యాప్స్, ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా బంగారం కుదువబెట్టి అప్పులు చేశాడు. మెడికల్ రిప్గా పని చేస్తూ మిత్తీలు కూడా కట్టకపోవడంతో ప్రస్తుత సంపాదనతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పేవాడు. ఈనెల 9న డ్యూటీ మీద హుజూరాబాద్ వెళ్తున్నానని చెప్పి శరత్ వెళ్లిపోయాడు. ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా కలవకపోవడంతో బుధవారం చొప్పదండిలోని మృతుడి స్నేహితులకు శరత్ భార్య దివ్య ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని చెప్పింది. అప్పుల బాధకు మనస్తాపం చెందిన శరత్ మంగళవారం రాత్రి చొప్పదండికి చేరుకొని ఉరేసుకున్నాడు. చొప్పదండిలోని ఇంటికి వచ్చి స్నేహితులు చూసేసరికి మృతిచెంది కనిపించాడు. మృతుడి భార్యకు సమాచారమందించారు. శరత్ సూసైడ్ నోట్ రాసి చనిపోగా.. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపారు. -
ఊరు రమ్మంటోంది..
తొలి విడత పోలింగ్: ఈనెల 11(నేడే) పోలింగ్ జరిగే సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం: అదే రోజు ● సమగ్ర కుటుంబ సర్వేను మరిపించమంటోంది.. ● ఒక్క ఓటూ కీలకమే.. ● శత శాతం ఓటింగ్తోనే ప్రజాస్వామ్యం ● నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..కరీంనగర్ అర్బన్: దసరా వచ్చిందంటే.. రెక్కలు కట్టుకొని సొంతూళ్లో వాలిపోతాం. సంక్రాంతి ఇంకా నెల ఉందనగానే పుట్టిన పల్లెకు పోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తాం. బంధువులను పలకరించి.. అయినవాళ్లతో హాయిగా గడిపి మళ్లీ వెళ్లిపోతాం. మరి ఈనెల 11, 14, 17 తేదీల్లో మీమీ జన్మస్థలాల్లో గొప్ప కార్యం జరగబోతోంది. దానికి అందరూ తప్పకుండా రావాలని ఊరు పిలుస్తోంది. ఓటు తలస్తోంది. అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం. మిగతా సంబురాల్లాగానే దీనికి తప్పకుండా వచ్చి ఓటేసి సొంత గడ్డపై ఒకరోజు హాయిగా సేదదీరి వెళ్లాలని కోరుతోంది. ఓటేసి పొమ్మంటోంది. ● ఒక్క ఓటూ కీలకమే.. దేశ, రాష్ట్రంలోనే కాదు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్క ఓటు కీలకమైంది. అందుకు గత ఎన్నికలే నిదర్శనం. గంగాధర మండలం మల్లాపూర్లో కిషన్, అంజయ్య పోటీ పడగా.. ఇద్దరికి 471 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీసి అంజయ్యను సర్పంచ్గా ప్రకటించారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కల్పన, మాధవి పోటీ పడగా.. ఇద్దరికి 1,250 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడుసార్లు ఓట్లను లెక్కించినా.. అదే ఫలితం రావడంతో టాస్ వేసి కల్పనను విజేతగా ప్రకటించారు. జిల్లాలో 318 గ్రామాలకు గానూ 316 గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పావువంతు గ్రామాల్లో నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఈక్రమంలో ఒక్క ఓటూ ఫలితాన్ని మార్చనుంది. ● పలు రాష్ట్రాల్లో ఓటర్లు జిల్లాలోని చాలామంది విద్య, వ్యాపారం, ఉపాధిరీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్లి నివసిస్తున్నారు. చేనేత కార్మికులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇలా అనేక వర్గాల ప్రజలు మరోచోట ఉన్నా.. ఓటు మాత్రం సొంతూళ్లోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లోని వారు ఒకరోజు సెలవు పెట్టుకొని వస్తే ఓటేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడొచ్చు. పలకరించొచ్చు. ఉత్సవాలను ఆత్మీయుల మధ్య చేసుకొని ఓ ప్రజాస్వామ్య పండగ్గా భావించి పోలింగ్ రోజును ఘనంగా నిర్వహించుకోండి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకరా్యాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. ఒకరోజు ముందే వస్తే మంచిది. ● యాది చేసుకోండి.. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అప్పుడు బయట ఉండేవారంతా రెక్కలు కట్టుకొని వచ్చి వాలారు. అలాగే ఓటు వేడుకకూ తరలొచ్చి నచ్చిన వారికి ఓటేసి వెళ్తే ప్రజా స్వామ్య యజ్ఞంలో పాలుపంచుకున్న తృప్తి ఉంటుంది. నాకెందుకులే అనుకోవద్దు. నీ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించొచ్చు. కీలకంగా మా రొచ్చు. మీరు ఎన్నుకున్న వ్యక్తి వల్ల ఊరు బాగు ప డిందంటే అభివద్ధిలో మీ భాగస్వామ్యం ఉన్నట్టేగా. ● ప్రలోభాలకు లొంగొద్దు ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టాయి. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి బూత్ కమిటీలతో ఆరా తీసి ఇప్పటికే ఫోన్లు చేశారు. దారి ఖర్చులతోపాటు ఇతర ఖర్చులను భరిస్తామని ప్రలోభపెడుతున్నారని సమాచారం. పోలింగ్ తేదీన రప్పించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరి మాటలూ నమ్మకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి. విద్యార్థులు: ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కర్నాటక, పంజాబ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు: బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరువనంతపురం, ముంబయి, ఢిల్లీ చేనేతలు: సూరత్, భీవండి, అహ్మదాబాద్, ముంబయి ఉద్యోగులు: కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వ్యాపారులు: హైదరాబాద్తోపాటు అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కార్మికులు: ముంబయి, హైదరాబాద్ -
అప్పుడు నో.. ఇప్పుడు సై..
● 2019లో ఎన్నికలను బహిష్కరించిన గొల్లపల్లి గ్రామస్తులు ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామ ఓట్లు తమ గ్రామం నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలో కలవడాన్ని నిరసిస్తూ.. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను గొల్లపల్లి గ్రామస్తులు బహిష్కరించారు. అదే సంవత్సరం మూడు నెలల తర్వాత మళ్లీ గొల్లపల్లి గ్రామానికి రీనోటిఫికేషన్ వేశారు. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు అభ్యర్థులు వేశారు. తీరా ఓటర్ లిస్టు పరిశీలించగా.. తమ గ్రామం నుంచి విడిపోయిన 148 ఓట్లు కలవకపోవడంతో మళ్లీ బహిష్కరించారు. గ్రామ పరిపాలన అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్చార్జి అధికారులే నిర్వహిస్తూ వచ్చారు. సంవత్సర క్రితం జరిగిన రీసర్వేలో తమ గ్రామ ఓట్లు 150, సరిహద్దులు తమ గ్రామంలో మళ్లీ కలవడంతో.. ఆరేళ్ల అనంతరం తిరిగి ఈసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొంటున్నారు. గ్రామంలో 620 ఓటర్లున్నారు. 8 వార్డులుండగా.. మూడు, నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. రడం లక్ష్మి, కడగండ్ల శిరీష పోటీ చేస్తున్నారు. శిరీష అంగన్వాడీ ఆయా పోస్టుకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలబడ్డారు. -
ఆర్టీసీకి ‘లక్ష్మీ’ కటాక్షం
కరీంనగర్టౌన్: సరిగా రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న తెలంగాణలో మహాలక్ష్మీ పథకం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం సక్సెస్ కావడం విశేషం. పథకంలో భాగంగా పల్లె నుంచి పట్నం వరకు మహిళలు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడం విశేషం. తెలంగాణలో ఆర్టీసీ ఆర్థికానికి వెన్నుదన్నుగా నిలిచిన కరీంనగర్ రీజియన్ పరిధిలో మహిళలు ఉత్సాహంగా రాకపోకలు సాగించారు. రెండేళ్లలో సుమారు 22 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రోజూ 3,00,822 లక్షల మంది.. కరీంనగర్ రీజీయన్ పరిధిలో మొత్తం 11 డిపోలున్నాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు 21.96 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. రోజూ సగటున 3,00,822 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. కరీంనగర్ రీజియన్లో రెండేళ్లలో రూ.895.83 కోట్ల ఆదా చేసుకున్నారు. అత్యధికంగా గోదావరిఖని డిపో పరిధిలో రూ.3.35 కోట్లు, అత్యల్పంగా మంథనిలో 1.60 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. మహాలక్ష్మీ పథకంలో రెండేళ్లలో 21.96 కోట్ల మంది మహిళల ప్రయాణం కరీంనగర్ రీజియన్కు రూ.895.83 కోట్ల ఆదాయం కరీంనగర్ రీజియన్ పరిధిలో రెండేళ్ల మహాలక్ష్మీ ఆదాయం డిపో మహాలక్ష్మీ రూ. కోట్లలో ప్రయాణికులు (కోట్లలో) గోదావరిఖని 3.35 130.37 హుస్నాబాద్ 1.53 53.50 హుజూరాబాద్ 1.69 70.14 జగిత్యాల 2.89 112.53 కరీంనగర్–1 2.15 76.31 కరీంనగర్–2 2.13 112.73 కోరుట్ల 1.89 70.52 మంథని 1.06 57.87 మెట్పల్లి 1.78 72.26 సిరిసిల్ల 1.66 71.15 వేములవాడ 1.82 68.45 మొత్తం 21.96 895.83 -
పెరిగిన పత్తి ధర
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి ధర రూ.7,300 పలుకగా.. మంగళవారం రూ.7,450పలికింది. మార్కెట్కు 47వాహనాల్లో 447 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.7,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు, నూతన డీటీఆ ర్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వ లపార్కు ఫీడర్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిమార్ట్, శ్రద్ధ ఇన్ హోటల్, అల్కాపురికాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
‘స్నేహిత’తో ఆత్మస్థైర్యం
జమ్మికుంట: స్నేహితతో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని డీఎంహెచ్వో వెంకటరమణ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వావిలాల పీహెచ్సీ డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో మంగళవారం స్నేహిత కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గుడ్, బ్యాడ్ టచ్, పోక్సో, వివిధ చట్టాలు, హక్కులను గురించి డీఎంహెచ్వో వివరించారు. బాలికల భద్రతపై పోలీసులు, ప్రభుత్వమే కాకుండా తల్లితండ్రులు, విద్యావ్యవస్థ సమానంగా బా ధ్యత తీసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో చందు, ఎంఈవో హేమలత, సీడీపీవో సు గుణ, హెచ్ఎం సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం వావిలాల పీహెచ్సీని తనిఖీ చేశారు. విద్యానగర్(కరీంనగర్): తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో కరీంనగర్–1 డిపో నుంచి ఈనెల 14న బీదర్ జిల్లా నరసింహాస్వామి, బీదర్ పోర్ట్, జరాసంగం, రేజింత్కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఐ.విజయ మాధురి తెలి పారు. ఈ బస్సు 14వ తేదీ ఆదివారం ఉద యం 3.30 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయల్దేరి దర్శనాల అనంతరం తిరిగి అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు రూ.1400, పిల్లలకు రూ.1,080 టికెట్ ఉంటుందని, వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కరీంనగర్క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల ఆదేశాల ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 21న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ న్యాయమూర్తి రాణి తెలిపారు. ఈ లోక్అదాలత్లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. వీటిలో ఫ్యామిలీ కేసులు, మోటార్ ప్రమాద, చెక్బౌన్స్, బ్యాంక్, ఫైనాన్స్ కేసులతో పాటు కోర్టుకు రాని కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ అర్బన్: రాష్ట్ర నీటిపారుదల శాఖ అడహక్ కమిటీ కన్వీనర్గా టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు ని యామకమయ్యారు. ఈ క్రమంలో టీఎన్జీవో జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్ష్మ ణ్రావును ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు చేపట్టే నాయకులుగా ఎదగడం టీఎన్జీవో సంఘానికి గర్వకారణం అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గతంలో ఇరిగేష న్శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా చూపిన నాయకత్వం స్థానంలో లక్ష్మణరావుకు అవకాశం దక్కడం జిల్లాకు ప్రత్యేక గౌరవమని కొనియాడారు. జమ్మికుంట: జమ్మికుంటలోని వీణవంక రోడ్డులో ఏర్పాటుచేసిన వైన్స్ను ఎత్తి వేయాలని స్థానిక మహిళలు, పలు పార్టీల నాయకులు మంగళవారం ధర్నా చేశారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న రోడ్డులో వైన్స్ నిర్వహణతో విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడతున్నారని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై నాగారాజు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. -
అండర్– 19 వైస్ కెప్టెన్గా శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్ మహిళల అండర్– 19 క్రికెట్ జట్టుకు కరీంనగర్కు చెందిన కట్ట శ్రీ వల్లీ వైస్ కెప్టెన్గా ఎంపికై ంది. ఫాస్ట్ బౌలర్గా రాణిస్తున్న శ్రీవల్లీ గతంలో అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. తాజాగా హెచ్సీఏ అండర్ 19 జట్టును ప్రకటించగా శ్రీవల్లీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి నుంచి లక్నో వేదికగా బీసీసీఐ అండర్–19 ఉమెన్ వన్డే ట్రోపీ జరుగనుంది. శ్రీవల్లి ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమా లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బాగోగులు చూసుకోవడం లేదని ఫిర్యాదుచొప్పదండి: పట్టణానికి చెందిన వృద్ధురాలి బాగోగులు పెద్ద కుమారుడు చూసుకోవడం లేదని ఆర్డీవో కార్యాలయంలో, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తల్లితండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను అనుభవిస్తూ, రెండు నెలలుగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని పెద్ద కుమారుడు పట్టించుకోవడం లేదని, తల్లితండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తిరిగి తల్లికి స్వాధీనం చేయాలని బాధితురాలి తరుఫున ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తామానకొండూర్ రూరల్: మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్–వరంగల్ రహదారిపై కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నర్సంపేట జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందినవారు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మానకొండూర్ శివారు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రాగా.. తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముత్యాల కవిత, పెండ్లి యాదమ్మ, పెండ్లి నీల, పెండ్లి లక్ష్మి, పెండ్లి సుధాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్లో దేహదాతకు నివాళి అర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి(92) ఈనెల 6న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు శ్యాంసుందర్రెడ్డి తనతండ్రి పార్ధివదేహాన్ని సిమ్స్కు దానంచేశారు. ఆయన మనుమరాలు వర్ష, మనుమడు వర్షిత్కు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.అనాటమీ విభాగం హెచ్వోడీ డాక్టర్ శశికాంత్ కిరాగి,డాక్టర్ కల్పన ఉన్నారు. -
రిజిస్టర్లు చిరుగుతున్నాయని..
కరీంనగర్ కార్పొరేషన్: దశాబ్దాల తరువాత నల్లాల కనెక్షన్లను ప్రక్షాళన చేసేందుకు నగరంలో నగరపాలకసంస్థ చేపట్టిన సర్వేలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. డిజిటలైజేషన్కు ముందటి వివరాల సేకరణ, నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో దశాబ్దాల నాటి పాత రిజిస్టర్లు తీస్తుంటే, అవి చిరిగిపోతుండడంతో అతిపెద్ద సమస్యగా మారింది. చిరుగుతున్న రిజిస్టర్లను స్కానింగ్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొనసాగుతున్న సర్వే నల్లాల కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా నగరపాలకసంస్థ నల్లాలపై సర్వే చేపట్టింది. నల్లాకనెక్షన్ తీసుకున్నారా లేదా, బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నారా, గృహావసరాలకు తీసుకొని వాణిజ్య అవసరాలకు వాడుతున్నారా అనేదానిపై ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వే అనంతరం గుర్తించిన కనెక్షన్లకు నోటీసులు జారీచేస్తున్నారు. నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తున్నారు. కమర్షియల్ అయితే డొమెస్టిక్ నుంచి కన్వర్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ గృహావసరాల పేరిట కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించి, నోటీసులు ఇచ్చారు. ఆ హాస్పిటల్స్ నల్లాలను కమర్షియల్కు కన్వర్ట్ చేశారు. కన్వర్షన్ చార్జీలుగా రూ.38 వేల చొప్పున వసూలు చేశారు. ఇప్పటివరకు రెండు అపార్ట్మెంట్లు కూడా సాధారణ డిపాజిట్ కింద తీసుకున్నట్లు గుర్తించి, రూ.లక్ష కన్వర్షన్ చార్జీలు వసూలుచేశారు. వినియోగదారుల గగ్గోలు సర్వే సందర్భంగా తేలిన అంశాలకు అనుగుణంగా వినియోగదారులకు నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నల్లా బిల్లులు ఏళ్లుగా బకాయిలు ఉన్నవాళ్లు, డొమెస్టిక్ తీసుకొని కమర్షియల్ వాడుతున్న వాళ్లు తదితరులు ఉన్నారు. తాము బిల్లులు సంవత్సరాల నుంచి చెల్లిస్తూ వస్తున్నా, బకాయిలు చూపించడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరపాలకసంస్థ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాము చెల్లించిన రశీదులు కూడా పట్టుకొని వస్తున్నారు. ఆన్లైన్లో బిల్లులు చెల్లించిన వివరాలు చూపకపోవడం, కనెక్షన్ వివరాలు ఆన్లైన్లో లేకపోవడంతో సమస్యలు తీవ్రమవుతూ వచ్చాయి. రిజిస్టర్ల స్కానింగ్ నగరపాలకసంస్థలో 2020 నుంచి నల్లా కనెక్షన్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయి. దాదాపు 1990నుంచి నల్లా కనెక్షన్ల వివరాలు మాన్యువల్గా ఉన్నాయి. దాదాపు 42 వేల నల్లా కనెక్షన్ల వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారు. ఇప్పుడు వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సర్వేలో తేలిన అంశాల ఆధారంగా వివరాలు చూసేందుకు రిజిస్టర్లు తీయాల్సి వస్తోంది. రిజిస్టర్లు దశాబ్దాల క్రితంనాటివి కావడం, కనీసం తీసి కూడా చూసిన దాఖలాలులేకపోవడంతో అవి కాస్తా చిరుగుతున్నాయి. దీంతో నల్లా వివరాలు పూర్తిగా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందుకు విరుగుడుగా రిజిస్టర్లలోని నల్లా కనెక్షన్ వివరాలను తాజాగా అధికారులు స్కాన్ చేస్తున్నారు. స్కాన్చేయడం ద్వారా ఆ వివరాలను కూడా డిజిటల్లో సంక్షిప్తం చేస్తున్నారు. 27 పాత రిజిస్టర్లను స్కానింగ్ చేస్తున్నారు. నల్లాల కనెక్షన్ల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు అధికారులు చేస్తున్న కసరత్తు గాడినపడుతోంది. -
పంచింగ్ స్టార్ట్
జిల్లా మొదటి ఏకగ్రీవం ఎన్నికలు కరీంనగర్ 92 03 89 పెద్దపల్లి 99 04 95 సిరిసిల్ల 76 09 67 జగిత్యాల 122 04 118 మొత్తం 389 20 369సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు రసవత్తరస్థాయికి చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. మైకులు బంద్ కావడంతో నిన్న మొన్నటి వరకు హోరెత్తిన ప్రచారం మూగబోయింది. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 389 గ్రామాల్లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 369గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా కొన్ని గ్రామాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు వెనకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు. తొలి విడతలో 369 జీపీలకు ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 369 పంచాయితీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావతుల్లో ముంచెత్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్లకు వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతుదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం. కొరవడిన నిఘా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తెరవెనక పంపిణీని పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.మూడుదశల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. మహిళా సంఘాల వారీగా డబ్బులు, చీరలు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్కు ఒక రోజే గడువు ఉండడంతో ప్రలోభాల పర్వం కీలక దశకు చేరుకుంది. ఇంటింటికీ డబ్బులు పంచుతూ... మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో అందుబాటులో లేని వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. -
రెండోసారి..
సైదాపూర్(హూజూరాబాద్): ఆరెపల్లి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గ్రామస్తులు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి తీర్మానించుకున్నారు. ఆరెపల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళ కాగా.. లొల్లేటి కల్యాణి, వర్నె లావణ్య, వెంగళ కోమల పోటీ పడ్డారు. ఏకగ్రీవానికి గ్రామంలో తీర్మానించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా వర్నె లావణ్య ఒక్కరే నామినేషన్ వేశారు. 5వ వార్డు సభ్యుడు వెంగళ రవిని ఉప సర్పంచ్గా గ్రామంలో తీర్మానించుకున్నారు. 1వ వార్డుకు ఆవునూరి సుజాత, 2వ వార్డుకు లొల్లేటి కల్యాణి, 3వ వార్డుకు వెంగళ కుమార్, 4వ వార్డుకు గుంటి అయిలయ్య, 6వ వార్డుకు మొగిలి లచ్చమ్మ, 7వ వార్డుకు గోంగూల మల్లేశ్వరి, 8వ వార్డుకు వర్నె సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రాములపల్లి సర్పంచ్గా లక్ష్మీనారాయణ
పెగడపల్లి: మండలంలోని రాములపల్లి సర్పంచ్గా అమిరిశెట్టి లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వ్ కావడంతో నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం ఉపసంహరించుకోవడంతో లక్ష్మీనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. పెగడపల్లి: మండలంలోని రాజరాంపల్లి సర్పంచ్గా ఇస్లావత్ రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థా నం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అ యింది. ఇద్దరు నామినేషన్ వేయగా.. తిరుపతినాయక్ తన నామినేషన్ ఉప సంహరించకున్నారు. దీంతో రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. -
పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’
పంచాయతీ ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఇంటింటి ప్రచారంతో అలసి, సొలసిన మద్దతుదారులకు, పార్టీ కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ చీప్ లిక్కర్, బాంద్రి, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మందు విక్రయాలు బాగా పెరిగి పల్లెలు మత్తులో జోగుతున్నాయి. పోలీసు యంత్రాంగం దాడులతో ‘బెల్టు’ షాపులకు తాళాలు పడగా, గతంలో ఎన్నడూ లేనంతగా బెల్టుషాపులను నియంత్రించారు. కానీ, దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలతో, పార్టీ గుర్తులతో, బీ–ఫామ్లతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. పార్టీల రంగులు, జెండాలు పల్లె పొలిమెరల్లోనే రెపరెపలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పల్లెలను ‘పంచభూతాలు’ ఆవహించాయి. ఎన్నికలను అవి శాసిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే శక్తిని ప్రదర్శిస్తున్నాయి. హామీలను ఎరగా వేసి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయి లాభసాటి వ్యాపారంలా పరిణమించాయి. ఎంత వెచ్చించాం, ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలువాలనేది అభ్యర్థుల లక్ష్యంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు అసలు కార్యానికి తెరలేపారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 పంపిణీ చేసేందుకు డబ్బు సంచులను సిద్ధం చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కులసంఘాల పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అనేక మంది ఎన్నికల్లో ఉండడంతో డబ్బుకు వెనకాడకుండా వెదజల్లుతున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు.పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎజెండాలు ఏమీ లేకుండా సొంత ఎజెండాలతో అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఊరిలో సొంత ఖర్చులతో ఫ్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఉచితంగా మంచినీరు అందిస్తామని, ఊరిలో ఆడపిల్ల పుడితే.. రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్, ఊరందరికీ డిష్ బిల్లు లేకుండా ఫ్రీగా టీవీ కనెక్షన్లు, పల్లె దవాఖానా నిర్మిస్తామని, ఇంటింటికీ సీసీ రోడ్డు వేస్తామని సొంత ఎజెండాలతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ‘మీ సామాజిక వర్గానికి భవనాలను కట్టిస్తాం’ అని రకరకాల హామీలిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు యథాశక్తిగా ప్రయత్నిస్తున్నారు.అనుకూలంగా, అందుబాటులో ఉండే అనుయాయులకు సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టు ఇప్పించి కాసులు దోచిపెడుతామంటూ నేతలు హామీలిస్తున్నారు. ఊరిలో ఏం చేయాలన్నా పంచాయతీ తీర్మానాలు ఇస్తామని చెబుతున్నారు. ‘గెలిస్తే చాటుగా మీ అందరికి నేనున్నా’ అంటూ అనుచరులకు నమ్మబలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికప్పుడు సెల్ఫోన్లు కొనిస్తూ, ద్విచక్ర వాహనాలు సమకూర్చుతూ ఎన్నికల ప్రచారానికి యువతరాన్ని వినియోగించుకుంటున్నారు. ‘నేను గెలిస్తే భవిష్యత్ ఉంటుందంటూ ఆశలురేపుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు హామీలతో ఎన్నికల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ పంచభూతాలు ఎన్నికల్ని ఆవహించి ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివిధ రకాల కుల సంఘాలు, వృత్తిసంఘాలు, యువజన సంఘాలకు గాలమేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు ఇస్తూ, యువజన సంఘాలు కట్టిస్తామని, ఓపెన్జిమ్లు నిర్మిస్తామని, కోతులను తరిమేస్తామని, సామాజిక భద్రత కల్పిస్తామని హామీలిస్తున్నారు. యువకులను గోవా లాంటి ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇలా పల్లెల్లో సెల్ఫోన్ మెస్సేజ్లు చేస్తున్నారు. ‘చెప్పిన పనులు చేయకుంటే చెప్పులు మెడలో వేసుకుంటాం, గాడిదమీద ఊరేగించండి’ అని బాండు పేపర్లు రాసిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఆవహించిన ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు.. పైఎత్తులు సొంత ఎజెండా.. అభివృద్ధికి హామీలు.. బాండు పేపర్లు గ్రామాల్లో పట్టు కోసం నేతల ప్రయత్నాలు -
తొలి విడతకు సిద్ధం
కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని కలెక్టర్తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ జిల్లా పరిస్థితిని వివరించారు. మొదటి విడత ఎన్నికలకు పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, 5 మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలకు గానూ మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరిపడా భద్రత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్ఆలం తెలిపారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. సైలెన్స్ పీరియడ్లో ప్రజలు గుంపులుగా చేరరాదని స్పష్టం చేశారు. ఏదేని ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఆదేశించారు. ‘ఓటే భవితకు బాట’ ఆడియో సీడీ ఆవిష్కరణ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కంసాని ఉదయ, ప్రకృతి ప్రకాష్ నిర్మించిన ‘ఓటే భవితకు బాట’ ఆడియో సీడీని కలెక్టర్ పమేలా సత్పతి మంగవారం ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆవిష్కరించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. పాటలను రచించిన తెలంగాణ సాంస్కృతి సారధి పాటల రచయిత ప్రకృతి ప్రకాష్, ఆలపించిన కంసాని ఉదయను అభినందించారు. -
డంప్యార్డ్లో భారీగా మంటలు˘
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డంప్యార్డ్లో మంటలు చెలరేగాయి. భారీగా చెత్త కుప్పలు తగలబడడం, గంటల పాటు మంటలు కొనసాగడంతో పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన మంటలు రాత్రి 9గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిసారి డంప్యార్డ్ మధ్యలో, పక్కన చెత్త కుప్పల్లో మంటలు చెలరేగేవి. ఈ సారి డంప్యార్డ్లోని మెయిన్గేట్ వద్ద చెత్తకుప్పలు తగలబడడం గమనార్హం. అదికూడా గతంలో ఎప్పుడూలేని స్థాయిలో భారీగా మంటలు చెలరేగడంతో, ఆటోనగర్, అలకాపురికాలనీ, కోతిరాంపూర్, కట్టరాంపూర్తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి నగరపాలకసంస్థ అధికారులు డంప్యార్డ్కు వెళ్లి, ఫైరింజన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. -
స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్ మంచిర్యాలలో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తున్న అలివేలు అనే మహిళతో నరేశ్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నరేశ్ మంగళవారం సాయంత్రం గ్రామానికి రాగా.. కొద్దిసేపటికి సదరు మహిళ కూడా చేరుకుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆవేశంలో నరేశ్ ఆ మహిళను రోకలిబండతో తలపై మోదాడు. అనంతరం కత్తితో మెడకోసి పారిపోయాడు. నరేశ్ గతంలో మంచిర్యాల ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి బంగారం దోచుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నరేశ్ నేర ప్రవృత్తి తెలిసి భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారని సమాచారం. ఆ హత్యలో సహకరించిన అలివేలుతో అప్పటినుంచే నరేశ్ సహజీవనం చేస్తున్నాడని సమాచారం. హత్య విషయం తెలుసుకున్న సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కరీంనగర్క్రైం: కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని వివరాలు తెలిస్తే టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సూచించారు. రాయికల్: రాయికల్కు చెందిన తాటిపాముల దేవక్క (82) మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. దేవక్క కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పైగా మానసిక స్థితి సరిగా లేదు. మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు దేవక్కకోసం గాలిస్తుండగా.. ఇంటి సమీపంలోని బావిలో శవమై తేలింది. దేవక్క కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్మపురి: మానసికంగా బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మేడిశెట్టి తిరుపతి (35)కి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యులను సంప్రదించి మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఊరుచివర డంపింగ్యార్డులో ఉరేసుకున్నాడు. తిరుపతికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి లక్ష్మి (45) అనారోగ్యం బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు.. లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, భర్త ముత్యం సెస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మి గతంలో అనారోగ్యానికి గురికాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా నయం కాలేదు. మంగళవారం ముత్యం అనారోగ్యంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లగా, ఇంట్లో లక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మనస్తాపంతో ఒకరు.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): నేరెళ్ల గ్రామంలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. నేరెళ్లకు చెందిన అంజయ్య–మణేమ్మ కూతురు దీటి రజిత (31) ఐదురోజుల క్రితం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం నుంచి పుట్టింటికి వచ్చింది. ఆమె భర్త సంతోష్ మూడెళ్లక్రితం అనారోగ్యంతో మరణించగా అప్పటి నుంచి మనోవేదనకు గురవుతోంది. ఇటీవల ఆమెకు అనారోగ్య, ఆర్థిక సమస్యలు రావడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఉదయం తల్లిగారి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. -
టార్గెట్.. 100శాతం పోలింగ్
కరీంనగర్ అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటర్ల నిర్ణయమే అంతిమం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం (సీఈసీ) అవగాహన కల్పిస్తోంది. ఓటరు చైతన్యమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో తక్కువశాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూనే అన్ని గ్రామాల్లో సాంస్కృతిక సారథి కళాకారులను ప్రచారం చేయాలని ఆదేశించింది. డీపీఆర్వో లక్ష్మణ్ పర్యవేక్షణలో 30 మంది కళాకారులుండగా రెండు బృందాలుగా విభజించారు. ఝాన్సీ, వడ్లకొండ అనిల్ ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తుండగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా షెడ్యూల్ ప్రకారం ప్రచారానికి పదును పెట్టారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా పాటలతో చైతన్యం కల్పిస్తున్నారు. ఎన్నికల్లో బెదిరింపులకు గురిచేసినా, ప్రలోభపెట్టినా ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలి వంటి అంశాలను వివరిస్తున్నారు. ప్రతి రోజు నిర్దేశిత గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా రోజువారీ కార్యక్రమాల వివరాలను ఫొటోలు తీసి డీపీఆర్వోకు చేరవేస్తున్నారు. -
17న హౌసింగ్బోర్డు స్థలాల వేలం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని హౌసింగ్బోర్డు స్థలాలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన నగరంలోని హౌసింగ్బోర్డుకాలనీలో ఉన్న రెండు స్థలాలను కూడా వేలం వేస్తున్నారు. కాలనీలోని రోడ్ నంబర్ 1లోని 4,235 చదరపు గజాల కమర్షియల్ స్థలంతో పాటు, బైపాస్ ప్రక్కనున్న మరో స్థలాన్ని (గతంలో పోస్టాఫీస్కు కేటాయించిన) వేలం వేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల మధ్య ఈ–యాక్షన్ ద్వారా విక్రయిస్తున్నట్లు ఆయా స్థలాల వద్ద హౌసింగ్బోర్డు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాలనీ అవసరాలకే వదిలేయాలి హౌసింగ్బోర్డుకాలనీలోని రెండు స్థలాలను వేలం వేయాలని హౌసింగ్బోర్డు విభాగం తీసుకున్న నిర్ణయంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలనీ ఏర్పాటు చేసినప్పుడు లేఅవుట్ ప్రకారం ఆయా స్థలాలను నిర్ణీత అవసరాలకు కేటాయించి, వదిలేశారన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆ స్థలాలను వేలం వేస్తుండడం సరికాదని, ఆ స్థలాలు కాలనీ అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగుతుందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 డిస్కం కార్యదర్శి సల్వాజి వేంకటరమణారావు తెలిపారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం టీఈఈయూ 1104 కరీంనగర్ టౌన్, రూరల్, సిటీ సర్కిల్ డివిజన్ల సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ప్రాంతీయ అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్ రావు, రంగు వెంకటనారాయణ, ప్రాంతీయ కార్య నిర్వహక అధ్యక్షుడు రాములు, అదనపు కార్యదర్శి నర్సింగ రావు, జగిత్యాల ప్రాంతీయ అధ్యక్షుడు చేరాలు, జిల్లా, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా డి.దేవరాజ్, మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జయకుమార్, అదనపు కార్యదర్శిగా బాపురెడ్డి, కరీంనగర్ రూరల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా కె.శ్రీనివాస్, ఎస్,రవీందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా శంకర్. అదనపు కార్యదర్శిగా ఆర్.తిరుపతి, సిటీ సర్కిల్ అధ్యక్ష, కార్యదర్శులుగా శంషోద్దీన్, కె.శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా సాంబమూర్తి, అదనపు కార్యదర్శిగా చంద్రశేఖర్ను ఎన్నుకున్నారు. ఇన్చార్జి డీఈవోగా అశ్వినీ తానాజీ వాకడేసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లా ఇన్చార్జి డీఈవోగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను నియమిస్తూ సోమవారం విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశా రు. ఎఫ్ఏసీ హోదాలో జిల్లా విద్యాశాఖ అధికా రిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగరంలో నేడు పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ల పునర్మిర్మాణ పనులు కొనసాగుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్డి ఫంక్షన్హాల్, తేజ స్కూల్, ఎస్ఆర్ జూనియర్ కళాశాల, సరస్వతీనగర్, వడ్లకాల నీ, చంద్రాపురికాలనీ, రెవెన్యూ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హనుమాన్నగర్, అమ్మగుడి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1,రూరల్ ఏడీఈలు పంజాల శ్రీని వాస్గౌడ్, గాదం రఘు, తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.రాంనగర్, గీతాభవన్ ఫీడర్ల పరిధిలోని మార్క్ఫెడ్, పారమిత స్కూల్, పద్మనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య పేర్కొన్నారు. జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,300 పలికింది. సోమవారం మార్కెట్కు 68 వాహనాల్లో 546 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న, ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
‘కిక్కు’లో పల్లెలు
పొలం పనులకు వెళ్లకముందే తమ అనుచరులతో కలిసి పొద్దున్నే ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లకు టీలు, టిఫిన్లు అందిస్తున్నారు. దూరప్రాంతంలోని వారిని మధ్యాహ్నం ఫోన్లో సంప్రదిస్తున్నారు. పొలం పనులు ముగించుకొని వచ్చాక సాయంత్రం మరోసారి కలుస్తున్నారు. రోజంతా తమతో తిరిగిన అనుచురులకు చీకటిపడగానే క్వార్టర్ బాటిల్ అప్పగిస్తున్నారు. రోజుకో కులసంఘం పెద్దతో దావత్ ఏర్పాటు చేయించి చల్లబరుస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిననాటి నుంచి మద్యం ఏరులైపారుతుండడంతో పల్లెలు మద్యం కిక్కులో తూలుతున్నాయి. రోజూ చీఫ్ లిక్కర్ తాగేవాళ్లు కూడా ఎన్నికల సందర్భంగా బ్రాండ్ మార్చుతున్నారు. అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతోంది.సాక్షి పెద్దపల్లి: పల్లెల్లో ఎక్కడచూసినా ఓట్ల పండుగ సందడి చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జిల్లాలో బెల్ట్షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న పల్లె, పట్నం అనే తేడా లేకుండా బెల్ట్షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే బెల్ట్షాపులపై ఉక్కుపాదం మోపుతారు. కానీ, కోడ్ అమలులోకి వచ్చి పదిరోజులు గడిచినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతకు కాటన్ల కొద్దీ బీర్లు, వృద్ధులు, పెద్దమనుషులకు మండువాల్లో తెల్లకల్లు పంపిణీ చేస్తున్నారు. రాత్రివేళ కులసంఘాల పెద్దలతో దావత్లు జోరుగా సాగిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు.. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కన్నా ప్రలోభాలకే ఆసక్తి చూపుతున్నారు. ప్రచారానికి ఖర్చు చేయడంకన్నా ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ఎంతవరకై నా వెనుకాడడంలేదు. గతంలో ఎన్నికలకు ఒకరోజు ముందు క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ లిక్కర్ను ఓటర్ల ఇళ్లకు పంపించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఊరురా మందు పార్టీలు మొదలయ్యాయి. ఎలగైనా గెలవాలనే కసితో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా లిక్కర్ కొనుగోలుచేసి పంచుతున్నారు. దీనికితోడు ప్రచారంలో పాల్గొన్న వారందరికీ చుక్క, ముక్కతో విదులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం పంపిణీకి గ్రామంలోని బెల్ట్షాపుల వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరికొందరు నేరుగా వైన్స్ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసి లిక్కర్ను తమ అనుచరుల వద్ద స్టాక్ పెట్టించి రాత్రిపూట పంపిణీ చేయిస్తున్నారు. బహిరంగంగానే తరలింపు రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్చేసే అధికార యంత్రాంగం.. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతున్నా.. ఎందుకు ఫోకస్ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిమితంగానే మద్యం తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తూ 24గంటలు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. అయినా.. అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏడు బృందాల నిఘా !
