breaking news
Karimnagar District Latest News
-
సింగిల్విండోల ఎన్నికలు నిర్వహించాలి
సింగిల్విండోల పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తోంది. ఇప్పుడు ప్రత్యేకాధికారులను నియమించారు. రైతులకు సత్వర సేవలు అందాలంటే ఎన్నికలను నిర్వహించాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి. – మెంగని శ్రీనివాస్, రైతు, మొర్రాయిపల్లిప్రస్తుతం సహకార సంఘాలకు ఇన్చార్జి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఆదేశాలు, నోటిఫికేషన్కు ముందే ఏర్పాట్లు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కొత్త సంఘాల ఏర్పాటుకు నిర్ణయం జరగలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘాలను నిర్వహిస్తాం. – రామకృష్ణ, జిల్లా సహకార అధికారి -
సహకార ఎన్నికలు ఎప్పుడో ?
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇన్చార్జి అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం అధికారులకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇన్చార్జి అధికారుల పాలనతో రైతులకు సరైన సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎన్నికలు ముగిసి, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని రైతులు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గాలు ఉన్నప్పుడే యూరియా, విత్తనాలు, రుణాలు వంటి సేవలకు ఆటంకం లేకుండా అందుతాయని వారు పేర్కొంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 60వేలకు పైగా రైతులు వాటాధనం కలిగి ఉన్నారు. ఇన్చార్జి అధికారులకు ఇబ్బందులు జిల్లాలో సహకార ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. కొలువుదీరిన పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు గడిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు పోకుండా ఆరు నెలలపాటు వారి పదవీకాలం పొడగించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీకాలం ముగియగా, 2025 ఆగస్టు వరకు ఒకసారి, అనంతరం మరో ఆరునెలలు పొడగించింది. డిసెంబర్ 19న పాలకవర్గాలను తొలగించి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. రెండు నెలలుగా అటు మాతృసంస్థలలో విధులు నిర్వర్తిస్తూ ఇటు ఇన్చార్జి సేవలను అందిస్తున్నారు. ఒక్కో అధికారికి నాలుగు సహకార సంఘాల బాధ్యతలను అప్పగించారు. రబీలో సమస్యలపై స్పందన ఏదీ.. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. ఎరువులు, యూరియా విత్తనాల సరఫరాపై సహకార ఉద్యోగులు, సిబ్బందికి సరైన మార్గనిర్దేశం చేసే వారులేరని రైతులు అంటున్నారు. మరోవైపు రుణాల రికవరీ వెనుకబడిందని తెలుస్తోంది. రుణాల మంజూరు, ఇతర సేవలు మందగించాయని సంఘ సభ్యులైన రైతులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై సమీక్షించే వారు లేరు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా సింగిల్విండోలకు నామినేటెడ్ ద్వారా పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు పోకుండా నామినేషన్ పద్ధతి ద్వారా పాలకవర్గాలను నియమిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉన్న సంఘాలను మరింత విస్తరిస్తారని ఆ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. 20 ఏళ్ల క్రితం మండలానికి మూడు నుంచి నాలుగు సంఘాలు ఉండేవి. ఇప్పుడు కూడా సంఘాలను విస్తరించడంతోపాటు కొత్తగా ఏర్పడిన మండలాల్లో కూడా సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అలా వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ అర్బన్ సంఘాలను ఏర్పాటు చేయవచ్చు. ఇల్లంతకుంటలో మరో రెండు సంఘాలు వచ్చే అవకాశం ఉంది. -
ఆధ్యాత్మికం.. గిరి ప్రదక్షిణం
గిరిప్రదక్షిణలో భక్తులుకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంమల్యాల: భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ప్రసిద్ధికి తోడు.. గిరి ప్రదక్షిణ మరింత ఆధ్యాత్మికతకు బాటలు వేస్తోంది. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి పౌర్ణమికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రహదారి అభివృద్ధికి కూడా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గిరి ప్రదక్షిణ చేసేవారు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవాలన్న నియమం లేకపోవడంతో సగం మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్తుండడంపై కొందరు భక్తులు ఆక్షేపిస్తున్నారు. అదే సమయంలో కొండగట్టు ఆలయం ఆధ్వర్యంలోనే గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రతిపౌర్ణమికి వేలాదిమంది కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి పౌర్ణమికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి అనుబంధం లేకుండా గతేడాది హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ యాత్రను చిలుకూరి బాలాజీ అర్చకులే ప్రారంభిస్తున్నారు. ఆలయ ప్రాశస్త్యంపై గిరి ప్రదక్షిణ ప్రభావం భక్తుల గిరి ప్రదక్షిణతో కొండగట్టు ఆలయ ప్రాశస్త్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అయితే స్వామివారిని దర్శించుకోవాలనే నియమం లేకపోవడంతో భవిష్యత్లో ఆలయ ప్రాశస్త్యంపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి దిగువ కొండగట్టులోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రారంభించి.. అక్కడే ముగించడంతో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గిరి ప్రదక్షిణ కొండగట్టు ఆలయానికి సంబంధం లేకుండా కొనసాగిస్తే భవిష్యత్లో ఆలయ ప్రాశస్త్యం, అంజన్న భక్తుల మనోభావాలపై ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి భక్తుల ఆక్షేపణ కొండగట్టు ఆలయానికి సంబంధం లేకుండా గిరి ప్రదక్షిణ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని ఆంజనేయస్వామి భక్తులు ఆక్షేపిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో సుమారు ప్రతి పౌర్ణమికి వేయి మందికిపైగా పాల్గొంటున్నా.. వారిలో స్వామివారి దర్శనానికి వెళ్లేవారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకునేలా కార్యక్రమాన్ని రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వైజంక్షన్ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభంతో మేలు.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని వైజంక్షన్ వద్ద గిరి ప్రదక్షిణను ఆలయ అర్చకులు ప్రారంభించడం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని.. స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. దిగువ కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రారంభించడంతో ఆలయ సమీపం నుంచి ఆరు కిలోమీటర్లు కాలినడక గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరోసారి మూడు కిలోమీటర్ల దూరంలోని స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గిరి ప్రదక్షిణ..ఆధ్యాత్మికతకు బాట.. గిరి ప్రదక్షిణ ప్రజల్లో మరింత ఆధ్యాత్మికత పెంపొందించేందుకు తోడ్పాటునందిస్తోంది. రోజురోజుకూ గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో రహదారి అభివృద్ధికి ఇటీవల కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్
కొత్తపల్లి(కరీంనగర్): జిల్లాలోని మున్సిపాలిటీలకు ఈ నెల 11న జరిగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ ఆదేశించారు. కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, డీటీఆర్ల వద్ద సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా గురించి నివేదిక తయారు చేయాలన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాబాట కార్యక్రమాలన్నీ మంగళవారం, శుక్రవారం తమ సెక్షన్ పరిధిలోని సిబ్బందితో నిర్వహించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. 1912 నంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, తిరుపతి, చంద్రమౌళి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, ఏవోలు, ఏఏవోలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె
● 12 నుంచి ప్రారంభం.. 15న స్వామివారి కల్యాణం ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 12న నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకిస్తారు. గురువారం ప్రత్యేక అర్చకులు దూపం వీరభద్రయ్య ఆధ్వర్యంలో అగ్రోదకం, కృద్రాచరణం, శ్రీమహాగణపతిపూజ, గౌరీపూజ, శివపుణ్యహావచనం, నాంది సమారాధానం, రుత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, హారతి, మంత్రపుష్పం, సాయంత్రం ధ్వజారోహణం, తీర్థప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. 13న ఉదయం బలిహరణ, దృష్టి కుంభోత్సవం, స్థాపిత మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, రుద్రహవనం నిర్వహిస్తారు. ఉదయం 10ః30గంటలకు భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణం జరుగుతుంది. స్వామివారి కల్యాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. 14న నాకబలి, గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 నుంచి సాయంత్రం 4గంటల వరకు సామూహిక రుద్రాభిషేకం, రాత్రి 8గంటలకు రథోత్సవం, రాత్రి 11ః45గంటలకు మహాహారతి, సాంస్రృతిక కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆలయ ఆలయ సిబ్బంది వివరించారు.బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో 12 నుంచి మహాశివరాత్రి వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు రానున్న భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు నీడ, ప్రత్యేక పూజలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – బి.సదయ్య ఆలయ ఈవో, ఓదెల -
బీజేపీ వల్లే ఆకాశానికి బంగారం, వెండి ధరలు
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లే బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు పెట్టే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కట్టరాంపూర్లో 10,11వ డివిజన్ల అభ్యర్థులు ఆకుల నర్మద, కొడూరి రవీందర్గౌడ్లకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ను గెలిపిస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కాగా ప్రచారం గడువు ముగుస్తున్న తరుణంలో వచ్చిన శ్రీధర్బాబు, సరిగ్గా సాయంత్రం 5 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులతో కలిసి..
హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నా. ఓటరుగా గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటా. భారత పౌరుడిగా ఓటును సద్వినియోగం చేసుకునే అవకాశం తొలిసారిగా వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేస్తా. – రాచమల్ల అభిలాష్, అశోక్నగర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉ ద్యోగం చేస్తున్నా. ఓటు హక్కు రావడమే కాదు.. దాన్ని సద్వి నియోగం చేసుకోవడం కూడా గొప్ప విషయమే. గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారిగా ఓటు వినియోగించుకుంటున్నా. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ఓటేస్తా. వారిలో అవినీతి ఉండదు. – వాసాల స్నేహ, సాయినగర్ -
సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనకు చెంప పెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు ద్వారా అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ‘సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ’ అనే బీజేపీ నినాదానికి అనుగుణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘ప్రజలారా! రేపు జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెలంగాణలో మార్పునకు సంకేతం కావాలి. అవినీతి, అరాచకాలు, మోసపూరిత హామీలతో అడ్డగోలు పాలన చేస్తున్న కాంగ్రెస్ పాలకులకు చెంప పెట్టు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. బీజేపీ మాత్రమే స్పష్టమైన ఎజెండా, అభివృద్ధి కార్యాచరణతో ఎన్నికల్లో పాల్గొంటోంది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధులవల్లేనని గుర్తుంచుకోండి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదు. ఇప్పుడు ప్రజల ముందున్న దారి ఒక్కటే. అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీకి బలమైన హెచ్చరిక జారీ చేయాలి. తెలంగాణను దోచుకుతిన్న బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మొలవకుండా బొందపెట్టాలి. ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త..! బీఆర్ఎస్, కాంగ్రెస్ను నమ్మితే అధోఃగతే. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, మున్సిపాలిటీల్లో నిజమైన పాలన రావాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలంటే.. కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ’ అని పిలుపునిచ్చారు. -
ఉన్నత చదువుకు ‘అంబేడ్కర్ విద్యానిధి’
● దళిత విద్యార్థులకు చక్కని అవకాశం ● రూ.20లక్షల వరకు రుణం పొందే చాన్స్ ● పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం కరీంనగర్టౌన్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం ఓ వరంగా మారింది. చదువుపై శ్రద్ధాశక్తులు ఉండి చేతిలో డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 210 మంది విద్యార్థులకే సాయమందించింది. ఇటీవల ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు చదివే కోర్సు ఫీజులను బట్టి గరిష్టంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థి వివరాలను పూరించి సంబంధిత ధ్రువపత్రాలను జేపీజీ ఫార్మాట్లో జతపర్చాలి. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. జీఆర్ఈ/జీమ్యాట్లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి విదేశీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రవేశ లేఖ ఆధారంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందజేస్తారు. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ధ్రువపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకుంటే సాయం నిలిచిపోతుంది. కావాల్సిన ధ్రువపత్రాలు పాస్పోర్టు సైజ్ ఫొటో, బోనాఫైడ్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, స్థానికత ఽధ్రువపత్రం, పదోతరగతి మెమో, చివరి కోర్సు మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్, జీఆర్ఈ/జీమ్యాట్/ఇతర స్కోర్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ, పాస్పోర్టు కాపీ. కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల్లోపు ఉండాలి. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జీఆర్ఈ/జీమ్యాట్లో అర్హత మార్కులు సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు. దరఖాస్తు గడువు మార్చి 31. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవచ్చు. -
కరీంనగర్
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026I‘అంబేడ్కర్ విద్యానిధి’ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం వరంగా మారింది. డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది. పత్తి మార్కెట్కు సెలవుజమ్మికుంట: స్థానిక మార్కెట్లో సోమవారం క్వింటా ల్ పత్తి రూ.7,750 పలికింది. ఎన్నికల సందర్భంగా మంగళ, బుధవారాలు మార్కెట్కు సెలవు ఉంటుందని చైర్పర్సన్ స్వప్న, కార్యదర్శి రాజా తెలిపారు.ఆకాశం నిర్మలంగా ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
కరీంనగర్ క్రైం: జిల్లాలో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ గౌస్ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడంపై నిషేధం విధించినట్లు తెలి పారు. కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈనెల 10న ఉదయం 6 గంటల నుంచి 12న ఉద యం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఏదైనా చట్టబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్: ఆదరించి గెలిపిస్తే ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్రావు అన్నారు. సోమవారం 42వ డివిజన్ భగత్నగర్లో విస్తృత ప్రచారం చేశారు. వివేకానందస్కూల్, అయ్యప్ప టెంపుల్, గోదాంగడ్డ మెయిన్రోడ్డు, గోదాం గడ్డ వాటర్ట్యాంక్, సాయికృష్ణ థియేటర్ తదితర ప్రాంతాల్లో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాననే భరోసా కల్పిస్తుండటంతో ఓటర్లు వారి వైపు మొగ్గుచూపుతున్నారు. చైతన్య, ఆదర్శ, జై భీమ్, మహాదేవ యూత్ క్లబ్ సభ్యులు, భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, డివిజన్ పెద్దలు, మహిళలు, పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్: మున్సిపల్ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్, అదనపు కలెక్టర్ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎం.మనోహర్, సయ్యద్, ముసాబ్ అహ్మద్, మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే తాను ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని ఓ అభ్యర్థి వినూత్న ప్రచారం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. కరీంనగర్ నగరపాలక పరిధిలోని 17వ డివిజన్ (కొత్తపల్లి) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల కవిత చంద్రశేఖర్ రూ.100 బాండ్ పేపర్పై హామీలు ఇస్తూ సోమవారం స్థానిక ప్రజలకు ఒప్పంద పత్రం రాసిచ్చారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే సొంత నిధులతో డివిజన్లోని ప్రతీ ఆడబిడ్డ వివాహానికి కానుకగా రూ.10,116, డివిజన్లో ఆడబిడ్డ జన్మిస్తే రూ.10,116 ఫిక్స్డ్ డిపాజిట్, ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారానికి రూ.5,016 అందజేస్తానంటూ ఒప్పంద పత్రాన్ని విడుదల చేశారు. హామీల బాండ్ పేపర్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ పలువురు స్వాగతిస్తున్నారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రంగా కరీంనగర్ ఎస్సారార్ కళాశాలను నిర్ణయించినందున ఈ నెల 10 నుంచి 13 వరకు కళాశాలకు సెలవులు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా కళాశాల ప్రాంగణంలోకి విద్యార్థులను అనుమతించబడరని, గమనించాలని పేర్కొన్నారు. -
శాస్త్రవేత్తకు డాక్టరేట్
పట్టా అందుకుంటున్న శేఖర్ కరీంనగర్రూరల్: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్కు వ్యవసాయ విద్యలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పని చేస్తున్న శేఖర్.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నవంబర్– 2025లో జరిగిన యూజీ (సీబీసీఎస్) (ఆర్19) మొదటి సెమిస్టర్ (బ్యాక్లాగ్), మూడవ, ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. www. satavahana. ac. in వెబ్సైట్లో ఫలితా లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతిచెందాడు. టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన అన్న వరుణ్ (26) సోలార్ సిస్టం కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటిపై సోలార్ సిస్టం అమర్చేందుకు స్లాబ్పైకి ఎక్కిన క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లే 11 కేవీ వైర్లు తాకి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన ఇంటి యజమాని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్ బీఫామ్లు తెచ్చుకుని.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేతఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్ శంకర్, డ్రైవర్ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్, అకడమిక్ ఇన్చార్జి ఇజాజ్ఖాన్, హెచ్వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు. -
సంతోషంగా ఉంది
హైదరాబాద్ నారాయణ గూడలోని ఆర్బీవీఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఓటు మన జన్మ హక్కు. దాన్ని సద్విని యోగం చేసుకుంటా. అవినీతిపరులకు కాకుండా అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేస్తా. – ఆవుదరి సిరిచందన, రాంనగర్ హైదరాబాద్లోని ఓరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నా. గత సంవత్సరం ఓటు నమోదు చేయించుకున్నా. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వినియోగించుకోనున్నాను. మనది ప్రజాస్వా మ్య వ్యవస్థ. కీలకమైనది, అత్యంత విలువైనది దేశం కల్పించిన హక్కు ఓటు. ఓటు సక్రమంగా వినియోగిస్తే నిజాయితీపరులు ఎన్నికవుతారు. – పల్లెర్ల స్నేహిత, అశోక్నగర్ గచ్చిబౌలిలోని నియట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓటేయడం ఎంతో ముఖ్యం. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ.. అభివృద్ధి కోసం, ప్రజలకు స్వార్థం లేకుండా సేవలందించాలనే ఉద్దేశంతో పోటీలో నిలబడిన వారిని గుర్తించి ఓటెయ్యాలి. – నరాల సాయి మనుహార్ష్ -
కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం నిల్వలు
● పట్టుకున్న ఎంఐఎం కార్యకర్తలు జగిత్యాలక్రైం/ జగిత్యాలలోని ఓ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్లు డంప్ చేస్తుండగా ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని పరిశీలించి వెళ్లిపోయారు. సదరు అభ్యర్థి ఇంట్లోకి వెళ్లకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోచీబజార్లో మద్యం పట్టివేత పట్టణంలోని మోచీబజార్లో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. రూ.3,250 విలువైన 13 లీటర్ల మద్యాన్ని ఇంట్లో ఉంచగా.. పోలీసులు పట్టుకున్నారు. అరవింద్నగర్కు చెందిన ఒకరి ఇంట్లోనుంచి రూ.3వేల విలువైన 2.5లీటర్ల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. -
బీజేపీ, కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీలు
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్టౌన్: బీజేపీ, కాంగ్రెస్లు అభివృద్ధి నిరోధక పార్టీలని, అభివృద్ధి కావాలో, విధ్వంసం కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం 21,47వ డివిజన్ల అభ్యర్థులు చల్లా హరిశంకర్, స్వరూపారాణిలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు జనరంజక పాలన సాగించామని గుర్తు చేశారు. కులాల పేరిట పెనుగులాటలు, మతాల పేరిట మారణహోమాలు, వర్గాల పేరిట విభజించి పాలించడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. అనంతరం 17,18వ డివిజన్ల అభ్యర్థులు రుద్ర నవిత, జమీలోద్దిన్కు మద్దతుగా ప్రచారం చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్, బీజేపీలు 2 రూపాయల అభివృద్ధి చేయలేదని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు, సెంటిమెంట్తో ఓట్లు దండుకునే బీజేపీకి ప్రజల చీత్కారం తప్పదని హెచ్చరించారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు డబ్బుల సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారని, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అలాగే 16,37,4,5వ డివిజన్ల అభ్యర్థులు బెజ్జంకి అయిలయ్య, గాదె స్వరూప, రామచంద్రం తదితరులకు మ ద్దతుగా రోడ్ కార్నర్ నిర్వహించారు. హరీశ్రావు, రుద్ర రాజు, శ్రీనివాస్, శ్రీనివాస్గౌడ్, గంగాధర చందు, మల్లేశం పాల్గొన్నారు. -
పుర.. పలోభాల ఎర!
కరీంనగర్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. పోలింగ్కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉండడంతో ఇక రాజకీయ సీన్ రసవత్తరంగా మారబోతోంది. ఓటర్లే లక్ష్యంగా అన్ని రకాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు బహిరంగ ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు గడువు ముగియడంతో అంతర్గత ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రచారాల జోరు ఇదిలా ఉండగా కాంగ్రెస్కు సీఎం రేవంత్రెడ్డి చొప్పదండిలో ప్రచారం నిర్వహించగా, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు విస్త్రృత ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ అన్నీ తానై ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని సుడిగాలి పర్యటన చేశారు. మాజీ ఎంపీ, సినినటీ నవనీత్కౌర్ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్షాన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, పంజాల శ్రీనివాస్, ఏఐఎఫ్బీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి అంబటి జోజిరెడ్డి, బీఎస్పీ పక్షాన ఎంపీ సుందర్పాల్ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. బహిరంగ ప్రచారానికి తెర మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. రోడ్షోలు, ఇంటింటా ప్రచారాలు, మైక్లు, లౌడ్ స్పీకర్లతో ఎన్నికల ప్రచారం రక్తికట్టింది. బహిరంగ ప్రచారం ముగియడంతో అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలిసి ఓటు కోసం ప్రాధేయపడనున్నారు. గంపగుత్తగా కుల సంఘాల ఓట్లను సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఓటర్లను నయానో, బయానో ఒప్పించి వారి మద్దతు కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఎన్నికలకు ఒక్కరోజు గడువు ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. మందు, విందు, వినోదాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు జరిగాయి. మద్యం పంపిణీకి అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ప్రచారం పరిసమాప్తం -
తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం భూస లక్ష్మణ్, తెలుగు సబ్జెక్టు టీచర్ శివకుమార్ పాల్గొన్నారు. అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం -
ఓటిక్కడ.. కేంద్రం అక్కడ
కరీంనగర్రూరల్: మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ఓటర్లకు భారంగా మారింది. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటరు జాబితా ప్రకారం సమీపంలోని పోలింగ్స్టేషన్లో ఓటు వేసే సౌకర్యం కల్పించాల్సి ఉండగా అధికారులు దూరంగా ఉన్న మరో స్టేషన్ను కేటాయించడం వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ అధికారులకు స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఓటర్లకు దూరభారంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్లో దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలను విలీనం చేసి 4,5వ డివిజన్లుగా విభజించారు. 4వ డివిజన్లోని గోపాల్పూర్ ఓటర్లకు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని విస్మరించి 2 కిలోమీటర్ల దూరంలోని దుర్శేడ్ జెడ్పీ స్కూల్లో పోలింగ్ కేంద్రం కేంటాయించారు. అలాగే దుర్శేడ్లోని సుమారు 760మంది ఓటర్లకు స్థానిక జెడ్పీ స్కూల్లో కేంద్రం కేటాయించకుండా గోపాల్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో కేటాయించారు. దీంతో రెండు గ్రామాల ఓటర్లు ఓటేసేందుకు నాలుగైదు కిలోమీటర్లు దూరం పోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, 5వ డివిజన్ పరిధిలోని దుర్శేడ్కు చెందిన సుమారు 500 మంది ఓటర్లకు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో కాకుండా దాదాపు 5కిలో మీటర్ల దూరంలోని బొమ్మకల్ రజ్వీచమన్లో ఐక్యుర జెమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను కేటాయించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేసేందుకు ముందుకువచ్చే అవకాశం లేకపోవడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. కళాశాలకు చెందిన బి.సంధ్య, కె.అజయ్ అనే విద్యార్థులు 2026 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి, ఎన్సీసీపీఐ స్టాఫ్ పి.అశోక్, కేర్ టేకర్ జి.రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదారు విజయ్కుమార్, హవల్దార్ పీవీరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
మా నాన్నను కాపాడండి
చందుర్తి(వేములవాడ): రెక్కాడితేనే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని కొద్ది రోజులుగా విధి వెంటాడుతోంది. పది నెలల క్రితం తల్లి కేన్సర్తో మృతిచెందగా.. ఇప్పుడు తండ్రి గుండె సంబంధిత వ్యాధితో ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఖరీధైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబానికి అండగా నిలిచే దిక్కులేక ఆ ఇంటి పెద్దబిడ్డ తన తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన మ్యాదరి విజయ, లక్ష్మణ్ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు పావని(16), కుమారులు నితిన్(12), రిషిత్(10). ఈ దంపతులు ఇద్దరు కూలీ పనిచేసి జీవించేవారు. గతేడాది తల్లి విజయకు నోటి కేన్సర్ వచ్చింది. వ్యాధి ముదిరి 10 నెలల క్రితం మృతిచెందింది. తండ్రి అన్నీతానై పిల్లలను సాదుకుంటున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజులుగా మంచం పట్టడంతో 16 ఏళ్ల కూతురు పావని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గుండె పంపింగ్ సరిగ్గా లేదని.. ఇక్కడ వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేవని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది చెప్పారు. అయితే ఎలాంటి దిక్కులేని ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వాస్పత్రిలో తండ్రి మంచం పక్కన కూర్చొని ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దాతలు 95423 96066లో సంప్రదించి, ఆదుకోవాలని కోరుతుంది. పది నెలల క్రితం కేన్సర్తో తల్లి మృతి నేడు ప్రాణాపాయ స్థితిలో తండ్రి ఆదుకోవాలని వేడుకుంటున్న కూతురు -
ఐదేళ్లలో గ్రేటర్ కరీంనగర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘కరీంనగర్ కార్పొరేషన్ను ఐదేళ్లలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తాం.. కరీంనగర్కు త్వరలో రానున్న ఔటర్ రింగ్రోడ్డుతో నగర రూపురేఖలు మారనున్నాయి. సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. ప్రతీ ఇంట్లో కాంగ్రెస్ ప్రజాపాలన లబ్ధిదారులు ఉండటం మాకు కలిసి వచ్చే అంశం. అందుకే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 50పైగా సీట్ల తో విజయదుందుబి మోగిస్తాం. మజ్లిస్ పార్టీతో మాకు ఎలాంటి పొత్తు లేదు. ముస్లింలు, దళితులు మా సంప్రదాయ ఓటు బ్యాంకు. వారెప్పుడూ మాతోనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ–బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో చేతులు కలిపాయి. కాంగ్రెస్ను ఓడిచేందుకు కరీంనగర్లో గంగుల– బండి జతకలిశా రు. అయినా మా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ‘సాక్షి’తో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ అన్నారు. స్మార్ట్సిటీ పేరిట దోపిడీ నగరంలో స్మార్ట్సిటీ పేరిట రూ.వందల కోట్లు ప్రజాధనం దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి సంజయే చెప్పారు. తీవ్ర అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను, అవినీతి అనకొండలను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారు?. బీఆర్ఎస్– బీజేపీ చేతులు కలిపాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అందుకే, ఇద్దరు కలిసినా హస్తం పార్టీని ఓడించలేరని బండి సంజయ్, గంగుల కమలాకర్కు సవాలు విసురుతున్నా. ఆ రెండు పార్టీల్లో కార్పొరేటర్లు బెయిల్ మీద ఉండి పోటీ చేస్తుండటం బీజేపీ– బీఆర్ఎస్ అవినీతి విధానాలకు అద్దం పడుతోంది. మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతె న నిర్మాణాల్లో లోపాలు, ఖర్చులో అవకతవకలపై విచారణ జరిపిస్తాం. అధ్యయనం అనంతరం ప్రాజెక్టులను పునరుద్ధరిస్తాం.నగరంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తాం. ముఖ్యంగా గత పాలకమండలి ముస్లిం, దళితవాడలలో సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. నగరాభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కీలక పాత్ర పోషించనుంది. ఔటర్ వెలుపల ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు వచ్చి, వలసలు పెరుగుతాయి. ఐదేళ్లలో ఇప్పుడున్న 4లక్షల జనాభా కాస్తా.. 6 నుంచి 7 లక్షలు దాటుతుంది. నగర ఆర్థికాభివృద్ధి కూడా మెరుగుపడగానే.. గ్రేటర్ నగరంగా అప్గ్రేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి మాటిచ్చినట్లుగా డంపింగ్యార్డు సమస్య తీరుస్తాం. నగరం మొత్తానికి 24 గంటల తాగునీరు అందజేస్తాం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవించేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను తీర్చిదిద్దాం. సోనియా సైనికులుగా, సీఎం రేవంత్ అనుచరులుగా కరీంనగర్ బల్దియాపై మూడురంగుల జెండా ఎగరేస్తాం. -
దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య
వీర్నపల్లి(సిరిసిల్ల): ఉపాధి కోసం ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన యువకుడు అక్కడ తనువు చాలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విషాదం నింపింది. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్ (22) దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాకేశ్ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేక, ఇంటి నిర్మాణానికి చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించక కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న తల్లి లక్ష్మి, సోదరుడు సతీశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్పంచ్ సామర్ల దేవరాజు, వడ్డెర సంఘం నాయకులు గోగుల రమేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన షేక్ నయూం(43) ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నయూం ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి జరీనాబేగం ఈనెల 7న రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో నయూం నర్సింగాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించాడు. నయూంకు భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తల్లి వద్దే ఉంటున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో వృద్ధుడి మృతికొడిమ్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన చిన్న శంకరయ్య అనే వృద్ధుడు అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్న్స్కు స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది శంకరయ్యను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. -
కళకు జీవితమిస్తే..
ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్పూర్ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు. – పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్పూర్ -
నేను.. నా పోరాటం
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్మడ్ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ జీవిత చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్దే కావడం విశేషం. ఎన్కౌంటర్కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్కౌంటర్లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు(57) అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి. ప్రభాకర్ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు.. ● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్స్టేషన్లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు. ● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్వార్లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్, డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్ వన్పల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. కానీ, లోకేటి చందర్రావు అలియాస్ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. ● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్ జోన్ నుంచి పశ్చిమ సబ్ జోన్కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా పనిచేశారు. ● ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు. కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోరాట క్షేత్రంగా ఆత్మకథ పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది. కన్నీటి వీడ్కోలు మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్రావు, మానిక్రావు, నేను చిన్నోడిని చందర్రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్ అయ్యాయని.. రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్కు వచ్చిన హెలీకాప్టర్ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్కౌంటర్లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి. 22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి సోషల్ మీడియాలో వైరల్ -
నిరుద్యోగులకు అండగా కోడింగ్ ట్యూటర్
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు కోడింగ్ ట్యూటర్ అండగా ఉంటుందని కోడింగ్ ట్యూటర్ నిర్వాహకులు ఫణిరాజ్ జాలిగామ అన్నారు. ఐటీ రంగంలోకి రావాలనుకునే అభ్యర్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులకు కోడింగ్, స్కిల్ మేనేజ్మెంట్పై ఆదివారం కరీంనగర్లోని శ్వేత హోటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఫణిరాజ్ జాలిగామ మాట్లాడుతూ యువతకు ఐటీ రంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు, గ్రాడ్యుయేషన్ పూర్తయి నాలుగైదేళ్లు గ్యాప్ ఉన్న వారు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కోచింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో కోడింగ్ నేర్చుకునేందుకు ఇంటర్న్షిప్ చేస్తే లాభా లేంటనే అంశంపై వివరించారు. కోడింగ్, స్కిల్స్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోడింగ్ట్యూటర్ ఆఫీస్కు 9 నెలల పాటు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. కోచింగ్ పూర్తయిన తర్వాత ఎంప్లాయీమెంట్ రాకపోయినా తమ కంపెనీలోనే అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. -
సుస్థిరం.. రామగుండం
రామగుండం: శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా.. రామగుండం ప్రాంతంలో పర్యటించారని, ఆయన అడుగుజాడలతో జలఊటలు ఏర్పడ్డాయని, అవే రామునిగుండాలు కావడంతో దీనికి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ముడిసరుకుల లభ్యతతో విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మారింది. విద్యుత్ రంగంలో దేశవ్యాప్త ఖ్యాతి గడిచింది. భిన్నవర్గాల ఓటర్ల సమ్మేళనంగానూ అవతరించింది. రామగుండంలో ఒకే రైల్వేస్టేషన్ ఉన్నా.. గోదావరిఖనిలో పోలీస్ కమిషరేట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. వాటిపేరు రామగుండంపైనే ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం రామగుండం అంటేనే గుర్తింపు లభిస్తుంది. మద్యం పట్టివేతసిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని భావనరుషినగర్లో రామగిరి దిలీప్ అక్రమంగా రూ.4,537 విలువ గల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. అతడి నుంచి మద్యం సీసాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
● వేములవాడలో మాంసం మాయ
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్సిటీ(ఎఫ్సీఐ)టౌన్షిప్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్సీఐ టౌన్షిప్లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. రోడ్డుపై పడిన బండరాయిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్నగర్కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు. వేములవాడ: ఆదివారం అంటే చికెన్, మటన్ ప్రియులు ప్రత్యేకంగా రుచి వైపు మగ్గుతారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ఈ ఆదివారమే చివరిది కావడంతో మటన్, చికెన్ బిర్యాని పొట్లాలతో అభ్యర్థులు తమ వార్డుల్లో హడావుడి చేస్తూ వారి అనుయాయులు, ఓటర్లకు ముందస్తు పండుగ చూపించారు. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇంటింటి ప్రచారంతోపాటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వేములవాడలోని పలు వార్డుల్లో మటన్, చికెన్ పొట్లాల పంపిణీ జోరుగా సాగింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు సంక్షేమ పథకాల మాటలు వినిపిస్తుండగా మరోవైపు పొట్లాల రాజకీయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓటు వేయించే ముందు కడుపు నింపితే సరిపోతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్స్ దగ్గర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఆదివారం మాత్రం చాలా ఇళ్లలో రాజకీయ రుచితో భోజనాలు జరిగాయని మాత్రం చెప్పొచ్చు. పంపకాలకు ప్లాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు పంపకాలపై దృష్టి సారించనున్నారు. కుల సంఘాలు, యూత్, మహిళా సంఘాలు, గ్రూపులవారీగా పంపకాలు జరిపేందుకు ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: వారంతా బంధువులు. ఒకే కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు. మున్పిపల్ ఎన్నికల్లో మాత్రం వైరివర్గాలుగా మారిపోయారు. ఆయా పార్టీల నుంచి కార్పొరేటర్ స్థానానికి పోటీపడుతున్నారు. నగరపాలకసంస్థలో సం్ఙకులశ్రీ సమరానికి వేదికగా మారింది 23వ డివిజన్. పోటీలో ఉన్న ప్రత్యర్థులంతా మున్నూరుకాపులు కావడమే ఆ డివిజన్ స్పెషల్. నగరంలోని 23వ డివిజన్ స్థానానికి మున్నూరు కాపు కులస్తులే పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, బీజేపీ నుంచి పాదం శివరాజ్, కాంగ్రెస్ నుంచి గుమ్మడి రాజ్కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వీరంతా కూడా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా బంధువులు కావడంతో ఆ డివిజన్ ప్రస్తుత ఎన్నికల్లో స్పెషల్గా మారింది. 1, 2, 36వ డివిజన్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కాకపోతే 1వ డివిజన్లో ఐదుగురు అభ్యర్థులకు గాను నలుగురు, 2వ డివిజన్లో ఆరుగురిలో ఐదుగురు, 36వ డివిజన్లో ఏడుగురిలో ఆరుగురు మున్నూరుకాపులే పోటీలో ఉండడం విశేషం. నగరంలో ఈ సం‘కుల’ సమరం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలకసంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. మున్సిపల్ పోరు.. నాన్వెజ్ జోరుబంధువులే ప్రత్యర్థులు -
ఓటరు మహాశయులారా
కోల్సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య శ్రీపలానా గుర్తుకే మన ఓటుశ్రీ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది. మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్గా, గాయకుడిగా, నృత్య మాస్టర్గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని -
మౌనమే అయితే..
కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్ ఓవర్ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ శ్రీఈ వాయిస్ కావాలిశ్రీ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందులు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్ అయ్యాను. అనుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారులను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది. – మేజిక్రాజా, వాయిస్ ఓవర్ కళాకారుడు, గోదావరిఖని -
ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన
శంకరపట్నం: మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ బృందం సభ్యులు ఆదివారం పర్యటించారు. రాష్ట్రస్థాయిలో స్వయంసమృద్ధి వసతుల గ్రామపంచాయతీగా ఇప్పలపల్లి ఎంపికై ంది. ఈ మేరకు గ్రామంలో పర్యటించిన రాష్ట్రబృందం సభ్యులు గ్రామ పంచాయతీ భవనం, గ్రామైక్య మహిళా సంఘం భవనం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, నర్సరీ, పాడిపశువుల పెంపకం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.జాతీయస్థాయికి ఎంపికై తే రూ.50 లక్షల అవార్డు అందుతుందని పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ అదనపు కమిషనర్ జాన్వెస్లీ తెలిపారు. డీపీవో జగదీశ్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో ప్రభాకర్, సూపరింటెండెంట్ రఘువేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీలు, దళితులకు కాంగ్రెస్ బాసటగా నిలుస్తోంది. మా పార్టీ ముస్లింల అభివద్ధికి కట్టుబడి ఉంది. ఈసారి మేం బల్దియాలో మెరుగైన స్థానాలు సాధిస్తాం. నగరంలో పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో కనీస సదుపాయాలు లేక మైనార్టీ ప్రాంతాలు వెనకబడ్డాయి. స్మార్ట్సిటీ పేరుతో అభివద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈసారి బల్దియాపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం. ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటాం. ముఖ్యంగా ఉపాధి, నైపుణ్య అభివద్ధి, ఆరోగ్యం, వసతుల కల్పనలో పూర్తి ప్రాధాన్యం కల్పిస్తాం. – వెలిచాల రాజేందర్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, కరీంనగర్ -
కాంగ్రెస్ వర్సెస్ మజ్లిస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియా పోరు అనూహ్య మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో గెలిచి కింగ్మేకర్గా నిలుస్తామని ఉవ్విళ్లూరుతున్న మజ్లిస్కు పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ వ్యూహాలకు గాలిపటం ఎదురీదుతోంది. మజ్లిస్ ఆశలు పెట్టుకొన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్ పథకం వేస్తోంది. గతంలో పలుమార్లు కలిసి పీఠాన్ని నడిపిన గాలిపటానికి ఈసారి చేతి సాయం దూరమయ్యేలా కనిపిస్తోంది. మిత్రపక్షంతో స్నేహంగా ఉంటూనే సొంతంగా మెజారిటీ సాధించాలన్న కాంగ్రెస్ పట్టుదల ఆచరణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఎంఐఎంలోని పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడం ప్రతికూలాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ సొంత బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు తిరుగుబాటుదార్లు బీఆర్ఎస్లో చేరి పోటీ చేయడంతో ముస్లిం ఓట్లు గంపగుత్తలా పడే మార్గాలు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరాన్ని బట్టి పొత్తులకు వెళ్లేలా కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోంది. విజేతగా నిలిచేనా? ప్రతీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు మజ్లిస్ చాంపియన్గా ఉంటూ వస్తోంది. ఎన్నిక ఏదైనా ఎంఐఎం వైపే ముస్లిం సమాజం నిలుస్తుందనే భావన ఉంటుంది. నగరపాలకసంస్థ ఎన్నికల్లో గతంలో పలుమార్లు ఇది రుజువైంది కూడా. మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా 50 డివిజన్లకు గాను తొమ్మిది స్థానాలు గెలుచుకొని డిప్యూటీ మేయర్ను సొంతం చేసుకుని సత్తా చాటింది. పైగా ఎంఐఎం మద్దతుతోనే అప్పుడు మేయర్ అభ్యర్థి చివరినిమిషంలో మారారనే ప్రచారం సాగింది. తరువాత జరిగిన రెండు నగరపాలకసంస్థ ఎన్నికల్లో ఎంఐఎం సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గడమే అందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో 60 డివిజన్లకు కేవలం ఆరు స్థానాలకే ఎంఐఎం పరిమితమైంది. ముస్లిం ఓట్లకు కాంగ్రెస్ గాలం పదేళ్లపాటు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమ వైఖరినీ మార్చుకుంది. ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బాసటగా నిలుస్తూ వస్తోంది. కరీంనగర్ బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం కనీసం పది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకొని, మేయర్ ఎన్నికల్లో చక్రం తిప్పుతుందని అంతా భావించారు. బయట ప్రచారం అదే సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఓటు బ్యాంకును పెంచుకొనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ముస్లిం, దళితుల ఓట్లను ఆకర్షిస్తోంది. సహజంగా ఎంఐఎం బలంగా ఉన్న చోట కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పోటీలో నిలుపుతుంది. ఈసారి ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎంఐఎంకు కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టిపోటీ నెలకొంది. ఎంఐఎం మద్దతు అవసరం పడకుండా, నేరుగా ముస్లిం ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో పావులు కదుపుతున్నారు. ఎంఐఎంకు ఓటు వేయడం ద్వారా బీజేపీకి పరోక్షంగా లాభం జరుగుతుందనే ఆలోచనకు వస్తున్న ముస్లిం మేధావులను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఎంఐఎం నుంచి విడిపోయిన ఓ బలమైన వర్గం బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగడం ఎంఐఎం గడ్డు పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్ నాటికి ఉన్న పరిస్థితి పోలింగ్ నాటికి ఎంఐఎంకు లేకుండా పోవడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం. -
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
కరీంనగర్క్రైం/కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఆదివారం కమిషనరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పనిచేస్తున్నాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని 66 వార్డులను వివిధ క్లస్టర్లుగా విభజించామని, ఏదైనా సమస్య తలెత్తితే నిమిషాల్లో స్పందించేలా పెట్రోలింగ్ పార్టీలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. 25శాతం కేంద్రాలను ‘క్రిటికల్’గా గుర్తించామని, అక్కడ వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ హాల్ను, పోలింగ్ స్టేషన్ను బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద లైటింగ్, ఫర్నిచర్, తాగు నీటి వసతి, రవాణా కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్ లెక్కింపు కోసం ట్రేలు, ర్యాకులు, టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ వెంకటరమణ, సీఐలు సృజన్ రెడ్డి, రాంచందర్ రావు, తిరుమల్ పాల్గొన్నారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
కరీంనగర్: కేంద్రం నిధులతోనే నగరం అభివృద్ధి చెందిందని 42వ డివిజన్ బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్ రావు అన్నారు. ఆదివారం డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీవాసులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని తెలిపా రు. స్మార్ట్సిటీ కింద కరీంనగర్ను ఎంపిక చేసి, తెలంగాణలోనే సుందరమైన నగరంగా కేంద్రం తీర్చిదిద్దిందన్నారు. మేయర్ పనిచేసిన ఐదేళ్లలో నగరంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు ఎంత కృషి చేశారని తెలిపారు. 42వ డివిజన్ కార్పొరేటర్గా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు, గొల్ల పల్లి గ్రామాల్లో ఆదివారం మత్స్యగిరీంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. గుట్టపై నుంచి తీసుకువచ్చిన స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగిస్తుండగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చైర్మన్ కోరెం రాజిరెడ్డి, ఆలయ పూజారులు శేషం ము రళీధరాచార్యులు, మాధవాచార్యులున్నారు. రెండోరోజు 1,532 ఓట్లు కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండవరోజు ఆదివారం 1,532 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 2062 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సోమవారం సైతం ప్రక్రియ కొనసాగనుంది. -
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్/తిమ్మాపూర్/చొప్పదండి: కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే నగర రూపురేఖలు మారుస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్లో విజయసంకల్పయాత్రతో పాటు అలుగునూరు, సదాశివపల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అలుగునూరు తలాపునే మానేరు ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యారన్నారు. మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే 24 గంటల తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. సదాశివపల్లి, హౌసింగ్ బోర్డు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ ఎత్తున ‘విజయ సంకల్ప ర్యాలీ’ నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్కౌర్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే టాక్స్లు పెంచుతారు కేంద్రం నుంచి నిధులు ఇచ్చేది మోడీ అని, అవి తెచ్చేది బండి అని, అలాంటప్పుడు కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండిలోని మార్కెట్చౌరస్తాలో ఆదివారం జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు, చొప్పదండి, అన్ని మున్సిపాలిటీలకు నిధులిచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటేందుకు వేయాలని ప్రశ్నించారు. పదేళ్లపాలనలో ప్రభుత్వ స్థలాలతో పాటు, ప్రజల జాగాలను కబ్జా చేసి అరాచకలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఏం ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రం నిధులతోనేనన్నారు. చొప్పదండికి అమృత్ 2 ద్వారా రూ.36.30 కోట్లు, 14,15 ఆర్థిక సంఘాల ద్వారా రూ.5.57 కోట్లు, స్వచ్ఛ భారత్ ద్వారా రూ.42లక్షలు కేంద్రం ఇచ్చిందన్నారు. స్వనిధి ద్వారా 1,611 మంది రూ.2.94కోట్లు లబ్ధి పొందారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్టౌన్: కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని, రెండున్నరేళ్లలో కరీంనగర్కు నయాపైసా తేలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 41,22,23,46,14,15,13,26,54 డివిజన్ల అభ్యర్థులు తోట సుగుణ, జంగిలి సాగర్, బోనాల శ్రీకాంత్, గడ్డి ప్రదీప్, గుర్రాల శివ, కంజర్ల రేణుక, మేడి ఉమా మహేశ్వర్, నాంపల్లి భవాని, మంథెన అనితకు మద్దతుగా కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ల్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ తరువాత కరీంనగర్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలది ఓట్ల రాజకీయాలే తప్ప అభివృద్ధి పట్టదని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ అడ్డగోలు అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. వేంకటేశ్వరస్వామి ఆలయం కోసం పది ఎకరాల భూమి కేటాయించామని, ఇప్పటికీ నిర్మా ణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. గ్రేటర్ రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడుతూ రెండు పర్యాయాలు నగర మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్కు అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపించామని, మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. -
త్రిముఖ పోరు.. ప్రచార జోరు
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: జిల్లాలో రాజకీయ ప్రముఖుల మకాం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు గల్లీ.. గల్లీలో పర్యటనలు.. చౌరస్తాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు.. మైకుల్లో దద్దరిల్లే వాగ్దానాలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఇంటింటా ప్రచార జోరుతో మున్సిపల్ ఎన్ని కల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచార ముగింపునకు మరి కొద్ది గంటలే సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు.. మద్దతుదారులు చెమటోర్చుతున్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుండగా.. సింహం గుర్తుతో బరిలో నిలిచిన వారితో పాటు పలువురు స్వతంత్రులు సైతం గట్టి పోటీనే ఇస్తున్నారు. మూడు పార్టీల దూకుడు కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. కొద్దిరోజుల నుంచి నుంచి అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు డివిజన్ల వారీగా స్ట్రీట్కార్నర్ మీటింగ్లతో గల్లీగల్లీల్లో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి 50 నుంచి 100 మంది కార్యకర్తలను వెంటేసుకొని ఇంటింటా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలతో పాటు రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలను ప్రచారంలో అస్త్రాలుగా చేసుకుంటున్నాయి. -
లారీ, బస్సును ఢీకొన్న ఇసుక లారీ
● ఆరుగురు ప్రయాణికులు, లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు ● బోల్తా పడ్డ యూరియా లారీ పగిలిన ఆర్టీసీ బస్సు అద్దాలు బోల్తా పడ్డ యూరియా లారీ శంకరపట్నం: తాడికల్ గ్రామంలో శనివారం యూరియా లారీ, ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొంది. ప్రయాణికులు, స్థానికుల వివరాల ప్రకారం.. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్తో వస్తున్న లారీ వెనుక హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు 70 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తోంది. తాడికల్కు చేరుకున్న క్రమంలో యూరియా లారీని ఇసుక లారీ ఢీకొట్టిడంతో యూరియా లారీ బోల్తా పడింది. యూరియా లారీ వెనకాల వస్తున్న హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సును సైతం ఇసుక లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యూరియా లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనానికి సమాచారమందించారు. ఆలస్యం కావడంతో ఆటోలో కొందరిని హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని 108 వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు -
స్వామి.. ఓ సంచలనమే
సిరిసిల్ల: మావోయిస్టు చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ హయాంలో సిరిసిల్ల ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిచింది. పీపుల్స్వార్(ప్రస్తుత మావోయిస్టు) పార్టీ పశ్చిమ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడి రెండేళ్లపాటు పనిచేశారు. తన కాలంలో భారీగా రిక్రూట్మెంట్స్తో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ప్రస్తుతం సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేటి చందర్రావు(57) గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో స్వామితోపాటు ఏడుగురు మరణించారు. ఈ ఎన్కౌంటర్లో పోలీస్ కమాండో కానిస్టేబుల్ దీపక్ చిన్నమదవి మంద్రా(38) ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడికి చెందిన చందర్ రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. కోనరావుపేట ఎస్సైపై కాల్పులు 1998లో కోనరావుపేట ఎస్సైగా ఉన్న ముసిపట్ల శ్రీనివాస్గౌడ్ పోలీసు బలగాలతో శివారు అడవుల్లోకి కూంబింగ్కు వెళ్లారు. ఎగ్లాస్పూర్కు చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిమ్మపల్లి వైపు వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న మావోయిస్టు స్వామి దళం పోలీసులపై మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు. కూంబింగ్లో ముందు వరుసలో వస్తున్న శ్రీనివాస్గౌడ్ అక్కడికక్కడే మరణించారు. మరికొందరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు. ● అదే ఏడాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు కెనాల్ పక్కన హోంగార్డు శ్రీనివాసరాజు కోవర్టుకు పాల్పడుతున్నాడని కాల్చి చంపారు. ● కోనరావుపేట మండలం వట్టిమల్లలో 1997, జూలై 28న మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సాయుధ నక్సలైట్లతో నిర్వహించారు. వట్టిమల్ల వేదికగా జనాన్ని సమీకరించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగించారు. వట్టిమల్లకు వచ్చే నాలుగు దారుల్లోనూ సాయుధ నక్సలైట్లతో మందుపాతరలు అమర్చి మూడు గంటలపాటు పొద్దంతా సమావేశాన్ని నిర్వహించడం అప్పట్లో ఓ సంచలనం. ● వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం మరిమడ్లలో అటవీశాఖ కాంట్రాక్టర్ల ద్వారా తునికాకు సేకరణ చేసింది. కూలీలకు కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించి సేకరించిన తునికాకును నిల్వ చేశారు. రూ.కోటి విలువైన తునికాకును లారీల్లో మధ్యప్రదేశ్కు అమ్మేసి ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని గ్రామాభివృద్ధికి, కొంత ఉద్యమ అవసరాలకు వినియోగించారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ● 1999లో కోనరావుపేట మండలం నిజామాబాద్లో ప్రజాకోర్టును నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మీడియాను తెప్పించి ప్రజాకోర్టును ఏర్పాటు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీ సానుభూతిపరుడు భానును, కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన నాగరాజు గర్జనపల్లి అడవుల్లో పట్టుకుని కాల్చి చంపారు. అప్పట్లో పీపుల్స్వార్కు, జనశక్తి పార్టీలకు మధ్య వైరుధ్యాలు ఉండేవి. ఆధిపత్య పోరులో భాగంగా జనశక్తికి చెందిన ఇద్దరిని కాల్చిచంపారు. ఇంకా అనేక హింసాత్మక ఘటనలకు, భౌతికదాడులకు, సంచలన ఘటనలకు పడ్కల్ స్వామి కేంద్రబిందువుగా నిలిచారు. పడ్కల్ స్వామిగా గుర్తింపు 1992 నుంచి అజ్ఞాతంలో ఉన్న స్వామి ఏనాడు ఇంటి ముఖం చూడలేదు. 1993లో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడ్కల్లో సిర్నాపల్లి దళం సేదతీరుతుండగా పోలీసులు దాడి చేశారు. ఆ సంఘటనలో డిప్యూటీ దళకమాండర్ సంజీవ్, గోపి, క్రాంతి మరణించారు. పడ్కల్లో పోలీసులతో రెండు రోజులపాటు ఒక్కడే పోరాడి ఒక్క కానిస్టేబుల్ను కాల్చి చంపారు. అప్పటి డీజీపీ పడ్కల్కు రావడం విశేషం. స్వామి ఉన్న ఇంటికి నిప్పు పెట్టగా ఏకే 47తో కాల్పులు జరిపి పోలీసులు వెనక్కి తగ్గగానే తప్పించుకున్నారు. అప్పట్లో ఇదో సంచనం. అప్పటి నుంచి పడ్కల్ స్వామిగా లోకేటి చందర్రావుకు గుర్తింపు. ఆయన భార్య సులోచన అలియాస్ నవనీత పార్టీలో పనిచేస్తూనే 2016లో అనారోగ్యంతో మరణించారు. ఆయన కొడుకు రమేశ్ ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. రమేశ్ భార్య బుజ్జి అలియాస్ కమలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామి ఎన్కౌంటర్ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రాబల్య గ్రామాల్లో శనివారం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఆవశ్యకతపై ప్రసంగం సిరిసిల్లలో చర్చనీయ ఘటనలు గొడ్చిరోలి ఎన్కౌంటర్లో మృతి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్న మాజీలు, సానుభూతిపరులు -
గెలిపిస్తే అవినీతి రహిత పాలన
కరీంనగర్ కార్పొరేషన్/తిమ్మాపూర్: నగరపాలకసంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అవినీతి లేని పాలనను అందిస్తామని ఐటీ, పరి శ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం నగరంలోని రాంనగర్, అలుగునూరులో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని, కరీంనగర్ బల్దియాపై పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే రూపాయి తీసుకోకుండా భవన నిర్మాణ అనుమతులు ఇస్తామన్నారు. త్వరలోనే అలుగునూర్ చౌరస్తాను మోడల్గా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్రంలోని బీజేపీ యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతోందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్పై కుట్రలు పన్నుతున్నాయని, గతంలో కబ్జాలు, గుండాగిరి స్థితిని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. తమ సర్వేలు 42స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థే మేయర్గా ఎదుగుతాడని హామీ ఇచ్చారు. 11న జరిగే పోలింగ్లో హస్తం చిహ్నానికి ఓటు వేయాలన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఆరెపల్లి మోహన్, ఆకా రపు భాస్కర్రెడ్డి, కవ్వంపల్లి అనురాధ, మల్లి కార్జున రాజేందర్, గోపు మల్లారెడ్డి పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు షురూ
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమఓటు హక్కును వినియోగించుకొనేందుకు శనివారం నుంచి మూ డు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. మొదటి రోజు 527మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం డివిజన్లవారీగా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిర్ణీత ఫారంలో తమ డ్యూటీ సర్టిఫికెట్ను జతపరిచి దరఖాస్తుచేసుకొన్న వారికి అవకాశం కల్పించారు. శనివారం ఉద్యోగులు ఓటు వేసేందుకు కార్యాలయానికి వచ్చినప్పటికి, సమయానికి ఏర్పాట్లు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యం చేస్తున్నారంటూ అధికారులతో వాదనకు దిగారు. 11.30కు ఓటింగ్ ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్లో అధికంగా 12వ డివిజన్లో 36, 6,32, 55,66 డివిజన్లలో ఒక్క ఓటు మాత్రమే నమోదైంది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఓటింగ్ కొనసాగుతుందని న గరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. -
మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
కరీంనగర్రూరల్: మూడేళ్లక్రితం కుటుంబకలహాలతో ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని పోలీసులు ఆధునిక టెక్నాలజీతో నేపాల్లోని ఖాఠ్మాండులో గుర్తించి శనివారం కరీంనగర్కు తీసుకొచ్చారు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు వివరాలు గోదావరిఖనికి చెందిన పస్తం సురేశ్(32)కు దుర్శేడ్కు చెందిన అనూషతో వివాహమైంది. మూడేళ్లక్రితం అత్తగారింటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కరీంనగర్రూరల్పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక విచారణతోపాటు ఆధునిక సాంకేతిక సాయంతో సురేశ్ విశాఖపట్నం,నేపాల్దేశంలోని ఖాఠ్మాండులో నివసిస్తున్నట్లు గుర్తించారు. చివరకు వివిధ ప్రయత్నాల ద్వారా సురేశ్ను పట్టుకుని శనివారం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మిస్సింగ్కేసును చేధించిన పోలీసులను సీఐ నిరంజన్రెడ్డి అభినందించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఎస్సై చల్లా వెంక్రట్రాజం తెలిపారు. మృతునికి 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మెడలో రుద్రాక్ష, ఇతర మాలలు ధరించి ఉన్నాడు. మతిస్థిమితం సరిగ్గా లేక.. కాగితాలు ఏరుకునేవాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే 87126 56417లో సంప్రదించాలని కోరారు. ● పత్తిపాకలో దొంగతనం ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని మెన్నెని వెంకటనర్సింగరావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. వెంకటనర్సింగరావు తన ఇంటికి తాళాలు వేసి పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చిచూడగా తాళం పగులకొట్టి కనిపించింది. లోనికి వెళ్లిచూడగా.. బీరువా ధ్వంసమై ఉంది. అందులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుడికి సంబంధించిన 19 గ్రాముల బంగారు ఆభరణాలు, 510 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం పోలీసులు వేలిముద్రలు సేకరించారు. 25ఏళ్లుగా స్వామివారి కానుకలు ఇక్కడే.. పత్తిపాకలో 2000–2001 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటినుంచి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమకూరే కట్నకానుకలను మాజీ సర్పంచ్ వెంకటనర్సింగరావు ఇంట్లోనే భద్రపర్చుతున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చిన కట్నకానుకలనూ ఆయన ఇంట్లో ఉంచేందుకు భక్తులు రాగా.. తాను స్థానికంగా ఉండడం లేదు, వేరేవారి ఇంట్లో భద్రపర్చాలని చెప్పారు. అయినా, గ్రామస్తులు ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లోనే ఆభరణాలు భద్రతపరిచారు. దొంగలు ఈ ఆభరణాలతోపాటు వాటి తాలూకు జాబితా కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బంగారం, వెండి ఎంతుందనే సమాచారం తెలియడం లేదు. దీనిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ స్పష్టత ఇవ్వలేదు. సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో శనివారం రెండు వేర్వేరు సంఘటనల్లో రూ.4లక్షలు సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన శ్రీనాథ్ తన కారులో వస్తుండగా పోలీసుల తనిఖీల్లో రూ.2లక్షలు నగదు పట్టుబడిందని సిరిసిల్లటౌన్ సీఐ కృష్ణ తెలిపారు. వేములవాడ మండలం ఎదురుగట్ల నుంచి చిగురు వినోద్ సిరిసిల్ల వస్తుండగా స్థానిక చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2లక్షలు నగదు తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. -
సేవలు మెరుగుపరచాలి
కరీంనగర్: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజారోగ్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చిన అధునాతన పరికరాలను ఉపయోగిస్తూ రోగులకు విస్త్తృతసేవలు అందించాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత మందుల వివరాల బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గైనకాలజీ, పిల్లల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో గర్భిణులు, శిశువులకు సేవలు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని తెలిపారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీబీ పరీక్షల సంఖ్య పెంచి జబ్బు ఉన్న వారిని గుర్తించి, మందులు అందజేయాలన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, జీజీహెచ్ ఆర్ఎంవో నవీన పాల్గొన్నారు. మేడారం ప్రసాదం బుకింగ్లో మొదటిస్థానంకరీంనగర్ టౌన్: మేడారం ప్రసాదం బుకింగ్లో కరీంనగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలి చిందని కార్గో మేనేజర్ వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జాతరకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే బంగారాన్ని అందజేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. బుకింగ్స్ చేసుకున్న భక్తులకు బంగారం(బెల్లం), అమ్మవారి ఫొటో, పసుపుకుంకుమ అందించామని తెలిపారు. గతనెల 17 నుంచి ఈనెల 5వ తేదీ వరకు రీజియన్ పరిధిలో 211 బుకింగ్స్ నమోదు అయ్యాయని, రూ.63,089 ఆదాయం వచ్చిందన్నారు. జోన్ పరిధిలో కరీంనగర్ రీజియన్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం రాజు ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చంద్రమౌళి, ఎన్.అన్వేశ్ తదితరులను అభినందించారు. చట్టాలపై అవగాహన అవసరంకొత్తపల్లి(కరీంనగర్): చట్టాలపై అవగాహన లేమితో చాలా మంది నేరాల బాట పడుతున్నారని, విద్యార్థి దశ నుంచే న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సురక్షిత సమాజం ఏర్పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు తెలిపారు. కొత్తపల్లి మండలం ఎలగందుల తెలంగాణ మోడల్స్కూల్లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్యపటేల్, చిట్టి చంద్రప్రకాశ్రెడ్డి, ఏ.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూనే, పౌర బాధ్యతలు నెరవేర్చాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ వేధింపులకు గురైతే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. న్యాయవాదులు కీర్తి శ్రీధర్, బొజ్జ శ్రీలక్ష్మి, అశ్విని, ఎస్.ప్రవీణ్ కుమార్, ఏ.వెంకటేశ్, కే.ఆనంద్ భాస్కర్ పాల్గొన్నారు. రెజ్లింగ్లో సత్తా చాటాలి కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని కరీంనగర్ జిల్లా క్రీడల యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అండర్–15 రెజ్లింగ్ జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. డీవైఎస్వో మాట్లాడుతూ.. రెజ్లింగ్లో జిల్లాకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని సూచించారు. జిల్లా నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాణించినవారు ఈనెల 8న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వహణ కార్యదర్శి మాడగొని వంశీకృష్ణ తెలిపారు. పీడీలు పట్లావత్ శిరీష, సఫియా బేగం పాల్గొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
● గొడ్డలితో నరికి.. కత్తితో గొంతుకోసి ● భార్యను దారుణంగా చంపిన భర్త ● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జగిత్యాలక్రైం: మూడుముళ్లు వేసి.. ఏడడుగులు వేసి.. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను అనుమానిస్తూ.. ఆమైపె కక్ష పెంచుకుని నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి.. కత్తితో గొంతు కోసి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో శనివారం వేకువజామున వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్కు చెందిన అదరవేని మల్లయ్యతో 30 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణ శివారు ఉప్పరిపేటకు చెందిన సత్తవ్వతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా మల్లయ్య భార్యను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిస అయిన మల్లయ్య సత్తవ్వను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు పంచాయితీలు జరిగాయి. వేధింపులు భరించలేని సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయినా వేధించడంతో తల్లిగారింటికి వెళ్లి కొన్నేళ్లు అక్కడే ఉంది. మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇద్దరిని కలిపారు. అప్పటినుంచి సత్తవ్వ పిల్లలను చూసుకుంటూ.. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. కుమారుడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న కూతురు నాలుగురోజుల క్రితం తన ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్లింది. దీనిని అదునుగా చేసుకున్న మల్లయ్య.. శనివారం వేకువజామున రెండు గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సత్తవ్వను గొడ్డలితో నరికాడు. సత్తవ్వ సృహ కోల్పోవడంతో కూరగాయల కత్తితో గొంతు కోశాడు. విచక్షణరహితంగా శరీరంపై పొడిచాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకుని అక్కడినుంచి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి సోదరుడు గడ్డం చిన్నమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. లక్ష్మీపూర్లో విషాదం ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు, కూతురును ఉన్నత చదువులు చదివిస్తున్న సత్తవ్వ హత్యకు గురికావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయంత్రం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు మల్లయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. -
116 ప్రాంతాలు.. 477 కేంద్రాలు
కరీంనగర్ కార్పొరేషన్: నగర ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు 66 డివిజన్లలోని 116 ప్రాంతాల్లో 477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 120కి పైగా సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. 66 డివిజన్లకు గాను 33 రూట్లను నిర్ణయించాం. రూట్కు ఒకరు చొప్పున 33 మంది జోనల్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చాం. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ అయిన ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి 33 రూట్ల ద్వారా వంద బస్సుల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి.. తిరిగి వస్తారు. కమాండ్ కంట్రోల్కు అనుసంధానం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం. 477 పోలింగ్ కేంద్రాల లోపల, 160 చోట్ల పోలింగ్ కేంద్రాల ఆవరణలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ వెబ్ కెమెరాలను నగరపాలకసంస్థ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశాం. పోలింగ్ రోజు కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షించడానికి వీలవుతుంది. పోలింగ్ కేంద్రాలు, బయట వెబ్కాస్టింగ్తో పోలింగ్ సరళిని పరిశీలిస్తాం. పది మోడల్ కేంద్రాలు నగరంలోని 477 పోలింగ్ కేంద్రాల్లో పది మోడల్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వేర్వేరు కేటగిరీల్లో ఈ పది మోడల్కేంద్రాలు ఉంటాయి. పర్యావరణం, స్వచ్ఛసర్వేక్షణ్, కరీంనగర్ హిస్టారికల్, మహిళా ఫ్రెండ్లీ, దివ్యాంగుల ఫ్రెండ్లీ మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. 3 వేల మంది సిబ్బంది ఆర్వోలు, పీవోలు, ఏపీవోలతో పాటు మూడు వేల మంది సిబ్బందిని నియమించాం. వీరంతా పోలింగ్ ప్రక్రియను చేపడుతారు. వీరితో పాటు దాదాపు వేయిమందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఉంటుంది. ఆయా డివిజన్ల వారీగా అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. వసతులు కల్పించాం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాం. లేనిచోట ర్యాంప్లు నిర్మించాం. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం బారినపడిన వాళ్ల కోసం దాదాపు 200 వీల్చైర్లు అందుబాటులో ఉంచాం. టెంట్లు, కుర్చీలు, లైటింగ్ ఏర్పాటు చేశాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు ఏఎన్ఎం బృందం ఉంటుంది. 16న మేయర్ ఎన్నిక ఎన్నికల సంఘం షెడ్యూల్ ఆధారంగా ఈ నెల 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన జరుగుతుంది. నగరపాలకసంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో చేపడతాం. ఎస్ఆర్ఆర్లో లెక్కింపు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను ఎస్ఆర్ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లో భద్రపరుస్తాం. 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. 33 మంది ఆర్వోల ఆధ్వర్యంలో 66 టేబుళ్లు ఏర్పాటు చేశాం. డివిజన్లవారీగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తాం. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు చేపడుతాం. వేయిఓట్లకు ఒక రౌండ్ ఉంటుంది. 25 బ్యాలెట్ పేపర్లకు ఒక బండెల్ తయారు చేసి, ఆ తరువాత వేయి ఓట్లు తీసుకొని అభ్యర్థుల వారీగా లెక్కిస్తాం. అనంతరం ఫలితాలు ప్రకటిస్తాం. నగరపాలకసంస్థ ఎన్నికల ప్రక్రియకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్, 13వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని 66 డివిజన్లలో పోలింగ్ కేంద్రాలు, ఏర్పాట్లు, సిబ్బంది, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను గురించి శనివారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ‘సాక్షి’తో మాట్లాడారు.డబుల్ ఓట్లు.. డెత్ ఓట్లు.. ఆబ్సెంట్తో గుర్తింపు పోలింగ్లో కీలక సమస్య అయినా డెత్ఓట్లు, డబుల్ ఓట్లు, షిఫ్టెడ్ ఓట్లను పోల్ చిట్టీల పంపిణీ ద్వారా గుర్తిస్తున్నాం. ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్లలో ఇంటింటికి ఓటర్ల వారీగా పోల్ చిట్టీలను పంచుతున్నాం. పోల్ చిట్టీలు పంచేటప్పుడు, డెత్ ఓట్లు, షిఫ్టెడ్ ఓట్లు, ఒకటికి మించి ఉన్న ఓట్లు ఉన్న వాళ్లు చిట్టీలు తీసుకొనే పరిస్థితి లేదు. దీంతో ఆ జాబితాను గుర్తించి, సంబంధిత ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తున్నాం. ఆ జాబితా ఆధారంగా అలాంటి ఓట్లపై పీవోలకు ముందుగానే అవగాహన ఉంటుంది. -
సిటీకి రూపాయి తెచ్చావా..?
