breaking news
Karimnagar District Latest News
-
ముదురుతున్న క్రిప్టోయాప్స్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ దందా పెరుగుతోంది. అనతికాలంలోనే రూ.కోట్ల లాభాలు అంటూ అమాయకులకు ఆశచూపి.. విదేశీ ప్రయాణాలు ఎరవేసి.. వారి నుంచి రూ.లక్షలు గుంజుతున్న యాప్ల సంఖ్య పెరిగిపోతోంది. మార్కెట్లో వీటిని నియంత్రించే మెకానిజం ఏదీ లేకపోవడంతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా వీటి మధ్య ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్లో నెక్ట్స్ బిట్ అనే క్రిప్టో కరెన్సీగా చలామణి అవుతున్న ఓ యాప్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో రాచకొండ పోలీసులను అంతా అభినందించారు. అయితే.. ఈ అరెస్టు వెనుక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పోలీసు యాక్షన్ అంతా నెక్ట్స్బిట్ వ్యతిరేక యాప్ వర్గం వాళ్లు చెప్పినట్లు సాగిందని జగిత్యాలలో ప్రచారం సాగుతోంది. వాస్తవానికి నెక్ట్స్బిట్ ప్రవేశించేందుకు ముందు.. డజనువరకు యాప్లు అక్కడ దందా చేస్తున్నాయి. వీరంతా జనాలను నమ్మించేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని యాప్లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యాప్లను అంత తేలిగ్గా నమ్మడం లేదు. అందుకే వీరి పెట్టుబడికి ఆస్తల ను ష్యూరిటీగా ఇస్తున్నారు. ఉదాహరణకు వీరు ఐదు నుంచి పది మంది పెట్టుబడిదారులను ఒక గ్రూపుగా పోగుచేస్తారు. వీరికి నమ్మకం కలిగేలా రూ.20 లక్షలు కూడా చేయని భూమికి రూ.50 లక్షలు అని చెప్పి.. బాధితుల నుంచి అంతమేరకు డబ్బును క్రిప్టో పేరిట వసూలు చేస్తారు. ఆ డబ్బుకు సమాన విలువ అంటూ కొన్ని డాలర్లను వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్కు పంపుతారు. ఇటు యాప్లో ఉన్న డాలర్లను, అటు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన భూములను ష్యూరిటీగా చూసుకుని మురిసిపోతున్నారు. తమ పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాదని, తాము కొన్న భూమికి అంత విలువలేదన్న విషయం వీరు గ్రహించే సరికి నిర్వాహకులు ఆ డబ్బును లక్కీభాస్కర్ సినిమాలో మాదిరిగా దేశం దాటిస్తున్నారు. ఇటీవల జీబీఆర్ క్రిప్టో కరెన్సీపేరిట రూ.95 కోట్లు, మెటాపేరిట రూ.100 కోట్లు, నెక్ట్స్బిట్ పేరిట రూ.19 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లిలో బాధితుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ కంటే అధిక వ్యాపారం చేస్తున్నాడన్న కోపంతో వ్యతిరేక యాప్ వారే.. హిమాన్షు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో క్రిప్టో కరెన్సీ పేరిట అనేక యాప్లు నడుస్తున్నా.. ఎలాంటి ఫిర్యాదూ లేకుండా విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేసింది ఈ ఒక్క కేసులోనే కావడం గమనార్హం. ఇందుకోసం నెక్ట్స్బిట్ పోటీదారైన యాప్ స్వయంగా రంగంలో కి దిగింది. నెక్ట్స్బిట్ యాప్కు సంబంధించిన కొందరు బాధితులను వెంటేసుకుని రాచకొండలోని మే డిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వీరిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఓ హోటల్లో తమ యాప్ ను ప్రమోట్ చేసుకుంటున్న హిమాన్షును అరెస్టు చేశారు. అతని అరెస్టు తతంగం అయ్యేవరకూ పో టీదారు యాప్ నిర్వాహకుల ప్రతినిధులు అక్కడే ఉండటం కొసమెరుపు. దాదాపు 400 మంది వద్ద రూ.19కోట్ల మేరకు మోసం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్రిప్టోదందా సాగుతోంది. ఈ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నా.. కేసు పెట్టేందుకు పోలీసులు సహకరించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ ఎప్పటికపుడు డీజీపీకి.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఒక్క రాచకొండ కమిషనరేట్లో మాత్రమే పోలీసులు స్వయంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం గమనార్హం. ఈ మొత్తం ఆపరేషన్ వెనక నెక్ట్స్బిట్ పోటీదారులే ఉన్నారని జగిత్యాల వాసులు ఆరోపిస్తున్నారు.ఎలా చేస్తున్నారు..? అసలేం జరిగింది..? -
వెన్నుచూపని వీరుడు పాపన్న
కరీంనగర్టౌన్: గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కొనియాడారు. పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్రావు తదితరులతో కలిసి నగరంలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులేనని కానీ, ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ పాపన్నకు దక్కకపోవడం బాధాకరమన్నారు. తాడిత, పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాజ్యస్థాపన చేసిన పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి పర్శరాములు, బుర్ర పర్శరాములు, పడాల రమేశ్, బుర్ర కనకయ్య, పంతంగి అనిల్, సంపత్, ముంజ ప్రశాంత్, బత్తిని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
భారం కాదు.. బాధ్యత
కరీంనగర్: తల్లిదండ్రుల తర్వాతే దైవం.. ప్రత్యక్ష దైవాలైన వీరు మలిసంధ్యలో పడరాని పాట్లు పడుతున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసి వారి బంగారు భవిష్యత్ కోసం శ్రమిస్తే.. వృద్ధాప్యంలో వారిని పట్టించుకోవడం లేదు. రెక్కలొచ్చిన కొడుకులకు కన్నవారు బరువైపోతున్నారు. రక్త బంధాన్ని తెంచుకుని ముసలి తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ప్రభుత్వం డివిజన్స్థాయిలో ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. వృద్ధులైన తల్లిదండ్రులను వీధిపాలు చేస్తే కొడుకులు కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వృద్ధాశ్రమాల్లో చేర్పించి.. కోట్లు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులకు తనయులు పట్టెడు అన్నం పెట్టడం లేదు. అయినవారికి దూరంగా ఉంటూ జీవనం గడుపుతున్న వారి గాథలు కన్నీళ్లు తెప్పించక మానవు. జీవిత చరమాంకంలో ఆదుకోవాల్సిన తనయులు వదిలేస్తున్నారు. వయోభారంతో వృద్ధులు అవస్థలు పడి విసిగిపోయి న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొందరు కుమారులు తెలివిగా వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. విస్మరిస్తే క్రిమినల్ కేసులు వృద్ధుల సంపూర్ణ బాధ్యత ఉన్న వ్యక్తులెవరైనా అందుకు విరుద్ధంగా శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టినా, వారికి హానీ తలపెట్టినా 3 నెలల జైలు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ అమలుకావచ్చు. సహాయ కేంద్రం వయోవృద్ధుల సహాయార్థం జిల్లా కేంద్రంలో హెల్ప్లైన్ నంబర్ 14567 ఏర్పాటు చేశారు. చైల్డ్ హెల్ప్లైన్ 1098, హుజూరాబాద్, కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరికి ఫిర్యాదు చేయాలి? చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ డివిజన్ల వారీగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అక్కడ డివిజన్ ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారు. వృద్ధుల సంఘం నుంచి ఒక ప్రతినిధి, కౌన్సిలేషన్ అధికారి ఉంటారు. సంబంధిత డివిజన్ కార్యాలయంలో వృద్ధులు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్డీవో సంబంధిత తహసీల్దార్ను విచారణకు ఆదేశిస్తారు. ఇరు వర్గాలను పిలిచి వాదనలు విని న్యాయం చేస్తారు. వినని పక్షంలో కౌన్సిలేషన్ అధికారికి అనుసంధానం చేస్తారు. ఆయన ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా అప్పిలేట్ అధికారి కలెక్టర్ను ఆశ్రయించవచ్చు. వృద్ధులే కాకుండా ఎన్జీవోలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేవారు నిర్ణీత ఫాం పూర్తి చేసి డివిజన్ రెవెన్యూ అధికారికి అందించాలి. ప్రయోజనం ఇలా.. సొంత సంపాదనతో తమను తాము పోషించుకోలేని వృద్ధులు ఈ చట్ట ప్రకారం తమ పిల్లలను, సంతానం లేని వృద్ధులు వారి ఆస్తిని అనుభవించే బంధువులను పోషణ గురించి అడగవచ్చు. పోషణ ఖర్చులో ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య సహాయం, చికిత్సకు అవసరమైన మొత్తం నెలకు రూ.10 వేలకు మించకుండా అందేలా ట్రిబ్యునల్ చర్యలు తీసుకుంటుంది. పత్రికా కథనాలపై విచారణ వివిధ దినపత్రికల్లో వచ్చే వృద్ధుల కథనాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పత్రికల కథనాలపై జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం సంబంధిత తహసీల్దార్లకు సమాచారం ఇస్తుంది. తహసీల్దార్ వాస్తవ నివేదికను రూపొందించి ఆర్డీవోకు నివేదిస్తారు. అధికారులు ఇరువర్గాలను పిలిచి రాజీ కుదర్చడమో, కేసు నమోదు చేయడమో నిర్ణయిస్తారు.వయోవృద్ధుల సంక్షేమ చట్టం వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 ప్రకారం కన్నవారిని విస్మరిస్తే జైలు కూడు తినాల్సిందే. మలిసంధ్యలో ఆదరించాల్సిన కుమారులు వారిని పట్టించుకోపోతే ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ చట్టం ప్రకారం తల్లి, తండ్రి, సవతి తండ్రి/తల్లిని వయో వృద్ధుల కింద పరిగణిస్తారు. జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు జిల్లావ్యాప్తంగా 2023లో 117 ఫిర్యాదులు, 2024లో 129 ిఫర్యాదులు, 2025లో (ప్రస్తుతం ఇప్పటి వరకు)101 ఫిర్యాదులు వచ్చినట్లు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
సైక్లింగ్తో పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ
కరీంనగర్స్పోర్ట్స్: ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను భాగం చేసుకుంటే సమాజ శ్రేయస్సుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ బుర్ర మధుసూదన్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రైడ్ ఫర్ వెల్నెస్, శ్రేయస్సు కోసం సైక్లింగ్ అనే నినాదంతో నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురుషులతో పాటు మహిళలు తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని విధిగా కేటాయించి శారీరక వ్యాయామం కలిగేలా క్రీడలు, నడక, సైక్లింగ్, యోగా లాంటి కార్యాలను నిత్య జీవితంలో భాగం చేసుకొని ఆయురారోగ్యాలతో జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి డిజిటల్ యువత స్మార్ట్ ఫోన్ నీలి తెరలకు పరిమితం కాకుండా మైదాన క్రీడలు, సైక్లింగ్ లాంటివి ఆచరణలో పెట్టాలన్నారు. 9వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ సుబేదార్ మేజర్ సాగర్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కెడెట్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
నయా భూ దందా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నయా భూ దందా వెలుగులోకి వచ్చింది. ఎవరికీ పట్టని హౌ జింగ్బోర్డు స్థలాలపై గురిపెట్టిన కబ్జారాయుళ్లు గుట్టుగా దందా కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలను కబ్జాకు పెడుతున్నారు. పక్క సర్వే నంబర్లు వేసి ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంటున్నారు. ఆ పై ఇంటినంబర్లతో అధికారిక ముద్ర వేసుకునేందుకు బల్దియాలో పైరవీలు కూడా మొదలుపెట్టారు. 1994లో అలాట్మెంట్ దశాబ్దాల క్రితం నగరంలోని పాత బైపాస్ పక్కన 99 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని హౌజింగ్బోర్డుకాలనీని నిర్మించింది. మొ త్తం 1,205 క్వార్టర్స్ నిర్మించడంతో పాటు, రోడ్లు, క్రీడా స్థలం, హెల్త్ సెంటర్, షాపింగ్కాంప్లెక్ష్ తదితర అవసరాలకు ఈ స్థలాన్ని వినియోగించింది. పూర్తయిన క్వార్టర్స్ అలాట్మెంట్ను 1994లో ప్రారంభించి, 2006లో అధికారులు పూర్తి చేశారు. మిగిలిన ఖాళీ స్థలాలు.. నిర్ణీత సైజుల్లో క్వార్టర్స్ నిర్మించిన సమయంలోనే అక్కడక్కడా ఖాళీస్థలాలు మిగిలిపోయాయి. ఖాళీ స్థలం 99 గజాల లోపు ఉంటే ఆ స్థలాన్ని పక్కనే ఉన్న ఇంటి యజమానికే నిర్ణీత ధర ప్రకారం హౌజింగ్బోర్డు విక్రయించింది. 100 గజాలు, అంతకన్నా ఎక్కువ స్థలం ఉంటే బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. చివరగా 2002లో కొన్ని స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. ఖాళీ స్థలాల కబ్జా హౌజింగ్బోర్డు కాలనీ నిర్మాణం పూర్తయి మూడు దశాబ్దాలవుతున్నా, కాలనీలో విలువైన ఖాళీ స్థలాలు ఇప్పటికీ ఉన్నాయి. 100 గజాలకు పై బడి విస్తీర్ణం కలిగిన పది వరకు ఖాళీ స్థలాలపై కొంతమంది కన్ను పడింది. హౌజింగ్బోర్డు డివిజన్ కార్యాలయం ఎక్కడో వరంగల్లో ఉండడం, పర్యవేక్షణ లేకపోవడం వారికి అనువుగా మారింది. పైగా స్మార్ట్ సిటీలో కాలనీ అభివృద్ధి చెందడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు సదరు ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కనీసం కోట్ల రూపాయల విలువైన స్థలాలను సొంతం చేసుకుంది. పక్క సర్వే నంబర్ వేసి.. ఖాళీ స్థలాల కబ్జా కోసం ముఠా కొత్త ఎత్తులు వేస్తోంది. హౌజింగ్బోర్డు కాలనీ సరిహద్దులో ఉన్న స్థలాలకు, పక్కనే ఉండే ప్రైవేట్ భూముల సర్వే నంబర్లు వేసి ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటోంది. హౌజింగ్బోర్డు కాలనీ స్థలాలు 225,226,227,228,229,230,231/ఏ,231/బీ,233/ఏ,233/బీ,234,235,236/ఏ,236/బీ,727 సర్వే నంబర్లలో ఉన్నాయి. కాని పక్కనే ఉన్న 224 సర్వే నంబర్ వేసి ఆ నంబర్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తితో తాజాగా 155 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కాలనీ మెయిన్రోడ్డులోని మరో స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆ స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురికాగా, మిగతా స్థలంలో సైతం ప్రహారీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రాంతంలోనూ ఇలాంటి స్థలాలను ఇప్పటికే కబ్జా చేశారు. ఇదిలాఉంటే కబ్జాకు అధికారిక ముద్ర వేసుకునేందుకు నగరపాలకసంస్థ నుంచి ఇంటినంబర్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాపాడాల్సిందే.. అన్యాక్రాంతమవుతున్న కోట్ల రూపాయల హౌజింగ్బోర్డు ఖాళీ స్థలాలను అధికారులు కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. తాజాగా కబ్జాకు గురైన స్థలాల విలువ రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి భూములు కాపాడేందుకు హౌజింగ్బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని, వేలం వేసే వరకు ఆ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హౌజింగ్బోర్డుకాలనీలో స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ఈ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఆ లోగా స్థలాల రక్షణకు చర్యలు చేపడుతాం. అవసరమైతే పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకుంటాం. – పృథ్విరాజ్, ఏఈ, హౌజింగ్బోర్డు స్వాధీనం చేసుకుంటాం -
రైతులకు తప్పని యూరియా తిప్పలు
చిగురుమామిడి(హుస్నాబాద్): రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఆదివారం మండలంలోని రేకొండ గ్రామంలో యూరియా కోసం బారులు తీరారు. ఉదయం ఐదు గంటల నుంచి మహిళలు, రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. చిగురుమామిడి సింగిల్ విండో ఆధ్వర్యంలో 230 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు పంపిణీ చేశారు. 115 మంది రైతులకు పంపిణీ చేయగా మరో 40 మంది బస్తాలు అందక తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సరిపడా బస్తాలను పంపించక తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలకు విశేశ స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరుకాగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. సమారు 160 మంది క్రీడాకారులు ప్రతిభచాటగా అత్యుత్తమంగా రాణించిన 30 మందిని ఈనెల 30, 31వ తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు 29న పాలమూరు స్టేడియంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని పేర్కొన్నారు. పోటీల నిర్వహణలో పీఈటీ, పీడీలు రమేశ్, చంద్రశేఖర్, ఎజాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సువిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్– 1 డిపో నుంచి ఈనెల 21న అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ బీచ్, ద్వారక తిరుమల దర్శనాల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. ఈ బస్సు 21 గురువారం సాయంత్రం 6గంటలకు కరీంనగర్ బస్స్టేషన్ నుంచి బయలుదేరి తిరిగి 23వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,250 టికెట్ ఉంటుందని, వివరాలకు 99592 25920, 80746 90491, 73828 49352 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. బీసీలకే కాంగ్రెస్ ఇన్చార్జి ఇవ్వాలి కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పదవి బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు బీసీ అభ్యర్థియే గెలుస్తూ వచ్చారని తెలిపారు. బీసీల్లో చైతన్యం రావడాన్ని చూసి అన్ని పార్టీలు కరీంనగర్లో బీసీలకే మొగ్గు చూపుతున్నాయన్నారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు బీసీలకే టికెట్లు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పదవిని అగ్రవర్ణాలకు ఇస్తే, మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో కొట్లాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, అదే తరహాలో కరీంనగర్ ఇన్చార్జీగా బీసీనే నియమించాలని కోరారు. సంఘం జిల్లా కన్వీనర్ రవీంద్రచారి, సత్యనారాయణ, జగన్, రాజు, రమేశ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హుజూరాబాద్: పట్టణంలో ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొడిగె సందీప్(25) ఆదివారం తన స్కూటీపై బతుకమ్మ సౌళ్ల వద్ద నుంచి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సందీప్ అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలు శ్రీత్విక్, ఆయాన్ష్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం మూడపల్లి బస్టాండ్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. సనుగుల గ్రామానికి చెందిన బొజ్జ చరణ్, మహ్మద్ షారుక్ అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేములవాడ వైపు వెళ్తుండగా.. మూడపల్లి బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు ఫొటోలు తీస్తున్నారని గమనించారు. తొందరపాటులో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించకపోవడంతో ద్విచక్ర వాహనానికి బస్సు తగిలి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చరణ్కు కాలు విరగగా.. షారుక్ స్పృహ తప్పి పడిపోయాడు. 108 అంబులెన్స్లో వీరిని వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చరణ్కు వేములవాడలో చికిత్స చేస్తుండగా.. షారుక్ను కరీంనగర్ తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంగాధర: మధురానగర్ చౌరస్తాలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కారుకు నిప్పు పెట్టి పేల్చే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మోతె శ్రీహరిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి పక్కన కారు పార్కింగ్ చేశాడు. రాత్రి సమయంలో దుండగులు కారుకు నిప్పు పెట్టి పారిపోయారు. కారు యజమాని మంటలు గమనించి ఆర్పేశాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. నిప్పు పెట్టినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
నెల రోజులుగా ఇబ్బందులు
త్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం కార్మికులు నెల రోజులుగా తిరుగుతున్నారు. మీ పొదుపు డబ్బులు తప్ప.. ప్రభుత్వ వాటా జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చేనేత, జౌళిశాఖ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం లేదు. స్కూల్ ఫీజులు, పండుగల నేపథ్యంలో నేతన్నలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నాయి. వెంటనే త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – మూషం రమేశ్, పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రిఫ్ట్ ఫండ్ పథకం నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల చేతుల మీదుగా నేతన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. తప్పకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు, సిరిసిల్ల -
పురుగుల మందు తాగి విద్యార్థి బలవన్మరణం
రాయికల్: అయోధ్య గ్రామానికి చెందిన ఎడ్మల శ్రీసాహిత్రెడ్డి(21) అనే డిగ్రీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీసాహిత్రెడ్డి హైదరాబాద్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగగా.. గమనించిన స్థానికులు జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఉన్న ఒక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళ..శంకరపట్నం: కాచాపూర్ గ్రామంలో అబ్బు శకుంతల(58) అనే మహిళ ఆదివారం వేకువజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాచాపూర్ గ్రామానికి చెందిన అబ్బు సత్యానారాయణరెడ్డి–శకుంతల దంపతులకు ముగ్గురు కూతుళ్లుండగా.. అందరికీ వివాహమైంది. కొంతకాలంగా శకుంతల మానసిక వ్యాధితో బాధ పడుతోంది. మానసిక వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తున్నారు. మందులు వాడుతున్నా నయం కాలేదు. ఆదివారం వేకువజామున ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో దూకింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. వృద్ధురాలు..ధర్మారం: నర్సింగపూర్ గ్రామానికి చెందిన చల్లా రాజమ్మ(78) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. కొంతకాలంగా బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నా నయం కావడం లేదు. దీంతో రాజమ్మ మానసికంగా కుంగిపోయి ఇంటి సమీపంలోని మంచినీటి బావిలో దూకింది. ఆమె కుమారుడు గంగయ్య ఆదివారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సైదాపూర్: ఎగ్లాస్పూర్లో సంతపురి రవీందర్రెడ్డి(65) శనివారం రాత్రి ఇంటి ఎదుట రేకుల షెడ్కు ఉరేసుకున్నట్లు సైదాపూర్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవీందర్రెడ్డి కూతురు శైలజకు వివాహమైంది. ఆమె హైదరాబాద్లో ఉంటోంది. భార్యతో కలిసి రవీందర్రెడ్డి ఎగ్లాస్పూర్లో ఉంటున్నాడు. రవీందర్రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. తనను చూసుకోవడానికి అయినవారు అందుబాటులో లేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మృతిపెగడపల్లి: బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాజనర్సు(55) అనే వ్యక్తి చేపలు పట్టేందుకని వెళ్లి దుర్మరణం చెందాడు. పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఇంటి నుంచి స్థానిక చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లిన రాజనర్సు మధ్యాహ్నం తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో కస్తూరి మల్లేశం అనే రెతుకు చెందిన పొలం గట్టుపై ప్రమాదవశాత్తు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రమాదవశాత్తు తాపీమేసీ్త్ర మృతి
మానకొండూర్: మండల కేంద్రానికి చెందిన కొండ్ర రమేశ్(50) అనే తాపీమేసీ్త్ర ప్రమాదవశాత్తు ఆదివారం మృతిచెందాడు. మానకొండూర్ సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. రమేశ్ ఆదివారం శ్రీనివాస్నగర్లో ఓ నూతన గృహ నిర్మాణంలో భాగంగా తాపీమేసీ్త్రగా వెళ్లాడు. పిల్లర్ బాక్స్లో సిమెంట్ కంకర నింపేందుకు నిచ్చెన పైకి ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి గాయాలపాలయ్యాడు. వెంటనే కరీంనగర్లోని ఆసుపత్రికి స్థానికులు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. -
ఇతిహాసాలే మన సంస్కృతి
కరీంనగర్ కల్చరల్: రామాయణ, మహాభారత ఇతిహాసాలు మన సంస్కృతిగా స్థిరపడ్డాయని ప్రముఖ వైద్యుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు డాక్టర్ బీఎన్రావు అన్నారు. తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఆదివారం ఫిలింభవన్లో కవి ఆవంచ ప్రమోద్ రచించిన మేలిమి చింత పుస్తక పరిచయ సభలో మాట్లాడారు. వాక్యం రసాత్మకం కావాలంటే భాష శైలిలను పట్టించుకొని, సొంత అభివ్యక్తిని కవులు శ్రమతో సాధించాల్సి ఉంటుందన్నారు. రెండు ఇతిహాసాలను రచించిన రచయితలే మన సంస్కృతి నిర్మాతలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ బి.విజయమోహన్రెడ్డి మాట్లాడుతూ.. మానవులను ఉన్నతీకరించే ఉత్తమ సాధనం సాహిత్యమని అన్నారు. ఇటీవల మరణించిన వరంగల్ రచయిత్రి అనిశెట్టి రజితకు సభ ప్రారంభంలో సభికులు నివాళి అర్పించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవులు కందుకూరి అంజయ్య, విజయకుమార్, కూకట్ల తిరుపతి, కనకం శ్రీనివాసులు, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, పీఎస్ రవీంద్ర, గులాబీల మల్లారెడ్డి, దామరకుంట శంకరయ్య, బూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెరవే సభలో డాక్టర్ బీఎన్రావు -
ధర్మం చిరకాలం నిలుస్తుంది
కరీంనగర్ కల్చరల్: సంఘర్షణతో సమాజం విడిపోతుందని, సంఘటన మాత్రమే మానవులను కలిపి ఉంచుతుందని, తద్వారా ధర్మం చిరకాలం నిలుస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం భగవతి పాఠశాల ప్రాంగణంలో జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాక రాజమౌళి రచించిన భారత భారతి, భావతరంగాలు గ్రంథాల ఆవిష్కరణ సభలో మాట్లాడారు. పాక రాజమౌళి దేశ, దైవభక్తి కలిగిన రచయితగా అద్భుతమైన పద్య, గేయ, అనువాద కవిత్వాన్ని రచించారని, ప్రతీ రచనలోనూ జ్ఞానం, శీలం, దేశభక్తి, సమానత్వం, సద్గుణాల నిర్మాణం కలగలిసి పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయని ప్రశంసించారు. వ్యక్తిత్వం లేని మనిషి మనోవిగ్రహాన్ని సాధించలేడని, తద్వారా ధర్మ రక్షణ సాధ్యం కాదని, ధర్మ రక్షణకు సంఘటిత శక్తిని అలవర్చుకోవాలని తన కవిత్వం ద్వారా రాజమౌళి స్పష్టం చేశారన్నారు. పాఠకుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించి, ప్రతీ పౌరున్ని కర్తవ్య పథంలో నడిపించే శక్తి ఈ కవిత్వానికి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా.భీమనాథుని శంకర్, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు చిలకమారి సంజీవ, భగవతి విద్యాసంస్థల అధినేత రమణారావు, కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్, స్తంభంకాడి గంగాధర్, కవులు గంగుల శ్రీకర్, అనంతోజు పద్మశ్రీ, నీలగిరి అనిత, వినీత్ కాశ్యప్, జక్కని గణేశ్, డా.కల్వకుంట్ల రామకృష్ణ, కేఎస్ అనంతాచార్య, పుప్పాల కృష్ణగోపాల్, జంగానీ యుగంధర్, బొమ్మకంటి కిషన్, ఎంఆర్వీ ప్రసాద్, దేవరం సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో వడ్రంగి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్కు చెందిన న్యాలపల్లి అజ య్(46) అనే వడ్రంగి కుడు ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సొంతంగా ఇల్లు కట్టుకోడానికి రూ.2లక్షల అప్పు చేశాడు. మహిళా సంఘంలో మరో రూ.2లక్షలు, అందినకాడల్లా రూ.4లక్షలు అప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అప్పులు తెచ్చిన చోట మి త్తితో కలిపి అవి రూ.13లక్షల వరకు అయ్యాయి. వ డ్రంగి పని చేసుకునే అజయ్ వచ్చిన కూలి డబ్బులతో అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో మనస్తాపంతో గుండెపోటుకు గురయ్యాడు. మృతుడికి భార్య రమాదేవి, కుమారులు కృష్ణచైతన్య, బనిత్, కూతురు శ్రీజ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బేతిగల్లో వైద్యశిబిరం
వీణవంక(హుజూరాబాద్): వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో నెల రోజులుగా జాండీస్(పచ్చ కామెర్లు) వ్యాధి వ్యాప్తి చెందడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వ్యాధితోపాటు జ్వరాలు వస్తుండడంతో గ్రామస్తులు ఆసుపత్రులపాలవుతున్న తీరుపై ఆదివారం సాక్షిలో బేతిగల్కు జాండీస్ కథనం ప్రచురితమైంది. ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం నుంచి ఆరా తీశారు. నీటి నమూనా పరీక్షలు చేయాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే నిమ్స్ వైద్యులతో విశ్లేషణ చేయాలని సూచించినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ దృష్టికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీసుకెళ్లారు. కలెక్టర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది. గ్రామంలో వారం రోజులపాటు క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కేశవపట్నం వైద్యాధికారి శ్రావణ్తోపాటు వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. జీపీ వద్ద శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. జాండీస్, జ్వరాల బారిన పడిన వ్యక్తుల వద్దకెళ్లి రిపోర్టులను పరిశీలించారు. శానిటేషన్ పరిశీలించారు. డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వైద్యులు వరుణ, రజనీకాంత్, ఎంఎల్హెచ్పీ రత్నమాల, అనిల్కుమార్, ఏఎన్ఎం పద్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో దొంగతనం
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్ర శివారులోని దీక్షిత ఇండేన్ గ్యాస్ ఏజేన్సీలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఏజెన్సీలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ ముందుగా సీసీ కెమెరా తీగ, కరెంట్ ఫ్యూజ్ తొలగించాడు. ఏజెన్సీ కార్యాలయ గొళ్లాన్ని ఇనుప రాడు సహాయంతో తొలగించి కార్యాలయంలో ఉన్న రూ.7వేల నగదు, రశీదు పుస్తకాలను మాయం చేశాడు. చందుర్తి ఎస్సై రమేశ్ను వివరణ కోరగా.. నిజమేనని, రూ.7వేల నగదు, రశీదు పుస్తకాలు మాయమైనట్లు తెలిపారు. 5 రోజుల క్రితం మర్రిగడ్డ పాఠశాలలో.. మర్రిగడ్డ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. మధ్యాహ్న వంట గదిలోని సిలిండర్, 2 వంట పాత్రలు, వాటి మూతలను ఎత్తుకెళ్లారని ఈనెల 12న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినయ్కుమార్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం చందుర్తి పోలీసులు బయటకు రానివ్వలేదు. -
సైకిల్పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. -
నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వర్షపు నీళ్లు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలు గౌతమినగర్, అలుగునూరు చౌరస్తాలను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కురిసిన వర్షాలతో నగరంలోని పలు లోతట్టు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. వీటిని తనిఖీ చేసిన కలెక్టర్, వరదనీళ్లు నాలాల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడుతాయనే సూచన మేరకు అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వర్షాలతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భూ యజమానుల అభ్యంతరం నగరంలోని కట్టరాంపూర్ పరిధి గౌతమినగర్ ప్రాంతంలో వరదనీళ్లు నిలిచిన ప్రాంతాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీళ్లు ఖాళీ స్థలాలు, ఇళ్ల నడుమ, రోడ్లపై నిలుస్తున్నాయి. గతంలో కాలువ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, కచ్చా నాలా తీసి నీళ్లు మళ్లించాలని ఆదేశించారు. కాలువగా చెబుతున్న స్థలం తమ సొంతమని,అందులో నుంచి ఎలా కాలువ తీస్తారంటూ సదరు స్థల యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కచ్చా నాలా ప్రతిపాదన విరమించుకొని, తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. అప్పటివరకు వరదనీళ్లతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నగరపాలకసంస్థ డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. -
గ్రామ స్వరాజ్య కృషీవలుడు వాజ్పేయ్
కరీంనగర్టౌన్: ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేదవాడి వరకు తీసుకెళ్లాలనే శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వాజ్పేయ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ రెండు ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంతో పాటు మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టారని గుర్తు చేశారు. అణుబాంబు తయారు చేసి అగ్రదేశాలకు వణుకు పుట్టించిన ధీశాలి అని కొనియాడారు. -
కొనసాగుతున్న ఎత్తిపోతలు
రామడుగు: రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్ నుంచి ఐదు మోటార్ల ద్వారా నీటిని ఎత్తి పోసి గ్రావిటీ కాలువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.1 టీఎంసీ మిడ్ మానేరుకు పంపింగ్ చేశారు. 1,2,4,5,6 బాహుబలి మోటార్ల ద్వారా ఎత్తి పోస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘కాళేశ్వరం’పై సీఎంవి పచ్చి అబద్ధాలురామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వాతంత్య్రదినోత్సవం రోజున పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరికాదని, కాళేశ్వరం నీటినే ఇప్పుడు గాయత్రి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోస్తున్నారని మాజీ ఎంపీ బి.వినో ద్కుమార్ విమర్శించారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్ నుంచి నీటిని గ్రావిటీ కాలువలోకి తరలిస్తుండడంతో శనివారం పరిశీలించి, పూజలు చేశారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం గంగపాలైందని రేవంత్రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కుంగిన పిల్ల ర్లకు మరమ్మతు చేయకుండా రాజకీయం చే యడం ఏంటని విమర్శించారు. మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, నారదాసు లక్ష్మణ్రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వేంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి పాల్గొన్నారు. శంకరపట్నం: మండలంలోని గద్దపాక సహకార సంఘం పరిధిలో ఉన్న కాచాపూర్ గోదాం వద్ద శనివారం యూరియా కోసం రైతులు క్యూకట్టారు. యూరియా లోడ్ రావడంతో పెద్ద సంఖ్యలో గోదాంకు చేరుకున్నారు. ఆధార్ జిరాక్స్తో క్యూ కట్టడంతో కాసేపటికే వచ్చిన లారీ యూరియా అయిపోయిందని, మరో లారీ యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో వాగ్వివాదానికి దిగారు. క్యూలో ఉన్న రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మరోలారీ యూ రియా తెప్పించి రెండు బస్తాలు పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఇంటిదారి పట్టారు. వీణవంక: వర్షం కాస్త గెరువిచ్చిందని ఆరుబయట ధాన్యం ఆరబోస్తే కోతుల గుంపు అందినకాడికి లూటీ చేశాయి. పదుల కొద్ది కోతులు గుంపుగా దండయాత్ర చేయడంతో సదరు రైతు చేతులెత్తాశాడు. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఓ రైతు సన్నరకం ధాన్యాన్ని ఇంటి ముందు ఆరబోశాడు. అప్పటి వరకు కాపలా ఉండి భోజనం కోసం ఇంట్లోకి వెళ్లేలోపే కోతులు ధాన్యాన్ని చిందరవందర చేశాయి. సుమారు గంట పాటు ఆరగించాయి. చివరికి రైతు టపాసులు పేల్చడంతో కోతుల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం. -
కవిత్వంతో నిలిచిపోయింది..