సిరిసిల్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగిసిపోనుండగా ఎన్నికలు డిసెంబరు 11న జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో ఎన్నికలపై అధికారులు నిఘా పటిష్టం చేశారు. ఏడు విభాగాలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నారు. ఫ్ల్లయింగ్ స్క్వాడ్ మండల కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం(ఎఫ్ఎస్టీ) ఉంటుంది. ఎన్నికలు ముగిసే వరకు ఈ బృందం గ్రామాల్లో సంచరిస్తుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు స్పందించి క్షేత్రస్థాయికి చేరుకోవాల్సి ఉంటుంది. బెదిరింపులు, మద్యం, డబ్బుల పంపిణీ ఫిర్యాదులపై స్పందిస్తుంది. ఎన్నికల ఖర్చుపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటుంది. బహిరంగ సభలు, ర్యాలీలను చిత్రీకరిస్తుంది. మద్యం, డబ్బు పంపిణీపై సాక్షుల సమక్షంలో జప్తు చేస్తుంది. రూ.50వేలకు మించి నగదును ఎవరూ కలిగి ఉన్న సీజ్ చేస్తుంది. అభ్యర్థి పార్టీ కార్యకర్తగా భావిస్తే ఎఫ్ఐఆర్ నమోదును సిఫార్సు చేస్తుంది. సాధారణ వ్యక్తులు రూ.50వేలకు మించి ఉంటే ఆ డబ్బుకు ఆధారాలుంటే వదిలేస్తుంది. లేకుంటే సీజ్ చేసి రశీదు అందిస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా డీటీవో వద్ద జమచేస్తుంది. ఎవరైనా నగదు రూ.10లక్షలు కలిగి ఉంటే ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తుంది. స్టాటిక్ సర్వేలెన్స్ టీం(ఎస్ఎస్టీ) జిల్లా సరిహద్దుల్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీం(ఎస్ఎస్టీ) చెక్పోస్టులను పర్యవేక్షిస్తుంది. అక్రమ మద్యం, పెద్దమొత్తంలో డబ్బు, ఆయుధాల రవా ణాపై చర్యలు తీసుకుంటుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వాహనాలు, డబ్బు, మద్యం పట్టుబడితే వీడియో తీయించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఎస్ఎస్టీ బృందం ఎన్నికల కమిషన్ ద్వారా నియమితమవుతుంది. మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వీడియోగ్రాఫర్ ద్వారా ఎస్ఎస్టీ పనిచేయాలి. వీడియో సర్వేలెన్స్ టీం(వీఎస్టీ) వీడియో సర్వేలెన్స్ టీం(వీఎస్టీ) మండల కేంద్రాల్లో ఉంటుంది. ఎన్నికల ఖర్చు, వివిధ సందర్భాల్లో వీడియో చిత్రీకరిస్తుంది. వీడియో రికార్డు చేసేటప్పుడు వాయిస్ మోడ్లో టైటిల్ స్థలం, పార్టీ పేరు, ప్రచారం నిర్వహించే అభ్యర్థి పేరు వీడియో రికార్డు చేయాలి. సమావేశాలు, సభలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పోస్టర్ సైజులు, బ్యానర్లు, లౌడ్స్పీకర్లు వీడియో రికార్డు చేస్తారు. వాహన డ్రైవర్ల స్టేట్మెంట్ నమోదు చేయాలి. వీడియో వ్యూయింగ్ టీం(వీవీటీ) మండల కేంద్రాల్లో వీడీయో వ్యూయింగ్ టీం(వీవీటీ) ఉంటుంది. ఎన్నికల ఖర్చుపై రోజువారీ వీడియోలను, సీడీలను ఈ టీమ్ చూస్తుంది. వీఎస్టీ సమర్పించిన సీడీలను, వీడీయోలను, మెమొరీకార్డులను బయటి ఏజెన్సీలకు ఇవ్వకూడదు. ఎన్నికల ఖర్చుపై నివేదికను ఏ రోజుకారోజు ఏఈవోకు సమర్పించాలి. వీవీటీ సమర్పించే రిపోర్టులో వాహనం నంబర్లు, వేదిక, కుర్చీల సంఖ్య, బ్యానర్సైజు, సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని ఎన్నికల పరిశీలకులకు అందించాలి. ఎన్నికల్లో అభ్యర్థి చేసే ఖర్చుకు సంబంధించి హెచ్చుతగ్గులున్నట్లు భావిస్తే వీవీటీ బృందం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 24 గంటల్లో రాతపూర్వకంగా అందించాలి. సమగ్ర సాక్ష్యాధారాలతో అందించాల్సి ఉంటుంది. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) జిల్లా స్థాయిలో ఉంటుంది. ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వచ్చే అభ్యర్థుల ప్రచారాల క్లిప్పింగ్స్ను ఎంసీఎంసీ కమిటీ సేకరించాలి. వీటిని అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా నమోదు చేయాలి. పత్రికలకు, టీవీలకు ఇచ్చే ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరి. ఎన్నికల్లో అభ్యర్థుల పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేసే ప్రచురణకర్త పేరు, ప్రతులసంఖ్య స్పష్టంగా ఉండాలి. లేకుంటే అభ్యర్థికి నోటీసు ఇవ్వాలి. ఎంసీఎంసీ కమిటీ పెయిడ్ న్యూస్ను గుర్తించి నివేదిక సమర్పిస్తుంది. అకౌంటింగ్ టీం(ఏటీ) ప్రతీ మండల కేంద్రంలో ఏఈవో సహాయకులు ఉంటారు. షాడో అబ్జర్వేషన్ విధిగా ఎన్నికల లెక్కలను నమోదు చేస్తుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు మూడుసార్లు లెక్కలు సమర్పించాలి. షాడో బృందాలు అభ్యర్థులు సమర్పించిన లెక్కలతో సరి పోల్చుతారు. హెచ్చుతగ్గులుంటే నోటీసులిస్తారు. అభ్యర్థులు నామినేషన్ నుంచి ఎన్నికలు ముగిసే వరకు చేసే ఖర్చును, వాటికి సంబంధించిన ఆధారాలను నమోదు చేస్తారు. ప్రత్యేక రిజిస్టర్లో వీటిని పొందుపరుస్తారు. లెక్కల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్(ఏఈవో) ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఈ బృందం పనిచేస్తుంది. జిల్లా నోడల్ అధికారికి నిత్యం ఏఈవో బృందం నివేదిక సమర్పిస్తుంది. గ్రామాల్లో అభ్యర్థులు చేసే ఖర్చు వివరాల గురించి నివేదిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్తోపాటు ఇతర విభాగాలు అందించే నివేదికలను క్రోఢీకరించి జిల్లా ఎన్నికల అధికారికి అందిస్తారు. వీఎస్టీ, వీవీటీ, ఎంసీఎంసీ కమిటీ ఎన్నికల ఖర్చుల వివరాలను క్రోఢీకరించి రోజువారీగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసే వరకు ఈ విభాగం పనిచేస్తుంది. కాల్ సెంటర్ ఫిర్యాదులపై నివేదిక అందిస్తుంది. గ్రామ‘పంచాయతీ’ల్లో మూడో కన్ను పంచాయతీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి మూడు విడతల ఎన్నికలపైనా నిఘా బృందాలు -
డీఎంఈ పరిధిలోకి వెల్నెస్
కరీంనగర్: ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు నగదురహిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2018లో కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఆవరణలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించిన దాఖలాలు లేవు. వైద్యుల గైర్హాజరు, మందుల కొరతతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకనుంచి ఆ సమస్యకు చెక్ పడనుంది. ఇది వరకు వెల్నెస్ సెంటర్ ఆరోగ్యశ్రీ సీఈవో పరిధిలో కొనసాగేది. ఇక నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వచ్చింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయమై డీఎంఈ నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు కలిపి దాదాపు 10 వేల మందికి పైగా ఉంటారు. వెల్నెస్ సెంటర్కు వెళ్లినా వైద్యసేవలు అందక తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెన్షనర్లకు బీపీ, షుగర్ తదితర మందులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇకనుంచి ఆ అవస్థలు తీరనున్నట్లు తెలుస్తోంది. ఆర్థో, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజీ సేవలు వెల్నెస్ సెంటర్లో ప్రస్తుతం ముగ్గురు ఎంబీబీఎస్ వైద్యులు, నలుగురు డెంటిస్టులు పనిచేస్తున్నారు. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇక నుంచి ఈ సెంటర్లో ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఎంబీబీఎస్లు, నలుగురు డెంటిస్టులతో పాటు కొత్తగా ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్టు వైద్యుల ద్వారా సేవలు అందించనున్నారు. దీంతోపాటు అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు సైతం చేపట్టనున్నారు. ప్రతిరోజు వెల్నెస్ సెంటర్కు 100కు పైగా పేషెంట్లు వస్తున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో చాలా మంది ఇక్కడ వైద్యసేవలు పొందలేక పోతున్నారు. ఈ సేవలు ప్రారంభిస్తే వెల్నెస్ సెంటర్ కిటకిటలాడనుంది.ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వెల్నెస్ సెంటర్లో వైద్యసేవలు అందించడం జరుగుతుంది. ఇది వరకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా, ఇటీవలే డీఎంఈ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. మెడికల్ కళాశాల అనుబంధ జీజీహెచ్ ద్వారా వెల్నెస్ సెంటర్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇప్పుడున్న వైద్యులకు తోడుగా అదనంగా ఆర్థో, జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజీ వైద్యులను నియమిస్తాం. రోస్టర్ ప్రకారం వారు సేవలు అందిస్తారు. – వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
పంచాయతీ బరిలోఇంజినీర్లు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని భుక్యారెడ్డితండాకు చెందిన బానోత్ నరేశ్కుమార్ బీటెక్ సివిల్ ఇంజినీర్ చదివి అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేశారు. నరేశ్ తండ్రి జయరాం రేషన్డీలర్, తల్లి శోభ గృహిణి. కొంతకాలంగా సామాజిక సమస్యలపై పోరాడుతున్న నరేశ్ సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో సర్పంచ్గా బరిలో నిలిచాడు. కంప్యూటర్.. జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకరు నల్ల కవిత కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివారు. ఆమె భర్త స్వామిరెడ్డి జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. – నల్ల కవిత సాఫ్ట్వేర్.. సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన కాంపెల్లి సతీశ్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో నిలిచాడు. నెలకు రూ.1.70 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలి నీరుకుల్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. – కాంపెల్లి సతీశ్కుమార్ ఉద్యోగం వదిలి.. కాల్వశ్రీరాంపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇంజినీరింగ్ చదివిన ఆరెల్లి ప్రవీణ్కుమార్గౌడ్ పోటీ చేస్తున్నాడు. గ్రామ సమస్యల పరిష్కారానికి ఇతరులపై ఆధారపడకుండా తానే ముందుంటానని చెబుతూ ప్రచారం చేస్తున్నాడు. హైదరాబాద్లో మేనేజర్ స్థాయి ప్రైవేట్ ఉద్యోగాన్ని ఉద్యోగం వదిలి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలు.. తమ స్వప్నాలను సాధించేందుకు ఉన్నతవిద్యనభ్యసించారు. ఇంజినీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించారు. సివిల్, కంప్యూటర్ ఇంజినీర్లుగా సమాజం నిర్మాణానికి దోహదపడ్డారు. సొంత గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ పల్లెపోరులో నిలబడ్డారు. ఇంజినీరింగ్ సర్పంచ్ అభ్యర్థులపై ప్రత్యేక కథనం.. సివిల్ ఇంజినీర్.. -
స్తంభంపల్లిలో చిరుత కలకలం
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో చిరుతపులి సంచరించిందనే వార్త కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి సమయంలో వెల్గటూర్ నుంచి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు వెళ్తున్న రంజిత్ కుమార్కు రాయపట్నం శివారు పెట్రోల్ బంక్ సమీపంలో చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సోమవారం చిరుత సంచరించినట్లు చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఆధారాలు కనిపించలేదు. గ్రామస్తులను అప్రమత్తం చేయాలని స్తంభంపల్లి, రాయపట్నం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. పశువులకాపర్లు అటువైపు వెళ్లొద్దని, మరోసారి చిరుతను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంగ శ్రీనాథ్, సెక్షన్ ఆఫీసర్ అమీర్ సయ్యద్ అలీ, బీట్ ఆఫీసర్ నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాయితీ చాటుకున్న 102 సిబ్బందిధర్మపురి: ప్రసవం కోసం 102లో వెళ్లిన ఓ మహిళ మర్చిపోయిన బ్యాగ్తోపాటు డబ్బులను తిరిగి అ ప్పగించి నిజాయితీ చాటుకున్నారు సిబ్బంది. బు గ్గారం మండల కేంద్రానికి చెందిన సుకన్య డెలివరీ కోసం 102లో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్ను వాహనంలోనే మర్చిపోయింది. సిబ్బంది చూడగా వారికి బ్యాగ్ కనిపించడంతో అందులో ఉన్న సెల్నంబర్కు ఫోన్ చేశారు. బ్యాగ్తోపాటు రూ.పదివేలను బాధితరాలు కుటుంబానికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఫైలెట్ పంజా సురేష్కు కృతజ్ఞతలు తెలిపారు. -
తొలి విడతకు సన్నద్ధం
కరీంనగర్ అర్బన్: తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడుతోంది. మొత్తం 92 పోలింగ్ కేంద్రాలుండగా 3,464 మంది సిబ్బందిని ఇప్పటికే నియమించగా అదనంగా వందకు పైగా నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవో, ఇద్దరు సిబ్బందితో కలిపి మొత్తం నలుగురు విధులు నిర్వహించనున్నారు. వీరికి శిక్షణ ప్రారంభమైంది. ఇప్పటికే తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగియగా ఆదివారం రెండో దశ ముగిసింది. శిక్షణలో బ్యాలెట్పై ఎలా ఉపయోగించాలనే దానిపై మాస్టర్ ట్రైనర్లు వివరిస్తున్నారు. మాక్ పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. రెండో దశ పూర్తి ఇప్పటికే రెండు దశల్లో ర్యాండమైజేషన్ను అధికారులు పూర్తి చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే 92 గ్రామాల్లో 866 బ్యాలెట్ బాక్స్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ రోజున సదరు బాక్స్లను ఉపయోగించనున్నారు. రెండో దశ పూర్తి కావడంతో వాటిని భద్రపరిచారు. మొదటి, రెండు దశల ర్యాండమైజేషన్ జిల్లాస్థాయిలో జరగగా పోలింగ్ జరగడానికి ఒకరోజు ముందు కమిషనింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సెక్టోరియల్ అధికారులపై దృష్టి ఎన్నికల సామగ్రి సరఫరా, పోలింగ్తో పాటు కౌంటింగ్ వరకు సెక్టోరియల్ అధికారులే కీలక భూమిక పోషిస్తారు. ప్రతి సెక్టోరియల్ అధికారి పర్యవేక్షణలో పీవోలు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులను నియమించి శిక్షణనిస్తున్నారు. పోలింగ్ రోజు రూట్ల వారీగా ఎన్నికల సామగ్రిని తరలించనున్నారు. పోలింగ్ జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాలి. కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే దృష్టి సారించాలి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా అప్పటివరకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశమిస్తారు. పోలింగ్ ముగిసిన తదుపరి అదే రోజు ఓట్ల లెక్కింపుతో విజేతను ప్రకటించి వాటిని స్ట్రాంగ్ రూంలకు తరలించాలి.ఈ నెల 11న తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలు: 05(గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, చొప్పదండి) ఎన్నికలు జరిగే గ్రామాలు: 92 వార్డు మెంబర్ స్థానాలు: 866 పోలింగ్ సిబ్బంది: 3,464 పోలింగ్ కేంద్రాలు: 92, పోలింగ్ బూత్లు: 866 -
కేసులు
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025నిబంధనలు ఉల్లంఘిస్తేసాక్షిప్రతినిధి,కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అభ్యర్థులు సహకరించాలని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సున్నితమైన గ్రామాలను గుర్తించి, ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ మండలానికి ఒక ఏసీపీని ఇన్చార్జీగా పెట్టామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. -
సాంబార్ గిన్నెలో పడి బాలుడి మృతి
● పుట్టినరోజునే మృత్యు ఒడిలోకి ● వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి ధర్మారం: పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. తన బర్త్డే నాడే నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు వేడుక జరిపేందుకు తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్న తరుణంలో కుమారుడు కానరాని లోకాలకు వెళ్లడం పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్ ఏడాదిన్నరగా మల్లాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులంలో తాత్కాలిక పద్ధతిన వంటమనిషిగా పనిచేస్తున్నాడు. మధుకర్ భార్య శారద, కూతురు శ్రీమహి(8), కుమారుడు మోక్షిత్(4)తో కలిసి విద్యాలయంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం వంటగదిలో మధుకర్ వంట తయారుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కాసేపటికి సాంబారు వండి పక్కన పెట్టాడు. అతడి కుమారుడు మోక్షిత్ ఆడుకుంటూ వంట గదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా వేడి సాంబారు పాత్రలో పడిపోయాడు. వేడితీవ్రతకు గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన తండ్రి మధుకర్.. తొలుత కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. బర్త్డే రోజే తమ కుమారుడు కళ్లెదుటే గాయపడి మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బంధువులు రోదించిన తీరు కలచివేఇంది. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతికరీంనగర్క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రోజు దేవేందర్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవేందర్ నగరంలోని గాంధీచౌరస్తాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించాడు. ఇంటికి వెళ్లి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరిన దేవేందర్, ప్రస్తుతం సివిల్ విభాగంలో హెడ్కానిస్టేబుల్గా కొనసాగుతున్నాడు. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ఘటనపై సీపీ గౌస్ఆలం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ యువకుడు మృతివీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు(27) చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం... ఆంజనేయులు నవంబర్ 30న రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. ఎందుకు తాగొచ్చావని తండ్రి శంకరయ్య మందలించాడు. మనస్తాపానికి గురైన ఆంజనేయులు పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. బావిలో పడి రైతు మృతిరామడుగు: రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామానికి చెందిన జాడి రాములు(48) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై కె. రాజు తెలిపారు. జాడి రాములు ఆదివారం మేకను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. మేక ప్రమాదశాత్తు బావిలో పడిపోగా కాపాడేందుకు ప్రయత్నించి, రాములు నీటమునిగి చనిపోయాడు. మృతుని భార్య జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. వీధి కుక్కల బెడదపై హైకోర్టులో విచారణమంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వీధి కుక్కల బెడదపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్పై సోమవారం విచారణ జరిపారు. ప్రతివాదిగా ఉన్న మున్సిపల్ కమిషనర్కు కౌంటర్ దాఖలు చేయాలని న్యూయమూర్తి సూచించారు. కేసు విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఈవిషయాన్ని మంథనికి చెందిన పిటిషనర్, హైకోర్టు న్యాయవాది ఇనుముల సతీశ్ సోమవారం తెలిపారు. మంథనిలోని పలు వార్డుల్లో వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయని, రాత్రంతా మొరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా దారిన వెళ్తున్న వారిని కరుస్తూ ఆందోళన గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ విషయంపై ఇటీవల 7వ వార్డులో కుక్కకాటుకు గురైన కొల్లూరి సమ్మయ్యతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సతీశ్ వివరించారు. -
‘పరీక్ష’ వాయిదా వేయాలె
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివ ర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. ఈనెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన పీజీ 3వ సెమిస్టర్ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట సుమారు ఆరుగంటలపాటు బైఠాయించారు. సోమవారం వర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు సుమారు 600 మంది వర్సిటీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ర్యాలీగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడు తూ.. త్వరలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతున్నారని, ఎన్నికలకు ఓటు వేసి రావాలంటే ఇబ్బంది అవుతుందని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఈనెల 23 నుంచి జవరి 7వ తేదీ వరకు సెట్, నెట్ పరీక్షలు ఉన్నాయని, ఏళ్లకాలం నుంచి ఎదురుచూస్తే ఇప్పుడు షెడ్యూల్ విడుదల అయ్యిందని, ఇదే సమయంలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే.. సెట్, నెట్ పరీక్షలు రావడం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15,16న నిర్వహించే ఫస్టియర్ విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశా రు. వర్సిటీలోని లైబ్రరీని ఉదయం 9 గంటల వరకే మూసేస్తున్నారని, సాయంత్రం తక్కువ సమయం ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఏ వర్సిటీలోనూ లైబ్రరీలు మూసివేసిన దాఖలాలు లేవని కేవలం శాతవాహనలోనే ఈ పరిస్థితి విడ్డూరంగా ఉందన్నారు. ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్దే బైటాయించిన విద్యార్థులు మధ్యాహ్న సమయంలో అక్కడికే భోజనం తెప్పించుకుని తిన్నారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోగా... విషయం తెలుసుకున్న సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. మంగళవారం మాట్లాడుదామని వర్సిటీ రిజిస్ట్రార్ ఓఎస్డీ ద్వారా ఫోన్లో చెప్పడంతో ఆందోళన వాయిదా వేశామని శాతవాహన స్టూడెంట్ జేఏసీ నాయకులు తెలిపారు. -
చైనా ‘మాంజా’ తగిలి కాలికి గాయం
పెద్దపల్లిరూరల్: గాలిపటం ఎగురవేసేందుకు దారమే ఆధారం.. కానీ, ఆ దారంతో మరో పతంగిని కోసేందుకు పోటీపడుతున్నారు. ప్రమాదకర రసాయనాలతో (సింథటిక్ గాజు పూసిన దారం) తయారు చేసిన చైనాను వినియోగిస్తున్నారు. మనదేశంలో నిషేధిత చైనా మాంజాను వినియోగించి ప్రాణాల మీదికి తెస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాగర్రోడ్డు ప్రాంతంలో నివాసముండే తిర్రి సక్కుబాయి సోమవారం బ్యాంకులో పింఛన్ డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ క్రమంలో ఎల్లమ్మచెరువు ప్రాంతంలో ఓ గాలిపటం తెగి దారం కిందపడగా.. తెంపిన యువకులు లాగుతున్న దారం సక్కుబాయి కాలికి చుట్టుకుని కాలివేళ్లు తెగి రక్తస్రావమైంది. ఆ దారాన్ని తొలగించే యత్నంలో చేతికి కూడా స్వల్పగాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. దారానికి గాజు లోహపు పొడి ఉండడంతో సెప్టిక్ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కాలికి తగిలింది.. అదే దారం మెడకు తగిలితే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు చొరవచూపి ప్రమాదకర చైనా మాంజా అమ్మకాలను నియంత్రించి విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని సక్కుబాయి కుమారుడు తిర్రి రవీందర్ కోరారు. కనిపించని మాంజా క్రయ, విక్రయాలపై నిషేధం ఏది? -
చలి.. గుండె అలజడి
కరీంనగర్: జిల్లాను చలి వణికిస్తోంది. చలితో శ్వాసకోశ, చర్మవ్యాధులతో పాటు హార్ట్ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నా రు. అధిక చలితో రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడంతో హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మారిన జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, కేన్సర్, టీబీ తదితర వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గుండెపోటుకు చలి ఒక కారణమైనప్పటికీ ఇతర కారణాలు ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్, హైబీపీ, అదుపులో లేని షుగర్, చిన్నప్పటి నుంచే గుండె సంబంధ సమస్యలు ఉండే వారు హార్ట్ఎటాక్కు గురవుతారు. మామూలు రోజుల్లో కన్నా చలికాలంలో హార్ట్ ఎటాక్లు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో గుండె సమస్యలు చలి ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాలు కుచించుకుంటాయి. దీంతో బీపీ పెరుగుతుంది. గుండె మరింత శక్తిగా పనిచేయాల్సి వస్తుంది. ఇది గుండె వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. చలిలో రక్తం కొంచెం మందంగా మారి రక్త గడ్డలు (క్లాట్స్) ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చలితో శరీరం వేడిగా ఉంచేందుకు ఎక్కువ కేలరీలు, ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. దీంతో గుండైపె భారం పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, శ్వాస సమస్యలు పెరిగి గుండె సంబంధిత సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తాయి. చలికాలంలో వ్యాయామం తగ్గిపోవడం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో రక్తపోటు సాధారణంగా పెరుగుతుంది. హై బీపీతో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉంటుంది. గుండెపోటు ఇలా గుండెకు ప్రధానంగా మూడు దమనుల ద్వారా రక్తసరఫరా జరుగుతుంది. వీటిలో ఏ రక్తనాళం మూసుకుపోయినా గుండె కండరాలకు అందాల్సిన రక్తం అందక గుండె పోటు వస్తుంది. ఇలాంటప్పుడు సమయానికి హాస్పిటల్కు తీసుకెళ్తే బాధితులను బతికించేందుకు అవకాశముంటుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో... సీపీఆర్ ప్రక్రియపై అవగాహన ఉన్నవారు సీపీఆర్ చేయడం కూడా అంతే ముఖ్యం.‘చొప్పదండి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఈనెల 3న వేకువజామున హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలు నిలిచాయి.’ ‘నగరంలోని కిసాన్నగర్కు చెందిన 42 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి అర్ధరాత్రి ఎడమచేయి లాగ డం, చాతిలో నుంచి వీపులోకి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మొదటి ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో కోలుకున్నాడు.’ -
ఏకగ్రీవ గ్రామాలకు త్వరలో నిధులు
కరీంనగర్/చొప్పదండి: ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాలకు త్వరలోనే కేంద్రం నుంచి రూ.10లక్షల నిధులు మంజూరు చేయిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని మండలం విజయ్నగర్ కాలనీ పంచాయతీ ఏకగ్రీవం కాగా.. సర్పంచ్గా ఎన్నికై న అమూల్య రాజశేఖర్ ఆదివారం బండి సంజయ్ని కలిశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ను సంజయ్ సత్కరించారు. త్వరలోనే రూ.10లక్షల ప్రోత్సాహక నిధులను అందజేస్తానని హామీ ఇచ్చారు. గన్నేరువరం మండలం పీచుపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న సామ రాజిరెడ్డి సంజయ్ని కలిశారు. శౌర్య దినోత్సవం సందర్భంగా నాటి కరీంనగర్ కర సేవకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ను మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ ఘనంగా సన్మానించారు. అయోధ్య రామ మందిరం అనే పాటకు ముగ్ధుడైన కేంద్రం మంత్రి బండి సంజయ్ కుమార్ చొప్పదండికి చెందిన ప్రముఖ గాయకుడు చీకట్ల లచ్చయ్యను అభినందించారు. -
14న కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్
కరీంనగర్ టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కోట పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కోట టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్–2026 ఈనెల 14న నిర్వహించనున్నట్లు స్కూల్ చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం పరీక్షకు సంబంధించిన పోస్టర్లను స్కూల్లో ఆవిష్కరించారు. 3వతరగతి నుంచి 9వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనొచ్చని, ప్రస్తుత తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100 శాతం స్కాలర్షిప్తోపాటు ఉచిత విద్య అందించనున్నట్టు పేర్కొన్నారు. ఐఐటీ–జేఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి జాతీయస్థాయి పరీక్షలకు ఆరోతరగతి నుంచే ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మద్యం పట్టివేతఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. రాచర్లగొల్లపల్లికి చెందిన షేక్ మౌలానా అనే వ్యక్తి తన హోటల్లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. హోటల్లో తనిఖీలు నిర్వహించగా మద్యం బాటిళ్లు దొరకడంతో స్వాఽ దీనం చేసుకొని మౌలానాపై కేసు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మ ద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రాత్రికి రాత్రే గుర్తులు మార్చేశారు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల గుర్తులు కేటాయించి అధికారికంగా ప్రకటించిన తర్వాత రాత్రికి రాత్రే గుర్తులు మార్చేసిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. బాధిత సర్పంచ్ అభ్యర్థి అంకారపు రవీందర్ ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. శనివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి తనకు ఉంగరం గుర్తు కేటాయించి, పంచాయతీ కార్యాలయంలోనూ అతికించారని తెలిపారు. దీంతో తాను ప్రచారం ప్రారంభించగా రాత్రికి రాత్రే గుర్తును మార్చేశారని ఆదివారం ఉదయం చూస్తే ఉంగరం గుర్తుకు బదులుగా కత్తెరను కేటాయించారని వాపోయారు. తన ప్రత్యుర్థులు అధికార పార్టీకి చెందిన వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనను ఓడించాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల ఎన్నికల అధికారులను వివరణ కోరగా రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాలు, జిల్లా ఎన్నికల అధికారుల సూచనలతో నిబంధనల ప్రకారం గుర్తులను మార్చినట్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారుల తీరుపై సర్పంచ్ అభ్యర్థి నిరసన తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో వింత ఘటన -
రాగట్లపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నెత్తెట్ల లస్మయ్యను సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఆరువార్డులకు వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్తోపాటు ఆరు వార్డులకు ఒక్కో నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి. గుంటపల్లిచెరువుతండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భూక్య తిరుపతినాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. మండలంలో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఎన్నికై న వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువ కప్పి సన్మానించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గండిలచ్చపేట..తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గండిలచ్చపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందిది. మొదట ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉండగా ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో సర్పంచ్గా జంగిటి అంజయ్య ఏకగ్రీవమయ్యారు. వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా ఆదివారం ఉపసర్పంచ్గా పుట్ట భాను ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, వలకొండ వేణుగోపాల్రావు, మాట్ల మధు, పడిగెల రాజు తదితరులు పాల్గొన్నారు. -
రచ్చబండ రాజకీయాలు
బోయినపల్లి(చొప్పదండి): పంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి రగిలింది. నలుగురు కలిస్తే చాలు ఎన్నికల ముచ్చట్లే పెడుతున్నారు. అభ్యర్థుల గెలుపోటములపై చర్చలు సాగుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 260 గ్రామాల్లో సర్పంచు పదవులకు, 2,268 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. హోటళ్లలో చాయ్ తాగుతూ.. చౌరస్తాలో నలుగురు కలిసిన చోట సర్పంచ్ ఎవరైతే కరెక్ట్.. ఏ వార్డులో ఎవరూ పోటీచేస్తున్నారనే చర్చలే సాగుతున్నాయి. అరుగులే..రచ్చబండలు ఒకప్పుడు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో రచ్చబండలు ఉండేవి. గ్రామంలోని పెద్దమనుషులు(వయసురీత్య) ఒక్క చోట చేరి కుసల సమాచారం చేరవేసుకునేవారు. కాలక్రమంలో రచ్చబండలు కనుమరుగయ్యాయి. ఇళ్ల ముందు కట్టుకున్న అరుగులపై కూర్చుంటున్న ఒకే వయసు వారు ఎన్నికలపై చర్చలు పెడుతున్నారు. ఏ అభ్యర్థి ఎట్లుంటడు.. గ్రామాభివృద్ధికి ఏం చేస్తడు... తదితర అంశాలపై జోరుగా ముచ్చట్లు పెడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల గుణగణాలు లెక్కిస్తున్నారు. గ్రామానికి ఎవరు సర్పంచ్ అయితే లాభం జరుగుతది అనే ముచ్చట్లు పెడుతున్నారు. ఉదయం, సాయంత్రం ఇళ్ల వద్ద అరుగుల(రచ్చబండలు)పై రాజకీయ ముచ్చట్లు నడుస్తున్నాయి. తామ కులపోడు గెలుస్తాడని ఒకరంటే.. ఏ లేదు.. లేదు మా పార్టీ బలపరిచిన అభ్యర్థే గెలుస్తాడని మరొకరు.. ఏహే.. వీళ్లెవలు కాదు పలాన వ్యక్తికి మంచి ఫాలోయింగ్ ఉందని ఆయన్నే గెలుస్తాడంట అని మాటల తూటాలు పేల్చుతున్నారు. చివరికి మనకెందుకే లొల్లి.. పోలింగ్ నాడు సూసుకుందాం.. తియ్ అనుకుంటూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పెరిగిన రాజకీయ ముచ్చట్లు నలుగురు కూడితే ఎన్నికల ముచ్చట్లే గ్రామాల్లో ఇళ్ల ముందు అరుగులపై ముచ్చట్లు -
ఎన్టీపీసీ నేఫి వైస్ చైర్మన్గా నితీశ్కుమార్
జ్యోతినగర్: ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు చెందిన నితీశ్కుమార్ నెఫి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీ సమీపంలోని ఎన్టీపీసీ దాద్రి ప్రాజెక్టులో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గల ఎన్టీపీసీ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్గా రామగుండం ప్రాజెక్టుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ నితీశ్కుమార్ ఎన్నికయ్యారు. ముక్కిన బియ్యం తిని 30 గొర్రెలు మృతిమల్యాల: మల్యాల మండలం రామన్నపేటలో ముక్కిన బియ్యం తిని 30 గొర్రెలు మృతి చెందాయి. మరో 20 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామానికి చెందిన తాడుక గంగన్న, దండిక మల్లేశం తమ గొర్రెల మందను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. పొలంలో పారబోసిన ముక్కిన బియ్యం తిని అస్వస్థతకు గురయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో 30 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను బతికించుకునేందుకు రూ.50వేలకుపైగా మందులు కొనుగోలు చేసి, చికిత్స చేసినా ఫలితం లేకుండాపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కిన బియ్యం తినడంతోనే జీవాలు మృతి చెందాయని మండల పశు వైద్యాధికారి రాజ్కుమార్ తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముక్కిన బియ్యం తిని మూగజీవాలు మృతిచెందాయని, వాటి విలువ సుమారు రూ.8లక్షల వరకు ఉంటుందని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే వెంట వెల్మ లక్ష్మారెడ్డి, నేరెళ్ల సతీశ్రెడ్డి, వెల్మ కృష్ణారెడ్డి ఉన్నారు. కట్నం వేధింపులకు వివాహిత బలికోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రాంతానికి చెందిన ఆడెపు రచన (జోగ లహరి)వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన జోగ రాజేశ్తో పట్టణానికి చెందిన రచనకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అదనంగా మరో రూ.3లక్షలు కట్నంగా కావాలని రాజేశ్ నిత్యం వేధిస్తున్నాడు. అత్తామామలు దేవక్క, దుబ్బయ్య, ఆడబిడ్డ వాసం రాజు కలిసి ఇంట్లోనుంచి గెంటేశారు. దీంతో తల్లిగారింటికి వచ్చిన రచన జీవితంపై విరక్తితో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రచన తండ్రి రవి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తామామ, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన నమిలికొండ సత్తయ్య చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్సై రాహుల్రెడ్డి కథనం ప్రకారం.. ఈనెల 3న సత్తయ్య ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ఎస్సీకాలనీ వద్ద గుంటపల్లిచెరువుతండాకు చెందిన గుగులోతు విజయ్ బైక్తో ఢీకొట్టాడు. గాయపడ్డ సత్తయ్యను ఆటోలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు బాబు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిబంధనలు పాటించాలి