కరీంనగర్టౌన్/కొత్తపల్లి: కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండున్నరేళ్లలో రూపాయి బిల్ల కేంద్రం నుంచి తెచ్చినట్లు జీవో చూపిస్తే ముల్లేమూట సర్దుకుని పోతా అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. శనివారం నగరంలోని 19,20,30,32,38,62 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు రాజశేఖర్, సుదగోని మాధవి కృష్ణగౌడ్, మేచినేని అశోక్రావు, కలకొండ జ్యోత్న, నక్కపద్మ, బోయినపల్లి శ్రీనివాస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. స్మార్ట్సిటీ తీసుకువచ్చిన అని చెప్పుకునే ఎంపీ బండి సంజయ్ బబీజేపీ కార్పొరేటర్ ఉన్న డివిజన్లలో ఎందుకు రోడ్లు వేయలేదో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తోందన్నారు. రేకుర్తిలోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రేకుర్తి భూములపై సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో మేయర్ పీఠాన్ని గులాబీ పార్టీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నాయకులు అక్బర్ హుసేన్, మధుకర్, మల్లారెడ్డి, గంటల రేణుక, కె.సుధాకర్, ప్రభాకర్, రవీందర్రావు, సంపత్రావు, పవన్ పాల్గొన్నారు. -
పాలిసెట్తో ఉజ్వల భవిత
కరీంనగర్టౌన్: ప్రస్తుతం పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో మెదులుతుంది. చాలా మంది ఇంటర్ చదవడానికి ఆసక్తి చూపుతారు. సంప్రదాయ చదువులు కాకుండా.. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగవకాశాలు కావాలనుకునేవారికి పాల్టెక్నిక్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని విద్యానిపుణులు చెబుతున్నారు. పదో తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాలిసెట్– 2026 ప్రవేశపరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు అవకాశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 40,701 మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 13,156, జగిత్యాల 12,298, పెద్దపల్లి 7,495, రాజన్న సిరిసిల్ల 7,752 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో టెక్నికల్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారు పాలిసెట్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాటారం, హుస్నాబాద్, సిరిసిల్ల(ఆగ్రహారం), కోరుట్ల, కరీంనగర్ జిల్లాకేంద్రాల్లో పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో 480 సీట్లు, హుస్నాబాద్, కాటారం, కోరుట్ల, కరీంనగర్ కళాశాలల్లో 5 కోర్సులకు 66 చొప్పున 330 సీట్లున్నాయి. ఆసక్తిగల విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.300 అపరాద రుసుముతో ఏప్రిల్ 22 వరకు ఫీజు చెల్లించొచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, పదో తరగతిలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఎంపిక చేస్తారు. మూడేళ్ల కోర్సులో ప్రతిభచాటిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా జెన్కో, ఎన్టీపీసీ, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐవోసీఎల్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నికల్ శిక్షకులుగా చేరవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఏప్రిల్ 20 వరకు అవకాశం.. మే 13న ప్రవేశ పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,701 మంది ఎస్సెస్సీ విద్యార్థులు ఉపాధి, ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధికి పాల్టెక్నిక్ విద్య తోడ్పడుతుంది. గ్రామీణ విద్యార్థులకు ఈ కోర్సు ఉపయోగకరం. తక్కువ ఫీజు చెల్లించి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. మూడేళ్ల కోర్సులో ఆరు నెలలు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఇది విద్యార్థుల్లో అవగాహన పెంచుతుంది. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేస్తే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు ఉంటాయి. – డి.శోభారాణి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కరీంనగర్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20 రూ.100 అపరాధ రుసుంతో ఏప్రిల్ 21 ప్రవేశపరీక్ష నిర్వహించే తేదీ మే 13 -
కబ్జాకోరుల అంతు చూస్తా
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లో కబ్జాకోరుల అంతు చూస్తానని.. ప్రజల ఆ స్తులకు రక్షణ కల్పిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఽఅభయమిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఈసారి బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కబ్జాలకు పాల్పడిన 9మంది కార్పొరేటర్లను అరెస్ట్ చేయించి జైళ్లో వేశానన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్లోని మల్కాపూర్, రేకుర్తి లయోలా కాలేజీ, తీగలగుట్టపల్లి బుట్టిరాజారాంకాలనీ, కొత్తపల్లిలో ఏర్పాటచేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. 16,17,18,19, 20,25,26,27 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు కటకం లోకేశ్, డాక్టర్ పుల్లెల ప్రవీణ్, చాడ ఆనంద్ సతీమ ణి తంబాల నవ్యశ్రీ, గిత్త రాజేంద్రప్రసాద్, మూల రుక్మిణి, జాడి బాల్రెడ్డి, గుంటి రమ్య, వాసాల రమేశ్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా? లేదా? అనే విషయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం ఈ విషయమై తమ వైఖరి తెలపాలన్నారు. విలీన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. -
మత్తు కోసం ఏవిల్ ఇంజెక్షన్లు !
● చెట్లపొదల్లో వెలుగుచూసిన సిరంజీలు, ఆంపుల్స్ ముస్తాబాద్ (సిరిసిల్ల): యువత మత్తు కోసం రోజుకో మార్గాన్ని కనిపెడుతున్నారు. తక్కువ ధరకు లభించే ఇంజెక్షన్లు తీసుకుంటూ మత్తులో జోగుతున్నారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ న్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో తెర్లుమద్ది, బందనకల్ గ్రామాల మధ్య చెట్ల పొదల్లో వాడి పడేసిన సిరంజిలు, ఆంపుల్స్ కవర్లు ప్రత్యక్షమయ్యాయి. ఫిజీషియన్ సమక్షంలోనే ఇచ్చే ఈ ఇంజెక్షన్లు ఇలా ఆరుబయట, చెట్లపొదల్లో పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మత్తు కోసమే వాడవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలోనే మత్తు కోసం దగ్గు మందు తాగేవారు. మత్తు కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల క్రైం: మున్సిపల్ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి తరలిస్తున్న మద్యంను సిరిసిల్ల టౌన్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. పట్టణంలోని సుభాష్నగర్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేయగా.. రూ.19,008 విలువైన మద్యం, బైక్, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దార్నం అరుణ, దార్నం లక్ష్మీనారాయణ, మల్లికార్జున వైన్స్, రాచమల్లు రాముపై కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
ముస్లింలు ఎటు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ కార్పొరేషన్లో ముస్లింల ఓటు బ్యాంకు కీలకంగా మారింది. మొత్తం జనాభాలో 20శాతం ఓట్లు ఉన్నా రాజకీయ గుర్తింపు, వసతుల కల్పనలో ప్రాధాన్యం దక్కలేదన్న విమర్శలున్నాయి. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన అభివృద్ధి జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సదుపాయాల కల్పనలోనూ గత పాలకవర్గాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా తమ ప్రాంతాల్లో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ మొదటి నుంచి బల్దియాలో ముస్లింల గొంతుకగా నిలిచిందని, వి గిలిన సమస్యలను తామే పరిష్కరిస్తామని కాంగ్రెస్ అంటోంది. ముస్లింలు తమ వైపే ఉన్నారని, అత్యధిక సీట్లు గెలచుకుంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ నేతలు తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని అంటుండగా.. వారి మద్దతు తమకే ఉందని మజ్లిస్ చెబుతోంది. సమస్యలివే షాదీఖానాలో వసతులు, రిపేర్లు లేక బోసిపోయాయి. కొన్ని ప్రదేశాలలో భూమి కేటాయించినా నిధులు ఇవ్వక నిర్మాణాలు నిలిచిపోయాయి. స్మార్ట్సిటీ బోర్డుల్లో, ఇతర ప్రదేశాలలో ఉర్దూ ప్రాఽ దాన్యం దక్కలేదని అసంతృప్తి ఉంది. నగరంలో బల్దియా తీర్మానాలు చేసినా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రూ.5 భోజన క్యాంటీన్లు ఏర్పాటు చేయలేదు. ముస్లింలు మరణిస్తే అంతిమ యాత్ర పథకం కింద బల్దియా నుంచి రూ.10,000 వసూలు చేసి సగానికిపైగా చేతివాటం ప్రదర్శిస్తున్నా అడిగే నాథు డే లేడు. బల్దియా పరిధిలో ఉన్నవక్ఫ్ ఆస్తులను అద్దెకిచ్చి మార్కెట్ రేట్ ప్రకారం కిరాయి వసూలు చేసేలా చూడాలి. మైనారిటీలలో వీధి వ్యాపారులు అధికంగా ఉన్నారు. వారికి చట్ట ప్రకారం సర్టిఫికెట్ ఆఫ్ వెండింగ్ ఇవ్వాలి. కార్ఖానగడ్డ ప్రాంతంలో దాదాపుగా 20 వేల జనాభా ఉన్నా ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు. మహిళా సంఘాల రుణా ల జారీ పేరిట వెలుగుచూస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయడం లేదు. మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో అంగన్వాడి సెంటర్లు, ఉర్దూ బోధన లేక ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చిన్నారులు దూరమవుతున్నారు. మైనార్టీ ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు, మరుగుదొడ్ల సదుపాయాలు సరిగా లేవు, ఆయా ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు, ఈఎస్ఐ ఆసుపత్రులు లేవు. డబుల్ బెడ్రూం కేటాయింపులో కాలయాపనతో అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తాం కరీంనగర్ బల్దియాలో కాంగ్రెస్– ముస్లిం మైనార్టీలకు విడదీయరాని బంధం ఉంది. గత పాలకవర్గాలు వారిని విస్మరించాయి. స్మార్ట్సిటీ పేరిట నిధులు దోచుకున్నారు. ముస్లింలను విస్మరించారు. కొన్ని ప్రాంతాల్లోనే ఐలాండ్లు నిర్మిస్తే అది స్మార్ట్సిటీ కాదు. కశ్మీర్గడ్డ, రజ్వీచమాన్ తదితర ప్రాంతాల్లో ప్రజల జీవితాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. పేద ముస్లింల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో డ్రెయిన్, రోడ్లు ఇతర సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. – వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి -
ఎవరికెవరు ఏమవుతారో..?!
జగిత్యాలటౌన్: జగిత్యాల బల్దియా ఎన్నికల ప్రచారంలో వింత పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తన అనుచరులైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఎర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో నిమగ్నమయ్యారు. దీంతో ఓట ర్లు విస్తుపోతున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ పా ర్టీ ఫిరాయింపుపై ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్ను కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని మీడియా ముఖంగా ప్రకటించిన ఎమ్మె ల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీ సీనియర్ నాయకుడు స్వతంత్రులకు మద్దతుగా ప్రచారం చేస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ‘ఉపాధి’ ప్రచారం పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఎన్నికలు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పెద్దపల్లిలో పలువురు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. చైర్పర్సన్ అభ్యర్థిగా ముందుకొచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కళాబృందాలతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారశైలిని చూసిన ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు.. మంథని ప్రాంతం నుంచి కళాకారులను రప్పించి ప్రచారం హోరెత్తిస్తున్నారు. వార్డుల్లో ప్రచారం చేస్తే రూ.200 పలువురు అభ్యర్థులు తమగుర్తుతో వార్డుల్లో ప్రచారం చేసేందుకు అదేవార్డుకు చెందిన వారితోనే తిరుగుతున్నారు. వీధుల్లో జెండాలు పట్టుకుని రెండుగంటల పాటు ఇలా తిరిగితే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తున్నారు. ఇలాంటి ప్రజలు పొద్దున ఒకరికి, మధ్యాహ్నం మరొకరిని, రాత్రిపూట ఇంకొకరికి వారివారి జెండాలు, గుర్తులు పట్టుకుని ‘జై అభ్యర్థి.. జై పార్టీ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయం గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు జనాల్ని పోగేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. మీరు మాతో ప్రచారానికి రండి అని అడిగితే.. ‘ఇప్పుడు పలానా అభ్యర్థికి మద్దతుగా వెళ్తున్నాం.. మీరు రెండు గంటల తర్వాత ప్రచారం చేసుకోండి’ అంటూ అభ్యర్థులకు స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. ఓట్ల పండుగ పుణ్యాన మహిళలకు ఇలా రోజుకు కనీసం రూ.600 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. పెద్దపల్లిరూరల్: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటారు. కానీ పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి.. తమకు మద్దతుగా 150 మందిని సమీకరించారు. తన వార్డులో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ, వారందరినీ సమీపంలోని మరోవార్డు అభ్యర్థి.. తన మద్దతుదారుల కోసం ఏర్పాటు చేసుకున్న భోజనం తినేందుకు పంపించాడు. అదే సమయంలో ఆ అభ్యర్థి మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. వీరంతా ఎవరు? ఎందుకొస్తున్నారోనని సదరు అభ్యర్థితో సహా ఆయన మద్దతుదారులెవరికీ అంతుబట్టలేదు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అని ఆరా తీయగా.. పొరుగువార్డుకు చెందిన ఓ నాయకుడని తేలింది. ‘మీ అందరికీ తలా రూ.200 చొప్పున డబ్బులు ఇవ్వమని అతడికి డబ్బులు ఇచ్చా.. మీరంతా ఆయన వద్దకే వెళ్లి తీసుకోండి’ అని చెప్పి వెనక్కి పంపిచేశాడు. ‘అరే.. మా అవసరానికి తగ్గట్టుగా భోజనం సిద్ధం చేసుకుంటే.. మాకు సంబంధం లేనివ్యక్తులను ఇలా పంపడమేంటో’ అని సదరు అభ్యర్థి వాపోయాడు. ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.ఒకరి ప్రచారం.. మరొకరి భోజనం! అధికార పార్టీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రచారం స్వతంత్రులకు అధికార పార్టీ నాయకుడి ప్రచారం జగిత్యాలలో వింత పరిస్థితి -
కరీంనగర్
మేటి నగరంగాకరీంనగర్లోని మానేరు డ్యాం వద్ద హుస్సేనసాగర్ తరహాలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియం ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. మానేరు రివర్ఫ్రంట్, తీగల వంతెనలో సాంకేతిక లోపాలపై అధ్యయనం చేసి నివేదిక ఆధారంగా లోపాలు సరిచేస్తాం. కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ను పునరుద్ధరిస్తాం సుడా మాస్టర్ప్లాన్లో భాగంగా నిర్మించిన తలచిన కరీంనగర్ ఔటర్ రింగురోడ్డుకు నెలరోజుల్లో భూసేకరణ, డీపీఆర్లు సిద్ధం చేయాలని ఆర్డీవోను సీఎం ఆదేశించారు. ఈ రోడ్డుతో కరీంనగర్ పారిశ్రామిక, ఆర్థిక ముఖచిత్రం మారనుంది. నగరంలో బల్దియా రూ.వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనాల్లో దళిత, బీసీ, మైనార్టీ మహిళలు, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఎంఎన్సీ కంపెనీల సాయంతో ప్రారంభించాలని సీఎం ఆదేశించా రు. పేదలందరికీ రెండో విడదలో సొంత జాగాతో ఇందిర మ్మ ఇళ్లు ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్కు రైలు సదుపా యం కల్పిస్తాం. పెద్దపల్లి మీదుగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే, కేంద్రరైల్వేశాఖమంత్రులకు లేఖలు రాయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి ఎక్స్ప్రెస్తోపాటు కాచిగూడ ఎక్స్ప్రెస్, డె మూ రైలు సర్వీసులు కూడా కాంగ్రెస్ హయాంలో వేసినవే. నిధుల కేటాయింపులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే)కు ప్రాధాన్యం కల్పించి.. అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. రెండేళ్లలోనే కార్పొరేషన్కు రూ.1489 కోట్లు కేటాయించామని, మరిన్ని నిధులు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. నగరంలోని 66 డివిజన్లలో ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులున్నారని అవే తమను గెలిపిస్తాయన్నారు. సోనియా సైనికులుగా మున్సిపల్ ఎన్నికల్లో 40కి పైచిలుకు సీట్లు గెలుచుకుని బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేసి, సీఎంకు బహుమతిగా ఇస్తామన్నారు. పదేళ్లలో బల్దియాలో జరిగిన అక్రమాలపై అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ చేయించి, అవినీతిపరుల భరతం పడతామని స్పష్టంచేశారు. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మించి బీసీసీఐకి ఇక్కడి యువత ఆడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. –సాక్షిప్రతినిధి,కరీంనగర్గత పదేళ్లలో స్మార్ట్సిటీ పేరిట రూ.వందల కోట్లు దోచుకున్నారు. శివారు, పేద, దళిత, మైనార్టీల కాలనీల్లో కనీస వసతులు కల్పించలేదు. బల్దియాలో కాంగ్రెస్ గద్దెనెక్కాక అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తాం. అవినీతి అనకొండలను బండి సంజయ్ బీజేపీలో చేర్చుకోవడం సరికాదు. కొందరు బెయిల్ నుంచి వచ్చి బీఆర్ఎస్ టికెట్ల మీద పోటీ చేస్తున్నారు. వీరిని ప్రజలు తరిమి కొడతారు. నగరంలో ఇండ్లు కట్టుకున్న సామాన్యుడిని ఇంతకాలం కార్పొరేటర్లే దోచుకున్నారు. డబ్బుల్వికుంటే ఇళ్లు కూల్చిన ఉదంతాలు చూశాం. మా పార్టీ బల్దియా పగ్గాలు చేపట్టాక ఎలాంటి అనుమతి అయినా పారదర్శకంగా రెండు రోజుల్లో వస్తుంది. బల్దియా ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతాం. వారిపై పని ఒత్తిడి తగ్గేలా బల్దియాలో అదనంగా మరో 700 మందిని చేర్చుకుంటాం.నగరంలో పదేళ్లుగా దాదాపు 2 లక్షల మందిని డంపింగ్ యార్డు సమస్య వేధిస్తోంది. సీఎం రేవంత్ దీనికి పరిష్కారంగా హుజురాబాద్ సమీపంలో ఆధునిక డంపింగ్యార్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ యార్డు నుంచి ఎరువు, విద్యుదుత్పత్తితో ఆదాయం సమకూరనుంది. నగరంలో దాదాపు 3.50 లక్షల ఓటర్లున్నారు. మా సంక్షేమ పథకాలు సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు, మహిళా సంఘాల రుణాలు ఇలా ఏదో రకంగా మా పార్టీ ప్రయోజనాలు పొందిన లబ్ధిదారులున్నారు. వారంతా బల్దియాలో మాకు ఓటేస్తారు. -
అమ్మకు అక్షర వికాసం
గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామాల్లోని నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. అక్షరాలు నేర్వని అతివలకు సులభ పద్ధతిలో చదవడం, రాయడం, అంకెలను గుర్తించడం, లెక్కలను నేర్పించడం కోసం ‘ఉల్లాస్’(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 12 మండలాల్లో 411 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీరిలో లక్షకు పైగా సభ్యులు ఉన్నారు. దాదాపు 23,800 మంది నిరక్షరాస్యులైన మహిళా సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి వివరాలను ఉల్లాస్ యాప్లో నమోదు చేశారు. వీరికి చదువు నేర్పించడానికి వలంటీర్లను గుర్తించారు. వలంటీర్లు నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. మార్చి నెల వరకు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ఉల్లాస్ అమలు చేస్తున్నారు. మహిళా సభ్యులు విద్యావంతులైతే సంఘాలు మరింత పటిష్టంగా పనిచేస్తాయని, నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో వలంటీర్ పది మంది నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పడం జరుగుతోంది. ఇంటింటా చదువు.. ఊరంతా వెలుగు.. అక్షర వికాసం పేరుతో పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలను వలంటీర్లు, వీవోఏలు నిరక్షరాస్యులైన మహిళలకు నేర్పుతున్నారు. ఇప్పటికే అక్షరజ్ఞానం నేర్పించడానికి వలంటీర్లకు, వీవోఏలకు, వీవోల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సీసీలు, ఏపీఎంలకు మండలాలవారీగా శిక్షణనిచ్చారు. జిల్లా విద్యాశాఖ, వయోజన విద్య, డీఆర్డీవో విభాగాలు ఈ అక్షరజ్ఞాన కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సంఘాల్లోని మహిళలు ఇప్పటికే అక్షరాస్యులై ఉంటే.. టెన్త్, ఇంటర్ పూర్తి చేయని వారైతే వారిని ఓపెన్స్కూల్లో చేర్పించి పరీక్షలు రాయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఉల్లాస్’తో విద్యాబోధన మహిళా సంఘాల్లోని సభ్యుల అక్షరాస్యతే లక్ష్యం జిల్లాలో 23 వేల మంది నిరక్షరాస్యుల గుర్తింపు -
40 ఏళ్లుగా రాజకీయాల్లో వాసాల
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి (హెచ్) వార్డు సభ్యుడిగా.. ఉపసర్పంచ్గా.. సర్పంచ్గా.. ఎంపీటీసీగా.. కరీంనగర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా.. కౌన్సిలర్గా.. ఓటమి ఎరగని నేతగా 40ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కొత్తపల్లికి చెందిన వాసాల రమేశ్. కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా (1998–2001), కరీంనగర్ నియోజకవర్గ ఏసీడీపీ సభ్యుడిగా సేవలందించారు. గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన రమేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 18వ డివిజన్ (కొత్తపల్లి) అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
కరీంనగర్
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20267క్వింటాల్ పత్తి రూ.7,800జమ్మికుంట: స్థానిక మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,800 పలికింది. 270 క్వింటాళ్లను రైతులు మార్కెట్కు తెచ్చారు. శని,ఆదివారాల్లో సెలవుంటుందని కార్యదర్శి వెల్లడించారు.రేకుర్తిలో పవర్ కట్కొత్తపల్లి: చెట్లకొమ్మల తొలగింపు పనులు, 11 కేవీ లైన్ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి 1గంట వరకు రేకుర్తిలో విద్యుత్ సరఫరా ఉండదని రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. -
ఒత్తిడి తగ్గించుకోవాలి
టైంటేబుల్ పెట్టుకొని ప్రతి సబ్జెక్టు కొంత సమయం చదువుకుంటూ పోవాలి. ఏకదాటిగా పుస్తకాలతో కుస్తీ పట్టకుండా కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి. రాత్రంతా చదవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పరీక్షలకు ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. తగినంత నిద్ర పోవాలి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్, డీప్ప్రై ఆహారం తీసుకోవద్దు. బయటి ఆహారం పూర్తిగా తగ్గించాలి. అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. చిరుధాన్యాలతో చేసిన పోహా, రాగి దోశ, ఇడ్లీ, ఓట్స్, పండ్ల ముక్కలు, గుడ్లు, పాలు తీసుకోవాలి. – ఉడుగుల సురేశ్, జనరల్ ఫిజీషియన్, హుజూరాబాద్ -
కరీంనగర్లో చేతులెత్తేసిన కాంగ్రెస్
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారి ఒప్పదం చేసుకుందన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నగరంలోని 10,11,55,37,48,21,22 డివిజన్ల అభ్యర్థులు డి.శంకర్, పండుగ స్వప్న, గుగ్గిళ్లపు మంజులరమేశ్, కోడూరి ఏపీపీ చంద్ర టింకు, కర్ర పద్మ, కొండపల్లి సతీశ్, బండ రమణారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించి బుక్లెట్ ఇంటింటికీ పంపిస్తుంటే, బీఆర్ఎస్వాళ్లు ఇప్పుడు కరపత్రం ప్రచురించి తామే కేంద్రం నుంచి నిధులు తెచ్చామని చెప్పడం సిగ్గు చేటన్నారు. తాను నిధులు తెస్తే, గంగుల కమలాకర్ మనుషులు కబ్జాలు చేయడం తప్ప చేసిందేమి లేదన్నారు. ముస్లింలకు నేను వ్యతిరేకం కానేకాదు తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లింలను వెనుకబాటుకు గురిచేస్తున్న ఎంఐఎం పార్టీకి వ్యతిరేకినని సంజయ్ అన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటిలోనూ ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. పేదరికంలో ఉన్న ముస్లింలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ముస్లిం మహిళల బాధలు చూసి ట్రిపుల్ తలాఖ్ రద్దు చేశామని గుర్తు చేశారు. -
ఆందోళన ఉప్పు లాంటిది
విద్యార్థులు విజువలైజేషన్ టెక్నిక్ పాటిస్తే మేలు. రాని ప్రశ్నలు వస్తాయేమో, మంచి మార్కులు రావేమో అని భయపడడం వల్లే ఆందోళన. అలా కాకుండా అన్నీ చదివిన ప్రశ్నలే వచ్చినట్లూ, పరీక్ష బాగా రాసినట్లూ, మంచి మార్కులు తెచ్చుకున్నట్లూ... ఊహించుకోవాలి. అప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఆటోమేటిగ్గా ఒత్తిడి తగ్గిపోతుంది. ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు. ఆందోళన ఉప్పు లాంటిదని దానికి దూరంగా ఉండాలి. – జి.వెంకటరాజం, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చెల్పూర్ -
అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
రామడుగు: ప్రతి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం తిర్మలాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గర్భిణులు, బాలింతలు, కిషోరబాలికలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను వివరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ మోడీ రవీందర్ కలెక్టర్కు విన్నవించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, డీడబ్ల్యూవో సరస్వతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుధారాణి, ఇన్చార్జి ఎంపీడీవో శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.గంగాధర: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, పాఠశాలల నిర్వాహణ తీరు బాగుందని, ఉపాధ్యాయులు మరింత ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె.సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గంగాధర మండలంలోని బూర్గుపల్లి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు పదోతరగతిపైనే కాకుండా 6వ తరగతి నుంచి కూడా దృష్టి సారించాలన్నారు. అనంతరం ప్రధానమంత్రి పరీక్షపే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, గ్రంథాలయం, విటమిన్ గార్డెన్, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులు సోషల్ మీడియా, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించారు. హెచ్ఎంలు ఎలిగేటి మల్లికార్జున్, లక్ష్మి, ఉపాధ్యాయులు నగేశ్, లక్ష్మిరాజం, జగదీశ్వర్రెడ్డి, భూమయ్య, మంజుల, రాజమల్లయ్య, ప్రవీణలత, మల్లేశం పాల్గొన్నారు.అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానంకరీంనగర్ అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు ఈ నెల 9 నుంచి సమాచార పౌరసంబంధాలశాఖ అధికారిక వెబ్సైట్ http://ipr. telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 8న కరీంనగర్లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంకరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటలకు, కరీంనగర్లోని శ్వేత హోటల్లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్కి ఫోన్చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందని నిర్వాహకులు ఈ సందర్భంగా సూచించారు. -
మేయర్ పీఠంపై గురి!