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది. వికసించిన రాజేశ్వరీ కవిత్వం రాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది. వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజ బూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్టాప్ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం. మహారాష్ట్రలో పాఠ్యాంశం రాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం.రాజేశ్వరీ జీవిత పాఠ్యాంశం మహారాష్ట్రలో పాఠ్యాంశమైన బూర రాజేశ్వరీ జీవితం 2021లో పాఠ్యాంశంగా చేర్చిన అక్కడి ప్రభుత్వం 2022లో చనిపోయిన కవయిత్రి తన పరిస్థితిపై.. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు.. తెలంగాణ ఉద్యమంపై.. భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం.. ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం. -
గోపాల.. గోపాల
కరీంనగర్ కల్చరల్/జమ్మికుంట: జిల్లావ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం వైభవంగా జరుపుకున్నారు. చిన్నారులు రాధాకృష్ణ, గోపికల వేషధారణతో సందడి చేశారు. నగరంలోని సాయినగర్ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలు సమర్పించారు. పలుప్రాంతాల్లో ఉట్టి సంబురాలు జరుపుకు న్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్వద్ద నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మ ల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజూరా బాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు. -
బల్దియాపై కాంగ్రెస్ నజర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ నజర్ పెట్టింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి నగర పాలికపై కాంగ్రెస్ జెండా ఎగరలేదు. వాస్తవానికి 20 ఏళ్ల క్రితం కార్పొరేషన్ ఆవిర్భవించినప్పటి నుంచి కాంగ్రెస్కు ఇక్కడ తిరుగులేదు. తెలంగాణ ఉద్యమంతో బీఆర్ఎస్ బలోపేతమైంది. హిందుత్వ నినాదంతో బీజేపీ వేళ్లూనుకుంది. ఫలితంగా కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలవకుండా ప్రాతినిథ్యం కరవైంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవస్థాగతంగా బలంగా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాగా, ఎంపీ బీజేపీ నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తున్నా రు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కరీంనగర్ కా ర్పొరేషన్ను గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ బాధ్యతలను ఇటీవల కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్రావుకు సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ బ లోపేతానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ బలోపేతం, చేరికలపై కసరత్తు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీది వింత పరిస్థితి. ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. కరీంనగర్లో పార్టీని నడిపించేవారు లేరు. ఇటీవల నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థలకు వెళ్లనున్న నేపథ్యంలో కరీంనగర్ బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలని కరీంనగర్ అసెంబ్లీ బాధ్యతలను వెలిచాల రాజేందర్కు సీఎం అప్పగించారని సమాచారం. ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇప్పటికే వెలిచాల క్షేత్రస్థాయిలో తన పనిచేసుకుంటున్నారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. కరీంనగర్లోని 66 డివిజన్లలో మెజారిటీ స్థానాలు గెలవడం లక్ష్యంగా.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆహ్వానించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీ మారే యోచనలో ఉన్న పలువురు వెలిచాలతో తరచుగా చర్చలు జరుపుతున్నారు. ఇక సొంత పార్టీ టికెట్ల మీద పోటీకి ఆసక్తి చూపిస్తున్న వారిలో ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపైనా సమాంతరంగా పనిచేస్తున్నారు. సీఎం స్వయంగా నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పనుండటంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలకు ఇక తెరపడనుందని వెలిచాల అనుచరులు ధీమాగా ఉన్నారు. -
పరిశుభ్రత ఎలా?
● జాడలేని స్కావెంజర్లు ● అరకొర వేతనాలు.. అవీ సరిగా ఇవ్వరు..కోరుట్ల: ‘రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు’. అక్కడున్న వారంతా.. ఒకే సర్ అని తలలు ఊపారు.. ఇదంతా బాగానే కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న స్కావెంజర్లకు దాదాపు ఆరునెలలుగా వేతనాలు లేవు. అడపదడప వేతనాలు ఇస్తున్నా..అవి అరకొరగానే ఉండటంతో స్కావెంజర్లు ఆసక్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తం 270 వరకు ఉన్నాయి. వీటిలో టాయ్లెట్స్, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీ పాఠశాలకు ఒక స్కావెంజర్ను నియమించుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి స్కావెంజర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడి పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా.. కేవలం ఒక్క స్కావెంజర్ను మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు దాదాపుగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకం జరిగింది. ఇక్కడితో సమస్య సమసిపోతుందని భావించినా గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చే అరకొర వేతనాలు సైతం ఇవ్వడం లేదు. ‘ఇదిగో వేతనాలు వస్తున్నాయి..అదిగో వస్తున్నాయి’.. అంటూ ఊరించడమే తప్ప ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు. స్కావెంజర్ల వేతనాల విషయంలో జిల్లాతో పోలిస్తే ఇతర జిల్లాలో ఎక్కువ మొత్తంలో వేతనాలు అందుతున్నట్లు సమాచారం. పొరుగు జిల్లాలో స్కావేంజర్లకు నెల రూ. 6వేలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనంగా స్కావెంజర్ల నియామకానికి అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో మాత్రం స్కావెంజర్లకు కేవలం రూ.3వేలు వేతనం ఇవ్వడం..ఆ వేతనం సకాలంలో ఇవ్వకపోవడం సమస్యగా మారింది. వేతనాలు సరిగా రాకపోవడంతో స్కావెంజర్లు సరిగా పనులకు రావడం లేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే..‘అరకొర వేతనాలు..అవీ సరిగా రావడం లేదు.. కానీ ఎక్కడా లేని ఆజమాయిషి’ ఎందుకని వర్కర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో పరిశుభ్రతను ఎలా మెయింటేన్ చేయాలో తెలియక నిర్వాహకులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. పాఠశాల విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా కలెక్టర్ ఈ మధ్య కాలంలో తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడంతో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏలాంటి చర్యలు ఉంటాయోనని ఉపాధ్యాయులు బెదిరిపోతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలల పరిశుభ్రతకు అవసరమైన వనరులు కల్పించి ఫలితం ఆశిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అజయ్ని బతికించారు
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బొంగోని అజయ్(26) వినాయకుడి విగ్రహాల తయారీలో కూలీ పనికి వెళ్లగా విగ్రహం మీదపడటంతో మెడనరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆయన దీనస్థితిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. జూలై 16న ‘నిరుపేదకు పెద్ద కష్టం’ కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా అజయ్ పరిస్థితిపై వాకబు చేశారు. చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని ఆదేశించారు. నెల రోజులుగా నిమ్స్లో చికిత్స పొందిన ఆజయ్కి శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా శ్రీసాక్షిశ్రీకి అజయ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఆపరేషన్ తర్వాత మూడు నెలల పాటు ఫిజియోథెరఫి చేయించాలి. దీని కోసం డిహాబిటేషన్ సెంటర్లో ఉంచాలి. రోజుకు రూ.38,00 ఖర్చు అవుతుంది. ఈ మూడు నెలలు అజయ్కి కీలకం. ఈ సమయంలో ఎంత ఫిజియోథెరిఫి చేపిస్తే అంత తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుందని నిమ్స్ వైద్యులు చెప్పుతున్నారు. పేద కుటుంబం కాబట్టి దాతలు సహకరిస్తే అజయ్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాల్సినవారు ఫోన్ నంబర్ 97013 14308ను సంప్రదించాలని కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సైదాపూర్: సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లిలో గడ్డి మందు తాగిన అమరగొండ రాహుల్(20) అనే యువకుడు శనివారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సైదాపూర్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎస్ఐ, గ్రామస్తుల కథనం ప్రకారం.. విజయ–కొమురయ్య ఏకై క కుమారుడు రాహుల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 4 రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించడం లేదని ఇంట్లో గొడవ పడ్డాడు. మనస్తాపం చెంది ఆగస్టు 15న సాయంత్రం వ్యవసాయ పొలాల వద్ద గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా రాహుల్ గడ్డి మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. హాయిగా చనిపోతున్నాను.. ఎప్పుడో చచ్చిపోదామనుకున్నా.. ఈరోజు అవకాశం వచ్చిందంటూ నవ్వుతూ గడ్డి మందు తాగే వీడియో గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వైరలైంది. నవ్వుతూ తిరిగే రాహుల్ ఆత్మహత్యకు పాల్పడడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. హుజురాబాద్కు చెందిన వ్యక్తి.. హుజూరాబాద్: పట్టణానికి చెందిన పంజాల కృష్ణ(42) ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కృష్ణ హుజురాబాద్కు చెందిన వనం హరీశ్కు రూ.25లక్షలు అప్పుగా ఇచ్చాడు. గత 15నెలలుగా అసలు, వడ్డీ ఇవ్వడం లేదు. ఇటీవల డబ్బుల కోసం అడగగా, ఇవ్వననడంతో మనస్తాపానికి గురై పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఈనెల 3న రాత్రి తన చావుకు హరీశ్ కారణమని సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం పురుగుల మందుతాగాడు. చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణను హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జమ్మికుంట, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కృష్ణ భార్య హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. -
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: పలు దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం రూరల్ పోలీస్స్టేషన్లో నిందితులను అరెస్ట్ చూపారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండంపల్లికి చెందిన వనం పాపయ్య, జగిత్యాల శివారు టీఆర్నగర్కు చెందిన వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి, బాన్సువాడకు చెందిన జగన్నాథం కృష్ణ ముఠాగా ఏర్పడి కొద్దికాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాల, రాయికల్, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేశారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్రావు రాయికల్ శివారులోని లలితామాత దేవాలయం వద్ద శనివారం తనిఖీలు చేస్తుండగా.. సమీపంలోని మామిడితోటలో నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, రూ.15 వేలు, మూడు సెల్ఫోన్లు, నిందితులు ఉపయోగించిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వనం పాపయ్య, వనం రాము, దాసరి రవిని రిమాండ్కు తరలించారు. జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నాడు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్సైలు సుధీర్రావు, సదాకర్, హెడ్కానిస్టేబుల్ గంగాధర్, సుమన్ను అభినందించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ పరారీలో ఒకరు 12 తులాల బంగారం, కారు, రూ.15వేలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని ఎండపల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అంగడి రాజు (26)కు కొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా గొడవ కాగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎండపల్లి శివారులో క్రిమి సంహారక మందు తాగాడు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రాజు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ధర్మపురి: మేకలను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దోనూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోనూరుకు చెందిన మాసం చంద్రయ్య (59) ఎప్పటిలాగే శనివారం మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని భీమన్న గుట్ట వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ చిన్న కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య నర్సవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి న్యూపీకేరామయ్య కాలనీకి చెందిన రాధారపు గట్టయ్య టీవీఎస్ వాహనంపై ప్రాజెక్టు లేబర్ గేట్ నుంచి మెయిన్ రోడ్కు వస్తుండగా మంథని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మరో బైక్పై వేగంగా వచ్చి గట్టయ్య వాహనాన్ని ఢీ కొట్టారు. గట్టయ్యతో పాటు మంథని కౌశిక్, బూడిద మనోజ్, బూడిద సాయి మనోహర్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఓదెల(పెద్దపల్లి): శ్రావణమాసం సందర్భంగా ఈ నెల 21న ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో లక్షబిల్వార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సదయ్య శనివారం తెలిపారు. సామూహిక లక్షబిల్వార్చన పూజలో పాల్గొనే దంపతులు రూ.200 చెల్లించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నంది పంప్హౌస్లోని నీటిని తరలిస్తూ నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కులు, నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి సొరంగాల ద్వారా లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్లోకి తరలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు పంపులను కొనసాగించిన అధికారులు ఒక్క పంపును ఆఫ్చేసి మూడు పంపుల నుంచి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నట్లు ఏఈఈ వెంకట్ తెలిపారు. -
బేతిగల్కు జాండీస్
వీణవంక(హుజూరాబాద్): ఆ ఊరు జాండీస్ (పచ్చకామెర్లు)తో వణికిపోతుంది. ఒకరిద్దరు కాదు 15 రోజుల వ్యవధిలో సుమారు 60 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాప్తి చెందడం గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడంతో రూ.వేలలో ఖర్చు అవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. 2వ వార్డులోని ఓ ఇంట్లో తండ్రితో పాటు, కూతురు, కుమారుడికి జాండీస్ రావడంతో రూ.40 వేలు ఖర్చు అయ్యాయని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు వ్యాధి బారిన పడుతున్నా ఇప్పటి వరకు వైద్యాధికారులు సందర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలుషిత నీరే కారణమా..? గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి. వాటిని వంట, స్నానం, తాగడానికి వినియోగిస్తున్నారు. ఈ నీళ్లు కలుషితం కావడంతోనే వ్యాధి ప్రబలుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ నీళ్లు కూడా వ్యాధికి కారణమని మరికొంత మంది గ్రామస్తులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరుతున్నారు. తీరా వైద్యాధికారులు పరీక్షలు చేయడంతో జాండీస్తో పాటు ప్లేట్లెట్స్ కూడా పూర్తిగా తగ్గిపోవడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికై నా గ్రామంలో వైద్య సిబ్బంది పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను గ్రామస్తులు కోరుతున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన. డాక్టర్లు టెస్టు చేస్తే జాండీస్ 9.1 రేంజ్లో ఉందని రిపోర్టు వచ్చింది. ఇప్పటి వరకు రూ.40వేలు ఖర్చయ్యాయి. అయినా తగ్గకపోవడంతో కరీంనగర్కు రెఫర్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నయం కావడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. డాక్టర్లను అడిగితే ఊర్లో నీళ్లు కలుిషితం అవుతున్నాయని చెబుతున్నారు. – శ్రీ సాయి, యువకుడు, బేతిగల్ వ్యాధి వ్యాప్తిపై గ్రామస్తుల ఆందోళన పట్టించుకోని వైద్యసిబ్బంది -
విద్యుత్షాక్తో మహిళ మృతి
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన కరికవేణి లక్ష్మి(35) శుక్రవారం విద్యుత్షాక్తో చనిపోయింది. లక్ష్మికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కొత్తఇళ్లు నిర్మించేంత వరకు నివాసం ఉండేందుకు పాతఇంటి వెనకాల గురువారం రేకులషెడ్డు వేశారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పిల్లలు స్కూల్కు వెళ్తారని నీళ్లు వేడి చేసేందుకు స్విచ్బోర్డులో వాటర్ హీటర్ ప్లగ్ పెట్టే ప్రయత్నంలో విద్యుత్షాక్కు గురై కింద పడిపోయింది. బంధువులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి చనిపోయిందని చెప్పారు. లక్ష్మి కొడుకు వరుణ్ కుమార్ తొమ్మిదోతరగతి, కూతురు వైష్ణవి నాలుగోతరగతి చదువుతున్నారు. భర్త రాజు అంధుడు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. పిట్టలు కొట్టేందుకు వెళ్లి.. బావిలో పడి ● మహిళా రైతు దుర్మరణం మల్యాల(చొప్పదండి): మహిళా రైతు మొక్కజొన్న చేనులో పిట్టలు కొట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ముత్యంపేట గ్రామంలో జరిగింది. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన సంత లక్ష్మి(49) శుక్రవారం ఉదయం ఇంటి సమీపంలోని మొక్కజొన్న చేనులో పిట్టలు కొట్టేందుకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదశాత్తు బావిలో పడిపోయింది. లక్ష్మి చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో చేనుకు వెళ్లి వెతకగా బావిలో మృతదేహం కనపడడంతో స్థానికుల సాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. క్రెడిట్కార్డు పేరిట సైబర్మోసం జగిత్యాలక్రైం: ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రమేశ్ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వివరాలు.. రమేశ్కు సైబర్ నేరగాళ్లు నో బ్రోకర్ అనే యాప్ను పంపించారు. దానిని ఓపెన్ చేస్తే క్రెడిట్ కార్డు లిమిట్ పెరుగుతుందని నమ్మించారు. దీంతో రమేశ్ యాప్ను ఓపెన్ చేయగానే ఆయన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.40,997 సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామగుండంలోని విద్యుత్ నగర్కు చెందిన పెయింటర్ మేకల మల్లేశ్(50) పర్మినెంట్ టౌన్షిప్లో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో బొద్దున సంజయ్ తన బైక్ను అజాగ్రత్తగా వేగంగా నడిపి మల్లేశ్ వాహనాన్ని వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్ను స్థానిక ధన్వంతరి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశాక గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. రైలు కిందపడి ఆత్మహత్య ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన గీతకార్మికుడు అయిలు రాజు(41) శుక్రవారం ఇంటర్సిటీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రైల్వే హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. చిరుత దాడిలో లేగదూడ హతంకోనరావుపేట: మండలం గోవిందరావుపేటతండా (బావుసాయిపేట)లో లేగదూడపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన గుగులోత్ పర్శరాములు పొలం వద్ద లేగదూడను ఉంచాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూసే సరికి దూడ మృతి చెందింది. ఆనవాళ్లను బట్టి చిరుతపులి దాడి చేసి చంపినట్లు భావిస్తున్నారు. కొంతకాలంగా ఎలాంటి కదలిక లేని చిరుతపులి మళ్లీ దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ముగ్గురిపై కేసుబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక గ్రామంలోని ఓ ఆలయ బడ్జెట్ విషయంలో జూలై 28వ తేదీ రాత్రి చెన్నమనేని కొండలరావుపై బాలగోని వెంకటేశ్, సిద్ధాంతి దీక్షిత్, సిద్ధాంతి కళాధర్ దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజయ్య తెలిపారు. వెంకట రామారావు ప్రోత్సాహంతోనే దాడి చేశారని చెన్నమనేని కొండలరావు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. -
గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య
ధర్మపురి: భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా, మనస్తాపానికి గురై భార్య ధర్మపురి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఉదయ్కుమార్ తెలిపిన వివరాలు.. ధర్మపురికి చెందిన జువ్వాడి పద్మ (55)కు బాపు అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్తకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఏ పని చేయక ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య చిన్నచిన్న పనులు చేస్తూ భర్తను పోషించేది. ఇటీవల భర్త ఆరోగ్యం మరింత బాగా లేక మంచానికే పరిమితం కావడంతో ఎలా పోషించాలని మనస్తాపానికి గురైంది. శుక్రవారం గోదావరి స్నానానికి వెళ్లి అందులో దూకి మునిగిపోయింది. వెంటనే జాలర్ల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి మేనల్లుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాజన్నకు ‘పంద్రాగస్టు’ రద్దీ
మహాలక్ష్మి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులుసినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ప్రసాదం అందజేస్తున్న మహేశ్ఆలయంలో భక్తులు వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 15 సందర్భంగా రద్దీ నెలకొంది. ధర్మగుండంలో స్నానాలు చేసి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో రాధాభాయి, ఏఈవోలు, పర్యవేక్షకులు పరిశీలించారు. కాగా.. రాజన్నను దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వాదం అందించారు. ప్రొటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ప్రత్యేక హోమాలు రాజన్న ఆలయ అనుబంధ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం, పట్టుచీర సమర్పించారు. శ్రావణశుక్రవారం సందర్భంగా అర్చకులు రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
కథలాపూర్(వేములవాడ): ఉపాధి నిమిత్తం ఓ యువకుడు గల్ఫ్బాట పట్టాడు. సరైన ఉపాధి, వేతనం లేక అక్కడ 25 రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన సంగెం గంగరాజం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు వినోద్(30) కొంతకాలంగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఏడాదిన్నర క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లేక, వేతనం రాక మనస్తాపానికి గురై గత నెల 22న తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఆనంద పరమార్థమే కృష్ణ లీల
శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల ప్రయోజనాలు వేర్వేరు. ఆదర్శ మానవుడికి ప్రతీక శ్రీరాముడు. అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు. దైవానికి ప్రతీక శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కర్మయోగి, కష్టసుఖాల ఎరగక అలసట తెలియక పనులు చేసి ఉచ్చనీచాలన్నీ భరించాడు. లోకోద్ధరణ కృష్ణావతార పరమార్థం. ఉపనిషత్తులు, వేదాల సారాన్ని అందరికీ విడమరిచి అందుబాటులో ఉండేట్లు భగవద్గీతగా చెప్పాడు. జ్ఞానం కంటే పవిత్రమైంది వేరేది లేదు. ఆత్మ జ్ఞానం లభించిన వాడు శాంతి పొంది చివరకు భగవంతుని చేరగలడని జగత్తుకు ఉపదేశమిచ్చి శ్రీకృష్ణుడు జగద్గురువైయ్యాడు. – పవనకృష్ణశర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్ -
అనభేరికి నివాళి
కరీంనగర్: స్వాతంత్య్ర సమరయోధుడు అనభేరి ప్రభాకర్ రావు 116వ జయంతి సందర్భంగా శుక్రవారం కరీంనగర్లోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు సల్వాజీ వాసంతి, తుల మధుసూదన్ రావుతోపాటు దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు మార్వాడి సుదర్శన్ు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభాకర్రావు లాంటి వీరుల త్యాగాల ఫలితమే ఈనాటి స్వాతంత్రోత్సవ సంబరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనభేరి కుటుంబ సభ్యులు శౌర్యరావు, ధైర్యరావు, తో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు దండు అంజయ్య, వరలక్ష్మి, వాణి, ఎస్ఎఫ్ఐ నాయకుడు అసంపల్లి వినయ్ సాగర్, కెవిపిఎస్ నాయకుడు పులిపాక సాయికుమార్, పీడీఎస్యూ నాయకుడు కుమార్, భీమ్ ఆర్మీ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. విగ్రహాంఏర్పాటు చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: నిజాం నిరంకుశత్వంపై పోరాడి అసువులు బాసిన తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు అన భేరి ప్రభాకర్రావు కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్ వద్ద ఏర్పాటు చేయాలని ఎల్లాపి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ స్వాతంత్య్రం కోసం పోరాడిన అనభేరి నిజాం రజాకర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎల్లాపి సంఘం నాయకులు లక్కాకుల సురెందర్రావు, పెంచాల కిషన్రావు, అన భేరి యుగంధర్రావు, బాలసంకుల అనంతరావు,మాదాసు మోహన్రావు, సాయిని జనార్ధనణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో నడవక.. ఫైనాన్స్ కట్టలేక ఆత్మహత్య
తిమ్మాపూర్: మహాలక్ష్మి పథకం మరో ఆటో డ్రైవర్ ను కబలించింది. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని మాట ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిస్తీలు కట్టలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్, గ్రామస్తుల కథనం ప్రకారం.. పర్లపల్లి గ్రామానికి చెందిన గోపగోని సంతోష్ (29) కొన్నేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆటో సరిగా నడవక కరీంనగర్లోని భజరంగ్ ఫైనాన్స్లో తీసుకున్న లోన్ కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య మమత సైతం మతిస్థిమితం సరిగా లేక గొడవపడి వేరుగా ఉంటున్నది. ఈనెల14న రాత్రి ఇంటికి వచ్చిన సంతోష్ ఎప్పటిలాగే తన రూంలోకి వెళ్లి పడుకున్నాడు. అర్థరాత్రి సమయంలో తన అక్క రజిత అన్నం తినేందుకు రమ్మనగా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపింది. దీంతో వారు తలుపులు పగులగొట్టి చూడగా లోపల రేకుల షెడ్డుకు ఉరివేసుకుని కనిపించాడు. కిరాయిల లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ఆటో యూనియన్ నాయకులు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ వివరించారు. -
బైకులు.. భారీ శబ్దాలు..
తిమ్మాపూర్: సెలవులు వచ్చాయంటే చాలు రాజీవ్ రహదారి శబ్దాలతో దద్దరిల్లుతుంది. కరీంనగర్, తిమ్మాపూర్లోని ఇంజినీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో కలిసి భారీ శబ్దాలతో కూడిన వాహనాలు నడుపుతూ హడలెత్తిస్తున్నారు. సైలెన్సర్ల శబ్దంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 40 మంది యువకులు జట్టుగా బైకులపై మండలంలోని రేణికుంట వరకు వెళ్లి, తిరిగి కరీంనగర్ వస్తూ స్టేజీల వద్ద హల్చల్ చేశారు. అటూఇటుగా వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది గురిచేశారు. పోలీసులు స్పందించి జరగరానిది జరగకముందే చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
వరంగల్ క్రైం: హనుమకొండ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. హనుమకొండ పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం హనుమకొండ కుమార్పల్లిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర నలుగురు వ్యక్తులు ఎండు గంజాయి కలిగి ఉన్నారని వచ్చిన సమాచారంతో నార్కొటిక్స్ సీఐ శ్రీకాంత్, ఎస్సై సీహెచ్ పరుశురాములు, సిబ్బందితో కలిసి వెళ్లి కారులో గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్కు చెందిన ఎండీ పైజాన్, ఎస్డీ అన్సార్, ఎండీ అర్బాన్, కుమార్పల్లికి చెందిన అర్షద్ అలీఖాన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 25కిలోల 800గ్రాముల ఎండు గంజాయితోపాటు ఐదు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైజాన్, అన్సార్, అర్బాన్.. ఆంధ్రప్రదేశ్– ఒడిశా బార్డర్ వద్ద బాలు అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకొచ్చి హనుమకొండలోని కుమార్పలి్?ల్క చెందిన అర్షద్ అలీఖాన్ ఇంట్లో డంప్చేసి, అవసరమైన వాళ్లకి విక్రయిస్తుంటారు. ఈక్రమంలో గంజాయిని కారులో తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. నిందితులను హనుమకొండ పోలీసులకు అప్పగించగా ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో యాంటీ నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్ టీం, హనుమకొండ పోలీస్స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు -
ముకుందా.. ముకుందా..
కృష్ణతత్వం.. కృష్ అంటే భూమి న అంటే లేకపోవడం అని అర్థం. కృష్ణుడు అన్ని మతాలు, దేశాలు, కాలాలకు వర్తించే దివ్య సందేశాన్ని భగవద్గీత ద్వారా అందించి చిరస్మరణీయుడయ్యాడు. పరమ దుష్టులైన కంస, జరాసంధ, శిశుపాల, నరకాసురాది రాక్షసులను సంహరించి జగద్రక్షకుడయ్యాడు. భారతదేశాన్ని యుధిష్టరుని పాలనలో ఏకచత్రాధిపత్యం కిందికి తెచ్చిన రాజనీతి దురంధరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణావతారం.. సమగ్రమైన ఐశ్వర్యం అంటే శాసించే అధికారం, సంపూర్ణ ధర్మం, నిర్మలమైన యశస్సు, పరిపుష్టమైన సౌభాగ్యం, విజ్ఞానం, నిశ్చలమైన వైరాగ్యం ఈ 6 భగవంతుడి లక్షణాలు. నారాయణుని దశావతారాల్లో ప్రతీ అవతారానికి ఇందులో కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని లక్షణాలున్న పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, చతుర్భుజుడు, శంకచక్ర, గద, పద్మాదరుడు, మణిమయ రత్నమకుట కంకణ ధారుడై శ్రీమహా విష్ణువు ఎనిమిదో అవతారం కృష్ణావతారం. సుమారు 5వేల సంవత్సరాల క్రితం కారాగారంలో దేవకి–వాసుదేవులకు శ్రావణ బహుళ కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఆ బాల గోపాల పుణ్యాల పున్నమిగా శ్రీకృషు్?ణ్డ జన్మాష్టమి వేడుకలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. బాల కృష్ణుడి లీలలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేవే. పాలు, పెరుగు, వెన్నె చౌర్యంతో చిలిపి చేష్టలతోపాటు పసి వయసులోనే పలువురు రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలావినోదం వర్ణనలకు అతీతమైంది. అందుకే పారాడే పసిబిడ్డలందరూ ఈరోజు బాలకృష్ణులు మాత్రమే కాదు.. వాళ్ల అల్లరిని ఆనందించి, అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లులందరూ యశోదమ్మలే. ఉట్ల పండుగ శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పిల్లలకు బాలకృష్ణుడి వేషధారణ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాల్యంలోని శ్రీకృష్ణుడి విన్యాసాలకు చిహ్నంగా ఉట్ల పండుగను వేడుకగా జరుపుతారు. అందనంత ఎత్తులో ఉట్టిని కట్టి.. అందులోని వెన్నను సాహసంతో తీసుకొచ్చిన వాళ్లను బాలకష్ణుడి ప్రతీకలుగా భావించేవారు. ప్రస్తుతం ఉట్లలో పాలు, వెన్నకు బదులు డబ్బులు ఉంచి గెలిచినవారికి బహుమతిగా ఇస్తున్నారు. ఉట్టి కొట్టే వేడుక ఆద్యంతం పిల్లలు, యువకులతోపాటు అందరినీ అలరిస్తుంది. ఉట్టిని అందుకునేందుకు చేసే ప్రయత్నాలను సున్నితమైన పద్ధతుల్లో భంగపరుస్తూ వినోదిస్తుంటారు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమివిద్యానగర్(కరీంనగర్): కృష్ణ అనే రెండు అక్షరాలు ప్రణవ మంత్రము, మొదలైన పవిత్ర మంత్రాలన్నింటితో సమానమైనవి. సర్వ భయాలు, విఘ్నాలను తొలగించి విజయ పథంలో నడిపించే అద్భుత చైతన్యం కృష్ణనామం. సత్యం జ్ఞాన మనస్తం బ్రహ్మ, ఆనందోబ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్యాన్ వంటి ఉపనిషత్ వాక్యాల సారం శ్రీకృష్ణ నామమే. -
‘తెలంగాణ’ ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. చింతకుంటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ పతాకం ఎగురువేసి మాట్లాడారు. మనదేశానికి స్వాతంత్రం వచ్చి 79ఏళ్లు గడిచిందని, ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో మనరాష్ట్రం ఏర్పడడం ఒక మైలురాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రస్తుతం మనదేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారకు ఇందుకు తొలి సీఎం కేసీఆరే అని తెలిపారు. ప్రభుత్వాలు ఏవైనా.. ప్రజాసంక్షేమం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, నాయకులు పాల్గొన్నారు. -
అతివకు అక్షర సేవ
కరీంనగర్ అర్బన్: ఇల్లాలి చదువు.. ఇంటికి వెలుగనే ఉద్దేశంతో నిరక్షరాస్యతను రూపుమాపే చర్యలు చేపడుతున్నారు. నూతన విద్యాహక్కు చట్టం ప్రకారం సమాజంలో అందరూ చదువుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీ) కార్యక్రమం ప్రవేశ పెట్టింది. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చాలన్నది ప్రధాన లక్ష్యం. పురుషులతో పోల్చితే మహిళల అక్షరాస్యత రేటు సుమారు 18శాతం తక్కువగా ఉండటంతో తొలుత మహిళల్లో అక్షర చైతన్యం తేవాలని నిర్ణయించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో చదువురాని అతివలను ఇప్పటికే గుర్తించి వారి వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. సదరు మహిళలకు అక్షరాలు, అంకెలు నేర్పడంతోపాటు ఆర్ధిక, డిజిటల్ అక్షరాస్యత, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తారు. నెలాఖరులోపు అక్షరాలు దిద్దించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగుతున్న కసరత్తు తొలుత జిల్లా రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)లకు రాష్ట్రస్థాయిలో శిక్షణనిచ్చారు. వీరు జిల్లాలోని మండల రిసోర్స్ పర్సన్ల(ఎమ్మార్పీ)కు ఉల్లాస్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. వీరు గ్రామాల్లోని వీవోలకు, క్లస్టర్స్థాయి వలంటీర్లకు శిక్షణనిస్తారు. మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఐకేపీ ఏపీఎంలకు ఇటీవల జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీవోలు, వలంటర్లకు తర్ఫీదు ఇవ్వడానికి తేదీలు ఖరారు కాలేదు. జిల్లాకు సరిపడా పుస్తకాలూ త్వరలో చేరనున్నాయి. లక్ష్యానికి మించి అక్షరాస్యతకు చర్యలు జిల్లాలో 50వేలకు పైగా చదువురాని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలని నిర్దేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో లక్ష్యాన్ని మించి గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 20వేల మంది వివరాలను నిక్షిప్తపరిచారు. పది మందికి ఒకరు చొప్పున చదువు చెప్పే వలంటీర్లను ఎంపిక చేయనున్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా 2022లో ‘ఉల్లాస్’ పట్టాలెక్కింది. జిల్లాలో సదరు పక్రియ నత్తనడకన సాగుతుండగా ఈ సారి శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 3 నెలల్లో లక్ష్యం పూర్తిచేయనుండగా ఎక్కువ మంది పనులకు వెళ్తారు. కనుక సాయంత్రం వేళల్లో తరగతులు నిర్వహించనున్నారు. వయోజనుల అభ్యసన సామర్థ్యంపై పరీక్షలుండనున్నాయని అధికారులు వివరించారు. -
మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
సైదాపూర్: ఏ పంటకై నా మోతాదుకు మించిన రసాయన ఎరువులు వాడొద్దని ఇఫ్కో కంపెనీ కరీంనగర్ జిల్లా మేనేజర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆవరణలో జైజవాన్, జైకిసాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మీలో పని చేసి రిటైరైన జవాన్లను ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఎక్కువ రకాల పంటలు సాగు చేస్తున్న మండలాల్లో గంగాధర, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాలున్నాయన్నారు. అన్ని రకాల పంటల సాగు రైతుకు శ్రేయస్కరమని అన్నారు. అధికంగా యూరియా వాడితే చీడపీడలు ఎక్కువగా వస్తాయన్నారు. నానో యూరియా, డీఏపీ మందులతో కలిపి వాడొచ్చని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బెదరకోట రవీందర్, మాజీ సర్పంచులు గుండారపు శ్రీనివాస్, కొండ గణేశ్, విద్వాన్రెడ్డి ఉన్నారు. -
మొదటి జెండా ఎగిరింది ధర్మపురిలోనే..