కరీంనగర్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని కరీంనగర్రూరల్ ఏసీపీ విజయ్కుమార్ హెచ్చరించారు. కరీంనగర్ మండలంలో సమస్యాత్మక గ్రామాలైన మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, చామనపల్లి, నగునూరు గ్రామాల్లో ఆదివారం కవాతు నిర్వహించారు. మొగ్ధుంపూర్, నగునూరులో ఏసీపీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులకు విరుద్ధంగా ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే అభ్యర్థులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 11న పోలింగ్ను ప్రశాంతవాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు. సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ పాల్గొన్నారు. సెపక్తక్రాలో పతకాలు కరీంనగర్స్పోర్ట్స్: మహబూబాబాద్ జిల్లా కురవిలో ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 సెపక్ తక్రా పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు చాంపియన్ షిప్ సాధించగా.. బాలికల జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. అండర్–14 బాలికల జట్టు తృతీయస్థానం సాధించింది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాజస్థాన్లోని ఉదయపూర్లో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే అండర్–17 జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి గన్ను విజయభాస్కర్రెడ్డి తెలిపారు. క్రీడాకారులను డీవైఎస్వో వి.శ్రీనివాస్గౌడ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, సెపక్ తక్రా కోచ్లు కుమార్, శ్రీనివాస్, సుమన్, శ్రీకాంత్ అభినందించారు. విజిలెన్స్ విచారణ చేపట్టాలి కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని జంక్షన్ల అభివృద్ధి పేరిట చోటుచేసుకొన్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ బండారి వేణు కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. నగరంలోని ఇందిరాచౌక్, వన్టౌన్,పద్మనగర్ జంక్షన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై ్కన ఇంజినీరింగ్ అధికారులు అంచనాలను భారీగా పెంచి, రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. రూ.60 లక్షలతో పూర్తి చేస్తామన్న ఇందిరాచౌక్ జంక్షన్ను రూ.కోటి 20 లక్షలకు అంచనాలు పెంచి, రూ.కోటి బిల్లు కూడా ఇచ్చారన్నారు. జంక్షన్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరారు. కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ పనులు కొనసాగుతున్నందున సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తేజ స్కూల్, ఎస్ఆర్ జూనియర్ కళాశాల, రెడ్డి ఫంక్షన్హాల్, సరస్వతీనగర్, వడ్ల కాలనీ, చంద్రాపూర్కాలనీ, రెవెన్యూ కాలనీ, హనుమాన్నగర్, అమ్మగుడి, తీగులగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్–1, కరీంనగర్రూరల్ ఏడీఈలు పంజాల శ్రీనివాస్ గౌడ్, గాదం రఘు తెలిపారు. -
ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సదరు ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా రాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ర్యాండమైజేషన్లో పోలింగ్ అధికారులు 1,255, ఇతర పోలింగ్ అధికారులు 1,773 మందిని కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ కలెక్టర్కు వివరించారు. -
రాంపల్లి సర్పంచ్..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్గా కనపర్తి సంపత్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంపత్రావు, కోదాటి దేవేందర్రావులు నామినేషన్ వేయగా, గ్రామపెద్దలంతా ఆదివారం సమావేశమై సంపత్రావుకు సర్పంచ్ పదవి కట్టబెట్టేలా దేవేందర్రావుకు నచ్చజెప్పి పోటీ నుంచి ఉపసంహరింపజేశారు. అలాగే 8వార్డు సభ్యుల పదవుల్లో 4వార్డులకు ఒక్క నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి. మిగతా 4వార్డులు సైతం ఏకగ్రీవంగా చేసి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో గ్రామపెద్దలున్నట్లు తెలుస్తోంది. -
ప్రలోభాల పర్వం
ప్రచారం కన్నా ప్రసన్నం చేసుకునేందుకే ఆసక్తికరీంనగర్/కరీంనగర్టౌన్: పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా అభ్యర్థులు ట్రెండ్ మార్చారు. ప్రచారం కన్నా ప్రలోభాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు ఇంటింటా, సోషల్ మీడియా ప్రచారంలో తలమునకలైన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఇక ప్రలోభాల దారి పడుతున్నారు. మాంసం, మద్యం పంపిణీ చేస్తున్నారు. వద్దంటే స్వీట్లు, కూల్డ్రింక్స్ పంపిస్తున్నారు. మొదటి, రెండోవిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రచారం ఊపందుకోగా.. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో రేపు గుర్తులు కేటాయించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాంసం వ్యాపారులతో ఒప్పందానికి వచ్చిన అభ్యర్థులు వైన్స్ల్లో అడ్వాన్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కిరాణా దుకాణాలు, బేకరీల్లో కూల్డ్రింక్స్ విక్రయాలు జోరందుకున్నాయి. వార్డుస్థానాలకు పోటీ చేస్తున్న వారు సైతం ఖర్చుకు వెనుకా డటం లేదు. ఉప సర్పంచ్ పదవిని దృష్టిలో ఉంచుకొని రూ.లక్షల్లో ఖర్చుచేసేందుకు రెడీగా ఉన్నారు. గుర్తుల గుబులు గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్నవారికి కేటాయిస్తున్న గుర్తులు ఒకే పోలికతో ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు ఆ గుర్తులను గుర్తుంచుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తు మాత్రమే ముద్రిస్తారు. అసలే పరిమిత ఓట్లు కావడంతో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ క్రమంలో ఓట్లు తారుమారైతే.. అభ్యర్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందనే భయం అందరినీ వెంటాడుతోంది. ఒకే పోలికతో ఉండే పలు గుర్తులు ఓటర్లను తికమక చేసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి స్థానంలో ఉంగరం, రెండోస్థానంలో కత్తెర ఉన్నాయి. అవీ చూడగానే సులువుగా అర్థమవుతోంది. మూడో స్థానం బ్యాట్, ఆరో స్థానంలో టీవీ రిమోట్, ఏడో స్థానంలో టూత్ పేస్ట్, ఎనిమిదో స్థానంలో సాసర్ ఉన్నాయి. పలక, బ్లాక్ బోర్డు, బిస్కెట్, మంచం వంటి గుర్తులు ఒకేలా ఉండడంతో ఓటర్లు ఇబ్బందులు పడే అవకాశముంది. దువ్వెన, ఆరటిపండు గుర్తులు కూడా ఒకేలా ఉన్నాయి. గ్యాస్ స్టా, సిలిండరు వేరువేరుగా ఇవ్వడం ఇబ్బందిగానే ఉంటుంది. రెబల్స్ బెడద చాలా గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు రెబల్స్ బెడద పట్టుకుంది. ఒకే పార్టీకి, ఒకే కులానికి, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చొప్పున పోటీలో ఉండే సరికి ఓట్లు చీలుతాయనే భయం పట్టుకుంది. వారిని బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి చెందిన అభ్యర్థి అయితే పెద్దనాయకులతో, ఒకే కులానికి చెందిన వారు అయితే ఆ కులపెద్దలతో, కుటుంబ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. నిబంధనలు కీలకం పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ 48గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అనుమతులు లే కుండా సమయాన్ని మించి ఊరేగింపులు తీయొ ద్దు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లు వాడొద్దు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఎన్నికల ప్రచార పోస్టర్లు అంటించొద్దు. గోడలపై ప్రచార రాతలతో ఇతరులకు ఇ బ్బంది కలిగించొద్దు. ఇలా చేస్తే 1997 చట్టం ప్రకా రం మూడు నెలల కారాగార శిక్ష లేదా రూ.1000 జరిమానా విధించే అవకాశముంది.మొదటి విడతకు ఇక రెండు రోజులే ప్రచారంజిల్లాలోని 316 గ్రామ పంచాయతీలు, 2946 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచారం జోరందుకుంది. ప్రచార గడువు రెండు రోజులే ఉండగా.. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 9వ తేదీ సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. మొదటి విడత ఐదు మండలాల్లోని 92 గ్రామ పంచాయతీగాను చొప్పదండి మండలం దేశాయిపేట, పెద్దకురమపల్లె, రామడుగు మండలం శ్రీరాములపల్లె ఏకగ్రీవం అయ్యాయి. 866వార్డులకు 276వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా గ్రామాల్లో ఆదివారం నుంచి ప్రచారం వేడెక్కింది. తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. కొన్ని గ్రామాల్లో తమకు కేటాయించిన బ్యాట్, ఉంగరం, కత్తెర వంటి గుర్తులు ఉన్నవారు ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న పెద్ద కుటుంబాలకు వెండినాణేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఫిర్యాదు
కార్పొరేట్కళాశాలు, పాఠశాలల ముందుస్తు అడ్మిషన్ల, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై శనివారం హైదరాబాద్లోని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ అదిత్యకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తి కాకముందే రాబోయే విద్యాసంవత్సరంలో తీసుకునే అడ్మిషన్లపై ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల విష ప్రచారానికి అడ్డుకట్టవేయాలని కోరాం. అడ్మిషన్ల పేరుతో స్కీనింగ్టెస్ట్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలి. – సిరిశెట్టి రాజేశ్గౌడ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా
గోదావరిఖని: జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా చాటిందింది. ఈనెల 2 నుంచి 7వరకు మహారాష్ట్ర నాగ్పూర్లోని మ్యాంగనీస్ ఓవరీస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలు ఆదివారం ముగిశాయి. దేశవ్యాప్తంగా 29 పురుషుల, ఏడు మహిళా జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో సింగరేణి సంస్థ బీటీం జట్టు ప్రతిభ కనబర్చి బొగ్గు గనుల విభాగంలో ఓవరాల్ చాంపియన్ సాధించింది. రెండో స్థానంలో డబ్ల్యూసీఎల్ ఏటీం, మూడో స్థానంలో డబ్ల్యూసీఎల్ బీటీం నిలిచింది. సింగరేణి ఏటీం జటు నాలుగో స్థానాన్ని కై వసం చేసుకుంది. ఐదో స్థానంలో ఈసీఎల్ ఏటీం, ఆరో స్థానంలో ఎంసీఎల్ బీ టీం జట్లు నిలిచాయి. సత్తా చాటిన సింగరేణి మహిళా రెస్క్యూ టీం మొదటి సారిగా జాతీయస్థాయి రెస్క్యూ పోటీల్లో పాల్గొన్న సింగరేణి మహిళా జట్లు ఓవరాల్ రెండో స్థానాన్ని కై వసం చేసుకుంది. మహిళా విభాగంలో ఏడు జట్లు పాల్గొనగా, పోటీలు నిర్వహించిన ఎంఓఐఎల్ జట్లు మొదటి స్థానం సాధించగా, రెండో స్థానంలో సింగరేణి జట్టు నిలిచింది. వ్యక్తిగత విభాగంలో సైతం.. జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు వ్యక్తిగత విభాగాల్లో కూడా అనేక బహుమతులు సాధించింది. రెస్క్యూ అండ్ రికవరీ విభాగంలో సింగరేణి బీటీం మొదటి స్థానం, రోప్ రెస్క్యూలో మూడో స్థానం సాధించాయి. మహిళా రెస్క్యూ మహిళా జట్టు సత్తా.. మహిళా విభాగం బెస్ట్ రెస్క్యూలో తాళ్ల గాయిత్రి మొదటి స్థానం, మౌనిక రెండో స్థానం, క్యాప్టెన్ ఆవార్డులో సింగరేణి జట్టు క్యాప్టెన్ క్రిష్ణవేణి మొదటి స్థానం పొందింది. థియరీలో మొదటి స్థానం, మహిళా ఫస్ట్ ఎయిడ్లో మొదటి, రెండు స్థానాలు సాధించారు. పురుషుల విభాగంలో.. బెస్ట్ మెంబర్గా సింగరేణి టీంకు చెందిన మధుసూదన్, బెస్ట్క్యాప్టెన్గా సింగరేణి బీటీంకు చెందిన ప్రమోద్ ఎంపికయ్యారు. థియరీలో సింగరేణి బీటీం మూడో స్థానం, స్టాట్యుటరీలో సింగరేణి బీటీం రెండో స్థానం, ఫస్ట్ ఎయిడ్లో సింగరేణి ఏటీం మొదటి, బీటీం రెండో స్థానం సాధించాయి. రెస్క్యూ రికవరీలో సింగరేణి బీటీం మొదటిస్థానం సాధించింది. ఓవరాల్ మొదటిస్థానం సాధించిన సింగరేణి బీటీం మహిళా విభాగంలో ఓవరాల్ రెండో స్థానం పలు విభాగాల్లో బహుమతులు -
ఆమెకు భరోసా
కరీంనగర్క్రైం: సమాజంలో అన్యాయానికి గురైన మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోంది. బాధిత మహిళలకు భరోసా కల్పిస్తోంది. జిల్లాలోని కొత్తపల్లిలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన భరోసా కేంద్రం వివిధ కేసుల్లోని బాధిత మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అలాగే మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటున్న వారికి రక్షణ వేదికగా ఉంటోంది. కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని గతేడాది డిసెంబర్ 22న అప్పటి డీజీపీ జితేందర్ ప్రారంభించారు. వివిధ సందర్భాల్లో అన్యాయానికి గురై పోలీసుస్టేషన్కు వెళ్లేందుకు భయపడేవారికి భరోసాకేంద్రాల్లో స్నేహపూర్వక, మానవీయ వాతావరణంలో న్యాయ, వైద్య, మానసిక సలహా సేవలు అందిస్తున్నారు. బాధితులకు చేయూత కరీంనగర్లోని భరోసా కేంద్రం మహిళలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, గృహహింస, ఇతర దారుణ ఘటనల్లో బాధితులకు ఒకేచోట న్యాయ, వైద్య, మానసికసాయం అందించాలనే లక్ష్యంతో ఏర్పడింది. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు ఈ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా గోప్యత, ఆత్మవిశ్వాసంతో తమ సమస్యను వివరించగలుగుగుతున్నారు. మానసిక వైద్యులు, అడ్వోకేట్లు, సోషల్ కౌన్సిలర్లు సాయం అందిస్తున్నారు. కోర్టు ప్రక్రియలో సులభతరం కోసం డాక్యుమెంటేషన్, లీగల్ సపోర్ట్, కౌన్సెలింగ్ సేవలు కల్పిస్తున్నారు. భరోసా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 45 పోక్సో కేసులు, 15 అత్యాచార కేసులు, మూడు ఇతర కేసుల్లో బాధితులకు న్యాయసాయం అందించారు. వివిధ సందర్భాల్లో అత్యవసర పరిస్థితిలో ఉన్న 43మంది బాధిత మహిళలకు వైద్యసాయం అందించారు. 44 పాఠశాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పించారు. ప్రత్యేక శ్రద్ధ గృహహింస, లైంగిక వేధింపులు, చిన్నారులపై హింస, మేజర్ మానసిక సమస్యలతో పాటు వివిధ కేసుల్లో బాధితులు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తున్నారు. వారి వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడంలో శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. కేంద్రాల్లో సేవలు, గృహహింస కేసుల్లో మహిళలకు పోలీసు సహకారం, పోక్సో చట్టం కింద బాధిత చిన్నారులకు న్యాయసాయం, కౌన్సెలింగ్, మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన కేసుల్లో తాత్కాలిక ఆశ్రయం ఇస్తున్నారు. పోలీస్స్టేషన్లో కేసు నమోదు ప్రక్రియలో పూర్తి రక్షణ, మార్గదర్శనం చేస్తున్నారు. వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్య సేవలు, న్యాయ నిపుణులు, మహిళా అధికారులు, సోషల్ వర్కర్లు అందుబాటులో ఉండటంతో బాధితులకు వ్యక్తిగత ఆదరణ లభిస్తోంది. వివిధ కేసుల్లో 39మంది బాధితుల తరఫున దరఖాస్తులు సమర్పించగా, 11మందికి రూ.3,50,000 పరిహారం అందించారు. -
మెడికల్ కాలేజీకి పార్థివదేహం దానం
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్ మెడికల్ కాలేజీకి శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా మామిడిగట్టు గ్రామానికి చెందిన వృద్ధుడు మందల రాజిరెడ్డి (82) పార్థీవ దేహాన్ని కుటుంబసభ్యులు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. శనివారం అనారోగ్యంతో రాజిరెడ్డి మరణించగా, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి వాసు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు దానం చేశారు. అనంతరం పార్థీవ దేహాన్ని సిమ్స్ మెడికల్ కాలేజీకి దానం చేసి స్పూర్తిగా నిలిచారు. ఐదు నెలల క్రితం మరణించిన తల్లి పార్థీవ దేహాన్ని కూడా మంచిర్యాల మెడికల్ కాలేజీకి దానం చేసిన కొడుకు శ్యాంసుందర్ రెడ్డి నేడు తండ్రి పార్థీవ దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసి ఆదర్శంగా నిలిచారని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ నరేందర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్సింగ్, ఆర్ఎంవో దండే రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపర్వైజర్ కూడిదల శివ, సిబ్బంది బొజ్జ శ్రీనివాస్, అన్నం చంద్రశేఖర్, గడ్ర సాయికృష్ణ, మంచినీళ్ల శివకుమార్, రేఖల రాజేంద్రప్రసాద్ పాల్గొని మందల రాజిరెడ్డికి నివాళి అర్పించారు. నేత్రదానం చేసి.. ఇద్దరికి చూపునిచ్చి -
చేతులు కలిపితే ఉద్యోగం పోయినట్టే !
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల జరిగే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుంది. దీని ఉదేశం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు లెక్క. అయితే కొందరు ఉద్యోగులు తెలియని తనం, అత్యుత్సాహంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో కరచాలనం చేయడం, సన్నిహితంగా ఉండడం చేస్తుంటారు. ఇదీ చాలా పెద్ద తప్పని ఎన్నికల సంఘం చెబుతోంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. కరచాలనం ఎందుకు చేయకూడదు? ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కింద పనిచేస్తారు. ఉద్యోగులు ఒక అభ్యర్థికి బహిరంగంగా కరచాలనం చేయడం, సన్నిహితంగా ఉండడం ద్వారా ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారనే లేదా అనుకూలంగా ఉన్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. దీంతో ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత సన్నగిల్లే అవకాశం ఉంది. ప్రవర్తనా నియమావళి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అనవసరమైన సాన్నిహిత్యాన్ని ప్రదర్శించకూడదు. పరిధి దాటితే శిక్ష తప్పదు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే శిక్షలు తప్పవు. క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి సర్వీస్ రూల్స్ ప్రకారం శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేతన పెరుగుదల నిలిపివేయడం, పదోన్నతి నిలిపివేయడం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం నుంచి తొలగించడం, నిర్బంధ పదవీ విరమణ చేయించడం జరుగుతుంది. అధికారి ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే కేసులు నమోదుచేసి జైలుకు పంపే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో జరిమానాలు విధిస్తారు. ఎన్నికల సమయాల్లో కఠిన నిబంధనలు నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు -
14న అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ పరీక్ష
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణలోని అల్ఫోర్స్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 14న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అమోట్–2025 (అల్ఫోర్ మ్యాథ్ ఒలింపియాడ్ పరీక్ష) నిర్వహిస్తున్నట్లు అల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. ఈమేరకు కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో శనివారం ‘అమోట్–2025’ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పరీక్షకు 3 నుంచి పదో తరగతి వరకు విద్యార్తులు హాజరుకావచ్చని తెలిపారు. ప్రతీతరగతిలో మొదటి 20 స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.5వేలు, రూ.3 వేలు, రూ.2 వేలనగదు బహుమతులతోపాటు జ్ఞాపికలు అందించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 12లోగా పేర్లునమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 92469 34441, 92469 34456, 93982 30614లలో సంప్రదించాలని తెలిపారు. విజేతలకు ఈనెల 22న రామానుజన్ జయంతి ఉత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ పని లేకపోవడంతో వారానికే తిరిగి వచ్చిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురిలో విషాదం నింపింది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చెరుకు రాజేశ్ (33)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబపోషణ కోసం నాలుగు నెలల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ పని లేక వారానికే ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటినుంచి నిత్యం మదనపడుతున్నాడు. అనవసరంగా డబ్బులు ఖర్చయ్యాయని భార్య, తల్లిదండ్రులతో చెబుతున్నాడు. మిత్రడి వద్దకని చెప్పి కాశెట్టి నాగరాజు ట్రావెల్స్కి వెళ్లాడు. షాపులో మిత్రుడు లేకపోవడంతో షాపులో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజేశ్ తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా లక్ష్మీ ప్రసాద్కరీంనగర్క్రైం: సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న వేముల లక్ష్మీప్రసాద్ను ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్గా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఊత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించగా పలువురు ప్రాసిక్యూటర్లు ఆయనకు అభినందనలు తెలిపారు. -
క్రీడల్లో వర్సిటీ పేరు నిలపాలి
కరీంనగర్స్పోర్ట్స్: సౌత్ ఇండియా, ఆల్ ఇండియా వర్సిటీల క్రీడల్లో శా తవాహన యూనివర్సిటీ పేరు నిలపాలని వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ కోరారు. శనివారం శాతవాహన యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో వోఎస్డీ హరికాంత్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మునావర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మ నోజ్ కుమార్, విజయకుమార్, దినేష్, నాగేశ్వరరావు, శ్రీనాథ్, సతీశ్, రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
స్థానికం.. పోస్టల్కు దూరం
కరీంనగర్ అర్బన్: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులను స్థానిక సంస్థల ఎన్నికలు ఓటుకు దూరం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సదరు ఉద్యోగి ఎవరికి ఓటు వేశారనేది తేలిగ్గా బహిర్గతమయ్యే అవకాశాలుండటమే అందుకు ప్రధాన కారణం. దీంతో పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడంపై చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో 70 నుంచి 85 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకుంటుండగా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి 10 శాతం దాటకపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు కాగా.. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 9 వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఓటేసేందుకు ఉద్యోగుల విముఖం కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, నియోజకవర్గాల్లో 6 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. వీరిలో నాలుగువేల మంది వరకు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంపై టిక్చేసి డివిజన్ కేంద్రాలకు పంపిస్తారు. కానీ...స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి పోస్టల్ బ్యాలెట్ పేపర్పై వారికి నచ్చిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులపై టిక్చేసి కవర్లో మండల పరిషత్ కార్యాలయాల్లో అప్పగిస్తారు. అధికారులు అక్కడి నుంచి సదరు ఉద్యోగుల సొంత గ్రామాలు, వార్డుల స్థానాల లెక్కింపు కేంద్రాలకు పంపిస్తారు. ఇక్కడే పెద్ద సమస్య. సాధారణంగా గ్రామ స్థాయిలో ఏ వార్డులో ఎంత మంది ఉద్యోగం చేస్తున్నారో స్థానికులకు తెలుసు. ఒక వార్డులో ఒకరు మరో వార్డులో ఒకరిద్దరు ఇలా వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనే ప్రభుత్వ ఉద్యోగులుంటారు. ఓట్లు లెక్కింపు సమయంలో మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏజెంట్లకు ప్రతీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చూపుతారు. పేరు, వివరాలు లేనప్పటికి ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఆ ఉద్యోగి ఓటు ఏ అభ్యర్థికి వెళ్లిందో స్పష్టంగా తేటతెల్లమవుతోందని ఉద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు సంఘాలు ఎప్పటి నుంచో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ వెసులుబాటు లభించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని ఓట్లలో కలిపి లెక్కిస్తేనే సమస్యకు పరిష్కారమని చెబుతున్నారు. -
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్
● తొలి విడత ఎన్నికలు ముగిసినా వర్తింపు ● జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతికరీంనగర్ అర్బన్: ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఈ నెల 11తో తొలి విడత ఎన్నికలు పూర్తవుతున్న ప్రాంతాల్లోనూ మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకూడదని పేర్కొన్నారు. మూడోదశ ఎన్నికలు పూర్తయిన తరువాతే కోడ్ ఎత్తివేస్తామని వివరించారు. మొదటి, రెండో దశలో ఎన్నికై న అభ్యర్థులు, ఇతరులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించవద్దని, ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ ఉంటుందని వివరించారు. కోడ్ నిబంధనలను విస్మరిస్తే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలుంటాయని పేర్కొన్నారు. 12న భద్రాచలానికి లగ్జరీ బస్సు విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ ప్రత్యేక టూర్లో భాగంగా కరీంనగర్ 2డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 12 శుక్రవారం రాత్రి 8 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరుతుందని డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. 13న పాపికొండలు బోటింగ్, అదేరోజు రాత్రి భద్రాచలం చేరుకుంటుందని, 14న భద్రాచలం, పర్ణశాల దర్శనం అనంతరం అదేరోజు రాత్రి కరీంనగర్ చేరుకుంటుందని డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. పెద్దలకు రూ.1800, పిల్లలకు 1300 టికెట్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9398658062, 8978383084, 9182610182 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. సిటీలో పవర్కట్కొత్తపల్లి: కరీంనగర్లో విద్యుత్ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్డి ఫంక్షన్హాల్, తేజ స్కూల్, ఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రాంతాలు, అదేవిధంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11కేవీ శ్రీవేంకటేశ్వర ఫీడర్ పరిధిలోని కెమిస్ట్భవన్, శివ థియేటర్, కోర్టు వెనుకభాగం, జ్యోతినగర్, వేంకటేశ్వర ఆలయం, ఎక్స్ఫ్లోరికా స్కూల్ ప్రాంతాలు, ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు 11కేవీ గౌతమినగర్ ఫీడర్ పరిధిలోని కట్టరాంపూర్ మెయిన్రోడ్, తిరుమల్నగర్, రెడ్డికాలనీ, శ్రేయం అపార్ట్మెంట్, మౌళిచంద్ర అపార్ట్మెంట్, మైనార్టీ స్కూల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, మహాలక్ష్మీనగర్, ప్రొ.జయశంకర్ కాలనీ, శ్రీనివాస్నగర్కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. తీగలగుట్టపల్లిలో.. విద్యుత్ 132 లైన్ పనులు కొనసాగుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్డి ఫంక్షన్హాల్, సరస్వతీనగర్, వడ్ల కాలనీ, చంద్రాపూర్కాలనీ, రెవెన్యూ కాలనీ, హనుమాన్నగర్, అమ్మగుడి, తీగులగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. నిజాయితీపరులనే ఎన్నుకోవాలి గన్నేరువరం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మందు..విందుకు ఓట్లను అమ్ముకోవద్దని, గ్రామాభివృద్ధికి పాటు పడే నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బామండ్ల రవీందర్, కార్యదర్శి మాశం అంజనేయులు అన్నారు. మండలంలోని మాదాపూర్, గునుకుల కొండాపూర్ గ్రామాల్లో శనివారం ఎన్నికల్లో ఓటుహక్కు, అభివృద్ధి వంటి అంశాలపై ఓటర్లకు వివరించారు. ఓటు వజ్రాయుధమని, నోట్లకు ఓట్లు అమ్ముకునే సంస్కృతికి స్వప్తి పలకాలని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడే వ్యక్తిని సర్పంచ్ ఎన్నుకుంటే అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత
● కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సీపీ గౌస్ ఆలం పోలీసు అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సీపీ మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై స్టేషన్ హౌస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలీసు బలగాలను కేటాయించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు, కమిషనరేట్ పరిధిలోని రౌడీషీటర్ల బైండోవర్ పూర్తి చేశామని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, మాధవి, విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, వేణుగోపాల్, వాసాల సతీశ్, ఇతర అధికారులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
స్వామియే శరణం అయ్యప్ప
మంగళవాయిద్యాలు..అభిషేక అర్చనలు.. వివిధ అలంకరణలు.. శరణు ఘోషలు.. అయ్యప్ప నామస్మరణలు..భజనల.. కీర్తనలు.. వెల్లువెత్తిన భక్తి పారవశ్యం మధ్య శనివారం కరీంనగర్ సిటీలోని మహాశక్తి ఆలయంలో మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వామి కావేటి పరమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గణపతి, కుమారస్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు పెదసంఖ్యలో పాల్గొన్నారు. – కరీంనగర్కల్చరల్ -
కరీంనగర్
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 20257వేములవాడ: రాజన్న గుడి విస్తరణ, అభివృద్ధి పనులతో ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తులు రాజన్న ప్రధాన గుడి ఎదుటనే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ధర్మపురిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. -
ప్రీ ప్రైమరీ పాఠశాలలకు మహర్దశ
కరీంనగర్టౌన్: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలకు మహర్దశ పట్టనున్నది. జిల్లాలో 25 ప్రీప్రైమరీ పాఠశాల ఇన్స్స్ట్రక్టర్లుకు గతనెల 25 నుంచి 29 వరకు సప్తగిరికాలనీ ప్రభుత్వం పాఠశాలలో శిక్షణా శిబిరం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్న ఈ పాఠశాలలకు బోధనాభ్యాసన సామగ్రిని సమగ్ర శిక్ష అధికారులు సమకూరుస్తున్నారు. ఆటపాటలతో చిన్నారులకు బోధన చేసేందుకు ఈ సామగ్రి ఉపయోగపడనున్నది. వీటితో పాటు తరగతి గదులకు రంగులు, బాలలకు ఏకరూప దుస్తులు అందించనున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అధునాతన వసతులతో చిన్నారులే కాకుండా వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది మొదటగా జిల్లా వ్యాప్తంగా 25 ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశారు. వీటికి ఒక ఇన్స్ట్రక్టర్ చిన్నారులను చూసుకునేందుకు ఆయాను విద్యాశాఖ నియమించింది. దాదాపు 250 మందికిపైగా బాలలు చేరగా యూకేజీ తరగతులు బోధిస్తున్నారు. అయితే సాధారణ రీతిలో బోధన చేస్తుండటంతో చిన్నారులు ఆకర్షితులు కావడం లేదని తెలుస్తోంది. కిడ్స్ కేర్ పాఠశాలలను తలపించేలా ఈ పాఠశాలల్లో అధునాతన వసతులు, ఆటపాటలతో కూడిన బోధన పద్ధతులతో తీర్చిదిద్దేందుకు అధికారులు దృష్టిసారించారు. బోధన సామగ్రికి నిధులు జిల్లాలోని ఒక్కో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు రూ.1.70 లక్షల నిధులు కేటాయించి వీటిని తీర్చిదిద్దుతున్నారు. సామగ్రి, బోధనాభ్యసన సామగ్రి అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు చేరడంతో ఎంఈవోల ద్వారా పాఠశాలలకు పంపిణీ చేశారు. పాఠశాల తరగతి గదులను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు రూ. 50వేలతో రంగులు వేయిస్తున్నారు. రూ.20వేలతో బాలలకు దుస్తులు, స్టేషనరీ సమకూరుస్తున్నారు. ఆట పాటలతో అభ్యసనా సాగించేందుకు పలు రకాల వస్తువులు, ఆట బొమ్మలు, రంగు రంగుల ఆకారాలు వంటివి అందించనుండటంతో చిన్నారులు చదువుపై ఆసక్తి చూపిస్తారని, ఈ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ప్రీప్రైమరీ స్కూళ్లకు కూడా.. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లోని చిన్నారులకు ప్రతీరోజు పాలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రీప్రైమరీ పాఠశాలను బలోపేతం చేసే దిశగా చిన్నారులకు పాలు తదితర ఆహార వస్తువులు అందజేయాలనే ఇటీవల మంత్రి సీతక్క తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారులకు ఏడాదిలో 200 రోజుల పాటు రోజు 100 మి.లీ. పాలు పంపిణీ చేసేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఇటీవల ఆదేశాలు జారీచేశారు. అంగన్వాడీ కేంద్రాలకు లీటర్ విజయ డెయిరీ డబుల్ టోన్డ్ యూహెచ్ టీ టెట్రా ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. ప్రీప్రైమరీ స్కూళ్లను బలోపేతం చేసే దిశగా అధికార యాంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటేసి పోండి
బాబాయ్ నమస్తే.. అంతా కుశలమేనా.. సర్పంచ్గా పోటీచేస్తున్న.. 11న మన పోలింగ్ ఉంది. పిన్ని, చిన్నోడు, నువ్వు బుధవారం సాయంత్రంలోగా ఊరికి వచ్చేలా ప్లాన్ చేసుకో. ఏం ఫికర్ పడకు. రానుపోను చార్జీలతోపాటు పైఖర్చులు కూడా చూసుకుంట. ఈ నంబరుకు ఫోన్ పే ఉందికదా? రవాణా చార్జీలు పంపుతా.. లేదా.. మన ఊరోళ్లు మీ కాలనీలో ఎవరైనా ఉంటే ఓ కారు మాట్లాడుకోని అందరూ రండి.. కిరాయి నేనేఇస్త. నామీద ఒట్టే.. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఓటెయ్యాలి? – వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లకు ఇది నిదర్శనం. సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్/ కరీంనగర్ టౌన్/హుజూరాబాద్: గ్రామం యూనిట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. స్వల్ప తేడా ఓట్లతోనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ‘నువ్వా.. నేనా’ అన్నట్లు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల వారీగా అనుకూల ఓట్లపై ఆరా తీస్తూ వారిని ఎలా కలవాలి? అనే దానిపై ప్లాన్ చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లినవారిపై ఫోకస్.. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామ ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 200 మందివరకు వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలనూ రంగంలోకి దింపారు. వలస వెళ్లిన వారికి ఫోన్లపై ఫోన్లు చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలింగ్కు ఒకరోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంర్లు సేకరిస్తూ, వాట్సప్ గ్రూప్లు క్రియేట్ చేస్తూ వారితో టచ్లో ఉంటున్నారు. ముందస్తు చెల్లింపులు కూడా.. ముందుగానే డబ్బులు పంపిస్తే ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని, లేకపోతే వేయకపోవచ్చని భావించి కొందరు అభ్యర్థులు ముందుగానే డబ్బులు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో ఓటరుకు రాకపోకలకయ్యే ఖర్చుతోపాటు అదనంగా ఓటకు రూ.500 వరకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లిన వారు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినవారు తమకు వచ్చే కూలి డబ్బులు నష్టపోకుండా చెల్లింపులు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక వాహనాల ఏర్పాటు.. ఓటరు జాబితా ఆధారంగా వార్డుల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఒకేచోట ఎక్కువమంది ఉంటే ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకుని రావాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి పంపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంతమంది ఓటర్లు గ్రామాలకు వస్తున్నారనేది తెలుసుకుని అందుకు సరిపడా డబ్బులు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్పే, గూగుల పే వివరాలు సేకరిస్తున్నారు. రవాణా ఖర్చులకు తోడు పైఖర్చులను సైతం చెల్లింస్తామంటూ ఆఫర్స్ ఇస్తున్నారు.‘గుర్తు’ కోసం: పల్లె ప్రచారం జోరుగా సాగుతోంది. కొంత మంది సర్పంచ్ అభ్యర్థులు గుర్తును గుర్తుంచుకోవాలని ఓటర్లకు వారికి కేటాయించిన ఉంగరం, కత్తెర, కప్పు సాసర్లు, బ్యాట్లు, కాక్లు, జగ్గులు ఓటర్లకు పంపిణీ చేసి పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాల సభ్యులకు నగదు ముట్టజెబుతున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు, మహిళ సంఘాలకు నగదు, ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లు ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. వాట్సాప్ ద్వారా కూడా అభ్యర్థులు తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. తాము గెలిస్తే ఏంచేస్తామో వివరిస్తూ వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. విందులు, వినోదాలకు ఆన్లైన్ పేమెంట్లు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగు పంచాయతీ పీఠాన్ని దక్కించుకునే ప్లాన్ చేస్తున్నారు. -
గంభీరావుపేటలో..