డి.శంకర్వాసాల రమేశ్సర్ధార్ రవీందర్ సింగ్చల్ల హరిశంకర్సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కీలకమైన కరీంనగర్ బల్దియా మేయర్ పీఠంపై బీసీ నేతలు కన్నేశారు. ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని, తమకే నగర ప్రథమ పౌరుడిగా అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. మేయర్ పీఠం బీసీ జనరల్కు రిజర్వ్ కాగా, ఆయా పార్టీల నుంచి పలువురు మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని, హంగ్ వస్తే చక్రం తిప్పి మేయర్ అవుతామని బీసీ ఆశావహులు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ మేయర్ బీసీ జనరల్ కావడంతో ఆ కేటగిరీ నేతల్లో చర్చ మొదలైంది. అధికార పార్టీగా తమకే అవకాశం ఉంటుందని కాంగ్రెస్, వరుసగా మూడోసారి పీఠం తమదేనని బీఆర్ఎస్, తొలిసారి కాషాయజెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ భావిస్తున్నా యి. దీంతో ఆయా పార్టీల్లో బీసీల నేతల మధ్య పోటీ తీవ్రమైంది. కాంగ్రెస్ నుంచి పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మాచర్ల ప్రసాద్ మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. అంజన్కుమార్ 26వ డివిజన్ నుంచి, మల్లికార్జున రాజేందర్ 46వ డివిజన్ నుంచి, మాచర్ల ప్రసాద్ 66వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ మేయర్ డి.శంకర్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ మేయర్ పీఠంపై గురిపెట్టారు. శంకర్ 10వ డివిజన్ నుంచి, రమేశ్ 18వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు. వీరితో పాటు పార్టీ గెలిస్తే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనూహ్య నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి.. బీఆర్ఎస్ నుంచి పోటీదారుల సంఖ్య కాస్త అధికంగా ఉంది. 21వ డివిజన్ నుంచి పోటీచేస్తున్న పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, 58వ డివిజన్ నుంచి పోటీచేస్తున్న మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, 23వ డివిజన్ నుంచి పోటీపడుతున్న జంగిలి సాగర్, 2వ డివిజన్ నుంచి పోటీలో ఉన్న నూతి చంద్రయ్య మేయర్ స్థానానికి పోటీపడుతున్నారు. బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో తాము కూడా సిద్ధమంటూ బీసీ మహిళలు కూడా సంకేతాలు ఇస్తున్నారు. వీరిలో ఎవరు కార్పొరేటర్గా గెలుస్తారో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో, అనూహ్యంగా ఇతరులకు అవకాశం వస్తుందో వేచి చూడాలి. -
అక్షరాలు నేర్చుకుంటున్నం
మా సంఘంలోని చదువురాని సభ్యులకు అక్షరాలు నేర్పిస్తున్నారు. మాకు చదువుపై ఆసక్తి కూడా పెరిగింది. సంతకాలు చేయడానికి, సంఘంలో లెక్కలు అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోపడుతుంది. – గోపగారి లీల, గంభీరావుపేట పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నం మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉల్లాస్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నం. గ్రామైక్య సంఘాలకు పుస్తకాలు కూడా అందించాం. వాటి ద్వారా విద్యాబోధన జరుగుతోంది. అక్షరజ్ఞానం కలిగించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. – జయసుధ, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట -
అంబులెన్స్లోనే కేసు విచారణ
● ఫిర్యాది వృద్ధాప్యం.. పక్షవాతంతో ఇబ్బంది ● న్యాయమూర్తి ఫిర్యాది వద్దకు వచ్చిన వైనంకరీంనగర్క్రైం: ఫిర్యాదుదారు వృద్ధాప్యంతోపాటు పక్షవాతంతో లేవలేని స్థితిలో ఉండడంతో న్యాయమూర్తి అంబులెన్స్లోకి వచ్చి వాంగ్మూలం స్వీకరించిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన అనువోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వారికి పెళ్లిళ్లు కావాటంతోపాటు ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలింది. తనని ఉద్యోగి అయిన కొడుకు అణువోజు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె ఆర్డీవో వద్ద కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును విచారించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు నెలకు రూ.4వేలు పోషణ నిమిత్తం తల్లికి చెల్లించాలని తీర్పునిచ్చారు. కొడుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న వృద్ధురాలు చిగురుమామిడి పోలీసులకు కొడుకుపై ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కొడుకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా ఫిర్యాది రాజేశ్వరీ సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. పక్షవాతం వచ్చి ఆమె రాలేని పరిస్థితిలో ఉండగా అంబులెన్స్లో జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అంబులెన్స్లో ఉన్న రాజేశ్వరి వద్దకు మెజిస్ట్రేట్ బానోత్ రాజేశ్వర్ వెళ్లారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సమక్షంలో ఫిర్యాది రాజేశ్వరి వాంగ్మూలాన్ని అంబులెన్సులోనే స్వీకరించారు. ఈ క్రమంలో ఫిర్యాది కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులపై పోలీసుల నిర్లక్ష్యం తగదు ● కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ కరీంనగర్టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై బాధితులకు న్యాయం చేయడంలో కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ విమర్శించారు. నగరంలోని మంకమ్మతోట జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 261 ఎస్సీ, ఎస్టీ, కేసులు నమోదైతే.. అందులో 154 కేసులు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నాయన్నారు. 2024 నుంచి 2026 వరకు 12 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేశారని, ఒక్క కేసులోనే శిక్ష పడిందన్నారు. 94 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేసులు విచారణ సకాలంలో పూర్తిచేసి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో 17 జూన్ 2024లో కేసు నమోదైతే.. ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు. డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులతో 30 రోజుల్లో పూర్తివిచారణ చేయాలని చట్టం చెబుతున్నా.. పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసుల నిర్లక్ష్యంపై సామాజిక సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు భూతం మల్లేశ్, కళ్లెం శివాజీ, టేకు నర్సింహులు, మిరియాల కృష్ణమూర్తి ఉన్నారు. -
ముచ్చటగా మూడు రూపాలు !
● నగర.. గ్రామపంచాయతీ.. మున్సిపల్ ● కోరుట్ల మున్సిపల్ తీరుకోరుట్ల: ‘కోరుట్ల’..కొన్నాళ్లు నగర పంచాయతీ.. మరికొన్నాళ్లు గ్రామపంచాయతీ.. ప్రస్తుతం మున్సిపాల్టీ ఇలా మూడు మార్పులు పొందింది. 1957లో ఈ ప్రాంతంలో సుమారు 5వేల ఓటర్లు ఉన్న ఉన్న గ్రామంగా కోరుట్ల గుర్తింపు పొందింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నింటికంటే ఎక్కువ ఓటర్లు ఉండడంతో కోరుట్లను నగర పంచాయతీ (బల్దియా)గా మార్చారు. మొదటగా వాసం శంకరయ్య, నీలి కిష్టయ్య, నీలి గంగారాం 20 సంవత్సరాలపాటు నగర పంచాయతీ చైర్మన్లుగా వ్యవహరించారు. గ్రామ పంచాయతీ ఆ తరువాత కాలంలో 1988 వరకు కోరుట్ల గ్రామపంచాయతీగా కొనసాగింది. ఈ సమయంలో ఉ ప్పులపు భూపతి, నీలి గంగారాం, రహీంపాషాలు సర్పంచులుగా కొనసాగారు. 1988 తరువాత థర్డ్ గ్రేడ్ మున్సిపాల్టీగా మారిన కోరుట్లలో ఏడేళ్లపాటు స్పెషలాఫీసర్ల పాలన కొనసాగింది. స్పెషలాఫీసర్ల కాలంలో కోరుట్ల అభివృద్ధి కుంటుపడింది. 1995లో మున్సిపల్ ఎన్నికలు మొదటిసారి మున్సిపాల్టీకి ప్రత్యక్ష ఎన్నికలు జరగగా అంబల్ల మాధవి మున్సిపల్ తొలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తరువాత షేర్ నర్సయ్య, ఎంఏ గఫార్, శీలం వేణు అవిశ్వాస తీర్మానంతో ఎన్నికై న గడ్డమీద పవన్, అన్నం లావణ్య చైర్మన్, చైర్పర్సన్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం సెకండ్ గ్రేడ్ మున్సిపాల్టీగా మారిన కోరుట్లకు ఇవి ఆరో మున్సిపల్ ఎన్నికలు కావడం విశేషం. -
చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే
పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మంచి ఫలితాలు సాధించాలనే ఆత్రంతో చాలామంది నిద్రను త్యాగం చేసి, సరైన ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతారు. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. పరీక్షల సమయంలో మెదడు చురుకుగా పనిచేయాలంటే సమతుల్యమైన ఆహారం అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బాదం, వేరుశెనగ తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఫాస్ట్ఫుడ్, నూనెతో చేసిన పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. జంక్ఫుడ్ మరుసటి రోజు చదువుపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. – వివేక్రావు, పిల్లల వైద్య నిపుణుడు, కరీంనగర్ -
కేంద్ర మంత్రిగా ‘బండి’ అట్టర్ ప్లాప్
కరీంనగర్ టౌన్: ఎంపీగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏడేళ్లలో ఎంపీ నిధులు తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క పని చేయలేదని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని బుక్లెట్లు ముద్రించి, ప్రజలకు పంచడం సిగ్గుచేటని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్సిటీకి ఎంపికై ననప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్ మాత్రమేనని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై బండి ముద్రించిన బుక్లెట్లో ఆయన చేసిన పని ఒక్కటీ లేదన్నారు. సీఎం ప్రత్యేక నిధులు, స్మార్ట్సిటీ నిధులతో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దామని, కూడళ్లు, విశాలమైన రోడ్లు, తీగలవంతెన రూ.కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ఏడేళ్లలో ఒక్క జీవో కాపీనైనా చూపాలని సవాల్ విసిరారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం కరీంనగర్ గడ్డమీద అభివృద్ధి జెండా అనే వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం 25వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాడే రాజ్కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండేళ్లలో చేసింది శూన్యమన్నారు. అనంతరం 24వ డివిజన్ బ్యాంక్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావుకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. -
అంతర్జాతీయ వేదికపై ‘జ్యోతిష్మతి’ కీర్తి పతాక
తిమ్మాపూర్: జ్యోతిష్మతి కళాశాల కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేశారు. ఆ కళాశాల విద్యార్థులు దుబాయ్లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ సమిట్– రిట్రీట్–2026లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. గతనెల 9 నుంచి 11వ తేదీ వరకు ఇంటర్ కాంటినెంటల్ ఫెస్టివల్ సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతదేశం నుంచి 1,700 టీంలు పోటీపడ్డాయి. అజిత్ షనగొండ, మొహమ్మద్ షోయబ్ బృందం ఫైనల్స్కు చేరి కళాశాల కీర్తిని చాటింది. అంతర్జాతీయ స్థాయికి కళాశాల కీర్తిని తీసుకెళ్లిన విద్యార్థులను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు అభినందించారు. సామాజిక ఉద్దేశాలతో నూతన ఆలోచనలను ప్రోత్సహించడం సంస్థ లక్ష్యమన్నారు. సెక్రటరీ జె.సుమిత్సాయి ఎంట్రప్రెన్యూర్షిప్ నిబద్ధతను హైలైట్ చేశారు. ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. -
కంట్రోల్ రూం తనిఖీ
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మీడి యా సెంటర్ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.జితేందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా వచ్చిన వార్త క్లిప్పింగ్లను సేకరించి తగు చర్యకై పంపించాలని అన్నారు. కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేయాలని, సంబంధిత నోడల్ అధికారికి తెలియపరచాలని ఆదేశించారు. అరచేతికే అస్త్రంకరీంనగర్ అర్బన్: ఎన్నికల నిబంధనలను విస్మరించి ప్రచారం చేస్తున్నారా.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా..? ఇంకెందుకు ఆలస్యం.. ఫోన్ చేయండి. ఎన్నికల సక్రమ నిర్వహణకు సహకరించండి. మున్సిపల్ ఎన్నికల క్రమంలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా ఎన్నికల విభాగం కలెక్టరేట్లో ఫిర్యాదుల నంబర్ను ఏర్పాటు చేసింది. ఫోన్ నంబర్ 08782997247. ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. -
పరీక్షల కాలం.. ఆరోగ్యం పైలం!
కరీంనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగిని లక్ష్మి కుమారుడు పదోతరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పరీక్షలంటే కుమారుడి కన్నా తల్లికే ఎక్కువగా ఆందోళన ఉంది. పిల్లాడు ఒత్తిడికి, ఆందోళనకు గురికాకుండా, ఆరోగ్యంపై దుష్ప్రభావం పడకుండా చూసుకోవడం లక్ష్మికి పెద్ద సవాలే. జమ్మికుంటకు చెందిన స్నేహకు భయమెక్కువ. పరీక్షలంటేనే వణికిపోతుంది. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతోంది. కొద్దిరోజుల్లో బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. స్నేహకు తల్లిదండ్రులు ధైర్యం చెబు తున్నారు. అయినా భయం పోవడం లేదు. చదివింది గుర్తుండటం లేదు. పరీక్షల సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని స్నేహ ఆందోళన చెందుతోంది.హుజూరాబాద్/ కరీంనగర్ స్పోర్ట్స్: ప్రస్తుతం పరీక్షల కాలం.. మరో 20 రోజుల్లో ఇంటర్, 40 రోజుల్లోపు పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు విజయం సాధించాలంటే ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పట్టాలి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిల్లల్లో నిశ్శబ్ధం మొదలవుతుంది. గుండెల్లో వేగం పెరుగుతుంది. కళ్లు మూసినా.. తెరిచినా పుస్తకాలే కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చదివింది గుర్తుపెట్టుకోవడంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపు తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం సరికాదని సూచిస్తున్నారు. పరీక్షల కాలంలో ఆరోగ్యం పైలంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. రాత్రంతా చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మెదడుకు ఎక్కదు. అనవసర ఆందోళనకు కారణమవుతుంది. రోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్ర తప్పనిసరి. ఎంత ప్రణాళిక వేసుకున్నా.. సరే.. కొందరికి పరీక్షలంటే భయం ఇలాంటి వారితో పెద్దలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. పరీక్షల సమయంలో పిల్లలకు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, డీప్ఫ్రైడ్ ఆహారం ఇవ్వకూడదు. బయట నుంచి ఆహారం పూర్తిగా తగ్గించాలి. అల్పాహారం తప్పకుండా ఇవ్వాలి. చిరు ధాన్యాలతో చేసిన ఆహారం, పండ్ల ముక్కలు, గుడ్డు, పాలు అందించాలి. -
పిల్లల మనసును నిర్బంధించొద్దు
పరీక్షల సమయంలో ప్రిపరేషన్ పేరిట పిల్లల ఏకాగ్రత ఇతర వ్యాపకాలపైకి వెళ్లకుండా దృష్టిని కేంద్రీకరించాలి. మానసిక సంఘర్షణకు గురి చేయొద్దు. పరీక్షల కోసం పిల్లల మనసును నిర్బంధించొద్దు. ప్రిపరేషన్ ప్రశాంతంగా కొనసాగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక భారాన్ని తట్టుకోలేనివారిని మానసిక నిపుణులకు చూపించి, పరీక్షలకు సంసిద్ధం చేయాలి. పరీక్షల సమయంలో పిల్లల మానసిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ హెల్ప్లైన్ అందుబాటులో ఉంది. కౌన్సెలింగ్కు 9440488571 నంబరులో సంప్రదించవచ్చు. – ఎంఏ కరీం, సీనియర్ సైకాలజిస్ట్ -
పోలింగ్, కౌంటింగ్కు ఏర్పాట్లు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: పోలింగ్, కౌంటింగ్కు ఏర్పా ట్లు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. పోలింగ్ మెటిరియల్ డిస్ట్రిబ్యూషన్తో పాటు కౌంటింగ్కు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. బ్యాలెట్ బాక్సుల కోసం స్ట్రాంగ్రూమ్లు 1,2లను సిద్ధం చేసి, కౌంటింగ్ ప్రక్రియకు టేబుల్ ఏర్పాటు చేయాలన్నారు. సామగ్రి సిద్ధం చేసుకోవాలి ఎన్నికలకు పోలింగ్స్టేషన్ ప్రకారం సామగ్రిని రిట ర్నింగ్ అధికారులు సిద్ధం చేసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. నిర్వహణ పూర్తయ్యే వరకు రిటర్నింగ్ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఆర్వోలు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ డేటాను పరిశీలించాలన్నారు. -
కల్లుగీస్తూ గుండెపోటుతో మృతి
తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం గీతకార్మికుడు కల్లుగీస్తూ తాటిచెట్టుపైనే గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. జిల్లెల్లకు చెందిన సాయిలి కిషన్గౌడ్(35) తాటిచెట్టుపైకి ఎక్కి కల్లుగీస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. చెట్టుపైనే ఉండడంతో కాపాడడానికి వీలులేకుండా పోయింది. దీంతో చెట్టుపైనే మోకుకు వేళాడుతూ ప్రాణాలు వదిలాడు. వంతెన సైడ్వాల్ను ఢీకొన్న బస్సు జమ్మికుంట : పట్టణంలోని ప్ల్రైఓవర్ బ్రిడ్జి సైడ్వాల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ ఆర్టీసీ బస్సు ప్లై ఓవర్ ఎక్కే క్రమంలో టైర్పేలి బ్రిడ్జి సైడ్వాల్ను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్సై సతీశ్ సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పొలంలోనే రైతు మృతిశంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో పొలంలోనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కరీంపేట గ్రామానికి చెందిన బొజ్జ సమ్మయ్య (53)కు గ్రామంలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. శుక్రవారం పొలంలో తిరుగుతుండగా గుండెపోటుతో పొలం గట్లపై కుప్పకూలాడు. గమనించిన సమీప రైతులు అక్కడికి వెళ్లేలోపే అప్పటికే మృతిచెందాడు. -
ఆరోగ్యం పైలం!
పరీక్షల కాలం..వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పక్షం రోజుల్లో ఇంటర్, నెల రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి సబ్జెక్టులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతూ.. అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఏడాదిలో విన్న పాఠాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పరీక్షలు ఉన్నాయని చదవడమే కాదు.. ఆర్యోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమని నిపుణులు అంటున్నారు. సరైన ఆహారం తీసుకోవాలని, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దని, నిద్ర ప్రధానమని సూచిస్తున్నారు. –హుజూరాబాద్/కరీంనగర్ స్పోర్ట్స్ – వివరాలు 8లో.. -
● బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి ● మాజీ ఎంపీ వినోద్కుమార్
కరీంనగర్టౌన్: బండి సంజయ్ కాగితపు పులి అని, కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు చేసింది శూన్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని 13వ డివిజన్ శివనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంజర్ల రేణుక కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి ప్రారంభించారు. 46వ, 50వ డివిజన్లలో బోనాల శ్రీకాంత్, వాల రమణారావు తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ హయాంలో గులాబీ జెండా నీడలోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందన్నారు. తాను ఎంపీగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు తెచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏడేళ్లలో ఏడు రూపాయల పని చేయలేదన్నారు. 420 హామీలతో అడ్డదారిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ జెండా ఎగరాలి
సాక్షిప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభకు హాజ రై కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ముందుగా రామడుగు మండలంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగు దత్తోజీపేటలో సోలార్ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజ లు పెద్ద ఎత్తున హాజరు కాగా.. ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్తేజన్ని నింపింది. పట్టం కట్టి.. పనులు చేయించుకోండి సభా వేదికపైకి వచ్చిన సీఎం రేవంత్ బీజేపీ– బీఆర్ఎస్ బంధంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల వ్యవధిలో తాము చేసిన అభివృద్ధిని వివరించా రు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కరీంనగర్ జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సుమారు రూ.2,778 కోట్లు ఇచ్చామన్నారు. రామగుండానికి రూ.586 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,489 కోట్లు, చొప్పదండి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు ఇచ్చామన్నా రు. ఇవన్ని పనులు జరగాల్సి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టి, గెలిపించి పనులు పూర్తి చేయించుకోవాలని కోరారు. ఏప్రిల్లో రెండో విడు త ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరించాలని సీఎంను కోరారు. చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం రెండు పేజీల సమస్యలు ఇచ్చారని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ● మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. సుదీర్ఘంగా పట్టి పీడిస్తున్న రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపా రు. రాహుల్ గాంధీ, పార్టీ సూచనతో రాష్ట్రంలో కులగణన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నా రు. మనల్ని చూసి కేంద్రం కులగణనకు తల వంచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టం కట్టాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కేబుల్ బ్రిడ్జి, రింగురోడ్డు, రివర్ ఫ్రంట్, డ్రైనేజీ పనులు పూర్తి చేయిస్తామన్నారు. ● మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పిల్లల్లో నైపుణ్యం పెంచాలని సీఎంను కోరడం ద్వారా ఏటీసీ మంజూరైందన్నారు. డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సీఎం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లోని బంధువులకు చెప్పి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది సీట్లలో ప్రజలు గెలిపించారని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తోందన్నారు. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం, ధర్మపురి లక్ష్మి నృసింహస్వామి ఆలయాలను అభివద్ధి చేయాలని కోరారు. రాబోయే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి నాయకత్వంలో తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం కాగానే రూ.240 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేశారని, గంగాధరలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులతో పాటు, పోస్టులు మంజూరు చేశారన్నారు. కొండగట్టుకు ఇటీవలే టీటీడీ ద్వారా రూ.35 కోట్లు ఇచ్చారని, మన ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ఠాకూర్, విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
నేను నిధులు తెస్తే.. వాళ్లు నీళ్లే ఇవ్వలేదు
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్కు నిరంతరాయంగా నీళ్లు అందించేందుకు కేంద్రం నుంచి రూ.134 కోట్లు తీసుకొస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చుక్కనీరు ఇవ్వలేకపోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. డంప్యార్డ్ తరలింపునకు రూ.50 కోట్లు తెస్తే, యార్డును తరలించడంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. గురువారం నగరంలోని బొమ్మకల్, కృష్ణానగర్, గాంధీబొమ్మ, సీతారాంపూర్ హనుమాన్చౌరస్తాలో 6, 34, 54, 53, 65, 1, 23 డివిజన్ల అభ్యర్థులు మేకల వెంకటేశ్, ఎలగందుల నందకుమార్, గొట్టిముక్కల ఉమా వెంకటరమణ, కొంపెల్లి శ్వేత రమణ్ కుమార్, కమటం తిరుపతి, బారి అపర్ణ, పాదం శివరాజ్ తరఫున ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ను గెలిపిస్తే కబ్జాలు చేసి జైలు పాలయ్యారని, కాంగ్రెస్ను గెలిపిస్తే రెండేళ్లుగా కార్పొరేషన్కు నయాపైసా ఇవ్వడం లేదని విమర్శించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులు తెస్తానని, కరీంనగర్కు నిరంతరాయంగా నీళ్లిస్తానని హామీ ఇచ్చారు. బొమ్మకల్లో కేంద్రం నిధులతో రాజీవ్ రహదారి పొడువునా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించానన్నారు. యజ్ఞవరాహస్వామి ఆలయం ప్రాంతం, కాపువాడ, కృష్ణానగర్ స్మార్ట్సిటీ నిధులతోనే అభివృద్ధి చెందాయన్నారు. గాంధీరోడ్డు, వైశ్య భవన్, రాజీవ్చౌక్, వీక్లీ మార్కెట్, నాఖాచౌరస్తా,అశోక్నగర్ను అభివృద్ధి చేశామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అశోక్నగర్, సాయినగర్, శర్మనగర్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. -
విద్యుత్ కంచె చట్ట విరుద్ధం
కొత్తపల్లి(కరీంనగర్): అటవీ జంతువుల నుంచి పంటల రక్షణ పేరుతో విద్యుత్ కంచె ఏర్పాటు చేయొద్దని ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ హెచ్చరించారు. పొలాలు, వ్యవసాయ భూముల చుట్టూ అక్రమంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో అనేక చోట్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. విద్యుత్ కంచె ఏర్పాటు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోలార్ ఆధారిత ఫెన్సింగ్, గార్డింగ్, ఇతర సురక్షిత వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. తమ పరిసరాల్లో ఎక్కడైనా అక్రమ విద్యుత్ కంచె ఉన్నట్లు గమనిస్తే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఈ కోరారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుతకాలంలో నూతన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఏఐ పునాది కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నా రు. శాతవాహన యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఎస్యూలో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు యొక్క ప్రభావం అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సదస్సు గురువారంతో ముగి సింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ అనేది యంత్ర అభ్యాస విధానంతో అనుసంధానం చేసుకొని తన పనులను చేసుకుంటుందన్నారు. ఎస్యూ వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, వైద్య, పర్యాటక అన్నిరంగాల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు పెంచవచ్చన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్కుమార్, సురేశ్లాల్, మహ్మద్ జాఫర్, కే.శ్రీవాణి, పద్మావతి, వరప్రసాద్, సూరేపల్లి సుజాత, మహ్మద్ అబ్రారుల్ బాకీ, డి.హరికాంత్, ఉమేరా తస్లీమ్, మునావర్, సత్యనారాయణ, విద్యాసాగర్ పాల్గొన్నారు. జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,800 పలికింది. గురువారం మార్కెట్కు 390 క్వింటాళ్ల పత్తిని రైతులు అ మ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,750, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
ప్రచారం హద్దులు దాటొద్దు
కరీంనగర్ కార్పొరేషన్: కార్పొరేటర్ అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ప్రచారం చేసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. గురువారం నగరంలోని రెవెన్యూ గార్డెన్లో అభ్యర్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కండక్ట్ను ఉల్లంఘించకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు. నగరంలోని 66 డివిజన్ల లో మొత్తం 477 పోలింగ్ కేంద్రాలున్నాయని, 11న జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల పేర్లను అభ్యర్థులు మూడు రోజుల మందుగా సంబంధిత ఆర్వోలకు అందజేయాలన్నారు. ప్రచార ర్యాలీలు, ప్రచార రథాల అనుమతులకు నగరపాలక సంస్థలో మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కోడ్ సమయంలో పలు చోట్ల కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టారని తమ దృష్టికి వచ్చిందని, చర్యలు ఉంటాయన్నారు.ఎన్నికల పరిశీలకుడు జితేందర్రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పించకుండా ప్రచారం చేయాలన్నారు. ప్రచార రథాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకే తిరగాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటరమణ, సీఐలు తిరుమల్, రాంచందర్రావు, సృజన్ రెడ్డి, నగరపాలకసంస్థ డీసీపీ బషీరొద్దీన్ పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక కౌంటర్లు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకొనే ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని నూతన రెవె న్యూ భవనంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు. ఈ నెల 7, 8,9 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్లో ఓటు వేయాలన్నారు. -
● రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నగరాన్ని అభివృద్ధిచేసే బాధ్యత తమదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. గురువారం నగరంలోని భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన 21, 22, 48,49 డివిజన్ల కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. డివిజన్లో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేస్తామని, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. కరీంనగర్కు ఔటర్రింగ్ రోడ్డు, మానేరు రివర్ ఫ్రంట్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డంప్యార్డ్ను కరీంనగర్, హుజూరాబాద్ మధ్యలో ఏర్పాటు చేసి, ప్రజల సమస్యను తీర్చుతామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ నగరానికి ఏం చేయలేదని, ఇప్పుడు గెలిస్తే ఏం చేయగలుగుతుందని ప్రశ్నించారు. పన్నులు పెంచేది లేదు కరీంనగర్ కార్పొరేషన్కు రూ.1,400 కోట్లు ఖర్చు చేశామని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్బాబు సమర్థించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరిట నగరపాలకసంస్థలో చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని, కాని తమ ప్రభుత్వం పన్నులు పెంచే ప్రతిపాదన కూడా చేయలేదన్నారు. పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్రావు పాల్గొన్నారు. -
అన్నదాతల యాప్ సోపాలు!
