Karimnagar District Latest News
-
భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..?
కరీంనగర్ టౌన్: పోక్సోకేసు నమోదైన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ డం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్లో మాట్లాడుతూ భగీరథ్ పరారీలో ఉన్నడని చెబుతుంటే, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, ఐబీ, స్పెషల్ బ్రాంచ్లు ఏం చేస్తున్నాయని నిలదీశారు. సాధారణ వ్యక్తిపై ఇలాంటి కేసు నమోదైతే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కావడంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 19 ప్రకా రం సమాచారం దాచిపెట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ కేసులో బండి సంజయ్, ఆయన పీఆర్వోపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికకు రూ.50 వేలు ఇచ్చి నట్లు నగరంలోని టూ టౌన్లో ఫిర్యాదు చేయ డం ద్వారా అసలు కేసును మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బండి సంజయ్ మాటపై నిలబడాలంటే, ముందుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.ఉచిత పీజీ ఎంట్రెన్స్ కోచింగ్కరీంనగర్ సిటీ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఎస్సారార్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉచిత ఎంకాం పీజీ ఎంట్రెన్స్ కోచింగ్ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 40రోజుల పాటు కొనసాగనుంది. ఆన్లైన్ విధానంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, కామర్స్ నిపుణులు విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు అవసరమైన పరిజ్ఞానం, మోడల్ పరీక్షలు, ప్రశ్నాపత్ర విశ్లేషణ, సమయ నిర్వహణ, పరీక్ష వ్యూహాలపై సమగ్ర శిక్షణ అందిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. కన్వీనర్ బూర్ల నరేశ్, వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్ , కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, కో–కన్వీనర్ అర్జున్ పాల్గొన్నారు. 16న జాబ్మేళాసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16వ తేదీ కరీంనగర్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ నివాబూపాలో 25 ఖాళీల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, 25ఏళ్లు పైబడి ఉండాలని తెలిపారు. వేతనం నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఈ సేవ కేంద్రం పైఅంతస్తుకు రావాలని, బయోడేటాతో పాటు విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 99082 30384, 99633 57250 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనుమతి లేని అకాడమీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దుసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఐ ఈవో ఆంజనేయరావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కొన్ని అకాడమీ లు, కోచింగ్ సెంటర్లు తమకు ఇంటర్ బోర్డు అనుమతి ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ, విద్యార్థులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆకాశ్, బన్సల్క్లాసెస్ వంటి సంస్థలు అకాడమీలు మాత్రమేనని, గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డు కళాశాలలు కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఐఐటీ, నీట్, ఏప్సెట్ అకాడమీలూ ఇంటర్ బోర్డు కిందికి రావన్నారు. అడ్మిషన్ తీసుకునే ముందు కళాశాల పేరు, అనుమతి పొందిన చిరునామా, గ్రూపులు, అర్హత గల అధ్యాపకులు, ల్యాబ్ సౌకర్యాలను స్వయంగా తనిఖీ చేయాలని, ప్రతి కళాశాల ఎదుట వివరాలతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అనుమతి లేని సంస్థల్లో చేరి విద్యార్థులు తమ భవి ష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. -
రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ
భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు అంజన్న ఆలయంజయంతి సందర్భంగా విశేష అలంకరణలో కొండ గట్టు అంజన్న స్వామినగరంలోని టవర్లో ఏక్తాయాత్రహిందూ ఏక్తాయాత్రతో కాషాయమయమైన కరీంనగర్ సిటీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి సందర్భంగా ఆలయం కిక్కిరిసిపోయింది. మంగళవారం వేకువజామున మూడు గంటలకు స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. విశేష అభిషేకం, అర్చనలు చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. హోమం, మహాపూర్ణాహుతి, ఊయల సేవ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల జై హనుమాన్.. జై శ్రీరాం నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. ఇరుముడులతో పాదయాత్ర వేలాదిమంది స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఉత్సవాలను కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో అంజనారెడ్డి వారి వెంట ఉన్నారు. లక్షలాది మంది భక్తుల రాకతో స్వామివారి కోనేరు కాషాయమయమైంది. మాల విరమణ చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.కరీంనగర్: కరీంనగర్ నగరం కాషాయమయమైంది. ‘రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి’ నినాదాలతో మార్మోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నేతృత్వంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర వైశ్య భవన్ నుంచి ప్రారంభమై టవర్, కమాన్, వన్టౌన్, అమరవీరుల స్తూపం మీదుగా తిరిగి వైశ్య భవన్ వరకు వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా హనుమాన్ భక్తులు, ప్రజలు తరలివచ్చారు. యాత్రలో శ్రీరాముడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతీస్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి యాత్రలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. యాత్రకు 400 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