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీతో పాటు వివిధ గ్రామాల్లో ప లువురు విద్యాధికులు సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నారు. గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తు న్న చేరాల లహరిక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ డిప్లామా కోసం ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఈ క్రమంలోనే సర్పంచ్ స్థానా నికి నామినేషన్ దాఖలు చేసింది. గంభీరావుపేటలో కోడె స్వప్న సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. -
వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి
జగిత్యాలరూరల్: భారతీయ వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ఓవర్సిస్ మొబిలిటి బిల్ ప్రవాసీల హక్కులు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ సభ్యులు చెల్లమనేని శ్రీనివాస్తో కలిసి రాష్ట్ర ఎంపీలకు వినతిపత్రం సమర్పించారు. 42 ఏళ్లుగా అమలులో ఉన్న ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంపీ డీకే.అరుణ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్.సురేశ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేశ్ శెట్కర్, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్కుమార్రెడ్డి, ఎంపీ మధుయాష్కిలతో చర్చించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యహుజూరాబాద్రూరల్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ అభినయ్ నందన్(19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కొక్కొండ రమేశ్ కొడుకు అభినయ్ నందన్ హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకున్నాడు. తండ్రి గమనించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. తన కొడుకు చదువులో వెనకబడి, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతివేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వే ములవాడ మండలం చింతాల్ఠాణాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి(50) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మురళి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి. గురువారం రాత్రి 7 గంటల వరకు కత్తెరగుర్తుకు ఓటేయాలని కోరుతూ గ్రామంలో ప్రచారం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో గుండెలో నొప్పిగా ఉందని, వేములవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి బైక్పై వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని సూచించారు. అంబులెన్స్లో వెళ్తూ పరిస్థితి విషమించడంతో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మురళికి కుమారుడు ఆదిత్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు. కుమారుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తండ్రి చివరి చూపు కోసం వస్తుండటంతో అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. సర్పంచ్ అభ్యర్థి మురళి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యథావిధిగా ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థి మృతిచెండంతో ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా.. అనే అనుమానంతో శుక్రవారం గ్రామంలో ఎవరూ ప్రచారం చేయలేదు. ఎన్నికలు యథావిధిగా నిర్వహిస్తామని ఎంపీడీవో కీర్తన ప్రకటించారు. -
గ్రామాలు నిర్లక్ష్యానికి గురైనందుకే
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం కమాన్పూర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసారు. ఉన్నత విద్య అనంతరం గృహిణిగా కొనసాగుతున్నా. కమాన్పూర్ సర్పంచ్స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో పోటీలో నిలిచాను. భర్త వ్యవసాయం, వ్యాపారం చేస్తుండడం, గ్రామస్తులతో మంచి పరిచయాలు ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నా. గ్రామస్థాయిలో ప్రజలు అనేక అన్యాయాలకు గురవుతున్నారు. ఆదర్శ గ్రామంగా చేయాలన్న కోరిక మేరకే పోటీలో నిలిచాను. – నునుగొండ మానస, బీటెక్ (ఈసీఈ) -
ఉద్యోగంలో సంతృప్తి లేక
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం నాగులమల్యాల మాది. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఈఈఈ) చేశా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మన్ లాంగ్వేజీ పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలని భావించా. ఇక్కడే కార్పోరేట్ ఉద్యోగం దొరికింది. నాగులమల్యాల సర్పంచ్ అభ్యర్థి జనరల్ మహిళలకు కేటాయించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో నిలిచాను. ఉద్యోగంలో అనుకున్న సంతృప్తి లేకపోవడం..ఇదివరకే వర్సిటీ స్థాయిలో విద్యార్థి నాయకురాలిగా చేసిన అనుభవం ఉండటంతో పోటీలో నిలిచాను. తండ్రి రాజాగౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా చేసి ఓడిపోయారు. – మల్యాల జాహ్నవి, బీటెక్ (ఈఈఈ) -
రూ.1.56 లక్షలు సీజ్
రామగిరి(మంథని): ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. శుక్రవారం లద్నాపూర్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మంథనికి చెందిన ఊడిమాడుగుల సురేందర్ వద్ద రూ.1,56,910 నగదు లభించింది. ఆధారాలు చూపించకపోవడంతో సీజ్చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి అరవింద్కు అప్పగించారు. మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో నివసిస్తున్న యెల్లె రమేశ్(42) శుక్రవారం మానేరువాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్కు చెందిన రమేశ్ పవర్లూమ్ కార్మికుడిగా పనిచేసేవాడు. ఏడాదిగా పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మద్యం మానేయలని భార్య లత మందలించడంతో మనస్థాపానికి గురై ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం తంగళ్లపల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాగులో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. -
సేవాలాల్తండా..
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని సేవాలాల్తండా పంచాయతీ పాలకవర్గానికి చివరి రోజు శుక్రవారం సర్పంచ్తోపాటు ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిగా భూక్య సరిత, వార్డు సభ్యులుగా లకావత్ శ్రీనివాస్, నిమ్మల అనిత, రమావత్ సునీత, ధరంసోత్ రేఖ, కట్ట వేణు, లకావత్ స్వరూప, రాగం దేవయ్య, ముడావత్ మౌనిక సింగిల్ నామినేషన్లు వేశారు. వీరిని సిద్దిపేట మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భూక్య చందర్నాయక్, నాయకులు కల్వకుంట్ల గోపాల్రావు, సురేందర్రావు, గౌతంరావు, కట్ట బాపురావు, కిషన్రావు అభినందించారు. -
కాల్వశ్రీరాంపూర్లో 12లో 8మంది..
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో 12 మహిళలకు కేటాయించారు. ఎనిమిది స్థానాల్లో గ్రాడ్యుయేట్లు పోటీలో నిలిచారు. కాల్వశ్రీరాంపూర్కు చెందిన జూకంటి శిరీష ఎంకాం చేశారు. గతంలో ఎంపీటీసీ, వైస్ ఎంపీపీగా సేవలందించారు. ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలిచారు. మీర్జంపేట నుంచి పుప్పాల రాజశ్యామల హృదయ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఎంకాం పూర్తి చేశారు. ఆరెపల్లి నుంచి సాకర్మాన్ విశాల పోటీలో నిలవగా.. బీఎస్సీ కంప్యూటర్ చదివారు. మడిపల్లి నుంచి అడిగొప్పుల రాణి పోటీ చేస్తున్నారు. బీకాం కంప్యూటర్ పూర్తి చేశారు. జాఫర్ఖాన్పేట నుంచి యాదగిరి జ్యోత్స్న పోటీ చేస్తుండగా ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేశారు. వెన్నంపల్లి నుంచి ఎంబాడి యశోద బరిలో ఉన్నారు. ఎంబీఏ, బీఎస్సీ చదివారు. పెద్దంపేట నుంచి పోటీ చేస్తున్న దాసరి సునీత బీకాం, సీఏ చదివారు. సర్పంచ్ పోటీకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. -
జిల్లాలో 32 ఏసీబీ కేసులు
● డీఎస్పీ విజయ్కుమార్ కరీంనగర్క్రైం: అవినీతి నిర్మూళనకు ప్రతి పౌరు డు పాటుపడాల ని ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ సూచించారు. నగరంలోని ఏసీబీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. లంచం ఇవ్వడంతో పాటు తీసుకోవడం నేరమని అన్నారు. లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూ ఆర్కోడ్ను విడుదల చేసిందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 32 కేసులు నమోదు చేసి, రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచామన్నారు. లంచం అడిగే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. కరీంనగర్కల్చరల్: ధర్మాదాయ, దేవాదాయశాఖకు చెందిన సీసీఎల్ భూముల రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ జోన్ ఉపకమిషనర్ సునీత సూచించారు. శుక్రవార ఉమ్మడి జిల్లా దేవాదాయ కమిషనర్ కార్యాలయం సమావేశం అయ్యారు. సీసీఎల్ఏ భూ ములు రిజిస్ట్రేషన్ చేసే ముందు పూర్వ రికార్డులైన కాస్ర, సేతువర్, చేన్ల వివరాలు సేకరించి, సర్వే నంబర్లు ధ్రువీకరణ చేయాలన్నారు. వివరాలను 22–ఏ(ఐ)సీ ప్రొఫార్మలో నమోదు చేసి రికార్డులు రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా సహా య కమిషనర్ నాయిని సుప్రియ పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): ఆరోగ్యకరమైన నేలలతోనే చక్కని దిగుబడి వస్తుందని డీఏవో భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ మృత్తిక (నేల) దినో త్సవం సందర్భంగా శుక్రవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో చింతకుంటలో పంట అవశేషాల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. డీఏవో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో, ఆహా ర భద్రతలో, జీవ వైవిధ్య పరిరక్షణలో నేల కీలక పాత్ర పోషిస్తుందన్నారు. శాస్త్రవేత్త డా. కె.మదన్ మోహన్రెడ్డి, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా.హరికృష్ణ, వ్యవసాయ పరిశోధనస్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా.ఇ.రజనీకాంత్, డా.రాజేంద్ర ప్రసాద్లు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, జీవన ఎరువులు వాడాలని, నేల ఆరోగ్యమే మనుషుల ఆరోగ్యం అని తద్వారా దేశ ఆరోగ్యం బావుంటుందన్నారు. పంట అవశేషాల యాజమాన్యం, పంట మార్పిడి చేయడం, మల్చింగ్ చేయడం వంటివి చేయాలని రైతులకు సూచించారు. గన్నేరువరం: రెండేళ్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గన్నేరువరంలో సర్పంచ్ అభ్యర్థి సందవేని ప్రశాంత్తో పాటు వివిధ పార్టీలకు చెందినవారు బీజేపీలో చేరారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లలో రేవంత్ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. గ్రామ పంచాయతీలు మొదలుకుని రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మానేరుపై వంతెన నిర్మాణానికి మంత్రి కృషి చేశారన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు తిప్పర్తి నికేశ్, భార్గవరెడ్డి, సాయిని మల్లేశం, ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్వర్మ, కరివేద మహిపాల్రెడ్డి, వి.రామచంద్రం పాల్గొన్నారు. -
ప్రచార వాహనాలకు అనుమతుల తిప్పలు
కరీంనగర్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నవారు ప్రచార అనుమతులు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి విడత ప్రచారానికి ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండగా పోలీస్, రెవెన్యూశాఖల నుంచి సకాలంలో ప్రచార వాహనాలకు అనుమతులు లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, గంగాధర, రామడుగు, చొప్పదండిలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. సర్పంచ్ 463, వార్డు సభ్యులకు 1,939 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే గుర్తులు కేటాయించగా.. వాహనాల ద్వారా గ్రామాల్లో విస్తతంగా ప్రచారం చేయాలని భావించిన అభ్యర్థులకు వాహనాలు, మైక్లకు అనుమతులు పొందడం కత్తిమీద సాములా మారింది. రెవెన్యూశాఖ ఆద్వర్యంలో మ్యాన్యువల్ పద్ధతిలో వాహన అనుమతి జారీ చేస్తున్నారు. పోలీస్శాఖ నుంచి మైక్ అనుమతిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఏసీపీస్థాయి అధికారి మంజూరు చేస్తున్నారు. శుక్రవారం రెవెన్యూశాఖ నుంచి వాహనాలకు అనుమతి పొందిన పలువురు అభ్యర్థులు మీసేవా, ఆన్లైన్ కేంద్రాల ద్వారా మైక్ అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆన్లైన్లో అభ్యర్థుల వివరాలను నమోదు చేయగా.. ఎర్రర్ డిటెయిల్స్ అని రావడంతో మైక్ అనుమతి లభించలేదు. పలువురు అభ్యర్థులకు మైక్ అనుమతి రాకపోవడంతో ప్రచార వాహనాలను ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల అధికారులు ఆన్లైన్లో మైక్ అనుమతి విధానాన్ని రద్దు చేసి మ్యాన్యువల్లో అనుమతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
నువ్వు సర్పంచ్.. నేను ఉప సర్పంచ్
కరీంనగర్: రిజర్వేషన్లు కలిసిరాక సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కోల్పోయిన చోట ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో ఉపసర్పంచ్గా ఎన్నికై తే ఎంతో కొంత పెత్తనం కొనసాగుతుందనే ఆలోచనతో వార్డు సభ్యుల మద్దతును కూడగట్టుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని చాలాచోట్ల రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో పాటు మహిళలకు 50 శాతం సర్పంచ్స్థానాలు రిజర్వ్ కావడంతో కీలకనాయకులకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా వార్డు మెంబర్గా గెలిచి ఉపసర్పంచ్ పదవి చేపట్టాలని భావిస్తున్నారు. వీరూ.. కీలకమే.. గ్రామపాలనలో ఉపసర్పంచ్ కీలక భూమిక పోషించనున్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పవర్ఫుల్గా మారారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్కు కూడా ఉమ్మడి చెక్పవర్ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఉపసర్పంచ్ పోస్టును బలంగా తయారు చేసింది. దీంతో తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు హోరాహోరీగా పోరు సాగుతుంది. దీంతో రిజర్వుడ్ స్థానాల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. చాలామంది జనరల్ అభ్యర్థులు వార్డు మెంబర్గా విజయం సాధించి ఉపసర్పంచ్ పదవిని చేజిక్కించుకోవాలని ఎత్తుగడ వేస్తున్నారు. అవసరమైన సంఖ్యా బలాన్ని సమీకరించుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఉపసర్పంచ్ పదవిని కూడా ఎన్నుకోవాల్సి ఉన్నందున ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులకు ఆర్థిక చేయూత అందిస్తున్నారు. తాము పోటీచేస్తున్న వార్డుల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు. చెక్ పవర్తో పెత్తనం.. ఉప సర్పంచ్లకు సర్పంచ్తో పాటు జాయింట్ చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది.గ్రామపంచాయితీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్పవర్ కల్పించిన సర్కారు.. బాధ్యతలను మాత్రం పూర్తిస్థాయిలో సర్పంచ్లకే అప్పగించింది. ప్రభుత్వ పథకాల అమలులో విఫలమైతే సర్పంచ్పై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టానికి ఉంది. ఉపసర్పంచ్ను ఇందులో భాగస్వామిని చేయకపోవడం గమనార్హం. దీంతో మహిళలు సర్పంచ్లుగా ఉన్న చోట్ల పెత్తనం చెలాయించడానికి ఉపసర్పంచ్ పదవి ఎంతో అనుకూలమనే భావనలో కొందరు నాయకులు ఉన్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీచేసే అవకాశం దక్కని వారు ఉపసర్పంచ్ పదవిపై కన్నేసి పావులు కదుపుతున్నారు. -
పటిష్ట భద్రతకు ప్రత్యేక ప్రణాళిక
కరీంనగర్క్రైం: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతున్నామని సీపీ గౌస్ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం కరీంనగర్రూరల్, హుజూ రాబాద్ డివిజన్లలోని ఉన్నతాధికారులు, క్లస్టర్ ఇన్చార్జీలు, రూట్ ఇన్చార్జులు, గ్రామ పోలీసు అధికా రులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారులు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి చిన్న హ్యాండ్బుక్లెట్ అందిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని 15 పోలీ సుస్టేషన్ల పరిధిలో పోలింగ్కేంద్రాలకు అనుగుణంగా 104 రూట్లు ఉండగా, 57 క్లస్టర్లు ఉన్నాయని వీటికి 83మంది క్లస్టర్ ఇన్చార్జీలు ఉన్నారని తెలిపా రు. 309మంది వీపీవోలను నియమించామన్నారు. ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయిలో 508 మంది పోలీసులు నిరంతరంగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 25మంది ఎస్సైలు వీరిని పర్యవేక్షిస్తారని అన్నారు. -
అప్పుడే సర్పంచ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇల్లు అలకగానే పండగ కాదు.. నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనేది సత్యం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వస్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయింది. సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వారం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదికాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి. అందుకోసం అభ్యర్థులు అప్పుల వేటలో పడ్డారు. ‘అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం. గెలవకపోతే అప్పుల ఊబిలో.. వాస్తవానికి అప్పులు చేసి పోటీచేస్తున్న అభ్యర్థులలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తారన్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది. గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి. అందుకే, ఈ యువ నాయకులు తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరంతా ఈ అప్పులను ఎలా తీరుస్తారో చూడాలి మరి!కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడతల్లో పలు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకున్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చిన్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక 3వేలు.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముందు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఊరికి ఏం చేస్తారో? ఆ పనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రామ పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తెస్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే విత్డ్రాయల్స్ సజావుగా సాగుతున్నాయి.జిల్లా పంచాయతీలు అభ్యర్థులు కరీంనగర్ 89 388 జగిత్యాల 118 461 పెద్దపల్లి 95 376 రాజన్నసిరిసిల్ల 76 295 -
ఆలస్యమైనా పదవులు పక్కా
కరీంనగర్ కార్పొరేషన్: పార్టీ వెన్నంటి ఉన్న వాళ్లకు కాస్త ఆలస్యమైనా పదవులు పక్కాగా వస్తాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం డీసీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం మాట్లాడుతూ కష్టపడితే కాంగ్రెస్లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా సత్యం ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలకు వారధిగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ చెప్పినట్లు కాళ్లల్లో కట్టె పెట్టేటోళ్లకు కాకుండా అభివృద్ధి చేసేటోళ్లకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అవకాశం ఇవ్వాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసినంత కాలం కాంగ్రెస్ను ఎవరూ ఓడించలేరన్నారు. పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొనే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అభిప్రాయాల మేరకే తనను, అర్బన్ అధ్యక్షుడిగా అంజన్ను నియమించారన్నారు. పైరవీలకు తావు లేదని, క్షేత్రస్థాయిలో అభిప్రాయాల మేరకు టికెట్లు వస్తాయన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్, కొడూరి సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్పార్టీ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి డీసీసీ కార్యాలయం వరకు సత్యంను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంబేడ్కర్, గాంధీ తదితర విగ్రహాలకు సత్యం పూలమాలలు వేశారు. సాయంత్రం కావడంతో ర్యాలీతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
కరీంనగర్
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 20257పత్తి ధర రూ.7,300జమ్మికుంట: మార్కెట్కు శుక్రవారం 464 క్వింటాళ్ల పత్తి వచ్చింది. గరిష్టంగా రూ.7,300, కనిష్ట ధర రూ.6,400 పలికింది. శని, ఆదివారాలు మార్కెట్కు సెలవని ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.సిటీలో నేడు పవర్ కట్కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పునరుద్ధరణ నేపథ్యంలో శనివారం ఉదయం 11 నుంచి 5 గంటల వరకు తేజ స్కూల్, ఎస్ఆర్ కళాశాల ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
వలస కూలీల పిల్లలను గుర్తించండి
కరీంనగర్టౌన్/తిమ్మాపూర్: జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం మండల విద్యాధికారులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వలస కూలీలు ఎక్కువగా పనిచేసే చోటే వర్క్సైట్ స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి ఈ బడిలో చేర్పించాలన్నారు. పిల్లలకు పోషకాహారం, దుస్తులు, పుస్తకాలు అందిస్తామన్నారు. ఇటుక బట్టీల యజమానులు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఇప్పటికే 185మంది పిల్లలను గుర్తించినట్లు విద్యాధికారులు కలెక్టర్కు వివరించారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు స్లిప్టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. మండల విద్యాధికారులు వారానికి రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలన్నారు. స్నేహిత ఫిర్యాదుల పెట్టెను నిర్వహించాలన్నారు. డీఈవో మొండయ్య, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించడంతోపాటు పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అలుగునూర్లోని కాకతీయకాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకు హాజరయ్యారు. పోషకాహారంతోపాటు ఆలనాపాలన చూ సే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులు 4 ఏఎన్సీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఖరీదైన టీఫా స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపారాణి, సీడీపీవో శ్రీలత, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ పాల్గొన్నారు. -
వలస పిల్లలకు వెలుగుదారి
● కలెక్టర్ పమేలా సత్పతి గంగాధర: వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహించి సమీప పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలో గురువారం వలసకార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు ప్రారంభించారు. 42మందిని పాఠశాలలో చేర్పించారు. వారికి యూనిఫాం, పుస్తకాలు, నోటు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అదేశించారు. తహసీల్దార్ రజిత, ఎంఈవో ప్రభాకర్రావు పాల్గొన్నారు.చైన్మెన్ల ఆగడాలకు చెక్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చైన్మెన్ల ఆగడాలకు బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ చెక్ పెట్టారు. ఎనిమిది మందిని గంపగుత్తగా బదిలీ చేశారు. టౌన్ప్లానింగ్ విభాగంలో క్షేత్రస్థాయిలో సహాయకులుగా ఉండాల్సిన చైన్మె న్లు అక్రమ వసూళ్లకు, వివాదాలకు చిరునామాగా మారడంతో వారి స్థానంలో ఔట్సోర్సింగ్కు బదులు మొత్తం రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. గంపగుత్త బదిలీ నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఎనిమిది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చైన్మెన్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు టీపీఎస్లు, ఐదుగురు టీపీబీవోలకు సహాయకులుగా ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, ఫిర్యాదులు, వివాదాలు వస్తే క్షేత్రస్థాయిలో కొలతలు, ఇతరత్రా అవసరాలకు సహకరించడం వీరి విధి. తమ విధులకు మించి అక్రమ వసూళ్లు, బెదిరింపులతో చైన్మెన్లంటేనే భవన నిర్మాణదారులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఏదైనా ఫిర్యాదు వస్తే అక్కడికి వెళ్లి అవతలి వాళ్లతో మాట్లాడుకొని డబ్బులు తీసుకొని ఫిర్యాదుదారుడిదే తప్పు అని తేల్చిచెప్పి రావడం చైన్మెన్ల ప్రత్యేకత. ఇలాంటి చైన్మెన్లకు కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతుండడంతో, వారి ఆగడాలు నిరాటకంగా కొనసాగాయి. దీనిపై ‘సాక్షి’లోనూ పలు కథనాలు వచ్చాయి. చైన్మెన్ల ఆగడాలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. చైన్మెన్ల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించిన నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ గంపగుత్తగా మొత్తం ఎనిమిది మందిని బదిలీ చేశారు. వారిస్థానంలో రెగ్యులర్ ఉద్యోగులైన విజయ్, శ్నేషేష్ రాజ్, అన్వేష్, రామచంద్రం, అరుణ్, మల్లేశం, ఆనంద్కుమార్, జీత్కుమార్ను నియమించారు. రెగ్యులర్ఉద్యోగులైతే జవాబుదారితనం ఉంటుందనే ఉద్దేశంతో భర్తీ చేశారు. చైన్మెన్లలో ఇద్దరిని రెవెన్యూ, ఒకరు టౌన్ప్లానింగ్, ఐదుగురిని శానిటేషన్కు కేటాయించారు. -
అయ్యప్ప భక్తులకు శుభవార్త
● నాందేడ్– కొల్లం ప్రత్యేక రైలు రెండు అదనపు ట్రిప్పులు సాక్షిప్రతినిధి, కరీంనగర్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ‘అయ్యప్పా.. ఒ కటే ట్రిప్పా?’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పాటు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అభ్యర్థన మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. నాందేడ్–కొల్లం ప్రత్యేక రైలును రెండు అదనపు ట్రిప్పులు నడిపేందుకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 7, 9 తేదీలలో (అప్ అండ్ డౌన్) వయా కరీంనగర్ మార్గంలో ఈ రైలు నడవనుంది. ప్రత్యేక రైలును అదనంగా రెండు ట్రిప్పులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అంగీకారం తెలపడంపై పలువురు అయ్యప్ప భక్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండోవిడత పోలింగ్ సిబ్బంది కేటాయింపు ర్యాండమైజేషన్ విధానంలో పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్లుతో కలిసి ర్యాండమైజేషన్ విధానాన్ని పరిశీలించా రు. జిల్లాలో రెండో విడతలో చిగురుమామిడి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: కార్మికులకు రూ.30 లక్షల బీమా కల్పించిన నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్దేశాయ్కు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞలు తెలిపింది. గురువారం నగరపాలకసంస్థకార్యాలయంలోని ఆయన చాంబర్లో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గతంలో కార్మికులకు ప్రమాద బీమా చేయించాలని అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు అన్నారు. కమిషనర్ ప్రఫుల్దేశాయ్ రూ.30 లక్షలు బీమా కల్పించడంతో పాటు, కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, కొబ్బరినూనె, షూలు తదితర వస్తువులు ఇచ్చారన్నారు. జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి రవి, మహిళా కమిటీ కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా కోశాధికారి దాసరి రాజమల్లయ్య, కార్పొరేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవునూరి శ్యామ్సుందర్, డ్రైవర్ల కమిటీ నాయకులు జంగం రవీందర్, జోగు గంగయ్య, చంద్రకళ, కూర రాజు, బెజ్జంకి స్వామి, రాజు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): వేసవి ప్రణాళిక సిద్ధం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో మాట్లాడుతూ పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్న చోట అదనపు సామర్థ్యం ట్రాన్స్ఫార్మర్లు బిగించాలన్నారు. 33 కె.వీ, 11 కె.వీ. లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వినియోదారులకు అంతరాయాలు లేకుండా 11 కె.వీ., 33 కె.వీ. లైన్ల మెయింటెనెన్స్ చేయాలన్నారు. వ్యవసాయ సర్వీస్ దరఖాస్తులను 15 రోజుల్లోపు పరిష్కరించి సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలని, గృహ, వాణిజ్య మీటర్లు ఏడు రోజుల్లోపు విడుదల చేయాలని తెలిపారు. 1912 ఫోన్ ద్వారా వచ్చిన వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. డీఈ (టెక్నికల్) కె.ఉపేందర్, డీఈలు జంపాల రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి పాల్గొన్నారు. -
ఎన్నికల గిరాకీ
కరీంనగర్టౌన్: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండంతో ప్రింటింగ్, ఫ్లెక్సీ దుకాణాల్లో సందడి మొదలైంది. ఎక్కడ చూసినా అభ్యర్థుల నమూనా బ్యా లెట్లు ముద్రిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేవలం బ్యాలెట్ గుర్తు మాత్రమే ఉంటుండగా.. అభ్యర్థి పేరు ఫొటోలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో పల్లె పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు తమ గుర్తులను ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. పెరిగిన గిరాకీ.. స్థానిక ఎన్నికలతో ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీ దుకాణా లకు గిరాకీ పెరిగింది. అభ్యర్థులు నమూనా బ్యాలెట్, డోర్పోస్టర్లను ముద్రించుకుంటున్నారు. జిల్లాలో 316 గ్రామపంచాయతీలు, 2,946 వార్డు స్థానాలకు ఈనెల 11, 14, 17 తేదీలో ఎన్నికలు జరగనున్నాయి. బరిలో ఉన్నవారు తమతమ గుర్తులను ప్రచారం చేసుకునేందుకు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, మండల హెడ్ క్వార్టర్లలోఉన్న ప్రింటింగ్ ప్రెస్లు, ఫెక్సీషాపులకు డిమాండ్ పెరిగింది. కరీంనగర్లో కలర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ ఉండడంతో ఎక్కువ మంది వస్తున్నారు. 100 నమూనా బ్యాలెట్పేపర్లకు రూ.450 చార్జి వేస్తుండగా, 100 డోర్పోస్టర్లకు రూ.800 నుంచి రూ 1000 తీసుకుంటున్నారు. ఎన్నికల గుర్తు కలిగిన ఒక్కో కండువాను రూ.25, టోపీ రూ.30కి విక్రయిస్తున్నారు. డమ్మీ గుర్తులు బ్యాడ్జీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రింటింగ్ ప్రెస్లకు డిమాండ్ పెరిగింది. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10కి పైగానే వార్డుస్థానాలు ఉండగా ఒక్కోవార్డు స్థానానికి ముగ్గురు, నలుగురు బరిలో ఉన్నారు. వారంతా ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం నమూనా బ్యాలెట్లు, డోర్ పోస్టర్లను ముద్రించుకుంటున్నారు. -
పౌర్ణమి రోజు అర్ధరాత్రి వరకు..