కరీంనగర్ అర్బన్/కరీంనగర్రూరల్: ఫర్టిలైజర్ యాప్ అన్నదాతలను అపసోపాలకు గురిచేస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ బుకింగ్ విధానం ఆర్థికభారం పడేలా చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఎరువుల విక్రయ కేంద్రాల్లోని స్టాక్ ఆధారంగా ఎక్కడినుంచైనా యాప్ లో ఎరువులను బుకింగ్ చేసుకునే సౌకర్యముండగా.. స్థానిక రైతులకు అవసరం సమయంలో అందని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు ఎరువు లభించే ప్రాంతానికెళ్లి తెచ్చుకుంటున్నారు. రవాణాభారం పడుతోందని చెబుతున్నారు. కాగా.. రెవెన్యూ రికార్డుల్లో లేని భూములకు యూరియా ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా బుకింగ్ సౌకర్యం గత నెల 31నుంచి జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ను అమలు చేస్తున్నారు. పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రైతులు బుకింగ్ చేసుకుని 48గంటల్లోపు ఎక్కడి నుంచైనా ఎరువు తీసుకోవచ్చు. తమ ప్రాంతంలో యూరియా దొరకని రైతులు లభించే చోటుకు వెళ్తున్నారు. కరీంనగర్ మండల పరిధిలోని దుర్శేడ్ సహకార సంఘం విక్రయ కేంద్రానికి మానకొండూరు, తీగలగుట్టపల్లి, నగునూరు, చొప్పదండి రైతులు వచ్చి యూరియా తీసుకెళ్తున్నారు. బస్తా ధర రూ.266 ఉండగా హమాలీ చార్జీతో రూ.270కి విక్రయిస్తున్నారు. రైతులు ట్రాక్టర్లు, ఆటోల్లో తరలించేందుకు బస్తాపై రూ.30 భారం పడుతోంది. ఏ మండల పరిధిలోని రైతులకు ఆ మండలంలోని విక్రయ కేంద్రాల్లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రికార్డులకెక్కని భూములకు యూరియా ఎట్లా? భూ భారతిలో జిల్లాలో 29,426 దరఖాస్తులు వచ్చాయి. భూ వివరాలు సదరు రైతుల పేరు లేకపోగా.. మోకాపై ఉంటున్నా తప్పుగా వివరా లు నమోదవడం, ధరణిలో ఉన్నా భూ భారతిలో రాకపోవడం వంటి కారణాలతో వేల మంది రైతులు రికార్డుల్లో లేరు. సదరు దరఖాస్తులను పరిష్కరించాల్సిన రెవెన్యూశాఖ పట్టించుకోవడం లేదు. దీంతో యూరియా బస్తాలు ఎలా తీసుకోవాలి..? యాప్లో వారి వివరాలే లేనప్పుడు పంటలకు యూరియా ఎక్కడ నుంచి తేవాలన్నది అంతుచిక్కని ప్రశ్న. యూరియా వేస్తేనే పంటలకు ప్రయోజనం లేకుంటే పెట్టిన పెట్టుబడి, రైతన్న శ్రమ వృథాగా మారుతోంది. యుద్ధ ప్రతిపాదికన రికార్డులు సరిచేసేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారిస్తేనే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు.కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామానికి చెందిన కోట లచ్చయ్యకు వ్యవసాయమే జీవనాధారం. నలుగురు అన్నదమ్ములు కాగా తల్లిదండ్రులు మరణించారు. గ్రామంలోని 879, 1089, 1091, 1188, 1180 సర్వే నంబర్లలో నాలుగెకరాల భూమి ఉంది. గతంలో తండ్రి పేరున ఉండగా తల్లి పేరున మార్చాలని దరఖాస్తు చేయగా ప్రస్తుతం ఇతరుల పేరున సూచిస్తుంది. అలాంటప్పుడు లచ్చయ్య యూరియా బస్తాల కోసం యాప్లో బుక్ చేసే అవకాశం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో యూరియా బస్తాలకు దూరమయ్యాడు. -
నా కొడుకును స్వగ్రామానికి రప్పించండి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధి కోసం సౌదీఅరేబియాకు వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడి జైలులో మగ్గుతున్న తన కొడుకు కమటం వెంకటేశంను విడిపించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన కాంతవ్వ ఎస్పీ మహేశ్ బీ గీతేను కోరింది. బూర్గుపల్లికి చెందిన వెంకటేశ్కు ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ నమ్మబలికి సౌదీఅరేబియాకు పంపాడని తెలిపింది. పక్కా పని చూపకుండా రహస్యంగా చేసే పని చూపడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారని కాంతవ్వ వాపోయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్తోపాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందించినట్లు తెలిపింది. ఈక్రమంలో బక్కి వెంకటయ్య రాసిన లేఖను ఎస్పీకి అందచేశామంది. ఏజెంట్ శేఖర్తోపాటు అతనికి సహకరిస్తున్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని కాంతవ్వ కోరింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తడగొండ సత్యరాజ్వర్మ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తడగొండ నర్సింగ్బాబు ఉన్నారు. -
పరిహారం కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
మల్లాపూర్ : కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా.. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో మృత్యువాత పడిన నలుగురి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ మండలంలోని మొగిలిపేటలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెట్పల్లి –ఖానాపూర్ రహదారిపై ధర్నా చేశారు. పసుపు ఏరడానికి కూలీలను తీసుకెళ్లిన ఎర్రంశెట్టి గంగా ధర్ నిర్లక్ష్యంతోనే ట్రాక్టర్ అదుపుతప్పిందన్నారు. లలిత, గంగు, సాయమ్మ, వైష్ణవి కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల ఎస్సైలు అనిల్, కిరణ్, చిరంజీవి మొగిలిపేటకు చేరుకొని పోలీసులు గంగాధర్ కుటుంబసభ్యులతో మాట్లాడి మృతుల కుటుంబాకు రూ.6.50లక్షల చొప్పున పరిహారంతోపాటు రూ.15వేల చొప్పున దహనసంస్కారాలకు ఇచ్చేందుకు ఒప్పించారు. తక్షణ పరిహారంగా రూ.50వేలు అందించడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
జల్సాల కోసం దొంగతనాలు
పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో ఇటీవల జరిగిన చోరీకేసులో అరెస్ట్ చేయడంతో నిందితుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ బసంత్నగర్ ఠాణాలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ రాంనగర్లో నివాసం ఉండే సాయి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇనుపరాడు సాయంతో తాళాలు పగులగొట్టడంలో నేర్పరి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు చేస్తున్నాడు. పదేళ్లలో పలు చోరీలు చేయగా 13కుపైగా కేసులు నమోదయ్యాయి. గతనెల 28న రాత్రి బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో వెండి కిరీటాలు, వెండి హస్తాలు, వెండి కళ్లు, నామాలతో కూడిన సీతమ్మ పుస్తెలు చోరీకి గురయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీధర్.. క్లూస్టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. పాత నేరస్తుడు సాయిపై నిఘా ఉంచారు. తాను చోరీచేసిన వస్తువులు విక్రయించేందుకు వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో ధర్మారం క్రాస్రోడ్డు వద్ద నిఘావేసి అదుపులోకి తీసుకున్నారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీధర్తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శరత్, క్లూస్టీం కానిస్టేబుల్ రాజేశ్ను ఏసీపీ అభినందించారు. నగదు పారితోషికం అందజేశారు. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు నిందితుడిని అరెస్ట్ చేసిన బసంత్నగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ -
పాఠశాలలో మద్యం కలకలం
● జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘటన చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఓ జిల్లాపరిషత్ పాఠశాలలో కొందరు విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగిన సంఘటన చర్చనీయాంశమైంది. 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఈనెల 3న భోజన విరామ సమయంలో బయటకు వెళ్లి ఒక మద్యం బాటిల్, కూల్డ్రింక్ తెచ్చుకుని పాఠశాలలోనే సేవించినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల హెచ్ఎం బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై చర్చించారు. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు వారి కదలికలను ఎందుకు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేయాలని సర్పంచ్ సూచించారు. పాఠశాల సమీపంలోనే కొందరు బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై హెచ్ఎంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వరకట్నం వేధింపులకు వివాహిత బలిబోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు కుమారులు పుట్టాక భర్త పెట్టే అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లికి చెందిన దొంతరవేణి నర్మద(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎన్.రమాకాంత్ తెలి పారు. బోయినపల్లికి చెందిన నర్మదకు ఐదేళ్ల క్రితం మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన దొంతరవేణి నరేశ్తో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లయిన ఏడాది తర్వాత అదనంగా రూ.2లక్షలు కట్నం తీసుకురావాలని నర్మదను భర్త వేధించేవాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని భార్య పిల్లలను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్తానంటే నరేశ్ మామ ఊరుమడ్ల రాజయ్య డబ్బులు వెచ్చించి పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సైతం నరేశ్ వైఖరిలో మార్పు రాకపోగా.. ఫోన్లో భార్యను కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. తీవ్ర మానసిక వేదనకు గురైన నర్మద మంగళవారం బోయినపల్లిలోని తన తల్లిగారింట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నర్మద తండ్రి ఊరుమడ్ల రాజయ్య ఫిర్యాదుతో దొంతరవేణి నరేశ్పై కేసు నమోదు చేశారు. దరఖాస్తులు ఆహ్వానంవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు డిప్లొమా అప్రెంటిషిప్ కోసం అర్హతున్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్ధులు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మద్యం తాగొద్దని తల్లి హితవు చెప్పినా వినకుండా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ రాజీవ్ నగర్ తండాకు చెందిన గుగులోతు రవి నాయక్(28) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రవినాయక్ తండ్రి అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లితో కలిసి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. అయితే, మద్యం తాగద్దని తల్లి చేప్పినా వినలేదు. మద్యం తాగినప్పుడు మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించేవాడు. ఈక్రమంలో ఈనెల 3న మద్యం తాగివచ్చి తల్లితో గొడవపడ్డాడు. ఆ తర్వాత తల్లి తనకూతురు ఇంటికి వెళ్లగా.. మనస్తాపం చెందిన రవినాయక్ ఇంట్లోని ఇనుపరాడ్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ● కల్వచర్లలో యువకుడి ఆత్మహత్య రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధి గోకుల్నగర్కు చెందిన బాదం రవికిరణ్(21) గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. రవికిరణ్ కొద్దిరోజులుగా ఉపాధి లేదని బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది మంగళవారం గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్కు ఆ తర్వాత హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన శనిగారపు బుచ్చిరాజు (60) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డినట్లు పోలీసులు తెలి పారు. వారి కథనం ప్రకారం.. బుచ్చిరాజుకు కొన్నాళ్లుగా మతిస్థిమితం సరిగా ఉడడం లేదు. కుటుంబసభ్యులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిరాజు భర్త లింగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కోదండ రామాలయంలో చోరీజగిత్యాలరూరల్: జగిత్యాల శివారు ధరూర్ క్యాంప్లో.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీకోదండరామాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పురోహితులు గుడికి తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాతోపాటు, దేవతలపై ఉన్న పావుకిలో వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పూజారి జగన్మోహనాచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
శోకసంద్రం మధ్య ముగ్గురు కూలీల అంత్యక్రియలు
బోరున విలపిస్తున్న మంగళారపు లలిత భర్త, కూతుళ్లు, కుమారుడు విలపిస్తున్న రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన మంగళారపు లలిత, పెద్దిరెడ్డి గంగు, సంపంగి సాయమ్మ, రొడ్డ వైష్ణవికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళారపు లలిత మృతదేహం వద్ద భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు బోరున విలపించారు. పిల్లలకు అమ్మ లేని లోటును ఎలా తీర్చాలి అంటూ.. ధర్మరాజు కన్నీటి పర్యంతమయ్యారు. గంగు మృతదేహం వద్ద కొడుకు, కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు పోశయ్య, అనిత, అక్కాచెల్లెల్లు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సంపంగి సాయమ్మ భర్త ఎల్లయ్య దుబాయ్ నుంచి బయల్దేరాడు. ఆయన రాగానే ఆమెకు అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడిపి నలుగురు కూలీల మృతికి కారణమైన డ్రైవర్ ఎర్రంశెట్టి గంగాధర్పై సంపంగి లక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి సీఐ అనిల్కుమార్ తెలిపారు. దుబాయ్ నుంచి బయలుదేరిన సంపంగి సాయమ్మ భర్త ఆయన వచ్చాకే అంత్యక్రియలు చేసే అవకాశం -
మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్ష వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. జాతర మహోత్సవాలపై ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్సాయి, ఈఈ రాజేశ్ బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. -
చిన్నారి ప్రాణాలతో చెలగాటం
● ఊపిరాడకుండ గుడ్డపేగులో చుట్టి యాచన ● వేములవాడలో పట్టుకున్న అధికారులు ● పోలీసులకు ఫిర్యాదు వేములవాడ: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో మూడు నెలల పసికందును గుడ్డలో చుట్టి భక్తుల వద్ద డబ్బులు యాచిస్తున్న ఓ మహిళను వేములవాడలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత వృద్ధులను సంక్షేమ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ తన భుజాన ఓ గుడ్డను వేసుకొని యాచిస్తుండడం గమనించారు. ఆమె వద్దకు వెళ్లి చూడగా ఆ గడ్డులో చిన్నారి ఉండడంతో అవాక్కయ్యారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్ ఎల్ల మ్మగుడి వద్ద గుడారాలు వేసుకొని ఉన్న సారవ్వ అనే మహిళ మూడు నెలల క్రితం ఆడ కూతురికి జన్మనిచ్చింది. ఆ మూడు నెలల పాపను పట్టుకొని రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తుల వద్ద యాచిస్తోంది. గుడ్డ పేగులో పసిపాపను చుట్టి యాచిస్తున్న తీరు గమనించిన అధికారులు ఆమెను విచారించారు. మూడు నెలల పాపను ఊపిరి ఆడకుండా గుడ్డలో చుట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఇలాంటి వారు అనేక మంది అడుక్కోవడమే వృత్తిగా బతుకుతున్నారు. ఇప్పటికే చాలా మందిలో మార్పు తీసుకొచ్చిన అధికారులకు వీరిలో మార్పు తీసుకురావడం సాధ్యం కావడం లేదు. -
యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ ● యాప్లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణకరీంనగర్ అర్బన్: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. యూరియా అక్రమ రవాణాకు చెక్ పెడుతూ ప్రభుత్వం యాప్ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1నుంచి సదరు విధానం అమలవుతుండగా తదనుగుణ పర్యవేక్షణ లేమి రైతులకు గుదిబండగా మారింది. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని చెబుతున్నా వ్యవసాయ శాఖ అసలు యూరియా నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత అవసరమనే కోణంలో ప్రణాళిక లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అత్యవసర వేళ ఇదేం కొరత యాసంగి సీజన్కు గానూ జిల్లాలో 2,59,065 ఎకరాల్లో వరి సాగవగా, 29,396 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అన్ని పంటలు కలిపి 2,89,017 ఎకరాలు సాగులో ఉంది. ఈ సమయంలో వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ రైతులు మాత్రం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగడం, పడిగాపులు కాయడం ఆందోళనకర పరిణామం. ఆయా పంటలకు మూడు దశల్లో అంటే విడతల వారీగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఎకరానికి ఒక బస్తా మాత్రమే బుక్ కానుంది. జిల్లావ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రంతో పాటు 16 మండలాలుండగా ఎక్కడా కూడా యూరియా బస్తా ఒక్కటి లేదని యాప్ స్పష్టం చేస్తోంది. అవసరమైన సమయంలో యూరియా వేస్తేనే పంటకు బలం కాగా దిగుబడి రానుంది. ఎన్నికల విధుల్లో ఏవోలు.. ఇండెంట్ పెట్టేదెవరు వాస్తవానికి యూరియా నిల్వలను అనుసరించి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టడం మండల వ్యవసాయ అధికారుల విధి. జిల్లాలో మాత్రం ఏ ఒక్క ఏవో కూడ తదనుగుణంగా విధులు నిర్వహించడం లేదనడానికి యాపే తార్కాణం. పలువురు ఏవోలు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండగా విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు పుష్కలం. మున్సిపల్ ఎన్నికల్లో విధులు కేటాయించగా యూరియా నిల్వలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు షరామామూలే. యూరియా పక్కదారి? యూరియా పక్కదారి పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ సర్వే నంబర్లో ఏ పంట సాగు చేశారనేది యాప్లో నమోదు కాలేదు. క్రాప్ బుకింగ్ వివరాలు నమోదుకాకపోవడంతో అక్రమార్కులు సాగులో లేని భూముల వివరాలతో యూరియా బుక్ చేస్తూ వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. సాగులో లేని భూములు వేల ఎకరాలుండగా భవనాలు, రోడ్లు, ప్లాట్లు, దేవాలయాలు ఇతర నిర్మాణాలు ఉన్నా భూములూ ఉండగా యాప్పై అవగాహన ఉన్న అక్రమార్కులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
గుమ్లాపూర్కు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/చొప్పదండి: జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రామడుగు మండలం వెదిరలో అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్, గంగాధరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, దత్తోజుపేటలో సోలా ర్ ప్లాంటు ఏర్పాటుతో పాటు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను సభావేదికగా అందించనున్నా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి జన సమీకరణ జరపనున్నారని సమాచారం. సుమారు 40వేల మందితో సభ నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. సభకు ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు పొన్నం ప్రభా కర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, జిల్లా ఇన్చార్జిమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హాజరు కానున్నారు. సభ కోసం చొప్పదండి నుంచి రామడుగు వెళ్లేదారిలో గుమ్లాపూర్ శివారులో వేదికను సిద్ధం చేశారు. బుధవారం ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్థానిక ఎమ్మెల్యే సత్యం, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్లో పట్టం కట్టండి: మంత్రి తుమ్మల కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుండైధెర్యంతో అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. మెట్ట నియోజకవర్గం అయిన చొప్పదండికి నీటి వసతులు, కళాశాల ప్రారంభం ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతోందన్నారు. పనికి మాలిన విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయయాత్ర కొనసాగుతోందన్నారు. అభివృద్ధి చేసేవారికే మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. వరద కాలువకు సాగునీరు: మేడిపల్లి చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. వరద కాలువకు ఓటీ కాలువ నిర్మాణం చేసి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని తెలిపారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు. ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కే ఉంది: నాయిని ప్రభుత్వం ఏ స్కీం పెట్టినా అది ప్రజలకు ఉపయోగపడేలా పెట్టడం కాంగ్రెస్ ఘనత అని, తమ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు పోలీసులను తిట్టడం ఎంత వరకు సబబని, ఇంకా మూడేళ్ల పాలన ఉందని, తాము ఎక్కియ్యాలంటే తొండలు ఎక్కియ్యలేమా అని ఎద్దేవా చేశారు. మంత్రి తుమ్మలపై ప్రవీణ్ కుమార్ దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కోడూరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, కరీంనగర్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఆల్ఫోర్స్ నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, సీపీ ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ఆలం తెలిపారు. గుమ్లాపూర్లో బుధవారం పర్యటించారు. సభా ప్రాంగణం, హెలిపాడ్, పార్కింగ్ స్థలాలు పరిశీలించారు. సీఎం సభకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. సభా ప్రాంగణం, చుట్టు పక్కల పరిసరాలను డ్రోన్ కెమరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. సభకు వచ్చే జనం, వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించామని సీపీ పేర్కొన్నారు. -
రెండో ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ విధానంలో రెండవ దశ సిబ్బంది కేటాయింపు పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.జితేందర్ రెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్, ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికలు జరిగే పట్టణాల్లో, నగరంలో బ్యాలెట్ బాక్సులు, విధులు నిర్వహించే సిబ్బంది, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది రవాణా ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలపై సమీక్షించారు. ఆడిట్ అబ్జర్వర్ ఎం.మనోహర్ పాల్గొన్నారు. నిబంధనల మేరకే ఎన్నికల ఖర్చుచొప్పదండి: మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చు పెట్టాలని ఎలక్షన్ జనరల్ ఆబ్జర్వర్ జి.జితేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బుధవారం ఎన్నికల వ్యయం, నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అభ్యర్థులు పాటించాల్సిన సూచనల పుస్తకాలను అభ్యర్థులకు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్, ఎక్పండేచర్ ఆబ్జర్వర్ ఎం.మనోహర్ పాల్గొన్నారు. -
సామాజిక సమానత్వంతోనే అభివృద్ధి
కరీంనగర్టౌన్/కరీంనగర్స్పోర్ట్స్: సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. నగరంలోని భగత్నగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అన్నివర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ వసతి గృహాన్ని సందర్శించారు. పలు సౌకర్యాలు పరిశీలించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడాపోటీల్లో రాణించాలి కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పోటీల్లో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రాంతీయ క్రీడా పాఠశాలను బుధవారం సందర్శించారు. జిమ్నాస్టిక్స్ సాధన, పాఠశాలలో వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. స్పోర్ట్స్స్కూల్లో యోగా, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలు సమకూర్చామని, వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనను తిలకించి అభినందించారు. డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
కృత్రిమ మేధా అవసరం ఎంతో ఉంది
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఆర్థిక స్వావలంబనలో కృత్రిమ మేధా అవసరం ఎంతో ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం పొఫెసర్ కృష్ణారెడ్డి అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల జాతీయస్థాయి సెమినార్కు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ రంగంలో కృత్తిమ మేధస్సు విరివిగా ఉపయోగిస్తున్నారని, శాస్త్ర సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు టూల్స్ను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటును సాధించవచ్చునని అన్నారు. కృత్రిమ మేధస్సుతో సమాచార రంగంలో వస్తున్న డిజిటల్ మార్పులను, ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధిని, భవిష్యత్తులో చేయాల్సిన పరిశోధనలను వివరించారు. రిజిస్ట్రార్ సతీశ్కుమార్, డి.హరికాంత్, కె.పద్మావతి, కే.శ్రీవాణి, వరప్రసాద్, సూరేపల్లి సుజాత, అబ్రారుల్ బాకీ, జాఫర్, ఉమేరా తస్లీమ్, మునావర్ పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుతకాలంలో కేన్సర్పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉందని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్ కుమార్ అన్నా రు. బుధవారం ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాహితీ ఫౌండేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన, వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రజల్లో కేన్సర్పై అవగాహన పెంచడం అత్యంత అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిషోర్, సాహితీ ఫౌండేషన్ ప్రతినిధులు రాముల కుమార్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. స్టాపర్లు.. ప్రమాదాలకు నిలయాలుకొత్తపల్లి: కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు స్టాపర్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. వెద్య కళాశాల యాజమాన్యం రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసింది. అడ్డంగా ఉన్న స్టాపర్లు వేగంగా వస్తున్న వాహనాల తాకిడికి నిలువుగా తిరుగుతున్నాయి. వాహనాలు స్టాఫర్లను ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. పలువురు వాహనదారులు గాయాల పాలయ్యారు. స్టాపర్లు కదలకుండా ఏర్పాటు చేస్తున్న బండరాళ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
క్షణాల్లో ఘోరం.. అంతులేని విషాదం
మల్లాపూర్: వారందరిదీ నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేనే డొక్కాడుతుంది. అలాంటి కూలీలు ఉపాధి కోసం మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్ రైతు పొలంలో పసుపు ఏరడానికి ట్రాక్టర్లో వెళ్లారు. సుమారు 15 మంది కూలీలతో గంగాధర్ తన సొంత ట్రాక్టర్లో బయల్దేరాడు. తోటి కూలీలుతో సరదాగా మాట్లాడుకుంటూ అలసట మర్చిపోయి పొద్దంతా పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం సమయంలో గంగాధర్ ట్రాక్టర్లోనే ఇంటికి బయల్దేరారు. మరో 10 నిమిషాల్లో ఇళ్లు చేరేదే. అంతలోనే ట్రాక్టర్ను గంగాధర్ స్పీడ్గా నడపడంతో రోడ్డు పక్కనున్న నీటి గుంతలో పడిపోయింది. ఆ కూలీలను కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంగళారపు లలిత (45), పెద్దిరెడ్డి గంగు(45), సంపంగి సాయమ్మ(38), రొడ్డ వైష్ణవి(13) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అంతా క్షణాల్లోనే జరగడంతో ఏం జరిగిందో కూడా కూలీలకు అర్థం కాలేదు. ఆర్తనాదాల మధ్య స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, పోలీసులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనాలు, 108లో మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన సంపంగి సాయమ్మది నిరుపేద కుటుంబం. భర్త ఎల్లయ్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. పెద్దిరెడ్డి గంగు భర్త గంగాధర్ ఆర్థిక ఇబ్బందులతో ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కూలీ పనులు చేసుకుంటూనే ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. రొడ్డ పోశయ్య, అనిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. రెండో కుమార్తె వైష్ణవి స్థానిక ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి చదువుకుంటూనే కుటుంబానికి అండగా నిలవాలని అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తోంది. మంగళారపు లలితకు భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ధర్మరాజు నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్నాడు. పెద్ద కూతురుకు వివాహం జరిపించాడు. మిగిలిన కూతుళ్లు, కుమారుడిని చదివించేందుకు లలిత కూలీ పనులకు వెళ్తోంది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, నాయకులు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్, కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హామీ ఇచ్చారు. తహశీల్దార్ శ్రీనివాస్, సీఐ అనిల్కుమార్, ఎస్సైలు అనిల్, కిరణ్, నవీన్కుమార్ మృతదేహాలను పరిశీలించారు. పోలీసుల అదుపులో ట్రాక్టర్ యజమాని ప్రమాదానికి కారణమైన ఎర్రంశెట్టి గంగాధర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కూలీ పనులకు వెళ్లి విగతజీవులుగా ఇంటికి తిరిగొస్తూ.. కానరానిలోకాలకు.. నలుగురి మృతి.. మరో ఎనిమిదిమందికి గాయాలు మల్లాపూర్ మండలం మొగిలిపేటలో విషాదం -
పక్కాప్రణాళిక.. ‘పరుగుల’ ప్రయాణం
● ఆస్తిపన్ను వసూలు కోసం అనేక ఒడిదొడుకులు ● రూ.60 లక్షల నుంచి రూ.17.75 కోట్లకు ఆదాయం ● చెత్త సేకరణకు ఎడ్లబండ్ల నుంచి.. ఆధునిక వాహనాలు ● వినూత్న ప్రయోగాలతో సత్ఫలితాలు ● రామగుండం కార్పొరేషన్ ప్రస్థానం కోల్సిటీ(రామగుండం): సుమారు 44 ఏళ్లక్రితం వరకు రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ఉంది. అప్పటి ఆస్తిపన్ను డిమాండ్ రూ.60 లక్షలు. ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.75 కోట్లకు చేరింది. భౌగోళికంగా విస్తరించడమే కాకుండా ఆదాయ వనరుల పెంపుకోసం బల్దియా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు ఎడ్లబండ్లు.. ఇప్పుడు ఆటో ట్రాలీలు.. గతంలో ఎడ్లబండ్ల ద్వారా ఇంటింటా చెత్త సేకరించేవారు. ప్రస్తుతం ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా కొత్తకాలనీలు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఆస్తిపన్ను పరిధీ విస్తరిస్తోంది. సదుపాయాల కల్పన, పారిశుధ్యం నిర్వహణ, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది. కార్పొరేషన్ ప్రస్థానం ఇలా.. ● జనగామ పంచాయతీతోపాటు 11 గ్రామాలను విలీనం చేస్తూ 1982 జనవరి 19న రామగుండం నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించారు. అప్పట్నుంచి 1983 వరకు ఆర్డీవో ద్వారా ప్రత్యేక పాలన సాగింది. ● 1995 మే 15న ద్వితీయ శ్రేణి, 2001 ఆగస్టు 3న ప్రథమ శ్రేణి, 2003 నవంబర్ 3న ప్రత్యేక శ్రేణి పురపాలక సంఘంగా, 2010 ఫిబ్రవరి 25న నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. ● 1998 జూన్ 6న పురపాలక సంఘం తొలి, 2004 జూన్ 22న రెండోసారి ఎన్నికలు జరిగాయి. ● 2014 మార్చి 30న నగరపాలక సంస్థకు తొలిసారి, 2020 జనవరి 22న రెండోసారి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. తొలిమున్సిపల్ చైర్మన్ ‘సోమారపు’ రామగుండం మున్సిపల్కు 1998 జూన్ 6న ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరిగాయి. తొలిచైర్మన్గా సోమారపు సత్యనారాయణ ఎన్నికయ్యారు. 1998 జూన్ 6 నుంచి 2003 జూన్ వరకు ఆయన మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించారు. ఆస్తిపన్ను విప్లవానికి నాంది గుడిసెలు, పెంకుటిళ్లు, రేకుల షెడ్లు.. ఎక్కడోఓచోట కొన్ని భవనాలు రామగుండం తొలిపురపాలక సంఘం పరిధిలోని నివాసాలు. ఏడాదికి గరిష్ఠంగా రూ.60 లక్షల వరకే ఆస్తిపన్ను వసూలయ్యేది. మున్సిపల్ కమిషనర్ను మినహా ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికుల వేతనాలు ఇందులోంచే చెల్లించాల్సి వచ్చేది. వాహనాల ఇంధనం, నిర్వహణ ఖర్చులు, ఇతర కార్యకలాపాలనూ నెట్టుకొచ్చేవారు. ఆదాయం తక్కువ, వ్యయం అధికం కావడంతో ఆర్థికపరిస్థితి సంక్లిష్టంగా మారింది. తొలిమున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. వినూత్న ఆలోచనతో ఎన్టీపీసీ, సింగరేణి, ఎరువుల కర్మాగారం వంటి భారీ పరిశ్రమలకు చెందిన ఖాళీ స్థలాలపై ‘వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్’ విధించేందుకు సాహసం చేశారు. దీంతో ఆస్తిపన్ను ఏకంగా రూ.2 కోట్లకు చేరింది. బల్దియా ఆర్థికంగా బలోపేతమైంది. ఇలాంటి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు, వినూత్న ఆలోచనలే బల్దియాను కార్పొరేషన్ స్థాయికి చేర్చాయి. పారిశుధ్య నిర్వహణ కీలకం.. రామగుండం నగరం నోటిఫైడ్ ఏరియా నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరే ప్రయాణంలో పారిశుధ్యం నిర్వహణ కీలకంగా నిలిచింది. ఎడ్లబండ్లలో చెత్త తరలించే వారికే ఆటోట్రాలీలు కేటాయించింది. వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే పేదలను గుర్తించి ఇంటింటా చెత్త సేకరించే పని కల్పించింది. చెత్త సేకరణలో వినూత్నతం ఇంటింటా చెత్త సేకరణ కోసం తొలుత 40 రిక్షాలు కొనుగోలు చేశారు. ర్యాగ్ పిక్కర్స్ పేరిట పేదలకు వాటిపై ఉపాధి కల్పించారు. ఈ విధానం విజయవంతం కావడంతో మరో 60 రిక్షాలు కొనుగోలు చేశారు. వీటిపై పని చేయడానికి కార్మికులు పోటీపడ్డారు. పరుగుపందెంతో నియామకం రిక్షా కార్మికులుగా ఉపాధి కల్పించేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి అవకాశం కల్పిస్తామని పురపాలక సంస్థ తొలిపాలక వర్గం నిబంధన విధించింది. ఇందుకోసం పరుగుపందెం నిర్వహించింది. తద్వారా ఆ కుటుంబానికి ఉపాధి లబించడంతోపాటు ఆర్థిస్థిరత్వం ఏర్పడింది. ఒక్కో ఇంటినుంచి చెత్త సేకరణ ఫీజుగా రూ.20 చొప్పున కార్మికులే వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా బల్దియాపై ఆర్థికభారం కూడా తగ్గింది. సేంద్రియ ఎరువు తయారీ చెత్తను వృథా చేయకుండా సేంద్రియ ఎరువుగా మార్చేవిధానాన్ని రామగుండం పురపాలక సంఘం విజయవంతంగా అమలు చేసింది. ఇలా ఆదాయం సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ముందంజ వేసింది. రామగుండం బల్దియా ప్రొఫైల్ డివిజన్లు 60 విస్తీర్ణం(చ.కి.మీ.) 100 స్లమ్ ఏరియాలు 50 జనాభా(అంచనా లక్షల్లో) 2.35 ఓటర్లు 1,83,049 అసెస్మెంట్లు 51,345 ఆస్తిపన్ను డిమాండ్(రూ.కోట్లలో) 19.75 రోజూ వెలువడే చెత్త(మె.టన్నుల్లో) 150 కాంట్రాక్టు కార్మికులు 448 రెగ్యులర్ కార్మికులు 43 -