ఆ సెల్ఫోనే పట్టించింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎంత పెద్ద క్రిమినల్ అయినా.. ఏదో ఒక క్లూ వదిలేస్తాడు.. అదే దొంగలను చిక్కేలా చేస్తుంది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో ఇదే తరహాలో దొరికిపోయారు. ఈనెల 3వ తేదీన పీఎంజేలో దోపిడీ చేసి, నలుగురు సిబ్బందిని తుపాకులతో కాల్చిన అనంతరం ధర్మపురి మీదుగా పారిపోయిన దొంగలు తాము వినియోగించిన ఒక సెల్ఫోన్ను మద్దునూరు వద్ద పగలగొట్టి వెళ్లిపోయారు. స్థానికులు ఆ సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. ఆ సెల్ఫోన్లో లభించిన డేటా ద్వారా దొంగల సమాచారం లభించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి బిహార్లో ఒకరిని, బెంగాల్లో మరొకరిని పట్టుకున్నారు. నిందితులంతా స్మార్ట్ఫోన్ల నుంచి ఎన్క్రిప్టెడ్యాప్స్ ద్వారా సంభాషించుకోవడం గమనార్హం. పోలీసులు డేటా రీట్రైవ్ చేయడం ద్వారా కీలక సమాచారం లభించింది. సినీ తరహాలో దోపిడీ ఈ మొత్తం చోరీకి బిహార్ జైలు వేదికగా ప్రణాళిక జరిగింది. దేశంలోని పలు బంగారం సంస్థలే టార్గెట్గా చోరీలు చేసే సుబోధ్ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 70 మందికిపైగా ప్రైవేటు సైన్యంతో ఆరు రాష్ట్రాల్లో ఇతని నెట్వర్క్ విస్తరించి ఉంది. సినీ తరహాలో దో పిడీలు చేయడం వీరి ప్రత్యేకత. కరీంనగర్ దోపిడీ కోసం ఆరుగురు ఒకరితో మరొకరికి పరిచయం లేనివారిని ఎంచుకున్నారు. కేవలం దోపిడీ మాత్రమే వీరి పని. ఆ తరువాత బంగారం తరలించేందుకు ఒక గ్యాంగ్, విక్రయానికి మరోగ్యాంగ్, ఆ డబ్బు తరలించేందుకు ఇంకో గ్యాంగ్ పనిచేస్తాయి. ఒకవేళ పోలీసులకు నిందితులు చిక్కినా పూర్తిస్థాయి సమాచారం దొరకక కేసు జాప్యం అవుతుంది. ఈలోపు బంగారం విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఈ దోపిడీలో పాల్గొన్న వారికి రూ.5లక్షలు ఇస్తామని ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రెస్మీట్.. ధర్మపురి వద్ద విడిపోయిన దొంగలు... వేర్వేరుగా బెంగాల్, బిహార్, రాజస్థాన్, ముంబై వైపు పారిపోయారు. ఈ నేపథ్యంలో చోరీ చేసిన సొత్తు రికవరీ చేయడం, మిగిలిన ముగ్గురు దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. అయితే, నిందితులు సొత్తు ఎక్కడ విక్రయించారు? అన్న విషయంలోనూ పోలీసులు పలు కీలక ఆధారాలు సంపాదించారు. సుబోధ్ గ్యాంగ్ ఇప్పటి వరకూ 30 కిలోల వరకు బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్ వద్ద దొంగ బంగారం కొనే వ్యాపారుల జాబితా కూడా కరీంనగర్ పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిపార్ట్మెంట్ ధీమాగా ఉంది. త్వరలోనే నిందితులందరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
సెన్సెస్ షురూ..!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలో జనగణన 2027 ప్రారంభమైంది. ఇప్పటివరకు స్వీయ గణనకు అవకాశం కల్పించిన ప్రభుత్వం, 11వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన మొదలు పెట్టడం తెలిసిందే. నగరంలో బ్లాక్లవారీగా ముందుగా కుటుంబాల సంఖ్య ఆధారంగా ఇళ్లకు నంబరింగ్ (సెన్సెస్ హౌస్ నంబరింగ్) చేస్తున్నారు. 14వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి కుటుంబాలవారీగా జనగణన చేపట్టనున్నారు. 666 బ్లాక్లు 2027 జనగణన తొలిదశను విజయవంతంగా పూర్తి చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్లాక్ల వారీగా గణనను విభజించారు. నగరపాలకసంస్థలో 66 డివిజన్లు ఉండగా, 666 బ్లాక్లుగా విభజించారు. 180 నుంచి 200 ఇళ్లకు ఒక బ్లాక్గా పరిగణిస్తారు. ప్రతి బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 666 బ్లాక్లకు 666 మంది ఎన్యుమరేటర్లను, పర్యవేక్షించేందుకు 111 మంది సూపర్వైజర్లను నియమించారు. 14 నుంచి ‘ఇంటి లెక్కలు’ జనగణన మొదటి దశ ప్రారంభం కావడంతో ఎన్యుమరేటర్లు కుటుంబాలవారీగా ఇళ్లకు నంబరింగ్ వేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనే లెక్కల ఆధారంగా ఆ ఇంటి గోడ లేదంటే తలుపులకు చాక్పీస్లు, స్టిక్కర్లతో నంబర్ వేస్తున్నారు. బుధవారం వరకు హౌస్నంబరింగ్ను పూర్తి చేయనున్నారు. 14వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వారీగా జనగణనను చేపడుతారు. ప్రభుత్వం రూపొందించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నారు. ఇప్పటికే స్వీయ గణనను నమోదు చేసుకుంటే, ఆ ఐడీ ఆధారంగా జనగణన ఎన్యుమరేటర్ పూర్తి చేయనున్నారు. ప్రజలు సహకరించాలి : ప్రఫుల్దేశాయ్ జన గణనలో భాగంగా ప్రజలు తమ వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కోరారు. నగరంలో జనగణన ప్రక్రియలో భాగంగా సెన్సెస్ హౌసెస్ నంబరింగ్ సాగుతున్న తరుణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 2027 జనాభా లెక్కలకు నగర ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని అన్నారు. సర్వే సమయంలో ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు.డివిజన్లు 66 బ్లాక్లు 666 (180 నుంచి 200 ఇండ్లకు ఒక బ్లాక్) ఎన్యుమరేటర్లు 666 సూపర్వైజర్లు 111 -
మెరుగైన విధానాలతో వ్యాపారాభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: మెరుగైన విధానాలు, నాణ్యతతో కూడిన వ్యాపారాలతో వీధి వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపరాణి అన్నారు. మంగళవారం కళాభారతిలో వీధి వ్యాపారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం ఉపాధి, పట్టణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో వీధి వ్యాపారులు, స్వయం సహాయక బృందాల పారిశ్రామికవేత్తల కృషి అభినందనీయమన్నారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, వ్యాపార నిర్వహణ, వినియోగదారుల సేవ, స్వయం ఉపాధి కార్యకలాపాల ద్వారా జీవనోపాధిని బలోపేతం చేసుకునే అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, మెప్మా ఇన్చార్జీ డీఎంసీ మల్లీశ్వరి, టీఎంసీ మానస, సీఓలు పద్మ, స్వప్న, తిరుపతి, మంజుల, దీప తదితరులు పాల్గొన్నారు. -