ధర్మపురి: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కేవీ.కేశవులు, మాణిక్యశాస్త్రి ప్రాణస్నేహితులు. కేశవులు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు హయాంలో చేనేత జౌళిశాఖ మంత్రిగా కొనసాగారు. 1947లో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న కర్నెఅక్కెపెల్లి భవనంపై తన మిత్రుడైన మాణిక్యశాస్త్రితో కలిసి మొట్టమొదటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఎగురవేయడం నిషేధమని అప్పటి నిజాం ప్రభుత్వం కేశవులను బంధించడానికి ప్రయత్నించగా.. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోంచి వెళ్లి తప్పించుకున్నారు. ఏడాదిపాటు ముంబయిలో తలదాచుకున్నారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం రోజు తిరిగి ధర్మపురికి చేరుకున్నారు. 2019 జనవరి 30న అనారోగ్యంతో మృతి చెందారు. -
రాజకీయాల్లో ప్రాధాన్యమివ్వాలి
రాజకీయాల్లో మహిళలు, అందులో యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఉండాలి. ఇప్పటికీ మహిళలు గెలిచిన స్థానాల్లోవారి కుటుంబసభ్యుల్లోని మగవారే పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మహిళల స్థానాల్లో వారే పరిపాలించేలా చూడాలి. – అర్చన, బీకాం, వీణవంకఅత్యుత్తమ టెక్నాలజీ ఉన్న భారతదేశ సైన్యాన్ని చూసి ప్రపంచమే వణికిపోతోంది. యుద్ధ విమానాలు, ఇతర దాడులు చేసే క్షిపణుల వ్యవస్థను మరింత పటిష్టపరిచి శత్రుదేశాలు మన గురించి ఆలోచించాలంటే వణుకుపుట్టేలా భారత సైన్యాన్ని సిద్ధం చేయాలి. – ఆర్.నీలిమ, కరీంనగర్2047నాటికి దేశం ఆగ్రస్థానంలో నిలవాలంటే రాజకీయాల్లోకి చదువుకున్న వారు రావాలి. ఐఏఎస్, ఐపీఎస్లను ఎలా ఎంపిక చేస్తున్నారో, రాజకీయాల్లోనూ అత్యుత్తమ వ్యక్తులను ఎంపిక చేయాలి. వారి చేతిలో డిజిటల్ ఇండియా ముందుకు సాగుతుంది. – అబ్దుల్ రహమాన్, సీఎస్ఈ ఫైనలియర్, కిట్స్భారతదేశం 2047నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలంటే ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. వైద్యరంగంలో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తే అందరం ఆరోగ్యంగా ఉండి దేశాన్ని ఆగ్రస్థానంలో నిలపొచ్చు. ఉచిత వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. – అభిలాష్, సివిల్ ఫైనలియర్, కిట్స్ -
చీకటి రోజు ఆగస్టు 14
కరీంనగర్టౌన్: 1947 ఆగస్టు 14 దేశ చరిత్రలో చీకటి రోజని, దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని, బ్రిటిష్ వలస పాలకుల దుర్నీతితో ప్రపంచంలోనే అతి పెద్ద హింసాత్మక, దారుణాలతో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఆగస్టు 14 విభజన గాయాల స్మృతి దినాన్ని పురస్కరించుకుని పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి లభించిన భారత స్వాతంత్య్రానికి సంబరాలు చేసుకోవాలో విభజన విషవలలో చిక్కిన అమాయక ప్రాణాలను చూసి దుఃఖించాలో తెలియని దుస్థితి అన్నారు. మాజీ మేయర్ సునీల్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్లపు రమేశ్, బత్తుల లక్ష్మినారాయణ, వెంకట్రెడ్డి, నర్సింహరాజు, రాపర్తి ప్రసాద్ పాల్గొన్నారు. -
పోరాటాల ‘గాలిపల్లి’
ఇల్లంతకుంట: పోరాటాల గ్రామంగా చరిత్రలో నిలిచిపోయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నిజాంపాలిత ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రానికి ఇంకా విముక్తి లభించలేదు. బద్ధం ఎల్లారెడ్డి ప్రాంతమైన గాలిపల్లి ప్రజలు నైజాం పాలనపై తిరగబడ్డారు. 1948 సెప్టెంబర్ మొదటి వారంలో రజాకార్లు గాలిపల్లికి వచ్చారు. తిరుగుబాటుదారులు వారిసైన్యంపై రాళ్లు విసిరారు. రజాకార్ల కాల్పుల్లో తిరుగుబాటుదారుల్లో ముందువరుసలో ఉన్న 11మంది చనిపోయారు. వీరిలో గాలిపల్లికి చెందిన వారు ఏడుగురు, బేగంపేట, సోమారంపేట, తాళ్లపల్లి, నర్సక్కపేట గ్రామాలకు చెందినవారు నలుగురు ఉన్నారు. రజాకార్ల పాలన నుంచి విముక్తి కలిగిన తరువాత గాలిపల్లిలో దాదాపు 20మందికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడంఫైటర్ పింఛన్లు మంజూరు చేశాయి. -
ఓట్ల చోరీని అడ్డుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఎన్నికల కమిషన్తో కలిసి బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీని అడ్డుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లిసత్యనారాయణ అన్నారు. ఓట్చోరీకి నిరసనగా గురువారం రాత్రి నగరంలో కాంగ్రెస్ ప్రదర్శన నిర్వహించింది. ఇందిరాచౌక్ నుంచి బస్స్టేషన్ వరకు కొవ్వొత్తులతో నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు స్వతంత్రంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్, నాయకులు వుట్కూరి నరేందర్రెడ్డి, కర్ర సత్యప్రసన్న,ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 కోసం భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గురువారం భారత జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్ట్ సంచాలకుడు దుర్గాప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేశ్బాబుతో భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు. ఇదివరకే పరిహారం చెల్లింపు పూర్తయిన భూమిని త్వరగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సేకరణ విషయంలో అభ్యంతరాలు ఉన్న వారితో మాట్లాడి సహకరించేలా చూడాలని అన్నారు. భూసేకరణలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని భారత జాతీయ రహదారి సంస్థకు స్వాధీనం చేయాలని పలు సూచనలు చేశారు. -
కరీంనగర్
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు నినాదంతో ఎందరో మహనీయుల పోరాటాలతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యమ సమయం నాటి అనేక సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి వేదికై న మెట్పల్లి ఖాదీప్రతిష్టాన్ విదేశీ వస్తు బహిష్కరణలో కీలక పాత్ర పోషించింది. తాజాగా పొలిటికల్ బ్రాండ్గా పేరొందుతోంది. ఉమ్మడి జిల్లానుంచి ఎందరో మహనీయులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అమరులైన వారి పేరిట శిలాఫలకాలు ఆయా ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. నాటికీ.. నేటికీ పరిస్థితులు మారాయి. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయినప్పటికీ విద్య, వైద్యం, చట్టాలపై మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేటి యువత అంటోంది. 2047 నాటికి వందేళ్ల భారతదేశాన్ని పునర్నిర్మిస్తామని సగర్వంగా చెబుతోంది. నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..కరీంనగర్క్రైం/హుజూరాబాద్: ‘కఠిన చట్టాలు తీసుకొచ్చి, బలమైన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాం. నవ భారత నిర్మాణానికి నాంది పలికి, దేశాన్ని పునర్నిర్మిస్తాం’ అంటూ నేటి యువత ప్రతిజ్ఞ పూనుతున్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలంటే సైన్యాన్ని మరింత పటిష్టం చేయాలని, విద్యా, సాంకేతిక రంగాల్లో మార్పులు అవసరమని చెబుతున్నారు. డ్రగ్స్ ముప్పును మట్టికరిపించకపోతే మనవజాతి మనుగడ కష్టతరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని కోరుకుంటున్నారు. శుక్రవారం పంద్రాగస్టు సందర్భంగా 2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్ర భారతదేశం ఎలా ఉండాలనే అంశంపై కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ,పీజీ కళాశాల, హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన టాక్షోలో విద్యార్థులు పాల్గొని, తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
పంద్రాగస్టుకు ముస్తాబు
కరీంనగర్ అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ, పరిశ్రమల, వాణిజ్యశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పతాకావిష్కరణ చేస్తారు. 9.32 గంటలకు వందన స్వీకారం, 9.40కి సందేశం, 10 గంటలకు స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, 10.10కు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.40కు ప్రశంసపత్రాలు, మెమొంటోల ప్రదానం, 11.10 గంటలకు స్టాళ్ల పరిశీలన, 11.40కు అస్ట్రా కన్వెక్షన్ హాల్లో తేనీటి విందు ఉంటుంది. కరీంనగర్ పోలీసుల లోగో మార్పుకరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కు కొత్త లోగోను ప్రతిపాదిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన లోగో రూపకల్ప నను సీపీ గౌస్ ఆలం ప్రతిపాదించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ భద్రత, శాంతిభద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. ఈ లోగోలో హూ డేర్స్ విన్స్ అనే పదం ఉంటుంది, ఇది ధైర్యం చేసేవాడు గెలుస్తాడు అని తెలుపుతుంది. లోగోలో కనిపించే అశోక చక్రం, నాలుగు సింహాల చిహ్నం దేశభక్తిని, శక్తిని, ప్రజల్లో నిబద్ధతను ప్రతిబింబిస్తాయని సీపీ వెల్లడించారు. ‘సహకారం’ మరో ఆరు నెలలు!కరీంనగర్ అర్బన్: ఎట్టకేలకు సహకార సంఘాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారంతో పాలకమండళ్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించడం ఇప్పట్లో ఎన్నికలు ఉండవని స్పష్టమవుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, డీసీసీబీ ఉమ్మడి జిల్లాలో 135 సంఘాలున్నాయి. ఇప్పటికే ఆరు నెలలు పదవీ కాలం పొడిగించగా తాజాగా మరో ఆరు నెలలు పొడిగించడం గమనార్హం. ఇక శుక్రవారం జరిగే పంద్రాగస్టు వేడుకల్లో చైర్మన్లే పతాకావిష్కరణ చేయనున్నారు. విపత్తు సాయంగా జిల్లాకు రూ.కోటికరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయక చర్యల కోసం జిల్లాకు ముందస్తుగా రూ.కోటి విడుదల చేసింది. ఈ నెల 17 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలో కంట్రోల్ రూంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని జిల్లా ఉన్నతాధికారులు వివరించారు. -
చదువుల్లో రిజర్వేషన్లు వద్దు
దేశవ్యాప్తంగా చదువుల్లో, కొలువుల్లో రిజర్వేషన్లు తీసివేయాలి. ప్రతిభ ఆధారంగా విద్యాసంస్థల్లో సీట్లు, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాలు ఇచ్చేలా వ్యవస్థ ఉండాలి. మిగితా విషయాల్లో పథకాలు ఎలా ఉన్నా, చదువుల్లో అర్హతకు ప్రాధాన్యం ఇవ్వాలి. – అన్నపూర్ణ, బీఎస్సీ, ఆదిలాబాద్భారతీయ చట్టాలకు ఇంకా పదును పెట్టాలి. మహిళలపై నేరాల్లో విదేశాల్లో కఠిన శిక్షలు ఉన్నట్లే మన దేశంలోనూ అమలు చేయాలి. ఇలా చేస్తే నేరం చేసే ఆలోచన కూడా రాదు. శిక్షలు కూడా త్వరగా పడేలా న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ పనిచేయాలి. – వైడూర్య, బీఏ, పెద్దపల్లివిద్యలో, టెక్నాలజీలో మనదేశం అభివృద్ధి చెందాలి. వైద్యానికి, చదువుకు అయ్యే ఫీజులు తగ్గించాలి. పేద విద్యార్థులకు వైద్య కోర్సులు కలగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్యం తప్ప మిగితా పథకాలకు ప్రాధాన్యం తగ్గించినా ఫర్వాలేదు. కె.అలేఖ్య, బీఎస్సీ, మానకొండూర్ప్రస్తుతానికి దేశాన్ని పీడించి ప్రధాన సమస్యల్లో డ్రగ్స్ ఒకటి. ఎంత కంట్రోల్ చేసినా రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం పోలీసు, ఇతర వ్యవస్థలు దృష్టి సారించి డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాలపై లోతుగా విచారించాలి. డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలి. – ఎ.మహేశ్, బీఎస్సీ, కరీంనగర్ -
క్రెడిట్ కార్డుల కమీషన్ పేరుతో డబ్బులు స్వాహా..
● నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ శివకుమార్ వరంగల్ క్రైం: క్రెడిట్ కార్డుల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇస్తానంటూ బాధితుల నుంచి లక్షలు స్వాహా చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హనుకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ 2023లో హనుమకొండ రాయపురలో ‘భద్రకాళి డిజిటల్ సేవ’ పేరుతో షాపు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ అప్లికేషన్స్తోపాటు కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు. రెగ్యులర్ కస్టమర్లను తన వాలెట్లో యాడ్ చేసుకుని వారి క్రెడిట్ కార్డుల్లో బ్యాలెన్స్ ఉంటే ఫోన్ చేసేవాడు. తాను వేరే పేమెంట్ చేసేది ఉందని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎలాంటి చార్జీలు లేకుండా తానే క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తానని మోసం చేసేవాడు. కార్డులు స్వైప్ చేసిన తర్వాత వేరే కస్టమర్ల కార్డులు పేమెంట్ చేసి దానికి 4 శాతం వరకు చార్జీ తీసుకుని లాభం పొందేవాడు. ఎలాంటి కమీషన్ లేకుండా డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి డబ్బులు వాడుకున్న అనంతరం కొన్ని రోజుల తర్వాత ఇతరుల క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. సంవత్సరంన్నర పాటు కస్టమర్లకు నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ బాధితుల డబ్బుల నుంచి తన క్రాప్ లోన్, అప్పులు కట్టుకున్నాడు. ఇలా రూ.28 లక్షలు వాడుకున్నాడు. కొద్ది రోజులుగా విజయవాడలో ఉంటున్న నిందితుడు బుధవారం షాపు ఖాళీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించగా అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. లారీ, బైక్ ఢీకొని ఒకరి మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు మంథని: మున్సిపల్ పరిధిలోని గంగాపురి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన చెట్టం వెంకటేశ్(30) మృతి చెందాడు. మంథని మండలం ధర్మారం గ్రామానికి చెందిన తిప్పని అభిలాష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేశ్, అభిలాష్ ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి ద్విచక్రవాహనంపై పెద్దపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన అభిలాష్ను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. చొప్పదండి: మండలంలోని దేశాయిపేటకు చెందిన ఎలకపల్లి అంజయ్య సౌది అరేబియాలో మృతి చెందగా గురువారం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన అంజయ్య అక్కడ మృతి చెందగా కుటుంబ సభ్యులు గల్ఫ్ జేఏసీని సంప్రదించారు. వారి కృషితో ఎట్టకేలకు మృత దేహం స్వగ్రామానికి చేరుకుందని గ్రామస్తులు తెలిపా రు. అంజయ్య కుటుంబానికి రూ.ఐదులక్షల ఎక్స్గ్రేషియా వచ్చేలా చూడాలని, మృతదేహం దేశాయిపేటకు రావడానికి 22 రోజుల సమయం పట్టిందని, ఇటువంటి ఇబ్బందులు రాకుండా రూ.ఐదువందల కోట్లతో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కాంత ప్రభుత్వాన్ని కోరారు. -
పంద్రాగస్టుకు పోదువు.. లే కొడుకా
తిమ్మాపూర్: ఉదయం అందరితో కలిసి సంతోషంగా బడికి వెళ్లాడు. తెల్లవారితే పంద్రాగస్టు కావడంతో ఆ వేడుకల గురించే తోటి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంటికి ఆటోలో బయల్దేరాడు. కానీ, ఆ బాలుడి ఆనందం మార్గంమధ్యలోనే ఆవిరైంది. ఆటో ప్రమాదం అనంతలోకాలకు తీసుకెళ్లింది. ‘పంద్రాగస్టుకు పోదువు లే.. కొడుకా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులతో స్కూల్ నుంచి ఆటో మన్నెంపల్లికి బయల్దేరింది. గ్రామానికి 500మీటర్ల దూరంలో కుక్కలు ఆటో వెంట పరుగెత్తడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. 15మంది చిన్నారుల్లో నలుగురుకి తీవ్ర గాయాలు, మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. మన్నెంపల్లికి చెందిన 4వ తరగతి విద్యార్థి నాంపల్లి హర్షవర్ధన్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ఎడమవైపు కూర్చున్న హర్షవర్ధన్న్పై ఆటో బరువుపడడంతోపాటు, పగిలిన ఆటో అద్దాలు అతని తలలో గుచ్చుకున్నాయి. అతని ఎడమ చేయి కూడా తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జుగా మారింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, గాయాల తీవ్రతతో హర్షవర్ధన్ మృతి చెందాడు. అదే ఆటోలో హర్షవర్ధన్ అక్క నాంపల్లి శ్రీసాహితి కూడా ఉంది. తమ్ముడు కళ్లముందే తీవ్రంగా గాయపడడం చూసి బోరున విలపించింది. హర్షవర్ధన్ తల్లిదండ్రులు నాంపల్లి శ్రీనివాస్, సమతలు వ్యవసాయం చేస్తూ, కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఈ దుర్ఘటన వారి కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది. శ్రీనివాస్ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పాఠశాలకు వెళ్లొస్తుండగా అదుపుతప్పిన ఆటో నాలుగేళ్ల బాలుడి దుర్మరణం.. నలుగురికి తీవ్రగాయాలు రెండు నిమిషాల్లో ఇంటికి చేరే క్రమంలో ప్రమాదం కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి శివారులో ఘటన -
పొలిటికల్ బ్రాండ్.. మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్
కోరుట్ల/మెట్పల్లి: ఇక్కడి నేతలకు ఖాదీ బట్టలే స్ఫూర్తి. చాలా మందికి ఖాదీ రాజకీయంగా ఊపిరి పోసిందంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరా టకాలంలో ఖాదీ ఉద్యమానికి వేదికగా నిలిచింది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి. గాంధీ శిశ్యుడు అన్నాసాహెబ్ ఆధ్వర్యంలో మెట్పల్లిలో వెలిసిన ఖాదీ ప్రతిష్టాన్ ఖద్దరు ఆ కాలంలో ఖ్యాతి పొందింది. అప్పటి ఆనవాయితీని పుణికిపుచ్చుకుని మెట్పల్లి ప్రాంత రాజకీయ నాయకులు ఖాదీ వస్త్రాలు ధరించడం ఇప్పటికీ దూరం కాలేదు. కడక్ ఖాదీ బట్టలతో ఎవరైనా కనిపిస్తే చాలు ఈయన మెట్పల్లి లీడరని చెప్పొచ్చు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన వర్ధినేని వెంకటేశ్వర్రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కేవీ.రాజేశ్వర్రావు, జనతా పార్టీ నుంచి ఏకై క ఎమ్మెల్యేగా ఎన్నికై న కొమొరెడ్డి రామ్లు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఖాదీ ప్రతిష్టాన్ వస్త్రాలు ధరించి రాజకీయాల్లో కీలకంగా ఎదిగినవారే. 2009 అసెంబ్లీ పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంగా మారినప్పటికీ.. మెట్పల్లి ఖాదీ కార్ఖానా స్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్ ఇక్కడి ఎమ్మెల్యేలుగా కొనసాగడం గమనార్హం. -
రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ
రామగుండం: పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్లలో గతంలో రద్దు చేసిన పలు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ను ఈనెల 15న పునరుద్ధరించనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణి గురువారం తెలిపారు. ఐఆర్సీటీసీ రైల్వే పోర్టల్లోపై వాటి రాకపోకలు, హాల్టింగ్ మార్పును అప్డేట్ చేయనున్నట్లు వెల్లడించారు. హాల్టింగ్ పునరుద్ధరణ ఇలా.. రైలు నంబరు : 12656 : చైన్నె సెంట్రల్–అసర్వ జంక్షన్ (నవజీవన్ సూపర్ఫాస్ట్): పెద్దపల్లి జంక్షన్కు రాత్రి 8.59 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో(12655) సాయంత్రం 4.45గంటలకు చేరుకుంటుంది. రైలు నంబరు : 22737 : సికింద్రాబాద్–హిస్సార్ (హిస్సార్ సూపర్ఫాస్ట్): ప్రతీ మంగళ, బుధవారాల్లో పెద్దపల్లి జంక్షన్కు వేకువజామున 2.34గంటలకు చేరుకుంటుంది. దీనికి ఈనెల 19 నుంచి హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 17005 : హైదరాబాద్–రక్సోల్ (రక్సోల్ సూపర్ఫాస్ట్): ప్రతీ గురువారం వేకువజామున 2.34గంటలకు పెద్దపల్లి జంక్షన్కు చేరుకుంటుంది. ఈనెల 21 నుంచి పెద్దపల్లి జంక్షన్లో హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 17006 : రక్సోల్ –హైదరాబాద్ (రక్సోల్ సూపర్ఫాస్ట్): ప్రతీ ఆదివారం రాత్రి 11.59గంటలకు పెద్దపల్లి జంక్షన్కు చేరుకుంటుంది. ఈనెల 17 నుంచి హాల్టింగ్ ఉంటుంది. రైలు నంబరు : 12295 : బెంగళూరు–దాణాపూర్ (సంఘమిత్ర సూపర్ఫాస్ట్): ప్రతీరోజు వేకువజామున 2.09గంటలకు రామగుండం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. శుక్రవారం నుంచి హాల్టింగ్ ఉంటుంది. -
చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం
మంథనిరూరల్: గతేడాది జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంకిశోర్ను భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సన్మానించారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చిల్లపల్లి సెక్రటరీతోపాటు రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన మరో ఐదుగురు కార్యదర్శులను సత్కరించారు. ఆరుగురు కార్యదర్శులతోపాటు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. నేడు ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు హాజరు -
గుండుసూదిపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి
జగిత్యాలటౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండుసూది మొనపై జాతీయ జెండాతో పరుగెడుతున్న యువతి చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. పండుగలు, పబ్బాలు, జాతీయ పండుగలు వంటి ప్రత్యేక సందర్భంలో ఏదో సూక్ష్మరూప చిత్రం ద్వారా సమాజానికి సందేశం పంపించే దయాకర్.. ఈ స్వాతంత్య్ర వేడుకకు జాతీయ జెండాతో పరుగులు పెడుతున్న యువతి సూక్ష్మకళాకండాన్ని రూపొందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారన్న సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ చిత్ర ఉద్దేశమని దయాకర్ తెలిపారు. ఈ సూక్ష్మ కళారూపాన్ని తయారు చేసేందుకు మైనం పెన్సిల్ కలర్స్ ఉపయోగించానని, పది గంటల సమయం పట్టినట్టు తెలిపారు. చిత్ర రూపకర్త గుర్రం దయాకర్ గుండు సూది మొనపై జాతీయ జెండాతో యువతి సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత సృష్టి -
సేవలకు దక్కిన గౌరవం
జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్కానిస్టేబుల్గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజేశుని శ్రీనివాస్ రుద్ర కృష్ణకుమార్ ఇండియన్ పోలీస్ మెడల్కు ఇద్దరు ఏఎస్సైలు -
రూ.1,947కే ఆరోగ్య పరీక్షలు
కరీంనగర్టౌన్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ ప్రవేశ పెట్టిందని ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చిన పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలను రూ.1,947 చెల్లించి పొందవచ్చన్నారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ కన్సల్టేషన్తోపాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్(సీయూఈ), పాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్ఎఫ్టీ), ఎక్స్రే చెస్ట్ (విత్అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, హెపటైటిస్బీఏ1సి, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్– పెల్విస్), సీరం క్రియాటినిన్ పరీక్షలు ఈ ప్యాకేజీ ద్వారా నిర్వహిస్తామని వివరించారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సద్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ‘మెడికవర్’లో వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ -
లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్కు రాష్ట్రపతి పతకం
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్మెన్గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్మెన్గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు. జమ్మికుంట ఫైర్ అధికారి గోపాల్రెడ్డికి.. జమ్మికుంట: జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్మెన్గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్మెన్గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు అవార్డుకు ఎంపికై నట్లు గోపాల్రెడ్డి తెలిపారు. -
సహకారం.. సందిగ్ధం
● సహకార సంఘాలకు ఎన్నికలా.. నామినేటెడా.? ● నేటితో ముగియనున్న పాలకవర్గాల గడువు ● సందిగ్ధంలో సహకార పాలన ● అధికారుల్లో అంతర్మథనంకరీంనగర్ అర్బన్: ప్రాథమిక సహకార సంఘాల పరిపాలన సందిగ్ధంలో పడింది. సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. మళ్లీ పాలకవర్గాల గడువు పొడిగిస్తారా లేక నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా అన్నది స్పష్టత లేకపోగా అధికారులకు తలకుమించిన భారమవుతోంది. నేటితో పాలకవర్గాల గడువు ముగియనుండగా ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా వాస్తవానికి 6 నెలల క్రితమే గడువు ముగియగా మరో 6నెలలు పొడిగించిన విషయం విదితమే. సదరు గడువు గురువారంతో ముగియనుండటంతో అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవ డం విస్తుగొల్పుతోంది. ఉమ్మడి కరీంనగర్ డీసీసీబీ పరిధిలో 135 ప్రాథమిక సహకార సంఘాలుండగా ఈ నెల 14తో గడువు ముగుస్తుండగా 15న సహకార సంఘాల, డీసీసీబీ, డీసీఎంఎస్ల ఎదుట జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఉంటుందా లేదా అని అధ్యక్షుల్లో ఆందోళన నెలకొంది. స్థానిక ఎన్నికల తరువాతే? సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిన దరిమిలా ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 42శాతం బీసీ రిజర్వేషన్ క్రమంలో సదరు ప్రక్రియ ఆలస్యమవుతుండగా సహకార ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశఽం లేదని తెలుస్తోంది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తదుపరి సర్పంచ్, మునిసిపాలిటీ ఎన్నికలు జరగనుండగా ఆయా ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం నాలుగు నెలలు పట్టనుంది. స్థానిక సంస్థల పోరు అనంతరం సొసైటీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. నేరుగా రైతులతో సంబంధాలు కలిగిన పదవి కావడం, రుణాలతో ముడిపడి ఉండడంతో సేవచేసే అవకాశం కోసం మండల స్థాయి చైర్మన్ పదవికి పోటీ ఏర్పడనుంది. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల విధానం పాటిస్తారా.. లేదా.. అన్నది తెలియడం లేదు. నామినేట్ చేసే అవకాశం ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో వ్యవహారం కావడంతో నామినేట్ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో 30, జగిత్యాల 51, రాజన్న సిరిసిల్ల 24, పెద్దపల్లి జిల్లాలో 20 సహకార సంఘాలున్నాయి. నామినేటేడ్ చేసే అవకాశాలే ఎక్కువని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. సదరు విధానంతో పార్టీలో కష్ట పడి పనిచేసిన వ్యక్తికి పదవి కట్టబెట్టినట్లవుతుందని ప్రజాప్రతినిధులు సైతం యోచిస్తున్నారు. కాగా ప్రత్యేక పాలన విధిస్తారా.. లేదా.. అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదని సహకార శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. -
రాఖీ కట్నం
15.48కోట్లువిద్యానగర్(కరీంనగర్): రాఖీ పండుగ కరీంనగర్ రీజియన్కు కాసుల పంట పండించింది. ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.15.48 కోట్ల ఆదా యం సమకూరింది. పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీనుంచి 11వ తేదీ వరకు రీజియన్ పరిధి లోని 11డిపోల్లో ఉన్న బస్సులు 21.50 లక్షల కిలో మీటర్లు తిరగగా.. 29,10,435 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 73శాతంపైగా (21,21,668) మహిళలు ఉండగా మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.9.08 కోట్లు ఆదాయం వచ్చింది. రాఖీ పౌర్ణమి రోజున ఈనెల 9న రికార్డుస్థాయిలో 7.02 లక్షల మంది రాకపోకలు సాగించగా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గోదావరిఖని డిపో నుంచి 4,28,432 మంది ప్రయాణించారు. వీరిలో 3,21,821మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ.223.79 లక్షల ఆదాయం రాగా.. మహాలక్ష్మీ స్కీంకింద రూ.130.09 లక్షల ఆదాయం వచ్చింది. జగిత్యాల డిపో 3,67,855 మందిని చేరవేసి రెండోస్థానంలో నిలిచింది. వీరిలో 2,71,103 మంది మహిళలున్నారు. మొత్తం ఆదాయం రూ.178.57 లక్షలు రాగా.. జీరో టికెట్లు ద్వారా 104.38లక్షల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి కరీంనగర్ రీజియన్లో లాభాల పంట గోదావరిఖని డిపోకు మొదటిస్థానంఅందరి సహకారంతోనే కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోలకు చెందిన సిబ్బంది, డైవర్లు, కండక్టర్లులు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పేర్ బస్సులతో పాటు జేబీఎస్ నుంచి సిటీ బస్సులు నడిచేలా చూశాం. 29 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. – బి.రాజు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ -
‘బుధవారం బోధన’తో ఆత్మవిశ్వాసం
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులకు కఠినమైన అంశాలు, పాఠాలు నేర్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఎలగందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బుధవారం బోధన కార్యక్రమానికి హాజరై పదోతరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించారు. ఇంగ్లిష్ సమర్థవంతంగా నేర్చుకోవడానికి చక్కటి వేదిక అన్నారు. బుధవారం బోధన రోజు విద్యార్థులు నూరుశాతం హాజరయ్యేలా చూడాలన్నారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, విటమిన్ గార్డెన్ పరిశీలించారు. అనంతరం ఎలగందులలోని పల్లె దవాఖానాను సందర్శించి, ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల రిజిస్టర్ను పరిశీలించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, ఎంఈవో ఆనందం పాల్గొన్నారు. నాలా నిర్మాణాలు చేపట్టాలి కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ముంపు సమస్యాత్మక ప్రాంతాల్లోని నాలాల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ముంపు సమస్య ఉన్న ప్రాంతాలను బుధవారం సందర్శించారు. టూటౌన్పోలీసుస్టేషన్ వద్ద ఉన్న నాలా, ఆర్టీసీ వర్క్షాప్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. జగిత్యాల రోడ్డులో మంజూరైన నా లా నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. టూటౌన్ వద్దగల నాలా పునర్నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)ను సందర్శించి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీపీ గౌస్ఆలం, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ కట్టడికి కలిసి రావాలి
కరీంనగర్క్రైం: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ ఐదోవార్షికోత్సవం సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ లేని సమాజమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయకుమార్, శ్రీనివాస్, సతీశ్, శ్రీనివాస్జి పాల్గొన్నారు. భరోసా కేంద్రం తనిఖీ కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని సీపీ గౌస్ఆలం తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, రికా ర్డులను పరిశీలించారు. కేసుల వివరాలను పరిశీలించి, నిందితులకు శిక్షలు పడేలా, బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఐ శ్రీలత, సిబ్బంది పాల్గొన్నారు. పరేడ్ ఏర్పాట్లపై సమీక్ష 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సీపీ గౌస్ ఆలం పరేడ్గ్రౌండ్లో సమీక్షించారు. పరేడ్ రిహార్సల్స్ను వీక్షించారు. పరేడ్లో పాల్గొంటున్న పోలీసులు, ఇతర విభాగాల కవాతును పరిశీలించి, సూచనలు చేశారు. పరేడ్ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. -
సుడా.. గడబిడ!