7న నవోదయ పరీక్ష
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 7న జరుగుతుందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్ల పంపిణీ ఆన్లైన్ ద్వారా చేశామని, డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంకా హాల్ టికెట్ రానివారు ఈ నెల 4న చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏవైనా సందేహాలుంటే 7989693572 నంబర్లో సంప్రదించాలని కోరారు. రూ.1.40 లక్షల నగదు సీజ్సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ 03బీ జెడ్ 9740 నంబర్ గల కారును తనిఖీ చేయగా, అనుమానాస్పద నగదు రూ.1.40 లక్షలను పోలీసులు గుర్తించారు. తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన డ్రైవర్ నందగిరి నాగరాజు నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్కరీంనగర్క్రైం: ఓ మహిళ కరీంనగర్ బస్టాండ్ సమీపంలో తన బంగారు ఆభరణాలు కలిగిన పర్సు పోగొట్టుకోగా ఆటోడ్రైవర్కు దొరకడంతో వన్టౌన్ పోలీసుస్టేషన్లో అందచేసి నిజాయితీ చాటుకున్నాడు. రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి మంగళవారం ఇల్లంతకుంట మండలం జవారీపేటకు వెళ్లేందుకు కరీంనగర్ వచ్చింది. బస్టాండు సమీపంలో 1.5 తులాల బంగారు రింగు, గుండ్లు, నగదు కలిగిన పర్సును పోగొట్టుకుంది. ఆ పర్సు భగత్నగర్కు చెందిన ఆటోడ్రైవర్ కోలపూరి జగన్కు దొరికింది. బస్టాండులోని పోలీసు అవుట్పోస్టు వద్దకు వచ్చి వన్టౌన్ ఎస్సై రాజన్న ఆధ్వర్యంలో లక్ష్మీకి పర్సు అందజేశాడు. ఆటోడ్రైవర్ జగన్ను పోలీసులు, స్థానికులు అభినందించారు. బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని తడగొండ గ్రామంలో రైతుల చేల వద్ద బావులు, బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కనెక్టింగ్ కేబుల్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సుమారు 20మంది రైతుల కేబుల్ వైర్లు సోమవారం రాత్రి అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన పలువురు రైతులు వైర్లు కట్ చేసి ఉండటాన్ని గమనించారు. కేబుల్ వైర్లు కాల్చి అందులోని రాగిని తీసి అమ్ముకునేందుకు వైర్లు కట్చేసి తీసుకెళ్లి ఉంటారని గంగారెడ్డి తదితర రైతులు చెబుతున్నారు. ఇలా పలుసార్లు పొలాల వద్ద వైర్లు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంమెట్పల్లి: పట్టణంలోని ఆరపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. సాయిరాంకాలనీకి చెందిన కేతావత్ ప్రవీణ్ బుల్లెట్ వాహనంపై స్నేహితుడు జలిగం వెంకటేశ్తో కలిసి సోమవారం రాత్రి సమయంలో కోరుట్లకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఆరపేట వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రవీణ్ భార్య సురేఖ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆన్లైన్లో పెట్టుబడి పెట్టించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: ఆన్లైన్ యూబెట్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాలలోని అంగడిబజార్కు చెందిన కట్కం చంద్రశేఖర్ను పట్టణానికి చెందిన వేముల మల్లికార్జున్ మల్టీలెవల్ మార్కెటింగ్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని యూబిట్ ట్రేడింగ్ యాప్లో క్రిప్టో కరెన్సీ ద్వారా గొలుసుకట్టు వ్యాపారంలో రూ.20 లక్షలు పెట్టించాడు. మల్లికార్జున్తోపాటు, పిల్లి కిషన్, ధరూర్కు చెందిన శివగంగ, యూబెట్ కంపెనీ మేనేజర్ బ్రిజ్ మోహన్, సంజయ్ గుప్తా కంపెనీ నడిపిస్తున్నారని చెప్పారు. ఇటీవల కంపెనీ మూతపడటంతో తన డబ్బులు చెల్లించాలని చంద్రశేఖర్ అడగగా తప్పించుకుతిరుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జనవరి ఒకటోతేదీన కేసు నమోదు చేసి మల్లికార్జున్ను ధరూర్ క్యాంప్లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
మెట్పల్లిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెట్పల్లి మండలం వేంపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన దండె నర్సింహులు (46) కొన్నేళ్లుగా వేంపేటలో నివాసం ఉంటున్నాడు. పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న నర్సింహులు.. సోమవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగ సహాయంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సింహులు భార్య నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్లో జనవరి 22న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనగోని క్రాంతికుమార్ (41) చికిత్స పొందుతూ మంగళవారం కరీంనగర్లో మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన క్రాంతికుమార్ హస్నాబాద్కు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆర్నెళ్ల క్రితం అతని తమ్ముడు మృతిచెందడంతో అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. భార్య కోసమని గతనెల 22న హస్నాబాద్ వచ్చాడు. భార్య లేకపోవడంతో తాగిన మైకంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన అత్తింటివారు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. క్రాంతికుమార్ సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు. ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన సాత్తూరి సందీప్(31) బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి మృతిచెందాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సందీప్.. రోజూ బైక్పై వెళ్లి వస్తుంటాడు. సోమవారం కూడా బైక్పై వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. కొలనూర్ శివారులోకి రాగా బైక్ అదుపుతప్పి పంట పొలాల్లో పడి గాయాలకు గురై మృతి చెందాడు. మంగళవారం ఉదయం రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కమాన్పూర్ గ్రామానికి చెందిన గిర్ర దేవేందర్ కుటుంబసభ్యులతో కలిసి రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి వెళ్లారు. గమనించిన దొంగలు ఈ నెల 24వ తేదీన రాత్రి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.89వేల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమరాలు, టెక్నాలజీని ఉపయోగించి దొంగల ను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ క మాన్పూర్ వడ్డెపల్లికి చెందిన సూర సీతారాం, తపాలా స్వామికుమార్, బంజారా కార్తీక్, చింతకుంటకు చెందిన చందా రాజు, కమాన్పూర్ కు చెందిన బోనాల శివను మంగళవారం అరె స్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల ను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సైలు సాంబమూర్తి, తిరుపతిని సీఐ అభినందించారు. -
బర్త్డే పార్టీలో యువకులపై దాడి
కరీంనగర్రూరల్: నడిరోడ్డుపై బర్త్ డే పార్టీ చేసుకోవడమే కాకుండా కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ కట్ చేసి హంగామా చేసి, ఇరువురిపై దాడి చేసి డబ్బులు,సెల్ఫోన్ తీసుకున్న తొమ్మిది మందిని మంగళవారం కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. తీగలగుట్టపల్లిలోని హన్మాన్నగర్లో గత నెల 31న అర్ధరాత్రి 12గంటలకు నడిరోడ్డుపై ఓ మైనర్ బర్త్ డే పార్టీని యువకులు నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ ట్ చేయడంతోపాటు టపాసులు కాల్చుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేశారు.ఈ సమయంలో టెంట్హౌజ్ సామగ్రిని వాహనం నుంచి దించుతున్న యుగంధర్, చరణ్పై కొందరు యువకులు కర్రలు, బండలతో దాడి చేశారు. వారి వద్ద ఉన్న రూ.2వేలతోపాటు సెల్ఫోన్ తీసుకుని పగులకొట్టారు. స్థానికులు వచ్చి యువకులను అక్కడి నుంచి వెళ్లగొట్టి బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. మరుసటిరోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. అజయ్, విఘ్నేష్, రంజిత్లు మేజర్లు కాగా మిగితా ఆరుగురు మైనర్లున్నారని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిని కరీంనగర్జైలుకు, ఆరుగురు మైనర్లను వరంగల్ జువైనల్హోమ్కు తరలించినట్లు వివరించారు. తొమ్మిది మంది అరెస్టు -
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా..
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రాంరెడ్డి 1970లోనే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఎంపీపీగా పనిచేసి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సర్పంచ్ మొదలు.. ఎమ్మెల్యే వరకు ఆయన అనేక ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. ప్రజల్లో తన పేరును పదిలం చేసుకున్నారు. 1970లో రాజకీయాల్లోకి.. 1970లో రాజకీయాల్లోకి వచ్చిన రాంరెడ్డి.. సర్పంచ్గా కొనసాగుతూనే మండల ప్రెసిడెంట్ బాధ్యలు నిర్వహించారు. 1989లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై విజయం సాధించారు. 1999లో శ్రీధర్బాబుపై ఓటమి చెందారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్లో చేరి చురుకుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ అధికారులపై దాడిచేసి గుర్తింపు పొందారు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని భావించారు. రాంరెడ్డి కుమారుడు సునీల్రెడ్డి(బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు) కాగా, రెండోకుమారుడు అమెరికాలో స్థరపడ్డారు. గురువారం ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో రాంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామన్న మృతిపై స్వగ్రామంతోపాటు నియోజకవర్గంలోని అయన అభిమానులు, బీజేపీ తదితర పార్టీలు, కుటుంభ సభ్యుల్లో విషాదం నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రజాసేవలో రాంరెడ్డి ప్రత్యేక ముద్ర అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే కన్నుమూత -
చాలాశ్రమించాం
నోటిఫైడ్ ఏరియా నుంచి పురపాలక సంఘంగా మారిన తర్వాత ఆస్తిపన్ను వసూలు చేయడం కష్టంగా ఉండేది. ఒక్కోఇంటికి వందలసార్లు తిరగాల్సి వచ్చేది. ఇంత శ్రమించినా ఏడాదికి రూ.60లక్షలకు మించి వసూలయ్యేదికాదు. తొలి మున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రత్యేక చొరవతో ఆస్తిపన్ను క్రమంగా రూ.2 కోట్ల వరకు చేరింది. ఇందులోంచే మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించేవాళ్లం. ఆర్థిక క్రమశిక్షణ పాటించేవాళ్లం. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసేవాళ్లం. దీంతోనే రామగుండం కార్పొరేషన్ స్థాయికి చేరింది. దీనివెనుక అనేక ఆలోచనలు, అనేక ప్రయాణాలు ఉన్నాయి. – పిల్లి శివయ్య, అప్పటి ఆర్ఐ -
‘వెలిచాల’తో కాంగ్రెస్కు భవిష్యత్ లేదు
కరీంనగర్ కార్పొరేషన్: అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీగా వెలిచాల రాజేందర్రావును నియమించి, అధిష్టానం కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తోందని మాజీ కార్పొరేటర్లు మెండి శ్రీలత, చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వెలిచాల ఉంటే కాంగ్రెస్కు కరీంనగర్లో భవిష్యత్ ఉండదన్నారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్లో పిచ్చోడి చేతిలో రాయి పెట్టిందని, అది ఎటు పోతుందో తెలియదని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షతో తమకు పార్టీ టికెట్ ఇవ్వకుండా వెలిచాల అన్యాయం చేశాడన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో తమను బ్రతిమాలి కాంగ్రెస్లో చేర్చుకున్నారన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో చాకులాంటి అమ్మాయిలు అని వెలిచాల చేసిన కామెంట్స్ తప్పని చెప్పినందుకే తమపై కక్షపెట్టుకొన్నారన్నారు. తమకు టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఉంటున్నానని చెప్పేందుకు డీసీసీ అధ్యక్షుడు సత్యం ఇంటికి వెళ్లామన్నారు. అక్కడికి వచ్చిన వెలిచాలను ఏదైనా పొరపాటుఉంటే క్షమించమని చేతులు పట్టుకొని వేడుకుంటే, తమనే దూషించాడన్నారు. ఒక ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని, దొర అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
రెండేళ్లలో కరీంనగర్ విధ్వంసమైంది
కరీంనగర్ టౌన్: రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని 40, 4వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కార్యాలయాలను ప్రారంభించారు. బండి సంజయ్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నారని.. తాను కరీంనగర్లో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. కేంద్ర మంత్రిగా రెండేళ్లు పూర్తయిన కూడా తీగలగుట్టపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని.. రెండేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, 40వ డివిజన్ అభ్యర్థి నలువాల పుష్పలత, 4వ డివిజన్ అభ్యర్థి బెజ్జంకి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తుల జ్వాలలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతా వరణం వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన వారికి నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్నవారు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ఎదుట ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. ముమ్మాటికీ తప్పే: మాజీ మంత్రి గంగుల ఒకే డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి బీఫామ్లు ఇవ్వడం విస్మయాన్ని కల్గించింది. ఇది రాజకీయంగా, సాంకేతికంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి ఈ రెండు బీఫామ్లను తిరస్కరించాలి. నిబంధనలు ఉల్లంఘనకు గురైనందున ఇద్దరు అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటించాలి. ఇందులో ఎవరినీ కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించినా న్యాయ పోరాటం చేస్తాం. సత్యనారాయణను నిలదీస్తున్న దుర్శేటి కావ్యబల్దియా వద్ద కాంగ్రెస్ ఆశావహుల ఆందోళనకాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫాంను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలి సి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్లో కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కరీంనగర్ 53వ డివిజన్కు చెందిన మెండి శ్రీలతచంద్రశేఖర్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో దళిత మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వెలిచాల రాజేందర్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీలత, చంద్రశేఖర్ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్న ట్లు ప్రకటించారు. నగరంలోని 2వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ దాసరి సాగర్ నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థి అని ముద్రించుకున్న కరపత్రాలు, పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. బీజేపీ నాయకుడు బేతి మహేందర్రెడ్డి పార్టీకి రాజీనామా చేసి, రెబల్గా బరిలో నిలిచాడు. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. టికెట్లు దక్కని నేతలు రెబల్స్గా బరిలోకి దిగా రు. రాయికల్లో ఐదుగురు రెబల్స్ పోటీలో ఉన్నారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లిలోనూ కాంగ్రెస్కు బెడద తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలలో రెబల్స్ బెడద ఉంది. సిరిసిల్లలోనూ అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి. వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు 3 డివిజన్లలో, బీఆర్ఎస్కు రెండు డివిజన్లలో రెబల్స్ బరిలో నిలిచి గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. -
మాకు ప్రగతి కావాలి.. వాళ్లకు మీ జాగా కావాలి
కరీంనగర్: మాకు నగర ప్రగతి కావాలి. వాళ్లకు మీ జాగాలు కావాలి. ఆలోచించి ఓటేయండంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కోతిరాంపూర్చౌరస్తా, పాత లేబర్ అడ్డా సమీపంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్ రావు, 9, 39, 40, 62, 63, 64 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ, పెద్దపల్లి శ్రీలేఖ, దేశ శిల్పా వేదం, గాదె శ్రీలేఖ పక్షాన ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చానని, ఈ వివరాలన్నీ బుక్ లెట్ప్రింట్ చేసి ఇంటింటికీ పంపిస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ చుట్టుపక్కల జాగాలు కబ్జా చేశారని, సిగ్గు లేకుండా వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గురించి చెప్పుకోవడమే దండుగ అన్నారు. అది కాంగ్రెస్ కాదు...‘ఖాన్’ గ్రేస్ అని ఎద్దేవా చేశారు. ఏ సర్వే చూసినా కరీంనగర్లో వార్వన్ సైడ్ అని సర్వే నివేదికలన్నీ చెబుతున్నాయన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే నగరంలోని డంప్యార్డు సమస్య పరిష్కరిస్తామన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయండి
కరీంనగర్టౌన్/సప్తగిరికాలనీ: అంతర్జాతీయస్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గత నెల 29నుంచి ఈనెల 1 వరకు రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ‘ది సైలెంట్ ఒలింపియాడ్–2026’ పేరుతో ముంబైలో నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కరీంనగర్ ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొని ఆల్ ఇండియా ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. 28 మంది బంగారు, వెండి, రజత పతకాలు సాధించారు. కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయ పోటీల్లోనూ విద్యార్థులు పాల్గొనేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, బధిరుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ జి.కమల ఉదయ కుమారి, ఉపాధ్యాయులు జే.తులసీరామ్, కె.శ్రీనివాస్, ఎన్.సుజాత, బి.అఖిల్, ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోగాలు ప్రజల వినియోగం వరకు వెళ్లాలి విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు సైన్స్ ఫెయిర్లకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే వస్తువుల్లాగా మారడం ఎంతో అవసరమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(కుమార్వాడి)లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని 17, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 8 అటల్ టింకరింగ్ ల్యాబ్ సౌకర్యం ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులు తమ ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 35 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, యూనిసెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గిరిజాశంకర్ పాల్గొన్నారు. -
బీజేపీకి ‘బేతి’ రాజీనామా
కరీంనగర్: బీజేపీలో కార్యకర్తగా వివిధ హోదాల్లో 30ఏళ్ల పాటు పనిచేసిన సీనియర్ నాయకుడు బేతి మహేందర్రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు పంపించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తున్న తనకు కాదని ఫిరాయింపుదారులకు బీఫాం ఇవ్వడం తీవ్రంగా కలచివేసిందన్నారు. నగరంలో ఇతర డివిజన్లలో కూడా తనలాంటి పార్టీ విధేయులకు అన్యాయం జరిగినందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహాయ, సహకారాలు అందించిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మున్సిపల్లోనూ కాంగ్రెస్దే విజయం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జైత్రయత్ర మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం నగరంలోని వీ పార్క్ హోటల్లో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 5వ తేదీన చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు,నామినేటెడ్ చైర్మన్లు హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్కు మేయర్దక్కకుండా ఉండేందుకు కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. ఒకరు బలంగా ఉన్న చోట మరొకరు బలహీనులకు టికెట్ ఇచ్చి సహకరించుకొంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. -
ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జితేందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని మైక్రో అబ్జర్వర్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. విధుల నిర్వహణలో తప్పకుండా గుర్తింపు కార్డు ధరించాలని అన్నారు. పోలింగ్ ముందు రోజు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, మాక్ పోలింగ్, ఓటింగ్, పోలింగ్ ఏజెంట్ల నియామకం వంటివి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్ని కల ఆడిట్ అబ్జర్వర్ ఎం.మనోహర్, నోడల్ అధికారి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మోహినుద్దీన్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): విద్యారంగంలో నూతన ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు పెద్దపీట వేయాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన వర్సిటీలో పరిశోధన పర్యవేక్షకులకు నూతన ఉత్తర్వుల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్డీ చేయడానికి పరిశోధకులు ముందుకు వస్తున్న తరుణంలో చాలామంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు పదవీ విరమణ చేయడం వల్ల పరిశోధనలలో ఖాళీ ఏర్పడిందన్నారు. వాటిని భర్తీ చేయడానికి విశ్వవిద్యాలయం ఉ న్నత విద్య మండలి సహకారంతో విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సహాయ, సహ ఆచార్యులకు పర్యవేక్షకులుగా పదోన్నతులు కల్పించిందని తెలిపారు. వర్సిటీతో పాటు వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు తెలుగులో 5, వృక్షశాస్త్రంలో 5, వాణిజ్యశాస్త్రంలో 7గురును పర్యవేక్షకులుగా గుర్తించి ఉత్తర్వులు అందించడం జరిగిందని వీసీ ఉమేశ్కుమార్ వివరించారు. కరీంనగర్: కుష్ఠువ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని లెప్రసీ అండ్ ఎయిడ్స్ జిల్లా అధికారి డాక్టర్ సుధా అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఓపీ ఆవరణలో కుష్ఠువ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధా మాట్లాడుతూ... మహాత్మా గాంధీ కుష్టు రోగులకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి తీవ్రత, చికిత్స విధానం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే వైద్య సేవల గురించి ఆమె వివరించారు. కుష్ఠు పూర్తిగా నయమయ్యే వ్యాధి అని, ప్రారంభదశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి వైకల్యం రాకుండా పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు డాక్టర్ శిల్ప, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు. 7న ఓవైసీ బహిరంగ సభవిద్యానగర్(కరీంనగర్): ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఈనెల 7న కరీంనగర్ రానున్నారు. మహాత్మా జ్యోతి బాపూలే మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందు కు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఉమ్మడి జిల్లా ఎంఐఎం పార్టీ పరిశీలకుడు యా సర్ ఆర్ఫాత్, కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పరిశీలించారు. -
బల్దియా బరిలో 398 మంది
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్ని కల బరిలో 398మంది నిలిచారు. మంగళవారం ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 698 నామినేషన్లకు గాను ఇప్పటికే ఆరుగురు నామినేషన్ను ఉపసంహరించుకోగా, చివరిరోజు మంగళవారం భారీ మొత్తంలో 294 మంది నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. 66 డివిజన్లకు గాను 398 మంది పోటీచేస్తున్నారు. బీజేపీ నుంచి 126, బీఎస్పీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 84, ఎంఐఎం నుంచి 9, బీఆర్ఎస్ నుంచి 48, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2, సీపీఐ నుంచి ఒకరు, జేఎస్పీ నుంచి 2, స్వతంత్రులు 26 మంది ఉపసంహరించుకున్నారు. బేరాలు...బీ–ఫారాలు మంగళవారం నగరంలో ఉత్కంఠవాతావరణం నెలకొంది. ఓ వైపు పార్టీల బీ–ఫారాల కోసం...మరో వైపు పోటీలో ఉండే రెబల్స్, ఇతరులతో బేరసారాలు సాగించడంపై నాయకులు దృష్టిపెట్టారు. ఎంఐఎం మినహా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున బీ–ఫారాలు సమర్పించారు. కొన్ని చోట్ల అన్ని పార్టీల్లోనూ చివరిక్షణంలోనే అభ్యర్థులు ఖరారయ్యారు. తప్పని రెబల్స్ బెడద అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికల్లో రెబెల్స్ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్, బీజేపీల్లో కాస్త ఎక్కువగా ఉన్నారు. టికెట్లు ఇవ్వలేని వాళ్లను పార్టీ పెద్దలు బుజ్జగించారు. దీనితో కొంతమంది ఉపసంహరించుకున్నా, కొన్ని డివిజన్లలో బుజ్జగింపులకు రెబల్స్ లొంగలేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్లు తమకే వస్తాయనుకొన్న మాజీ కార్పొరేటర్లు కొంతమందికి, టికెట్లు దక్కకపోవడంతో తప్పనిసరిగా స్వతంత్రులుగా బరిలో దిగారు. సీపీఐకి ఒకటి పొత్తులో భాగంగా కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐకి ఒక సీటు కేటాయించింది. 57వ డివిజన్ సీపీఐ అభ్యర్థి లతాశ్రీ కసిరెడ్డికి మద్దతు ప్రకటించింది. బల్దియా ముందు ఆందోళన గుర్తుల కేటాయింపు, తుది జాబితా ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారంటూ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట స్వతంత్ర అభ్యర్థులు ధర్నాకు దిగారు. వాహనాలు, మైక్లకు అనుమతి తీసుకొనేందుకు ఒక్కకౌంటర్ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చొప్పదండి బరిలో 64 మంది చొప్పదండి: నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డులలో 64 మంది బరిలోఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి అన్ని వార్డులలో అభ్యర్థులను బరిలోకి దింపారు. ఏఐఎఫ్బీ, జనసేన నుంచి 2 చొప్పున, బీఎస్పీ నుంచి ఒక్కరు, ఇండిపెండెంట్గా 17 మంది బరిలో ఉన్నారు. పట్టణంలో 14 వార్డులుండగా 2,6,7,11,12 వార్డుల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,14 వార్డుల్లో నలుగురు చొప్పున, 3,4,10 వార్డుల్లో అయిదుగురు చొప్పున పోటీలో ఉన్నారు. 1,5,8 వార్డుల్లో ఆరుగురు చొప్పున, 9వ వార్డులో ఏకంగా 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
పొత్తు లేకుండానే సత్తా చాటుతాం
‘గంగుల కమలాకర్.. నేను నయాపైసా తీసుకురాలేదని అబద్ధాలాడుతున్నావు.. ఏయే అభివృద్ధి పనులు చేశానో ఆ వివరాలు బుక్లెట్లో ఉన్నయ్. ఇగ అన్నమాట ప్రకారం.. నువ్వు మూట, ముల్లె సర్దుకుని వెళ్లిపో’.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ధ్వజమెత్తారు. –కరీంనగర్ – వివరాలు మెయిన్లోu కరీంనగర్ టౌన్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ మేయర్ పీఠం కై వసం చేసుకుంటే ఆ విజయంతో రాష్ట్రం మొత్తం ప్రభావితం అవుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి కరీంనగర్లోని ఓ హోటల్లో బీఆర్ఎస్ 66 డివిజన్ల ఇన్చార్జిలతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డివిజన్ ఇన్చార్జీలకు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు రెండు రూపాయలు కూడా తీసుకురాలేదన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని బీఆర్ఎస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా మేయర్ పీఠం కై వసం చేసుకొని సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, అనిల్కుమార్గౌడ్, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
● జాతర కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● వేములవాడ జాతర నిర్వహణపై సమీక్షసిరిసిల్ల: మహాశివరాత్రి జాతరకు అన్ని శాఖల అధికారులు సమ్వయంతో పనిచేయాలని జాతర కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి జాతర సందర్భంగా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్సాయి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ హాజరయ్యారు. కలెక్టర్ మా ట్లాడుతూ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా, వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో మరమ్మతు, హెలిప్యాడ్ వద్ద, ఇతర చోట్ల బారికేడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు 600 బస్సులు భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ ఏడాది 600 బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఆర్ఎం తెలిపారు. జాతరకు ముందు నుంచి తర్వాత మూడు రోజుల వరకు పారిశుధ్య సేవలు అందించాలని సూచించారు. బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల హెల్ప్డెస్క్లు అందుబాటులో పెట్టాలని తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, అల్పాహారం కల్పించాలని సూచించారు. 24 గంటలు విద్యుత్ సరఫరా వేములవాడ పట్టణ వ్యాప్తంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సెస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పార్కింగ్ స్థలాల్లో వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వేములవాడ ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల జీజీహెచ్ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫుడ్సేఫ్టీ అధికారులు భక్తులకు అందించే ప్రసాదం, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించాలన్నారు. నాంపల్లి వద్ద భక్తుల నియంత్రణ నాంపల్లి వద్ద భక్తుల రద్దీ నియంత్రణకు ఇద్దరు అధికారులను నియమించాలని తెలిపారు. జాతరలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా చూడాలని, క్యూలైన్ల వద్ద తాగునీటిని స్టీల్గ్లాస్లలో ఇవ్వాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల సహాయం కోసం వీల్చైర్లతో వలంటీర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తిప్పాపూర్ బస్టాండ్తోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి ఏకాంత సేవలు, పూజలు కొనసాగుతాయని ఆలయ అర్చకుడు చంద్రగిరి శరత్ తెలిపారు. భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర, స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తారని వెల్లడించారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సింహం ధైర్యం..!