వీణవంక: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్ని కల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. గురువా రం పౌర్ణమి, మంచిరోజు అని భావించి చాలామంది నామినేషన్ వేశారు. వీణవంక మండలం వల్భాపూర్లో అర్ధరాత్రి వరకు అభ్యర్థులు బారులు తీరా రు. వల్బాపూర్ పరిధిలో బేతిగల్, కనపర్తి, వల్బా పూర్, నర్సింగాపూర్ గ్రామాలున్నాయి. గురువారం మంచి రోజు అని సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కు సాయంత్రం 4గంటలకు ఒక్కసారిగా నామినేషన్ పత్రాలతో పోటెత్తారు. సాయంత్రం 5గంటలకు అధికారులు స్వీకరణ ముగించినప్పటికే, క్యూలైన్లో అభ్యర్థులు భారీగా నిల్చుకున్నారు. నామినేషన్ల స్వీకరణ అర్ధరాత్రి వరకు సాగింది. -
పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన ● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ ● సాంకేతికపరమైన అంశాలపై క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా ● ప్రాజెక్టు, పంపుహౌజ్, రైల్వేస్టేషన్, గోదావరితీరం సందర్శనఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివీటి చేసే అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుకు గురువారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్ర పరిశీలన చేపట్టారు. ఎయిర్పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ, వివిధ అంశాలపై ఆరా తీశారు. పాలకుర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణం ఏర్పాటుకు పలుసాంకేతిక సమస్యలు ఏర్పడడంతో.. ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఎయిర్పోర్టు నిర్మించాలని భావించింది. ఇప్పటికే ప్రీఫిజిబిలిటీ సర్వే కోసం రూ.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విమానాశ్రయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారుల బృందం రాగా, వారికి వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులు సాంకేతికపరమైన అంశాలను వివరించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ స్థలం, గోలివాడ గోదావరినది తీరం, పెద్దంపేట రైల్వేస్టేషన్, గోలివాడ పంపుహౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేశారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
ప్రచార సందడి
‘రామడుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి సదరు వ్యక్తికి ఫోన్ చేశాడు. ‘తమ్మీ.. 11వ తేదీన ఎలక్షన్లు ఉన్నాయి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. తప్పకుండా నాకు మద్దతు ఇవ్వాలె. మీకు ఏం అవసరం ఉన్నా చూసుకుంటా. డ్యూటీ బంజేసి ఓటేసేందుకు తప్పకుండా రావాలే. దారిఖర్చులకు పంపిస్తా’ అంటూ హామీ ఇచ్చాడు. ‘మానకొండూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కరీంనగర్లో ప్రైవేటు టీచర్గా పనిచేస్తున్నాడు. గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఫోన్చేశాడు. ‘అన్నా.. నేను సర్పంచ్గా పోటీ చేస్తన్నా. తప్పకుండా నాకు ఓటెయ్యాలే. వీలైతే మధ్యలో ఒక్కసారి వచ్చి నన్ను కలిసిపోతే మంచిగుంటది. ఇంటికాడ అమ్మాబాపుకు కూడా చెప్పిన’. అంటూ గుర్తు చేశాడు.కరీంనగర్/కరీంనగర్టౌన్: పల్లెల్లో ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా.. తమను ‘గుర్తుంచుకోవాలని’ పోటీదారులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. రెండో విడత నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. బరిలో ఉన్నవారు సమరానికి సన్నద్ధం అవుతున్నారు. మూడో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా.. నేడు ఆఖరు రోజు కావడంతో జోరుగా దాఖలు కానున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఈనెల 11న, రెండోవిడత 14న, మూడోవిడత 17 పోలింగ్ జరగనుంది. ఖర్చు పెట్టే వారికే పెద్దపీట జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రత అధికంగా ఉంది. ఎంత ఖర్చయినా కొందరు వెనకాడడం లేదు. అభ్యర్థులు ప్రతి రోజు వేలల్లో ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. విందు సమావేశాలు పెడుతూ తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. జనరల్ పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు పెట్టే వారికి అవకాశం కల్పిస్తున్నారు. వస్తే సర్పంచ్ పదవి, పోతే పైసలు అన్నట్లు ఖర్చుకు వెనకాడడం లేదు. ప్రజలు కూడా ఖర్చు పెట్టే వారికే పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఖర్చులకు తండ్లాట పల్లెల్లో విందు రాజకీయాలు, తాయిలాల ప్రచారం జోరందుకోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థుకు పైసల రంది పట్టుకుంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్లు అప్పులు చేసి మరీ అడ్డగోలు ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతున్నా ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. గెలుపుకోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు అభ్యర్థులు ఆస్తులను అమ్మడానికి, తనఖా పెట్టడానికి వెనుకాడడం లేదు. పట్టణ ఓటర్లపై దృష్టి గ్రామాలను విడిచి పట్టణాల్లో ఉండే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి, వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటేసేందుకు రావాలని, రవాణా చార్జీలు, అవసరమైతే వాహనాలు పెట్టి రప్పించేందుకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారు. వారికి ఫోన్పే, గూగుల్పేలో దారిఖర్చులు పంపుతున్నారు. పట్టణాల్లో ఉండే వారు వచ్చి ఓట్లు వేసి వెళ్లే వరకు అన్ని వ్యవహారాలు చూసుకునేందుకు అనుచరులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఒక్క ఓటే ఫలితాన్ని తారుమారు చేసే పరిస్థితి ఉండడంతో ప్రతి ఓటరుపై దృష్టిపెడుతున్నారు. ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమవుతున్నారు.తొలి విడతలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో నామినేషన్లు పూర్తయి, సర్పంచ్, వార్డుసభ్యులకు గుర్తులు కేటాయించారు. ఆయా పంచాయతీల్లో ప్రచారం ఊపందుకుంది. రెండో విడత ఎన్నికలు జరిగే చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో నామినేషన్లు, స్క్రూటినీ పూర్తయింది. తుది విడత ఎన్నికలు జరిగే ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, సైదాపూర్ మండలాల్లో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మూడు విడతల్లో ఎన్నికలు జరిగే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకర్షించేందుకు విందు రాజకీయాలు రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితో పాటు ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. కాలనీలకు, సంఘాలకు నజరానాలు ప్రకటిస్తున్నారు. సొంతఖర్చుతో ఆలయాల అభివృద్ధి, బోరుబావులు తవ్వించడం, కుల సంఘాల భవనాలకు హామీ ఇవ్వడం, యువత క్రికెట్ కిట్లు అందిస్తామని చెబుతున్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
హుజూరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలకు పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. హుజూరాబాద్ డివిజన్లోని హుజూ రాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్ మండలాల్లోని నామినేషన్, సమస్యాత్మక కేంద్రాలను గురువారం పరిశీలించారు. హు జూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి చిన్నపాపయ్యపల్లి, వీణవంక మండలం చల్లూరు, మామిడాలపల్లి, జమ్మికుంట పరిధిలోని జగ్గయ్యపేట, వల్భాపూర్, ఇల్లందకుంట మండలంలోని నాగంపేట, టేకుర్తితో పాటు పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ రోజు కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పలువురు రౌడీషీటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి హెచ్చరించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా నేర చరిత్ర ఉన్న వారిని బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, సీఐలు కరుణాకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
నేడు ప్రశాంతం
నాడు సమస్యాత్మకం.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మూడు దశాబ్దాల క్రితం సిరిసిల్ల మానేరు ప్రాంతంలో ఎన్నికలు అంటేనే గ్రామీణుల్లో భయాందోళన ఉండేది. ఒక వైపు పోలీసుల ప్రచారం.. మరో వైపు నక్సలైట్ల అల్టిమేటంతో పల్లెల్లో భయానక వాతావరణం ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. పోలీసుల అవగాహన కార్యక్రమాలతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు పల్లెజనం ముందుకొస్తున్నారు. బహిష్కరణ పిలుపుతో భయాందోళన మూడు దశాబ్దాల క్రితం ఎన్నికలు వచ్చిందంటే సిరిసిల్ల ప్రాంతంలో ఒక రకమైన భయానక పరిస్థితులు ఉండేవి. ఒక వైపు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని నక్సలైట్లు దర్బార్లు పెట్టి పిలుపునిచ్చేవారు. గోడలపై రాతలతో హెచ్చరించేవారు. దీన్ని సవాల్గా తీసుకున్న పోలీసులు పోలింగ్శాతాన్ని పెంచేందుకు జనాన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకునేవారు. అయినా చాలా మంది గ్రామీణులు ఓటు వేసేందుకు వెనుకంజ వేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నక్సలైట్లు మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా నిలుచుండేవారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణులు సైతం ఓటుహక్కు వినియోగించుకునేవారు. అసెంబ్లీ ఎలక్షన్స్కు వస్తే ఓటు వేసేందుకు జంకేవారు. ఆ కాలంలో పంచాయతీ ఎన్నికల్లో 65 నుంచి 68 శాతం పోలింగ్ నమోదయ్యేది. అదే ఇప్పుడు 73 నుంచి 78 శాతం వరకు నమోదవుతుంది. బ్యాలెట్లు మాయం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1995 ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్లు బ్యాలెట్బాక్స్లను అపహరించుకు వెళ్లారు. అయితే తర్వాత పోలీసుల విచారణలో గ్రామంలోని ఓ మిలిటెంట్ వద్ద ఉంచినట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో అప్పటి ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామంలో పోలింగ్అధికారులను బెదిరించడమే కాకుండా బ్యాలెట్బాక్స్ల్లో సిరాను పోసి ఎన్నికలను డిస్టర్బ్ చేశారు. అదే ప్రాంతంలోని కంచర్ల గ్రామంలో కొందరు రిగ్గింగ్ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు కల్లోలిత ప్రాంతంగా ముద్రపడ్డ సిరిసిల్ల ఏరియాలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పోలీసులు తీసుకున్న అవగాహన చర్యలు, నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. గ్రామీణుల్లో ఆర్థిక అక్షరాస్యత.. ఉన్నత విద్యావంతులు పెరిగిపోవడంతో రాజ్యాంగహక్కులపై అవగాహన పొందారు. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో పల్లె ప్రజలు ఉన్నారు. దీంతో ఒకప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా పేరొందిన దుమాల, అడవిపదిర, కంచర్ల, వీర్నపల్లి, మద్దిమల్ల, తిమ్మాపూర్, గుంటపల్లిచెరువుతండా, బుగ్గరాజేశ్వరతండా, వట్టిమల్లతండా, బండమీదితండా, కేలోత్తండా, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వట్టిమల్ల, బావుసాయిపేట, ఎగ్లాస్పూర్, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని చాలా గ్రామాల్లో నక్సలైట్ల ప్రాబల్యం ఉండేది. కానీ నేడు ఆ గ్రామాలే ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ నమోదు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం నక్సల్స్ మాటే వేదం నేడు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి మారిన గ్రామీణ పరిస్థితులు ఎన్నికల్లో పోటాపోటీగా బరిలోకి.. -
స్వరశంఖాలు
సంగ్రామంలో● అభ్యర్థులకు వ్యాఖ్యాతలుగా సిరిసిల్ల గొంతులు ● ఆ గొంతులు వింటేనే ఓటర్లు ఫిదా ● ఎన్నికల నేపథ్యంలో వేలాది మందికి ప్రచారబాణిలుసిరిసిల్లటౌన్: ఊరుపోరులో సిరిసిల్ల స్వరాలు మార్మోగుతున్నాయి. ఏ ఎన్నిక అయినా వారి గొంతులే వినిపిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా వినిపించే మృదుమధుర గొంతులు సిరిసిల్ల వాసులవే. పట్టణానికి చెందిన ఎండీ సలీం, సాంబారి రాజు గొంతులు అభ్యర్థుల తరఫున ఓట్లను అడుగుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా గొంతు వీరిదే. వీరి స్వర విన్యాసాలపై ప్రత్యేక కథనం.సిరిసిల్లకు చెందిన ఎండీ సలీం ఎన్నికల ప్రచార స్వరకర్తగా పేరుంది. సలీం స్వర ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. పదోతరగతి చదివే రోజుల్లో అప్పుడే ప్రారంభమైన పట్టణంలోని శ్రీలక్ష్మి థియేటర్లో ఆడే సినిమాలకు సంబంధించిన ప్రచారంతో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు. ‘రోజూ నాలుగు ఆటలు నేడే చూడండి..’ అంటూ మొదలైన స్వరప్రస్థానం ఎన్నికలు వచ్చాయంటే మరింత మారుమోగుతుంది. ఇందిరాగాంధీ నుంచి కేసీఆర్, ఎమ్మెస్సార్, కేటీఆర్, భాగారెడ్డి, నర్సింగరావు, గొట్టె భూపతితోపాటు ఇప్పటి వార్డు, కౌన్సిలర్ల వరకు ఎన్నికలు ఎక్కడ జరిగినా సలీం స్వరం ప్రచారాస్త్రమైంది. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు సలీం గళం పరిచయమైంది. 1988లో ఆకాశవాణిలో 25 నిమిషాల ప్రత్యక్ష వ్యాఖ్యానం, 1989లో ఘంటసాల ఆలపించిన పాటలకు తన గొంతుతో వ్యాఖ్యానం చేశారు. అనంతర కాలంలో చాలా ఏళ్లు న్యూస్ చానల్లో న్యూస్రీడర్గా రెండో ప్రస్థానం ప్రారంభించారు. సలీం ప్రతిభకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి.సిరిసిల్లకు చెందిన మరో వ్యాఖ్యాత సాంబారి రాజు. గురువు సలీం వ్యాఖ్యానికి తీసిపోకుండానే ప్రకటనలకు స్వరం అందిస్తున్నారు. 1982, జూన్ 16న సిరిసిల్లకు చేనేత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటేశం, బాలలక్ష్మి. ఆరో తరగతి వరకు చదువుకున్న రాజు, తన బాబాయ్ సాంబారి ప్రదీప్ నడిపే ఆర్కెస్ట్రాలో ప్రవేశించాడు. పదిహేనేళ్ల క్రితం డబ్బింగ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన ప్రస్థానం నేడు ఎన్నికల ప్రచారం, ప్రకటనలకు స్వరం అందించే స్థాయికి ఎదిగారు. ఇరవై ఏళ్లుగా 20వేలకు పైగా వ్యాపార, ఎన్నికల ప్రకటనలకు తన స్వరాన్ని అందించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రస్తుతం ఆన్లైన్ సేవలనూ అందిస్తున్నారు. సమాచారం పంపితే చాలు వాయిస్ ఓవర్ సిద్ధం చేసి, మెయిల్ చేసేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, సుంకె రవిశంకర్, గంపగోవర్ధన్, షబ్బీర్ అలీ ఎన్నికల్లో నిల్చోగా వారి ప్రచారంలో తన గొంతు అందించారు. సలీం గొంతుకు సలాంస్వర‘రాజ’సంప్రాంతీయ యాసల్లో వ్యాఖ్యానం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ యాసల్లో వారు కోరిన విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాను. గురువు గారు సలీం స్ఫూర్తితో 20 ఏళ్లుగా వ్యాఖ్యానంలో కొనసాగుతున్నాను. నాతో పాటుగా ఫిమేల్ వాయిస్కు స్థానిక మహిళ స్వాతి గొంతు అందిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ప్రకటనలు చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ప్రకటనలు విరివిగా చేస్తున్నాం – సాంబారి రాజు, సిరిసిల్ల -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పొలంలో దున్నుతుండగా కేజ్వీల్ ఊడిపోయి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విషాదం నింపింది. ఎస్సై రాహుల్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాలు. వెంకటాపూర్కు చెందిన గడ్డం జితేందర్(30) గురువారం పోతిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో పొలం దున్నుతుండగా కేజ్వీల్ ఊడిపోయింది. ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు వెనక్కి తిరిగి చూడగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి బాల్రాజ్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన జితేందర్ మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. మృతునికి భార్య దివ్య, కుమారుడు విశాల్, తల్లి లక్ష్మి ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి వెల్గటూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం కొత్తపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన గౌరెల్లి లక్ష్మణరావు (37) గత నెల 29న రోజువారీ పనులు ముగించుకుని వెల్గటూర్ నుంచి బైక్పై కొత్తపేట వస్తుండగా రోడ్డుపై గుంతలను తప్పించే క్రమంలో బైక్పై వస్తున్న ముత్తునూర్కు చెందిన కల్యాణ్ను ఢీ కొట్టాడు. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కల్యాణ్ను జగిత్యాల, లక్ష్మణరావును కరీంనగర్ తరలించారు. చికిత్సపొందుతూ లక్ష్మణరావు గురువారం మృతి చెందాడు. లక్ష్మణరావుకు 8ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య సహజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. భార్య వెంటే భర్త మానకొండూర్ (శంకరపట్నం): భార్య మృతి చెందిన 24 గంటలకే భర్త మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలం ముత్తారంలో జరిగింది. గ్రామానికి చెందిన కనకం రాజమల్లు, రాజవ్వ అనే వృద్ధ దంపతులు ఎంతో అన్యోనంగా ఉండేవారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. కొంతకాలంగా వీరు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజవ్వ బుధవారం మృతి చెందగా, భర్త రాజమల్లు గురువారం మృతి చెందాడు. భూ విస్తీర్ణం అధిక నమోదుపై కేసు మల్యాల: భూవిస్తీర్ణం తప్పుడుగా అధికంగా పహాణిలో నమో దు చేసిన జీపీఓతోపాటు, భూ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు. మండలంలోని తాటిపల్లికి చెందిన జలజ కొన్నేళ్లక్రితం పహాణిల సర్టిఫైడ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. బల్వంతాపూర్ జీపీఓ ప్రవీణ్ను కలిసి భూ విస్తీర్ణం అధికంగా నమోదు చేయాలని సంప్రదించింది. దీనికి ప్రవీణ్ తాటిపల్లికి చెందిన కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూమిని పహాణి 2.20 ఎకరాలను జలజ పేరిట రాయించాడు. ఫైళ్లను పరిశీలించిన తహసీల్దార్ వసంత ప్రభుత్వ రికార్డులు, పహాణీలను ట్యాంపరింగ్ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్, జలజపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పరిశీలించి.. ఆరా తీసి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా అంతర్గాం గోలివాడ శివారులోకి వచ్చే ప్రభుత్వ భూముల వద్దకు ఏఏఐ బృందం అధికారులు చేరుకునే సరికి ఇరిగేషన్, రెవెన్యూ, గ్రౌండ్వాటర్, హైడ్రాలజిస్ట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఆర్అండ్బీ, మైనింగ్ తదితరశాఖలకు చెందిన జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య భూమికి సంబంధించి నక్ష (చిత్రపటం) ఆధారంగా వివిధ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి లభ్యత, సత్వరమే అందుబాటులోకి తీసుకునే అవకాశాలు, భూ విస్తీర్ణం, సదరు భూములలో సాగయ్యే పంటలు, భూముల యధార్థ స్థితిగతులతో పాటు ప్రభుత్వేతర భూలభ్యత, విస్తీర్ణం తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ భూముల్లో హైటెన్షన్ టవర్లు ప్రతిపాదిత స్థలంలో 400 కేవీ హైటెన్షన్ టవర్లు, విద్యుత్ తీగలను పరిశీలించిన ఏఏఐ అఽధికారులు తొలగించాల్సి ఉంటుందని, లేదంటే భూగర్భం నుంచి విద్యుత్లైన్ వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రతిపాదిత స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్లో 45 మీటర్లలోపు, ఆరు కిలోమీటర్ల రేడియస్ తర్వాత 90 మీటర్ల ఎత్తులో నిర్మాణాలున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేయగా, ప్రతిపాదిత స్థలంలో సుమారు 60కి పైగా టవర్లు ఉండే అవకాశం ఉంటుందని ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. తొలుత టవర్లను ఎత్తివేసేందుకు అంచనా వ్యయం సుమారు రెండువేల కోట్లుగా భావించినా, ప్రస్తుతం ఏఏఐ వారిచ్చిన నివేదికలలో పేర్కొన్న మేరకు మరోసారి అంచనా వ్యయ నివేదిక సిద్ధం చేయాల్సి ఉండనుంది. స్థల లభ్యతపై ఎయిర్పోర్టు నిర్మాణానికి సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉన్నట్లు ఏఏఐ అధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం 600 ఎకరాల ప్రభుత్వ భూ లభ్యత ఉండగా, మరో 400 ఎకరాలు ప్రభుత్వేతర భూములు అందుబాటులో ఉన్న నివేదికను అందజేసినట్లు సమాచారం. ల్యాండింగ్ అయ్యే స్థలం నుంచి 1.5 కిలో మీటర్ రేడియస్లో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని, సదరు స్థలాన్ని నిషేధిత స్థలంగా పరిగణించడం జరుగుతుందని ఏఏఐ ప్రతినిధులు తెలిపారు. గోదావరినది తీరం సందర్శన ఏఏఐ బృందం గోలివాడ గోదావరినది తీరాన్ని సందర్శించడంతో పాటు నీటి లభ్యత అంశాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో నీటి లభ్యత 130 మీటర్లు, వరదల సమయంలో గరిష్టంగా 280 మీటర్ల ఎత్తులోకి వరద చేరుతుందని, భూగర్భ జలాలు పది మీటర్లస్థాయిలో ఉంటాయని వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఏటా గరిష్టంగా ఇన్ఫ్లో, కనిష్ట ఇన్ఫ్లో, నీటి లభ్యత, సాగు, తాగునీటి కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ వివరాలు, పునరావాసం తదితర అంశాలను తెలుసుకున్నారు. అండర్గ్రౌండ్ వంతెన పరిశీలన, రోడ్డు భూగర్భంలో ఏమైనా రైల్వే కమ్యూనికేషన్కు కేబుల్స్, రైల్వే ట్రాక్షన్ మీద విద్యుత్ తీగల ఎత్తు, ప్రతిపాదిత విమానాశ్రయం స్థల దూరం, సమీపంలో ఉన్న విద్యుత్ టవర్స్ ఎత్తు, ప్రతీ రోజు రైళ్ల రాకపోకల సంఖ్య తదితర అంశాలను నేరుగా పెద్దంపేట రైల్వేస్టేషన్కు వచ్చి తెలుసుకున్నారు. మొత్తంగా ఏఏఐ అధికారుల బృందం పర్యటనతో ఇప్పటికై నా విమానం ఎగిరేనా.. ఎప్పటిలాగే పర్యటనలు, నివేదికలకే పరిమితమవుతుందా అనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో నెలకొంది. -
యువకుడి ఆత్మహత్య
పెగడపల్లి: కుటుంబసభ్యులు మందలించడంతో బీటెక్ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాములపల్లిలో చోటుచేసుకుంది. స్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీలం రమేశ్, జమున దంపతులకు కూతురు వర్షిత, కుమారుడు అరవింద్ ఉన్నారు. అరవింద్ హైదరాబాద్లో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. మంచి ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు అరవింద్ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్ బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ.. చందుర్తి(వేములవాడ): ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్నసిరిసిల్ల చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. బండపల్లికి చెందిన నేదూరి అంజవ్వ(55)కు భర్త పోశయ్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసి హార్వెస్టర్ను కొనుగోలు చేయగా ఆర్థికంగా నష్టపోయారు. హర్వెస్టర్ విక్రయించిన అప్పులు తీరలేదు. దీనికితోడు వ్యవసాయంలో వచ్చిన నష్టంతో పూర్తిగా దివాళ తీశారు. దీంతో అప్పులిచ్చిన వారు అప్పులు చెల్లించాలని కోరితే ముగ్గురు కుమారులు పట్టించుకోకుండా పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై అంజవ్వ ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుంది. మృతురాలు అంజవ్వ తల్లి రాజవ్వ వృద్ధాప్యంలో అనా రోగ్యంతో బాధపడుతోంది. ఏకై క కుమార్తె అంజవ్వ ఆత్మహత్య చేసుకోవడంతో నాకు దిక్కెవరూ అంటూ తల్లి రాజవ్వ రోదిస్తుండడంతో అక్కడున్న వారందరూ కన్నీరుపెట్టారు. కాగా అంజవ్వ భర్త పోశయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందపడి యువకుడు.. జమ్మికుంట: అనారోగ్య కారణాలతో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామంగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన జక్కె రజనీకాంత్(31) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి రైల్వేస్టేషన్ మధ్య తనుగుల సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తల్లి జక్కె రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జీవితంపై విరక్తి చెంది డ్రైవర్.. ముస్తాబాద్(సిరిసిల్ల): జీవితంపై విరక్తి చెంది ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సద్ది రాజిరెడ్డి(40) తల్లితో కలిసి డబుల్బెడ్రూమ్ ఇంటిలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం రాజిరెడ్డి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తన గదిలో నిద్రించాడు. వరండాలో తల్లి సత్తవ్వ పడుకుంది. మరుసటి రోజు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు రాజిరెడ్డి ఇంటికెళ్లారు. సత్తవ్వతో మాట్లాడగా, రాజిరెడ్డి కోసం ఆరా తీశారు. ఇంకా లేవలేదని తల్లి తెలపగా.. సదరు నాయకులు తలుపులు తట్టిన స్పందన రాలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కువైట్లో వలసజీవి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండీ వేదుల్(36) కువైట్లో పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫుడ్పాయిజన్కు గురైన వేదుల్ను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస వదిలాడు. మృతునికి భార్య షబానా, కుమారుడు, కూతురు ఉన్నారు. వేదుల్ మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించి, గల్ఫ్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బరిలో భార్యాభర్తలు, కుమారుడు
రిటైర్డ్ ఐపీఎస్ భార్య.. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మాజీ ఐపీఎస్(ఎస్పీ) భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన ఉప్పు తిరుపతి(రిటైర్డ్ ఐపీఎస్) భార్య లక్ష్మి గురువారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఉద్యోగ రిత్యా ఎక్కడ ఉన్నా సొంత గ్రామంలో అభివృద్ధి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో బరిలో నిలిచింది. ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటి చేస్తున్నట్లు లక్ష్మి, తిరుపతి పేర్కొన్నారు. డిపాజిట్ దక్కాలంటే..కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగినీని బట్టి బ్యాంకులో కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్తో పాటు ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి రూ.1,000, వార్డు స్థానాలకు రూ.250 చొప్పున డిపాజిట్ కట్టాలి. జనరల్ అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి రూ.2వేలు, వార్డు స్థానాలకు రూ.500 చొప్పున చెల్లించాలి. ఓడిన అభ్యర్థులు డిపాజిట్ తిరిగి దక్కించుకోవాలంటే చెల్లిన ఓట్లలో వందకు కనీసం ఎనిమిది ఓట్లు పొందాలి. అంతకన్నా తక్కువ ఓట్లు వస్తే వారి డిపాజిట్ గల్లంతే. మొత్తం పోలైన ఓట్లలో 16శాతం ఓట్లను పొందాలి. ఉదాహరణకు ఓ పంచాయతీలో 1000 ఓట్లు పడితే అభ్యర్థి 160 ఓట్ల కన్నా ఎక్కువ సాధించాలి. 16 శాతం కన్న తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది. మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేషన్లు తిరస్కరణకు గురైన పక్షంలో ఎవరోఒకరు బరిలో ఉండేందుకు ముందుచూపుగా వ్యవహరించిన ఆ కుటుంబానికి వింత పరిస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన పుల్ల సాయగౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేశ్తో కూడా నామినేషన్ వేయించాడు. అయితే సర్పంచ్ స్థానానికి వీడీసీ వేలం వేయడం.. అది వివాదానికి దారితీయడం.. వేలం వేసిన వీడీసీ సభ్యులు పలువురిని బైండోవర్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు గ్రామంలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహిస్తామని, నామినేషన్లు ఎవరూ విత్డ్రా చేసుకోవద్దని సూచించారు. వీడీసీ ఆంక్షలకు భయపడొద్దని చెబుతూనే.. నామినేషన్ వేసిన ప్రతిఒక్కరూ బరిలో ఉండాల్సిదేనని తేల్చిచెప్పారు. ఫలితంగా ముందు జాగ్రత్తతో మూడు నామినేషన్లు వేసిన సాయగౌడ్ కుటుంబం కూడా బరిలో నిలవాల్సి వచ్చింది. ప్రచారంలో భాగంగా ముగ్గురు కలిసే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భర్తను గెలిపించాలని భార్య.. తండ్రిని గెలిపించాలని కుమారుడు ఓట్లు అభ్యర్థిస్తున్న తీరును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. పోటీకి 75 ఏళ్ల వృద్ధురాలు సైమంథనిరూరల్: అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ 75 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలబడి సమరానికి సై అంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట వెంకటమ్మ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉప్పట్ల పంచాయతీకి జనరల్ మహిళ రిజర్వేషన్ రాగా ఆ సామాజికవర్గం నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడం వెంకటమ్మతో పాటు మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన ముగ్గురిలో వెంకటమ్మ వృద్ధురాలు కావడం, గ్రామాభివృద్ధిలో ముందుంటానంటూ భరోసా కల్పిస్తూ తనకు సర్పంచ్గా అవకాశం కల్పించాలని ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ బరిలో 12 మంది సర్పంచ్ పదవి వేలం వివాదంతో ఆ కుటుంబానికి విచిత్ర పరిస్థితి -
అయ్యప్పా..
ఒకటే ట్రిప్పా?సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రిప్ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తులకు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమలకి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం, వచ్చే నెల 15 (సంక్రాంతి) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు మన ఉమ్మడి జిల్లా నుంచి లేవు. రామగుండంలో ప్రతి రోజు నిలిచే 12626 కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్న కూడా కన్ఫర్మ్ కానీ పరిస్థితి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్ వీక్లీ ఎక్స్ ప్రెస్, 22647 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీపేట, వికారాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ మార్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్ నుంచి యేటా తూతూ మంత్రంగా ఒకట్రిప్ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ఒక ట్రిప్ కూడా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్ నుండి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా 8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. -
కాంగ్రెస్లో జోష్!
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి,కరీంనగర్: హుస్నాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. పల్లెల్లో పట్టు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని సీఎం రేవంత్రెడ్డి అభ్యర్థుల్లో నింపే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చామంటూ సీఎం సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్త్రెడ్డి మొదట హుస్నాబాద్కు మంజూరైన ఇంజినీర్ కళాశాలకు రూ.45 కోట్లు మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ ఇటీవల అమెరికాలో పర్యటించగా, అక్కడ ఓ ఎన్నారై అందించిన 70 సైకిళ్లను సీఎం చేతిలో మీదుగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన పార్టీ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసిన ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందుతుందని తెలిపారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వకుండా సీఎం నిరాశపరిచారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, గడ్డం వివేక్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. -
దివ్యాంగులకు అండగా ఉంటాం
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. కరీంనగర్ రేకుర్తిలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో బుధవారం మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి, దివ్యదృష్టి యూట్యూబ్ చానల్ ఆవిష్కరించారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందన్నారు. బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులు తమలోని దివ్యదృష్టిని వృథా చేయవద్దని, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఐదుశాతం కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సు పాసుల సమస్య మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగుల శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ మాట్లాడుతూ.. యూపీఎస్సీ వంటి ఉన్నత ఉద్యోగాల్లో దివ్యాంగులు రాణిస్తున్నారని, చదువును నమ్ముకుని ముందుకు సాగాలని సూచించారు. డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోపరేటివ్ చైర్మన్ వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులతో ఇప్పటికీ స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. సుడా చైర్మన్ కె.నరేందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపరాణి పాల్గొన్నారు. అంధ విద్యార్థినితో పాట పాడిన కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి(కరీంనగర్): అంధుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి కలెక్టర్ పమేలా సత్పతి పాట పాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురష్కరించుకుని పాడిన పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ రచించిన నింగినేల నాదే అనే సినిమా కోసం రాసిన ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత?’ అనే పాటను పాడారు. గతంలో ఓ కార్యక్రమంలో సింధుశ్రీ పాడటం చూసి కలెక్టర్ స్ఫూర్తి పొందారు. కరీంనగర్ అంధుల పాఠశాల మ్యూజిక్ టీచర్ సరళ, స్థానిక మ్యూజిక్ డైరెక్టర్ కేబీశర్మ ఆధ్వర్యంలో కలెక్టర్ పాడిన పాటను రికార్డు చేశారు. -
సోషల్.. హల్సెల్
కరీంనగర్: గతంలో గోడలపై రాతలు, వాల్పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం చేసే అభ్యర్థులు.. ఎన్నికల నిబంధనలతో నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సెల్ఫోన్ను నమ్ముకుని ప్రచారం సాగి స్తున్నారు. సోషల్ మీడియా వారియర్స్ను ఏర్పాటు చేసుకొని ప్రత్యేక విభాగాన్ని నడిపిస్తున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ఏ ఒక్క ఓటునూ వదలకూడదని జాబితా ముందేసుకుని మరీ ఎక్క డ ఉన్నారో వెతుకుతున్నారు. చిరునామా, ఫోన్ నంబర్ తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాలను వదలి ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేసి.. వరుసలు కలిపేసి.. మాటలతో మస్కా కొడుతున్నారు. ఫోన్ నంబర్ దొరికితే చాలు డిజిటల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు స్మార్ట్ఫోన్ల ప్రచారానికి పెద్ద పీట వేస్తున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, స్క్రూటినీ, విత్డ్రా ముగిశాక బుధవారం గుర్తుల కేటాయించారు. దీంతో పోటీదారులు ఇంటింటికి తిరగడంతో పాటు వాట్సాప్లో పోస్టులనే నమ్ముకున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్లో ప్రచారం ముమ్మురం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓటర్ల ఫోన్ నంబర్లను తెలుసుకుని గ్రూప్లు తయారు చేసి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తారో అన్న విషయాన్ని కూడా షేర్ చేస్తున్నారు. కుల సంఘాల వారికి ఫోన్లు చేస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అనుచరుల ఫోన్లలో స్టేటస్ పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యువకులు ప్రతి గ్రామానికి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయగా ఆయా గ్రామాల గ్రూపులలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో తాము చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి వాటికి బ్యాక్గ్రౌడ్ పాటలను సెట్ చేసి మరీ పంపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు కొంత మంది యువకులతో కమిటీ వేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. -
● పక్షం రోజులుగా మండుతున్న ధరలు ● ఏదికొన్నా కిలోకు రూ.50పైనే
కూరగాయలు పిరంకరీంనగర్ అర్బన్: వండకముందే కూరల ధరలు కుతకుతమంటుండగా జేబులు తడుముకోవడం వినియోగదారుల వంతవుతోంది. చిక్కుడు ధర కిలో సెంచరీ దాటగా బెండ, తోటకూరది ఇదే పరిస్థితి. టమాట ధర రైతు బజార్లలో కిలో రూ.50 పలుకుతుండగా ఇక చిల్లర మార్కెట్లలో రూ.70కి విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో మరింత అదనం. ఏ కూరగాయ చూసిన ధరల మోతే. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులపై పెనుభారం పడుతోంది. ఇతర ప్రాంతాలపైనే ఆధారం జిల్లాలో 11లక్షలకు పైగా జనాభా ఉండగా సాగు విస్తీర్ణం అంతంతే. దీంతో మదనపల్లె, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి టమాట, మిర్చి, ఇతర కూరగాయలను దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో ధరలను ఇష్టారీతిగా పెంచేస్తున్నారు. ప్రధానంగా రాయితీ కూరగాయల విత్తనాల పంపిణీ లేకపోవడంతో రైతులు కూరగాయల సాగుకు స్వస్తి పలుకుతున్నారు. గత ఎనిమిదేళ్ల్ల క్రితం వరకు ఆర్కేవీవై పథకం కింద 70శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ చేసేవారు. కొన్నేళ్లుగా రాయితీ విత్తనాల ఊసే లేకపోవడంతో సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గుతోంది. 8సంవత్సరాల క్రితం 9వేల ఎకరాల్లో కూరగాయలు సాగవగా ప్రస్తుతం 2వేల ఎకరాలే. అంతలోనే ఎంత తేడా నెలరోజుల క్రితం బహిరంగ మార్కెట్లో టమాట ధర రూ.30 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.70కి చేరింది. బీర గతంలో 40ఉండగా రూ.100కు చేరడం ఆందోళనకర పరిణామం. కొత్తిమీర రూ. వంద ఉండగా 180 పలుకుతోంది. హెచ్చు కూరగాయలకు ధరలు పెరగగా వారంలో రూ.40–60 పెరగడం విశేషం. కాకర, సోరకాయ అంతే. క్యాలీ ఫ్లవర్, క్యారెట్, గోరుచిక్కుడు, చిక్కుడు, పాలకూర, చుక్కకూర ధరలు సెంచరీ దాటిపోయింది.పంట రైతుబజారు మార్కెట్లో ధర టమాట 50 70 పచ్చిమిర్చి 80 100 కాకర 80 100 బీర 90 100 క్యాబేజీ 60 90 వంకాయ 70 80 బెండ 90 100 క్యారెట్ 80 100 గోరుచిక్కుడు 80 100 చిక్కుడు 80 100 దొండకాయ 60 80 సోరకాయ 45 60 -
న్యాయవాదులు మార్గదర్శకులుగా ఉండాలి
కరీంనగర్క్రైం: న్యాయవాదులు మేధావులని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించిన న్యాయవాదుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయవాది అన్నింటిపై అవగాహన కలిగి ఉంటారన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్కుమార్ మాట్లాడారు. ఆటలపోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందించారు.కరీంనగర్: రాజకీయ అవసరాల కోసం, హిందూ దేవుళ్లను ద్వేషిస్తూ, హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణచౌక్లో నిరసన తెలిపారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులను చులకన చేసి మాట్లాడారని, ఆ వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్పిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని, అందుకే హిందూ సమాజంతో పెట్టుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. మూడు కోట్ల దేవతలంటూ.. ఒక్కో దేవునిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. గుగ్గిళ్లపు రమేశ్, వాసాల రమేశ్, కళ్లెం వాసుదేవరెడ్డి, గువ్వల శ్రీనివాస్, కటకం లోకేశ్, పాదం శివరాజ్, బండారు గాయత్రి, తణుకు సాయికృష్ణ, జాడి బాల్రెడ్డి పాల్గొన్నారు. డీఏలు విడుదల చేయాలిసప్తగిరికాలనీ(కరీంనగర్): ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నగరంలో సత్కరించారు. ఈ సమావేశానికి వరంగల్, కరీంనగర్ సర్కిల్ నుంచి రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ అధికారులు హాజరయ్యారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఉన్నతాధికారులు బి.శ్రీనివాస్, దాసరి నాగభూషణం, జి.నర్సయ్య, వుచ్చిడి మోహన్రెడ్డి, పురుషోత్తం పాల్గొన్నారు. -
భవిత కేంద్రాలతో పిల్లల్లో మార్పు
తిమ్మాపూర్: భవిత కేంద్రాలు దివ్యాంగ పిల్లలకు అండగా నిలుస్తున్నాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రాల్లో ప్రత్యేక పద్ధతిలో విద్యా బోధన ద్వారా దివ్యాంగ విద్యార్థుల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని తెలిపా రు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ దివ్యాంగుల కోసం జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. డీఈవో మొండయ్య, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, విద్యాశాఖ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఎంఈవో శ్రీనివాస్, డీఈ కృష్ణ కుమార్, హెచ్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. బుధవారం బోధన పరిశీలన మహాత్మానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. కొందరు సరిగ్గా చదవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. -
నల్లా కనెక్షన్ల ఫిర్యాదుకు ప్రత్యేక కౌంటర్
కరీంనగర్ కార్పొరేషన్: నల్లాల సర్వే నగరంలో జరుగుతున్న క్రమంలో ప్రజల నుంచి వస్తున్న సందేహాలు, ఫిర్యాదుల కోసం నగరపాలకసంస్థ కార్యాలయంలోని ఇన్వార్డులో ప్రత్యేకంగా కౌంటర్ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్మార్ట్సిటీ పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న నల్లా కనెక్షన్ల సర్వేను మరింత వేగవంతం చేయాలన్నారు. డీఈ స్థాయి అధికారి నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు నల్లాల ఫిర్యాదులు పరిష్కరించాలన్నారు. స్మార్ట్సిటీ పనులను తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీలలోగా పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న బిల్లుల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు.స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించిన పనులను ప్రాధాన్యతగా తీసుకొని వెంటనే చేపట్టాలన్నారు. అక్రమ విద్యుత్ వినియోగాన్ని నిర్మూలించడానికి విద్యుత్ మీటర్ల సర్వే చేయాలన్నారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, శివానందం, డీఈలు దేవేందర్, లచ్చిరెడ్డి, అరుణ్, వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్, ఏఈలు పాల్గొన్నారు. -
‘ఇట్టిరెడ్డి’ పాలన పాతికేళ్లు
● ఏకగ్రీవంగా ఎన్నుకున్న కొండాపూర్ గ్రామస్తులు కోనరావుపేట(వేములవాడ): పంచాయతీ ఎన్నికల్లో కొండాపూర్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్నేళ్ల వరకు ఒకే దంపతులు ఈ గ్రామాన్ని పాలించారు. భర్త 20 ఏళ్లు గ్రామానికి సర్పంచ్గా పనిచేయగా, భార్య ఐదేళ్లు సేవలందించారు. మూడు దశాబ్దాలు ఏకగ్రీవం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామం గతంలో నిజామాబాద్ గ్రామానికి అనుబంధంగా ఉండేది. 1980లో కొండాపూర్ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. 1981లో గ్రామపంచాయతీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో గ్రామస్తులు సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. గ్రామానికి చెందిన ఇట్టిరెడ్డి రాంరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు రాంరెడ్డి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2000లో జరిగిన ఎన్నికల్లో రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో రాంరెడ్డి భార్య ఇట్టిరెడ్డి లక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా కొండాపూర్ గ్రామపంచాయతీ చరిత్రలో రాంరెడ్డి కుటుంబమే పాతికేళ్లు పాలించింది. 1995లో జరిగిన ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ రావడంతో గొల్లపెల్లి దేవేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా భార్యాభర్తలే గ్రామాన్ని పాతికేళ్లు పాలించడం జిల్లాలోనే ఏ గ్రామంలో లేదు. అది కూడా ప్రతీసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మరో విశేషం.రాంరెడ్డి లక్ష్మి -
పీచుపల్లి..