● టెండర్ ఖరారు కాకుండానే శంకుస్థాపన ● కాంట్రాక్టర్వి తప్పుడు పత్రాలంటూ మాజీ మేయర్ ఫిర్యాదు ● వివాదంలో ఐడీఎస్ఎంటీ కాంప్లెక్స్ ఆధునీకరణకరీంనగర్ కార్పొరేషన్: ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులు వివాదంలో పడ్డాయి. ఓ వైపు టెండర్ ఖరారు కాకుండానే శంకుస్థాపన చేయడాన్ని పలువురు తప్పు పడుతుండగా, మరోవైపు టెండర్లో తప్పుడు పత్రాలు అందజేసిన కాంట్రాక్టర్పై చర్యతీసుకోవాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఖరారు కాని టెండర్ నగరంలోని పాత మున్సిపల్ అతిథిగృహం స్థలంలో దాదాపు పదేళ్ల క్రితం నిర్మించిన వాణిజ్య భవన సముదాయం నిరుపయోగంగా ఉంది. ఈ సముదాయాన్ని సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం గత నెలలో టెండర్ పిలిచారు. ఈ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, ప్రైస్ బిడ్ ఓపెన్ చేయాల్సి ఉంది. టెక్నికల్ బిడ్ ఓపెన్చేసిన తరువాత, బిడ్లో పాల్గొన్న కాంట్రాక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లు సరైనవే అయితే, ఆ తరువాత ప్రైస్బిడ్ ఓపెన్ చేస్తారు. అందులో ఎవరు లెస్కు వేస్తే వారికి టెండర్ ఖరారు అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్ పనుల్లో ఇప్పటివరకు టెండర్ ఖరారు కాలేదు. అయినప్పటికి ఈ నెల 11వ తేదీన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఓ కాంట్రాక్టర్ తనకే పనులు అప్పగించినట్లు వ్యవహరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పలు అనుమానాలకు తావిస్తోంది. కాంట్రాక్టర్వి తప్పుడు పత్రాలు: రవీందర్ సింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనుల టెండర్లో తప్పుడు పత్రాలు అందజేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. టెండర్లో ఇద్దరు పాల్గొన్నారని, ఇప్పటివరకు ఆ టెండర్ ఖరారు కాలేదన్నారు. కాని ఒక కాంట్రాక్టర్ అందజేసిన పత్రాలన్నీ తప్పువేనన్నారు. ఆ సంస్థకు ఎలాంటి పరికరాలు, వాహనాలు, ల్యాబ్ లేవని, కాని ఇవన్నీ ఉన్నట్లు పత్రాలు అందచేశారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.పరిపాలన మంజూరు ఉంది షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులకు సంబంధించిన టెండర్ ఖరారు కావాల్సి ఉంది. అయితే సుడా పరిపాలనా మంజూరు ఇవ్వడంతో శంకుస్థాపన చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తి చేస్తాం. – యాదగిరి, ఈఈ, కరీంనగర్ కార్పొరేషన్ -
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి
కరీంనగర్టౌన్: 108 సేవలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. బుధవారం జిల్లాలోని 108 వాహనాలను పరిశీలించారు. 108 జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్తో కలసి అంబులెన్స్లోని ఔషధాలు వాటి గడువు, వైద్య పరికరాలు, పనితీరు, ఆక్సీజన్ లెవెల్స్, పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ పనితీరు, విషం తాగిన వారికి ఉపయోగించే సక్షన్ మిషన్, ఏఈడీ, లారెంజో స్కోప్, స్ట్రక్చర్, పెడిబోర్డు, సికాలర్, స్ప్లింట్, అంబు బ్యాగ్స్ను పరిశీలించారు. స్వామి, సంపత్, తిరుపతి, శ్రీనివాసరెడ్డి, సంపత్రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. -
వడ్డీ లేని రుణాలు సీ్త్రనిధి ద్వారే ఇవ్వండి
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ లేని రుణాల్లో మొదటి ప్రాధాన్యత సీ్త్ర నిధి రుణాలకు ఇవ్వాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సీ్త్రనిధి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. సీ్త్రనిధి ద్వారా రుణాలివ్వడం వల్ల మహిళల్లో సంస్థపై ఆత్మవిశ్వాసం పెరిగి సంస్థ బలపడటానికి దోహదపడుతుందని వివరించారు. సంస్థ నుంచి వైదొలిగిన పూర్వ ఉద్యోగులు స్వార్ధపూరితంగా, నిరాధారమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారని వివరించారు. వారి తప్పుడు ప్రచారం వల్ల రుణ చెల్లింపులు తగ్గిపోయాయని, సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సంస్థ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారని సీ్త్రనిధి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ.కె.మదర్ వివరించారు. వర్షాలతో అప్రమత్తం● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్నిశాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. భారీ వర్షాలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. విద్యుత్, రెవె న్యూ, పోలీసు, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకుని ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఖాళీ చేయించాలన్నారు. ప్రమాదరంగా ఉన్న చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్లకు కేంద్ర మంత్రి సంజయ్ ఫోన్..కరీంనగర్టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం సాయంత్రం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝాకు ఫోన్ చేశారు. జిల్లాల్లో ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలపై ఆరా తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సిబ్బందిని 24గంటలు అందుబాటులో ఉంచాలన్నారు.విద్యుత్తో జర భద్రం ● ఎస్ఈ రమేశ్బాబు కొత్తపల్లి(కరీంనగర్): జిల్లాలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు జాగ్రత్త వహించాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తున్నామని, మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకున్నామని తెలిపారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను సిద్ధంగా ఉంచామని, ఉద్యోగులకు షిఫ్ట్ విధానంలో 24 గంటల విధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగితే 8712488004 సెల్ నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్కు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితిల్లో చేయకూడదని సూచనలు ఇచ్చారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. శంకరపట్నం మోడల్ స్కూల్ పీఈటీల తొలగింపుకరీంనగర్: శంకరపట్నం మోడల్ స్కూల్ లో చదువుతున్న బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీ మోహన్, తిరుపతిలను ఉద్యోగం నుంచి తొలగిస్తూ బుధవారం కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్ట్/ ఔట్సోర్సిగ్ నిబంధనల మేరకు వీరిని విధుల నుంచి తొలగించారు. ప్రిన్సిపాల్ వి.సరిత, ఇంగ్లిష్ (పీజీటీ)గా విధులు నిర్వహిస్తున్న పి.కనక లక్ష్మిలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు కలెక్టర్ సిఫారసు చేశారు. -
ప్రమాదకరంగా ఆర్టీసీ బస్సుల డ్రైవింగ్
హుజూరాబాద్రూరల్: హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన ఘటన మంగళవారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. జమ్మికుంట బస్ స్టేషన్ నుంచి హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సులు హుజూరాబాద్ వైపు ఒకే సమయంలో బయల్దేరాయి. డ్రైవర్లు ఒకరిని మించి మరొకరు ప్రమాదకరంగా ఇతర వాహనాలు వెళ్లకుండా ఒకదానికొకటి ఓవర్ టేక్ చేస్తూ నడపటంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. వేరే వాహనాలు వెళ్లకుండా ప్రమాదకరంగా బస్సులను నడుపుతున్న వీడియోలను వెనుక వచ్చిన వాహనాదారులు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని కోనాపూర్ గ్రామంలో సర్వే నం.192,348లో ప్రభుత్వ భూమిని చదును చేసి ఆక్రమించేందుకు అదే గ్రామానికి చెందిన కొందరు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఆర్ఐ కరుణాకర్, మండల సర్వేయర్ తిరుపతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశ్విని అడ్డుకున్నారు. గతంలో 192 సర్వే నంబర్ గల భూమిని సూరంపేట గ్రామంలోని ఓ వ్యక్తి ఆక్రమించి చదును చేస్తుండగా పట్టుకొని రెండు బ్లేడు ట్రాక్టర్లను సీజ్ చేశామని, ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తి వరినాట్లు వేశాడని తెలిసింది. మరోసారి 192 సర్వే నంబర్ గల భూమి తెరమీదకు రావడంతో అధికారుల నామమాత్రపు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నామమాత్రపు చర్యలు -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణం కేశవనగర్కు చెందిన పిప్పరి పురుషోత్తం ఇంట్లో దొంగలు చోరీకి యత్నించినట్లు బాధితుడు మంగళవారం తెలిపాడు. వారం క్రితం పురుషోత్తం హైదరాబాద్లో ఉంటున్న తన కొడుకు వద్దకు వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉందన్న విషయం గమనించిన దొంగలు చోరీకి యత్నించారు. బీరువాలోని చీరలు, సామగ్రిని చిందరవందరగా పడేశారు. స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం ఇవ్వగా హైదరాబాద్లో ఉన్న పురుషోత్తం ఇంటికి వచ్చి పరిశీలించారు. వస్తువులు చోరీ కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏదేమైనా వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గొల్లపల్లిలో.. హుజూరాబాద్రూరల్: మండలంలోని గొల్లపల్లి గ్రా మంలో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండి సమ్మయ్య నెలరోజుల నుంచి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులు పని నిమిత్తం ఇంటికి వచ్చి తిరిగి ఆసుపత్రికి వెళ్లారు. ఎవరూ లేరని భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి 18 తులాల వెండి, మూడు తులాల బంగారం, రూ.8 వేల నగదు అపహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గ్రామంలోకి వన్యప్రాణి
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని కోనాపు రం గ్రామంలో మంగళవారం వన్యప్రాణి అయిన మనుబోతు గాయాలతో కనిపించింది. గ్రామస్తులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, కొడిమ్యాలలోని ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం అటవీశాఖ అధికారి మోయినొద్దీన్ మాట్లాడుతూ, రేస్ కుక్కల దాడిలో మనుబోతు గాయపడిందని, వాటి నుంచి తప్పించుకొని గ్రామ శివారులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స చేయించి , ఆరోగ్యంగా ఉన్నందున మళ్లీ అడవిలో వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు. -
సాకారమైన అగస్త్య ఫుడ్స్ యూనిట్
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ అనుబంధంగా బిస్కెట్ల తయారీ యూనిట్ ఏర్పాటైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్లో భాగంగా ‘అగస్త్య ఫుడ్స్’ కంపెనీ ‘సూపర్ ఫుడ్స్’ యూనిట్ను ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 8న ఈ యూనిట్కు అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు శంకుస్థాపన చేయగా.. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం 130 మందికి ఉపాధి కల్పిస్తూ అగస్త్య కంపెనీ ‘సూపర్ ఫుడ్స్’ తయారు చేస్తూ ఎగుమతి చేస్తోంది. భవిష్యత్లో మరింత విస్తరించి, యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. తొలి ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను రైతులను పండిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని అప్పట్లో మంత్రి కేటీఆర్ భావించారు. ఈమేరకు తొలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఉద్యానపంటలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలని భావించారు. జిల్లాలో తొలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు బిస్కెట్ ఉత్పత్తులను ప్రారంభించి ఎగుమతులు చేస్తోంది. పక్కనే ఎగువ మానేరు జలాశయం ఉండడంతో నీటికి ఇబ్బందులు లేకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొనసాగేందుకు అవకాశం లభించింది. బహుముఖ ప్రయోనాలు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు శివారులో సర్వేనంబర్ 104/2, 124/2లో 282 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు రైతులకు రూ.11.73 కోట్లు పరిహారం చెల్లించి సేకరించారు. ఆ స్థలాన్ని టీఎస్ఐఐసీకి అప్పగించారు. ఇందులో 50 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కేటాయించారు. మరో 232 ఎకరాలను సేకరించి వివిధ యూనిట్లకు కేటాయించారు. సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ పార్కులతో రైతాంగానికి బహుముఖ ప్రయోజనాలు కలుగనున్నాయి. ఆహారశుద్ధి పరిశ్రమలకు సమీకృత విధానాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రైతులు పండించిన పంటలను ఇక్కడే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసి ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీ యూనిట్లను నెలకొల్పనున్నారు. రైతులు వరితోపాటు ఉద్యాన పంటలను సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టమాటతోపాటు కూరగాయలు, పువ్వులు, పండ్లు వంటి వాటిని ఉత్పత్తి చేస్తే స్థానికంగా ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. టమాట ఎక్కువగా ఉత్పత్తి అయితే ఇక్కడే సాస్ తయారు చేసి విక్రయించవచ్చునని, పసుపు పండిస్తే స్థానికంగా పిండిగా మార్చి ఎగుమతి చేయవచ్చునని, స్థానికంగా అన్ని రకాల పంటలను రైతులు పండించేలా అవి ఇక్కడే ప్రాసెస్ అయి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడంతోపాటు స్థానికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. జిల్లాలోని నిరుద్యోగులకు 5 వేల మందికి ఉపాధి చూపేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నర్మాల వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు ప్రారంభంలోనే 130 మందికి ఉపాధి మరింత విస్తరించనున్న సంస్థ పారిశ్రామిక విజయగాథను ట్వీట్ చేసిన కేటీఆర్ ట్విట్టర్లో కేటీఆర్ ఆనందం తెలంగాణ గ్రామీణ ప్రాంతమైన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఒక పారిశ్రామిక విజయగాథను మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉందని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదలకు అపారమైన అవకాశాలున్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఒక ఆశాజనకమైందన్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ‘అగస్త్య ఫుడ్స్’ పేరిట ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎగుమతి నాణ్యత కలిగిన ‘సూపర్ ఫుడ్స్’ తయారు చేసే యూనిట్ను ఏర్పాటు చేశారు. 130 మందికి ఉపాధి కల్పిస్తూ అనేక దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్కు ధన్యవాదాలు అంటూ... కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వృద్ధాశ్రమంలో ఎంపీడీవో మృతి
రామడుగు: రామడుగు మండల పరిధి వెలిచాల మన స్పందన వృద్ధాశ్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీవో తీగల శంకర్ అనారోగ్యంతో మంగళవారం మృతిచెందినట్లు నిర్వాహకుడు మంచికట్ల శ్రీనివాస్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్లో ఎంపీడీవో పడిపోయి ఉండగా.. పోలీసులు ఆశ్రమం నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చుకున్నారు. శంకర్ స్వస్థలం హన్మకొండ జిల్లా. ఆయన మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించినట్లు శ్రీనివాస్ తెలిపారు. శంకర్ మృతదేహనికి రామడుగు ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంపీడీవోలు శ్రీనివాస్, దివ్యదర్శన్రావు, ఎంపీవో శ్రావణ్కుమార్ పలువురు నివాళులర్పించారు. ఎఫ్సీఐ కార్మికురాలు..జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని ఎఫ్సీఐలో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామానికి చెందిన పారునంది ప్రమీల(56) ఎఫ్సీఐలో స్వీపర్ విధులు నిర్వహిస్తోంది. మంగళవారం అకస్మాత్తుగా కిందపడిపోయింది. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమీల 25 ఏళ్లుగా ఎఫ్సీఐలో స్వీపర్గా పని చేస్తుందని, ఆమె మృతిపట్ల మేనేజర్ కిషన్ సంతాపం వ్యక్తం చేశారు. రైలుకింద పడి యువకుడి ఆత్మహత్యజమ్మికుంటరూరల్(హుజూరాబాద్): రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి రవి(29)గ్రామ సమీపంలోని పట్టాల వద్ద గుర్తు తెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రవి జమ్మికుంటలో బ్యాండ్మేళం పని, కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతడికి వివాహం కాలేదు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రవి మృతదేహాన్ని తల్లి మధునమ్మ, అన్న ప్రశాంత్ చూసి గుర్తుపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నటు రామగుండం రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. అఘోరి శ్రీనివాస్కు బెయిల్కరీంనగర్క్రైం: కొత్తపల్లి పోలీస్స్టేషన్లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో అఘోరి శ్రీనివాస్కు కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో పాటు ప్రతీ గురువారం కొత్తపల్లి పోలీస్స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా హైదరాబాద్లోని చంచల్గూడ జైలు నుంచి మంగళవారం సాయంత్రం వరకు కూడా విడుదల కాలేదని సమాచారం. -
నగరంలో కోతుల బీభత్సం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధన్గరివాడి పాఠశాలలో కోతుల భయంతో ఓ విద్యార్థి దూకి గాయపడిన ఘటన మరవకముందే, మంగళవారం నగరంలోని రజ్విచమాన్ ప్రాంతంలో ఓ కార్మికుడు తీవ్రగాయాలపాలయ్యాడు. కాలనీలో ఓ భవన నిర్మాణంలో భాగంగా పై అంతస్తులో పనిచేస్తుండగా, 20కి పైగా కోతులు ఒక్కసారిగా ఆ భవనంపైకి వచ్చాయి. కోతులు దాడికి ప్రయత్నించడంతో, భయంతో రామరాజు అనే కార్మికుడు భవనంపై నుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన రామరాజును, స్థానికులు వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కాగా రామరాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నగరంలో కోతులబెడద తీవ్రంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ముదిరాజ్ పౌరుల సమితి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా అనిల్కుమార్ సిరిసిల్లటౌన్: తెలంగాణ ముదిరాజ్ పౌరుల సమితి ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజన్నసిరిసిల్లకు చెందిన కర్నాల అనిల్కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ముదిరాజ్ పౌరుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకరబోయిన మహేశ్ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరవేణి రంజిత్ ముదిరాజ్లు నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్, నీలం మధు ముదిరాజ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పండుగ స్వామి, శ్రీధర్, రాకేశ్, నరేశ్, సాయి పాల్గొన్నారు. చెడు వ్యసనాలతోనే యువతలో హార్ట్ఎటాక్ కరీంనగర్టౌన్: ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఒత్తిడి కారణంగానే వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ఎటాక్లు పెరుగుతున్నాయని మెడికవర్ కార్డియాక్ విభాగం వైద్యులు అన్నారు. మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో గుండె వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జీవనశైలిలో మార్పుల కారణంగా 45 ఏళ్ల తర్వాత రావాల్సిన గుండె జబ్బులు 25 ఏళ్లలోపు యువతకు సైతం వస్తున్నాయన్నారు. ఛాతినొప్పి, గుండెదడ, ఆయాసం, చేయి, దవడ గుంజడం, లూజ్ మోషన్స్ వంటివి హార్ట్ఎటాక్ లక్షణాలన్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, ఫ్యామిలీ హిస్టరీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలుంటే సైలెంట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందన్నారు. కడుపులో మంట వస్తే గ్యాస్ అని భావించకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్కు హార్ట్ ఎటాక్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. షుగర్, బీపీని తగ్గించుకొని, చెడు అలవాట్లుతో పాటు కల్తీ ఆయిల్ మానేయాలన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని, రోజూ గంటపాటు వ్యాయామం చేసి ఒత్తిడిని తగ్గించుకుంటే హార్ట్ఎటాక్ను జయించవచ్చన్నారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వైద్యులు అనీశ్పబ్బ, వాసుదేవరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఉపేందర్రెడ్డి, నాగరాజు, విష్ణువర్ధన్రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ పాల్గొన్నారు. -
ఆలేరులో విషాదం
ఆలేరు: ఉన్న ఊరు, కన్నవారిని వదిలి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కార్మికుడి మృతి బాధిత కుటుంబంలో విషాదం నింపింది. గోదావరిఖని ప్రాంతానికి చెందిన సదానందం(48) ఉద్యోగ రీత్యా భార్య అఖిల, ఇద్దరు కుమారులు శ్రీరామ్, శ్రీనాథ్తో కలిసి ఆలేరులో స్థిరపడ్డాడు. మైత్రికాలనీలో నివాసం ఉంటున్నాడు. దాదాపు 25ఏళ్లుగా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. సదానందం కుమారులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కార్మిక యూనియన్లోనూ చురుకుగా వ్యవహరించే సదానందం మంగళవారం కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో మైత్రి కాలనీలోని ఆయన ఇంటి వద్ద విషాదం అలుముకుంది. ఆలేరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్యూటీ షిఫ్ట్ ఛేంజ్? సదానందం మంగళవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా, ఉదయం షిఫ్ట్కి మార్చుకున్నట్లు తెలిసింది. అయితే యూనియన్ సమావేశానికి హాజరుకావాలనే ఆలోచనతో ఉదయం షిఫ్ట్కు హాజరైనట్లు సమాచారం. -
35.96 కిలోల గంజాయి దహనం
జగిత్యాలరూరల్: జగిత్యాల జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో 36 కేసుల్లో నిందితుల నుంచి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని దహనం చేశారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సుమారు రూ.9 లక్షల విలువైన 35.96 కిలోల గంజాయిని దహనం చేయడం జరిగిందన్నారు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి దింపుతున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, మత్తు పదార్థాలు రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ సభ్యులు ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, డీఎస్పీలు రఘుచందర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు రవి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ లంచం
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ పద్ధతిలో లంచం తీసుకున్న సర్వేయర్ సునీల్ను అవినీతి నిరోధక శాఖ అధికా రులు పూర్తిఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఈ ఘ టన చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ విలేకరులకు వెల్లడించిన వివరాలిలు.. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చెరకు నాగార్జునరెడ్డి తన భూమి సర్వే కోసం సుమారు 8 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. గతనెలలో సర్వే పూర్తిచేసినా సర్వేయర్ నివేదిక ఇవ్వడంలేదు. రిపోర్టు ఇవ్వాలని కోరితే రూ.20వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రూ.6వేలు ఇస్తానన్నా వినలేదు. చివరకు రూ.10వేల కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన నాగార్జునరెడ్డి.. ఏసీబీ అధికారుల సూచనలమేరకు ఆ మొ త్తాన్ని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్రెడ్డికి ఫోన్పే చేశారు. ఆయన ద్వారా సర్వేయర్ ఫోన్ పే చేయించుకున్నాడు. పూర్తిఆధారాలతో వచ్చిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ జరి పారు. సర్వేయర్ సునీల్, ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 24గంటల్లోగా రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. ఫోన్పే ద్వారా డబ్బులు తీసుకున్న సర్వేయర్ ఆధారాలతోవచ్చి పట్టుకున్న ఏసీబీ అధికారులు -
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సిద్ధమవుతున్న మట్టి గణపతులుచవితి పండుగ వచ్చేస్తోంది. సంబరాలు తెచ్చేస్తోంది. మరో పక్షం రోజుల్లో గణనాథుడు వాడవాడన కొలువుదీరనున్నాడు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటుండగా.. ముందస్తు బుకింగ్లు కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ శివారు బొమ్మకల్ వద్ద మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నారు. ఎకో గణపతులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్న ప్రతిమ నుంచి పెద్దపెద్ద విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. రూ.2,500 నుంచి రూ.లక్షన్నర వరకు ధర పలికే విగ్రహాలు ఉన్నాయని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముందస్తు బుకింగ్లు చేసుకుంటున్నారని తయారీదారులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్న్యూస్రీల్ -
నూతన భవనంలోకి ‘సైన్స్వింగ్’
కరీంనగర్: కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల( సైన్స్వింగ్)లో నిర్మించిన నూతన భవనంలో తరగతులు ప్రారంభించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కళాశాలను సందర్శించారు. మరమ్మతు పనులను పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. శిఽథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షలు విద్యార్థులకు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు, అత్యవసర మరమ్మతుల కోసం వినియోగించాలని అన్నారు. నూతన భవనంలో తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన డోర్లు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రిన్సిపాల్ వెంకటరమణచారి ఉన్నారు. ‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్లో జిల్లాలోని అన్ని పాఠశాలలు పాల్గొనాలని కలెక్టర్ పమేలా సత్పతి సూ చించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బుధవారం బోధన, ఇంగ్లిష్ క్లబ్ అంశాలపై మండల విద్యాధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీరు తదితర వివరాలు స్వచ్ఛ హరిత విద్యాలయ యాప్లో నమోదు చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో కేంద్ర బృందం పరి శీలించి పాఠశాలలకు ర్యాంకు ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగుతో పాటు సబ్జెక్టుల్లో మరింతగా రాణించేందుకు ‘బుధవారం బోధన’ జిల్లావ్యాప్తంగా అమలు చేయాలన్నారు. సందేశాత్మక చిత్రాలు చూపిస్తూ రివ్యూలు రాయించాలని తెలిపారు. యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, స్వచ్ఛభారత్ సమన్వయకర్త వేణు ప్రసాద్, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. వెంటనే వినియోగంలోకి తేవాలి కలెక్టర్ పమేలా సత్పతి -
ఆసక్తి అంతంతే!
● అంబేడ్కర్ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల వేలం ● కొన్నింటికి డిమాండ్.. మరికొన్నింటికి నిల్ ● మరోసారి వేలం నిర్వహించే అవకాశం?కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ షాప్లకు వేలం నిర్వహించారు. కొన్ని షాప్లకు డిమాండ్ ఏర్పడగా, మరికొన్నింటికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి వేలం చేపట్టే పరిస్థితి నెలకొంది. నగరంలోని కళాభారతిలో మంగళవారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆధ్వర్యంలో కాంప్లెక్స్లోని 22షాపులు, బాంక్వెట్హాల్, డార్మెటరీ సూట్రూంలకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు ఒకటి (షాప్ నంబర్ 16), ఎస్సీలకు మూడు (6,17,22), దివ్యాంగులకు ఒకటి (15), నాయీబ్రాహ్మణుల కో ఆపరేటివ్ సొసైటీకి ఒకటి(10), స్వయం సహాయక సంఘాలకు రెండు (9,20) కేటాయించారు. మిగిలిన 1,2,3,4,5,7,8,11,12, 13,14,18,19,21 నంబర్షాప్లను జనరల్ కేటగి రీలో ఉంచారు. రూ.10 వేలు డీడీ చెల్లించిన వ్యాపారులు ఈ వేలం ప్రక్రియలో పాల్గొన్నారు. రిజర్వేషన్ షాప్లకు డిమాండ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కింద కేటాయించిన షాప్లకే బహిరంగ వేలంలో డిమాండ్ ఏర్పడింది. ఎస్సీలకు కేటాయించిన షాప్ నంబర్ 6కు ప్రతిపాదిత అద్దె రూ.11,800 కాగా వేలంలో రూ.20 వేలు పలికింది. షాప్నంబర్ 17కు అద్దె రూ.8,300 కాగా వేలంలో రూ.12,500, షాప్ 22కు రూ.9,237 కాగా, వేలంలో రూ.13,500కు దక్కించుకున్నారు. ఎస్టీ కోటాలో షాప్ నంబర్ 16కు రూ.8,300 అద్దె కాగా, రూ.12 వేలకు వేలం పాడారు. దివ్యాంగుల కోటాలో షాప్ నంబర్ 15కు రూ.7,700 కాగా రూ.11,500 వేలకు వేలంపాట సాగింది. ఎనిమిది దుకాణాలకు టెండర్లు నిల్ 22 షాప్ల్లో ఎనిమిది షాప్లకు వేలంలో ఎవరూ ముందుకు రాలేదు. షాప్ నంబర్ 1,2,11,12,13, 14,18,19కు, రెండోఅంతస్తులోని బాంక్వెట్ హాల్, డార్మెటరీ సూట్ రూమ్లకు ఎవరూ వేలం పాడలేదు. దీంతో ఆ షాప్లకు మరోసారి వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వయంసహాయక సంఘాలకు ప్రతిపాదిత అద్దెకే షాప్లు దక్కాయి. అనుమతి ఇవ్వొద్దని అభ్యంతరం వేలం ప్రక్రియలో పోటీదారులు, అధికారుల నడుమ నిబంధనలపై స్వల్ప వాదన చోటుచేసుకుంది. షాప్ నంబర్ 8కి ఒక్కరే ఉండడంతో మూల జైపాల్ అనే వ్యక్తికి అప్పగించినట్లు అధికారులు ప్రకటించారు. కొద్దిసేపటికే మరో వ్యక్తి ఆ నంబర్కు పోటీరావడంతో అధికారులు అనుమతించారు. దీనిపై జైపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుకు తనకు కేటాయిస్తున్నట్లు చెప్పి, మళ్లీ మరొకిరికి అవకాశం ఎలా ఇస్తారంటూ వాదనకు దిగారు. ఏ షాప్నకు డీడీ కడుతారో అదే షాప్నకు వేలం పాడాలని, ఒకటి చెల్లించి, అన్నింటికి ఎలా వేలం పాడుతారంటూ పలువురు అభ్యంతరం చెప్పారు. నిబంధనల మేరకే అనుమతిస్తున్నామని అధికారులు సర్ధి చెప్పారు. నిబంధనల ప్రకారం నగరపాలకసంస్థ నిబంధనల మేరకు రిజర్వేషన్ కేటగిరీ వారిగా బహిరంగ వేలం నిర్వహించినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. వేలంలో షాప్లు పొందిన వ్యాపారుల కు మూడేళ్ల కాలపరిమితితో అద్దె ప్రాతిపదికన కేటా యించామన్నారు. డిపాజిట్ కింద ఒక్కోషాప్నకు రూ.2లక్షలు చెల్లించాలన్నారు. వేలంలో చెల్లించిన రూ.10 వేలు డీడీని మినహాయించి రూ.1.90 లక్షలు మూడు రోజుల్లో డిపాజిట్ చేయాలన్నారు. మూడు నెలలు అడ్వాన్స్ చెల్లించాలన్నారు. ఏడు రోజుల్లో షాప్ల ఒప్పందం చేసుకోవాలన్నారు. డిపాజిట్లో ఎస్సీ ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంటుందన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాధర్ మొహియుద్దీన్, ఆర్వో శివప్రసాద్, ఆర్ఐలు కిష్టయ్య, కలిముల్లాఖాన్ పాల్గొన్నారు. -
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలి
కరీంనగర్ కార్పొరేషన్: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం ఇచ్చేలా చూడాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న కోరారు. మహిళా కాంగ్రెస్ సమావేశం డీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డవారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలన్నారు. గ్రామ, మండల, బ్లాక్ కమిటీలు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లోగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులపై విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నా రు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య,రాష్ట్ర కార్యదర్శి వంగల కల్యాణి పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రి సందర్శనహుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలో అసంక్రమిక వ్యాధులకు అందుతున్న వైద్య సేవలను గురించి సిబ్బందితో చర్చించి, పలు సూచనలు చేశారు. జిల్లా క్వాలిటీ మేనేజర్ సాగర్ ఆధ్వర్యంలో ఫైర్సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించి, విపత్తుల సమయంలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ ఏరి యా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. గడువు ముగిసిన వస్తువులు విక్రయం కరీంనగర్ అర్బన్: వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త. కొనుగోలు చేసే వస్తువులకు గడువుందో లేదో ఒకసారి చూడండి మరీ. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీల్లో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నారని స్పష్టమవడం ఆందోళనకు తావిస్తోంది. నగరంలోని కమాన్చౌరస్తాలో గల ఓ మార్ట్లో గడువు ముగిసిన వస్తువులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో మంగళవా రం ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ అంకిత్రెడ్డి తనిఖీ చేశా రు. పలు వస్తువులు గడువు ముగిసినవిగా గుర్తించి ధ్వంసం చేయించారు. చాలా రకాల వస్తువులు మరో 2నుంచి 7రోజుల వ్యవధిలో గడువు ముగిసేవిగా గుర్తించి, యాజమాన్యానికి నోటీస్ అందజేసినట్లు అంకిత్ తెలిపారు. బీఎల్వోల గౌరవ వేతనం రెట్టింపుకరీంనగర్ అర్బన్: ఎన్నికలంటే గుర్తొచ్చేది పోలింగ్ కేంద్రం, పోలింగ్ అధికారులు. ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్వోల పాత్ర కీలకం. ఎక్కువగా అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు, మహిళా సంఘాల సీఎలు బీఎల్వో పాత్రను నిర్వహిస్తున్నారు. యేటా ఓటర్ల జాబితా తయారీ కత్తిమీద సామే. వీరి సేవలను గుర్తించిన ఎన్నికల సంఘం గౌరవ వేతనాన్ని పెంచింది. ఇప్పటివరకు ఏడాదికి రూ.6వేలను గౌరవ వేతనంగా చెల్లించేవారు. దాన్ని తాజాగా రూ.12వేలకు పెంచారు. సూపర్వైజర్లకు రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచారు. ఓటర్ల జాబితా సవరణకు అందించే పారితోషికాన్ని రూ.వెయ్యి నుంచి రూ.2 వేల కు పెంచాలని నిర్ణయించారు. ఎలక్టోరల్ అధి కారులు, సహాయ ఎలక్టోరల్ అధికారులకు కూడా గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులతో జిల్లాలో 1,342మందికి లబ్ధి కలగనుంది. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపురి కాలనీ పరిధిలోని అల్కాపురి, శ్మశానవాటిక, గిద్దె పెరుమాండ్ల ఆలయం, కోతిరాంపూర్, విజేత అపార్ట్మెంట్, 11 కేవీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, ప్రగతినగర్, టెలిఫోన్ క్వార్ట్టర్లు, శివనగర్, మార్కండేయకాలనీ ప్రాంతాలతో పాటు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్కాలనీ, ప్రభుత్వ మహిళా కళాశాల, కశ్మీర్గడ్డ, శాలిమార్ ఫంక్షన్ హాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
సహనాన్ని పరీక్షించొద్దు
● పెండింగ్ పనులు పూర్తి చేయాలి ● ఎమ్మెల్యే గంగుల కమలాకర్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చాలని, తమ ఓపికను పరీక్షించొద్దని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులను హెచ్చరించారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ని మంగళవారం ఆయన చాంబర్లో కలిసి నగరంలో పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయి ఏడాదిన్నర దాటిందన్నారు. సీఎంఏ అసంపూర్తి పనులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తాము ఆందోళనకు దిగే పరిస్థితి తీసుకురావద్దన్నారు. సర్కస్గ్రౌండ్లో చిల్డ్రన్ పార్క్ పక్కన సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టడం సరికాదని, మరో స్థలం చూడాలన్నారు. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ వినియోగంలోకి రావడం సాధ్యం కాదని, ఆధునీకరణ పేరిట నిధులు వెచ్చించడంపై పునరాలోచించాలన్నారు. సీతారాంపూర్, ఆరెపల్లిల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. రేకుర్తిలో ఖాళీ స్థలాలకు ఇంటినంబర్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్పందించిన కమిషనర్ సర్కస్గ్రౌండ్లో సబ్స్టేషన్ పనులు నిలిపివేశామన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి, వాల రమణారావు, బండారి వేణు, ఐలేందర్ యాదవ్, కుర్ర తిరుపతి, తోట రాములు పాల్గొన్నారు. -
‘నిఘా’ నిరంతరం
● సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుల శ్రీకారం ● పలు గ్రామాల్లో 20కి పైగా బిగింపువీణవంక(హుజూరాబాద్): గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా నిరంతరం కొనసాగనుంది. గతంలో ఇంటర్నెట్ ద్వారా పని చేసే కెమెరాల్లో పిడుగు, వర్షం, గాలివీచిన సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తేవి. మరమ్మతు చేయడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు సోలార్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ సీసీ కెమెరాలు నిరంతరం పని చేయనున్నాయి. గతంలో ఎస్సైగా పని చేసిన శేఖర్రెడ్డి మండల పరిధిలో సుమారు 90కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల విధుల్లో చేరిన రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై తిరుపతి సోలార్ కెమెరాలపై దృష్టిపెట్టారు. ఠాణా నుంచే నిఘా వీణవంక మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉండగా, 52వేల జనాభా ఉంది. గతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో నేరాలను పసిగట్టడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గ్రామాల్లో నేరాల నియంత్రణతోపాటు నేరస్తులను గుర్తించేందుకు సోలార్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై తిరుపతి విస్తృతంగా అవగాహన కల్పించారు. దాతల సాయంతో మండలవ్యాప్తంగా 20కి పైగా ఏర్పాటు చేశారు. ఒక్కో కెమెరాకు రూ.15వేలు వెచ్చించారు. ఇందులో సిమ్ కార్డును ఏడాది పాటు రిచార్జ్ చేశారు. వీటిని పోలీస్స్టేషన్కు అనుసందానం చేశారు. మనిషి కదలిక, మాటలు రికార్డు అవుతుండడంతో ఆకతాయిలు జంకుతున్నారు. నెలలోపు మరిన్ని ఏర్పాటు చేస్తామని ఎస్సై తెలిపారు. 50మందికి పైగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలకు చెక్? గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనుంది. నేరాల నియంత్రణ, నిందితులను త్వరగా పట్టుకోవచ్చు. చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణ జరుగుతుంది. కెమెరాలు ఏర్పాటు చేస్తే ట్రాక్టర్లను గుర్తించి చర్యలు తీసుకునే వీలుంటుంది.దాతలు ముందుకు రావాలి గ్రామాల్లో ఎలాంటి ఘటన జరిగినా సీసీ కెమెరాలతో గుర్తించవచ్చు. సీపీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు దాతల సాయంతో 20 సోలార్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకురావాలి. – తిరుపతి, ఎస్సై, వీణవంక -