ఏనుగు బలం.. సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. ముందస్తు వ్యూహాలు టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్బీ, బీఎస్పీ పార్టీల పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు సవాల్ ఏఐఎఫ్బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబల్ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్ కలసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది. సెంటిమెంట్ ఏఐఎఫ్బీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్ 3, జగిత్యాల 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం – అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజురాబాద్లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తుంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం. – నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు -
రేకుర్తి జాతర ఆదాయం రూ.40.44లక్షలు
కరీంనగర్కల్చరల్: కరీంనగర్లోని రేకుర్తి సమ్మక్క– సారలమ్మ జాతర ఆదాయం రూ.40,44,292 సమకూరినట్లు ఈవో మారుతి తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ కార్యాలయంలో సహాయ కమిషనర్ సుప్రియ పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో వివరాలు వెల్లడించారు. టెండర్ ద్వారా రూ.11,16,000, టికెట్ల ద్వారా రూ.7,31,580, హుండీల ద్వారా రూ.21,96,712 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 2024 జాతర కంటే ఈసారి రూ.4,52,642 ఆదాయం ఎక్కువగా సమకూరినట్లు వివరించారు. అలాగే 30 గ్రాముల మిశ్రమ బంగారం, 531.5 గ్రాముల మిశ్రమ వెండి సమకూరినట్లు తెలిపారు. హౌసింగ్బోర్డు జాతర ఆదాయం రూ.4.59 లక్షలు బొమ్మకల్ రోడ్డులోని హౌసింగ్బోర్డు సమక్క– సారలమ్మ జాతర ఆదాయం రూ.4,59,954 సమకూరినట్లు ఈవో వెంకటచారి తెలిపారు. హూండీల ద్వారా రూ.409,234, టికెట్ల ద్వారా రూ.50,720 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. -
మత్తు రహిత సమాజానికి కృషి చేయాలి
కరీంనగర్కల్చరల్: మత్తు రహిత సమాజాన్ని సాధించేందుకు కవి, రచయితలు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీనియర్ కవి, గాయకుడు నడిమెట్ల రామయ్య అన్నారు. సోమవారం రాత్రి తీగలగుట్టపల్లి టీచర్కాలనీలో సుంకె రాజు నివాసంలో జరిగిన 154వ ఎన్నీల ముచ్చట్లలో మాట్లాడారు. డ్రగ్స్ మాఫియా చేతిలో బలైపోయిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం నిర్వాహకులు కవితాపఠనం కార్యక్రమాన్ని కొనసాగించారు. సమకాలిన అంశాలపై కవులు కవిత్వం చదివి వినిపించారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు సీవీ కుమార్, దామరకుంట శంకరయ్య కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కవులు బాలసాని కొమురయ్య, గుండు రమణయ్య, విలాసాగరం రవీందర్, నెరువట్ల చైతన్య, జనగాని యుగంధర్, రావుల శ్రీనివాసాచారి, బొల్లం బాలకృష్ణ వెంకటేశ్, ఉపేందర్ తదితరులు కవిత్వం వినిపించారు. కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ సంతోష్నగర్, చైతన్యపురి, మహాశక్తి ఆలయ ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. సంతోష్నగర్, సంతోషిమాత ఆలయం, మహాశక్తి ఆలయం, బాలాజీ సూపర్మార్కెట్, భాగ్యనగర్, జ్యోతినగర్, గీతాభవన్ వెనక ప్రాంతం, కార్పెంటర్స్ సొసైటీ, హనుమాన్ ఆలయం, కొత్త లేబర్అడ్డా, సాయిబాబా ఆలయం, సెయింట్ జాన్స్ స్కూల్, చైతన్యపురి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
జగిత్యాలకు ఐకాన్ క్లాక్టవర్
తీగలగుట్టపల్లి ఆర్వోబీ రోడ్డులో దుమ్ముతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దమ్ము తీయకుండా దుమ్ము లేస్తోందని వాపోతున్నారు. ఆర్వోబీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ తాత్కాలికంగా కంకరరోడ్డు వేశాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ రోజూ ట్యాంకర్తో దుమ్ము లేవకుండా రోడ్డుపై నీళ్లు చల్లాల్సి ఉండగా పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కరీంనగర్– చొప్పదండి రోడ్డులోని వాహనాలు మరోవైపు రైల్వేస్టేషన్లో ఎరువుల లోడింగ్తో వచ్చే లారీలతో పెద్దపెద్ద గుంతలేర్పడ్డాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డుకు మరమ్మతు చేసేందుకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – కరీంనగర్రూరల్ -
నాచుపల్లి జేఎన్టీయూలో ప్రాంగణ నియామకాలు
కొడిమ్యాల: నాచుపల్లి జేఎన్టీయూలో వర్టికల్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, యూనిటెక్, వీటెక్ సంస్థలు సోమవారం ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. రెండు దశల్లో సాగిన ఎంపిక ప్రక్రియలో ట్రిపుల్ఈ, మెకానికల్, ఈసీఈ ఫైనలియర్ విద్యార్థులు 110 మంది ఎంపికై నట్లు సంస్థ హెచ్ఆర్ ఆపరేషన్స్ హెడ్ సబరీ తెలిపారు. వీరందరికీ ఏటా రూ.2.40లక్షల వేతనం ఉంటుందని, ఉచిత వసతి, రవాణా సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నరసింహ అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రాంగణ నియామకాల అధికారి సతీశ్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 110 మంది విద్యార్థులు ఎంపిక -
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
చొప్పదండి: మండలంలోని రాగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థులకు సోమవారం ‘సాక్షి’ మెటీరియల్ పంపిణీ చేశారు. గణితం, ఫిజికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ అందించడంపై విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్చార్జి హెచ్ఎం గంగేశం, ఉపాధ్యాయులు కర్ర వెంకటరాంరెడ్డి, ప్రమీల, రాణి, రాజియొద్దీన్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 5న గుమ్లాపూర్ శివారులో నిర్వహించే సీఎం రేవంత్రెడ్డి సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మండలంలోని గుమ్లాపూర్ శివారులో సభా స్థలాన్ని సోమవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, ఇప్ప శ్రీనివాస్రెడ్డి, నిజానపురం చందు తదితరులు ఉన్నారు. తిమ్మాపూర్: మండలంలోని మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతిపై కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ రామచందర్రావు తెలిపిన వివరాలు.. పర్లపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు.. పొలం వద్ద సాగునీటి కాలువ విషయంలో ఇటీవల సదరు సర్పంచ్తో స్వల్ప వాగ్వాదం జరిగింది. సోమవారం కరీంనగర్లో ఫర్టిలైజర్ దుకాణం వద్ద పొలానికి సంబంధించి మందులు కొనుగోలు చేస్తుండగా ఇద్దరికి మాటామాట పెరిగింది. సర్పంచ్పై రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ తిరుపతి, రైతుపై చేయి చేసుకున్నాడు. రైతుకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తిమ్మాపూర్: ఉద్యోగులు తమ హక్కులు, సమస్యలపై పోరాడే తత్వం క్రమంగా కోల్పోతున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం మండలంలోని ఎల్ఎండీ కాలనీలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన నీటి పారుదల శాఖ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. 80 ఏళ్లుగా ఉద్యోగుల హక్కుల కోసం టీఎన్జీవో పోరాడుతోందని తెలిపారు. ఏ సమస్యపైనా పిలుపునిస్తే ఉద్యోగులు రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. త్వరలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఏ సమస్య వచ్చినా పోరాటానికి ముందుండాలన్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను అభినందించారు. టీఎన్జీవో కార్యదర్శి సంగెం లక్ష్మ ణరావు, నాయకులు శంకర్, నాగేందర్రెడ్డి, అమరేందర్రెడ్డి, పోలు కిషన్ పాల్గొన్నారు. జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ. 7,950 పలికింది. మార్కెట్కు 35 వాహనాల్లో 268 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకవచ్చారు. క్వింటాల్కు మోడల్ ధర రూ.7,700, కనిష్ట ధర రూ.7,300 చెల్లించారు. క్రయవిక్రయాలను మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
జగిత్యాలకు ఐకాన్ క్లాక్టవర్
● ఒకప్పుడు సమయం తెలిపింది ఈ టవరే ● అందమైన రీతిలో కట్టడం ● నిర్లక్ష్యానికి గురవుతున్న అపురూప నిర్మాణం జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రం నడిబొడ్డున.. నలువైపులా ఏర్పాటు చేసిన క్లాక్టవర్ ఈ ప్రాంతానికే ఐకాన్గా నిలుస్తోంది. ఇది పట్టణానికే అందం తేవడంతోపాటు గతంలో వచ్చిపోయే వారికి సమయం కూడా తెలిపేది. క్లాక్టవర్ అంటే ఈ ప్రాంతంలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 1936లో ఈ క్లాక్టవర్ను చల్గల్కు చెందిన ధర్మ జలపతిరావు దేశ్ముఖ్ నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. ఇందులోని గడియారాన్ని జర్మనీ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చారు. నాటి రోజుల్లో స్థానిక ప్రజలకు కలరా వ్యాధి రావడంతో కోలుకున్న సందర్భంగా వ్యాధి నిర్మూలనకు సాక్ష్యంగా ఈక్లాక్ టవర్ నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ● ఇందులోని గడియారాన్ని జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు ● ఇది సమయం సూచించడంతోపాటు గంటకుగంటకూ మోగుతుంది ● ఆ శబ్దం చుట్టుపక్కల కొంతదూరం వరకు వినిపిస్తుంది ● మొదట్లో కాషాయం రంగులో ఈ టవర్ను ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో సుమారు రూ.10 లక్షలు పెట్టి మరమ్మతు చేయించారు. ● ప్రస్తుతం వైట్, బ్లూకలర్తో మెరిసిపోతోంది ● 60 అడుగుల ఎత్తుతో అష్టబుజి గోపురం దీని ప్రత్యేకత ● స్తంభానికి ఎత్తైన భాగంలో గోపురం ఉంటుంది. ● నాలుగు వైపులా గడియారం ఉంటుంది ● ఇప్పుడు అది పనిచేయడం లేదు. గతంలో మరమ్మతు చేపట్టినా ఫలితం లేదు. ● క్లాక్ టవర్ చుట్టూ వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలిశాయి ● ఈ ప్రాంతంలో దొరకని వస్తువంటూ ఉండదు ● జిల్లా కేంద్రంలో నిర్వహించే వినాయకచవితి, దేవీనవరాత్రులు, మొహర్రం, స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా క్లాక్టవర్ వరకు వచ్చి ప్రదర్శనలు చేపడతారు ● ఉత్సవాల సమయంలో విద్యుత్ వెలుగులతో అలంకరిస్తుంటారు ● ఇంత ప్రాచూర్యం పొందిన క్లాక్ టవర్పై బల్దియా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి ● అధికారులు స్పందించి క్లాక్ టవర్కు మరమ్మతు చేయడంతోపాటు అభివృద్ధికి కృషి చేయాలని, పర్యాటకులను ఆకట్టుకునేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
తల్లిదండ్రుల పెళ్లిరోజే కుమారుడి మృతి
● యువకుడిని కబళించిన రోడ్డు ప్రమాదం ● చిట్టాపూర్లో విషాదం మల్లాపూర్: తల్లిదండ్రుల పెళ్లిరోజే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మండలంలోని సాతారం, ధర్మారం గ్రామాల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని చిట్టాపూర్కు చెందిన బొమ్మెన రమేశ్, లత దంపతులకు ఇద్దరు కుమారులు. రమేశ్ బ్రాస్బ్యాండ్ నిర్వహిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్దకుమారుడు యశ్వంత్(20) ఇంటర్ పూర్తి చేసి తండ్రికి చెదోడువాదోడుగా ఉంటున్నాడు. రమేశ్, లత పెళ్లిరోజు కావడంతో కుటుంబసభ్యులంతా ఆనందంగా గడిపారు. రాత్రి 7.30గంటల సమయంలో యశ్వంత్ బైక్పై సాతారం గ్రామంలోని మిత్రుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సాతారం–ధర్మారం గ్రామాల మధ్య గుండంపల్లి క్రాస్రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. మల్లాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
బెదిరించి.. ఉపసంహరింపజేసి
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మహిళను, ఆమె కుటుంబాన్ని బెదిరించి నామినేషన్ ఉపసంహరణ చేయించిన ఘటనపై బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణితోపాటు నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి, డీజీపీతోపాటు రామగుండం పోలీస్ కమిషనరేట్లోని అడిషనల్ డీసీపీ(అడ్మిన్)ని కలిసి ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. బీజేపీ ఒకటో డివిజన్ అభ్యర్థి రమ బిశ్వాస్, భర్త పంకజ్ కుమార్బిశ్వాస్ మాట్లాడుతూ, ఎన్టీపీసీ ఇందిరమ్మక్యాంప్లో తాము నివాసం ఉంటున్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి మాత్రమే కాకుండా పోలీసుల పేరిట కూడా తమకు బెదిరింపులు పెరిగాయని ఆవేదన చెందారు. ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఎన్టీపీసీ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు.. పంకజ్ కుమార్ బిశ్వాస్ను ఆయన పనిచేస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ యాజమాన్యం ద్వారా పిలిపించారని పేర్కొన్నార. అక్కడ పోలీస్ అధికారులు భయభ్రాంతులకు గురిచేశారని, నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే అంతుచూస్తామని బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడి, భయభ్రాంతుల మధ్య తనతో బలవంతంగా వీడియో స్టేట్మెంట్ రికార్డు చేయించారని, అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తీసుకెళ్లి పలు పత్రాలపై సంతకాలు చేయించి నామినేషన్ ఉపసంహరణ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాలరాస్తూ, భయబ్రాంతులకు గురిచేసి నామినేషన్ ఉపసంహరణ చేయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. నామినేషన్ విత్డ్రాపై పోలీసులకు ఫిర్యాదు -
లంకెబిందెలంటూ భయపెట్టి..
కామారెడ్డి క్రైం: ‘మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి. అందుకే మీకు తరచూ అనారోగ్య, ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటిని తీసివేయకపోతే మీ కుటుంబంలో మరణాలు తప్పవు’ అంటూ భయపెడుతూ.. క్షుద్ర పూజల పేరుతో లక్షలు దోచుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్దిరోజుల క్రితం వాస్తు పరిజ్ఞానం, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు నటిస్తూ ఓ వ్యక్తి వచ్చాడు. మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయని, వాటి కారణంగానే కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతోందని చెప్పాడు. వాటిని తీయకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని భయపెట్టాడు. క్షుద్రపూజలు చేసి లంకెబిందెలు తీసివేస్తానని నమ్మించాడు. దీనికి రూ.8.20 లక్షలు డిమాండ్ చేశాడు. భీరవ్వ కుటుంబం ఇటీవల సదరు వ్యక్తికి కామారెడ్డిలో డబ్బులు అందించింది. తర్వాత అతడు ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి గతనెల 26న కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిని రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి నర్సింలు అలియాస్ నర్సారెడ్డిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రూ.7లక్షలు నగదు, సెల్ఫోన్, రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అతడి ఇద్దరు అనుచరులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గతంలోనూ పలు కేసులు.. ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని గుప్తనిధులు, పూజల పేరిట ఈ ముఠా చాలా మంది నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతేడాది కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి భిక్షాటన కోసం వెళ్లి లంకెబిందెల పేరిట ఇదే తరహాలో రూ.14 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె నుంచి రూ.2.93 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఇలా ఇతర జిల్లాల్లోనూ ఈ ముఠాపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ నరహరి, సిబ్బందిని అభినందించారు. క్షుద్రపూజల పేరిట లక్షల దోపిడీ నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
పనులు లేక పరేషాన్
● మిడ్మానేరు నిర్వాసిత గ్రామాల్లో అన్ని ఇబ్బందులే.. ● యువతకు ఉపాధి లేదు.. రైతులకు పనులు లేవు.. ● అడ్డా కూలీలుగా నిర్వాసితులురుద్రవరం ఆర్అండ్ఆర్ కాలనీ వేములవాడఅర్బన్: మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలు అన్నీ.. ఇన్నీ కావు. నిర్వాసితుల కుటుంబాల్లోని యువతకు ఉద్యోగావకాశాలు లేక.. పెద్దమనుషులకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ఎదురుచూస్తున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్ట్లో కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, శాభాష్పల్లి, ఆరెపల్లి, సంకెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, గుర్రంవాణిపల్లి, చింతాల్ఠాణా, చీర్లవంచ గ్రామాలు ముంపునకుగురయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలకు వేములవాడ మండలంలో పునరావాసం కల్పించారు. ప్రభుత్వం అందించిన స్థలంలో ఇంటి నిర్మాణాలు చేసుకున్నారు. కానీ చాలా హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిర్వాసితుల సమస్యలు ఇవీ.. మిడ్మానేరులో ముంపునకు గురైన నిర్వాసితులకు కొందరికి ఇప్పటి వరకు పట్టాలు పరిహారం రాలేదు. గత ప్రభుత్వం ప్రతీ నిర్వాసితుడికి రూ.5.04 లక్షలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. 10,683 నిర్వాసిత కుంటుబాలు ఉండగా 5,987 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు ప్రత్యేక కోటా కింద మాంజూరు చేసింది. ఉపాధి కరువు నిర్వాసిత గ్రామాల్లో వ్యవసాయ భూములు లేక, కూలి పనులు దొరక్క ఆటోల్లో ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్తున్నారు. యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ నిర్వాసితుడికి రూ.5.04 లక్షలు చెల్లించాలి. నిర్వాసితులు సర్వం కోల్పో యి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. – బుర్ర శేఖర్గౌడ్, సంకెపల్లి ప్రాజెక్ట్లో సర్వం కోల్పోయి ఉపాధి లేక యువత ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. ఈ ప్రభుత్వమైనా ఉపాధి అవకాశాలు కల్పించాలి. – శ్రీధర్, రుద్రవరం -
పోస్టల్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి: స్పీడ్ పోస్ట్, పార్సిల్, అంతర్జాతీయ మెయిల్ బుకింగ్, పిక్అప్, డెలివరీ సేవలు మరింత విస్తృతం చేసేందుకు భారత పోస్టల్ శాఖ శ్రీకారం చుట్టింది. అధునాతన ఏపీటీ 2.0 సాంకేతికత ద్వారా వీటిని అందించేందుకు కొత్త పోస్టల్ ఫ్రాంచైజీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ శివాజీ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు భారత పోస్టల్ శాఖ అధికారిక వెబ్సైట్ (indiaport.gov.in) ద్వారా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. 18ఏళ్ల వయసు పైబడి కనీసం ఇంటర్మీడియట్ (డెలివరీ సేవల కోసం పదో తరగతి ఉత్తీర్ణత), ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులన్నారు. కమీషన్ ఆధారిత ఆదాయం, ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరించారు. వివరాలకు సమీప పోస్టాఫీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసు కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన సూచించారు. రూ.1.30లక్షలు పట్టివేత● సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎలాంటి పత్రాలు తరలిస్తున్న నగదును ఎస్ఎస్టీ చెక్పోస్టు సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. కారు డ్రైవర్ మోహిత్కుమార్ తన కారులో ఎలాంటి పత్రాలు లేని రూ.1.30లక్షలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆ నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. 8న వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు కరీంనగర్స్పోర్ట్స్: సిరిసిల్లలోని మినీ స్టేడియంలో ఈ నెల 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి యూత్ అండర్– 21 పురుషులు, మహిళల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్.వేణుకిషన్రావు, గిన్నె లక్ష్మణ్ తెలిపారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 16 నుంచి 19 వరకు వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయి యూత్ వాలీబాల్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో మధ్యాహ్నం 2 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలన్నారు. క్రీడాకారులు 1 జనవరి 2005 తర్వాత పుట్టినవారు అర్హులని తెలిపారు. గోదావరిలో మృతదేహం రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ గ్రామశివారు గోదావరినదిలో సోమవారం పురుషుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 35ఏళ్లు ఉంటుందని భావిస్తున్నామని, జీన్స్ప్యాంట్, క్రీమ్ కలర్ షర్ట్, లెడ్కలర్ డ్రాయర్, ఎడమ చేతికి ఆకుపచ్చ బట్ట కట్టుకొని ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. బంధువులు గుర్తిస్తే అంతర్గాం ఎస్సై వెంకటస్వామి, సెల్నంబరు 99494 93435లో సంప్రదించాలని సూచించారు. 166 మంది బాలలకు విముక్తి గోదావరిఖని: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈక్రమంలోనే గత జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్–11 విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా 166 మంది బాలలకు విముక్తి కల్పించామని, 20 కేసులు నమోదు చేశామని వివరించారు. తప్పిపోయిన, వదిలేసిన, కిరాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, కంపెనీల్లో పనిచేస్తున్న, రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సె లింగ్ ఇచ్చి అప్పగించామని, కొందరిని చిల్డ్రన్ హో మ్లకు తరలించామని వివరించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. పెద్దపల్లి జిల్లా 30 మంది బాలురు, 18 మంది బాలికలను గుర్తించి 5 కేసులు నమోదు చేసి ఐదుగురి అరెస్ట్ చేశామన్నారు. మంచిర్యాల జిల్లాలో 93 బారులు, 25మంది బాలికలను గుర్తించి 15 కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. బాలలను పనిలో పెట్టుకున్నా, బాల కార్మికులుగా పనిచేస్తు న్నా, తప్పిపోయినా.. సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098, లేదా డయల్ 100 నంబరుకు సమాచారం అందించాలని సీపీ కోరారు. -
పోలింగ్కు ఏర్పాట్లు చేయండి
కరీంనగర్ కార్పొరేషన్: పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 11న జరిగే పోలింగ్ ప్రక్రియకు కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ బూత్ల వారీగా విద్యుత్ సౌకర్యం, లైటింగ్, ఫర్నిచర్, ర్యాకులు, పార్టీషన్స్, వీల్ చైర్స్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. రూట్ ప్రకారం కావల్సిన బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యం, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. జోనల్ అధికారుల నియామకం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జోనల్ అధికా రులను నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ పమేలా సత్పతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చొప్పదండి మున్సిపాల్టీకి నలుగురు, హు జురాబాద్ ఐదుగురు, జమ్మికుంట నలుగురు, కరీంనగర్ నగరపాలకసంస్థకు 33 మందిని నియమించారు. నగరపాలకసంస్థకు ముగ్గురు, మున్సిపాల్టీలకు ఒక్కొక్కరి చొప్పున రిజర్వ్డ్లో ఉంచారు. -
ఊపందుకున్న మహాజాతర పనులు
వేములవాడ: మహాశివరాత్రి జాతర మహోత్సవా లకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 14 నుంచి ప్రారంభంకానున్న జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నా రు. గుడిచెరువు ఖాళీ స్థలంలో టెంట్లు వేస్తున్నారు. వీవీఐపీ గేటు సిద్ధం మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చే వీవీఐపీలు భీమేశ్వర సదన్లోకి వెళ్లేందుకు శివసాయినగర్లోని వీఐపీ రోడ్డు నుంచి ఓ గేటును ఏర్పాటు చేశారు. నేరుగా ఆలయ అతిథి గృహంలోకి తీసుకెళ్లేందుకు వీలుంటుంది. పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చే టీటీడీ అధికారులు, ప్రభుత్వం తరఫున వచ్చే అధికారులను ఈ గేట్ ద్వారా ఆలయంలోకి తీసుకెళ్లనున్నారు. -
కాంగ్రెస్లో కొట్లాట!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు నిరాకరణతో నెలకొన్న అసంతృప్తి బహిరంగంగా బయటపడింది. డీసీసీ అధ్యక్షుడి ఇంటి వద్దే జరిగిన తోపులాట ఘటన కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత కలహాలకు నిదర్శనంగా మారింది. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ (మార్షల్) తన భార్య శ్రీలతతో కలిసి టికెట్ కేటాయింపు విషయమై నగరంలోని సీతారాంపూర్లోని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లారు. డీసీసీ అధ్యక్షుడితో చర్చలు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు కారణమైంది. టికెట్ తనకు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇది అన్యాయమంటూ మార్షల్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పి మార్షల్.. వెలిచాల రాజేందర్రావు మధ్య తోపులాటకు దారితీసింది. డీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం పార్టీ శ్రేణులను ఇబ్బందికి గురిచేసింది. అక్కడున్న కాంగ్రెస్ నేతలు వెంటనే జోక్యం చేసుకుని ఇరువురిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ ఘటన కరీంనగర్ కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపుపై ఉన్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ఎన్నికల వేళ ఈ తరహా పరిణామాలు పార్టీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాల్సిన అంశంగా మారింది. ‘దమ్ముంటే నా రాజీనామా ఆమోదింపచెయ్’ తనకు టికెట్ రాకుండా చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావుకు దమ్ముంటే తన రాజీనామాను ఆమోదింపచేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, పార్టీని నమ్ముకొని ఉన్న తనకు కాకుండా, బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి రవీందర్ను కాంగ్రెస్లో చేర్చుకొని టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీని కరీంనగర్లో అధికారంలోకి రానీయకుండానే వెలిచాల కుట్ర పన్నారని ఆరోపించారు. తన యూత్కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని, వెలిచాలకు దమ్ముంటే రాజీనామాను ఆమోదింపచేయాలన్నారు. -
ఇసుక తరలిస్తే రూ.50వేలు జరిమానా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే రూ.50వేలు జరిమానా విధించనున్నట్లు గ్రామసభలో సోమవారం తీర్మానించారు. గ్రామ సర్పంచ్ మాదాసు స్రవంతి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామసభలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామం నుంచి అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తే సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేలు నజరానా అందించనున్నట్లు సర్పంచ్ స్రవంతి ప్రకటించారు. గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహించరాదని నిర్ణయించారు. ఎవరైనా అక్రమంగా బెల్ట్షాపులు పెట్టి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తీర్మానంలో పేర్కొన్నారు. ఉపసర్పంచ్ మందాటి బాబు, గ్రామ కార్యదర్శి పవిత్ర, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో బెల్ట్షాపులు నిషేధం ఆదర్శంగా అక్కపల్లి గ్రామం -
ఉమ్మడి జిల్లాకు గుండుసున్నా
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయించింది గుండుసున్న. బీజేపీ ప్రజా ప్రతినిధులు, కేంద్రమంత్రులు బడ్జెట్పై జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు, రైల్వేలైన్లు, విద్యాలయాల ఊసే లేకపోవడం బాధాకరం. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చే యడంలో వైఫల్యం చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి. మొత్తంగా కేంద్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉంది. – జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శుభపరిణామం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. విదేశీ చదువులకు వెళ్లిన విద్యార్థులకు పంపే మొత్తంపై టీసీఎస్ను ఐదు శాతం నుంచి రెండుశాతానికి తగ్గించడం శుభపరిణామం. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు జూలై 31గానే కొనసాగిస్తూ ఆడిట్ అవసరం లేని వ్యాపారుల ఐటీఆర్ గడువును ఆగస్టు 31వరకు పెంచడం, సవరించిన గడువును మార్చి 31 వరకు పొడగించడం ఊరటనిచ్చే అంశం. – కె.వెంకటేశ్వర్లు, ట్యాక్స్ ప్రాక్టీషనర్ -
అమ్మో ఆ వార్డు..!