గడువు ముగిసింది.. గుబులు పట్టుకుంది
మండలాల వారీగా ఈకేవైసీ నమోదు వివరాలుకరీంనగర్రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలకు ఈకేవైసీ నమోదు గుబులు పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి విధించిన గడువు ఈ నెల 10తో ముగిసింది. జిల్లాలో పూర్తిస్థాయిలో కూలీల ఈకేవైసీ నమోదు పూర్తికాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో అక్రమాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలని గతేడాది ఏప్రిల్లో ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశాల్లో కూలీల నమోదు, వేతనాల చెల్లింపులకు ఈకేవైసీని ప్రామాణికంగా పరిగణిస్తామని ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియను చేపట్టారు. ముగిసిన గడువుతో ఆందోళన జిల్లాలో ఉపాధి కూలీలు 1,07,667 మంది ఉండగా 1,03,877 మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 3,790 మంది నమోదు పూర్తి చేయాల్సి ఉంది. రామడుగు, తిమ్మాపూర్ మండలాలు 98శాతం నమోదుతో మొదటిస్ధానంలో ఉన్నాయి. కూలీ ఆధార్కార్డు వివరాలతోపాటు ఫొటో, ఐరిస్లను సెల్ఫోన్లో నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ 96శాతం పూర్తికాగా వందశాతం నమోదు పూర్తికాకపోవడం గమనార్హం. ఈకేవైసీ నమోదుకు కొంతమంది కూలీలు అందుబాటులో లేకపోవడం, ఆధార్కార్డులోని వివరాలు, ఫొటో మ్యాచింగ్ కాకపోవడం, ఐరిస్లో మార్పులు తదితర కారణాలతో వందశాతం నమోదు కాలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 10తో పూర్తయిందని, నమోదు ప్రక్రియ గడువు పొడిగిస్తారా లేదా అనే సమాచారం ఇంకా రాలేదని తెలిపారు.మండలం కూలీలు ఈకేవైసీ మిగిలినవారు జమ్మికుంట 7,578 7,228 350 కరీంనగర్రూరల్ 3,872 3,697 175 ఇల్లంతకుంట 7,596 7,262 334 మానకొండూరు 10,097 9,669 428 గన్నేరువరం 5,359 5,145 214 చొప్పదండి 5,883 5,652 231 సైదాపూర్ 9,142 8,819 323 వీణవంక 10,757 10,380 377 హుజూరాబాద్ 7,004 6,774 230 శంకరపట్నం 9,587 9,287 300 కొత్తపల్లి 2,317 2,247 70 చిగురుమామిడి 6,803 6,603 200 గంగాధర 8,553 8,316 237 రామడుగు 6,856 6,685 171 తిమ్మాపూర్ 6,263 6,113 150 -
తండ్రి దినకర్మ రోజే తనయుడి ఆత్మహత్య
● దుమాలలో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ ఆటో డ్రైవర్ తండ్రి దినకర్మ రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో మంగళవారం విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. దుమాలకు చెందిన పాముల భాస్కర్గౌడ్(43) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదురోజుల క్రితం తన తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి దినకర్మ సోమవారం జరిపించారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్గౌడ్కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ శరవిందు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఉరేసుకుని మహిళ..జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్వాడకు చెందిన సాయిని అంజవ్వ (51) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంజవ్వకు సారంగాపూర్ మండలం రేచపల్లిలో కొంత భూమి ఉంది. వారి సమీప బంధువులతో వివాదం కొనసాగుతోంది. భూమి పోతుందని మనస్తాపానికి గురైన అంజవ్వ ఇంట్లోనే ఉరేసుకుంది. అంజవ్వ కూతురు సాయిని సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఏఎస్సై అజిజోద్దీన్ తెలిపారు. మానకొండూర్: మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు సీతాల రమేశ్ (38) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. రమేశ్కు ఆరేళ్ల క్రితం వివాహమైంది, భార్యతో విడాకుల కేసు కొనసాగుతోంది. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో రమేశ్ ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు..● చెప్పుతో కొడతానన్న మహిళా సర్పంచ్ ● సోషల్ మీడియాలో ఆడియో వైరల్ శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలో చెట్ల నరికివేతపై ఓ వ్యక్తి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ మరో వ్యక్తి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిని ఆశ్రయించాడు. దీంతో విచారణ నిమిత్తం అధికారులు తరచూ గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ‘కావాలనే కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని, వారిని చెప్పుతో కొడతా’ అంటూ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై వార్డు సభ్యులు సమావేశం అయ్యారు. శ్రీఎవరిని చెప్పుతో కొడతారంటూ’ సర్పంచ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సుల్తానాబాద్ ‘అల్ఫోర్స్’కు సీబీఎస్ఈ గుర్తింపు
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని అల్ఫోర్స్కు సీబీఎస్ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి అన్నారు. అల్ఫోర్స్కు సీబీఎస్ఈ గుర్తింపు రావడంతో సుల్తానాబాద్లోని అల్ఫోర్స్ హైస్కూల్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లుగా అన్నివర్గాల విద్యార్థులకు తమ సంస్థ విద్యా సేవలు అందిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, బోధన సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని గుర్తింపు ఇచ్చారని అన్నారు. విద్యార్థులకు ప్రాథమికదశ నుంచే నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. సీబీఎస్ఈ గుర్తింపు ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయని, ఐఐటీ, నీట్లో సులభంగా సీట్లు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. పాఠశాల సీబీఎస్ఈ గుర్తింపు నంబర్ 3630668గా ఉందని ఆయన చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల సిబ్బంది నరేందర్రెడ్డిని సన్మానించారు. -