ఎస్జీఎఫ్ క్రీడలకు ఏర్పాట్లు
● 27లోపు మండల, సెప్టెంబర్ 15లోపు జిల్లాస్థాయి పోటీలు ● జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీకరీంనగర్స్పోర్ట్స్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి 27వ తేదీ లోపు మండల, సెప్టెంబర్ 15వ తేదీ లోపు జిల్లాస్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల, క్రీడా సమాఖ్య వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్జీఎఫ్ క్రీడల నిర్వహణలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ గతేడాది 48క్రీడాంశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. 6,300మంది విద్యార్థులు పాల్గొన్నారని, వివిధ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 918మంది విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఎం. స్వదేశ్కుమార్, వ్యాయామ విద్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శంకరయ్య, శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వర్షంలోనూ.. అదే వరుస
చిగురుమామిడి/గంగాధర / హుజూరా బాద్రూరల్: ఓ వైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా యూరియా కోసం రైతులు వరుసలో నిల్చున్నారు. గొడుగులు పట్టుకుని గంటల తరబడి ఎదురుచూశారు. చిగురుమామిడి, ఇందుర్తి, బొమ్మనపల్లి గ్రామాల్లో యూరియా కోసం మంగళవారం ఉదయమే రైతులు, మహిళలు క్యూలో నిలబడ్డారు. ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు ఇవ్వగా.. సరిపోవడంలేదని పలువురు నిరసన వ్యక్తం చేశారు. గంగాధర మండలం కురిక్యాల సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో మంగళవారం వేకువజామున్నే రైతులు తరలివచ్చారు. ఎకరాకు ఒకటే బస్తా ఇవ్వడంతో సరిపోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియాకోసం రైతులు బారులు తీరారు. సరిపడా స్టాక్ లేకపోవడంతో కొంతమంది నిరాశతో వెళ్లిపోయారు. -
వాన.. వరద.. బురద
అధ్వానంగా అశోక్నగర్ రోడ్డునగరంలోని అశోక్నగర్ రోడ్డు అధ్వానంగా మారింది. బొమ్మ వెంకన్న భవనం నుంచి పాత బైపాస్ వైపు వెళ్లే లింక్ రోడ్డు నరకం చూపుతోంది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్డు జలమయమైంది. వరదనీళ్లు రోడ్డుపై నిలిచి నడవడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. గతంలో ఈ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదించినా, అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో మట్టిరోడ్డు ప్రజలకు చుక్కలు చూపుతోంది. వర్షం పడిన ప్రతిసారి ఈ రోడ్డుపై వరదనీళ్లు నిలుస్తుండడం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. – కరీంనగర్ కార్పొరేషన్ -
ప్రజావాణికి వినతుల వెల్లువ
● ప్రజావాణిలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య ● పరిష్కరించాలని వేడుకోలుప్రజావాణికి వచ్చిన మొత్తం అర్జీలు: 231 ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్: 49 కరీంనగర్రూరల్ తహసీల్దార్: 15 మానకొండూరు తహసీల్దార్: 13 రామడుగు తహసీల్దార్: 12, వీణవంక తహసీల్దార్: 12 ఎస్ఈ, ఎన్పీడీసీఎల్: 9, వారధి సొసైటీ: 4 -
అది చిరుత కాదు.. హైనా
ధర్మపురి: ధర్మపురిలో మూడు రోజులుగా చిరుత సంచరిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది చిరుత కాదని, హైనా అని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనాథ్ తెలిపారు. పట్టణంలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి పరిసర ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని కొందరు జిల్లా అధికారులకు సమాచారం అందించారని, దీంతో ఫారెస్టు సిబ్బందితో సమీప పొలాలు, చెట్లపొదల మాటున గాలింపు చేపట్టామని, ఓ జంతువు పాదముద్ర లభించగా.. అది చిరుత పాదముద్రలని భావించి హైదరాబాద్ ఫోరెన్సికు పంపించామని తెలిపారు. అక్కడ చిరుత పా దముద్రలు కావని, హైనా అడుగులుగా గర్తించారని తెలిపారు. హైనాతో మనుషులకు ఎలాంటి ప్రాణనష్టమూ జరగదని, మేకలు, గొర్రెల కోసం వస్తుంటుందని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సదాశివుడు, సిబ్బంది తదితరులున్నారు. కాపర్వైర్ దొంగల అరెస్టు ఎల్కతుర్తి: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమారస్వామి, బండి సతీశ్ కొంతకాలంగా ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం ప్రాంతాల్లో రాత్రివేళల్లో 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్ను అపహరించారు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తన సిబ్బందితో సోమవారం భీమదేవరపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. వారి వద్ద కాపర్వైరు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టేందుకు ఉపయోగించే వస్తువులు ఉండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కాపర్ వైర్ను ముల్కనూర్ గ్రామానికి చెందిన రుద్రాక్ష తిరుపతికి అమ్మినట్లు విచారణలో తేలింది. వెంటనే తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితులపై 2012 నుంచి 53 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, నిందితుల నుంచి రూ.2.50లక్షల విలువ గల 250 కిలోల కాపర్ వైర్, మోటర్ సైకిల్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంతో రూ.1.67కోట్ల నష్టం
మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గో దాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో భారీ నష్టం సంభవించింది. ఈ గోదాంలో సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను నిల్వ ఉంచిన సంగతి తెలిసిందే. ఆ శాఖకు చెందిన రూ.97లక్షల విలువైన 9,07, 527 పాత గన్నీ సంచులు దగ్ధమయ్యాయి. అలాగే మంటల ధాటికి 2వేల టన్నుల గోదాం ధ్వంసమైంది. దీనివల్ల రూ.70వేల నష్టం వాటిల్లినట్లు మార్కె ట్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఇరు శాఖలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం పది గంటలకు చెలరేగిన మంటలు.. సోమవారం రాత్రి వరకు కూడా అదుపులోకి రాకపోవడం గమనార్హం. టెండర్లో జాప్యం..భారీ నష్టం ● సివిల్ సప్లయ్ శాఖ గన్నీ సంచులను 2018లో ఈ గోదాంలో నిల్వ చేసింది. ఇందుకు గాను మార్కెటింగ్ శాఖకు ప్రతినెలా రూ.38వేలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ● ఆ సంచులను ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా టెండర్ ద్వారా విక్రయించాలి. ఈ విషయంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ● తద్వారా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రమాదంలో సంచులన్నీ కాలి బూడిదై భారీ నష్టానికి దారి తీసింది. భద్రతపై మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం ● గోదాంల భద్రత విషయంలో మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● మార్కెట్ కార్యాలయానికి దూరంగా ఉన్న ఈ గోదాంల ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో ప్రతిరోజు వాటి వద్ద బయటి వ్యక్తులు పేకా ట ఆడడం, మద్యం సేవించడం చేస్తున్నారు. ● గోదాంలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్కు అవకాశముండదు. ● అక్కడ పేకాట, మద్యం సేవించే వ్యక్తుల్లో ఎవరైనా ఈ ప్రమాదం చోటు చేసుకునే చర్యలకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రమిస్తున్న ఐదు శాఖల అధికారులు ● గోదాంలో చెలరేగిన మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి పోలీస్, రెవెన్యూ, సివిల్, మార్కెటింగ్, అగ్నిమాపక శాఖల అధికారులు సోమవారం ఉదయం నుంచి అక్కడే ఉండి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ● ఆ గోదాం పక్కనే మరో మూడు గోదాంలు ఉండడమే కాకుండా నివాస గృహాలు ఉన్నాయి. ● మంటలు ఎగిసిపడినా.. వాటికి వ్యాపించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ● గోదాంకు మూడు వైపులా ఉన్న గోడకు పలు చోట్ల పెద్ద రంధ్రాలు చేశారు. అందులో నుంచి పెద్ద సంఖ్యలో సంచులను బయటవేసి మంటల ఉధృతిని కొంతమేర తగ్గించారు. ● రాత్రివేళలో కూడా మంటలను ఆర్పేందుకు అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం వరకు పూర్తిగా ఆదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రెండోరోజూ అదుపులోకి రాని మంటలు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్పరిశీలించిన కలెక్టర్ అగ్ని ప్రమాదం జరిగిన గోదాంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నా రు. సాధ్యమైనంత తొందరంగా మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించాలని అధికా రులకు సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, డీఎస్పీ రాములు, అర్డీఓ శ్రీనివా స్, సివిల్ సప్లయ్ శాఖ డీఎం జితేంద్రప్రసాద్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు, సీఐ అనిల్కుమార్, ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు. -
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని ట్రినిటి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎడ్యూనెట్ ఫౌండేషన్ ద్వారా సాప్ కార్యక్రమాన్ని ఎడ్యునెట్ ప్రాజెక్టు మేనేజరు అఫ్సర్ పాషా, ప్రోగ్రాం మేనేజర్ దేవీసేన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎడ్యునెట్ ఫౌండేషన్ ద్వారా అందించే సాప్ కోర్స్ను ఎంబీఏ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు గ్లోబల్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ట్రినిటి చైర్మెన్ దాసరి ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, ఏవో రాజశేఖర్రెడ్డి, హెచ్వోడీ ప్రవీణ్కుమార్, సంతోషి, రజితరెడ్డి, ఇలియాస్అలీ, అజారుద్దీన్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం గూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. గూడెంకు చెందిన పిట్ల దేవయ్య(60) సోమవారం ఉదయం ఇంట్లో మృతిచెంది ఉన్నాడు. దేవయ్య ముఖం, శరీరంపై గాయాలు ఉన్నాయి. దేవయ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోదరుడు లస్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లస్మయ్య ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దేవయ్య ఆయన కుమారుడు చందు తరచూ గొడవ పడేవారని, అర ఎకరం భూమి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తిందని తెలిపారు. ఆ కోణంలో చందును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. జ్వరంతో యువకుడు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్ శివ(23) జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరా లు. రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకా వత్ జయరాం–సోబి దంపతుల కుమారుడు శివ చిన్నతనం నుంచి మూర్ఛవ్యాధితో బాధపడుతుండే వాడు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శివకు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీల వద్ద వైద్యం అందించారు. జ్వరం తగ్గకపోగా.. పరిస్థితి విషమంగా మారడంతో మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. డిష్ రిపేర్ చేస్తూ.. కింద పడి వ్యక్తి..సారంగాపూర్: మండలంలోని పెంబట్ల గ్రా మంలో ఓ ఇంటిపై డిష్ రిపేర్ చేస్తూ.. కిందపడి పల్లికొండ మహేశ్ (40) మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం.. జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన మహేశ్ పెంబట్లలోని చొప్పరి రాజేందర్ ఇంట్లో డిష్ రాకపోవడంతో వెర్ను సరిచేసేందుకు ఇంటిపైకి ఎక్కాడు. మహేశ్నిలబడి ఉన్న సజ్జ విరిగి కింద పడిపోయాడు. తల బండరాయిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో జగిత్యా ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన బంగారం బ్యాగుజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట–పొరండ్ల శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తల వద్దనున్న బంగారం బ్యాగు పడిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాయికల్ మండలం వీరాపూర్కు చెందిన స్వామిరెడ్డి తన భార్యతో కలిసి సోమవారం జగిత్యాల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని వెళ్తుండగా వారి వద్దనున్న బంగారం బ్యాగు హన్మాజీపేట–పొరండ్ల మధ్యలో పడిపోయింది. పొరండ్లకు వెళ్లేసరికి బంగారు బ్యాగుతోపాటు, సెల్ఫోన్ కన్పించకపోవడంతో రోడ్డు వెంట పరిశీలించుకుంటూ వచ్చినా బ్యాగు దొరకలేదు. బాధితులు రూరల్ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తున్నారు. -
ఆ తండ్రికదే చివరి వేడుక
కరీంనగర్రూరల్: ఆ తండ్రికదే చివరి వేడుక అయింది.. కొడుకు పుట్టినరోజునే గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీపండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహం కోసం సింగాపూర్ నుంచి మూడు రోజులక్రితమే వచ్చి అనూహ్యరీతిలో మృత్యువాత పడడం గ్రామస్తులను కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన దావు మధుకర్రెడ్డి(46) ఉపాధి నిమిత్తం సింగాపూర్ వెళ్లాడు. మూడురోజులక్రితం గ్రామానికి వచ్చిన ఆయన శనివారం కుటుంబసభ్యులతో కలిసి రాఖీపండుగ జరుపుకున్నాడు. ఆదివారం కొడుకు సాత్విక్రెడ్డి పుట్టినరోజు వేడుకల అనంతరం రాత్రి విందులో పాల్గొన్న మధుకర్రెడ్డికి ఆకస్మికంగా గుండెపోటురావడంతో కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాఖీ పండుగ, కొడుకు పుట్టినరోజు, కుటుంబసభ్యుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సింగాపూర్ నుంచి వచ్చిన మధుకర్రెడ్డి మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సింగాపూర్ నుంచి రాకపోయినా బతికేవాడంటూ విలపించారు. మృతుడికి భార్య స్రవంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు పుట్టినరోజున గుండెపోటుతో మృతి మూడురోజుల క్రితం సింగాపూర్ నుంచి రాక -
ఊరట...ఉపాధి
● స్థానికంగానే మిర్చినారు పెంపకం ● నాడు గుంటూరు.. నేడు ఉప్పట్ల ● వంద ఎకరాలకు సరిపడా సాగు ● అన్నదాతలకు తప్పిన రవాణా భారం ● పదిమంది కూలీలకు ఉపాధి అవకాశం మంథనిరూరల్: ఒకరైతు ఆలోచన అనేకమంది అన్నదాతలకు ఊరటనిస్తోంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి నారు తీసుకొచ్చి పంట సాగు చేసేవారికి ఎంతోప్రయోజనం కలిగిస్తోంది. మరికొందరు కూలీలకూ ఊపాధి చూపిస్తోంది. ఒకప్పుడు గుంటూరు వెళ్లి మిర్చినారు తీసుకువచ్చే రైతులకు ఇప్పడు తమ స్వగ్రామంలోనే నారు పెంచుకునే అవకాశం కల్పించాడో రైతు. ఉప్పట్ల గ్రామానికి చెందిన రైతు పోగుల తిరుపతి ఆరేళ్లుగా మిర్చినారు సాగు చేస్తూ రైతులపై భారం తగ్గించేలా చేశాడు. గ్రామ శివారులోని కొంత భూమిని కౌలుకు తీసుకుని డ్రిప్ పద్ధతిన నారు సాగు చేస్తున్నాడు. ఒకప్పుడు గుంటూరు వెళ్లి.. ఉప్పట్ల గ్రామంలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తుంటారు. ఇందుకోసం రైతులు ఏపీలోని గుంటూరుకు వెళ్లి ఆండ్రాడ్, ఎండ్పై లాంటి రకాల నారును తీసుకువచ్చి ఇక్కడ సాగు చేసేవారు. ప్రస్తుతం గ్రామంలోనే మిర్చినారు సాగు చేసుకునే అవకాశం లభించడంతో ఉప్పట్ల, గుంజపడుగు, విలోచవరం, పోతారంతోపాటు సమీప గ్రామాల మిర్చి రైతులకు ఊరట లభించింది. తగ్గిన భారం.. నాణ్యమైన రకం మిర్చిసాగు చేసే రైతులు గుంటూరు వెళ్లి నారు తీసుకురావడం తలకు మించిన భారమయ్యేది. ఉప్పట్లలోనే రైతులు కలిసి మిర్చినారు సాగు చేసుకోవడంతో అదనపు భారం తగ్గుతోంది. నాణ్యమైన రకాన్ని ఎంచుకునే అవకాశం లభించింది. గుంటూరు నుంచి తీసుకువచ్చే నారు ఎలాంటిదో తెలియక రైతులు అనేకసార్లు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. రైతుకు ఇష్టమైన విత్తనాలను.. మిర్చి సాగుచేసే రైతులు తమకు ఇష్టమైన విత్తనాలను తీసుకువచ్చి ఇస్తే వాటిని అలికి నారు అయ్యే వరకు పెంచుతాడు. ఇందుకు ప్యాకెట్కు రూ.300 నుంచి రూ.400 వరకు చార్జీ తీసుకుంటాడు. సుమారు 45 నుంచి 50రోజుల వరకు మిర్చినారు నాటే స్థాయికి చేరుతుంది. ఇలా విత్తనాలను అలికి నారును ఇస్తుండటంతో స్థానిక రైతులకు ఉపశమనం లభించినట్లయింది, ఆరేళ్లుగా నారుపెంచుతున్న రైతులకు ఇష్టమైన వంగడాలు లేకపోవడంతో వారే విత్తనాలు తీసుకవస్తే అలికి నారు రెడీ చేసి ఇస్తా. అందుకయ్యే కూలీల ఖర్చులు తీసుకుంటా. ఉప్పట్లతో పాటు ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికే వచ్చి విత్తనాలు ఇచ్చి వెళ్తుంటారు. నాతో పాటు మరో పది మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. – పోగుల తిరుపతి, రైతు, ఉప్పట్ల ట్రాన్స్పోర్టు ఖర్చులు తగ్గాయి మిర్చినారు కోసం ఏటా గుంటూరు వెళ్లే వాళ్లం. ఇందుకోసం మూడు, నాలుగు రోజుల సమయం పట్టేది. ఆ నారు నాణ్యత కూడా తెలిసేదికాదు. దిగుబడిపై ఆశలు ఉండేవికావు. తిరుపతి ఆలోచనతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, సమయం మిగులుతోంది. నాలుగు ఎకరాలకు సరిపడా మిర్చినారు సాగు చేయిస్తున్న. – ముచ్చకుర్తి శేఖర్, రైతు, గుంజపడుగు -
రెండు ఆటోలు ఢీకొని విద్యార్థులకు గాయాలు
జగిత్యాలక్రైం/సారంగాపూర్: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం అర్పపల్లి శివారుల్లో ఓ ప్రైవేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు నిత్యం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆటోలో వెళ్లి వస్తుంటారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్తుండగా గుల్లపేట, అర్పపల్లి శివారులో ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొంది. ఈ ఘటనలో గుల్లపేటకు చెందిన గంగాధర సిద్దార్థ, పాలెపు శివానీ చేతులు విరిగాయి. వీరితోపాటు గాయపడిన విద్యార్థులను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆటో డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీత చికిత్స పొందుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. -
కాజీపేట – బల్హార్ష రైలుకు ఆదరణ కరువు
రామగుండం: కాజీపేట – బల్హర్ష మధ్య నడిచే బల్హర్ష ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి ప్రారంభమవుతోంది. వేకువజామున గమ్యస్థానం చేరుకుంటోంది. దీంతో ప్రయాణికులు లేక బోగీలు బోసిపోయి కనినిపస్తున్నాయి. కాజీపేటలో రాత్రి 10.50 గంలకు ప్రారంభమైతే.. ఉప్పల్కు రాత్రి 11.09 గంటలకు, జమ్మికుంటకు రాత్రి 11.18 గంటలకు, ఓదెలకు రాత్రి గం.11.32 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.41గంటలకు, రాఘవాపురానికి రాత్రి 11.47 గంటలకు, రామగుండానికి రాత్రి 11.54గంటలకు, బల్హర్షకు వేకువజామున 3.10గంటలకు చేరుకుంటోంది. తిరుగు ప్రయాణంలో బల్హార్షలో వేకువజామున 3.50గంటలకు ప్రారంభమై రామగుండానికి ఉదయం 5.47గంటలకు, పెద్దపల్లికి ఉదయం 6.15 గంటలకు, ఓదెలకు ఉదయం 6.34లకు, జమ్మికుంటకు ఉదయం 7.20గంటలకు కాజీపేటకు ఉదయం 8.50 గంటలకు చేరుకుంటోంది. దీనికి అర్ధగంట ముందే భాగ్యనగర్ నడవడంతో హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారంతా అందులోనే వెళ్తున్నారు. దీంతో బల్హర్ష రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండడంలేదు. మరోవైపు.. అర్ధరాత్రివేళ రాకపోకలు సాగించే ఈ రైలులో ప్రయాణించే కొద్దిమంది మహిళా ప్రయాణికులకు కూడా భద్రత కరువైంది. వారిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. రాత్రివేళలోనే ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం వేకువజామున గమ్యస్థానం చేరిక పదిమంది కూడా ప్రయాణించని వైనం తిరుగు ప్రయాణంలోనూ స్పందన కరువు రాకపోకల సమయాలు మార్చాలని డిమాండ్ సికింద్రాబాద్ వరకు పొడిగించాలని విన్నపాలు -
బీసీ గర్జన సభ ఏర్పాట్లు పరిశీలన
కరీంనగర్కల్చరల్: కరీంనగర్లోని జోతిబా పూలే గ్రాండ్లో ఈ నెల 14న నిర్వహించే బీసీ గర్జన సభ ఏర్పాట్లను సోమవారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పరిశీలించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు హరిశంకర్ తదితరులున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో సోలార్ సేవలు గర్వకారణం చొప్పదండి: రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సోలార్ విద్యుత్ సేవలు చొప్పదండి పీఏసీఎస్ ద్వారా ప్రారంభమవుతున్నాయని న్యాప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. చొప్పదండి శివారులోని పీఏసీఎస్ భూమిలో సోమవారం సోలార్ప్లాంటు భూమిపూజ కార్యక్రమానికి హాజరై పలువురికి చెక్కులు అందించారు. చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తొలిసారి సోలార్ ప్లాంటు ప్రారంభించడం గర్వకారణమన్నారు. ఇప్పటికే పీఏసీఎస్ జనరిక్ మందుల దుకాణం ప్రారంభించి ఖ్యాతిని మూటగట్టుకుందన్నారు. సంఘాన్ని ముందుండి నడిపిస్తున్న వెల్మ మల్లారెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. వైస్ చైర్మన్ ముద్దం మహేశ్గౌడ్, సీఈవో కళ్ళెం తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు గుర్రం భూమారెడ్డి, వల్లాల కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు ● ఏసీపీ వెంకటస్వామి గంగాధర(చొప్పదండి): మండలంలోని మధురానగర్ చౌరస్తాలో సోమవారం వేకువజామున కరీంనగర్ రూరల్ ఇన్చార్జి ఏసీపీ ఎన్.వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 91 ద్విచక్రవాహనాలు, ఆటో, కారు, ట్రాక్టర్ను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంటలోపు 1930 నంబర్కు ఫిర్యాదు చేస్తే దొంగిలించబడిన సొమ్మును ఫ్రీజ్ చేయించవచ్చన్నారు. మాదకద్రవ్యాల అమ్మకం, రవాణా, వినియోగం చట్టపరంగా నేరమని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై సమాచారం ఉంటే డయల్ 100, లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. షీ టీం సీఐ శ్రీలత సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీఐలు ప్రదీప్కుమార్, బి.సదన్కుమార్, కోటేశ్వర్రావు, కె.సంజీవ్, ఎస్సైలు వంశీకృష్ణ, నరేందర్రెడ్డి, కె.రాజు, సాయికృష్ణ, సయ్యద్అన్వర్, పి.లక్ష్మారెడ్డి, నరేశ్, యాంటీ నార్కొటిక్ బ్యూరో పుల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కొండన్నపల్లి శివారులోని సహస్రలింగేశ్వర ఆలయ పరిసరాల్లో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మారుతీనగర్, అశోక్నగర్, కాపువాడ, అహ్మద్పుర, ఓల్డ్ బజార్, మేదరివాడ, బొమ్మకల్ రోడ్ ప్రాంతాలు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, అంజనాద్రి దేవాలయం, ధోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్ క్వార్టర్లు, ఏఓస్ పార్కు కాలనీ, జెడ్పీ క్వార్టర్లు, భగత్నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. -
మానేరు రివర్ఫ్రంట్ పూర్తిచేస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో మిగిలిపోయిన పనులతో పాటు, మానేరు రివర్ ఫ్రంట్ను పూర్తి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. నగరంలో రూ.4.79 కోట్ల నిధులతో నిర్మించనున్న సుడా వాణిజ్య భవన సముదాయం, ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణకు సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే శాతవాహన యూనివర్సిటీని నెలకొల్పామని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో త్వరలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తెలిపారు. త్వరగా పూర్తి చేయాలి కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు. సుడా కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతితో కలెక్టరేట్ నిర్మాణంపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో ఫోన్లో మాట్లాడారు. మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు ‘పొన్నం’ గైర్హాజరు నగరంలో సోమవారం జరిగిన సుడా శంకుస్థాపనకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా పొన్నంకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందలేదని, కేవలం సెల్ఫోన్ సందేశంతో సరిపెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నగరంలో తనకు చెప్పకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా, సరైన విధానంలో ఆహ్వానించకపోవడంపై మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ● మంత్రి శ్రీధర్బాబు -
రేకుర్తిలో 1,002 ఇంటి నంబర్లు రద్దు?
● విచారణలో అక్రమమని తేలినట్లు సమాచారం కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ బల్దియా పరిధిలోని రేకుర్తిలో అక్రమంగా జారీ చేసిన 1,002 ఇంటి నంబర్లు రద్దు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా వివాదాస్పద ప్రాంతంగా గుర్తింపు పొందిన రేకుర్తిలో ప్రభుత్వ, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూడడం తెలిసిందే. రేకుర్తిలో ఇంటి నంబర్ల దందాపై పలుమార్లు ‘సాక్షి’ కథనాల మేరకు స్పందించిన అధికారులు గత నెలలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో 1,002 ఇంటి నంబర్లు అక్రమమేనని తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. రేకుర్తిలోని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు, వివాదాస్పద స్థలాలను సొంతం చేసుకునేందుకు ఇంటినంబర్లను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. స్థలాల్లో ఇళ్లు లేకున్నా ఇంటి నంబర్లు ఇవ్వడం, చిన్న షెడ్కు నంబర్ వేయడం లాంటి అక్రమాలతో కోట్లాది రూపాయల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. చొప్పదండిలో సోలార్ పవర్ప్లాంటు ● శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి: పట్టణ శివారులోని పీఏసీఎస్ స్థలంలో ఒక మెగావాట్ సోలార్ పవర్ప్లాంట్కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం శంకుస్థాపన చేశారు. చొప్పదండి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తొలిసారిగా పవర్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. నాబార్డు డీడీఎం జయప్రకాశ్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రోజుకు 4,500 యూనిట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్ చేపట్టినట్లు వివరించారు. ఉత్పత్తి అయిన కరెంట్ను చిట్యాలపల్లి సబ్స్టేషన్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి మాట్లాడుతూ, బహుముఖ సేవలు అందించడంతోనే తమ సంఘం జాతీయ స్థాయిలో ముందుందని తెలిపారు. -
రైతుకు ధీ(బీ)మా
● కొత్త దరఖాస్తులకు ఈ నెల 13గడువు ● జిల్లాలో ఏటా వందల్లో మృతి.. ● అందుతున్న పరిహారం ● క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు జారీ కరీంనగర్ అర్బన్: రైతు బీమా పథకానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బీమాకు దరఖాస్తు చేయనివారు, కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు బీమాలో చేరవచ్చు. ఎలాంటి ప్రీమియం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా సంబంధిత ఏఈవోకు భౌతికంగా కలిసి అందిస్తే సరి. ఈ నెల 13వరకు అవకాశం కల్పించగా జూన్ 5వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. ఇప్పటికే నమోదు చేసుకున్నవారు ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. భౌతికంగా దరఖాస్తు అందజేయాల్సిందే పథక ఆరంభంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.2,271.50 బీమాను ఎల్ఐసీకి చెల్లించింది. 2019 నుంచి ఒక్కో రైతుకు రూ.3,555.94 చెల్లిస్తోంది. జిల్లాలో 2.05లక్షల మందికి పైగా రైతులుండగా అర్హత క్రమంలో ఏటా రూ.53కోట్లు చెల్లిస్తోంది. ఈ పథకం ద్వారా 18ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు వర్తిస్తుంది. బీమాలో చేరిన రైతులు యఽథావిధిగా కొనసాగుతారు. గతంలో 12,817 మంది రైతులు నమోదు చేసుకోకపోగా కొత్తగా పాసుపుస్తకం పొందినవారు 10,827 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. కాగా 18 సంవత్సరాలు నిండిన రైతులు ఈ పథకంలో చేరాలంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ అందించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నామిని బ్యాంకు ఖాతా పాసుపుస్తకం జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఉన్నట్లే పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలుండాలి. ఒకవేళ తప్పుగా ఉంటే తప్పనిసరిగా సరిచేసుకోవాల్సిందే. 2,903 కుటుంబాలకు ప్రయోజనం జిల్లాలో 2.05లక్షల మంది రైతులుండగా వీరిలో 1.98లక్షలకు పైగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. కాగా 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయసు గలవారు 1,09,717మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వీరందరికి రైతు బీమా వర్తించనుంది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 2,903 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. అయితే వీరందరికి ఒక్కొ కుటుంబానికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. 2021లో 363, 2022లో 471, 2023లో 731, 2024లో 380 మందికి బీమా అందజేశారు. వయసు సడలిస్తే బాగు రైతు బీమా పథకం దరఖాస్తులకు అన్నదాతలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం రై తుబంధు పథకం ద్వారా ఆదుకోవడమే కాకుండా రైతు మరణించిన తర్వాత ఆ కుటుంబం వీధినపడకుండా రూ.5లక్షలు అందజేసి ప్రభుత్వం అండగా ఉండటం స్వాగతించదగ్గ పరిణామం. అయితే రైతులకు వయసుతో పరిమితి లేకుండా బీమా అమలు చేస్తే మరింత మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వాస్తవానికి 65–70 ఏళ్ల వయసు గలవారు వ్యవసాయం చేస్తున్నారు. సుమారు వీరి సంఖ్య 10 వేల వరకు ఉంటుందని అంచనా. ఏవుసం చేసే రైతులందరికి బీమా వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. మొత్తం రైతులు: 2.05లక్షలు పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు: 1.98లక్షలు రైతు బీమాలో ఉన్నవారు: 1,29,717సాగు విస్తీర్ణం: 3,35,564 ఎకరాలు పథకం ప్రారంభం: 2018 ఆగస్టు 14 ఏడేళ్లుగా లబ్ధి పొందిన కుటుంబాలు: 2,903చెల్లించిన మొత్తం పరిహారం: రూ.145.15కోట్లు ఎవరికి అవకాశం: జూన్ 5వరకు పాసుపుస్తకం పొందినవారు -
గుండెపోటుతో మాజీ ఉపసర్పంచ్ మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మల్లారెడ్డి(63) శనివారం గుండెపోటుతో మృతిచెందారు. వ్యవసాయ పనులకు వెళ్లిన మల్లారెడ్డికి మధ్యాహ్నం 3గంటలకు పొలంలోనే గుండెపోటు రావడంతో స్థానిక రైతులు ఇంటికి తరలించగా చనిపోయారు. రెండు పర్యాయాలు ఉపసర్పంచ్గా, ఒకసారి దుర్శేడ్ సింగిల్విండో డైరెక్టర్గా పనిచేసిన మల్లారెడ్డి గ్రామాభివృద్ధిలో ఎంతో కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్ నాయకుడు.. చొప్పదండి: మండలంలోని మంగళ్లపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గడ్డం మోహన్రెడ్డి (72) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మృతదేహానికి నివాళి అర్పించారు. పీఏసీఎస్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, గడ్డం చుక్కరెడ్డి, ఇప్పనపల్లి సాంబయ్య, వెల్మ శ్రీనివాస్ రెడ్డి, వెల్మ నాగిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, ఏనుగు స్వామిరెడ్డి పాల్గొన్నారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్..తిమ్మాపూర్: ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ఆదివా రం మృతి చెందాడు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ వివరాల ప్రకారం.. కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన కామారపు అనిల్కుమార్(36) సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్న్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన సన్నిహితులకు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకపోగా, అతన్నే వేధించారు. మానసిక వేదనకు గురైన అనిల్ జూ లై 31న అలుగునూరు శివారులో పురుగుల మందు తాగాడు. ఇంటికి చేరుకున్న అతన్ని వెంటనే హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మ రణించాడు. మృతుడి తండ్రి కామారపు భాస్కర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బావిలో పడి రైతు..కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన కుంటెల్లి రామస్వామి(45) ఆదివారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. గ్రామస్తులు, కుటు ంబ సభ్యులు తెలిపిన వివరాలు. రామస్వామికి గ్రామ శివారులో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వరి, పత్తి సాగు చేశాడు. భార్య కొమురవ్వకు జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ఇంజక్షన్ చేయించాడు. మధ్యాహ్నం భోజనం చేయకుండానే పొలం వద్దకు వెళ్లిన రామస్వామి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా బావిలో పడి మృతిచెంది ఉన్నాడు. మృతునికి భార్య కొమురవ్వ, కుమారుడు అరవింద్ ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యానికి బానిసై వ్యక్తి..వీణవంక: మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన నలుబాల రాకేశ్(24 మద్యానికి బానిసై ఆరోగ్యం క్షీణించి ఆదివారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం రాకేశ్ గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు, ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మారలేదు,. ఆరోగ్యం క్షీణించి ఇంట్లో మృతి చెందాడని, తల్లి రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పాముకాటుతో చిన్నారి..జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఓ రైస్మిల్లులో పనిచేస్తున్న కూలీ కుమార్తె పాముకాటుతో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం నామ్ఖాడ్ తాలుకూ ఉజ్జన్ గ్రామానికి చెందిన ప్రజాపతి రాజేశ్వరి కొద్దిరోజులుగా జిల్లా కేంద్రంలోని ఓ రైస్మిల్లులో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. శనివారం రాత్రి షెడ్డులో నిద్రిస్తుండగా రాజేశ్వరి కుమార్తె ధన్వంతి(3)కి పాము కాటు వేసింది. దీంతో వెంటనే జగిత్యాల ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మోహన్ తెలిపారు. ఎంసీహెచ్లో నవజాత శిశువు..జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో నవజాత శిశువు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ప్రేమలత– లక్ష్మణ్ దంపతులకు శనివారం రాత్రి రెండో సంతానంగా మగశిశువు జన్మించాడు. అయితే రాత్రంతా శిశువు ఏడుస్తుండగా ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సిబ్బందికి విషయం తెలిపారు. ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై ఆర్ఎంవో సుమన్రావును వివరణ కోరగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆనందోబుద్ధ
● నాటకాలలో రాణిస్తున్న ముస్తాబాద్ యువకుడు ● ‘బుద్ధునితో నా ప్రయాణం’తో గుర్తింపు ● సినిమా, సీరియళ్లలో అవకాశం ● మేకప్ వేస్తే పరకాయ ప్రవేశం ● ప్రశంసలు అందుకుంటున్న యువనటుడు ముస్తాబాద్(సిరిసిల్ల): మేకప్ వేస్తే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. స్టేజీపైకి వెళ్తే డైలాగ్స్ ధారాళంగా వచ్చేస్తుంటాయి. తనకు నచ్చిన రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కస్తూరి ఆనంద్రెడ్డి. నటనలో అనుభవాన్ని ఉపయోగించుకుంటూ రంగస్థలంపై రాటుదేలుతున్నారు. ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటకం తెచ్చిన పేరు ప్రఖ్యాతులు అంతా.. ఇంతా కాదు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఫోక్సాంగ్స్లో నటించిన ఆనంద్రెడ్డి వెండితెరపై కనిపించారు. ఇటీవల దేశాన్ని ఊపేసిన పుష్ప సినిమాలోనూ ఓ పాత్ర పోషించారు. యువనటుడు ఆనంద్రెడ్డి గురించి తెలుసుకుందాం... ముస్తాబాద్ నుంచి నాటకరంగంలోకి.. ముస్తాబాద్కు చెందిన కస్తూరి వెంకట్రెడ్డి, విజయ దంపతుల కుమారుడు ఆనంద్రెడ్డి. మండల కేంద్రంలోనే ప్రాథమిక విద్యనభ్యసించాడు. సిద్దిపేటలో డిగ్రీ చదివిన ఆనంద్రెడ్డి విద్యార్థి దశ నుంచే నటనపై మక్కువ పెంచుకున్నాడు. డిగ్రీ తర్వాత హైదరాబాద్కు వెళ్లాడు. నటనపై ఆసక్తితో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. తొలుత ఫోక్సాంగ్స్, సీరియళ్లలో నటించాడు. పుష్ప, అఖండ చిత్రాల్లో చిన్నపాత్రలు పోషించాడు. 31 జిల్లాలు..31 నాటక ప్రదర్శనలు రెండు నెలల క్రితం బుద్ధుని జీవిత చరిత్ర, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై బుద్ధుడి ప్రభావంపై అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేసింది. అంబేడ్కర్ అభ్యుదయ భావాలకు, బుద్ధుడి బోధనలతో కలిగే శాంతి సందేశంపై ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటక ప్రదర్శనలకు ముందుకొచ్చారు. ఇందుకోసం హైదరాబాద్లో నిర్వహించిన ఆడిషన్స్కు వందలాది మంది హాజరయ్యారు. బుద్ధుని పాత్రకు కస్తూరి ఆనంద్రెడ్డి ఎంపికయ్యారు. అప్పటి నుంచి బుద్ధుడి వేషం, ఆహార్యంపై పట్టు సాధించి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. లీడ్ రోల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నాటకం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని 31 జిల్లాల్లో 31 రోజులపాటు ప్రదర్శించగా, అనేక ప్రశంసలు దక్కాయి. దేశ విదేశాలలో ప్రదర్శన ఆనంద్రెడ్డి నటిస్తున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించగా.. ఇప్పుడు మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ప్రదర్శనకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆనంద్రెడ్డి మరాఠీ, హిందీ, కన్నడ భాషలను నేర్చుకుంటున్నారు. బుద్ధుడి ప్రభావం అధికంగా ఉన్న థాయ్లాండ్, చైనా, మయన్మార్, జపాన్ దేశాల్లో త్వరలోనే ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామని అభ్యుదయ ఆర్ట్స్ నిర్వాహకులు తెలిపారు. నాటక ప్రదర్శనలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఆనంద్రెడ్డితో బుద్ధుని ముఖ్యపాత్ర పోషించగా, నిజంగా గౌతమ బుద్ధుడు మన ఎదుటే ఉన్నాడనే ఫీలింగ్ కలుగుతోందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. గౌతముని పాత్ర లభించడం అదృష్టం సీరియల్స్, సినిమాల్లో వ చ్చిన అవకాశాలతో నటుడిగా కొంత గుర్తింపు దక్కి ంది. బుద్ధునితో నా ప్ర యాణంతో రెండు తెలు గు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ప్రశంసలు పొందడం మరచిపోలేని అనుభూతి. ఇప్పుడు నాపై బుద్ధుడి బోధనల ప్రభావం ఉంది. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన బుద్ధుడి నాటకాలను విదేశాల్లో ప్రదర్శించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. – కస్తూరి ఆనంద్రెడ్డి, నటుడు -