● ‘మీ కుల సంఘానికి ఫంక్షన్ హాల్ ఉంది.. దాన్ని ఏసీ ఫంక్షన్ హాల్గా మార్చడానికి అవసరమైన డబ్బులు నేనే ఖర్చు పెడతా.. మీ ఓట్లన్నీ గుల్లగుత్తగా నాకే వేయాలి’. ● ‘నా వార్డులో మీదే పెద్ద కుల సంఘం.. మీ సంఘానికి స్థలం కొనివ్వడంతోపాటు మరో రూ.10 లక్షలు ఇచ్చి భవన నిర్మాణానికి సహాకరిస్తా..మీ ఓట్టు పొల్లుపోకుండా వేయండి.’ ● ‘నా వార్డులో ఉన్న ఓటర్లు ఎవరు ఎదుటి వారి వైపు చూడాల్సిన అవసరమే ఉండొద్దు. ఏం కావాలన్నా.. ఎంత ఖరీదైనా నన్నే అడగండి. నేను సమకూరుస్తా..’ కోరుట్ల: ఇదీ.. కోరుట్ల మున్సిపాలిటీలోని ఓ వార్డు తీరు. ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అంతే కాదు.. ఇతర వార్డుల్లో పోటీ చేస్తున్న వారికి తలనొప్పిగా మారింది. సదరు వార్డులో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి చైర్పర్సన్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. గతంలోనూ చైర్పర్సన్ హోదాలో కొనసాగారు. ఈసారి తాను పోటీ చేస్తున్న వార్డులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో నెల రోజుల ముందు నుంచే ఓటర్లకు తాయిలాలు పంపిణీ మొదలు పెట్టారు. ఇప్పటికే ఆ వార్డులోని ఓటర్లకు రెండు, మూడుసార్లు మందు, మాంసం విందులు జోరుగా సాగాయి. ఇప్పటికీ అదే తీరు. వార్డులోని ఓటర్లు ఏం అడిగినా సరే కాదనకుండా సదరు అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వార్డులో జరిగిన ఖర్చు జిల్లాలో ఎక్కడా జరగదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్డులో ఇతర పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు సదరు అభ్యర్థితో పోటీ పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసేసరికి ఆ వార్డులో అనధికారికంగా ఎంత తక్కువ అనుకున్నా రూ. కోటి వరకు ఖర్చవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఓటర్లు మాత్రం అదృష్టవంతులని ఇతర వార్డుల్లోని ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు. అడిగిన వారికి లేదనకుండా.. ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చు -
మూడు కర్తవ్యాలే లక్ష్యంగా బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, ప్రజలందరి ఆకాంక్షల్ని నెరవేర్చడం లాంటి మూడు కర్తవ్యాలే లక్ష్యంగా చారిత్రకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ మార్కెట్తో పోటీ పడేలా, మన దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగించేలా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆదాయ పన్ను, వ్యక్తిగత ఆర్థిక అంశాలు, వేతన జీవులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు చేయడం శుభపరిణామం. ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, నిరుద్యోగతను తగ్గించేందుకు ప్రభుత్వం ఐదు ప్రధాన పథకాలను బడ్జెట్లో ప్రకటించడం హర్షణీయం. – గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
ఇసుక లారీలతో నరకయాతన
రెడ్డిపల్లి వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు రెడ్డిపల్లి–హిమ్మత్నగర్ మధ్య రోడ్డుపై ఆగిన లారీలు వీణవంక: ఇసుక లారీలతో నరకయాతన పడుతున్నాం.. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల లారీలు అతివేగంగా వెళ్తుంటే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాం.. దుమ్ముతో రోగాల బారిన పడి ఆసుపత్రులపాలవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని ఆరోపిస్తూ రెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వీణవంక–కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని మానేరు వాగులో ఉన్న ఇసుక క్వారీల వద్ద వందల లారీలు రోడ్డుకిరువైపులా నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము విపరీతంగా లేచి శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులపాలవుతున్నామని వాపోయారు. ఇటీవల సీపీ, కలెక్టర్ పర్యటించి రోడ్డుకిరువైపులా వాహనాలను నిలపొద్దని హెచ్చరించినా.. ఇసుక క్వారీ నిర్వాహకుల తీరు మారడం లేదని మండిపడ్డారు. ఇసుక క్వారీల్లో లారీలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించినా.. క్వారీ యజమానులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక క్వారీలను నిలిపేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు. లారీ పట్టివేత జమ్మికుంట: అక్రమంగా మానేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఓ లారీని పట్టుకొని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వావిలాల గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారపురం మండలం వావిలాలపల్లి గ్రామానికి చెందిన వెంటేపాక స్వామి అనే లారీ డ్రైవర్, నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామానికి చెందిన దీప శ్రీకాంత్రెడ్డి జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన కూరపాటి సదానందం, జక్కే సదానందం, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన సిరికొండ సతీశ్ అనే జేసీబీ డ్రైవర్ సహాయంతో ట్రాక్టర్లు, లారీలో ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకండా రవాణా చేస్తుండగా.. పోలీసులు పట్టుకొని లారీ సీజ్ చేశారు. రెడ్డిపల్లిలో గ్రామస్తుల ఆందోళన -
ఆరు.. తకరారు
కరీంనగర్కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరిదశకు చేరుకుంది. 60 ఫైనల్ కాగా ఆరు డివిజన్ల పీటముడి వీడ లేదు. ఆరు డివిజన్లకు సంబంధించి అధిష్టానం నిర్ణయానికి వదిలేశారు. 60 సింగిల్ నేమ్ కరీంనగర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, వుట్కూరి నరేందర్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్నికల ఇన్చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో సమావేశమై 45 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ రెండోసారి భేటీ అయింది. 21లో 15 డివిజన్లకు ఒకే పేరును ప్రతిపాదించారు. 60 డివిజన్ల అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించారు. కుదరని ఏకాభిప్రాయం విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని 7, 20,24,33,48,50వ డివిజన్లకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ నేతల్లో సఖ్యత కొరవడింది. దీంతో రెండు, మూడేసి పేర్లను పంపించి, ఎంపికను అధిష్టానానికి వదిలేశారు. 53వ డివిజన్కు సంబంధించి సభ్యుల నడుమ తీవ్రస్థాయిలో విభేదా లు పొడసూపినట్లు సమాచారం. ఆ డివిజన్ విషయంలో ఓ నేత తన పంతం నెగ్గించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. -
ఆలయాల్లో చోరీ
ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవా లయం, రహీంఖాన్పేటలోని ఎల్లమ్మ దేవాలయంలో శనివారం రాత్రి దొంగలు పడి బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్లారని కుల పెద్దలు తెలిపారు. పెద్దమ్మ గుడిలో పుస్తెలు, మెట్టెలు, రహీంఖాన్పేట ఎల్లమ్మ గుడిలో పుస్తె మెట్టెలు ఎత్తుకెళ్లినట్లు వాపోయారు. హుండీలు భద్రంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్సై సిరిసిల్ల అశోక్ వివరాలు సేకరించారు. ఫింగర్ ప్రింట్ టీం వేలిముద్రలు సేకరించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో..రామగిరి: కల్వచర్ల గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి యత్నించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కల్వచర్ల గ్రామానికి చెందిన కంజార్ల సాగరాచార్యులు జనవరి 28న ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లాడు. ఫిబ్రవరి 1న వేకువజామున 2 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అత్త సౌమిత్రి లావణ్యకు ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే వచ్చి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా పంపించింది. ఎలాంటి వస్తువులు చోరీకి గురి కాలేదని తెలిపారు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాడవేని శ్రీనివాస్ తెలిపారు. -
నిరంతర తనిఖీలు
వైద్యారోగ్య శాఖ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసి స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తున్నాం. తనిఖీల్లో రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, కేస్ రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లు, ఫామ్(ఎఫ్) పత్రాలు పరిశీలిస్తున్నాం. గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా కృషి చేస్తున్నాం. డిసెంబర్లో నిబంధనలు పాటించని 5 స్కానింగ్ కేంద్రాలకు నోటీసులు జారీ చేశాం. లింగ నిర్ధారణకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు చేపడతాం. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి 2025లో ఎంసీహెచ్లో జననాలిలా.. నెల బాలురు బాలికలు మొత్తం జనవరి 182 209 391 ఫిబ్రవరి 162 135 297 మార్చి 192 171 363 ఏప్రిల్ 197 171 368 మే 203 179 382 జూన్ 213 147 360 జూలై 217 183 400 ఆగస్టు 234 197 431 సెప్టెంబర్ 240 229 469 అక్టోబర్ 245 237 482 నవంబర్ 218 213 431 డిసెంబర్ 232 224 456 -
కుక్కల దాడిలో జీవాలు మృతి
వేములవాడరూరల్: ఉన్న ఊర్లో మేపలేక పొరుగు గ్రామాలకు వచ్చిన పశువుల కాపరులకు కష్టాలు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో 3 రోజులుగా ముక్కిన బియ్యం తిని గొర్రెలు మృతిచెందిన సంఘటనలున్నాయి. అదే ప్రాంతంలో మరో గొర్రెల కాపరుల మందపై కుక్కలు దాడి చేసి దాదాపు 30 గొర్రెలు, మేకలను చంపిన సంఘటన ఆదివారం జరిగింది. వారి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామానికి చెందిన భూపతి కొండమల్లయ్య, భూపతి దేవయ్య, భూపతి నడిపి అంజయ్య, రేపాక దేవరాజు, రేపాక గంగారెడ్డి, ఇరువేని గంగాధర్, ఇరువేని కొమురెల్లి అనే పశువుల కాపరులు 20 రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం చిన్న పిల్లలను ఒక పంట చేన్లో జాలీలో పెట్టి పక్కనే పశువులను కాస్తుండగా.. అకస్మాత్తుగా అక్కడికొచ్చిన కుక్కలు జాలీలో ఉన్న గొర్రెలు, మేకలపై దాడి చేశాయి. దాదాపు 30 వరకు పశువులు అక్కడికక్కడే మృతిచెందాయి. వెంటనే వచ్చి వాటిని తరమగా.. కొన్ని పశువులు ప్రాణాలతో బయటపడ్డాయి. ఇదే ప్రాంతంలో కథలాపూర్ మండలానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు పశువులను తోల్కొని రాగా.. రైస్మిల్ పక్కనున్న ముక్కిన బియ్యం తిని దాదాపు 80 పశువుల వరకు మృతిచెందాయి. మేత కోసం తీసుకొస్తే మృత్యువాత పడడంతో పశువుల కాపరులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నిన్న ముక్కిన బియ్యంతో.. నేడు శునకాల దాడిలో.. నష్టాల్లో పశువుల కాపరులు ఆదుకోవాలని వేడుకోలు -
మానేరు వాగులో పడి వ్యక్తి మృతి
సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి: సిరిసిల్ల మానేరు వాగులో ఆదివారం ఓ వ్యక్తి పడి మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన గండికోట మహేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. మానేరు తీరంలోని వినాయక నిమజ్జనం ప్రదేశానికి, వినాయక విగ్రహాల ఇనుప రాడ్లను సేకరించేందుకు అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో కలిసి ఆదివారం వెళ్లాడు. ఇనుము సేకరిస్తున్న క్రమంలో మహేశ్కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో.. కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి నీటిలో మునిగి మృతిచెందాడు. రవికి మహేశ్ కనిపించకపోవడంతో గాలించగా.. మృతదేహం నీటిలో కనిపించడంతో స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. మృతుడికి భార్య సుజాత, సంతానం శివ, శివాని ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూర్: శంశాబాద్ గ్రామానికి చెందిన గడ్డి రవి(43) అనే రైతు ఆదివారం ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ ఉప కాలువలో పడి మృతిచెందాడు. రవి తన వ్యవసాయ పొలం వద్దకు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ ఉప కాలువలో పడిపోయింది. వాహనంపై ఉన్న రవి కూడా కాలువలో పడగా.. ముక్కుకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూలీలు మృతికరీంనగర్ క్రైం: టవర్ సర్కిల్లో లేబర్ అడ్డా వద్ద ఇద్దరు కూలీలు అనారోగ్యంతో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. కాశ్మీర్ గడ్డకు చెందిన మహంకాళి కృష్ణ(50), హుస్సేన్పురకు చెందిన మహమ్మద్ అజీమ్(40) ప్రతిరోజు కూలి పనికి టవర్ సర్కిల్లో ఉన్న లేబర్ అడ్డా వద్దకు వస్తారు. వేర్వేరు సమయాల్లో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇద్దరికీ రోజు మద్యం తాగే అలవాటుంది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు సూచించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీ, కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు
కరీంనగర్టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాగ్దానాలను అమలు చేయకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్శన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాయని, ఆ పార్టీలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్కు సిట్ పేరిట నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం తెలంగాణచౌక్లో చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సీరియల్ వలె రోజుకో నోటీసు పేరిట కాలం వెలదీస్తూ పాలనను మర్చిపోయారని మండిపడ్డారు. ఒకసారి జూ బ్లీహిల్స్ ఎన్నికల్లో, మరోసారి సర్పంచ్, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో.. ఇలా కేవలం ఎన్నికలప్పుడే నోటీసులు పంపడం.. తద్వారా బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉండదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖకు సంబంధించిన అధికారులు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీంలో అప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులే ఉన్నారని, మొదట వారికి నోటీసులు పంపాలని రేవంత్రెడ్డికి సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు తీస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ అనిల్కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చులెట్లా..?
రాయికల్: మున్సిపాల్టీలో నామినేషన్లు, పరిశీలన పక్రియ పూర్తి కావడంతో.. బీఫాంల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. బీఫాం ఇవ్వకపోయినా.. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేందుకు సైతం అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతోపాటు ఎన్నికల గుర్తులు సైతం అభ్యర్థులకు కేటాయించనుంది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఖర్చులకు సైతం ఎలా డబ్బులు కూడబెట్టాలో వాటి ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల ఖర్చులకు పరేషాన్ జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మున్సిపాల్టీలుండగా.. కౌన్సిలర్గా గెలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. రాయికల్, ధర్మపురి వంటి చిన్న మున్సిపాల్టీల్లో ఒక్కో అభ్యర్థికి రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వంటి మున్సిపాల్టీల్లో రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చవుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. భూమి కాగితాలు కుదవపెట్టి రూ.3 వడ్డీకి అప్పులు తీసుకురావడం, చిట్టీలు ఎత్తడం, ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టడం, భూములమ్మేందుకు వెనుకాడడం లేదు. భారం తప్పదు.. రాయికల్, ధర్మపురి లాంటి చిన్న మున్సిపాల్టీల్లో గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడంతో.. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గింది. చైర్మన్ అభ్యర్థి ఎన్నికల్లో ముందుగా ఒక్కొక్కరికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఎన్నికల డబ్బులు సమర్పించేవారు. ఇప్పుడు సీను రివర్స్ అయింది. అభ్యర్థులు గెలిచిన తరువాతే చైర్మన్ ఎన్నిక చేపడతామని పార్టీలు సైతం ప్రకటించడంతో.. పోటీ చేసే కౌన్సిలర్లపై ఆర్థికంగా మరింత భారం పడనుంది. ఏదేమైనా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వంటి పెద్ద మున్సిపల్లో చైర్మన్ ఎన్నికయ్యే లోపు అభ్యర్థులు రూ.లక్షలు, రూ.కోట్లల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ● ఆందోళనలో ఆశావహులు ● అప్పుల కోసం వెతుకులాట ● చిట్టీలు ఎత్తుతున్న వైనం -
దయచూపని నిర్మలమ్మ
ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రప్రభుత్వం ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది. సంక్షేమం, అభివృద్ధి కరీంనగర్: ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్ అని కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర వహిస్తుందన్నారు. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ నిధులు పెంచామని, ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యమని వివరించారు. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బడ్జెట్ అన్నారు. -
బల్దియా నామినేషన్లు 698
● అత్యధికంగా 6వ డివిజన్ బొమ్మకల్లో 22 ● మొదటిరోజు ఒక నామినేషన్ ఉపసంహరణ కరీంనగర్కార్పొరేషన్: పరిశీలన అనంతరం బల్దియాలో నామినేషన్ల లెక్కతేలింది. నగరంలోని 66 డివిజన్లకు మొత్తం 698 నామినేషన్లు వచ్చాయి. 698 మంది అభ్యర్థులు 1,231 సెట్స్ దాఖలు చేశారు. ఆదివారం మొదటి రోజు ఒక అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. అధికంగా బొమ్మకల్లో.. మొత్తం 1,257 నామినేషన్ల సెట్స్కు గాను ఒకే అభ్యర్థి, ఒకే పార్టీ పేరిట ఉన్న వేర్వేరు 26 సెట్స్ను తొలగించడంతో స్క్రూటినీ అనంతరం 1,231 సెట్స్ మిగిలాయి. 66 డివిజన్లలో అత్యధికంగా నగరపాలకసంస్థలో తాజాగా విలీనమై, మొదటిసారి బల్దియా ఎన్నికలు జ రుగుతున్న 6వ డివిజన్ బొమ్మకల్లో 22 నా మినేషన్లు దాఖలయ్యాయి. ఇక 32వ డివిజన్ హుస్సేనిపుర, 49వ డివిజన్ భాగ్యనగర్లో అత్యల్పంగా ఐదు నామినేషన్లు వచ్చాయి. ఒకరు ఉపసంహరణ నామినేషన్ల ఉపసంహరణలో మొదటిరోజు నగరంలోని 54వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సాలెహ్బాను తన నామినేషన్ను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరిరోజు. సీఎం సభాస్థలి పరిశీలనచొప్పదండి: మండలంలోని గుమ్లాపూర్లో ఈ నెల 5న సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే సభాస్థలాన్ని చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, ఎస్సై నరేశ్రెడ్డి ఆదివారం పరిశీలించారు. వారి వెంట సర్పంచ్ లింగాల ఆనంద్, ఉప సర్పంచ్ ఇనుకొండ రమణారెడ్డి తదితరులున్నారు. సమర్థవంతంగా పోలింగ్ నిర్వహించాలి కరీంనగర్ కార్పొరేషన్: పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అన్నారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. మాస్టర్ ట్రైనర్లు సంపత్, అమరేందర్ శిక్షణ ఇచ్చారు. ఓటర్లను ఎలా గుర్తించాలి, డాక్యుమెంట్స్ ఎలా పూరించాలి తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీవోలు, ఏపీవోలు, సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఓటర్ల జాబితా, ఇచ్చిన బ్యాలెట్లో పోటీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఓరిజినల్ గుర్తింపు కార్డుతో మాత్రమే ఓటుకు అనుమతించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వనదేవతల జాతర విజయవంతంకరీంనగర్కల్చరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల జరిగిన సమ్మక్క– సారలమ్మ జాతర వైభవంగా ముగిసినట్లు ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రియ పేర్కొన్నారు. కరీంనగర్లో 16 చోట్ల, పెద్దపల్లి జిల్లాలో 16, జగిత్యాల జిల్లాలో ఒక చోట జాతర జరుగగా, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, హెల్త్ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది కృషితో విజయవంతమయ్యాయని తెలిపారు. కాగా, దేవాదాయశాఖ వారు జాతర హుండీలను సమీప పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. సోమవారం నుంచి హుండీలు, కానుకల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్లోని రేకుర్తి సమ్మక్క– సారలమ్మ జాతర హుండీలను సోమవారం దేవాదాయ శాఖ కార్యాలయంలో లెక్కించనున్నట్లు ఈవో మారుతి తెలిపారు. -
ఉరేసుకొని వలస కూలీ ఆత్మహత్య
మేడిపల్లి: భీమారంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక వలస కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్త్సె శ్రీధర్రెడ్డి వివరాల ప్రకారం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం బందెమర్కు చెందిన కుర్సింగా శేకు కొంతకాలంగా భీమారం మండల కేంద్రంలోని గంగారాం పౌల్ట్రీఫాంలో కూలీగా పనులు చేస్తున్నాడు. నెలవారీగా వచ్చే జీతం సరిపోక.. ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసయ్యాడు. పౌల్ట్రీఫాంలోని ఓ గదిలో ఆదివారం ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి సోము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్యతో దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. పెళ్లికి నిరాకరించారని..కోరుట్ల రూరల్: పట్టణంలోని నక్కల గుట్ట ప్రాంతానికి చెందిన గోగుల నరేశ్(23) అనే యువకుడు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చిరంజీవి వివరాల ప్రకారం.. నరేశ్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా.. ఇద్దరు అన్నలకు పెళ్లి కాకుండా నువ్వేలా చేసుకుంటావని నిరాకరించారు. మనస్తాపానికి గురైన నరేశ్ నక్కల గుట్ట శివారులోని ఓ మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. నరేశ్ అన్న సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గొర్రెల మృతికి రూ.3లక్షల పరిహారంవేములవాడరూరల్: వేములవాడ మండలం మ ర్రిపల్లి శివారులో ఓ రైస్మిల్ నిర్వాహకుడు ము క్కిన బియ్యం బయటపడేయడంతో ఇటీవల మూగజీవాలు బుక్కి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై గొర్రెల కాపరులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా కొంతమంది పెద్దమనుషులతో సంప్రదింపులు జరిపిన మిల్లు య జమాని ఎట్టకేలకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిసింది. వాగు నుంచి ఇసుక తరలింపు వేములవాడరూరల్: లింగంపల్లి మూలవాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ ఆదివారం రోజు అనుమతులు లేకుండా ఇసుకను తరలించినట్లు తెలిసింది. వాగులోనే కొంతమంది కూలీలతో ఇసుకను నింపి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నేడు జాతర సమీక్ష సమావేశం వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగే మహాశివరాత్రి జాతర మహోత్సవాల సమీక్ష సమావేశం కలెక్టర్ గకీమా అగ్రవాల్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి ప్రకటనలో తెలిపారు. జాతర సమన్వయ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పనుల పురోగతిపై వివిధ శాఖల అధి కారులతో సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
కరీంనగర్టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి జంబ్లింగ్ విధానం అమలు చేయడం లేదు. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఈనెల 2 నుంచి 6, రెండో విడతలో ఈనెల 7 నుంచి 11 వరకు పరీక్షలు జరుగుతాయి. 50 కేంద్రాల్లో జనరల్ (బైపీసీ, ఎంపీసీ) విద్యార్థులకు పరీక్షలు జరగనుండగా, 10 కేంద్రాలను ఒకేషనల్ విద్యార్థులకు ఏర్పాటు చేశారు. చదివిన కళాశాలలోనే.. ఈసారి జనరల్ విద్యార్థులకు సొంత కళాశాలలోనే పరీక్షలు జరగనుండగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా ఎగ్జామినర్ ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి ప్రశ్నపత్రాలు డౌన్లోడ్ చేయనున్నారు. ఏ విద్యార్థి యే ప్రయోగం చేయాలనేది ఇంటర్ బోర్డు విద్యార్థి హాల్ టికెట్నంబర్ ఆధారంగా కేటాయిస్తుంది. పరీక్షల పర్యవేక్షణకు ఒక్కో కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ ఆఫీస్కు అనుసంధానం చేశారు. తనిఖీ బృందాల నియామకం జిల్లా స్థాయిలో పరీక్షల నిర్వహణకు ఏర్పాటయ్యే హైపవర్ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, సభ్యులుగా సీపీ, మెంబర్ కన్వీనర్గా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి వ్యవహరించనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు డెక్ బృందంలో జిల్లా నోడల్ అధికా రి, ఇద్దరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలల ప్రిన్సి పాల్స్, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. కన్వీనర్గా డీఐఈవో గంగాధర్, సభ్యులుగా వి.ఆంజనేయరావు, వి.సత్యవర్దన్రావు, ఎ.సత్యనారాయణ, అస్మాజాబిన్తో కమిటీ ఏర్పాటు చేశారు. మార్కుల్లో ప్రైవేట్ ముద్ర చదివిన కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ప్రైవేట్ కాలేజీలు తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులకు మార్కులు కేటాయించే విషయంలో ఎగ్జామినర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. వారిని ప్రైవేట్ యాజమాన్యాలు ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకున్న ఉదంతాలు గతంలో చోటుచేసుకున్నాయి. కాగా, ప్రస్తుతం విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎగ్జామినర్లు మార్కులు వేసేలా అధికారులు నిఘా పెంచనున్నట్లు తెలిసింది. హాజరయ్యే జనరల్ విద్యార్థులు 14,522ఒకేషనల్ విద్యార్థులు 2,735పరీక్ష కేంద్రాల సంఖ్య 60ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11ఇతర ప్రభుత్వ విభాగంలో 4ప్రైవేట్ పరిధిలో 45 -
మల్కాపూర్లో నంది విగ్రహం లభ్యం
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనుల తవ్వకాల్లో శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాలు. ఉపాధిహామీ పనులు చేసే పలువురు కార్మికులు మల్కాపూర్లోని గోగులగుట్ట పరిధిలో ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో నంది, లింగం రూపంలో ఉన్న విగ్రహాలు వెలుగుచూశాయి. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పూజలు చేశారు. విగ్రహాలు బయటపడ్డ ప్రాంతంలో ఆలయం నిర్మించాలని అనుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఉపాధిహామీ పనుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం -
కౌంటర్
పెన్కొత్త ఆట మొదలైంది కోరుకోగుర్రాన్ని ఓటు హక్కు కళ్లాన్ని ఒడుపుగా పట్టుకుని ఏమరుపాటుగా ఉంటే ఏత్తేస్తది ఆ గుర్రం జాతి గుర్ర రాజాన్ని జాగ్రత్తగా ఎంచుకో ఐదేళ్లకు ఒకసారి ఆటలాడు గుర్రమొద్దు గడ్డి తినే గుర్రమే నక్కవినయాలు చూపిస్తది బోల్తా కొట్టిస్తది..బొందవెట్టిస్తది తాత్కాలిక సుఖాలకు తలుపులనే తీస్తది డబ్బులిచ్చి మురిపిస్తది మాటలతో మరిపిస్తది లొంగితే నీ బతుకు ఐదేళ్లు వంగుడే అభివృద్ధే కావాలంటే అసలు సిసలు గుర్రాన్ని ఆలోచించి ఎంచుకో. -
మరో 12 మూగజీవాలు మృత్యువాత
వేములవాడరూరల్: ముక్కినబియ్యం తిన్న గొర్రెలు మూడు రోజుల్లో 80 మృత్యువాత పడ్డాయి. రైస్మిల్ యజమాని నిర్లక్ష్యానికి మంగళవారం మరో 12 గొర్రెలు చనిపోయాయి. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మిల్లు యజమానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వరుసగా గొర్రెలు చనిపోతుండడంతో మిల్లు యజమాని గొర్రెల కాపరులతో సయోధ్య కుదుర్చుకునేందుకు పెద్దమనుషులతో చర్చలకు వచ్చినట్లు తెలిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి శివారులో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్, తాండ్య్రాల గ్రామాలకు చెందిన గొర్రెలకాపరులు ఇటీవల మేత కోసం తీసుకొచ్చారు. మర్రిపల్లి శివారులోని మహాలక్ష్మి రైస్మిల్లు వద్ద ముక్కినబియ్యాన్ని యజమాని బయట పడేశాడు. వీటిని తిన్న గొర్రెలు గత మూడు రోజులుగా చనిపోతున్నాయి. ఈ విషయంపై పోలీసులు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. ముక్కినబియ్యం తిని గొర్రెలు చనిపోయిన సంఘటనపై మహాలక్ష్మి రైస్మిల్లు యజమానులకు మర్రిపల్లి పంచాయతీ కార్యదర్శి నోటీస్లు జారీ చేశారు. మూడు రోజుల్లో 80 గొర్రెలు మృతి -
కమనీయం.. తిరుకల్యాణం
జమ్మికుంట: జమ్మికుంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టాదశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీపద్మావతి, గోదా సమేత శ్రీవెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. వేద పండితులు హరికృష్ణమాచార్యలు, వేణుగోపాలచార్యులు వేద మంత్రోచ్చరణల మధ్య వేడుక కనుల విందుగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ముక్కా జితేందర్గుప్తా, పుల్లూరి ప్రభాకర్రావు, శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, ఎదులాపురం వెంకటేశ్వర్లు, రావికంటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
అటు పరీక్షలు.. ఇటు ఎన్నికలు
కరీంనగర్టౌన్: బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి సెలవులు. గత నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు. తాజాగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు తల పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఈ విద్యా సంవత్సరంలో చదువు సంగతి దేవుడెరుగు.. ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఇప్పు డు మున్సిపల్ ఎన్నికలు, వెనువెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం ఇంటర్, ఎస్సెస్సీ, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 11న బల్దియా పోలింగ్ ఉన్నందున అటు ఎస్సెస్సీ, ఇటు ఇంటర్ పరీక్షల నిర్వహణ కత్తి మీద సాములా మారింది. జనవరి 21నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షికపరీక్షలు ఉన్నాయి. పరీక్షల సమయంలోనే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉంటుంది. ఇటు పరీక్షలు.. అటు ఎన్నికలు విద్యాశాఖ అధికారుల్లో కలవరం రేపుతోంది. ఎన్నికల విధుల నుంచి తప్పించండి ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది, లెక్చరర్లకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్షల సమయంలో సమన్వయం, పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణ వంటి విధుల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నిమగ్నమై ఉంటారని, వీరిని ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తేనే పాఠశాల విద్యా సజావుగా సాగుతుందని సూచిస్తున్నారు. -
రేపు ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల క్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని, కోడ్ ముగిసేంతవరకు కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. కోడ్ ముగిసిన తర్వాత ప్రజా వాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ విచారణ సరికాదుమానకొండూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ పేరిట పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, కేసీఆర్ను బద్నాం చేయడానికే కొత్త నాటకానికి తెరతీశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. మానకొండూర్లో శనివారం మాట్లాడుతూ.. మార్పుకోసం ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. అందుకు మానకొండూర్ నియోజకవర్గమే సాక్ష్యమన్నారు. కేబుల్బ్రిడ్జి ఆధ్వానంగా మారిందని, దీనికి కారణం కాంగ్రెస్ అన్నారు. నేషనల్ హైవేను అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదిస్తే, తాను మంజూరు చేయించానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ పేరిట పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై ఆదివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2029 ఎన్నికల వరకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, తాళ్లపల్లి శేఖర్గౌడ్, సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతూ, బాల కార్మికులు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోలీసు, లేబర్, చైల్డ్ హెల్ఫ్లైన్ 1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ శనివారంతో ముగిసింది. నెలరోజుల పాటు విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరిగిందని, జిల్లాలో మొత్తం 117 మంది పిల్లలను రెస్క్యూ చేసినట్లు తెలిపారు. 109 బాలురు, 8బాలికలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, విజయ్ కుమార్, రాధ ఉన్నారు.