పాత ఆటలు... భలే సరదాలు
వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలున్న రోజుల్లోనే పిల్లలు ఫోన్లు వదలడం లేదు. ఇక సెలవుల్లో మన మాట వింటారా? ఆ ఫోన్లకే అతుక్కుపోతారు అంటూ తల్లిదండ్రులు బాధపడొద్దు. మీరు కూడా ఖాళీ సమయం చూసుకుని పిల్లలతో ఈ పాత ఆటలు ఆడించండి. మీరు చిన్నతనంలో ఆడుకునే ఉంటారు. వారూ వాటిని వదిలి పెట్టరు. గడులాట: క్లాసురూంలో ఖాళీ పీరియడ్ వచ్చిందంటే చాలు నోట్ పుస్తకాలు తీసుకొని దానిలో గడులాట ఆడేవారు. ఒకరు ఒక గీత గీయాలి. వేరొకరు దానికి ఆనించి మరో గీతగీయాలి. ఇలా నాలుగు గీతలు గీస్తే ఒక గడిలా తయారవుతుంది. చివరి గీత ఎవరు గీస్తే గడిలా తయారవుతుందో వారిదే ఆ గడి అన్నమాట. ఆ గడిలో వారి పేరు మొదటి అక్షరం రాసుకుంటారు. అలా పేజీ అంతా అయ్యాక లెక్కిస్తే ఎవరికి ఎక్కువ గడులొస్తే వారు గెలిచినట్టు. చిట్ల పొట్లకాయ ఆట: ఇది దాదాపు దాగుడుమూతల్లానే ఉంటుంది. ఒక మూలవైపుగా ఒకమ్మాయిని కూర్చోమంటారు. మిగిలిన వాళ్ళలో ఒకరు వెళ్ళి కూర్చున్న అమ్మాయి కళ్ళు మూస్తారు. అప్పుడు ఎవరు కళ్ళు మూశారో చెప్పాలి. కళ్ళు మూసిన అమ్మాయి పేరు కనుక్కుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరల ఆడతారు. పేరు కనుక్కోలేకపోతే మొదట అమ్మాయికే కళ్లు మూయాలి. చిట్ల పొట్లకాయ–సీమనెల్లి కాయ గోడ పుచ్చకాయ–గొట్టినెల్లి కాయ అత్తకు పెడితే అల్లం–అల్లుడు తింటే బెల్లం కొత్త కుండల్లోని కోడళ్లారా–పాలపిడతలోని పాపల్లారా! అంటూ ఈ ఆట ఆడుతూ పాట పాడతారు. ఇప్పటి పిల్లలు అంత్యాక్షరి ఆడుకున్నట్లుగా మా కాలంలో ఈ ఆట ఆడేవారు. ఆటలో పాల్గొనే వాళ్లంతా తలా ఒక పుస్తకం, పెన్నుతీసుకొని ఒక పేజీలో పేరు, ఊరు అని పైన రాస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక్కరు ఒక అక్షరం పేరు చెబుతారు. ఆ అక్షరంతో వచ్చే పేరు, ఊరు పేరు రాయాలి. ఎదుటి వాళ్లకు రాని విధంగా ఉండేలా కష్టమైన అక్షరాలు ఇస్తారు. దానికి వాళ్లు పేరు, ఊరు పేరు రాయాలి. ఇప్పటిలా దీవీలు లేవు కాబట్టి. ఊర్ల పేర్లు చాలామందికి తెలియవు. అట్లాస్లో చూడటమే తప్ప విడిగా తెలియదు. అప్పట్లో మేము ఎవ్వరికీ తెలియని వికారాబాద్ పేరును తెగ రాసేవాళ్లం. ఇలా ఎవరికీ తెలియనివి రాసినపుడు పక్క ఫ్రెండ్స్ ఒప్పుకునే వాళ్లు కాదు. ఇంకా కొంత మంది ఊరు, పేరుతో పాటు ఆట, పండు, తినే వస్తువు అని ఇలా నచ్చినట్టుగా పెట్టుకునే వాళ్లు.. ఎన్ని గంటలైనా ఆడుకునే వాళ్లం. ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆటఇది. ఒక తాడును తీసుకొని ఎగరేస్తూ రెండు కాళ్లకింద నుంచి తీసుకెళ్తారు. ఎగురుతూ ఆడే ఈ ఆట వ్యాయామానికీ ఉపయోగ పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, పెద్ద వాళ్లయ్యాక కూడా అంతే సరదాగా ఆడుకోవచ్చు. ఒంటి కాలితో, రెండు కాళ్లతో ఆడే స్కిప్పింగ్ ఎక్కడా తడబడకుండా వంద వరకూ ఆడేవాళ్లం అలుపు లేకుండా. ఈ రోజుల్లో ఇవేవీ లేవు. రచన: డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రాజన్నసిరిసిల్ల -
శవమై కనిపించిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి
శంకరపట్నం: ఇంటి నుంచి వెళ్లిన సింగరేణీ రిటైర్డ్ ఉద్యోగి మాతంగి కొంరయ్య(75) మండలంలోని కాచాపూర్ గ్రామశివారులో శవమై కనిపించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొంరయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. కుటుంబంతో కలిసి అత్తగారి ఊరు ముత్తారంలో నివాసం ఉంటున్నాడు. కొంరయ్య పెద్ద కుమారుడు ఆనంద్ ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో అదే బెంగతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం గొర్రెల కాపరులకు కాచాపూర్ శివారులో శవమై కనిపించాడు. కొడుకుపై బెంగతోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. -
బన్నీ వేసవి యాత్ర–5 రామ్ డాన్స్
సాయంత్రం అయ్యింది. బస్ ఒక ఊర్లో ఆగింది. ఇది బస్ స్టాండ్. అక్కడ చాలా మంది. మధ్యలో ఒక అబ్బాయి. పేరు రామ్. వయసు 11. పక్కన ఒక తాత డప్పు కొడుతున్నాడు. ‘డమ్ డమ్’ అని శబ్దం. రామ్ డాన్స్ చేస్తున్నాడు. గెంతుతున్నాడు. తిరుగుతున్నాడు. అందరూ చూస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. రామ్ బన్నీని చూశాడు. ‘ఏయ్ బాబూ! రా!’ అన్నాడు. ‘నాకు డాన్స్ రాదు’ అన్నాడు బన్నీ. సిగ్గు పడ్డాడు. రామ్ నవ్వాడు. బన్నీ చెయ్యి పట్టుకున్నాడు. మధ్యలోకి లాగాడు. ‘డాన్స్ రాకున్నా పర్లేదు. చిన్నగా మొదలు పెట్టు. ఆనందం చాలు’ అన్నాడు రామ్. బన్నీ రెండు గెంతులు గెంతాడు. చెయ్యి ఊపాడు. కాలు కదిపాడు. తప్పు అయ్యింది. అయినా పర్లేదు. అందరూ ‘భలే!’ అన్నారు. చప్పట్లు కొట్టారు. బన్నీకి నవ్వు వచ్చింది. గుండె హాయిగా ఉంది. బస్ ‘పాం పాం’ అని అరిచింది. బన్నీ బస్ ఎక్కాడు. రామ్ చెయ్యి ఊపాడు. ‘బై!’ అన్నాడు. పిల్లలకి మాట: డాన్స్ రావాల్సిన పని లేదు. మనసులో ఆనందం ఉంటే చాలు. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం
కరీంనగర్ టౌన్: దళిత క్రెస్తవులకు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని ఎమ్మార్పీస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రిస్టియన్ పాస్టర్స్ ఫెలోషిప్ సంస్థ కరీంనగర్లోని ఇందిరా భవన్లో ‘దళిత క్రైస్తవులు .. రాజ్యాంగ హక్కులు, సామాజిక హోదా’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోకి ఇస్లాం ప్రవేశించకముందు ఉన్న కులవిక్షను క్రైస్తవం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడపై కత్తిలాగా వేలాడుతున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25కు ఇవి పూర్తి వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిక్కు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగా దళిత క్రైస్తవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1947 నుంచి 1977 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. తాను ఏ పార్టీ వాడిని కాదని, తన ఒంటిపై కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని తీర్పు చెబితే అన్నిరాజకీయ పార్టీలు మౌనం వహించాయని విమర్శించారు. న్యాయం, ధర్మం దళిత క్రైస్తవుల పక్షాన ఉందని, శక్తిమంతమైన ఉద్యమాన్ని నడిపి ప్రజా మద్దతు సమీకరిద్దామని ఆయన కోరారు. పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాఘవా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎలీషా, గంగరాజు, బెన్ని, మోజెశ్బాబురావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు
సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12నుంచి జూన్ వరకు ఉమ్మడి జిల్లా క్రికెట్ సెలెక్షన్స్కు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు డీసీసీ చైర్మన్ వంకాయల కార్తీక్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బాలబాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించేలా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డు వైట్ డ్రెస్తో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. -
నిజాయతీ ఫలం
ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ఒక రోజు పాఠశాలకు వెళ్తూ రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. రాము ఆ పర్సును తీసుకుని ఇంటికి వెళ్లకుండా నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లాడు. గ్రామ పెద్ద ఆ పర్సు ఎవరిదో తెలుసుకోవడానికి గ్రామంలో ప్రకటించాడు. కొంతసేపటికి ఒక వృద్ధుడు వచ్చి అది తనదేనని చెప్పాడు. అతను చాలా ఆందోళనలో ఉన్నాడు, ఎందుకంటే ఆ డబ్బుతో తన కుమార్తె చదువు ఫీజు చెల్లించాల్సి ఉంది. రాము పర్సును అతనికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో రామును ఆశీర్వదించి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కానీ రాము శ్ఙ్రీనిజాయితీకి బహుమతి అవసరం లేదుశ్రీశ్రీ అన్నాడు. రాము మంచితనాన్ని చూసి గ్రామస్థులందరూ అతన్ని ప్రశంసించారు. అప్పటి నుండి గ్రామంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పేరు: నక్క శ్రీకర్, గ్రామం: ఊటూరు, మండలం: మానకొండూర్, జిల్లా: కరీంనగర్ -
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు –2026 ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని సోమవారం పీఎం శ్రీ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చెస్, క్యారమ్ ఆటలాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఎంఈఓ తుమ్మ ఆనందం, ఈఈ అశోక్కుమార్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏఏపీసీ చైర్పర్సన్ సుగుణ, హెచ్ఎం కన్నం రమేశ్, ఐఈఆర్పీ దీప్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం ఎలగందుల మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంపును ఎంఈవో ప్రారంభించారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండికరీంనగర్: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఆధ్వర్యంలో క రీంనగర్లోని వైశ్యభవన్ నుంచి నిర్వహించే ‘హిందూ ఏక్తాయాత్ర’ను విజయవంతం చే యాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఏక్తాయాత్ర ఏర్పాట్లను కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలతో కలిసి పరిశీలించి మాట్లాడారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు 12 ఏళ్లుగా లక్షలాది మందితో జరిగే యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. హిందూ సమాజం తరలిరావాలని కోరారు. భగీరథ్పై చర్యలు తీసుకోండివిద్యానగర్(కరీంనగర్): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ లైంగిక దాడి చేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదు చేసినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం వివిధ సంఘాలు, పార్టీలు నగరంలో నిరసన తెలిపాయి. భగీరత్ను పోక్సో కేసులో అరెస్ట్ చేయాలని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మచ్చ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, నాయకులు పాల్గొన్నారు. రాజకీయ అక్రమ సంబంధం వల్లే భగీరత్ను అరెస్ట్ చేయడం లేదని బీఎస్పీ జోన్ ఇన్చార్జి నిషాని రామచంద్రం ఆరోపించారు. నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు అయినందుకే పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. మాతంగి అశోక్, పల్లె ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానంసప్తగిరికాలనీ(కరీంనగర్): హైదరాబాద్లోని బేగంపేట, రామాంతాపూర్ పబ్లిక్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశానికి అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6 సీట్లలో ఎరుకల వారికి 3, లంబాడ వారికి 2, ఇతరులకు 1 సీటు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 1 జూన్ 2019 నుంచి 31 మే 2020 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించరాదని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 12 నుంచి 18 వరకు కలెక్టరేట్లోని గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉండదని, దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఈనెల 22న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండదని, మరిన్ని వివరాలకు 95026 64044 నంబరులో సంప్రదించాలని కోరారు. -
పడుతున్నారు..!