వ్యవసాయ మార్కెట్ గోదాంలో అగ్నిప్రమాదం
మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లోని గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గోదాంలో సివిల్ సప్లై శాఖ అధికారులు సుమారు 9లక్షల పనికి రాని, 10 వేలు పనికి వచ్చే గన్నీ సంచులను నిల్వ ఉంచారు. అయితే ఆదివారం ఉదయం ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ, మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో రెండు ఫైర్ ఇంజన్లను రప్పించారు. కొన్ని గంటల పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది శ్రమించినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అప్పటికే గోదాంలోని గన్నీ సంచులు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలాన్ని ఎస్పీ అశోక్కుమార్, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్, డీఎస్పీ రాములు, సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్, సివిల్ సప్లై అధికారులు పరిశీలించారు. గోదాంలో ఓ చోట కిటికీ తెరిచి ఉండగా ఎవరైనా ఆకతాయిలు అందులో నుంచి మంటలు పెట్టారా..? లేదా మరే ఇతర కారణాల అన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదంలో భారీగానే నష్టం జరిగిందని చెబుతున్న అధికారులు ఎంత నష్టం జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. పెద్ద సంఖ్యలో కాలిబూడిదయిన గన్నీ సంచులు -
సౌదీ జైల్లో వెంగళాయిపేట వాసి
● సారా కేసులో అరెస్ట్ ● 8 నెలలుగా జైలులోనే.. పెగడపల్లి(ధర్మపురి): ఉపాధి కోసం మూ డేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేటకు చెందిన పబ్బతి ప్రశాంత్ సారా, మద్యం కేసుల్లో సౌదీలోని రియాద్ జైల్లో మగ్గుతున్నాడు. స్థాని కులు తెలిపిన వివరాలు. ముంబయిలోని ఓ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా మూడేళ్ల క్రితం కూలీ పని చేసేందుకు రియాద్ వెళ్లాడు. తాను వెళ్లిన కంపెనీలో సరైన పని, జీతం లేకపోవడంతో కల్లివెల్లిగా ఉంటూ మరోచోట పనికి కుదిరాడు. పని చేస్తున్న చోట ప్రశాంత్ నాటుసారా, మద్యం కేసుల్లో అరెస్టయినట్లు కుటుంబ సభ్యులకు ఇటీవల సమాచారం అందింది. కుటుంబ పోషణ కోసం సౌదీ వెళ్లిన ప్రశాంత్ 8 నెలలుగా సౌదీ జైల్లో మగ్గుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అమాయకుడైన ప్రశాంత్ను సౌదీ జైలు నుంచి విడిపించాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి, బాధితుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. -
అల్ఫోర్స్లో జాతీయ విద్యావిధానంపై సదస్సు
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హైస్కూల్(సీబీఎస్ఈ)లో ఆదివారం జాతీయ విద్యా విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీబీఎస్ఈ రిసోర్స్ పర్సన్స్ ఎన్ఎస్ శ్రీనివాస్, నాంపల్లి సంజీవ్ పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉందని, అందుకు అవసరమైన విశ్లేషణాత్మక విద్యపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యావిధానాన్ని సులభతరంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. -
అంతర్జాతీయస్థాయిలో రాణించాలి
కరీంనగర్స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ ఖోఖో పోటీల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉ మ్మడి జిల్లా క్రీడాకారుల్లో ప్రతిభకు కొదవ లేదన్నారు. జిల్లా ఖోఖో క్రీడా రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో రాష్ట్ర, జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వై.మహేందర్రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 130మంది క్రీడాకారులు, 20 మంది టెక్నికల్ అఫీషియల్, 30 మంది సీనియర్ క్రీడాకా రులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. కరీంనగర్ జి ల్లా ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఆర్ఐ కు మారస్వామి, వివిధ జిల్లాల ప్రధాన కార్యదర్శులు డాక్టర్ వేల్పుల కుమారస్వామి, డాక్టర్ ఏ రవీందర్, ఎస్.కె మహినోద్దీన్, వి సూర్యప్రకాష్, జిల్లా పేట అ ధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివా స్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు టి లక్ష్మయ్య, అంతర్జాతీయ కోచ్ నరేశ్, జగిత్యాల ఎస్సై రమేశ్, పెద్దపల్లి జిల్లా పెటా సంఘ అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల సురేందర్, అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారులు గెల్లు మధుకర్, వెంకటేశ్, బి రాజు, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ముగిసిన ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీలు -
రాజన్నకు సెలవుల రద్దీ
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్నకు వరుస సెలవుల రద్దీ తాకిడి పెరిగింది. 50 వేలకుపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఒక్కో భక్తుడి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. వీఐపీల రద్దీ పెరిగిపోవడంతో ప్రొటోకాల్ కార్యాలయం బీజీగా మారింది. భక్తుల ద్వారా రూ.52 లక్షల ఆదాయం సమకూరింది. భక్తుల ఏర్పాట్లను ఈవో రాధాభాయి, ఏఈవో, పర్యవేక్షకులు పరిశీలించారు. ● 50 వేలకు పైగా భక్తుల రాక ● ఒక్కో భక్తుడి దర్శనానికి 4 గంటల సమయం -
తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిన కొడుకు
● రాత్రంతా గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులు ● ఏమైందో తెలియక ఆందోళన ● 12 గంటల తర్వాత ఇంటికి చేరిన బాలుడు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తండ్రి మందలించాడని పదకొండేళ్ల బాలుడు 12 గంటలు కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆదివారం కలకలం రేపింది. బాలుడు కనిపించకుండా పోయిన ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు బాలుడు 12 గంటల తర్వాత ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన అంతెర్పుల శ్రీనివాస్–స్రవంతి దంపతుల కుమారుడు రోహిత్(11) బైక్ నడుపుతూ ప్రమాదానికి గురికాగా, స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాస్ ఇకపై బండి నడపొద్దని రోహిత్ను శనివారం మందలించాడు. దీంతో శనివారం రాత్రి నుంచే కనిపించకుండా పోయాడు. రాత్రి పొద్దుపోయే వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా అందరు రోహిత్ కోసం టెన్షన్గా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రోహిత్ తనే స్వయంగా ఇంటికి తిరిగిరావడంతో తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై రోధించింది. బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
చోర్.. పారాహుషార్
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు ఈనెల 4వ తేదీన అరెస్టు చేశారు. సదరు వ్యక్తి కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో తన భార్యకు ఆపరేషన్ చేయించేందుకు వచ్చాడు. పొద్దంతా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. రాత్రిళ్లు చోరీలకు పాల్పడ్డాడు. గన్నేరువరం, తిమ్మాపూర్, రామడుగు, చిగురుమామిడిలో దొంగతనాలు చేశాడు. సదరు వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి 18 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం కరీంనగర్ కల్చరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని, ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మండిపడ్డారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ.. బీసీ, బడుగు, బలహీనవర్గాల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బీసీ రిజర్వేషన్లలో మైనారిటీలను తొలగించాలని షరతు పెట్టడం దారుణమన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మ హారాష్ట్రలో ముస్లింలను బీసీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలని ప్రధాన మోదీని డిమాండ్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే డిమాండ్ పెట్టాలని కేంద్ర హోంశాఖ సహా యమంత్రి బండిసంజయ్కి సవాలు విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసిన ధర్నాచౌక్ను తిరిగి ప్రజలకు అందించింది రేవంత్రెడ్డి ప్రభుత్వం అని, నిజాయితీ ఉంటే కవిత, కేటీఆర్, హరీశ్రావుతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని సూచించారు. నాయకులు తాజు ద్దీన్, శ్రవణ్నాయక్, కొరవి అరుణ్కుమార్, రాజు, గంగుల దిలీప్, సాగర్ పాల్గొన్నారు. ఐక్యంగా ముందుకు సాగాలికరీంనగర్ టౌన్: గ్రామస్థాయి నుంచి మున్నూరు కాపు యువత అన్ని రంగాల్లో ముందుకుసాగాలని మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్తినేని శ్రీనివాస్ నియామకమైన సందర్భంగా ఆదివారం జ్యోతినగర్లో ఆయన్ను సత్కరించారు. సంఘం నాయకులు బొల్లం లింగమూర్తి, దామెరకొండ సంతోష్, వంగల రమేశ్, దొడ్ల దేవేందర్ పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు 42శాతం అమలు చేయాలికరీంనగర్: బీసీ రిజర్వేషన్లు 42శాతం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్లో ఆదివారం ధర్నా నిర్వహించారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపిందన్నారు. రిజర్వేషన్ల సాధనకు రాజీలేని పోరా టాలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గుడికందుల సత్యం, బీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యుడు కోనేటి నాగమణి పాల్గొన్నారు. నేడు సుడా భవనానికి శంకుస్థాపనకరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటి (సుడా) వాణిజ్య సముదాయ భవ న నిర్మాణానికి శంకుస్థాపన పడనుంది. గతంలోనే భవన నిర్మాణానికి నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ పక్కన స్థలం కేటాయించారు. రూ.4కోట్లతో నిర్మించనున్న సుడా భవన సముదాయానికి సోమవారం ఉదయం 10గంటలకు భూమిపూజ చేయనున్నట్లు సుడా చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు. సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించనున్న ఐడీఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేస్తారన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభా కర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతారని తెలిపారు. -
● పొద్దంతా రెక్కీ.. రాత్రిళ్లు చోరీ ● జిల్లాలో బెంబేలెత్తిస్తున్న దొంగతనాలు ● సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకుంటున్న వైనం ● పట్టణాలు, గ్రామాల్లో గస్తీ పెంచిన పోలీసులు
కరీంనగర్లోని వివేకానందపురికాలనీలో ఉన్న అపార్టుమెంటులో తాళంవేసి ఉన్న ఓ ఫ్లాట్లో ఈనెల 6వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. బీరువాలో ఉన్న 30తులాల బంగారాన్ని అపహరించుకుపోయాడు. బాధితుల ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కరీంనగర్క్రైం: ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. మనచుట్టే ఉంటూ.. అన్నీ గమనిస్తూ.. అదను చూసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. పొద్దంతా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీ వినియోగిస్తూ.. లొకేషన్ ద్వారా తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తిస్తూ గుల్ల చేస్తున్నారు. కమిషనరేట్వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కరీంనగర్ సిటీతో పాటు శంకరపట్నం, గన్నేరువరం, రామడుగు, మానకొండూర్, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల పరిధిలో గత రెండుమూడు నెలలుగా తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. అప్రమత్తం అవుతున్న పోలీసులు నగరంతో పాటు గ్రామాల్లో గస్తీ పెంచారు. పొద్దంతా రెక్కీ.. రాత్రిళ్లు చోరీ.. జిల్లాకు ఉపాధికోసమని, అవసరాల నిమిత్తం చా లామంది గుర్తు తెలియని వ్యక్తులు, ఇతర రాష్ట్రాల వారు, పొరుగుజిల్లాల వ్యక్తులు వస్తున్నారు. వీరిలో కొందరు పొద్దంతా గ్రామాలు.. పట్టణాలు.. నగరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారు. తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తిస్తూ రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో కమిషనరేట్ పరిధిలో సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కార్డెన్సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలవారు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. గూగుల్ లొకేషన్ ఆధారంగా... కొందరు అధునాతన టెక్నాలజీని వాడుతూ దొంగతనం చేస్తున్నారు. పొద్దంతా రెక్కీ నిర్వహించిన తరువాత రాత్రి చోరీ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్న ఇంటికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నా రు. పలువురు బంగారం వ్యాపారులు చోరీచేసిన సొత్తును దొంగల నుంచి కొనుగోలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఎక్కువగా జల్సాల కోసం ఖరీదైన లైఫ్స్టైల్కు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసు విచారణలో తెలుస్తోంది. గస్తీ పెంచుతున్నాం దొంగతనం కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. దొంగతనం చేసిన బంగారం కొనుగోలు చేయడమూ నేరమే. గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా రాత్రిళ్లు పెట్రోలింగ్, గస్తీ పెంచుతున్నాం. – గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్ -
‘సర్కారు’ భూమి ‘హస్తగతం’
● రూ.60కోట్ల విలువైన స్థలం రికవరీ సాక్షిప్రతినిధి, కరీంనగర్: పరాధీనంలో ఉంటున్న రూ.కోట్లాది విలువైన భూమిని కలెక్టర్ చొరవతో అధికారులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రం శివారులోని చంద్రగిరి సమీపంలో సర్వేనంబరు 25, 26లోని ప్రభుత్వ భూమిలో చాలా ఏళ్లు ఇటుకబట్టీలను తిప్పాపూర్కు చెందిన ఓ వ్యక్తి నడిపించాడు. జిల్లా కలెక్టర్గా సందీప్కుమార్ ఝా వచ్చినప్పటి నుంచి పరాధీనంలో ఉంటున్న ప్రభుత్వ భూములను రికవరీ చేస్తున్నారు. గతంలో కొంతమందిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే చంద్రగిరి శివారులో ఉన్న భూమి ప్రస్తుతం రూ.60కోట్ల వరకు పలుకుతోంది. ఇటుక బట్టీలు నడిపించిన వ్యక్తి ఇతరుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమి కావడంతో సదరు భూమిలో ఇటుకబట్టీలు నడిచి పరాధీనంలో ఉంటున్నాయన్న విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూములుగా తేలడంతో వెంటనే రికవరీకి ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఆదివారం సదరు భూమిలో ఉన్న కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. రూ.60కోట్ల విలువైన భూమి ప్రభుత్వపరం కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. -
కాలేజీ ఒకచోట.. వసతి మరోచోట
● ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు రవాణా తిప్పలు ● ఉన్నది ఒకే బస్సు.. మూడో బ్యాచ్ వస్తే కష్టమే ● ఈ ఏడాది ప్రారంభం కానున్న తరగతులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు రవాణా కష్టంగా మారింది. ఇప్పటివరకు మొదటి, రెండో ఏడాది విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ విద్యా సంవత్సరం మూడో బ్యాచ్ విద్యార్థులు జాయిన్ కానున్నారు. మెడికల్ కళాశాలకు పక్కా భవనాలు లేకపోవడంతో కొత్తపల్లిలోని విత్తనాభివృద్ధి సంస్థ గోదాముల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. బాలికలకు తీగలగుట్టపల్లిలో, బాలురకు సీతారాంపూర్లో కొంతమందికి, దుర్గమ్మగడ్డలో మరి కొంతమందికి వసతి ఏర్పాటు చేశారు. వీరందరిని ప్రతిరోజు సమయానికి కళాశాలకు తరలించేందుకు ఒకేఒక్క బస్సు ఉంది. ఈ బస్సులోనే మూడు ప్రాంతాల నుంచి విద్యార్థులు వెళ్తారు. దీంతో ప్రతిరోజు కళాశాలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల విద్యార్థులకే ఇలా ఇబ్బంది ఏర్పడితే, మరో నెలరోజుల్లో మూడో బ్యాచ్ విద్యార్థులు రానున్నారు. 300మందిని ఒకే బస్సులో పంపించడం అంటే కష్టతరమే. తమ రవాణా కష్టాలు తీర్చేందుకు మెడికల్ కళాశాల అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ‘ప్రస్తు తం ఉన్న బస్సుతో ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థుల రవాణాకు ఇబ్బంది లేదు. మరో బ్యాచ్ పిల్లలు వస్తే మరో బస్సు అవసరముంటుంది. దానికోసం ఏర్పాట్లు చేస్తున్నాం’. అని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాఖియుద్దీన్ వివరించారు. -
తేలని గుట్ట గుట్టు!
● లేని రాక్కు రూ.80 లక్షలు ● ఆపై ఎంబీకి రెక్కలు ● ఏఈపై వేటు పడి నెల రోజులు ● ముందుకు కదలని చర్యలు ● విచారణ పేరిట కాలయాపనకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కిసాన్నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణంలో లేని గుట్టను తవ్వి రూ.80 లక్షలు స్వాహా చేసిన వ్యవహారాన్ని అటకెక్కించే పని గుట్టుగా సాగుతోంది. రూ.లక్షలు స్వాహా చేసి, ఆపై అక్రమాలు బయట పడతాయని ఎంబీ మాయం చేసి ఏళ్లు గడుస్తున్నా ఎటూ తేలడం లేదు. పావుగా మారిన ఏఈని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, తదుపరి చర్యలపై ఎటూ తేల్చడం లేదు. లేని గుట్టను తొలిచారట కిసాన్నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రెండేళ్ల క్రితం పట్టణ ప్రగతి నిధులు రూ.5.80 కోట్లతో నగరపాలక సంస్థ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టింది. నిర్మాణ సమయంలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలొచ్చాయి. మార్కెట్ ఆవరణలో గుట్టను తవ్వడానికి రూ.80 లక్షలు ఖర్చయ్యాయంటూ బిల్లు పెట్టడం అక్రమాలకు పరాకాష్టగా నిలిచింది. అసలు మార్కెట్ యార్డ్లో గుట్ట ఎక్కడుందంటూ స్థానికులు సైతం నోళ్లు వెళ్లబెట్టిన పరిస్థితి. విషయం బయటకు పొక్కడంతో, రాక్టింగ్కు సంబంధించిందిగా చెబుతున్న ఎంబీ–152 మాయమైంది. ఆ ఎంబీ దొరికితే, లేని రాక్ను కట్ చేసినట్లు తేలుతుందని, అందుకే మాయం చేశారంటూ ఫిర్యాదులొచ్చాయి. ఇదేసమయంలో ఎంబీ– 152 పోయిందంటూ సర్టిఫైడ్ కాపీ కోసం సంబంధిత కాంట్రాక్టర్ చిందం శ్రీనివాస్ గతేడాది ఆగస్టులో వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏఈ వద్ద ఉండాల్సిన ఎంబీ పోయిందని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తతంగంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో రూ.80 లక్షలు బిల్లు చేశారనేది అబద్దమని, రూ.1,99,468 మాత్రమే చెల్లించామని సంబంధిత ఏఈ అబ్దుల్ గఫూర్ పేరిట అప్పట్లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏడాది గడిచినా, ఎంబీ మాయం అంశాన్ని పట్టించుకున్నవాళ్లు కరువయ్యారు. ఇటీవల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్దేశాయ్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. మొదటి బాధ్యుడిగా ఏఈ అబ్దుల్ గఫూర్పై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్కు నెల రోజులు ఎంబీ మాయంపై ఏడాది గడిచిన తరువాత తొలి వేటు ఏఈ పైపడింది. మార్కెట్ అక్రమాలపై కదలిక వచ్చిందని, ఇక బాధ్యులపై చర్యలు ఉంటాయనుకుంటున్న క్రమంలో నెల రోజులు దాటినా చడీచప్పుడు లేకుండా పోయింది. సాంకేతికంగా ఎంబీ సంబంధిత ఏఈ దగ్గర ఉండాల్సిందే కాబట్టి, ఆయన సస్పెండ్కు గురయ్యారు. ఏఈపై గత జూలై 1వ తేదీన వేటు పడగా, నెల రోజులు దాటినా మళ్లీ ఈ వ్యవహారం ఊసే లేకుండా పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిగ్గు తేల్చాల్సిందే ప్రజల సొమ్ము సుమారు రూ.80 లక్షలు స్వాహా చేయడం, అది బయటపడుతుందని ఏకంగా ఎంబీ మాయం చేసిన వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. స్మార్ట్సిటీ, పట్టణ ప్రగతి నిధులు ఏవైనా అందినకాడికి దోచుకోవడం, ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం బల్దియాకు రివాజు గా మారింది. కాని ఇటీవల బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఈ వ్యవహారంపై దష్టిసారించి తొలివేటు వేశారు. అదే తరహాలో విచారణను ఇతరులపై ఆధారపడకుండా, నేరుగా దృష్టి సారిస్తే తెరవెనక ఉన్న పాత్రలు బయటపడుతాయి. అప్పనంగా కాజేసిన లక్షల రూపాయల ప్రజల సొమ్ము రికవరీ అయ్యే అవకాశముంది.కావాలనే కాలయాపన?ఎంబీ మాయం వ్యవహారంపై కావాలనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. విచారణల పేరిట అధికారులను నియమించడం, వారు విచారణను ఎటూ తేల్చకపోవడం సంవత్సర కాలంగా ఓ తంతుగా సాగుతోంది. సుమారు రూ.80 లక్షల అక్రమ బిల్లు, ఎంబీ 152 మాయం కావడంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నేతృత్వంలోనే నడుస్తున్నట్లు ప్రచారంలో ఉంది. సదరు అధికారిని, వెనుక ఉన్న సూత్రధారులను కాపాడేందుకే ఎంబీ మాయంపై కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. -
అంగట్లో సబ్సిడీ సిలిండర్లు
నగరంలోని ప్రముఖ హోటల్ ఇది. ఇక్కడ రాయితీ గ్యాస్ సిలిండర్ల వినియోగమే ఎక్కువ. గెజిటెడ్, నాన్గెజిటెడ్ అధికారులు ఇక్కడే టిఫిన్ చేస్తుంటారు. అధికారులకు కళ్ల ముందే కనిపిస్తున్నా కబోదిలా వ్యవహరిస్తున్నారు.కరీంనగర్ అర్బన్: పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్లు అంగట్లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఖర్చును తగ్గించుకునేందుకు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు, ఆసుపత్రుల్లో వీటినే వినియోగిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో సిలిండర్లు పక్కదారి పడుతుంటే పౌరసరఫరాలశాఖ చోద్యం చూడటం గమనార్హం. గతంలో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా కలెక్టర్ ఆదేశాల క్రమంలో తనిఖీల పేరుతో హడావుడి చేసిన పౌరసరఫరాలశాఖ చర్యలను కేవలం పాత్రదారుల వరకే పరిమితం చేసింది. ప్రస్తుతం రాయితీ సిలిండర్కు రూ.925 కాగా కమర్షియల్ సిలిండర్కు రూ.1915. దీంతో అక్రమార్కులు రాయితీ గ్యాస్ను బ్లాక్లో కొనుగోలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. రెస్టారెంట్లు, హాస్టళ్లు అన్నింటా ఇవే సిలిండర్లు జిల్లాకేంద్రంతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం, మానకొండూరు తదితర ప్రాంతాల్లో దర్జాగా రాయితీ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. రాయితీ గ్యాస్ గృహ అవసరాలకే వినియోగించాల్సి ఉండగా జిల్లాలో అంతటా ఇవే కనిపించడం యంత్రాంగ పనితీరుకు తార్కాణం. జిల్లాకేంద్రంలో వేయివరకు టిఫిన్ సెంటర్లు ఉండగా ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు 200 వరకు ఉండగా హాస్టళ్లు 150వరకు ఉన్నాయి. హెచ్చుప్రాంతాల్లో రాయితీ గ్యాస్నే వినియోగిస్తున్నారు. పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ సిలిండర్ల వ్యాపారానికి అడ్డాగా మారాయి. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. జనావాసాల మధ్య కార్లలో గ్యాస్ నింపే దందా ఎక్కువగా సాగుతోంది. భగత్నగర్, కోతిరాంపూర్, మంకమ్మతోట, రాంనగర్, విద్యానగర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో దందా నిర్వహిస్తున్నారు. అంతా హడావుడి.. అంతలోనే మౌనం ఏకకాల దాడులతో గుండెల్లో గుబులు రేపిన పౌరసరఫరాలశాఖ అంతలోనే మౌనం దాల్చడం విమర్శఽలకు తావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 4న జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, ఏసీఎస్వో బుచ్చిబాబు ఆధ్వర్యంలో కరీంనగరంలో మెరుపు దాడులు నిర్వహించి అక్రమంగా వినియోగిస్తున్న 102 రాయితీ సిలిండర్లను పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి సూత్రదారులను గుర్తించకపోవడం విడ్డూరం. రాజకీయ ఒత్తిడితో పాటు మామూళ్ల బంధంతో అసలైన గ్యాస్ ఏజెన్సీ అక్రమార్కులను వదిలారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇదొక్కటే పౌరసరఫరాలశాఖ చేసిన తనిఖీ కావడం గమనార్హం. కాగా.. విరివిగా తనిఖీలు చేస్తామని, నిఘాను తీవ్రతరం చేస్తామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.కరీంనగర్లోని గణేశ్నగర్కు చెందిన ఓ కిరాణాదుకాణం నిర్వాహకుడు కొన్నేళ్లుగా అక్రమంగా సబ్సిడీ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. వివిధ కంపెనీల సిలిండర్లు డీలర్ల నుంచి బుక్ చేసుకుని, పదుల సంఖ్యలో దుకాణంలో నిల్వ ఉంచుతున్నాడు. అత్యవసరం ఉన్నవారికి అసలు ధరకన్నా.. రూ.400 వరకు అధికంగా వసూలు చేస్తూ విక్రయిస్తున్నాడు. గ్యాస్ కంపెనీ డీలర్లు, అధికారులకు విషయం తెలిసినా చోద్యం చూస్తున్నారు. అధిక ధరకు విక్రయాలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వినియోగం రీఫిల్లింగ్తో మరో రకం దందా చోద్యం చూస్తున్న అధికారులు -
రోడ్డు ప్రమాదంలో సీడ్ వ్యాపారి మృతి
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని మంకమ్మతోటలో ఉన్న కొత్తలేబర్ అడ్డా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీడ్ వ్యాపారి మృతిచెందగా అతని భార్యకు గాయాలయ్యాయి. టూటౌన్ సీఐ సృజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి మండలం నామాపూర్కు చెందిన చాడ కిషన్రెడ్డి(57) సీడ్ వ్యాపారం చేస్తూ.. కరీంనగర్లోని విద్యానగర్లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి తన భార్య రమాదేవితో కలిసి బైక్పై మంకమ్మతోట నుంచి జ్యోతినగర్ వెళ్తున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో కిషన్రెడ్డి కిందపడి స్పృహ కోల్పోయాడు. అతని భార్య తలకు, కాళ్లకు గాయాలు కావడంతో ఇద్దరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిషన్రెడ్డి మృతిచెందాడు. మృతుడి సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కిషన్రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా ఆమెరికాలో ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. ఆగిఉన్న వాహనాన్ని ఢీకొని యువకుడు.. ముస్తాబాద్(సిరిసిల్ల): చెల్లితో రాఖీ కట్టించుకున్న యువకు డు ఉత్సాహంగా ఇంటికి చేరే క్రమంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందాడు. ఏఎస్సై అశోక్కుమార్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మెయిన్ రోడ్డులో హన్మాన్ ఆలయ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బోరుబండిని శనివారం రాత్రి బైక్ ఢీకొట్టింది. బైక్పై ఉన్న పోతుగల్కు చెందిన కొప్పు నరేశ్(26) తీవ్రంగా గాయపడ్డాడు. కడుపులో తీవ్ర గాయాలు కాగా పేగులు బయటపడ్డాయి. చుట్టుపక్కల వారు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో నరేశ్ను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేశ్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై అశోక్కుమార్ తెలిపారు. -
భూ సమస్య పరిష్కారం కోసం టవరెక్కిన రైతు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నల్లలింగయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు యాళ్ల ప్రకాశ్రెడ్డి శనివారం ఓ కంపెనీ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. బాధితుడి కథనం ప్రకారం.. ప్రకాశ్రెడ్డి, నర్సింహారెడ్డి అన్నదమ్ములు. వీరిద్దరికి గ్రామ శివారులోని సర్వే నంబర్లు 74, 80లో చెరో 2.22 గుంటల భూమి ఉంది. ఈ భూములోంచే ధర్మారం– పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మించారు. రోడ్డు వైపుఉన్న భూమికి డిమాండ్ పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య భూ సమస్య తలెత్తింది. ఈక్రమంలోనే సర్వేనంబరు 74లోని భూమిలో నర్సింహారెడ్డి దుక్కిదున్నుతుండగా.. ప్రకాశ్రెడ్డి అక్కడకు వెళ్లాడు. తనకు వాటాగా వచ్చిన భూమిలో ఎందుకు దున్నుతున్నావని ప్రశ్నించాడు. నర్సింహారెడ్డి ఆగ్రహంతో ప్రకాశ్రెడ్డిపై దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా చంపుతానని బెదిరించాడు. గత్యంతరం లేక ప్రకాశ్రెడ్డి సెల్టవర్ ఎక్కాడు. వారసత్వంగా వచ్చిన ఈ భూమి పంపకం విషయంలో ఇద్దరూ సమానంగా పంచుకున్నా.. నర్సింహారెడ్డి తనకు అన్యాయం చేసినట్లు ఆరోపించాడు. ఇదే సమస్యపై గ్రామంలో పలుసార్లు పంచాయితీలూ జరిగాయన్నాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయాడు. సమస్య పరిష్కారం కోసమే టవర్ ఎక్కినట్లు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో రైతు టవర్ దిగాడు. కాగా, ఈవ్యవహారం కోర్టు వరకు వెళ్లినట్లు సమాచారం. -
కారును ఢీకొట్టిన బస్సు
● నలుగురికి గాయాలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని కోళ్లఫాం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నపూర్కు చెందిన రాజు, మహేశ్, దేవేందర్, మణికంఠ కారులో కామారెడ్డికి వెళ్తున్నారు. ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న సిరిసిల్ల ఆర్టీసీ డిపో బస్సు బైక్ను తప్పించబోయి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాఖీ కట్టుకుని.. గుండెపోటుతో మృతి
● నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు గొల్లపల్లి: రాఖీ పండుగ రోజు.. ఉదయం ఆ ఇంట్లో రక్షాబంధన్ వేడకలు ఆనందంగా జరుపుకున్నారు. సాయంత్రం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రాఖీ పౌర్ణమి పర్వదినాన తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గరిగంటి అనిల్(24) హఠాన్మరణం అందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. కుటుంబ సభ్యులు.. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గరిగంటి తిరుపతి, సత్తవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. చిన్నకుమారుడు అనిల్ హైదరాబాద్లో ఎంబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. రాఖీ పండుగ సందర్భంగా మూడు రోజుల కిత్రం స్వగ్రామమైన రాఘవటప్నం వచ్చాడు. స్నేహితులతో ఉత్సాహంగా గడిపాడు. రాఖీ పండుగ సందర్భంగా అక్క అనూష ఇంటికొచ్చింది. ఇద్దరు సోదరులకు రాఖీ కట్టింది. అనూష ఇంటికి రావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అనిల్ మధ్యాహ్న భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రమైన లేవకపోవడంతో కుటుంబసభ్యులు నిద్రలేపారు. ఉలుకుపలుకు లేకపోవడంతో అతడిని వెంటనే జగి త్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిద్రలోనే గుండెపోటు వచ్చినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పండుగపూట జరిగిన ఈ ఘట న గ్రామస్తులను కలచి వేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఆర్నెళ్లకే నూరేళ్లు
● బీరువా మీద పడి పసిపాప మృతి కోరుట్ల/మల్లాపూర్: చెక్క బీరువాతో కొడుకు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ అది పక్కకు ఒరిగి కింద పడి అక్కడే పడుకుని ఉన్న ఆరు నెలల పసిపాపై పడడంతో పాప అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవపేటకు చెందిన బైరి రవికుమార్–మమత దంపతులకు కుమారుడు, కూతురు శివాని(ఆరునెలలు) ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమారుడు ఇంట్లో ఉన్న చెక్క బీరువాతో ఆడుకుంటుండగా అది పక్కకు ఒరిగింది. దాని పక్కనే శివాన్షీ పడుకుని ఉండటంతో బీరువా ఆమైపె పడింది. చెక్క బీరువా శివాన్షీ తలపై పడటంతో పసిపాప అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాగా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని తెలిసింది. కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించగా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆరు నెలలకే నూరేళ్లు నిండాయని స్థానికులు కంటతడిపెట్టారు. ఇంటి లోన్కోసం వెళ్లి అనంత లోకాలకు..కొత్తపల్లి(కరీంనగర్): ఇంటి లోన్ తీసుకునేందుకు వెళ్లి కొత్తపల్లిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాలు విరిగింది. కొత్తపల్లి ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల మేరకు గంగాధరకు చెందిన ఆదిరెడ్డి(50), వేణు ఇంటిలోన్ విషయమై బైక్పై కరీంనగర్కు వచ్చారు. పని ముగించుకుని గంగాధర వెళ్తుండగా కొత్తపల్లిలోని ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. వేణు కాలికి తీవ్ర గాయాలు కాగా, వెనక కూర్చున్న ఆదిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని, క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. ఇతని ఇద్దరు కుమారుల్లో ఒకరు విదేశాల్లో.. మరొకరు హైదరాబాద్లో ఉన్నారు. మృతుడి సోదరుడు రాజుల కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
ఆకట్టుకున్న జోయాలుక్కాస్ బ్రిలియెన్స్ డైమండ్ జ్యువెలరీ షో
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్లోని జోయాలుక్కాస్ షోరూమ్లో శుక్రవారం నిర్వహించిన బ్రిలియెన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఆకట్టుకుంది. ప్రత్యేకమైన డిజైన్స్, స్లయిల్స్ ఉన్న డైమండ్లు ఆకట్టుకున్నాయి. జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాయ్ అలూక్కాస్ మాట్లాడుతూ.. మేము బ్రిలియెన్స్ డైమండ్ జ్యువెలరీ షోను కరీంనగర్కు తీసుకురావడానికి ఎంతో సంతోషిస్తున్నామన్నారు. జ్యువెలరీలో సుసంపన్నమైన అభిరుచితో ఇది ఒక గమ్యస్థానం, ఆధునికత–స్లయిల్ను చూపించే కలక్షన్ను మేము సృష్టిస్తామని అన్నారు. ఇది అందం, భావోద్వేగం, వ్యక్తిత్వం ప్రదర్శనన్నారు. ప్రత్యేకమైన ఆఫర్గా కస్టమర్లకు ఈ షో సమయంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువగా ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ను ఇస్తామని అన్నారు. ఎగ్జిబిషన్ జోయాలుక్కాస్ కరీంనగర్ షోరూంలో ఈనెల 24 వరకు జరుగుతుందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో శుక్రవారం రాత్రి 8.30గంటలకు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చుక్క అంజమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంజమ్మకు మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతోంది. శుక్రవారం రాత్రి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తల పగిలి చనిపోయింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వివాహం ఇష్టం లేక ఆత్మహత్యచొప్పదండి: పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన వనపర్తి సంధ్య(27) వివాహం ఇష్టంలేక, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి కనుకయ్య, లక్ష్మిల మూడో కుమార్తె సంధ్యకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14న వివాహం కావాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఇంట్లో వారు పెళ్లి పనుల్లో ఉండగా.. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తండ్రి కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపారు. దొంగతనం మోపారని యువకుడు..జూలపల్లి(పెద్దపల్లి): తనపై దొంగతనం మోపారనే అవమాన భారంతో వడ్కాపూర్ గ్రామానికి చెందిన ఐలవేని రంజిత్(25) చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్కాపూర్ గ్రామానికి రంజిత్ ఈనెల 6న సాయంత్రం మద్యం కొనుగోలు కోసం అదేగ్రామంలోని అంగరి రజిత బెల్ట్షాపుకు వెళ్లాడు. బీరు కొనుగోలు చేసి తాగాడు. ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కౌంటర్లోని డబ్బులు లేవని, ఆ డబ్బు తీశాడనే నెపంతో బెల్ట్షాపు నిర్వాహకులు రంజిత్ బట్టలు విప్పి తనిఖీ చేశారు. దీనిని అవమానంగా భావించిన యువకుడు.. ఇంటికి వెళ్లాడు. తాను కరీంనగర్ వెళ్లి పని చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంటికి వచ్చిన రంజిత్ చీరతో దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికిలోంచి చూడగా రంజిత్ ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్కుమార్ తెలిపారు. స్వగ్రామానికి మృతదేహం మేడిపల్లి(వేములవాడ): భీమారం మండల కేంద్రానికి చెందిన చెక్కపల్లి గంగారాం(52) ఇటీవల దుబాయ్లో గుండెపోటుతో మృతిచెందగా శుక్రవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గంగాధర్ దాదాపు 30 ఏళ్లుగా దుబాయ్ వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా, కూతుళ్లకు పెళ్లిల్లు జరిగాయి. అందరితో కలుపుగోలుగా ఉండే గంగాధర్ విగతజీవిగా గ్రామానికి చేరడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించిన దొంగను పట్టుకుని, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పడాల దినేశ్ కొద్ది రోజులుగా జగిత్యాల పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ ఒక చోట పెట్టాడు. శుక్రవారం సాయంత్రం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద జగిత్యాల టౌన్ ఎస్సై సుప్రియ వాహనాల తనిఖీ చేస్తుండగా హోండా యాక్టివ్ వాహనంపై వస్తున్న దినేశ్ పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా 9 వాహనాలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై రవికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా ఉద్యోగిపై వేధింపులు.. విచారణ కోల్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓ మహిళా ఉద్యోగినిపై సూపర్వైజర్ తాజుద్దీన్ వేధింపులకు గురిచేశాడని వస్తున్న వివాదంపై విచారణ చేపడుతున్నట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ దయాల్సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబింద్ సింగ్ తెలిపారు. ఆస్పత్రిలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రి గ్రీవెన్స్సెల్ కమిటీతోపాటు లింగ వేధింపుల నిరోధక కమిటీ కూడా బాధితురాలు ఫిర్యాదు చేయలేదన్నారు. అయినా ఈ వివాదంపై ప్రత్యేక కమిటీ వాస్తవాలు తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. నివేదికను కలెక్టర్కు పంపిస్తామని తెలిపారు. సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవడం లేదని వస్తున్న ఆరోపణలను ఖండించారు. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ, ఆర్ఎంవో రాజు పాల్గొన్నారు. -
నాకు నీడగా..