● గ్రామాభివృద్ధికి రూ.10 లక్షలు కేటాయిస్తానన్న కేంద్ర మంత్రి బండి కరీంనగర్: గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి బీజేపీ బలపర్చిన సామ రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక ఏకగ్రీవం లాంఛనమైంది. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులు కేటాయిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల్లేకుండా సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన పీచుపల్లి మొత్తం రూ.20 లక్షల ప్రోత్సాహక నిధులు అందనున్నాయి. నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు. కేసన్నపల్లి.. ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం కేసన్నపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ నామినేషన్ల కోసం పోతరాజు చంటి, అతని భార్య అనిత నామినేషన్లు వేశారు. మిగతా వారు ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో సర్పంచ్గా పోతరాజు చంటి ఏకగ్రీవమైనట్లు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా ఆరు వార్డులలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒకటో వార్డులో మాత్రమే పోటీ ఉందని తెలిపారు. 2019లో గ్రామపంచాయతీగా ఏర్పడగా పోతరాజు చంటి తల్లి ఎల్లవ్వ సర్పంచ్గా పనిచేశారు. -
పంచాయతీలు ఏకగ్రీవం
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో మూడు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. మైదుపల్లిలో ఇద్దరు నామినేషన్లు వేయగా.. ఒకరు తప్పుకోగా.. పంతంగి లక్ష్మణ్ ఏకగ్రీవమయ్యారు. తోటగోపయ్యపల్లిలో ఇద్దరు నామినేషన్లు వేయగా.. ఒకరు ఉపసంహరించుకున్నారు. దొబ్బల రమేశ్ ఒక్కరే మిగిలారు. నాగారంలో ముగ్గురు నామినేషన్లు వేయగా.. ఇద్దరు ఉపసంహరించుకున్నారు. బెల్లంకొండ శ్రీదేవి ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. తోటగోపయ్యపల్లిలో ఆరుగురు, నాగారంలో ముగ్గురు వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. సర్పంచ్ స్థానాలు ఏకగ్రీమైన మైదుపల్లి, నాగారంలో ఈనెల 11న వార్డు స్థానాలకే ఎన్నికలు జరుగనున్నాయి. మైదుపల్లిలో ఆరు, నాగారంలో ఐదు వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. రమేశ్ (తోటగోపయ్యపల్లి) శ్రీదేవి (నాగారం) లక్ష్మణ్ (మైదుపల్లి) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే పలు గ్రామాల్లో గ్రామస్తులు ముందుకొచ్చి పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ అభ్యర్థుల ఇచ్చిన హామీలు నచ్చి కొందరు గ్రామస్తులు ఏకగ్రీవానికి ఒప్పుకోగా.. అభ్యర్థుల గుణగణాలు నచ్చి మరికొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
సర్పంచ్ బరిలో తండ్రీకొడుకులు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ పంచాయతీ సర్పంచ్ స్థానం కోసం తండ్రీకొడుకులు పోటీపడుతున్నారు. కొండ నారాయణ, కొండ శ్రావణ్కుమార్ తండ్రీకొడుకులు. రెండోవిడతలో తొలిరోజు నారాయణ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. కుమారుడు శ్రావణ్ చివరిరోజు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం జనరల్ కేటగిరీలో ఉంది. ఒకే ఇంట్లోంచి తండ్రీకొడుకులిద్దరూ సర్పంచ్ పదవి కోసం పోటీ పడడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారా? లేక ఇద్దరూ బరిలోనే ఉంటారా? అనేదానిపై చర్చలు జోరందుకున్నాయి. గుబులు పుట్టిస్తున్న గుర్తులు ● ఓటర్లకు అంతుపట్టని గుర్తులు .. అభ్యర్థులకు చిక్కులు కమాన్పూర్(మంథని): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులకు అక్షరమాల ప్రకారం కేటాయించిన గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. గుర్తులు ఒకేపోలికతో ఉండడంతో నిరక్షరాసులు, వృద్దులు గుర్తుంచుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పంచాయతీలో ఏడుగురు పోటీలో ఉండగా అధికార, ప్రతిపక్షపార్టీల మద్దతో పటీపడుతున్న వారికి అనుకులమైన గుర్తురాలేదు. దీంతో వారు నిరుత్సహం చెందుతున్నారు. మిగతావి దాదాపు ఒకేమాదిరిగా ఉండడంతో తమకు వచ్చేఓట్లు ఎటువైపు పడతాయోనని అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. ఒకగ్రామంలో ఇద్దరు లేదా ముగ్గురు పోటీలో ఉంటే.. బ్యాలెట్ పత్రాల్లో అనుకూలంగా ఉండే గుర్తులు వచ్చేవని చర్చించుకుంటున్నారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఓటర్లు గుర్తు పెట్టుకునేలా ఎలా అవగాహన కల్పించేదని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులే కాకుండా నామినేషన్లు వేసి పోటీలో ఉన్నవారికి అనుకూలమైన గుర్తులు రావడంతో వారు సంతోషపడుతున్నారు. సిలిండర్ల దొంగ అరెస్ట్● 38 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం ● జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలో వరుసగా జరుగుతున్న గ్యాస్ సిలిండర్ల దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని అరెస్ట్ చూపారు. పట్టణానికి చెందిన సమీర్ అనే వ్యక్తి కొద్దినెలలుగా రాత్రి వేళల్లో ఇళ్లలో చొరబడి సిలిండర్లు ఎత్తుకెళ్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా వేశారు. జిల్లాకేంద్రంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని విచారణ చేపట్టగా నిజం ఒప్పుకొన్నాడు. అతని నుంచి 38 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే ఏడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సైలు సుప్రియ, రవికిరణ్, ఏఎస్సై వేణురావు, కానిస్టేబుళ్లు విజయ్, జీవన్ పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చకపోతే నెలలోపే రాజీనామా
● బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే సొంత డబ్బులతో గ్రామంలో ప్రధానంగా అవసరమున్న ఆరు హామీలను నెరవేరుస్తానని బీజేపీ బలపర్చిన అభ్యర్థి దాసరి గణేశ్ బుధవారం గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గెలిపించిన నెల రోజుల్లోపే గ్రామస్తుల సమక్షంలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. గ్రామస్తులు తనపై నమ్మకం ఉంచి గెలిపించాలని కోరారు. గణేశ్ గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో బరిలో ఉండే అభ్యర్థులు ఖంగుతిన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కరీంనగర్క్రైం: బైకుపై వెళ్తుండగా కుక్కఅడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తికి గాయపడగా చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం సంతోష్నగర్కు చెందిన బోయినపల్లికి చెందిన వెంకటరమణరావు (56) లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారానికి వెళ్లి వస్తుండగా గత నెల 30వ తేదీన అర్ధరాత్రి ఇంటికి వచ్చే క్రమంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కిందపడడంతో గాయలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రస్థాయికి ‘అల్ఫోర్స్’ నమూనాల ఎంపిక
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఎంపికై నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలి పారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో గత మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26 , ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ 2024–25 ప్రదర్శనలో విద్యార్థులు పి.నిశాంత్, ఆండ్రియా మదన్జోష్, బి.స్నితిక్, ఎస్.నితీశ్కుమార్, అవి జ్ఞ నమూనాలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. వీరిని డీఈవో శ్రీరామ్ మొండయ్య, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, డీసీఈ బీ కార్యదర్శి భగవంతరావు అభినందించారు. -
బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్ సర్పంచ్ ఎన్నిక విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) వ్యూహం బెడిసికొట్టింది. తాము చెప్పిన అభ్యర్థిని మాత్రమే సర్పంచ్గా ఎన్నుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలైన విషయం తెల్సిందే. బుధవారం విత్డ్రాకు అవకాశం ఉన్నప్పటికీ అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. కొందరు అభ్యర్థులను పోటీనుంచి తప్పుకోవాలని వీడీసీ చెప్పిన క్రమంలో.. అభ్యర్థులకు అధికారులు భరోసా ఇవ్వడంతో పోటీలో ఉండేందుకే సిద్ధపడ్డారు. దీంతో జగ్గాసాగర్ సర్పంచ్ ఎన్నిక పారదర్శకంగా జరిగేందుకు మార్గం సుగమమైందన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సర్పంచ్ పదవికి వేలం వేయడంపై సీరియస్.. జగ్గాసాగర్లో సర్పంచ్ స్థానం బీసీ జనరల్గా రిజర్వేషన్ ఖరారుకావడంతో పోటీలో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 12 మంది నామినేషన్లు వేయగా.. సర్పంచ్ పదవికి వేలం వేయాలని వీడీసీ నిర్ణయించింది. ఇటీవల 17 కుల సంఘాలతో సమావేశమై రూ.28.60 లక్షలకు వేలం వేసింది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన అదే గ్రామానికి చెందిన గూడెటికాపు కులస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరారు. విషయాన్ని సీరియస్గా పరిగణించిన అధికారులు.. వీడీసీ సభ్యులతోపాటు మరికొందరిని బైండోవర్ చేశారు. బుధవారం నామినేషన్ల విత్డ్రా ఉండడంతో గ్రామంలో ప్రజాస్వామ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, తహసీల్దార్ నీత, ఎస్సై కిరణ్కుమార్, ఎంపీడీవో సురేశ్ పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్ ఎన్నిక జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఓటింగ్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ పదవులకు వేలం వేయడం చట్టవిరుద్ధమని, అలాంటి వాటిని ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. ఇరుకున పడిన వీడీసీ.. సర్పంచ్ పదవికి వేలం వేసిన వీడీసీ సభ్యులు ఆ సమయంలో కొందరిని పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు సమాచారం. వీడీసీ చర్యతో కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు అభ్యర్థులు తమ ఆవేదనను సన్నిహితుల వద్ద వెల్లబోసుకున్నారు. అదే సమయంలో గుడేటికాపు కులస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వీడీసీ సభ్యులను హెచ్చరించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో నామినేషన్ వేసిన అభ్యర్థులకు సర్పంచ్గా పోటీ చేసేందుకు అవకాశం లభించగా.. వీడీసీ మాత్రం ఇరుకున పడినట్లైంది. జగిత్యాలటౌన్: కుల బహిష్కరణతోపాటు వేలం ద్వారా సర్పంచ్ను ఎంపిక చేసేందుకు యత్నించిన జగ్గసాగర్ వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టరేట్లో కలెక్టర్ సత్యప్రసాద్కు వినతిపత్రం అందించారు. వేలంపాట వద్దని వారించినందుకు గుడేటికాపు కులస్తులను గ్రామ బహిష్కరణ చేస్తూ వీడీసీ సభ్యులు తీర్మానం చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో కొమ్ముల రాజ్పాల్రెడ్డి, శంకర్రెడ్డి, గుడేటి కాపు సంఘం సభ్యులు ఉన్నారు. జగ్గాసాగర్ సర్పంచ్ బరిలో 12 మంది అభ్యర్థులు నామినేషన్ల విత్డ్రాకు ససేమిరా సర్పంచ్ ఎన్నికకు మార్గం సుగమం -
ఊరుతండా..
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని జైసేవాలాల్ ఊరుతండా (నిమ్మపల్లి) గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. ఊరుతండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఇస్లావత్ మంజులతోపాటు మరో ముగ్గురు గుగులోత్ ప్రమీల, ఇస్లావత్ ప్రమీల, ఇస్లావత్ కవిత నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వడంతో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థి మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ వార్డులో ఇస్లావత్ మంజుల, 2వ వార్డులో మాలోత్ నరన్, 3వ వార్డులో అజ్మీర జబ్బర్, 4వ వార్డులో అజ్మీర సోనవ్వ, 5వ వార్డులో ఇస్లావత్ రవీందర్, 6వ వార్డులో అజ్మీర లావణ్య ఏకగ్రీవమయ్యారు. దీంతో కోనరావుపేట మండలంలో రెండు పంచాయతీలు కమ్మరిపేటతండా, ఊరుతండా ఏకగ్రీవమయ్యాయి. -
మూడు జీపీలు ఒకే బాటలో..
కథలాపూర్/మెట్పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలం రాజారాంతండా సర్పంచ్, వార్డుస్థానాలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి శ్రీరాం కిషన్ తెలిపారు. సర్పంచ్ స్థానంతోపాటు నాలుగు వార్డులకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేయడంతో సర్పంచ్గా భూక్య తిరుపతినాయక్, ఒకటో వార్డుకు లకావత్ పద్మ, రెండో వార్డుకు లకావత్ జ్యోతి, మూడో వార్డుకు లకావత్ రాజేందర్, నాలుగో వార్డుకు భూక్య లక్ష్మి ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. మెట్పల్లి మండలం చింతలపేట సర్పంచ్గా తోట్ల చిన్నయ్య ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థానానికి ఐదుగురు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం నలుగురు విత్డ్రా చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్ సర్పంచుగా కానుగంటి లాస్యప్రియ ఒకరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమయ్యారు. యామపూర్కు కనక నాగేష్, ఎలాల గోపాల్రెడ్డి నామినేషన్ వేశారు. గోపాల్రెడ్డి విత్డ్రా చేసుకోవడంతో నాగేష్ ఏకగ్రీవమయ్యారు. -
పసిబిడ్డకు ప్రాణం పోయండి
కరీంనగర్: అభం.. శుభం.. ఎరగని ఆ పసివాడిని పుట్టుకతో వచ్చే గుండె జబ్బు వేధిస్తోంది. మూడు నెలల ఆ బాలుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కరీంనగర్ కోతిరాంపూర్కు చెందిన శనిగరపు రాజు– పద్మ దంపతుల కొడుకు మిట్రల్ స్టెనోసిస్, ఏఎస్డి, వీఎస్డి, ఓవర్రైడింగ్ అయోర్టా పీడీఏతో సహా పుట్టుకతో వచ్చే గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ కొండాపూర్లోని కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్నాడు. బాబు బతికేందుకు అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాలి. ఇందుకు రూ.12 లక్షలు అవసరం ఉంది. మెకానిక్ షాపులో పనిచేసే రాజుకు సంపాదన అంతంత మాత్రమే. ఇప్పటికే ఉన్న సొమ్మంతా ఆసుపత్రి ఖర్చులకే అయిపోయాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రాణాలతో పోరాడుతున్న ఆ బిడ్డ కోసం దాతల సహకారాన్ని అర్థిస్తున్నారు. తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని కోరుతున్నాడు. సాయం చేయాలనుకునే వారు 9652417926 నంబరుకు సంప్రదించాలని రాజు పద్మ దంపతులు వేడుకున్నారు. పుట్టుకతోనే గుండె సమస్య వెంటిలేటర్పై చికిత్స రూ.12 లక్షలు అవసరం దాతలు ఆదుకోవాలని వేడుకోలు -
కిక్కిరిసిన కొండగట్టు
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు అంజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. దీంతో సాధారణ భక్తులతోపాటు జాతరకు వెళ్లే భక్తులు రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. టికెట్ల విక్రయాలు, లడ్డూ, పులిహోర విక్రయాలు, వాహనపూజల ద్వారా ఆలయానికి రూ.7.35 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు, ఏఈఓ హరిహరనాథ్, ఆలయ ఇన్స్పెక్టర్లు అశోక్, ఉమామహేశ్వర్రావు పర్యవేక్షించారు. -
సాంచాలు నడవకపాయె.. అప్పులు పెరిగిపాయె
సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య సిరిసిల్లఅర్బన్: అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట జ్యోతినగర్కు చెందిన బోడ శేఖర్ (38) తనకున్న సాంచాలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రస్తుతం సాంచాలు సరిగా నడవక, చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఉరేసుకున్నాడు. ఘటన స్థలం వద్ద పోలీసులకు మృతుడి సూసైడ్ నోట్ లభించింది. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్ విద్యార్థి..సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఎనగంటి రికిత(18) మంగళవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రికిత కరీంనగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. సమస్య తీవ్రం కావడంతో భరించలేక బలవన్మరణానాకి పాల్పడినట్లు తల్లి రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన కుమ్మరవేణి లత (28) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొద్దిరోజులుగా లత మానసిక పరిస్థితి సరిగా ఉండడం లేదు. మంగళవారం భర్త నాగరాజు వ్యవసాయ పనులకు వెళ్లిన తర్వాత ఇంటి లోపల తలుపులకు గడియ వేసుకొని ఉరేసుకుంది. పొలం పనుల నుంచి భర్త తిరిగి వచ్చిన అనంతరం చుట్టుపక్కల వారితో తలుపులను బలవంతంగా తెరిచి చూడగా ఆమె మరణించి ఉంది. మృతురాలికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. శబరిమలకు స్పెషల్ రైళ్లు రామగుండం: శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధి కంకటి ఫణికుమార్ తెలిపారు. సిర్పూర్ కాగజ్నగర్–కొల్లాం(07117) ఈనెల 13న ఉదయం 10 గంటలకు కాగజ్నగర్లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడలో ఆగుతుంది. నాందేడ్–కొల్లాం(07123) మధ్య ఈనెల 24 వేకువజామున 4.25 గంటలకు నాందేడ్లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.00 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడలో దీనికి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
పోరండ్ల సొసైటీని మూసేసిన రైతులు
● వడ్లు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం పోరండ్లలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై ధర్నా చేసి సొసైటీ కార్యాలయాన్ని మూసి వేయించారు. నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసి ఉన్నాయని, తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 43 కిలోల చొప్పున తూకం వేసి ట్రాక్టర్లను మిల్లర్ల వద్దకు పంపితే తరుగు పేరిట బస్తాకి మరో ఐదు కిలోలు అదనంగా కట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగు పేరిట తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సొసైటీ పాలకవర్గం చొరవ తీసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. 3వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు రైస్మిల్లు అలాట్మెంట్ అయిందని, ధాన్యం తూకం వేస్తామని తెలపడంతో ఆందోళనను విరమించారు. -
బీమా చేసి.. అన్నను చంపేసిండు
కరీంనగర్క్రైం: వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు సొంత అన్న హత్యకే మరణశాసనం రచించాడు. అన్నపై రూ.4.14 కోట్ల బీమా చేయించాడు. ఆపై టిప్పర్తో ఢీకొట్టి హత్యచేసి, బీమా సొమ్ము పొందేందుకు పథకం వేశాడు. పోలీసు దర్యాప్తులో విషయం తేలడంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కరీంనగర్జిల్లాలోని రామడుగు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరీంనగర్ సీపీ గౌస్ఆలం మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రామడుగు గ్రామానికి చెందిన మామిడి నరేశ్(30) టిప్పర్లు నడిపిస్తుంటాడు. షేర్ మార్కెట్తో పాటు వివిధ వ్యాపారాలు చేసి రూ.1.50కోట్ల వరకు నష్టపోయి, అప్పుల పాలయ్యాడు. అప్పు తీర్చేందుకు మానసిక పరిపక్వత లేని, ఇంకా వివాహం కాని సొంత అన్న మామిడి వెంకటేశ్(37)ను చంపాలని నిర్ణయించుకున్నాడు. గత రెండు నెలల క్రితం అతనిపై నాలుగు ప్రైవేటు, రెండు ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.4.14 కోట్లు వచ్చే విధంగా పాలసీలు చేయించాడు. రూ.20 లక్షల బంగారం రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో రాకేశ్ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన రూ.7 లక్షల గురించి నరేశ్పై ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నను చంపుతున్నానని, సహకరిస్తే రూ.13 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇద్దరు కలిసి టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ను ఒప్పించారు. విషయం బయటపడితే ముగ్గురు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ప్రణాళిక రచించే సమయంలో వీడియో రికార్డింగ్ చేసుకున్నారు. పథకం ప్రకారం.. నవంబర్ 29న రాత్రి నరేశ్ డ్రైవర్ ప్రదీప్కు టిప్పర్లో మట్టిలోడ్ నింపుకురావాలని చెప్పాడు. రాత్రి 11 గంటల తర్వాత టిప్పర్ బ్రేక్డౌన్ అయిందని ప్రదీప్ నరేశ్కు ఫోన్ చేశాడు. గ్రామశివారులోని పెట్రోల్ బంక్ వద్ద టిప్పర్ ఆగిపోయిందని, జాకీ ఇచ్చిరమ్మని నరేశ్ వెంకటేశ్ను తమ బంధువు సాయిని ఇచ్చి స్కూటీపై పంపించాడు. కాసేపటికి నరేశ్ టిప్పర్ వద్దకు చేరుకున్నాడు. వెంకటేశ్ను టిప్పర్ కింద పడుకుని జాకీ తిప్పమని చెప్పి నరేశ్ టిప్పర్ ఎక్కాడు. వెంకటేశ్ సెల్ఫోన్ లైట్ పెట్టుకొని జాకీ తిప్పుతుండగా టిప్పర్ స్టార్ట్ చేసి ఎక్కించడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్ టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ను పారిపోవాలని సూచించాడు. తన అన్నను ప్రదీప్ చంపాడని ఫిర్యాదు చేయాలని భావించాడు. కానీ టిప్పర్ను నరేశే నడిపాడని అతని తండ్రి మామిడి నర్సయ్యకు సాయి చెప్పాడు. నరేశ్ టిప్పర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు ఢీకొని వెంకటేశ్ మృతిచెందినట్లు ఫిర్యాదు చేశారు. రామడుగు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రమాదం జరిగిన తీరు, బీమా పత్రాలు పరిశీలించారు. పథకం ప్రకారమే హత్య చేశారని నిర్ధారించారు. నరేశ్, రాకేశ్, ప్రదీప్ను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. కేసును త్వరగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, రామడుగు ఎస్సై రాజును సీపీ అభినందించి, రివార్డు అందించారు. -
ఉందామా? తప్పుకుందామా?
కరీంనగర్రూరల్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పోటీ చేయడంపై కసరత్తు చేస్తున్నారు. గెలుపోటములపై అంచనా వేస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, అనుకూలంగా ఉన్న ఓట్లు, ప్రత్యర్థులకు పడే ఓట్ల వివరాలు సేకరిస్తున్నారు. పోటీ చేసేందుకు సిద్ధపడిన కొందరు ప్రత్యర్థులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా పెద్దలతో సంప్రదింపులు, రాయబేరాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ మండలంలో మొదటి విడతలో 132వార్డులకు 25వార్డుస్థానాలు ఏకగ్రీవం కాగా.. మంగళవారం రాత్రి జరిగిన చర్చల్లో నల్లగుంటపల్లిలో మిగిలిన మూడు వార్డుస్థానాలు సైతం ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. రెండు రోజుల నుంచి ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు అభ్యర్థులు చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో కాసేపట్లో తెలుస్తుంది. నామినేషన్ ఉపసంహరణ చేయాలంటే ఏకగ్రీవాలకుకు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ పోటీదారులపై తీవ్రమైన ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ప్రత్యేక గైడ్లైన్స్జారీ చేసింది. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థి సంబంధిత రిటర్నింగ్ అధికారికి బుధవారం మధ్యాహ్నం 3గంటల్లోపు ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందినట్లయితేనే నామినేషన్ ఉపసంహరణ చెల్లుబాటవుతోంది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేసినట్లయితే క్షేత్రస్థాయిలో ఆర్వో విచారణ చేసే అవకాశముంది. సింగిల్ నామినేషన్కు సర్పంచు, వార్డుసభ్యుల స్థానాలకు ఒక్కటే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా గెలిచినట్లవుతోంది. సదరు అభ్యర్ధి స్వీయ ధ్రువీకరణ పత్రం రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్వో డిక్లరేషన్ పరిశీలించి ఆమోదిస్తేనే ఆ పదవి ఏకగ్రీవమవుతోంది. ఏకగ్రీవమైన పదవుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఆర్వోలు పంపించినట్లయితే గెజిట్ విడుదల చేస్తారు. అనంతరం ఏకగ్రీవ అభ్యర్థులు గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తారు.మండలం సర్పంచ్ వార్డు మెంబర్ చొప్పదండి 80 332 గంగాధర 169 643 రామడుగు 108 480 కరీంనగర్ రూరల్ 68 301 కొత్తపల్లి 38 183 మొత్తం 463 1,939 -
ఆకట్టుకుంటున్న కళాసిల్క్ ప్రదర్శన
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్ ప్రదర్శన అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలో ఎంపిక చేసిన కళాకారులు తయారు చేసిన సిల్క్, చేనేత వస్త్రాలతో పాటు గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, రెవెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, కలాంకారి, ఉప్పడ, అసోంలోని మూగా, ఎరిసిల్క్స్, బిహార్లోని బాగల్పుర సిల్క్స్, చత్తీస్గఢ్లోని ట్రిబిల్ వర్క్స్, కోసా సిల్క్, గుజరాత్లోని బాందని, కర్చ ఎంబ్రయిడరీ డ్రెస్లు, చీరలు ఆకట్టుకుంటున్నాయి. డ్రెస్ మెటీరియల్, హ్యాండ్ క్రాఫ్ట్స్, న్యూట్రీషన్ ఫుడ్, అతివల అలంకరణ వస్తువులు, హోమ్ఫుడ్స్, బ్యాంగిల్స్ వివిధ రకాల కళాఖండాలు అందుబాటులో ఉన్నాయి. -
కరీంనగర్
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 20257జమ్మికుంట: స్థానిక మార్కెట్కు మంగళవారం 366 క్వింటాళ్ల పత్తి వచ్చింది. గరిష్ట రూ.7,250, మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,500 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.కొత్తపల్లి: బుధవారం 2నుంచి 4 గంటల వరకు 11 కె.వీ.మంకమ్మతోట ఫీడర్ పరిధిలోని రిజ్వాన్, లతీఫ్, బృందావన్ అపార్ట్మెంట్లు, ఉస్మాన్చౌరస్తా ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు. -
బరిలో విద్యావంతులు
జూలపల్లి(పెద్దపల్లి): యువతీయువకుల్లో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. రెండోవిడత సర్పంచ్, వార్డు స్థానాలకు విద్యావంతులు నామినేషన్లు వేశారు. అబ్బాపూర్ సర్పంచ్ స్థానానికి బీటెక్ చదివిన కచ్చు రమేశ్, జూలపల్లి సర్పంచ్ స్థానానికి డిగ్రీ చదివిన పాటకుల అనూష నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరి వయసు 23ఏళ్లలోపే. వివిధ గ్రామాలల్లోని వార్డుస్థానాలకు అత్యధికంగా ఈసారి 30ఏళ్ల వయసువారే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. బ్యాలెట్ పేపర్పైనే ఓటు ● సర్పంచ్కు గులాబీ.. వార్డు మెంబర్కు తెలుపు పెద్దపల్లిరూరల్: పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును బ్యాలెట్ పేపర్తోనే వినియోగించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో ఓటరు వివరాలను సరిపోల్చుకున్న సిబ్బంది.. రెండు బ్యాలెట్ పత్రాలను అందిస్తారు. ఓటరు చేతికి ఇచ్చే బ్యాలెట్ పత్రాలు రెండు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రం ‘తెలుపు’ రంగులో ఉంటుండగా.. సర్పంచ్ ఓటుకు ఇచ్చే బ్యాలెట్ పత్రం ‘గులాబీ’ రంగులో ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రఘురాం(15) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్కు పని నిమిత్తం వచ్చి దివ్వచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన రఘురాం.. బైక్ అదుపు తప్పి కిందపడడంతో ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండుకార్లు ఢీ.. 8మందికి గాయాలుతిమ్మాపూర్: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఎల్ఎండీ పోలీసుల వివరాల ప్రకారం.. బెజ్జంకి మండల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం కలికోట సంతోష్కుమార్, తోడెపు రమేశ్, తడకొండ కనకయ్య కారులో కరీంనగర్ నుంచి బెజ్జంకి వెళ్తున్నారు. కరీంనగర్లోని కట్టరాంపూర్కు చెందిన పెండ్యాల కిషన్రెడ్డి భార్య విజయ, కోడలు దివ్య, ఇద్దరు మనవలతో కారులో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వసతఉన్నారు. తిమ్మాపూర్ పరిధిలోని ఇందిరానగర్ స్టేజీ సమీపంలో కిషన్రెడ్డి కారు అదుపు తప్పి డివైడర్ దాటి రాంగ్ రూట్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం కారును ఢీ కొట్టింది. రెండు కార్లు రోడ్డుపక్కనున్న కల్వర్టులోకి దూసుకెళ్లాయి. అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులు స్పహ కోల్పోగా రోడ్డుపై వెళ్తున్న బస్సు కండక్టర్ సీపీఆర్ చేశాడు. మరో పసి బాలుడు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. పాటకుల ఆనూష -
రాజీవ్ రహదారి.. రైల్వేలైనే హద్దులు
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి పంచాయతీకి చెదరని హద్దులు ఉన్నాయి. దీనికి అనుబంధ బద్రిపల్లికీ ఓ వైపు రైల్వేలైన్, మరోవైపు రాజీవ్ రహదారి హద్దులుగా ఉన్నాయి. ఇందిరమ్మ(ఐఓసీ) కాలనీ–మొగల్పహాడ్ గ్రామాల మధ్య రాజీవ్ రహదారి ఉంటుంది. వీటితర్వాత ప్రధాన రైల్వేలైన్ పక్కనే కుందనపల్లి గ్రామం ఉంది. దీనికి మరోవైపు ఎన్టీపీసీ నుంచి అక్బర్నగర్ సమీపంలోని యాష్పాండ్ వరకు బూడిద పైపులైన్ సరిహద్దు ఉంటుంది. బద్రిపల్లి, మొగల్పహాడ్, ఇందిరమ్మ(ఐఓసీ) కాలనీల సమూహమే కుందనపల్లి పంచాయతీ. ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో అభ్యర్థులు వీటన్నింటినీ దాటుకొని వెళ్తేనే ప్రచారం చేసేది. రైల్వేలైన్ చెంతనే కుందనపల్లి ఓట్లు సమానంగా వస్తే..కరీంనగర్ అర్బన్: ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో అభ్యర్థి పడే కసరత్తు అంతాఇంతా కాదు. విజయమే లక్ష్యంగా ఓటు వేటలో వేయని ఎత్తులు ఉండవు. మరీ ఇంత చేసినా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే..? ఈ సందర్భం వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. లాటరీ ఏ అభ్యర్థికి అనుకూలంగా వస్తుందో ఆ అభ్యర్థికి ఒక అదనపు ఓటు వచ్చినట్లుగా భావించి విజేతగా ప్రకటిస్తారు. సమాన ఓట్లు పొందిన అభ్యర్థుల పేర్లను సమాన రంగు, పరిమాణం కలిగిన ఐదేసి చీటీలపై రాసి వాటిని గుర్తించకుండా కలుపుతారు. తదుపరి ఒక చీటీని డ్రా తీయగా దాంట్లో ఎవరి పేరైతే వస్తుందో ఆ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటిస్తారు. విలేజ్ వాయిస్తంగళ్లపల్లి(సిరిసిల్ల): నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని వార్డు మెంబర్ అభ్యర్థిపై దాడిచేసిన పలువురు వ్యక్తులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు.. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సుంకపాక శరత్ గ్రామంలో 1వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. కాగా నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని శరత్ను గ్రామానికి చెందిన దేవచంద్రం, సాయి, కంకర రాజు, కంకర కిషన్ బెదిరింపులకు గురిచేసి దాడి చేశారు. బాధితుడి పెద్దనాన్న సుంకపాక దేవయ్య ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా
కరీంనగర్కార్పొరేషన్: నగరపాలక సంస్థ కార్మి కులు, సిబ్బందికి రూ.30 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యే క అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పారిశుధ్య కార్మికులకు పీపీఈ, శానిటేషన్ కిట్లు అందించారు. పారిశుధ్య జవాన్ శ్యాంసుందర్ మృతిపై మౌనం పాటించి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికులు ప్రమాదాల బారిన పడితే కుటుంబానికి రూ.30 లక్షలు అందేలా బీమా చేస్తున్నామన్నారు. పీపీఈ కిట్లను కార్మికులు పనిసమయాల్లో తప్పకుండా వినియోగించాలన్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. పారిశుధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారధి సొసైటీ ద్వారా గ్లౌస్లు, షూలు, ఆఫ్రాన్లు, మాస్కులతో పాటు సబ్బులు, ఆయిల్ లాంటి వస్తువులతో కూడిన పీపీఈ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, హెల్త్ ఆఫీసర్ సుమన్, వారధి సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు.ఎన్సీడీ వ్యాధులపై దృష్టి పెట్టండికరీంనగర్: నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్సీడీ) వ్యాధులపై దృష్టి సారించాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. కరీంనగర్లోని మోతాజ్ఖానా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. 30ఏళ్లు పైబడినవారికి అధిక రక్తపోటు, షుగర్ పరీక్షలు చేసి నిర్ధారణ అయినవారికి మందులు అందజేయాలన్నారు. గృహ సందర్శనల ద్వారా శిశు సంరక్షణ, పోషకాహారంపై తల్లులకు అవగా హన కల్పించాలన్నారు. ఆరోగ్య మహిళ క్యాంపుల్లో 100శాతం రీస్క్రీనింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నించాలన్నారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను, బరువు తక్కువ ఉన్న పిల్లలను (ఎస్ఏఎం, ఎస్యూడబ్ల్యూ)గుర్తించి పోషకాహార పునరావాస జిల్లా కేంద్రానికి పంపించడానికి తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. పీవో ఎన్సీడీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్ఎన్ సన జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇమ్రాన్ పాల్గొన్నారు. కొత్తపల్లి: విద్యార్థులు విద్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ చాటాలని డీఈవో శ్రీరాం మొండయ్య సూచించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్నేహిత ఫేజ్–2 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యం దశ నుంచే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాలన్నారు. సీడీపీవో సబిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, జీసీడీవో కృపారాణి, షీటీం సభ్యురాలు స్వప్న, హెచ్ఎం టి.శోభారాణి పాల్గొన్నారు. కరీంనగర్కల్చరల్: నిజామాబాద్కు చెందిన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న నిజామాబాద్లో జరిగే సరస్వతీరాజ్ సాహిత్యోత్సవంలో అందించే వచన కవితా పురస్కారాలకు జిల్లా కేంద్రానికి చెందిన సబ్బని లక్ష్మీనారాయణ, అన్నవరం దేవేందర్లు ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. నగదు పురస్కారంతో పాటు సన్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇరువురికి పలువురు కవులు, రచయితలు, రచయిత్రులు అభినందనలు తెలిపారు. -
● సర్కారు ఉద్యోగులూ తస్మాత్ జాగ్రత్త ● ప్రచారం, సభలు, సమావేశాల్లో పాల్గొన్నా వేటే
కరీంనగర్ అర్బన్: ఎన్నికలంటే అన్ని వర్గాలకు సంబరమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాల్సిందే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగుతున్నందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. ఉద్యోగులు ఏ మాత్రం అనుచితంగా వ్యవహరించినా వేటు వేయడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయడం తగదని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతో పాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ పోస్టులపై కూడ ఓ కన్నేసింది. సభలు.. సమావేశాలు వద్దు ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకుని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాద్యమాల్లో పొందుపరిచినా నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడిది పెను ముప్పే. ఆడియో, వీడియోల ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి కానీ అందుబాటులో ఉన్న యంత్రాంగానికి పంపినా లేదా ప్రచార మాధ్యమాల్లో పోస్టు చేసినా అంతే సంగతులని గత ఉదంతాలు చాటుతున్నాయి. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తూనే అంగన్వాడీలపై వేటు వేశారు. గతంలో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీలు ఫోన్లు చేసి మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు. సెల్ఫోన్లతో కష్టాలు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. స్మార్ట్ఫోన్లు లేనివారు లేకపోగా ఆధునాతన ఫీచర్లను వినియోగిస్తున్నారు. ఉద్యోగులు సెల్ఫోన్ ద్వారా విస్తృతంగా వాడుతున్న ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులలో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది. ఉద్యోగులు ఎటువైపు..? సర్పంచి ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఏరికొరి ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలముంటే, మరికొన్ని సంఘాలు ప్రతికూలమంటున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని మాత్రమే చూస్తామని, ఏ పార్టీ వ్యక్తన్నది అనవసరమని ఉద్యోగులు చెబుతున్నారు. -
పల్లె ఒక్కటే.. పంచాయతీలు రెండు
కరీంనగర్రూరల్: సంచార జీవులకు నిలయమైన మందులపల్లె రెండు గ్రామపంచాయతీలకు నిలయంగా మారింది. మందులపల్లె గ్రామపంచాయతీ కరీంనగర్ జిల్లాకు చెందగా మరొకటి పెద్దపల్లి జిల్లాకు చెందిన నారాయణరావుపల్లె. ఒకే ప్రాంతంలో పైభాగంలో మందులపల్లె ఉండగా కిందివైపు నారాయణరావుపల్లె ఉంటుంది. గత పంచాయతీ ఎన్నికల్లో మూడు గ్రామపంచాయతీలు మందులపల్లె, నారాయణరావుపల్లె, మొగ్ధుంపూర్లకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మొగ్ధుంపూర్ ఓటర్లను మందులపల్లె జాబితాలో కలుపడంతో రెండు పంచాయతీలకు అడ్డాగా మారింది. మందులపల్లెలో మొత్తం 750 ఓట్లుండగా నారాయణరావుపల్లె పంచాయతీ పరిధిలోకి వచ్చే 6వ వార్డులో 74 ఓట్లున్నాయి. కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో మందులపల్లె సర్పంచు స్థానం జనరల్ మహిళకు కేటాయించగా ఐదుగురు నామినేషన్లు వేశారు. పెద్దపల్లి జిల్లాలో మూడో విడతలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. నారాయణరావుపల్లె గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మందులపల్లెలో రాజకీయం వేడెక్కగా.. నారాయణరావుపల్లెలో స్తబ్దత నెలకొంది. -
సర్పంచ్ ఎన్నికపై ‘వీడీసీ’ పెత్తనం
మెట్పల్లిరూరల్: పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తమను అడిగేవారు, అడ్డుకునేవారు లేరన్న ధీమాతో పెత్తనం చెలాయిస్తున్నాయి. ఇసుక, మద్యం, కూల్డ్రింక్స్, చికెన్, ఇతరత్రా వాటికి వేలం వేస్తున్న వీడీసీలు.. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికలోనూ జోక్యం చేసుకోవడం వివాదాలకు దారితీస్తోంది. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో సర్పంచ్ పదవికి వీడీసీ సభ్యులు ఆదివారం రూ.28.60 లక్షలకు వేలం వేసినట్లు సమాచారం. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన గుడేటికాపు కులస్తులు వీడీసీ ఏకపక్షంగా సర్పంచ్ పదవికి వేలం నిర్వహించిందని అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలు భూములకు సంబంధించిన అంశాల్లో వీడీసీ, గుడేటికాపు కులస్తులకు వివాదం తలెత్తగా.. వారిని వీడీసీ గ్రామ బహిష్కరణ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు.. జగ్గాసాగర్ సర్పంచ్ అభ్యర్థిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సి ఉండగా వీడీసీ సభ్యులు, సర్పంచ్ పదవికి వేలం వేయడంపై గుడేటికాపు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మంగళవారం మెట్పల్లి ఆర్డీవో, డీఎస్పీ, ఎంపీడీవో, ఎస్సైలను కలిసి ఫిర్యాదు అందించారు. నామినేషన్ వేసిన పలువురు పోటీ నుంచి తప్పుకోవాలని వీడీసీ సభ్యులు చెబుతున్నారని వివరించారు. చట్టబద్ధంగా సర్పంచ్ ఎన్నిక జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఉపసర్పంచ్ పదవికి కూడా వేలం వేసేందుకు వీడీసీ సభ్యులు గ్రామ శివారులోని ఓ చోట రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి పలువురిని పిలిచి తాము అనుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్ అభ్యర్థులనే గెలిపించుకోవాలని సూచించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనస్థలానికి వెళ్లడంతో వారంతా అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. అభ్యర్థులతో అధికారుల సమావేశం సర్పంచ్గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థులు, వీడీసీ సభ్యులతో తహసీల్దార్ నీత, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆర్వో శ్రీనివాస్, పోలీసులు జగ్గాసాగర్ పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. చట్టవిరుద్ధంగా సర్పంచ్ ఎన్నిక వేలం నిర్వహించడం సరికాదని వీడీసీ సభ్యులను హెచ్చరించారు. సర్పంచ్ పోటీ నుంచి తప్పుకోవాలని ఎవరైనా భయపెడుతున్నారా..? ఎవరినుంచైనా ఒత్తిడి ఉందా..? అని అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. 10 మంది బైండోవర్.. జగ్గాసాగర్ సర్పంచ్ వేలం, గుడేటి కాపు కులస్తుల గ్రామ బహిష్కరణ వివాదంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు 10 మందిని బైండోవర్ చేశారు. వీరిలో నలుగురు వీడీసీ సభ్యులు ఉన్నారు. మిగిలిన ఆరుగురు గ్రామస్తులు. చట్టానికి విరుద్ధంగా పనులు చేసినా.. సత్ప్రవర్తనతో మెలగని పక్షంలో రూ.5 లక్షలు జరిమానా విధించేలా హెచ్చరికలు జారీ చేశారు. వివాదాస్పదమవుతున్న సభ్యుల తీరు జగ్గాసాగర్ సర్పంచ్ ఎన్నికలో జోక్యం గుడేటికాపు కులస్తుల అభ్యంతరం గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ పోలీసులకు ఫిర్యాదు.. వీడీసీ సభ్యుల బైండోవర్ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్ రిజర్వేషన్ ఖరారైంది. దీంతో పోటీలో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. మొత్తంగా సర్పంచ్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత సర్పంచ్ పదవికి వేలం వేయాలని వీడీసీ నిర్ణయించింది. ఆదివారం వీడీసీ 17 కులసంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసింది. అందులో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని వీడీసీ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. బహిరంగ వేలం వేస్తే మరింత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశముందని భావించిన వీడీసీ సభ్యులు వేలం నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.28.60 లక్షలు చెల్లించడానికి ముందుకొచ్చాడు. అతడినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వీడీసీ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. -
జోష్ పెరిగేనా?