దేశ, విదేశాలకు రాఖీ‘పోస్టు’ నీకు తోడుగామేము ముగ్గురం అక్కచెల్లెలం, ఒక్కడే అన్న. పేరు నాగవెల్లి గణేశ్. మాది కరీంనగర్ అయినప్పటికీ పుట్టిపెరిగింది ఛత్తీస్గఢ్. అక్కడే అమ్మానాన్న, అన్నయ్య ఉంటారు. పెళ్లిళ్లు చేసుకుని ఒక్కోక్కరం ఒక్కోచోట స్థిరపడ్డాం. ఏటా రాఖీ పండుగకు అందరం కలిసి పుట్టినిల్లు ఛత్తీస్గఢ్ వెళ్లి అన్నయ్యకు రాఖీ కట్టి పండుగను ఆనందంగా జరుపుకుంటాం. – రాచకొండ రేణుక, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, కరీంనగర్ రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం నుంచి కరీంనగర్ టు జేబీఎస్ వరకు 200 అదనపు బస్సులు నడిపిస్తున్నాం. కరీంనగర్ డిపోల పరిధిలోని వివిధ ప్రాంతాలకు 250 బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశాం. ఆయా రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తాం. – బి.రాజు, ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ బోయినపల్లి(చొప్పదండి): ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగ, వ్యాపార తదితర పనుల నిమిత్తం పలువురు దేశ, విదేశాల్లో ఉంటున్నారు. ఇలాంటి వారికి రాఖీలు అందించే వేదిక తపాల శాఖ. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు పోస్టులో రాఖీలు పంపడానికి పోస్టాఫీస్కు చాలా మంది వస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం పోస్టు ద్వారా రాఖీలు పంపిస్తున్నారు. ఎక్కువశాతం హైదరాబాద్, బెంగళూర్, ముంబై ప్రాంతాలకు రాఖీల పోస్టు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే కొందరు మహిళలు లండన్, అమెరికా తదితర దేశాల్లో ఉన్నవారికి సైతం రాఖీలు పోస్టు ద్వారా పంపుతారు. రిజిస్టర్ పోస్టు ద్వారా రూ.40– రూ.60 వరకు బరువును బట్టి చార్జ్ చేస్తున్నారు.విద్యానగర్(కరీంనగర్): నాకు తమ్ముడున్నాడు. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇద్దరం అమెరికాలోనే ఉన్నాం. నేను జాబ్ చేస్తున్న. తమ్ముడు నాతోపాటు ఉంటూ చదువుకుంటున్నాడు. గతేడాది నుంచి అమెరికాలోనే రాఖీ పండుగా జరుపుకుంటున్నాం. ఈసారి కూడా ఇక్కడే రాఖీ కడుతా. – తొడుపునూరి సౌమ్య, జ్యోతినగర్, కరీంనగర్ యైటింక్లయిన్కాలనీ (రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీలో నివాసం ఉంటున్న బీజీపీ పట్టణ అద్యక్షుడు ఆకుల శశికుమార్, అతడి తమ్ముడు అరుణ్కుమార్ సోదరి హారిక ఆరేళ్లుగా లండన్లో ఉంటున్నారు. గతేడాది హారిక రాఖీ పండుగకు యైటింక్లయిన్కాలనీకి వచ్చి సోదరులకు రాఖీ కట్టారు. ఈసారి రావడం కుదరకపోవడంతో పండుగకు ఒకరోజు ముందుగానే ఇంటికి చేరేలా ప్రైవేట్ కొరియర్ ద్వారా రాఖీలు పంపించినట్లు శశికుమార్ తెలిపారు. భారీగా రాఖీల బట్వాడాఅన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లది అనురాగబంధం. రక్తం పంచుకొని పుట్టినవారిది విడదీయలేని, జీవితాంతం తరిగిపోని ఆప్యాయత బంధం. ఎక్కడ ఉన్నా పరస్పరం యోగక్షేమాలు ఆలోచించి, ఆత్మీయత పంచుకునే ఈ బంధాన్ని శాశ్వతంగా నిలిపేది రక్షాబంధనం. సోదరి మణుల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన వేడుకను శనివారం జరుపుకోనున్న నేపథ్యంలో పలు కథనాలు..ఈసారి పోస్టు ద్వారా దూరప్రాంతల్లో ఉన్నవారికి సుమారు 1,100 పైగా రాఖీలు కరీంనగర్ డివిజన్ పరిధిలో పోస్టు ద్వారా పంపారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్లో మహిళలు భారీగా రాఖీలు పోస్టు చేయడం మంచి పరిణామం. దూర ప్రాంతాల్లో ఉండే సోదరీ, సోదరుల అనుబంధానికి పోస్టల్ శాఖ వేదిక కావడం సంతోషంగా ఉంది. – కె.శివాజి, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, కరీంనగర్ డివిజన్ ‘రాఖీ’ మిఠాయి పెద్దపల్లిరూరల్: రాఖీ పండుగరోజు ప్రతీ ఆడపడుచు తమ పుట్టింటికి వచ్చి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి నోరు తీపి చేయడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం రాఖీ పండుగ కోసం జిల్లాలోని స్వీట్హౌజ్ల నిర్వాహకులు వైరెటీలలో మిఠాయిలు తయారు చేసి అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్, మంథని, పలు ప్రాంతాల్లో 150 వరకు స్వీట్హౌజ్లు ఉన్నాయి. అందులో కొన్ని స్వీట్హౌజ్లకు మంచి పేరుండడంతో ఆయా దుకాణాల్లోనే కొనేందుకు జనం ఎగబడుతుంటారు. సాధారణ రోజుల్లో తయారు చేసే పరిమాణం కన్న పండుగ వేళ కొంత ఎక్కువగా తయారు చేస్తున్నామని మిఠాయి దుకాణ యజమాని ఒకరు తెలిపారు. రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తం సోదరులకు రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తం. అందుకే రాఖీతో పాటు స్వీట్హౌజ్లో మిఠాయిలు కొంటాం. రకరకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా పలురకాల కంపెనీల స్వీట్లు కిరాణ దుకాణాల్లో దొరుకుతాయి. పల్లె ప్రజలకు ఇవి కూడా అందుబాటులో ఉంటున్నాయి. – టి.స్వప్న, అప్పన్నపేట, పెద్దపల్లి కథలాపూర్(వేములవాడ): ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నవారు దసరా పండుగకు స్వగ్రామానికి రావాలని అనుకుంటారు. మా చెల్లె సునీత మేడిపెల్లి మండలం రాగోజిపేట గ్రామంలో ఉంటుంది. ఆమెతో రాఖీ కట్టించుకోవాలని ఇటీవలే అబుదాబి దేశం నుంచి స్వగ్రామం భూషణరావుపేటకు వచ్చిన. రాఖీ పండుగపూట కుటుంబసభ్యులతో ఆనందోత్సవాల మధ్య గడపాలని నెలరోజుల ముందే వచ్చా. – కూన చిన్నయ్య, ఎన్ఆర్ఐ, భూషణరావుపేట, కథలాపూర్ గిరాకీ ఎక్కువగానే ఉంటది రోజువారీ అమ్మకాల కన్న రాఖీపండుగకు గిరాకీ ఎక్కువగానే ఉంటది. వైరెటీలలో స్వీట్లు తయారు చేస్తాం. ఎవరి అభిరుచులను బట్టి వారు ఆయా రకాల స్వీట్లు తీసుకెళ్తారు. పంద్రాగస్టు, రిపబ్లిక్ డే సమయాల్లో స్వీట్లు అవసరమున్న వారు ముందస్తుగా ఆర్డర్ ఇస్తుంటారు. కానీ, రాఖీ పండగ కోసం అప్పటికప్పుడే వచ్చి అందుబాటులో ఉన్నవి తీసుకెళ్తారు. – నితిన్ఖత్రీ, స్వీట్హౌజ్ నిర్వాహకుడు, పెద్దపల్లి ‘అక్కా.. తమ్ముడు అంటూ చిన్నప్పటి నుంచి వృద్ధాప్యంలోనూ పలకరించుకుంటున్నాం. సెల్ఫోన్ పుణ్యమానీ రెండు రోజులకోసారి యోగాక్షేమాలు తెలుసుకుంటున్నాం. అక్కకు 80 ఏళ్లు అయినా ఆమె చేతితో రాఖీ కట్టించుకుంటేనే సంతృప్తి ఉంటుంది’ అని కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన 75 ఏళ్ల ఉశకోల శంకరయ్య అన్నారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్లో శంకరయ్య అక్క 80 ఏళ్ల చిలివేరి భాగ్యమ్మ నివాసం ఉంటుంది. ఆమె నడవలేని స్థితిలో ఉన్నా ఏటా తాను సైకిల్పై భూషణరావుపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని ఆత్మనగర్కు వెళ్లి అక్కతో రాఖీ కట్టించుకుంటానని శంకరయ్య తెలిపారు. – ఉశకోల శంకరయ్య, భూషణరావుపేట, కథలాపూర్ ఛత్తీస్గఢ్ వెళ్తున్నా.. ఈసారీ అమెరికాలోనే..జేబీఎస్కు అదనపు బస్సులు ఎల్లలు దాటిన సోదరి ప్రేమనెలరోజుల ముందే గ్రామానికి.. రాఖీ కోసం సైకిల్పై.. -
ముగిసిన సీబీఎస్ఈ టేబుల్ టెన్నీస్ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్–7 బాలికల టేబుల్ టెన్నీస్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. అండర్ –14 విభాగంలో వీపీఎస్ పబ్లిక్ స్కూల్, విజయవాడ ప్రథమస్థానంలో టైం స్కూల్, రాజేంద్రనగర్, రంగారెడ్డి నిలిచాయి. అండర్– 17 విభాగంలో శ్రీ ప్రకాశ్ ఎనర్జీ స్కూల్, పెద్దాపురం, తూర్పుగోదావరి ప్రథమస్థానంలో సర్ సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్, పశ్చిమగోదావరి రెండోస్థానంలో నిలిచాయి. అండర్ 19 విభాగంలో శ్రీ ప్రకాశ్ ఎనర్జీ స్కూల్, పెద్దాపురం, తూర్పుగోదావరి ప్రథమస్థానంలో, సర్ సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్, పశ్చిమగోదావరి రెండోస్థానంలో నిలిచాయి. అండర్–14 విభాగంలో ఎస్.మనస్వి, రిద్దిటోరో, కే.నైనా, వంశిక, అండర్ 17లో జి.వర్ణిక, తనిష్క, దాస్, మిద్ది శాంతి జ్యోతి, అండర్ 19లో సాయి సుదీక్ష, రిషికా తులసి, లినేషియా, ఎం.దర్శిక జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి హాజరై విజేతలకు ట్రోపీలు, మెడల్స్ అందజేశారు. పోటీల పరిశీలకుడు పద్మారావు, చీఫ్ రెఫరీ శంకర్, అసోసియేట్ చీఫ్ రెఫరీ రామచంద్రరావు, బాబురావు, ఒతినేల్, ఎండీ గౌస్, రవి, గంగారాం పాల్గొన్నారు. -
పారాణి ఆరలేదు.. గోరింట చెరగలేదు
తిమ్మాపూర్/చొప్పదండి/గొల్లపల్లి: కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. చేతులకు వేసుకున్న గోరింటాకు ఇంకా చెరిగిపోలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయలేదు. వచ్చిన బంధువులు తిరిగి ఇంకా ఇళ్లు చేరనేలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన నవవధువును లారీరూపంలో మృత్యువు కబలించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలకేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల(22)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన చిరుత రాజుతో ఈనెల 6వ తేదీన వివాహం జరిగింది. శుక్రవారం పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అఖిల భర్త రాజుతో కలిసి తిమ్మాపూర్ మండలకేంద్రంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చింది. పరీక్ష రాసి బైక్పై ఇద్దరూ కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో వెనకనుంచి లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన అఖిల అక్కడికక్కడే చనిపోయింది. రాజుకు స్వల్పగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సురేందర్సింగ్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. నవ వధువును కబళించిన రోడ్డు ప్రమాదం పెళ్లయిన మూడు రోజులకే మృత్యువాత పీజీ సెట్ రాయడానికి వచ్చి అనంత లోకాలకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఘటన -
తాత, మనుమరాలిని కబళించిన జ్వరం
ముత్తారం(మంథని): జ్వరం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వారంరోజుల వ్యవధిలోనే మనుమరాలు, తాతను కబళించింది. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న గూట్ల నవ్య తీవ్రజ్వరంతో బాధపడగా.. హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 2న చనిపోయింది. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే.. ఆమె తాత గూట్ల ఓదెలు(68) అనారోగ్యానికి గురవడంతోపాటు జ్వరంతో గురువారం రాత్రి మృతి చెందాడు. ఒకేకుటుంబంలో మనుమరాలు, తాత జ్వరంతో మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి విషాదంలో కుటుంబసభ్యులు కేశనపల్లి గ్రామంలో ఆందోళన -
నాకు నీడగా.. నీకు తోడుగా..
● ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ ● ఎక్కడున్నా రాఖీని మరువని రక్త సంబంధాలు ● మార్కెట్లో పండుగ సందడికలెక్టర్కు పోషణ బంధం రాఖీ63 ఏళ్లుగా పండుగ సంతోషం..సోదరి కోసం సౌదీ నుంచి..అన్నంటే ధైర్యం.. తమ్ముడంటే ప్రేమ.. అమ్మగర్భాన్ని పంచుకుని.. నాన్న చూపిన బాటలో నడుచుకుని.. ఏళ్లకాలం తోడునీడగా నిలిచేది సోదర, సోదరీమణుల బంధం. రక్తం పంచుకుని పుట్టి.. చివరి అంకం వరకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకునే ప్రేమబంధం. ఇలాంటి బంధానికి ప్రతీకగా నిలుస్తోంది రాఖీ పండుగ. నేను నీకు రక్షా.. నీవు నాకు రక్షా అంటూ.. అన్నా.. తమ్ముళ్లకు అక్కాచెల్లెల్లు కట్టేది రక్షాబంధన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు బట్వాడా చేస్తుండగా.. మరికొందరు పండక్కి స్వదేశానికి వచ్చేశారు. కొందరు వృద్ధులు శుక్రవారం నుంచే సోదరుల ఇళ్లకు పయనమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో పండుగ రద్దీ కనిపిస్తుండగా.. మార్కెట్లలో వివిధ డిజైన్లలతో రాఖీలు మెరుస్తున్నాయి. స్వీట్ల దుకాణాల్లో వివిధ రకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేడు రాఖీ పండుగ సందర్భంగా కథనం..మరిన్ని కథనాలు 8లోuపెద్దపల్లిరూరల్: కలెక్టర్ కోయ శ్రీహర్షకు శుక్రవారం పెద్దపల్లి సీడీపీవో కవిత పోషణ బంధం రాఖీ కట్టారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పోషణ రాఖీలు తయారు చేయించి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అంగన్వాడీ టీచర్లు విధిగా గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 15 వేల ఇళ్లకు వెళ్లి ఇలా అవగాహన కల్పిస్తారని వివరించారు.ఇల్లంతకుంట: చిత్రంలో కనిపిస్తున్న వీరు సార మల్లేశం, అంతటి లక్ష్మి. అక్కా తమ్ముళ్లు. సొంతూరు ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట. తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. ముగ్గురు మగపిల్లలు. అంతటి లక్ష్మి అన్న నర్సయ్య ఐదేళ్లక్రితం చనిపోయాడు. ప్రతీ రాఖీ పండక్కి అక్క లక్ష్మినర్సవ్వతో కలిసి అంతటి లక్ష్మి ముస్కానిపేటకు నడుచుకుంటూ వెళ్లి అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టేవారు. ప్రస్తుతం ముగ్గురూ ఇల్లంతకుంటలోనే వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ‘మా తమ్ముడు మల్లేశానికి నేను మా అక్క ప్రతీ ఏటా రాఖీ కడతాం. తమ్ముడికి రాఖీ కడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. 63ఏళ్లుగా రాఖీ కడుతున్నా. ఆరోజు మా ఇళ్లంతా పండుగ వాతావరణం ఉంటుంది. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం’ అని అంతటి లక్ష్మి తెలిపింది.16 ఏళ్లుగా స్పీడ్ పోస్ట్లో..జమ్మికుంట: చిన్నతనం నుంచి తన చేతులతో రాఖీ కట్టించుకున్న సోదరుడు ఇప్పుడు సప్తసముద్రాల అవతల ఉన్నా రాఖీ పంపించడం మరవడం లేదు ఆ సోదరి. అమెరికాలో స్థిరపడిన సోదరుడికి 16ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పీడ్పోస్టు ద్వారా రాఖీ పంపుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సుజాతకు ఇద్దరు సోదరులు పొనగంటి సంపత్, రమేశ్ ఉన్నారు. సంపత్ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. రమేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా జీవనం సాగిస్తున్నాడు. సుజాత ఏటా రాఖీ పండుగ సందర్భంగా 15రోజుల ముందుగానే రమేశ్కు ఇంటర్ నేషనల్ స్పీడ్పోస్ట్ ద్వారా రాఖీ పంపిస్తోంది. పండుగ రోజున రమేశ్ రాఖీ కట్టుకొని ఫోన్ ద్వారా సుజాతతో మాట్లాడి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన బీమనాతి శ్రీధర్ ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా స్వదేశానికి రాలేదు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి మౌనికతో రాఖీ కట్టించుకోవాలని అనిపించింది. గల్ఫ్ దేశంలో కంపెనీ యజమానితో విషయం చెప్పాడు. వారు ఒప్పుకోవడంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. సోదరితో రాఖీ కట్టించుకుంటే ఆ సంతోషం వర్ణించలేనిదని శ్రీధర్ అంటున్నాడు. -
త్వరలో ఎస్టీపీ ఆధునీకరణ
కరీంనగర్కార్పొరేషన్: పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ను ఆధునీకరిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ పేర్కొన్నారు. నగరంలోని ఎస్టీపీని శుక్రవారం సందర్శించారు. ఎస్టీపీ ఆధునీకరణకు సంబంధించి డీపీఆర్ను రూపొందించాలని ప్రైవేట్ టెక్నికల్ కన్సల్టెన్సీ ప్రతినిధులకు సూచించా రు. సమీపం నుంచి వెళ్లే నాలాలో వ్యర్థాలను తొలగించి, మురుగునీరు సులువుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అన్నారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. హెచ్టీ సర్వీసులకు మోడమ్ కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని హైటెన్షన్ (హెచ్టీ) సర్వీసుల మోడమ్ ఇన్స్టాలేషన్, కమిషనింగ్ పనులు కొనసాగుతున్నాయి. 990 హెచ్టీ సర్వీసులకు ఈ ప్రక్రియ సాగుతోంది. పనులు పూర్తయ్యాక తదుపరి నెలలో హై వ్యాల్యూ హెచ్టీ మీటర్లు అందించనున్నారు. ఈ మీటర్ల ద్వారా రియల్ టైమ్లో మానిటరింగ్ చేయగలిగే సామర్థ్యం లభించడంతో పాటు రీడింగ్ను ఆన్లైన్లో తీసుకుని, తక్షణ బిల్లింగ్ వ్యవస్థను అమలు చేయడం జరుగుతుందని ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. ‘శుక్రవారం సభ ఉపయోగకరం’ కరీంనగర్: మహిళా సమస్యలకు శుక్రవారం సభ పరిష్కార వేదికగా నిలుస్తుందని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాశ్మీర్గడ్డ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో పాల్గొని మాట్లాడుతూ.. మహిళల తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చనని తెలిపారు. సీడీపీవో సబితా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు పిల్లల సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించ డం జరుగుతుందన్నారు. మెడికల్ ఆఫీసర్ సఫి ర్ హుస్సేన్ మాట్లాడుతూ మహిళలకు 50రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్ఖానాగడ్డ అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన, రాఖీ వేడుకలు నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ పాల్గొన్నారు. -
ఆరోగ్యంతోనే ఆర్థిక సాధికారత
● కలెక్టర్ పమేలా సత్పతిమానకొండూర్: మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూరు మండలం అన్నారంలో శుక్రవారం సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. సభలో పలువురు మహిళలు ‘శుక్రవారంసభ’ నిర్వహణపై అభిప్రాయాలు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభ అన్నారం మహిళల్లో చైతన్యం నింపిందన్నారు. గ్రామంలోని 1,544 మంది మహిళల్లో 1,200మంది ఆరోగ్య మహిళ పరీక్షలు చేయించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలో బరువు తక్కువగా ఉన్న శిశువులు 14మంది ఉన్నారని, వారి విషయంలో అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ పాల్గొన్నారు. -
కరీంనగర్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025మీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్ 85007 86474వరలక్ష్మీ.. నమోస్తుతేశ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నగరంలోని ఆలయాలు మహిళలు, భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, వ్రతాలు, వాయినాలతో సందడిగా మారాయి. వరలక్ష్మీ రావమ్మా అంటూ మహిళలు భక్తితో నోముకున్నారు. నివాసాల్లోనూ అమ్మవారిని కొలువుంచి ప్రత్యేకపూజలు చేశారు. సుహాసినులను ఆహ్వానించి పసుపు, కుంకుమ, పప్పు బెల్లాలు, ఫల, తాంబూలాలు, వస్త్రాలు వాయినాలుగా ఇచ్చారు. ఆలయాల్లో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం భక్తులతో పోటెత్తింది. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం, గాజులు, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించారు. – కరీంనగర్ కల్చరల్ -
క్రిప్టోకు రెక్కలు!
దేశం దాటుతున్న రూ.వందల కోట్లు ● మూడేళ్ల క్రితమే కేంద్రం హెచ్చరికలు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ● తాజాగా నెక్ట్స్ బిట్ పేరుతో రూ.300 కోట్ల టోకరా? ● గతంలో రెక్సిట్, మెటా పేరుతో రూ.కోట్ల దందాలు ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పెట్టుబడి పెడుతున్న అత్యాశపరులు ● క్రిప్టో వసూళ్లపై రాచకొండ పోలీసుల ఉక్కుపాదం ● కరీంనగర్లో రెవెన్యూ, పోలీసులవే అధిక పెట్టుబడులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘క్రిప్టోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. ప్రతీ రోజూ సాయంత్రానికి మీ ఖాతాల్లో రూ.వేలు చూసుకోండి. నెలకు రూ.లక్షల సంపాదన. రెండుమూడు నెలల్లో మీ జీవితం మారిపోతుంది, హోదా పెరుగుతుంది’ అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి.. అమాయకుల నుంచి రూ.లక్షలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఒకరిద్దరికి సరిగానే ఇచ్చి.. మిగిలిన వారికి టోకరా వేస్తున్నారు. అలా వసూలు చేసిన డబ్బులు రూ.వందల కోట్లు దేశం దాటుతున్నాయి. క్రిప్టో పేరిట తెలంగాణలో పలు నకిలీ యాప్లు పుట్టుకొస్తున్నాయని, అమాయకులు పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారని మూడేళ్ల క్రితమే కేంద్ర నిఽఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను హెచ్చరించాయి. ఈ తరహా యాప్లను రాష్ట్ర పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక క్రిప్టో మోసాలకు వేదికవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యాప్లలో పెట్టుబడులు పెట్టడం శోచనీయం.దేశం దాటుతున్న రూ.వందల కోట్లు భారీగా లాభాలు ఆశ చూపి, వసూలు చేసిన మొత్తాన్ని జగిత్యాల కేంద్రంగా కొంచెం హవాలా మార్గంలో, క్రిప్టోలోకి కొంచెం మార్చి దేశం దాటిస్తున్నారు. విదేశాల్లో ఆస్తులు కొని, వ్యాపారాలు ప్రారంభించి అక్కడే స్థిరపడేలా ‘లక్కీ భాస్కర్’సినిమాను తలపించేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్గౌడ్ అనే వ్యక్తి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.95 కోట్లు కొల్లగొట్టాడు. దీనిపై సీఐడీ విచారణ జరపుతోంది. ఇందులో లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఓ డీఎస్పీని అటాచ్ చేశారు. రమేశ్ గౌడ్ ఆ డబ్బును దుబాయ్లో పెట్టుబడులు పెట్టి, పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల మెటా ఫండ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై వసూలు చేసిన లోకేశ్, కె.సతీశ్ ఆ డబ్బును దేశం దాటించారని, వీరికి ఓ బీజేపీ నాయకుడు సాయం చేశాడన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి లోకేశ్ ఎప్పుడో థాయ్లాండ్ వెళ్లాడని బాధితులు చెబుతున్నారు. తాజాగా హిమాన్ష్ అనే యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇతను రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వద్ద రూ.19 కోట్లు నెక్ట్స్బిట్ యాప్ పేరుతో వసూలు చేశాడని రాచకొండ పరిధిలోని మేడిపల్లి పీఎస్లో కేసు నమోదైంది. ఈ యాప్ బారిన పడ్డవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లావారే. గతంలోనూ హిమాన్షు రిక్సో యాప్ను నిర్వహించి రూ.కోట్లలో వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ముఠా దాదాపు రూ.300 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం.పట్టించుకోని కరీంనగర్ పోలీసులు నెక్ట్స్బిట్ యాప్పై రహస్య సమాచారం మేరకు రాచకొండ పోలీసులు ఆగస్టు 1వ తేదీన హిమాన్షును అరెస్టు చేశారు. ఈ కేసులో రికీఫామ్ (ఫారిన్ ఆపరేటర్), అశోక్ శర్మ (థాయ్లాండ్ ఆపరేటర్), డీజే సొహైల్ (రీజనల్ రిక్రూటర్), మోహన్ (సహాయకుడు), అశోక్కుమార్ సింగ్ (హిమాన్షుకు సహాయకుడు)ను నిందితులుగా చూపించారు. వీరంతా నెక్ట్స్ బిట్యాప్లో పెట్టుబడి పెట్టించి ప్రజలను మోసగించారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో రామగుండం, కరీంనగర్ కమిషనరేట్లు, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. రాచకొండ పోలీసుల తరహాలో వీరూ చర్యలకు దిగితే రూ.వందల కోట్ల దందా బయటికి వస్తుందని బాధితులు అంటున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో ఈ విషయమై ఫిర్యాదులు ఇస్తే సెటిల్మెంట్ చేసుకోండని తిప్పి పంపుతున్నారని, కేసులు నమోదు చేయకుండా నిందితుల వైపు ఉంటున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కేసులు ఎందుకు నమోదు చేయడం లేదంటే బాధితులు ముందుకు రావడం లేదని పోలీసులు సమాధానం ఇస్తున్నారు. -
అభిషేక ప్రియుడి సేవలో తరించాలని..
వేములవాడ: శ్రావణమాసంలో శివుడికి అభిషేకం చేయాలని ఆరాటంతో భక్తులు తండోపతండాలుగా రాజన్న ఆలయానికి తరలివస్తున్నారు. ప్రధానంగా స్థానికులు చేతుల్లో కలశాలతో రాజన్నకు అభిషేకం చేసేందుకు వేకువజాము నుంచే క్యూ కడుతున్నారు. స్థానికుల రద్దీ పెరుగుతుండడం.. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు టికెట్ తీసుకొని వేచి చూడాల్సి వస్తోందని వరంగల్కు చెందిన స్వామి, రాజమల్లయ్య, రాజేశ్వర్, ఉమేందర్, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కొని తాము గంటల తరబడి క్యూలైన్లో నిల్చొంటే.. తమ ముందే వందలాది మంది ఉచితంగా గర్భగుడిలోకి వెళ్లి వస్తున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈక్రమంలో వారిని కట్టడి చేయడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పా ట్లు చేయాలని కోరుతున్నారు. అయితే శ్రావణమా సం మొదలైనప్పటి నుంచి రాజన్న ఆలయంలో ని త్యం భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో రాజ న్నను దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లో నిల్చోవడం ఇబ్బందిగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఆలయ అధికారులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు నిత్యం తెల్లవారుజామున తోపులాట ఇబ్బంది పడుతున్న సిబ్బంది -
యూరియా నిల్వల తనిఖీ
కరీంనగర్రూరల్ /కరీంనగర్ అర్బన్: కరీంనగర్ మండలంలోని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. గురువారం ‘సాక్షి’లో ‘యూరియా కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఏడీఏ రణధీర్, ఏవో సత్యం స్పందించారు. కరీంనగర్, దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాలతోపాటు తీగలగుట్టపల్లిలోని డీసీఎంఎస్, నగునూరులోని ఆగ్రోస్ సెంటర్, మొగ్ధుంపూర్, చేగుర్తిలోని ప్రైవేట్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. దుర్శేడ్ సొసైటీలో 177 బస్తాలు, చెర్లభూత్కూర్లో 383, బొమ్మకల్లో904, తీగలగుట్టపల్లి డీసీఎంఎస్లో 127, మొగ్ధుంపూర్లోని వరలక్ష్మి ఫర్టిలైజర్స్లో 85, చేగుర్తిలోని మంజునాధ ఫర్టిలైజర్స్లో 65 బస్తాల యూరియా స్టాక్ ఉన్నట్లు ఏవో సత్యం తెలిపారు. . కాగా.. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని డీఏవో భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.భోజనంలో నాణ్యత పాటించాలికరీంనగర్రూరల్: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడొద్దని మైనార్టీ గురుకులాల ప్రత్యేక అధికారి, ఎస్సీకార్పొరేషన్ డీడీ నాగలేశ్వర్ సూచించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. కిచెన్రూం, డైనింగ్హాల్, స్టోర్రూం, తరగతి గదులు, హాస్టల్ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పరిసరా ల పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంత రం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రి న్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, కో– ఆర్డినేటర్లు శ్రీలత, మహేందర్, వార్డెన్ ఫకృద్దీన్ పాల్గొన్నారు.కరీంనగర్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలికరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కేంద్ర విమానాయనశాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిసిన ఆయన విమానాశ్రయం ఏర్పాటుకు సర్వే జరిపి, నిధులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉందన్నారు. గతంలో సర్వే చేసినా కార్యరూపం దాల్చలేదన్నారు.జిల్లాలో ఆర్ఐల బదిలీకరీంనగర్ అర్బన్: రెవెన్యూశాఖలో పలువురు ఆర్ఐలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కె.రాఘవేందర్(గన్నేరువరం)ను చొప్పదండికి, జి.మోహన్రెడ్డి(చొప్పదండి)ని వీణవంక సీనియర్ అసిస్టెంట్గా బదిలీ చేశారు. బి.రజనీకాంత్రెడ్డి(గన్నేరువరం)ని గంగాధరకు, కె.ప్రవీణ్(గంగాధర)ను గన్నేరువరం కార్యాలయానికి, కె.వాస్తవిక్ (కరీంనగర్ రూరల్)ను చిగురుమామిడికి, వి.అరుణ్కుమార్(చిగురుమామిడి)ను కరీంనగర్ రూరల్కు, టి.త్రిపాల్సింగ్(చొప్పదండి)ను గన్నేరువరం, ఎండీ.రహీం(శంకరపట్నం)ను చొప్పదండి గిర్దావర్గా బదిలీ చేయగా తక్షణమే విధుల్లో చేరాలని పేర్కొన్నారు.బీసీ గర్జన సభ 14కు వాయిదాకరీంనగర్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్లో నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జన సభ వాయిదా పడింది. ఈనెల 14న సభను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్లో ఈనెల 14న భారీ బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేసి, తరువాత అన్ని జిల్లాకేంద్రాల్లో సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. సభతో కాంగ్రెస్, బీజేపీల బండారాన్ని బయటపెడతామని తెలిపారు. -
పెండింగ్ బకాయిలు చెల్లించాలి
కరీంనగర్: మధ్యాహ్న భోజన వర్కర్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సమ్మయ్య మాట్లాడుతూ 12నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. నిత్యవసర వస్తువులు, గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. మెనూ చార్జీలు రూ.25 చొప్పున ఇవ్వాలన్నారు. వంట కార్మికులకు గుర్తింపుకార్డులు ప్రోసీడింగ్ ఆర్డర్లు, డ్రెస్కోడ్ ఇవ్వాలన్నారు. గ్రీన్ చానల్ లేదా పీఎఫ్ఎంఎస్ ద్వారా బడ్జెట్ను రిలీజ్ చేసి కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్ల యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత, కార్యదర్శి దేవేంద్ర పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో పారమిత విద్యార్థి ప్రతిభ
కొత్తపల్లి: తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో కెడెట్(జూనియర్స్) చాంపియన్షిప్ పోటీల అండర్– 90 కిలోల విభాగంలో పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థి టి.రణవీర్ (10వ తరగతి) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం గెలుచుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.గోపికృష్ణ తెలిపారు. విద్యార్థి, వ్యాయామ ఉపాధ్యాయుడు గోలి సుధాకర్ను శుక్రవారం పాఠశాల చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్రావు, రశ్మిత, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, సమన్వయకర్త రబీంద్రపాత్రో అభినందించారు. ఉత్సాహంగా టేబుల్ టెన్నీస్ పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలలో సీబీఎస్ఈ పాఠశాలల క్లస్టర్–7 బాలికల టేబుల్ టెన్నీస్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 35 సీబీఎస్ఈ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. గురువారం నాటి పోటీలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్రెడ్డి ప్రారంభించారు. అండర్– 14 విభాగంలో టీం ఈవెంట్లో వీపీఎస్ పబ్లిక్ స్కూల్, టైం స్కూల్పై, అండర్–17 విభాగంలో శ్రీ ప్రకాశ్ సినర్జీ స్కూల్, సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్పై, అండర్–19 విభాగంలో శ్రీ ప్రకాశ్ సీనర్జీ పాఠశాల, సర్ సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్పై విజయం సాధించాయి. -
భూ భారతి.. కాసులకే హారతి
● డబ్బులిస్తేనే పరిశీలన.. పరిష్కారం ● లేదంటే కొర్రీలతో దాటవేసే ప్రయత్నం ● జిల్లాలో పలు చోట్ల మామూళ్ల దందా ● పరిశీలన సమాచారమే లేక రైతుల అయోమయంమానకొండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు భూమిని భూ సేకరణలో ప్రభుత్వం వారు తీసుకున్నారు. తీసుకున్న భూమి కన్నా ఎక్కువగా రికార్డు నుంచి తొలగించారు. భూ భారతిలో దరఖాస్తు చేస్తే గతంలో పనిచేసిన ఆర్ఐ బేరసారాలకు దిగాడు. పరిష్కారం చేపిస్తానని రూ.20వేలు వసూలు చేయగా, పని అవుతోందని దాటవేస్తున్నాడు. ఇది కేవలం ఈ ఒక్క రైతే కాదు జిల్లావ్యాప్తంగా వేలసంఖ్యలో బాధిత రైతులు ఇబ్బంది పడుతున్నారు.కరీంనగర్ అర్బన్: భూ భారతి అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. భూ సమస్యల్లేని రా ష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించగా పలువురు రెవెన్యూ అధి కారులు బేరసారాలకు దిగుతుండటం విమర్శలకు తావిస్తోంది. భూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి భూ భారతి కార్యక్రమాన్ని చేపట్టింది. రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి జిల్లావ్యాప్తంగా 29,426 దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులను ఈ నెల 15లోగా పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేయగా పావు వంతు కూడా పరిష్కారం కాలేదని తెలుస్తోంది. రెవెన్యూ సిబ్బంది చేయి తడిపినవారికే పెద్దపీట వేస్తుండగా బేరం కుదరనివారిని పక్కనబెడుతున్నట్లు సమాచారం. పరిశీలిస్తున్నారా.. సమాచారమేది? ప్రతి మండలంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి రెండు బృందాలు ఏర్పాటు చేశారు. ఆరు మాడ్యూళ్లలో 33 ఐచ్చికాలను పొందుపరచగా వీటిపై అవగాహన కోసం ఇప్పటికే గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఏ గ్రామానికి రెవెన్యూ అధికారులు వెళ్తున్నారు..? మోకాపై పరిశీలిస్తున్నారా? అంటే స్పష్టత లేదని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో టాంటాం చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్య లే లేవని, అధికారులు ఎపుడొస్తున్నారో, ఎప్పుడెళ్తున్నారో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిష్కారమయ్యే సమస్యలను తొక్కి పెడుతూ.. అమ్యామ్యాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదముంది. 29,426 అర్జీలు.. 30 రకాల సమస్యలు జిల్లాలో 29,426 అర్జీలు స్వీకరించగా 30 రకాల సమస్యలపై ఆన్లైన్ చేశారు. సాదాబైనామాతో భూమి హక్కుల కోసం, పాసుపుస్తకాల్లో తప్పులు, పాత పాసుపుస్తకం నుంచి కొత్తదాంట్లో భూమి నమోదుకాలేదని, విస్తీర్ణం, భూమి స్వభావం, హక్కు రకం తదితర అంశాల్లో సమస్యలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల హక్కుల నమోదుకు అర్జీలు అందాయి. పెండింగ్ మ్యుటేషన్, డీఎస్ పెండింగ్, భూ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం, నిషేధిత జాబితా నుంచి తొలగించడం, ఇనామ్– ఓఆర్సీ జారీ చేయడం, వారసత్వ భూ మార్పిడి, భూ సేకరణకు సంబంధించి అర్జీలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వీటిని రెవెన్యూ అధికారులు క్రోడీకరించి మాడ్యూళ్ల వారీగా విడదీశారు. తొలుత రెవెన్యూ రికార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాత గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి భూమి భౌగోళిక హద్దుల్ని నమోదు చేయనున్నారు. ముందు దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వేయర్, రెవెన్యూ బృందాలు పరిశీలించాలి. పట్టాదారు పాసుపుస్తకాల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి వెంటనే సరి చేయనుండగా సదరు వివరాలను రెవెన్యూ సెటిల్మెంట్ రిజిష్టర్(ఆర్ఎస్ఆర్)లో సవరణ చేయాలి. ఇతర సమస్యల వివరాలను దరఖాస్తుకు జోడించి తహసీల్దారు, సదరు అధికారి ద్వారా ఆర్డీఓకు నివేదించాలి. కానీ ఏం జరుగుతుందో.. ఎక్కడ అధికారులుంటున్నారో తెలియడం లేదన్నది కర్షకుల మాట. కాగా ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని, భూ భారతిలో ప్రతి సమస్య పరిష్కారమవుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తులు: 29,426 సాదాబైనమా: 10,456 పీవోటీ: 958, అప్పీల్స్: 2,916 ఎఫ్ లైన్: 278 నోషనల్ ఖాతా టు పట్టా: 194 నాలా ఇష్యూస్: 187, అసైన్మెంట్: 183 హౌజ్సైట్ పీపీబీ: 111 -
జ్వరం.. భయం
● ఆందోళన కలిగిస్తున్న సీజనల్ వ్యాధులు ● పెద్దాసుపత్రికి క్యూ కడుతున్న రోగులు ● నిత్యం 1,100 దాటుతున్న ఓపీ ● 470కి పైగా ఇన్ పేషెంట్లుగా నమోదు ● జ్వరం వస్తే నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులుకరీంనగర్టౌన్: జిల్లాను జ్వరం భయం వణికిస్తోంది. వాతావరణంలో మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రభు త్వ ప్రధానాసుపత్రితో పాటు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో పాటు డయేరియా బారిన పడ్డ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నగరంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్)కి రోజుకు సుమారు 1,100 మంది పైగా జ్వరాలతో చికిత్సల కోసం వస్తున్నారు. ప్రస్తుతం 470 మందికి పైగా ఇన్పేషెంట్లతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వందల సంఖ్యలో రోగులు సీజనల్ వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ● ఇటీవల కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో అ పరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలు షిత తాగునీరు, దోమలు, ఈగల ద్వారా అతిసా రం, టైపాయిడ్, చికున్గున్యా, డెంగీ, మలేరి యా వ్యాప్తి చెందుతున్నాయి. రక్తకణాలు తగ్గిపోవడంతో పలువురు మంచాన పడుతున్నారు. ● పరిసరాల శుభ్రత, ఆహార నియమాలు పాటించటంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇళ్ల చుట్టూ నీరు నిలవడం, మురుగు గుంతలతో ఈగలు ముసిరి టైపాయిడ్ వ్యాప్తి చెందుతోంది. తరుచూ జ్వరం వస్తుంటే రక్త పరీక్ష చేసుకుని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుకోవాలి. ● దోమకాటుతో మలేరియా, చికున్గున్యా వ్యాప్తి చెందుతున్నాయి. ‘ఎనాఫిలస్’ దోమవల్ల మలేరియా వస్తోంది. తరచూ తలనొప్పి, చలి జ్వరం వేధిస్తుంటే చికెన్గున్యా సోకినట్టు సంకేతం. ● పారిశుధ్య లోపంతో హెపటైటిస్ సోకుతుంది. కాలేయానికి ఇబ్బందులు ఏర్పడి పచ్చకామెర్లు వస్తాయి. కళ్లు, చర్మం పచ్చబడటం వ్యాధి లక్షణాలు. వైద్యం పొందుతూ, కాచి చల్లార్చి వడకట్టిన నీటిని తాగాలని వైద్యులు చెబుతున్నారు. ● ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిల్వ ఆహార పదార్థాలు, తాగునీరు కలుషిత కావడం వల్ల అతిసార సంక్రమించే అవకాశముంది. చేపలు, మాంసాహారం, అపరిశుభ్ర వాతావరణంలో వీధుల్లో విక్రయించే తినుబండారాల వల్ల ఎక్కువగా ఈ వ్యాధి వస్తోంది. దండుకుంటున్న ప్రైవేటు నిర్వాహకులు సీజనల్ వ్యాధులు జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. జ్వరం వచ్చిందని వెళ్లిన వ్యక్తి నుంచి రక్తపరీక్ష, మూత్రపరీక్ష, స్కానింగ్ పేరిట వేలకు వేలు దండుకుంటున్నారు. రక్తకణాలు తగ్గాయని, అడ్మిట్ ఉండాలని భయాందోళనకు గురిచేస్తున్నారు. మందులు, పరీక్షలు, ఆస్పత్రి ఫీజు పేరిట రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఒక వ్యక్తి జ్వరం వచ్చిందని వెళ్తే రోజుకు కనీసం రూ.10వేలకు పైగా ఆస్పత్రిలో ఖర్చవుతోందని పలువురు చెబుతున్నారు. అడ్డగోలు పరీక్షలు చేస్తూ.. అవసరం లేదని మందులు రాస్తూ, డయాగ్నోస్టిక్ సెంటర్లతో కలిసి రక్తం తాగుతున్నారని వాపోతున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.జీజీహెచ్లో ఓపీ వివరాలు ఆగస్టు 1 1,105 ఆగస్టు 2 1,204 ఆగస్టు 4 1,375 ఆగస్టు 5 1,219 ఆగస్టు 6 1,111 ఆగస్టు 7 1,113అన్ని జ్వరాలు డెంగీ కాదు సాధారణంగా జ్వరం రెండు, మూడు రోజులు మించి ఉంటే డెంగీగా కంగారు పడుతున్నారు. అన్ని జ్వరాలు డెంగీ కాదు. సాధారణ జ్వరం వచ్చిన వ్యక్తి శరీరంలో రక్తకణాలు పడిపోతాయి. జ్వరం తగ్గిన తరువాత పౌష్టికాహారం తీసుకుంటే పెరుగుతాయి. డెంగీతో రక్త కణాలు తగ్గిపోతాయని చెప్పడం అవాస్తవం. జీజీహెచ్కు ఎక్కువగా జ్వరాలు, డయేరియా వంటి కేసులు వస్తున్నాయి. – డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్అప్రమత్తంగా ఉండాలి సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిల్వ ఆహార పదార్థాలను తినొద్దు. ఇంటి అవసరాలకు, స్నానానికి కలుషిత నీరు వాడొద్దు. జ్వరం వస్తే వైద్యుల సలహాతో మందులు వాడాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల చాలా రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. – ఉపేందర్రెడ్డి, క్రిటికల్ కేర్ వైద్య నిపుణుడు, మెడికవర్ -
నిర్మల్ టు కోరుట్ల
● గంజాయి తరలిస్తున్న ముఠా ● బ్రేక్ వేసిన జగిత్యాల పోలీసులు ● అరకిలో గంజాయి పట్టివేత ● ఆరుగురు రిమాండ్ ● మూడు బైక్లు, ఐదు సెల్ఫోన్లు సీజ్ కోరుట్ల: పాఠశాలల పరిసరాల్లో గంజాయి అమ్ముతూ.. విద్యార్థులను వ్యసనపరులుగా మారుస్తున్న గంజాయి ముఠాసభ్యులు ఆరుగురిని కోరుట్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. సీఐ సురేశ్ బాబు కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన ఎండీ.అమేర్ఖాన్, ఎండీ. ముష్, సోహైల్, హురెరా, కోరుట్లకు చెందిన షేక్ మజీద్, ఎండీ.ఉమేర్ పట్టణ శివారులో అడ్డా వేసి గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఎస్సైలు చిరంజీవి, రాంచంద్రం అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేపట్టగా నిర్మల్ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి కోరుట్ల, జగిత్యాల పరిసరాల్లో అమ్ముతున్నట్లు వెల్లడించారు. కొంత కాలంగా వీరు గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి అర కిలో గంజాయి, మూడు బైక్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు ఎస్సైలు, కానిస్టేబుళ్లు పురుషోత్తం, శ్రీనివాస్, రాజేశ్వర్రావును ఎస్పీ అభినందించారు. ధరూర్లో గంజాయి విక్రేత అరెస్ట్ జగిత్యాలక్రైం: జగిత్యాల ధరూర్ క్యాంప్లో కోదండరామాలయం వద్ద గంజాయి విక్రయించేందుకు వస్తున్న ఎల్లేశ్వరం ఫణీంద్రను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 105 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై కుమారస్వామి రామాలయం వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఫణీంద్ర గంజాయి విక్రయించేందుకు వస్తున్నాడు. అనుమానంతో ఆయనను తనిఖీ చేయగా అతని వద్ద 105 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
పెన్షన్ పెంపుపై నిబద్ధత లేదు
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగహుజూరాబాద్: పెన్షన్ల పెంపుపై పాలకులు, ప్రతిపక్షాలకు నిబద్ధతలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆరోగ్య శ్రీ సాధన కోసం ఎమ్మార్పీఎస్ ఎంతో శ్రమించిందని గుర్తుచేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ల పెంపు కోసం ఈనెల 13న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మహా గర్జనను విజయవంతం చేయాలని కోరుతూ.. గురువారం హుజూరాబాద్లోని సాయిరూప గార్డెన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. పెన్షన్లు పెంచకుంటే రేవంత్రెడ్డిని గద్దె దించుతామని హెచ్చరించారు. కేసీఆర్ మౌనం వీడాలని, గడీ నుంచి బయటకు రావాలన్నారు. రేవంత్ ప్రభుత్వం 50లక్షల మంది దివ్యాంగులను మోసం చేస్తుంటే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాలని సూచించారు. పెన్షన్లు పెంచడమా..? రేవంత్రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడమా తెలుసుకోవడమే మహాగర్జన సభ ప్రధాన ఉద్దేశమన్నారు. దివ్యాంగులకు రూ.6వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు ఇవ్వాలని మహాగర్జన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలని..
● ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ ● అరెస్ట్ చేసే వరకూ కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయింపు ● గొల్లపల్లిలో ఉద్రిక్తతకు దారితీసిన బాధిత కుటుంబాల ధర్నా గొల్లపల్లి: అకారణంగా తన భర్తపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగిన ఘటన గొల్లపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతానికి చెందిన దండ్ల శ్రీనివాస్పై అదే ప్రాంతానికి చెందిన ఒర్సు విజయ్, ఇడగొట్టు సురేందర్, వేముల వంశీ, ఇడగొట్టు తిరుపతి కలిసి మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్ తన బర్త్డేను తన బంధువుల ఇంట్లో జరుపుకుంటుండగా అకారణంగా వచ్చి దాడిచేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన ఒర్సు రాజ్కుమార్, ఒర్సు ఆంజనేయులుపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్పై దాడి విషయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఒర్సు విజయ్, ఇడగొట్టు సురేందర్, ఇడగొట్టు తిరుపతి, వేముల వంశీ, ఒర్సు చెన్నవ్వపై కేసు నమోదు చేసినా.. అరెస్ట్ మాత్రం చేయలేదు. నిందితులపై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారంటూ శ్రీనివాస్ భార్య అంజలితోపాటు కుటుంబసభ్యులు గురువారం గొల్లపల్లి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఎస్సై కృష్ణసాగర్రెడ్డిని ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేస్తామని, ఇందుకు సమయం పడుతుందని తెలిపారు. బాధితులు ఇప్పుడే అరెస్ట్ చేయాలంటూ జగిత్యాల–ధర్మారం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన తన భర్తకు న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఫ్లెక్సీ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్రెడ్డి పోలీస్ కేసు విత్డ్రా చేసుకోవాలని, కాంప్రమైజ్ కావాలని తమపై ఒత్తిడి తెస్తూ.. బెదిరిస్తున్నాడని బాధితుడి భార్య అంజలి, సోదరుడు మహేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ గూండాల్లా వ్యవహరిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి వారికి నచ్చజెప్పారు. సీఐ రాంనర్సింహారెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు నింధితులను అరెస్ట్ చేసేంత వరకు ఊరుకునేది లేదని బాధితుని కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయ పోరాటం చేస్తామన్నారు. -
వరాలతల్లికి జేజేలు
● నేడు వరలక్ష్మీ వ్రతం ● సౌభాగ్యాన్ని ఇచ్చే వ్రతంగా మహిళల విశ్వాసం ● పేరంటాలు.. వాయినాలు బోయినపల్లి(చొప్పదండి): శ్రీలక్ష్మీదేవీ రావమ్మా.. కోరిన కోర్కెలు తీర్చవమ్మా.. అంటూ మహిళలు వరలక్ష్మీదేవీని కొలుస్తారు. మహిళలకు మంగళప్రదం వరలక్ష్మీ వ్రతం. కోర్కెలు తీరుస్తూ మహిళలకు కొంగు బంగారం.. సౌభాగ్యాన్ని ప్రసాదించే వరాలతల్లి వరలక్ష్మీ. ఈ వ్రతం ఏటా శ్రావణమాసంలోని రెండో శుక్రవారం నిర్వహిస్తారు. వరలక్ష్మీ వ్రతాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది. ● వరలక్ష్మీ పూజ విధానం ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఆచరించే స్థలంలో నీటితో శుద్ధి చేసి పీట వేయాలి. దానిపై తెల్లని వస్త్రం పరచి ముగ్గులతో అలంకరించాలి. దానిపై కలశం(రాగి చెంబు) ఉంచాలి. కలషంలో బియ్యం, పసుపుకొమ్ములు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, నాణేలు, ఉన్నంతలో బంగారు, వెండి వస్తువులు ఉంచాలి. నారీకేళంతో శ్రీలక్ష్మీ పిండిబొమ్మ : నారీకేళంపై పిండితో శ్రీలక్ష్మీదేవీ అమ్మవారి బొమ్మ తయారు చేయాలి. ఆ ప్రతిమను నారీకేళంపై ఉంచాలి. నూ తన వస్త్రం చుట్టాలి. ఆభరణాలు ధరించాలి. జెడను పుష్పాలతో అలంకరించాలి. శ్రీలక్ష్మీ అమ్మవారి ప్రతిమకు ఇరువైపులా ఏనుగు బొమ్మలు ఉంచాలి. ఏనుగు బొమ్మ లేనిచో తమలపాకులు ఉంచాలి. నవగ్రహ పూజ చేయాలి. అనంతరం అమ్మవారి ఐదు వ్రత కథలను ఆచార్యులు వినిపిస్తారు. ఒక్కో కథకు ఒక్కో టెంకాయ నైవేద్యం సమర్పించాలి. ● లక్ష్మీదేవికి 12 రకాల పిండివంటలు మహలక్ష్మీ అమ్మవారికి వీలైనంతలో 12 రకాల పిండి వంటలతో శ్రీమహాలక్ష్మీ అక్షయ ఫలాల ప్రసాదం నివేదించాలి. అమ్మవారికి పళ్ల రసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆవుపాలతో అమ్మవారికి పరమాన్నం నివేదించాలి. దీంతో అమ్మవారు అన్నపానాదులకు లోటు లేకుండా చేస్తుంది. పిండివంటలలో అమ్మవారికి శెనగల ప్రసాదం ప్రీతిపాత్రం. ● సాయంత్రం పేరంటాలు వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు సాయంత్రం 8 మంది ముత్తయిదువలను పేరంటాలకు పిలుస్తారు. తొమ్మిడి ముడులతో తోరణాలు తయారు చేసి వారికి వరలక్ష్మీ రక్ష కంకణ తోరణం చుడతారు. అనంతరం అమ్మవారికి పంచహారతి సమర్పిస్తారు. హాజరైన మహిళలకు తాంబూలం ఇస్తారు. వారు తలంబ్రాలతో వ్రతం నిర్వహించుకునే వారిని ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న వ్రత ఆచారం.కలశంలో వేసిన వాటి విషిష్టత బియ్యం : సంవత్సరాంతం అన్నపానాదులకు లోటు లేకుండా చేస్తుంది. వక్కలు : భర్తల ఆరోగ్యాన్ని బాగుంచుతాయి. పసుపు : మహిళలకు సౌభాగ్యాన్నిస్తాయి. నాణేలు : ధనధాన్యాలు సమృద్ధినిస్తాయి. కర్జూరాలు : సంతోషాన్నిస్తాయి. -
బైక్పై నుంచి జారిపడి యువతి మృతి
కొడిమ్యాల:బైక్ పైనుంచి పడి యువతి మృతి చెందిన ఘటన కొడిమ్యాల మండలం చెప్యాల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన గుర్రం మమత (30) తాటిపల్లి గ్రామానికి చెందిన గంగాధర స్వామిదుర్గయ్యతో కలిసి బుధవారం రాత్రి బైక్పై వేములవాడ నుంచి జగిత్యాల వైపు వస్తోంది. చెప్యాల శివారులో బైక్ అతివేగంగా నడపడం.. రోడ్డు పూర్తిగా గుంతలతో నిండి ఉండడంతో యువతి కాలు వెనుక టైరులో ఇరుక్కుని ప్రమాదవశాత్తు కింద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి శంకరవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్యఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన వంగల దేవిరెడ్డి(70) అనారోగ్యం బాధ భరించలేక గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. దేవిరెడ్డి కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది ఇంటి వెనుకాల పశువుల కొట్టంలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే వరకే మరణించాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డిమందు తాగి ఒకరు.. జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన కొత్తకొండ లచ్చయ్య(52) కుటుంబ కలహాలతో గడ్డిమందు తాగగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సనత్కుమార్ తెలిపిన వివరాలు.. కాచాపూర్కు చెందిన లచ్చయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. గురువారం తమ పొలంలో నాటు వేసేందుకు భార్య లక్ష్మిని రమ్మనగా కాళ్ల నొప్పులతో వెళ్లలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం జరుగగా, లచ్చయ్య పొలం వద్ద గడ్డిమందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. 30 తులాల బంగారం చోరీకరీంనగర్క్రైం: కరీంనగర్ త్రీటౌన్ పరిధిలోని వివేకనందపురికాలనీలో ఉన్న అపార్ట్మెంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. వివేకానందపూరికాలనీ రోడ్డు నంబర్–5లో ఉన్న ఓ అపార్టుమెంటులో వేదవ్యాస్ నివాసం ఉంటున్నాడు. అపార్ట్మెంట్కు రంగులు వేస్తుండడంతో సామగ్రి ప్లాట్లోనే ఉంచి, శ్రీపురంకాలనీలోని సొంత ఇంటి నుంచి వచ్చి వెళ్తున్నాడు. బుధవారం రాత్రి తన ప్లాట్కు తాళం వేసి శ్రీపురంకాలనీలోని ఇంటికి వెళ్లాడు. గురువారం వచ్చి చూడగా.. తన ప్లాట్లోని బీరువాలో దాచుకున్న 30తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదుతో సీఐ జాన్రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కోసం వినతి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రాంత ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర తెలంగాణ రైల్వేఫోరం అధ్యక్షుడు ఫణి కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్నిలయంలో సీపీటీఎం రవిచందర్కు వినతిపత్రం అందించారు. తెలంగాణ ఏర్పడి 11ఏళ్లు దాటినా రాష్ట్రం పేరుతో ప్రత్యేక రైలు లేదన్నారు. తెలంగాణ సంపర్క్ క్రాంతి రైలును హైదరాబాద్–ఢిల్లీ వయా కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల మార్గంలో నడపాలన్నారు. అలాగే బల్లార్ష– ఖాజీపేట రైలును చర్లపల్లి వరకు, కాచిగూడ– కరీంనగర్ డెమో రైలును పెద్దపల్లి వరకు, రాయలసీమ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను బోధన్ వరకు, నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ను కాజీపేట వరకు పొడిగించాలని విన్నవించినట్టు తెలిపారు. మహిళను వేధించిన వ్యక్తిపై కేసు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిపై, అదే ఆస్పత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్న తాజొద్దీన్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు వన్టౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇటీవల కొందరు ఉద్యోగులను పనిలోంచి తొలగించగా, ఇందులో సదరు మహిళ కూడా ఉంది. తన కుటుంబ పోషణకు ఉద్యోగం అత్యవసరమని ఉన్నతాధికారులను వేడుకోగా, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి అంగీకరించారని బాధితురాలు వెల్లడిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం విధుల్లో చేరడానికి ఆస్పత్రికి వచ్చిన మహిళ పట్ల, తోటి ఉద్యోగుల ముందే సూపర్వైజర్ దురుసుగా, అవమానపర్చేలా ప్రవర్తించడంతో మనస్తాపంతో ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నారు. -
అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఏటా వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తాం. పూజ గదిలో అమ్మవారి ప్రతిమను అందంగా అలంకరిస్తాం. పూజల అనంతరం అమ్మవారికి పిండి వంటల నైవేద్యం సమర్పిస్తాం. – శ్రీపతి కవిత, బోయినపల్లి మహిళలకు ప్రీతిపాత్రం వరలక్ష్మీ అమ్మవారి వ్రతం నిర్వహించడం మహిళలకు ఎంతో ప్రీతిపాత్రం. అమ్మవారిని భక్తితో కొలిచిన వారికి సిరిసంపదలు ఉంటాయి. వ్రతం అనంతరం సాయంత్రం పేరంటాలు చేస్తాం. – హరిప్రియ, కరీంనగర్ -
అనారోగ్యంతో తండ్రి.. ఉరేసుకుని కొడుకు..
జగిత్యాలక్రైం: ఒకేరోజు.. ఒకే గ్రామంలో తండ్రీకొడుకులు గంటల వ్యవధిలోనే చనిపోయిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి గ్రామంలో విషాదం నింపింది. తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా.. ఆయన ఇబ్బందులు చూడలేక.. అప్పుల బాధ తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన చంద వెంకన్న (65)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రవి ఐదేళ్ల క్రితం దుబాయ్లో హత్యకు గురయ్యాడు. చిన్న కుమారుడు తిరుపతి ఊరులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వెంకన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రవి ఇంటి వద్ద ఉంటున్నా.. తిరుపతి కూడా ఆయన బాగోగులు చూసుకుంటున్నాడు. బుధవారం రాత్రి తిరుపతి తండ్రి వద్దకు వెళ్లి బాగోగులు చూసుకుని ఇంటికొచ్చాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి వెంకన్న గురువారం ఉదయం మృతిచెందాడు. వెంకన్న కుటుంబ సభ్యులు తిరుపతికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అదే గ్రామంలో ఉన్న తిరుపతి మామ జొన్నల గంగన్నకు వివరించగా.. ఆయనతోపాటు భార్య సుజాత ఇంటికి వెళ్లి చూసేసరికి తిరుపతి బెడ్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి వ్యవసాయం చేస్తుండటంతో ఇటీవల అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువ కావడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సుజాత ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై సదాకర్ కేసు నమోదు చేశారు. ఒకే ఇంట్లో.. ఒకేరోజు తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వెంకన్నకు ఆయన పెద్దకుమారుని కొడుకు కార్తీక్ తలకొరివి పెట్టాడు. తిరుపతికి కూతురు శ్రీకృతి రెండేళ్లే ఉండడంతో మామ జొన్నల గంగన్న తలకొరివి పెట్టారు. ఒకరి తర్వాత మరొకరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి ఒకరి తర్వాత ఒకరికి అంత్యక్రియలు సోమన్పల్లిలో విషాదం -
ఆకర్షిస్తున్న హస్తకళా మేళా
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న కళాభారతి చేనేత, హస్తకళా మేళా సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్కు చెందిన ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆంటిక్ జ్యువెల్లరీ, హస్త కళల ఉత్పత్తులు, పిల్లల ఆట వస్తువులు, డ్రెస్ మెటీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. లేడీస్ ఫ్యాన్సీ ఐటెమ్స్, ఎంబ్రాయిడరీ టాప్స్, ఆప్లిక్ వర్క్ ఐటెమ్స్, ఒడిశా పెయింటింగ్స్, సిల్క్ డ్రెస్ మెటీరియల్, భగల్పురి చద్దర్లు, బ్రాస్ వస్తువులు, జ్యూట్ బ్యాగులు, చెప్పులు, మైసూర్ అగర్బత్తీలు, చందన్ పౌడర్ విక్రయిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
పండుగ సందడి
విద్యానగర్(కరీంనగర్): శుక్రవారం వరలక్ష్మీ వ్రతం.. శనివారం రాఖీ పండుగ సందర్భంగా నగరంలోని ప్రధాన మార్కెట్ గురువారం కిక్కిరిసింది. మధ్యాహ్నం నుంచే మార్కెట్లో రద్దీ నెలకొనగా.. టవర్ సర్కిల్ ప్రాంతంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందడి కనిపించింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజా సామగ్రి దుకాణాలు రద్దీగా మారాయి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. అమ్మవారి ప్రతిమలు, గాజులు, పసుపు, కుంకుమ, తదితర వస్తువులను కొనుగోలు చేస్తూ.. మహిళలు బీజీగా కనిపించారు. శనివారం రాఖీ పండుగ కోసం పలువురు ముందస్తుగానే రాఖీలు కొనుగోలు చేశారు. డిజైన్లను బట్టి రూ.10 నుంచి రూ.100కు పైగా ధర పలికాయి. -
చేనేత గౌరవం ఎప్పటికీ తగ్గదు
కరీంనగర్: చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గేది కాదని, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జాతీయ చేనే త దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు నేత కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ర్యాలీని ప్రా రంభించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చేనేత కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తామన్నా రు. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. జిల్లా నుంచి చేనేత పురస్కారాలు అందుకున్న పలువురిని సన్మానించారు. చేనే త వస్త్రాల ప్రదర్శనను తిలకించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు విద్యాసాగర్, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు వాసాల రమేశ్ పాల్గొన్నారు. తల్లిపాలు అమృతం లాంటివి తల్లిపాలు అమృతంతో సమానమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో కళాభారతిలో తల్లిపాల ప్రయోజనాలపై ఏర్పాటుచేసిన తల్లులు, స్వయం సహాయక సభ్యుల అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పుట్టిన బిడ్డకు గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో తల్లిపాల ఆవశ్యకత గురించి తెలియజేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ బిడ్డకు కనీసం ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వాలని అన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పీడీ వేణుమాధవ్, సీడీపీవో సబిత పాల్గొన్నారు. నేత కార్మికుల సంక్షేమానికి కృషి కలెక్టర్ పమేలా సత్పతి -
గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు
బోయినపల్లి(చొప్పదండి): స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జిల్లా అధికారులు చురుకుగా చేపడుతున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన బ్యాలెట్బాక్స్ల సేకరణకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాలతో బోయినపల్లి ఎంపీవో శ్రీధర్, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పంచాయతీ కార్యదర్శి అనిల్, రుద్రంగి మండలం దెవాగత్తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.శివప్రసాద్ ఈ నెల 4వ తేదీన గుజరాత్కు వెళ్లారు. గుజరాత్లోని మెహసానా జిల్లా నుంచి సుమారు 1,500 బ్యాలెట్ బాక్స్లు రాజన్న సిరిసిల్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు వ్యాన్లలో బ్యాలెట్ బాక్స్లను సిరిసిల్లకు తరలించారు. ఇంకా కావాల్సిన బ్యాలెట్ బాక్సుల గురించి అక్కడి ప్రభుత్వ కార్యాయాల్లో సేకరిస్తున్నారు. ఈనెల 11వ తేదీ వరకు జిల్లా ఉగ్యోగులు గుజరాత్లో ఉండి మిగతా బ్యాలెట్ బాక్స్లను సేకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సేకరణ రెండు వ్యాన్లలో రాజన్న సిరిసిల్లకు తరలింపు -
కాంగ్రెస్ నాయకుడి తల్లి దారుణ హత్య
కొడిమ్యాల: మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ప్యాక్స్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు తల్లి ప్రేమలత (65) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఆమె ఇంటి పక్కనే ఉన్న పాడుబడిన కుండీలో పడేశారు. కర్రలు, బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రేమలతకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సత్యం గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు రాయికల్ మండలం బోర్నపల్లిలో వ్యాపారం చేస్తున్నారు. రాజనర్సింగరావు కరీంనగర్లో ఉంటున్నారు. ప్రేమలత నాచుపల్లిలోని తన ఇంట్లో ఒంటరిగానే నివసిస్తోంది. ఆమె కోడలు స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పరిశీలించారు. హత్యకు పాల్పడింది స్థానికంగా ఉన్న ఓ వ్యక్తేనని స్థానికులు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తితో ప్రేమలతకు మధ్య గతంలో గొడవలు జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. -
సిరిసిల్ల, హకీంపేటల్లో డ్రైవింగ్ శిక్షణ
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా హెవీ వెహికిల్(బస్సు) డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చిందని.. సిరిసిల్ల, హైదరాబాద్ శివారులోని హకీంపేటల్లో శిక్షణ ఇస్తారని రాజన్నసిరిసిల్ల డీఆర్డీవో శేషాద్రి తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సమాఖ్య ఆఫీస్లో గురువారం డ్రైవింగ్ శిక్షణ అవగాహన సదస్సులో డీఆర్డీవో మాట్లాడారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), మొవో(ఎంవోడబ్ల్యూవో) అనే స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. మూడు నెలలపాటు పూర్తిగా రెసిడెన్షియల్గా శిక్షణ ఇస్తారని, శిక్షణకు అయ్యే ఖర్చులను ప్ర భుత్వం భరిస్తుందని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షల్లో ఎంపికై న అభ్యర్థులకు సిరిసిల్ల, హకీంపేటల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల కు చెందిన 37 మంది అభ్యర్థులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. సెర్ప్ సీడీవో రజిత, ఎంవో డబ్ల్యూవో ప్రతినిధులు జయభారతి, జనెల్ బైట్, స్వేత దుక్తల, రత్నశ్రీ, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివా స్, కో–ఆర్డినేటర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.