హస్తంలోసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘పల్లెల్లో’ పాగా వేసేందుకు ‘పట్టణం’లో పెట్టిన సీఎం సభపై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీస్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్లో జరిగే సీఎంసభను ప్రచార అస్త్రంగా భావిస్తున్నారు. పల్లెలను ప్రభావితం చేసేలా పెడుతున్న పట్టణ సభద్వారా మరింత జోష్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా మంత్రుల నడుమ ఆధిపత్యపోరు, కరీంనగర్ కేంద్రంగా పార్టీ అనాథలా మారడం, నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్పోరు.. శ్రేణులను కలవరపరుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సభతో ముగ్గురు మంత్రులు, విప్లు, అంతా ఏకమై సభ విజయవంతానికి తమ వంతుగా పనిచేసుకుంటూ పోతుండటం పార్టీలో పెరిగిన సహకారానికి నిదర్శనమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు ప్రకటించే వరాల జల్లుతో స్థానికసంస్థల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మూడు ముక్కలాటకు సీఎం సభతో చెక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నడుమ అంతర్గత ఆధిపత్యపోరు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా హుస్నాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ నడుమ ఏ విషయంలోనూ పొసగదనేది బహిరంగరహస్యమే. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్బాబుది పైచేయి కావడం, కరీంనగర్కు సంబంధించిన నియామకాల్లోనూ ఆయనే కీలకం కావడంపై అప్పట్లో పొన్నం కినుక వహించారు. ఒక దశలో సుడా చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని భీష్మించుకొని ఉన్నా, ఇటీవల కాస్త మెత్తపడి, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డిని చేరువ చేసుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కుమార్పై చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెనుదుమారం లేపడం తెలిసిందే. పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ముగ్గురి నడుమ అధికారులు నలిగిపోతూనే ఉన్నారు. సీఎంసభ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనబెట్టి అంతా కలిసి పనిచేస్తుండటం శుభసూచకం. ఈ మైత్రి మునుముందు కూడా కొనసాగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ ఆశాజనకంగా ఉంది.పొన్నం ప్రభాకర్అడ్లూరి లక్ష్మణ్కుమార్ఉమ్మడి జిల్లా ‘హెడ్’ క్వార్టర్ అయిన కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. ఇటీవల డీసీసీ, కార్పొరేషన్ అధ్యక్షుల నియామకంతో కాసింత గాడినపడినట్టుగా కనిపిస్తున్నా, ఇప్పటికీ కరీంనగర్ ఎవరిదనే సమస్య కొనసాగుతోంది. కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందడం, శ్రీధర్బాబు పెద్దపల్లి, లక్ష్మణ్కుమార్ జగిత్యాల జిల్లాలకు ప్రాతినిథ్యం వహించడంతో కరీంనగర్లో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. పైగా కరీంనగర్ ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉండడంతో, ఆ స్థాయిలో కాంగ్రెస్కు నాయకుడు కనిపించడం లేదు. తాను కరీంనగర్ వాసినని పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు జోక్యం చేసుకొంటున్నా, పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా మారారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్కుమార్ను నియమించిన తరువాత పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఖాళీగానే ఉంది. దీంతో నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఎవరికీ లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ అసంపూర్తి సంస్థాగత నిర్మాణం సమస్యగా మారుతోంది. పూర్తిస్థాయిలో డీసీసీ, సిటీ, మండల కమిటీలను నియమిస్తే పార్టీలో కొత్త జోష్కు అవకాశముంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు, పార్టీ గుర్తులపై త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పార్టీలో సమన్వయం ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్లో అదే కరువైంది. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్క్రైం/చిగురుమామిడి/సైదాపూర్:జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రత చర్యలు చేపడుతున్నామని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. రెండో విడ త నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పర్యవేక్షించా రు. తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్, నల్లగొండ, పర్లపల్లి, మొగిలిపాలెం, చిగురుమామిడి మండలం రేకొండ, సుందరగిరి, బొమ్మనపల్లి, సైదాపూర్, సోమారం, శంకరపట్నం, తాడికల్ గ్రామాల్లో పర్యటించారు. పోలింగ్ రోజు అదనపు పోలీసు బలగాలను మోహరించి, పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రూరల్ ఏసీపీ విజయకుమార్, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐలు సదన్ కుమార్, వెంకట్, ఎస్సైలు శ్రీకాంత్, తిరుపతి, సాయికృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల బందోబస్తుపై సీపీ సమీక్ష గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సీపీ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా భద్రత కల్పించాలన్నారు. డీజేలు, బహిరంగ మద్యపానం, డ్రోన్ల వినియోగంపై ఈ నెల 31వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. సైబర్ నేరాలపై సమరశంఖం సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని సీపీ గౌస్ఆలం అన్నారు. సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ‘ఫ్రాడ్ కా ఫుల్స్టాప్– సైబర్ క్లబ్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ ఆవిష్కరించారు. కళాశాలల విద్యార్థులు సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని ప్రతిజ్ఞ చేయించారు. -
ఐదు నిమిషాల ఆలస్యంతో చెదిరిన ఎన్ని‘కల’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వార్డు మెంబర్గా ఎన్నికై ప్రజాసేవ చేద్దామనుకున్న ఓ అభ్యర్థి కల ఐదు నిమిషాల ఆలస్యంతో ముగిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామపంచాయతీ 1వ వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు నేరెళ్ల శ్రీధర్ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. నామినేషన్ కేంద్రానికి చేరుకుని తనవంతు కోసం వేచిచూశాడు. కాగా పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని గుర్తించి తీసుకు రావడానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి నామినేషన్ సమయం ముగిసి 5 నిమిషాలు ఆలస్యం కావడంతో పోలీసులు అతడిని అనుమతించలేదు. కాగా, అధికారులు తన పత్రాలను సరిగా చూడకపోవడం వల్లే నామినేషన్ వేయలేకుండా పోయాయని, నామినేషన్ వేసేందుకు రూ.6 వేలు ఖర్చు చేశానని వాపోయాడు. -
ఆ పల్లెలు ఏకగ్రీవం..
● వీరాపూర్ సర్పంచ్గా దిండగుల గంగు రాయికల్: రాయికల్ మండలం వీరాపూ ర్ సర్పంచ్తో పాటు, వార్డులన్నిటికీ ఒక్కటి చొప్పున నామినేషన్ రావడంతో అన్ని స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్గా దిండగుల గంగు ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా దొమ్మంటి లావణ్య, మహ్మద్ అమీర్బీ, తొట్ల రాజిరెడ్డి, చెట్లపల్లి అంజన్న, ముక్కెర నరేశ్, దుంపల నర్సారెడ్డి, నీలి మమత, సుందరగిరి మురళీ ఏకగ్రీవమయ్యారు. చెర్లపల్లి పంచాయతీకి ఒకే నామినేషన్ జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. సర్పంచ్ స్థానానికి మేడిపల్లి వనిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఒకటో వార్డుకు ఇమ్మడి విజయ్, రెండో వార్డుకు బాలు సాని విజయ, మూడోవార్డుకు బాలుసాని స్వరూ ప, నాలుగో వార్డుకు కోల రాజిరెడ్డి, ఐదో వార్డుకు దుమల సుమన్, ఆరో వార్డుకు బొమ్మెన రాజేందర్ ఒక్కటి చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అధికారులు వారిని ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు. నాయికపుగూడెంలో.. సారంగాపూర్: మండలంలోని నాయికపుగూడెం సర్పంచ్కు ఒకటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. కొత్తూరి పుష్పనాథ్ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం కానుంది. భీంరెడ్డిగూడెం సర్పంచ్గా మైనేని ప్రమీల, వార్డు సభ్యులుగా మారినేని రాజేందర్, గుడిపెల్లి బాలవ్వ, కర్నాటకపు జమున, సిరిపెల్లి భీమయ్య ఏకగ్రీవం కానున్నారు. ఒడ్డెరకాలనీ సర్పంచ్గా పల్లపు మాధవి, వార్డుసభ్యులుగా పొగుల ఎల్లారెడ్డి, దండుగుల రమేశ్, చెల్ల లావణ్య, పల్లపు నాంపల్లి, బోదాసు మధువర్ష, పల్లపు పుష్పలత ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం తిప్పాపురం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, సర్పంచ్గా బొల్లవేణి మంజులను ఏకగ్రీవం చేసేందుకు ఒకే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వార్డు సభ్యులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. చిక్కుడువానిపల్లె గ్రామపంచాయతీ ఏకగ్రీమైంది. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఒక్కో నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా చింతమడక కళ్యాణ్, వార్డు సభ్యులుగా చిక్కుడు సత్యం, చిక్కుడు శ్రీనివాస్, కంకటి బాలవ్వ, చింతమడక రమ్య నామినేషన్ వేశారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సర్పంచ్ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీకి నిలబడితే కక్షలు పెరిగే అవకాశం ఉందని భావించిన గ్రామస్తులు ఏకగ్రీవం చేయాలని భావించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో 360 మంది జనాభా ఉంటారు. గ్రామంలో పార్టీల గొడవలు లేకుండా ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా నెత్తెట్ల లస్మయ్య, ఉపసర్పంచ్ అభ్యర్థిగా మందాటి రామును ప్రకటించారు. ఈ గ్రామాలకు ఒక్కటే నామినేషన్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేందుకు పలు గ్రామాల్లో అభ్యర్థులు కుప్పలు తెప్పలుగా నామినేషన్లు వేయగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం వేణుగోపాల్పూర్, బాలమల్లుపల్లెలో సర్పంచ్ స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యింది. నామినేషన్ పత్రాల స్కూటినీ తర్వాత అన్నిపత్రాలు సక్రమంగా ఉంటే ఒక్క నామినేషన్ వేసిన అభ్యర్థులనే రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవ విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. -
బిల్లులు రాక ఇబ్బందిపడుతున్న
సర్పంచ్గా పనిచేసిన హయాంలో రూ.20 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన. పెండింగ్ బిల్లులు ఇప్పటికీ క్లియర్ కాలేదు. సర్పంచ్ల బిల్లులను క్లియర్ చేయడంలో గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. – నేరేళ్ల మహేందర్గౌడ్, మాజీ సర్పంచ్, చెల్పూర్ గ్రామంలో సర్పంచ్గా పనిచేసిన సమయంలో అప్పు చేసి అభివృద్ధి పనులు చేసిన. రూ.13 లక్షలకు సంబంధించిన చెక్కులు మంజూరైనా గ్రామపంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో చెక్కులు నిలిచిపోయాయి. మొత్తం రూ.17 లక్షల నిధులు రావాల్సి ఉంది. – బింగి కరుణాకర్, మాజీ సర్పంచ్, రంగాపూర్ -
● ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్ అధికారి ● సహాయకులుగా అధికారులు
కరీంనగర్అర్బన్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కలెక్టర్ పమేలా సత్పతి ఇప్పటికే నోడల్ అధికారులను నియమించగా పర్యవేక్షణ పక్కాగా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో లోపాలను దిద్దుబాటు చేస్తూ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. ఇప్పటికే ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించగా ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చారు. నోడల్ అధికారులుగా జిల్లా స్థాయి అధికారులను, సహాయకులుగా ఇద్దరు గ్రూప్–2 స్థాయి అధికారులను నియమించారు. మానవ వనరుల పర్యవేక్షణ, శిక్షణ యాజమాన్యం, రవాణా, కంప్యూటరైజేషన్, ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఐటీ, స్వీప్, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఈవీఎం మేనేజ్మెంట్ అండ్ స్టోరేజ్, మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్, బ్యాలెట్ పేపర్/డమ్మీ బ్యాలెట్/పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఓటరు జాబితా, హెల్ప్లైన్/ఫిర్యాదులు/ఎస్ఎంఎస్ మానిటరింగ్ సీ–విజిల్, అబ్జర్వర్స్, వెల్ఫేర్/పీడబ్ల్యూడీ ఓటర్స్, కాంటాక్టింగ్ మైగ్రేటరీ ఓటర్స్ ఇలా 13విభాగాలకు నోడల్ అధికారులను నియమించారు. ఒక అధికారికి ఇద్దరు సహాయకులు ఎన్నికల కసరత్తు, నిర్వహణ, పర్యవేక్షణ క్రమంలో నోడల్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించగా, ఒక్కో అధికారికి ఇద్దరిని సహాయకులుగా నియమించారు. మ్యాన్పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా విద్యాధికారి, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ డీపీవో, మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా ఏవో(డీపీవో), ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా రవాణా శాఖ అధికారి, ట్రైనింగ్ మేనేజ్మెంట్ డీపీవో, ఎక్స్పెండెచర్ మానిటరింగ్, ఎంసీవోసీ నోడల్ అధికారిగా డీఆర్వో, బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా ఏవో(డీపీవో), పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిగా డీఆర్డీవో, మీడియా నోడల్ అధికారిగా డీపీఆర్వో, ఎక్స్పెండెచర్ మానిటరింగ్ నోడల్ అధికారిగా డీడీ స్టేట్ ఆడిట్, పరిశీలన నోడల్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(ఎన్ఐసీ), రిపోర్ట్స్, రిటర్న్స్ నోడల్ అధికారిగా డివిజనల్ పంచాయతీ అధికారి(హుజూరాబాద్), హెల్ప్లైన్, కంప్లయిట్స్ నోడల్ అధికారిగా జెడ్పీ డీసీఈవోలను నియమించారు. -
గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టె క్నో స్కూల్లో మూడురోజులుగా నిర్వహించిన జి ల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26, ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ ప్రదర్శన సోమవారం ము గిసింది. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 807 నమూనాలు, 126 ఇన్స్సైర్ అవార్డ్స్ మనాక్ నమూనాలను ప్రదర్శించగా దాదాపు 176 పాఠశాలల నుంచి మొదటి రోజు 1,600 మంది, రెండో రోజు 2,652 మంది, చివరి రోజు 5,357 మంది విద్యార్థులు సందర్శించారు. ఇందులో 13 నమూనాలు రాష్ట్రాస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్కు ఎంపికయ్యాయి. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 7 సబ్థీమ్స్లో మొదటి స్థానం పొందిన నమూనాను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా డీఈవో శ్రీరాంమొండయ్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడ ని, పట్టుదలతో పనిచేసి మానవాళి సంక్షేమానికి కొ త్త ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు. అల్ఫోర్స్ చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశనుంచే నూతన ఆవిష్కరణల దిశగా ఆ లోచనలు సాగాలని, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగా లని పిలుపునిచ్చారు. జిల్లా సైన్స్ అధికారి చాడ జ యపాల్రెడ్డి, ఎస్.భగవంతయ్య, కర్ర అశోక్రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్రెడ్డి, రవీంద్రాచా రి, రామయ్య, రవీందర్, గంగాధర్, అనంతాచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
కాసుల కష్టాలు
హుజూరాబాద్: సర్పంచ్గా పోటీ చేయాలని ఆశ.. కానీ, ఖర్చులు భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంస.. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చి పోటీకి ఉత్సాహం ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వలేక ఆశావహుల్లో నిరాశ. తాజామాజీ సర్పంచ్లకు చేసిన పనులకు బిల్లులే రాక ఇంకా అవస్థలు పడుతున్న తీరు పోటీదారులకు అప్పు పుట్టకుండా చేస్తోంది. ప్రధాన పార్టీల మద్దతు కావాలన్నా.. ‘నీ చేతిలో ఎంత ఉందో ముందు చెప్పు’ అంటూ ఎదురు ప్రశ్నలు. దీనికి తోడు రియల్ భూమ్ లేకపోవడం, పంటల ఆదాయం అంతంతే ఉండటంతో అభ్యర్థులను కాసుల కష్టాలు వెంటాడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలిసినోళ్లందరినీ కలిసి ‘నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దుబాటు చేయ్’ అంటూ పాట్లు పడుతున్నారు. పోటీ సరే.. పెసలెట్లా..? అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్.. ఏ ఎన్నికై నా కాసులతో ముడిపడిపోయింది. ప్రచారంలో ప్రత్యర్థులకు దీటుగా రంగంలో ఉండాల్సిందే. ఖర్చులో తగ్గేదేలే అంటేనే క్యాడర్ అభ్యర్థి వెనుక నిలబడుతుంది. లేదంటే వారి దారి వారిదే అనే భయం. దీంతో పోటీకి సిద్ధమైన అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల్లో బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ప్రచార వాహనాలు, రోజువారి క్యాడర్ ఖర్చు, పోల్ మేనేజ్మెంట్ వీటన్నింటికి తోడు మందు, మాంసం లెక్కలు వేరే అనే టాక్ ఉంది. వెయ్యి ఓట్ల లోపు గ్రామమైతే తక్కువలో తక్కువగా రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందనే అంచనాల్లో ఉన్నారు. రెండువేల లోపు జీపీల్లో ఒక్కో అభ్యర్థికి రూ.20 లక్షల పైమాటే అనే టాక్ ఉంది. ఇక 2వేలకు పైగా ఓటర్లు ఉంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు.. ఆపైన కూడా ఖర్చు పెరుగుతుందనే చర్చ ఉంది. ఖర్చులే కాకుండా సొంత పార్టీ నుంచి పోటీకి దిగుతున్నవారిని తప్పించేందుకు రూ.లక్షల్లో చేతిలో పెట్టాల్సిందే. అయితే మరోవైపు ఏకగీవ్రం ఆశావహులను ఊరిస్తోంది. ఎవరితో పోటీ, ప్రచార లొల్లి, ఖర్చుల బాధ లేకుండా సర్పంచ్ సీటులో కూర్చోవచ్చునని ఉవ్విళ్లూరుతున్నవారు కూడా ఉన్నారు. అయితే ఏకగ్రీవం పేరుతో గ్రామ అభివృద్ధికి, పోటీ నుంచి తప్పుకునేవారికి, చివరికి ఓటర్లకు దావత్.. ఇలా ఖర్చుల మీద ఖర్చులు తప్పవనే ప్రచారం ఉంది. దీంతో చేతిలో చిల్లీ గవ్వ లేకున్నా మద్దతుదారుల ప్రోత్సాహంలో సర్పంచ్ బరిలో దిగుతున్న అభ్యర్థులను కాసుల కష్టాలు కలవరపెడుతున్నాయి. సర్దుబాటుకు తంటాలు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాననే ఆనందం ఒకవైపు, ఖర్చులకు అప్పు ఎట్లా అనే ఆందోళన మరో వైపు అభ్యర్థులను కలవర పరుస్తోంది. తెలిసినోళ్లందరికీ ఫోన్ చేసి అప్పు కోసం బతిమిలాడాల్సి వస్తోంది. అభ్యర్థులు వడ్డీ వ్యాపారులను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తాజా మాజీ సర్పంచుల అనుభవాలను చూసిన వ్యాపారులు, పెట్టుబడిదారులు కూడా ఎన్నికల కోసం అప్పు ఇచ్చేందుకు ససేమేరా అంటున్నారు. మాజీ సర్పంచులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పు ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో కొందరు తమ భూములను తాకట్టు పెట్టే పనిలో ఉండగా, మరికొందరు భార్య, పిల్లలు, తల్లికి సంబంధించిన బంగారు ఆభరణాలను తాకట్టు పెడుతున్నారు. కాగా, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పోటీ చేస్తే మిగిలేది ఏమిటనే ఆలోచనలో మరి కొందరు ఉన్నారు. తాజా మాజీ సర్పంచుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, వృథా ఖర్చులు లేకుండా పోటీ చేయాలని అభ్యర్థుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. పదవిపై మోజుతో బరిలోకి పలువురు ఎన్నికల ఖర్చుకు సరిపడా డబ్బుల్లేక వెతలు పోటీదారులకు అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపని వడ్డీవ్యాపారులు మాజీ సర్పంచ్లకే చేసిన పనులకు బిల్లులు పెండింగ్ గెలిచినా ఖర్చుపెట్టింది సంపాదించేదెప్పుడో అనే అనుమానం డబ్బు సర్దుబాటుకు అభ్యర్థుల పాట్లు చేతిలో చిల్లిగవ్వ లేకున్నా పోటీకి సై -
కొత్త వైన్స్లకు షాక్
కరీంనగర్రూరల్: కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులకు సోమవారం తొలిరోజే అధికారులు షాకిచ్చారు. మద్యం స్టాక్ సకాలంలో కేటాయించకపోవడంతో దుకాణాలను తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ మద్యం అందుబాటులో లేక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలుండగా కరీంనగర్అర్బన్లో 21, కరీంనగర్రూరల్ పరిధిలో 26 ఉన్నాయి. ప్రారంభంతోనే పంచాయతీ ఎన్నికలతో గిరాకీ ఉంటుందని వ్యాపారులు భావించారు. కరీంనగర్రూరల్ మండల పరిధిలో నగునూరు, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ గ్రామాల్లో గతంలో నిర్వహించిన దుకాణాల్లోనే కొత్తవ్యాపారులు మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే, గతంలో కరీంనగర్రూరల్ పరిధిలో ఉన్న బొమ్మకల్, దుర్శేడ్లోని మద్యం దుకాణాలను ప్రస్తుతం అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాలను పొందిన వ్యాపారులు ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశమేర్పడింది. గతంలో బొమ్మకల్ పరిధిలోని మద్యం దుకాణం పొందిన వ్యాపారులు కొత్తగా గోపాల్పూర్లోని రాజీవ్ రహదారి పక్కన కొత్త షెడ్ నిర్మించారు. అయితే షెడ్ నిర్మాణం పూర్తికాకపోవడంతోపాటు లైసెన్స్దారుడికి పాస్వర్డ్ జారీలో జాప్యంతో రాత్రి మద్యం స్టాక్ కేటాయించారు. మరికొన్ని దుకాణాలకు సైతం సకాలంలో స్టాక్ ఇవ్వకపోవడంతో చివరకు రాత్రి దుకాణాలు తెరిచినట్లు సమాచారం. తీగలగుట్టపల్లికి చెందిన మద్యం దుకాణం చల్మెడ ఆనందరావుమెడికల్ కళాశాల సమీపంలోని పెట్రోల్బంకు పక్కన ఏర్పాటు చేశారు. రెండు మద్యం దుకాణాలు రాజీవ్ రహదారిలో ఏర్పాటు చేయడంతో మద్యం కొనుగోళ్లతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడే అవకాశముందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కొత్త మద్యం దుకాణాలకు అవసరమయ్యే స్టాక్కు డిపోలో బిల్లు చేసి కేటాయించడంలో కొంత జాప్యమేర్పడిందని కరీంనగర్రూరల్ ఎకై ్సజ్ సీఐ అశోక్కుమార్ తెలిపారు. దుకాణాలన్నింటికీ మద్యం స్టాక్ను అలాట్మెంట్ చేశామని వివరించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్: ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారీగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రతీ చిన్న అంశాన్ని అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు వివరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. కరీంనగర్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. సోమవారం డీఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. లింగ నిర్ధారణ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన 7 స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే వారి సమాచారాన్ని నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని 98499 02501 టోల్ఫ్రీ నంబర్కు, స్వయంగా తెలియజేయాలని కోరారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను నిరంతరాయంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. కమిటీ సభ్యులు డీఐవో డాక్టర్ సాజిద, సన జవేరియా, ఎంసీహెచ్ హెచ్వోడీ, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ వైద్యులు, డెమో రాజగోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): దుర్శేడ్ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలోని 132 సబ్స్టేషన్కు ప్రస్తుతమున్న ఏసీఎస్ఆర్ కండక్టర్ హైటెన్షన్ తీగలకు బదులుగా హెచ్టీఎల్ఎస్ కండక్టర్ తీగలు అందుబాటులోకి వచ్చాయని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రమేశ్బాబు తెలిపారు. ఈ విద్యుత్ తీగలు ఎత్తులో ఉండి గ్రౌండ్ క్లియరెన్స్ పెరగడంతో పాటు ప్రమాదాలు తగ్గేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. హెచ్టీఎల్ఎస్ కండక్టర్ లైన్ ద్వారా లైన్ సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, దీంతో వేసవిలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ తీగలు ఉపయోగపడతాయన్నారు. ఎక్కడైనా ప్రమాకరంగా విద్యుత్ తీగలుంటే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఈ పేర్కొన్నారు. కరీంనగర్క్రైం: కరీంనగర్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్న మంచికట్ల రాజేశంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం రాజేశం పాస్ట్ట్రాక్ కోర్టు–2 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
రోడ్డు దాటితే ఊరు మారుడే..
మంథనిరూరల్: గీత దాటితే వేటు తప్పదు అనే మాటలు వింటూనే ఉంటాం.. కానీ ఇక్కడ రోడ్డు దాటితే ఊరు మారుతుంది. సాధారణంగా ఒక ఊరు నుంచి మరోఊరుకు కనీసం కిలోమీటరో రెండు కిలోమీటర్ల దూరమో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మారితేనే మరో ఊరు ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం ప్రధాన రహదారికి ఒకవైపు నాగారం ఉంటే మరోవైపు కన్నాల గ్రామపంచాయతీలోని పందులపల్లి ఉంటుంది. ఒకేచోట రెండు గ్రామపంచాయతీలకు చెందిన వారు ఉన్నా ఒక్క ఊరువాళ్లలాగే కలిసిమెలిసి ఉంటారు. కానీ ఎన్నికల సమయం వస్తే మాత్రమే రెండు గ్రామపంచాయతీలని తెలుస్తుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తే మాత్రం రోడ్డు ఇవతలివైపు వాళ్లు అవతలివైపు వాళ్లు బరిలో నిల్చుంటారు. ఎన్నికలు ముగిసే వరకు ఆ రహదారి పూర్తిగా హడావుడిగా ఉంటుంది. మళ్లీ ఎన్నికల తర్వాత ఒక ఊరులాగే కన్పించడం కొసమెరుపు. ఒకే గ్రామం.. రెండు పంచాయతీలు -
తమ్ముడూ.. తప్పుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే.. ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండడం మంచిది కాదని తలచి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వ్డ్ స్థానాల కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఈనెల 3వ తేదీతో తొలిదశ నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు. కులం ఓట్లే ప్రామాణికం ప్రతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వరంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతని సామాజికవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన హామీలు ఇచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీ చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. అందుకే, గెలిచిన వాడే మనవాడు అవుతాడని, అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకు మొగ్గుచూపుతున్నారు.దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్ వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పించేందుక సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీలో పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్ల అవకాశంతో పాటు అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. స్థానికంగా జరిగే వర్క్స్, టెండర్లలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు. -
విలేజ్ వాయిస్
నెరవేరని బీటీ రోడ్డు కలమంథనిరూరల్: ఎన్నికలు.. ఓట్లు రాగానే ఊళ్లో సమస్యలు తీరుస్తామని అభ్యర్థులు హామీలు ఇవ్వడం సర్వసాధారణమే. ఎన్నికలు ముగిశాక మళ్లీ ఆ సమస్యను పట్టించుకోకపోవడం సర్వసాధారణమే. ఇలాంటి సమస్యే పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారంలో ప్రజల్ని పట్టిపీడిస్తోంది. మట్టి రోడ్డు బీటి రోడ్డుగా ఎప్పుడు మారుతుందోనని దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్ప రైతుల కల నెరవేరడం లేదు. నాగారం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కనుంచి ఉప్పట్ల వరకు గతంలో మట్టిరోడ్డు ఉండేది. దీనిపరిధిలో సుమారు 300 ఎకరాల నుంచి 400ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఏటా సాగు పనులకు ఈ రోడ్డు ద్వారానే వెళ్తుంటారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయం కావడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తన బస్తాలు తీసుకురావడానికి నానాతంటాలు పడుతుంటారు. వర్షం పడితే కాలినడకే శరణ్యం. గత ఎన్నికల సమయంలో ఈ రోడ్డు బాగు చేయిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని వాపోతున్నారు. ఎన్నికలయ్యే వరకు నీకు నాకు కటీఫ్..రాయికల్: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవారు దూరందూరంగా ఉంటున్నారు. పొద్దంతా ఒకే వాహనంపై తిరుగుతూ సరదాగా గడిపిన వారు ఇప్పుడు ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారు. సర్పంచ్గా పోటీచేసే ఆశావహులు తన మిత్రులు ఇతరవ్యక్తులకు నచ్చకపోతే ఎక్కడ ఓట్లు పడవోనని భావించి.. శత్రువును చూసినట్లు చూస్తున్నారు. దీంతో ఓటర్లంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటి వరకు తన స్నేహితుడు అని చెప్పుకుని ఎన్నికల వేళ తనకు శత్రువు అంటే ఎవరు నమ్ముతారంటూ ఓటర్లు చర్చించుకుంటున్నారు. పోలింగ్ వరకు ఇలాంటి నాటకీయ పరిణామాలు ఎన్ని చూడాల్సి వస్తుందోనని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎన్నికల బరిలో రేషన్ డీలర్లు.. ఆర్ఎంపీలు జగిత్యాలజోన్: సర్పంచ్గా పోటీ చేసేందుకు రేషన్ డీలర్లు, ఆర్ఎంపీలు కూడా సై అంటున్నా రు. రేషన్ సరుకుల కోసం వచ్చిన వారితో సత్సంబంధాలు ఉండటంతో రేషన్ డీలర్లు.. అనారో గ్యం బారినపడిన వారికి వైద్యం అందించేందుకు ఇళ్లిళ్లూ తిరిగే ఆర్ఎంపీలు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గెలిస్తే సర్పంచ్.. లేదంటే మళ్లీ అదే పని చేసుకోవచ్చు.. అంటూ వారిని బంధువులు, తెలిసిన వారు ఊదరగొ డుతున్నారు. అభ్యర్థులు ఖర్చు జోలికి వెళ్లకుండా నే రుగా ఓటర్లను కలిసి తమను గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. సర్పంచ్కు ఫికర్ లేదు కరీంనగర్టౌన్: సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతున్నందున వీరిపై అవిశ్వాసం పెట్టే అవకాశం లేకుండా పోతుంది. సర్పంచ్ ఏదేని అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడితే తప్పా ఎలాంటి ఢోకా లేకుండా ఐదేళ్లు పదవిలో ఉండొచ్చు. అక్రమాలపై ఫిర్యాదులు అందితే కలెక్టర్, డీపీవో విచారణ జరిపించి నిజమని తేలితే పదవి నుంచి తొలగించే అధికారం ఉంది. అలాగే గ్రామ సభలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించకుంటే పదవి కోల్పోయే ప్రమాదముంది. సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడితే 4 నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపసర్పంచ్పై అవిశ్వాసం పెట్టొచ్చు పదవి చేపట్టిన నాలుగేళ్ల తర్వాత ఉప సర్పంచ్పై అవిశ్వాసం పెట్టే వీలుంటుంది. పంచాయతీలోని సగానికిపైగా వార్డు సభ్యులు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం చేసి రెవెన్యూ డివిజన్లోని అధికారికి సమర్పించాలి. మొత్తం వార్డు సభ్యుల్లో రెండింట మూడో వంతు అవిశ్వాసానికి ఆమోదం తెలిపితే ఉప సర్పంచ్ పదవి కోల్పోతారు. ఈ పదవిని ఖాళీ అయిన 30 రోజుల్లో తిరిగి కొత్తగా ఎన్నుకోవాలి. సర్పంచ్ అధ్యక్షతన మెజార్టీ సభ్యులు చేతులెత్తే పద్ధతిన ఉపసర్పంచును ఎన్నుకుంటారు. సర్పంచ్ గౌరవవేతనం ఎంతో తెలుసా? కరీంనగర్టౌన్: గ్రామ పంచాయతీలో మొదటి పౌరుడు సర్పంచ్. పంచాయతీ ఎన్నికల షెడ్యూ ల్ విడుదలవడంతో సర్పంచులకు గౌరవ వేత నం ఎంత ఉంటుందనేది పలువర్గాల ప్రజల్లో చర్చనీశయాంశంగా మారింది. 2021కి ముందు సర్పంచులకు నెలకు రూ.5 వేల గౌవర వేతనం ఉండేది. తర్వాత నుంచి రూ.6,500 చెల్లిస్తున్నారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పా రితోషకం, గౌరవవేతనం ఉండదు. వార్డు సభ్యులు మూడు సమావేశాలకు, మహిళ సభ్యులు ఆరు సమావేశాలకు వరుసగా హాజరుకాకుంటే కలెక్టర్ వారిని పదవికి అనర్హులుగా ప్రకటిస్తారు. దశాబ్దాలుగా ఎదురుచూపులే ఓట్ల్లేస్తే రోడ్డస్తదనే ఆశలు మొదలు రైతులకు తప్పని బురదరోడ్డు కష్టాలుపది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తా. వర్షాలు పడితే పొలం కాడికి పోవడం కష్టమైతాంది. రోడ్డంతా బురదమయమై నడవలేని పరిస్థితి ఉంటది. ఈరోడ్డు బీటీ రోడ్డు అయితే మా కష్టాలన్నీ తీరిపోతయ్. ఈసారైనా రోడ్డు బాగు చేయిస్తే రుణపడి ఉంటం. – గోపు శ్రీకాంత్, రైతు, నాగారం -
హెచ్ఐవీని అంతం చేద్దాం
కరీంనగర్: ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకొని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదుగా ఫిలిం భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఫిలింభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకట రమణ మాట్లాడారు. హెచ్ఐవీని అంతం చేద్దామని, దేశంలో రోజురోజుకు తగ్గుముఖం పడుతుందన్నారు. వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధా, డీటీసీవో రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐఎంఏ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జ్యోతిబాఫూలే పార్కు నుంచి తెలంగాణ చౌరస్తా, ప్రతిమ మల్టిప్లెక్స్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రమణాచారి, అధ్యక్షురాలు డాక్టర్ అకుల శైలజ, కార్యదర్శి మహేశ్ మాట్లాడుతూ, బాధిత కుటుంబాలు ఇప్పటికీ సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధి గుర్తింపు, చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్టీ సేవలను వినియోగించుకోవాలన్నారు. సీవీఎం చైర్మన్ డాక్టర్ చాట్ల శ్రీధర్, వైద్యులు అంజిబాబు, రమేశ్ కొల్లూరి, శివకుమార్, సునీల్రెడ్డి, జ్యోతి, గీతారెడ్డి, రవికాంత్, సాయికృష్ణ, ఆడెపు శైలజ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంవో నవీన ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. వైద్యులు షాహాన, ఉదయ్, శ్రీలత, దీప్తి, ఎషికాశ్రీ, ఐసీటీసీ కౌన్సిలర్ సదానందచారి, శ్యాంసుందర్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
102 వాహనం లేక బాలింత అవస్థలు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సరోజ వారం క్రితం డెలివరీ కోసం వచ్చింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే బాలింతను ఇంటి వద్ద దింపేందుకు 102వాహనం అందుబాటులో లేకపోవడంతో సుమారు రెండు గంటల పాటు వేచిచూసింది. వాస్తవానికి తల్లీబిడ్డను క్షేమంగా 102లో వారి సొంత గ్రామంలో ఇంటి వద్ద దింపి రావాలి. సమాచారం ఇచ్చినా సిబ్బంది మాత్రం రాకపోవడంతో ఏమీ చేయలేక చివరికి అద్దె వాహనంలో ఉట్నూరు వెళ్లారు. ఈ విషయంపై డీఎంహెచ్వోను వివరణ కోరగా.. ఇతర జిల్లాకు వెళ్లాల్సి ఉన్నందున సమయం పడుతుందని.. అదే సమయంలో 102 సిబ్బంది సమీపంలోని ఓ బాలింతను తీసుకెళ్లిందని, అందుకే కొంత ఆలస్యమైందని తెలిపారు. -
ప్రత్యేక నిధులు విడుదల చేయాలి
కరీంనగర్టౌన్: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రేవా రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం సోమవారం కరీంనగర్ ఫిలింభవన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది అనారోగ్యం పాలవుతూ చనిపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై పెన్షనర్ సంఘాలు గత నెల 17న హైదరాబాదులో ధర్నా చేపట్టగా, స్పందించిన ప్రభుత్వం రూ.707.30 కోట్లు రిలీజ్ చేయగా, కేవలం పదవిలో ఉన్నవారి పెండింగ్ బకాయిలకే సరిపోయాయని, పెన్షనర్లకు ఎలాంటి లాభం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్రావు, గద్దె జగదీశ్వర చారి, కనపర్తి దివాకరు, జగి త్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామ్రెడ్డి, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. -
వారిది ఆరాటం.. వీరిది ఆపేయత్నం
● పీఎల్జీఏ వారోత్సవాలపై ఉత్కంఠ ● అమరులకు నివాళి అనుమానమే? ● కొయ్యూర్ ఎన్కౌంటర్కు 26 ఏళ్లు మంథని: 1999 డిసెంబర్ 2వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రస్తుత మావోయిస్టు(అప్పటి పీపుల్స్వార్) పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్షరెడ్డి, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేశ్ నేలకొరిగారు. వీరిజ్ఞాపకార్థం 2000 డిసెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలను మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహనిర్వహిస్తూ వస్తోంది. అమరవీరుల జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో 2004 నవంబర్ 13న మావోయిస్ట స్మారక స్తూపం నిర్మించింది. దానిని మృతుల కుటుంబ సభ్యులతో ఆవిష్కరింపజేసింది. కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగి మంగళవారానికి 26ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో పీఎల్జీఏ వారోత్సవాలపై నీలినీడలు అలుముకున్నాయి. ఉనికి కనుమరుగు చేసేందుకు.. మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసి అమరులైన ప్రతీఒక్కరికి ప్రజాక్షేత్రంలో నివాళి అర్పించేందుకు ఏటికేడు నక్సల్స్ యత్నిస్తున్నారు. వారి ఉనికిని కనుమరుగు చేసేందుకు పోలీసులు కట్టడికి యత్నిస్తూనే ఉన్నారు. రెండు దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి అవతలి వైపు మహారాష్ట్ర, ఛత్తీష్గఢ్ రాష్ట్రాలు ఉండడం, ఆ రాష్ట్రాల పరిధిలోని గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాల్లో మావోయిస్ట్లు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం సాధారణమే. పాతికేళ్లకుపైగా కరీంనగర్ తూర్పు డివిజన్లో మావోల ప్రభావం పెద్దగా లేకున్నా తరచూ కదలికలు ఉన్నట్లు సమాచారం. అగ్రనేతలు మరణించి 26ఏళ్లు అవుతున్న క్రమంలో అమరులను స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహించేందుకు అనుకూల పరిస్థితులు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలితరం అగ్రనేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్తో పాటు సుమారు 60 మందితో గత అక్టోబర్లో లొంగిపోయారు. ఆ తర్వాత మరో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కావడం, మిగతా మావోయిస్ట్లు సైతం లొంగిపోతామని ప్రకటించడం లాంటి చర్యలు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయంటున్నారు. అటవీ గ్రామాలపై పోలీస్ నిఘా కరీంనగర్ తూర్పు డివిజన్లో మావోయిస్ట్ల ప్రభావం లేకున్నా వివిధ రాష్ట్రాల్లోని ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిఘాను తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్లు నదులను దాటి రాకపోకలు సాగించే అవకాశాలు ఉండడంతో ఆ ప్రాంతాలపై డేగ కన్నేసి ఉంచుతారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఊపందుకోవడంతో పోలీసులు సహజంగానే అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. -
పోస్టాఫీస్ ఖాతాలే..
బోయినపల్లి సబ్ పోస్టాఫీస్ వద్ద ఖాతాలు తీసుకుంటున్న పలువురు బోయినపల్లి(చొప్పదండి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఖర్చు నిర్వహణకు జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలనే నిబంధనను ఎన్నికల కమిషన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు అభ్యర్థులు జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లగా.. వారు జీరో ఖాతాలు ఇవ్వడం లేదు. దీంతో పలువురు పోస్టాఫీస్లో ఖాతాలు తెరుస్తున్నారు. సోమవారం ఒక్క రోజే బోయినపల్లి సబ్ పోస్టాఫీస్లో 60 వరకు కొత్త ఖాతాలు తెరిచినట్లు పోస్టల్ అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ మంగళవారం ఇస్తామని చెప్పారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన గుండ బీమలింగం (59) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. బీమలింగం మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానలేకపోతున్నాననే మానసిక వేధనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ● రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి కరీంనగర్రూరల్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందడంతో స్వగ్రామం బొమ్మకల్లో విషాదం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. బొమ్మకల్కు చెందిన గన్ను రాజిరెడ్డి–సునీత దంపతుల కుమారుడు సాయి వర్ధన్రెడ్డి(20) గుజరాత్లోని రాజ్కోట్లో గల మార్వాడి యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి అవుటింగ్లో భాగంగా హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2గంటలకు తిరిగి హాస్టల్కు వస్తుండగా పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొట్టింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాజ్కోట్లోని లయన్స్క్లబ్ను సంప్రదించగా సాయివర్ధన్రెడ్డి మృతదేహానికి సోమవారం పోస్ట్మార్టం చేయించి అంబులెన్స్లో బొమ్మకల్కు పంపించారు. మంగళవారం అంత్యక్రియలను నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. -
బల్దియా స్పెషల్ డ్రైవ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో బల్దియా స్పెషల్ డ్రైవ్ సీజన్ నడుస్తోంది. ఏళ్లుగా కూనరిల్లిన వివిధశాఖలకు పూర్తిస్థాయిలో ఊపిరిలూదేందుకు కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఫోకస్ పెట్టారు. సేవలను మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఆయా విభాగాల అధికారులతో డివిజన్లవారీగా సర్వే చేయిస్తున్నారు. నల్లాలు, ఆస్తి పన్ను, సెల్లార్ పార్కింగ్, విద్యుత్ మీటర్లపై చేపట్టిన సర్వేలు ఫలితాలిస్తున్నాయి. రెసిడెన్షియల్ టు కమర్షియల్ నగరపాలకసంస్థ ఆదాయ వనరుల్లో ప్రధానమైన ఆస్తి పన్నులపైఽ అధికారులు దృష్టిపెట్టారు. రెసిడెన్సి పేరిట అనుమతి పొంది కమర్షియల్కు వినియోగిస్తున్న భవనాలు పెద్దఎత్తున కమర్షియల్ ట్యాక్స్ ఎగవేస్తుండడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నగరవ్యాప్తంగా 242 కమర్షియల్, 1,033 మిక్సింగ్ భవనాలు ఉన్నట్లు లెక్కతేల్చారు. 883 భవనాలు ట్రేడ్ లైసెన్స్ తీసుకుని, రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆస్తి పన్ను ఆదాయ డిమాండ్ను రూ.1,98,56,000కు బల్దియా పెంచుకుంది. నల్లాలు.. ఆన్లైన్ ఇక్కట్లు అక్రమ కనెక్షన్లు, మెయిన్పైప్లైన్ కనెక్షన్లు, రెసిడెన్షియల్ పేరిట కమర్షియల్ కనెక్షన్లు, ఆన్లైన్ సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్న నల్లాల విభాగంలో స్పెషల్ డ్రైవ్తో కాస్త కదలిక వచ్చింది. నెల రోజులుగా చేపట్టిన సర్వేతో రూ.30లక్షల ఆదాయం సమకూరింది. మరో 20వేల నల్లా కనెక్షన్లు సర్వే చేయాల్సి ఉంది. నల్లాల సర్వేలో పెద్ద ఎత్తున సమస్యలు బయటపడుతున్నాయి. క్రమం తప్పకుండా నల్లా బిల్లులు చెల్లిస్తున్నా, తాము బకాయి పడ్డట్టు నోటీసులు ఇచ్చారంటూ వినియోగదారులు బల్దియా ఉద్యోగులతో వాదనకు దిగుతున్నారు. బిల్లులు చెల్లించినా, గతంలో ఆన్లైన్ చేయకపోవడంతో బిల్లు బకాయిలుగానే ఆన్లైన్లో చూపుతోందని సిబ్బంది నోటీసులిస్తున్నారు. విద్యుత్ మీటర్లపైవీధి దీపాలు, ఇతరత్రా వ్యవహారాలకు వినియోగించే విద్యుత్ మీటర్లపై సర్వే చేపట్టారు. కనెక్షన్లు, వాడకానికి మించి విద్యుత్ బిల్లులు వస్తుండడం, చాలా చోట్ల మీటర్ల సమస్యలు, కొన్ని చోట్ల నగరపాలకసంస్థ విద్యుత్ మీటర్ల నుంచి కొంతమంది వ్యక్తిగత అవసరాలకు కనెక్షన్ తీసుకోవడం లాంటి వ్యవహరాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సర్వేను చేపట్టారు. నగరపాలకసంస్థ చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ సత్పలితాలను ఇస్తున్నా, భవిష్యత్లోనూ కొనసాగిస్తేనే లక్ష్యం నెరవేరే అవకాశముంది.భవన సెల్లార్లను పార్కింగ్కు బదులుగా, వ్యా పార, వాణిజ్య అవసరాలు వినియోగించడంపై పట్టణ ప్రణాళికాధికారులు సర్వే చేపట్టారు. దాదాపు 80 శాతం భవనాలు సెల్లార్ నిబంధనలు ఉల్లంఘించి నట్లు తేలింది. ఇప్పటివరకు 149 భవనాల్లోని సెల్లార్లను తనిఖీ చేశారు. అందులో 102 భవనాలు సెల్లార్ను పార్కింగ్కు బదులు, ఇతరత్రా అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. -
పత్తి రైతుల ‘యాప్’సోపాలు
కరీంనగర్ అర్బన్: రైతులు పత్తి విక్రయించాలంటే ముప్పుతిప్పలు పడుతున్నారు. అక్టోబరు నుంచి భారత పత్తి సంస్థ(సీసీఐ) మద్దతు ధర క్వింటాకు రూ.8,110 చెల్లించింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ నవంబరు 2నుంచి 7 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేయాలని పరిమితి విధించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఆర్థిక గణాంకాలశాఖ నివేదిక ఆధారంగా పత్తి దిగుబడులు ఎకరానికి 7 క్వింటాళ్లు మించవని నిర్ధారించింది. ఈ మేరకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్లోనూ 7క్వింటాళ్ల పరిమితి నిబంధనలు పెట్టగా.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జౌళిశాఖతో సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో వాస్తవసాగుపై కలెక్టర్లతో సర్వే నిర్వహించి.. నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో పత్తి సగటు దిగుబడి ఎకరానికి 11.77 క్వింటాళ్లు తేలింది. జిల్లాలో మొత్తం 47వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలోని 12 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతుండగా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది స్వల్పమే. ప్రైవేట్కే కొమ్ముకాస్తుందన్న విమర్శలు కొకొల్లలు. ఏఈవో ధ్రువీకరణతోనే విక్రయాలు ఎకరానికి 12క్వింటాళ్ల వరకు సీసీఐకి పత్తిని విక్రయించాలంటే ప్రస్తుతం రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. రైతులు పండించిన పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏఈవోలు తమకు కేటాయించిన పోర్టల్లో దిగుబడి వివరాలు నమోదు చేయాలి. తద్వారా రైతుల వివరాలకు సంబంధించి శ్రీఈల్డింగ్ సర్టిఫికేట్శ్రీ మొబైల్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో సీసీఐ కేంద్రానికి వెళ్తుంది. ఏఈవోల ద్వారా ధ్రువీకరణ పొందిన రైతులు మాత్రమే ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు విక్రయించుకునే అవకాశం కల్పించారు. మార్పుల్లేని యాప్ కపాస్ కిసాన్ యాప్లో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఎకరానికి 7క్వింటాళ్ల పరిమితే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జౌళిశాఖకు సమర్పించిన నివేదిక ఆధారంగా ఇంకా యాప్లో సీసీఐ మార్పులేవి చేయలేదు. యాప్లో ఎకరానికి 12 క్వింటాళ్ల పరిమితి ఒకటిరెండు రోజుల్లో అప్డేట్ అవుతుందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఏఈవో ధ్రువీకరణతో మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించాయి.కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్కు చెందిన నారాయణరెడ్డి పత్తి విక్రయించాలని స్లాట్ బుక్ చేస్తే కావడం లేదు. ఇప్పటికే ఏడు క్వింటాళ్లు విక్రయించగా కేంద్రం ఎకరానికి 12క్వింటాళ్ల వరకు పరిమితి పెంచినప్పటికీ యాప్లో పాత విధానమే అనుసరిస్తోంది. ఇది ఒక నారాయణరెడ్డి పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా రైతుల దుస్థితి. -
రసవత్తరంగా పల్లెపోరు
రెండో విడత తొలిరోజు నామినేషన్లు అంతంతేకరీంనగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. జిల్లాలో తొలివిడతలో సర్పంచ్కు చొప్పదండి మండలంలో 124 నామినేషన్లు రాగా.. పరిశీలన తరువాత 80 మిగిలాయి. వార్డుసభ్యులకు 334రాగా.. 332 ఆమోదం పొందాయి. గంగాధర పరిధిలో 266 సర్పంచ్ నామినేషన్లకు 169 ఆమోదం పొందాయి. 725 వార్డుసభ్యులకు 643 మిగిలారు. రామడుగులో సర్పంచ్కు 172 రాగా 108, వార్డుసభ్యులకు 529రాగా 480 ఆమోదం పొందాయి. కరీంనగర్ రూరల్లో 100 సర్పంచ్ నామినేషన్లకు 68 ఆమోదం పొందాయి. 358 వార్డుసభ్యుల నామినేషన్లకు 301 ఆమోదం పొందాయి. కొత్తపల్లిలో 68కి 38 సర్పంచ్ నామినేషన్లు, 218 వార్డు నామినేషన్లకు 183 ఆమోదం పొందాయి. మొత్తంగా 92 సర్పంచ్ స్థానాలకు 730 నామినేషన్లు దాఖలు కాగా.. 463 ఆమోదం పొందాయి. 866వార్డులకు 2,174 నామినేషన్లు దాఖలు కాగా.. పరిశీలన తరువాత 1,939 ఆమోదం పొందాయి.అసెంబ్లీ ఎన్నికల తరహాలో పల్లెపోరులోనూ సత్తా చా టాలని అధికార కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. మె జార్టీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తున్నా రు. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూ హాలకు పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ స్కీంలే తమ విజయానికి దోహదపడతాయని పంచాయతీ ఆశావహులు ఉత్సాహంలో ఉన్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీస్థానాల్లో రెండింటిని దక్కించుకున్న బీఆర్ఎస్ ఆ స్థాయిలోనే సర్పంచ్లను గెలిపించుకొని తిరిగి ప్రజలలో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్కు పట్టుండడంతో ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకోవడం ద్వారా, భవిష్యత్లో మిగతా ఎన్నికల్లో సత్తా చాటొచ్చని భావిస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి పంచాయతీల్లో తమ బలం నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా భావిస్తోంది. గత పదేళ్లలో తమ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో పట్టునిలుపుకునే పనిలో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ధీటుగా బీజేపీ తన కేడర్ను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే పల్లె యువతలో పట్టున్న బీజేపీ అన్ని వర్గాలను కలుపుకొని ఎ క్కువ సంఖ్యలో సర్పంచ్లను గెలిపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం మండలస్థాయిలో ముఖ్య నేతల ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్ర పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తోంది. కేంద్రం నుంచి వేల కోట్లు నిధులు వస్తున్నాయని, కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని ప్రచారం ప్రారంభించింది. కేంద్ర నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరిస్తున్నారు.పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ కమల వికాసానికి సమాయత్తం ‘హస్త’గతం చేసుకోవాలని..కరీంనగర్/మానకొండూర్: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కాగా.. తొలిరోజు అంతంతే నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతగా చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూర్, శంకరపట్నం, తిమ్మాపూర్ మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 1,046 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు మండలాల్లో 113 గ్రామపంచాయతీలలో సర్పంచ్గా పోటీ చేసేందుకు తొలిరోజు 121 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో 1,046 స్థానాలకు 209 నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్కు చిగురుమామిడి మండలంలో 16, గన్నేరువరంలో 10, మానకొండూర్లో 30, శంకరపట్నంలో 35, తిమ్మపూర్లో 30 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకు చిగురుమామిడి మండలంలో 32 నామినేషన్లు, గన్నేరువరంలో 17, మానకొండూర్ మండలంలో 65, శంకరపట్నంలో 50, తిమ్మాపూర్ మండలంలో 45 నామినేషన్లు వేశారు. -
అవగాహనే ఔషధం
కరీంనగర్: ఎయిడ్స్ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది గానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా.. జిల్లాలో అధికారికంగానే ప్రతినెల 20కి పైగా పాజిటివ్కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. నెలనెలా పరీక్షలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ విభాగం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో బాధితుల సంఖ్య తగ్గుతోంది. 2019లో 7,906 మందికి పరీక్షలు చేయగా 122 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ఈ ఏడాది నవంబర్ వరకు 6,286 మందికి పరీక్షలు చేయగా 105మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య 1,004 మంది కాగా అందరికి మందులు అందజేస్తున్నారు. అవగాహన ముఖ్యం హెచ్ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చు. హెచ్ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి హెచ్ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడిచి, 15 నిమిషాల పాటు ధాన్యం చేయాలి. గ్లాస్ పాలు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజు రాగి జావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజనంలో తాజా కూరగాయలు, ఆలు దుంపలు, ఆకు కూరలు, పప్పు దినుసులు, నాన్వెజ్ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్, దానిమ్మ, అంగూర, అరటి పండ్లు, ఫైనాపిల్, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగిలి. ఎయిడ్స్ బారిన యువత... హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారినపడుతున్నారు. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమని వైద్యులు చెబుతున్నారు. తగ్గుతున్న మరణాల సంఖ్య... జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జెండర్ల తరపున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది. ఎయిడ్స్ వ్యాధి బాధితుల కోసం జిల్లా ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రం, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, చల్మెడ మెడికల్ కళాశాలలో ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి.(ఇప్పటివరకు)జిల్లాలో ఎయిడ్స్ కేసులు ఇలా సంవత్సరం టెస్టులు పాజిటివ్ శాతం 2019–20 7,906 122 1.5 2020–21 3,244 152 4.5 2021–22 3,892 120 3.0 2022–23 8,005 135 1.6 2023–24 10,836 218 2.0 2024–25 10,710 152 1.4 2025–26 6,286 105 1.6గతేడాది స్టేట్ అవార్డు ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లా ప్రథమస్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్ఐవీ బాధితులకు ఏఆర్టీ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్ లోడ్పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నాం. హెచ్ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – ఎం.సదానందచారి, ఐసీటీసీ కౌన్సిలర్, కరీంనగర్ -
కరీంనగర్ ఫిలిగ్రీకి ప్రధాని మోదీ ప్రశంస
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని ప్రశంసించారు. కరీంనగర్కు ప్రత్యేకమైన వెండి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని కొనియాడారు. విద్యానగర్లోని 362 పోలింగ్ బూత్లో ఆదివారం బీజేపీ శ్రేణులు మన్కీబాత్ వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో విషయాలు ప్రజలతో పంచుకున్నారని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. కరీంనగర్లో ప్రసిద్ధి చెందిన సిల్వర్తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి, పూల ఆకృతితో ఉన్న మిర్రర్ను ఇటలీ ప్రధానికి బహుకరించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కవిత్వంలో వైవిధ్యం అవసరం కరీంనగర్కల్చరల్: కవిత్వంలో వైవిధ్యంతో పాటు నవ్యత ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు డా.నాళేశ్వరం శంకరం పేర్కొన్నారు. భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో వైరా గ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుమారి గౌత్రె శ్యామల రచించిన ‘అక్షరమా నీకు వందనం’ కవితా సంపుటి, అనుభవం నేర్పిన పాఠం పుస్తకాలను ఆవిష్కరించారు. పరిచయమున్న అంశాలపై కవిత రాసినా అందులో నవ్యత్వం, కొత్తదనం ఉండాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ శ్యామల కవిత్వంలో ప్రకృతి పర్యావరణాలతో పాటు తాత్విక చింతన, మానవతా విలువలున్నాయన్నారు. కవులు తన్నీరు సురేశ్, అన్నాడి గజేందర్రెడ్డి, బొమ్మకంటి కిషన్, వెంకటరమణ, వెల్ముల కృష్ణారావు, నగునూరి రాజన్న, గూడెపు కుమార్, స్వామి, సత్యనారాయణరాజు,వేములవాడ ద్రోణాచారి పాల్గొన్నారు. కొత్త ఆలోచనతో ఆవిష్కరణలు కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లోని కొత్త ఆలోచనలు సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26, ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ 2024–25 ప్రదర్శనను ఆదివారం సందర్శించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త ఆలోచనల వైపు మనసు మళ్లించాలన్నారు. చుట్టూ ఉన్న పరిసరాల్లో, సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కార మార్గాలను కనుక్కోవడానికి ఆలోచన చేయాలన్నారు. వైజ్ఞానిక మేళాకు స్పందన వస్తోందని, సుమారు 2,652 మంది విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారని జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్.భగవంతయ్య, సెక్టోరియల్ అధికారులు కర్ర అశోక్రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, ఎంఈవోలు ఆనందం, ప్రభాకర్రెడ్డి, రవీంద్రాచారి, రామయ్య, రవీందర్, గంగాధర్ పాల్గొన్నారు. ఘనంగా బాలోత్సవ్ కరీంనగర్కల్చరల్: లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని కళాభారతిలో నిర్వహించిన బాలోత్సవ్–2025 ఆకట్టుకుంది. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ కొమురయ్య వేడుకలను ప్రారంభించారు. ఎందరో బాల కళాకారులు ఎంచుకున్న కళల్లో ప్రతిభ కనబరిచి, టీవీ, సినిమాల్లో సత్తా చాటుతున్నారని అభినందించారు. చిన్నారులకు అవార్డులు అందించారు. -
నేడే ప్రారంభం
కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీనుంచి నూతన వైన్స్లు ప్రారంభం కానున్నాయి. ఇటీవల నిర్వహించిన నూతన ఎకై ్సజ్ పాలసీలో 94 వైన్స్లకు 2,730 దరఖాస్తులు రాగా కలెక్టరేట్లో లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించారు. 01 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027వరకు దుకాణాల నిర్వహణ ఉంటుంది. ప్రారంభంలోనే వైన్స్లకు కిక్కు ఎక్కనుంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్త వైన్స్లకు గిరాకీ ఉండనుంది. దీంతో నిర్వాహకులు ఫుల్స్టాక్తో మద్యం అమ్మకాలకు సిద్ధమవుతున్నారు. మొదట్లోనే పెద్దఎత్తున లా భాలుంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో డిసెంబర్ 17వ తేదీ వరకు మూడుదశల్లో ఎన్నికలు జరగనుండడంతో మద్యం అమ్మకాలు ఆకాశాన్నంటనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.5కోట్ల నుంచి రూ.8కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఎకై ్సజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.జిల్లాలో వైన్స్లు ఎకై ్సజ్ స్టేషన్ వైన్స్లు కరీంనగర్ అర్బన్ 21కరీంనగర్ రూరల్ 26తిమ్మాపూర్ 14హుజూరాబాద్ 17జమ్మికుంట 16మొత్తం 94 -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
రామడుగు(చొప్పదండి): రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్(39) అనే యువకుడు టిప్పర్ ఢీకొని శనివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలో శనివారం రాత్రి మట్టిని తరలిస్తున్న టిప్పర్ బ్రేక్డౌన్ కాగా.. వెంకటేశ్ టిప్పర్ ముందు భాగాన పడుకొని మరమ్మతు చేస్తున్నాడు. ఇది గమనించని మృతుడి తమ్ముడు డ్రైవర్ నరేశ్ టిప్పర్ను స్టార్ట్ చేసి ముందుకు నడిపించాడు. వెంకటేశ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై కె.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నదిలో పడి వ్యక్తి మృతిమంథనిరూరల్: ఆరెంద గ్రామ శివారులోని గోదావరి నదిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన పంచిక సదయ్య(42) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆరెంద సమీపంలోని గోదావరి నదికి స్నానానికి వెళ్లాడు. అయితే సట్టి బోనాల సందర్భంలో ఇసుక తీసుకొచ్చేందుకు నదిలో దిగిన సదయ్య ఒక్కసారిగా మునిగిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులకు సమాచారమందించగా.. సదయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 2 గంటల అనంతరం సదయ్య మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. ఇటీవలి కాలంలో వర్షాలతో నదిలో వరద నీరు చేరి పెద్ద గొయ్యి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దారి దోపిడీ దొంగల అరెస్ట్ జగిత్యాలక్రైం: దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు నిందితులతోపాటు మరో మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంచిర్యాల జిల్లా జెండావెంకటపూర్కు చెందిన తాళ్లపెల్లి నవీన్ శనివారం మంచిర్యాలలో తన డీసీఎం వాహనంలో వరి ధాన్యం నింపుకొని నిజామాబాద్ వెళ్లాడు. వరి ధాన్యం దింపి తిరిగి మంచిర్యాల వస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జగిత్యాల గాంధీనగర్ సమీపంలో కాలకృత్యాల కోసం వాహనం ఆపి తిరిగి వాహనం ఎక్కుతుండగా.. ముగ్గురు వ్యక్తులు పల్సర్ మోటార్ సైకిల్పై వచ్చి నవీన్పై దాడి చేశారు. రూ.22వేల నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ కరుణాకర్ నిందితులైన పెర్కపల్లి రోడ్డు సమీపానికి చెందిన ఎర్ర సాయి, గాంధీనగర్కు చెందిన నక్క గణేశ్ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.22వేల నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించారు. పోలీసులు 5 గంటల్లో కేసు ఛేదించారు.