రాష్ట్రాలను జల్లెడకరీంనగర్క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహర్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నింది తులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్వి చ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్ర మే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్యవధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్టగా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజావాణి.. వినతుల బాణి
కరీంనగర్అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాస్థాయిలో కలెక్టర్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో కుందారపు మహేశ్వర్ వినతులను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపగా, ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మొత్తం 129 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కాగా, అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని ఆదేశించారు. కరీంనగర్ రెవెన్యూ డివిజన్కు 40, హుజురాబాద్ డివిజన్కు 16 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్లోనే.. మొత్తం అర్జీలు: 129 మునిసిపల్ కార్పొరేషన్: 23 ఎస్సీ వెల్ఫేర్: 11, హౌజింగ్: 11 సీపీ ఆఫీస్: 06, వారధి: 06 -
యానిమల్ హౌస్తో పరిశోధనలకు ఆస్కారం
కరీంనగర్సిటీ: శాతవాహన ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో సోమవారం ‘యానిమల్ హౌస్’ను వీసీ ఉమేశ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతువులకు ఆశ్రయం కల్పించి, వాటి సంరక్షణ, ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ చేయడానికి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, కొత్త పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయి సదస్సులలో పాల్గొనడానికి అధ్యాపకులకు ఉపయోగపడుతుందన్నారు. రిజిస్ట్రార్ సతీశ్కుమార్ మాట్లాడుతూ, పరిశోధనలో భాగంగా ఫార్మ కాలేజీకి జంతుశాల వెన్నెముక వంటిదని, పరిశోధనలతో మరింత ముందుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శ్రీశైలం, సీడీసీ డీన్ డా.జాఫర్, డా. శ్రీవాణి, డా. నజీముద్దీన్మున్వర్, అధ్యాపకులు డా.క్రాంతి, డా.అనిల్ డా.భాగ్యలక్ష్మి, డా.శ్రీవిద్య, డా. అశ్విని, డా.అర్చన తదితరులు పాల్గొన్నారు. -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్సిటీ(రామగుండం)తూకంలో దోపిడీ తగదుకరీంనగర్అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ తూకం వేయడం, తరుగు పేరిట మిల్లర్లు దోచుకోవడం వంటి చర్యలను తక్షణమే నియంత్రించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రామిశ్రాను కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు, స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ వివరించారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోండి రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేసి, కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లు, రవాణా దా రుల సమన్వయంతోనే కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలమన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఎక్కువమంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోళ్లను నిరంత రం పర్యవేక్షించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పౌరసరఫర ాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజచారి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
పాపం పసివాడు
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ గుర్తు తెలియని మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందగా, తన నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. సుమారు 28 ఏళ్ల వయస్సుగల మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో శనివారం జమ్మికుంట రైల్వే స్టేషన్కు వచ్చింది. అంతలోనే ఎమైందో ఎమో కానీ, రైల్వే బుకింగ్ హాల్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన రైల్వే బుకింగ్ ఉద్యోగి 108 అంబులెన్స్కు సమచారమిచ్చాడు. వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు, వివరాలు లేవు. బ్లూ కలర్ డిజైన్ హాఫ్ ప్యాంట్, పింక్ బ్లూ, పసుపు డిజైన్ టాప్ ధరించి ఉంది. చేతిపై ‘సమ్మక్క, సలీమ్, అమ్మ’అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. కాగా, చికిత్స సమయంలో తల్లి వద్దే ఉన్న కుమారుడిని ఆమె మృతిచెందడంతో ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది చైల్డ్ హోంకు పంపించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. మృతురాలి వివరాలు తెలిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి అనాథ అయిన నాలుగేళ్ల కుమారుడు -
మద్యం తాగించి.. కత్తితో పొడిచి..
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ(28)ని పథకం ప్రకారం హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు వంశీ గతనెల 29 నుంచి కనిపిండచం లేదని ఫిర్యాదు చేయగా ఈనెల 1న మిస్సింగ్ కేసు నమోదైంది. సీడీఆర్, మొబైల్ కాల్స్పై దృష్టి సారించిన పోలీసులు.. వంశీ స్నేహితురాలు అలేఖ్య, ఆ మె భర్త నీలం నవీన్, నవీన్ స్నేహితుడు బుర్ర భా స్కర్పై దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత సా యంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. వంశీని హత్య చేశామని అంగీకరించారు. ప్రాణం తీసిన గెట్టూగెదర్.. వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య, నీలం నవీన్ను ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో టెన్త్క్లాస్ గెట్టుగెదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతస్నేహితులు కలిశారు. ఈక్రమంలోనే వంశీ.. అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్చేస్తూ, మెసేజ్లు పంపిస్తూ ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి మూడుసార్లు గొడవకు కూడా దిగాడు. భర్త నవీన్, స్నేహితుడు భాస్కర్ మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. వంశీ తనను వేధిస్తున్నాడని అలేఖ్య తన భర్తకు తెలిపింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని నవీన్, భాస్కర్ పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్చేసి వంశీని హైదరాబాద్ రప్పించారు. గతనెల 30న వంశీ తొలుత అలేఖ్య నివాసానికి వెళ్లగా.. ముగ్గురూ కలిసి కారులో భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటకిఏ నవీన్ డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో భాస్కర్ వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో చాతి, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఫోన్ద్వారా నవీన్కు భార్య సమాచారం అందించింది. నవీన్ చేరుకొని భాస్కర్తో కలిసి గదిలోని రక్తపు మరకలను లైజాల్తో శుభ్రపర్చారు. భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్, మ్యాట్లో చుట్టి కారులో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్క లోయలో పడవేశారు. పోలీసు విచారణలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి కారు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలేఖ్య, నవీన్, భాస్కర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివాహితను వేధిస్తున్నాడని వంశీ హత్య వివరాలు వెల్లడించిన ఏసీపీ రమేశ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ -
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. తమ మంచి మాటలతో రోగులకు ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు వైద్య సేవలందిస్తున్నాను. – శోభ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ రోగులను కాపాడడంలోనే సంతృప్తి రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మా ట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్ని స్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. ఈ వృత్తిలోకి వచ్చేవారందరూ మదర్ ఆఫ్ నర్సింగ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకోవాలి. – దీవెన, నర్సింగ్ ఆఫీసర్, కరీంనగర్ నర్స్ పాత్ర గొప్పది రోగులకు ప్రత్యక్షంగా సేవలందించడం ఒక్క నర్సింగ్ ఆఫీసర్లకే దక్కుతుంది. న ర్సింగ్ ఆఫీసర్ల పాత్ర గొప్పది. 22 ఏళ్లుగా నర్సింగ్ పని చేస్తున్న. మా పిన్ని జానకి ఏఎన్ఎంగా పని చేశారు. ఆమె సేవలకు స్ఫూర్తి పొంది నర్సింగ్ విభాగాన్ని ఎంచుకున్న. ఆస్పత్రుల్లో డాక్టర్లతోపాటు నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. – జమున,నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2, పెద్దపల్లి -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి(వట్టిమల్ల) లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గొల్లపల్లికి చెందిన గోపు లచ్చయ్య(65) ఆదివారం బంధువుల వివాహానికి వెళ్లి వచ్చి, సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే వేములవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రైల్వే ఉద్యోగిపై కోతుల దాడి ● తలకు, ముక్కు, కన్నుకు తీవ్రగాయాలు రామగుండం: పెద్దపల్లి జి ల్లా రామగుండం రైల్వేక్వార్టర్లలో కోతులు బీభత్సం సృష్సిఉ్తన్నాయి. ఈ నేప థ్యంలోనే స్థానిక రైల్వే సీ అండ్ డబ్ల్యూ సహాయకు డు రవికిషన్ విధులు ముగించుకుని ఆదివారం రాత్రి తన క్వార్టర్కు చేరుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్రూమ్కు వెళ్లేందుకు డోర్ తీసి బయటకు రాగానే కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేసేందుకు య త్నించాయి. వాటిని తప్పించు కునేందుకు రవి కిషన్ ఇంట్లోకి పరుగెత్తినా వెంటాడి దాడి చేశా యి. ఘటనలో ముఖం, ము క్కు, కంటిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో స్థానికు లు భయాందోళనలకు గురవుతున్నారు. భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాళ్ల రాజు(34) తన భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రాజుకు భార్య రజిత, ఇద్దరు కొడుకులున్నారు. రాజు మద్యానికి బానిస కావడంతో భార్యతో రోజూ గొడవలు జరిగేవి. విసుగు చెందిన భార్య ఆర్నెల్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. తన ఇంటికి రావాలని ఎంతపిలిచినా రాలేదు. మరింత మద్యానికి బానిసైన రాజు.. మనస్థాపంతో ఆదివారం మద్యం తాగాడు. ఆ మత్తులో తాను ఉరివేసుకుని చనిపోతున్నని తన చిన్నఅక్కకు ఫోన్ చేసి చెప్పాడు. భయపడిన ఆమె వెంటనే ఇంటిపక్కన ఉన్న బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లిచూసేసరికే ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. అక్క లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతివీణవంక: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూలం వెంకటమ్మ(70) వడదెబ్బకు గురై మృతి చెందింది. వెంకటమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. సోమవారం పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
లైఫ్ డో‘నర్స్’
ఏ ఉద్యోగమైనా ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహిస్తుంటారు. కానీ, నర్సులు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా సేవా భావంతో పనిచేస్తారు. కోవిడ్ సమయంలో మొక్కవోని ధైర్యంతో వారు సేవలు అందించిన రోజులను చూశాం. అన్నీ మూతపడ్డా ఆసుపత్రులు మాత్రం ఎళ్లవేళలా తెరిచే ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలందిస్తూనే ఉంటారు. రోగమేదైనా నర్సులు మాత్రం రోగులను అక్కున చేర్చుకొని వైద్యాన్ని అందిస్తారు. సడలని సంకల్పంతో విధులు నిర్వహిస్తారు. వైద్యుల తర్వాత నర్సులదే కీలకపాత్ర వైద్య సేవల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నర్సులే. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వు, ఆత్మీయ స్పర్శతో రోగులకు సేవలందిస్తుంటారు. డాక్టర్ రౌండ్స్లో భాగంగా వార్డుకు వచ్చి రోగిని పరీక్షించి ఏయే మందులు వాడాలో కేస్షీట్పై రాసి వెళ్లిపోతారు. డాక్టర్ పేర్కొన్నట్లు రోగికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఇండెంట్ రాసుకొని మెడికల్ స్టోర్స్ నుంచి తెప్పించి వాడుతారు. ఏమైనా వైద్య పరీక్షలు అవసరమైతే నాల్గో తరగతి ఉద్యోగుల సాయంతో చేయిస్తారు. 24 గటలు అందుబాటులో ఉంటూ పేషెంట్కు వ్యాధి తగ్గే వరకు సేవలందిస్తారు. సేవలకు సలాం ప్రమాదాల్లో గాయపడినవారు, మందు తాగి ఆస్పత్రి పాలైనవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు, డెంగీ, మలేరియా వంటి జబ్బున పడినవారు మాత్రమే కాకుండా అనేక మంది చీము, నెత్తురుతో కలిసిన గాయాలతో ఆస్పత్రులకు వస్తుంటారు. వీరందరినీ పరీక్షించి మందులు రాసేది డాక్టర్. ఆపరేషన్లు చేసేది డాక్టర్. అయితే ఆ తర్వాత కోలుకోవడంలో, డ్రెస్సింగ్ చేసి గాయాలు మాన్పించడంలో ప్రధాన భూమిక పోషించేది నర్సులే. నర్సింగ్ కోర్సులపై ఆసక్తి నర్సింగ్ కోర్సులపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్స్టిట్యూట్లు కూడా పోటీ పడుతున్నాయి.కరీంనగర్/కోల్సిటీ(రామగుండం):ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడితే.. ఒక నర్సు తన సేవలతో రోగి ప్రాణానికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ఎంతో మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చి తమలోని సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంకితభావం, నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఆమె పుట్టిన రోజున ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. -
ఇష్టంతో నర్సింగ్ వృత్తి..
4చాలా ఇష్టంతోనే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న. 2011లో ఏఎన్ఎం చేశాను. నర్సింగ్ చదవాలని పట్టుదలతో డిగ్రీ వదిలేసి, జీఎన్ఎం కోర్సు పూర్తి చేశా. కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో నర్సింగ్ ఆఫీసర్గా ఐదేళ్లుగా పని చేస్తున్న. – స్రవంతి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని చాలా సంతృప్తిగా ఉంది మాది ఖమ్మం. నాన్న సలహాతో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి వచ్చాక రోగులకు సేవలందించడం చాలా సంతృప్తిగా ఉంది. మా కజిన్స్ కూడా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. ఇలా నాకు నర్సింగ్ సేవలపై ఇంట్రెస్ట్ కలిగింది. – కె.సరిత, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని -
వేసవిలో చిన్నారులు భధ్రం
సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు ●ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వేసవిలో పిల్లల్లో డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులు, చర్మసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ గమనిస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. డ్రాయింగ్, సంగీతం, నృత్యం, యోగా వంటి శిక్షణ తరగతులకు పంపించాలి. రోజూ కొంతసమయం చదువుకు కేటాయించేలా ప్రోత్సహించాలి. ఇంటిపనుల్లో చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమశిక్షణ పెంపొందించాలి. పెద్దలతో సమయం గడిపేలా చేసి కుటుంబ విలువలను తెలియజేయాలి. మొక్కలు నాటడం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా శారీరక–మానసిక వికాసం కలిగించాలి. జ్యోతినగర్: వేసవి సెలవుల్లో పిల్లలు అధిక సమయం ఇంట్లోనే గడపడం, బయట ఆటలపై ఆసక్తి చూపడం సహజం. మండుతున్న ఎండలు వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులను పిల్లల భవిష్యత్కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సలహాలిస్తున్నారు. -
అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం
స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు మల్యాల: మల్యాల మండలం కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలంలోని శ్రీసీతారాముల ఆలయం నుంచి ఆలయ ఈవో దామోదర్ పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వాటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించి.. వైజంక్షన్ నుంచి మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాల మధ్య శోభాయాత్రగా అంజన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తరలివస్తున్న భక్తులు.. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సుమారు 3 నుండి 4లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో అధికారులు ఆలయంలో లడ్డూ, ప్రసాదాలు, తాగునీటి వసతులు కల్పించారు. -
‘ఆది’ ఔదార్యం
● తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడి తరలింపు వేములవాడ: భగవంతరావునగర్కు చెందిన ఊరడి భూమయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పట్టణంలోని పెద్దమ్మ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వేములవాడ రూరల్ పరిధిలో తన పర్యటన ముగించుకొని వేములవాడ వస్తున్న క్రమంలో ఇది చూసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమయ్యను పరామర్శించి రోడ్డు ప్రమాద వివరాలడిగి తెలుసుకున్నారు. వెంటనే తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
నా బాల్యం
కథల పుస్తకాలు చదివేవాడిని సిరిసిల్ల: వేసవి సెలవులు వస్తున్నాయంటే ఎంతో సంతోషంగా ఉండేదని రాజన్నసిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. ఎండాకాలం సెలవుల్లో తన చిన్నతనంలో ఎలా గడిపేవారో వివరించారు. ఆయన మాటల్లోనే.. బాల్యం .. నిజంగానే అమూల్యమైనది. తిరిగిరాని గొప్ప వరం. వేసవి సెలవులు వస్తే.. చాలు మా ఊరిలోని పెద్దవాగులో ఈతకొడుతూ.. ఈతకాయలు.. తాటి ముంజలు తింటూ ఎంజాయ్ చేస్తూ గడిపే వాడిని. మాది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వెల్గ టూర్. నాన్న గడ్డం రాంరెడ్డి ప్రభుత్వ టీచర్, అమ్మ పద్మ. మా అమ్మమ్మ ఊరు కమ్మర్పల్లి మండలం నాగాపూర్. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడిని. ఈ రోజుల్లో లాగా మాకు సెల్ఫోన్లు, టీవీలు అందుబాటులో లేవు. నిజానికి మా నాన్న బాలమిత్ర, బాలజ్యోతి చందమామ వంటి పుస్తకాలు తెప్పించి చదివించేవారు. వేసవి సెలవుల్లోనూ క్రికెట్ వంటి ఆటలతోపాటు కథల పుస్తకాలు బాగా చదివే వాడిని. ఇప్పటికీ నాపై ఆ ప్రభావం ఉంటుంది. వేసవి సెలవులు వస్తున్నాయంటేనే ఎంతో సంతోషంగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. -
కంచర్లలో చిరుత కలకలం
● దాడిలో గేదె మృతి వీర్నపల్లి: కంచర్ల గ్రామంలో చిరుత పులి దాడి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం రాత్రి గ్రామానికి చెందిన రైతు, మంత్రి శ్రీనివాస్కు చెందిన పాడి గేదైపె చిరుత దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, బాధితుడి వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే శ్రీనివాస్కు చెందిన గేదె తోటి గేదెలతో మేతకెళ్లగా.. అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం తన గేదె కోసం అడవిలో గాలించగా.. గేదె చిరుత దాడిలో అక్కడికక్కడే మృతిచెందడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం నుంచి సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. గ్రామ సమీపంలోనే చిరుత సంచరిస్తుండడంతో కంచర్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. పెద్దమ్మ ఆలయంలో చోరీమల్లాపూర్: సిరిపూర్ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ప్రతి ఏటా ముదిరాజ్ కులస్తులతోపాటు ఇతర భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఆలయ గర్భగుడి తాళం పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, ముక్కెర, బొట్టు, వెండి మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఎస్సై అనిల్ స్థానిక ప్రజాప్రతినిధులతో వెళ్లి విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ ఫుటేజీ చూడగా.. దుండగుడు ఆభరణాలను దొంగిలిస్తున్న దృశ్యం రికార్డయింది. ముదిరాజ్ కులస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. -
కాసుపత్రులు..!
జిల్లా వివరాలు ప్రైవేటు ఆస్పత్రులు 286 ప్రైవేటు క్లినిక్లు 222రోగనిర్ధారణ కేంద్రాలు 58 కరీంనగర్: కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కమీషన్ల దందా నడుస్తోంది. ప్రాణాల కన్నా కమీ షన్లే లక్ష్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు రోగుల రక్తం తాగుతున్నాయి. సాధారణ జ్వరంతో వెళ్లినా అవసరం లేని వైద్య పరీక్షలు చేయించి రూ.వేలల్లో గుంజుతున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల మధ్య ఉన్న ఒప్పందంతో అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పీడిస్తున్నారని పలువురు సీనియర్ వైద్యులే వాపోతున్నారు. కొంత మంది రోగి ముఖం చూడకుండానే వైద్య పరీక్షలు రాస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో అసిస్టెంట్లే జూ నియర్ డాక్టర్ పేరిట అవసరం లేకున్నా వివిధ రకాల టెస్టులు రాసి పేదలను దోచుకుంటున్నారు. ఎమ్మారై, సిటీస్కాన్లో సగానికి పైగా వైద్యులకే ఆస్పత్రుల నిర్వాహకులు తాము రాసిచ్చిన ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్కే వెళ్లాలని ఒత్తిడి చేస్తుండగా.. ఎమ్మారై, సిటీస్కాన్ లాంటి వైద్య పరీక్షలకు డయాగ్నోస్టిక్ సెంటర్లు రోగుల వద్ద నుంచి వసూలు చేసే ఫీజులో సగానికి పైగా వైద్యులకే అందజేస్తున్నామని స్కాన్ సెంటర్ల నిర్వాహకులే చెబుతున్నారు. సిటీస్కాన్కు రూ.3 వేలు నుంచి రూ.6 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఎమ్మారైకి రూ.5 వేల నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇతర ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్తే సరిగా లేవని తిప్పి పంపడం సర్వసాధారణమైంది. స్కానింగ్ ఫీజు ఆస్పత్రిలోనే వసూలు స్కానింగ్ సెంటర్లో చెల్లించాల్సిన డబ్బులు కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులే వసూలు చేస్తున్నారు. కమీ షన్ తీసుకుని మిగతావి అప్పగిస్తున్నారు. ఇలా చే యడం వల్ల తాము సూచించిన స్కానింగ్ సెంటర్ కు పేషెంట్ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. ఇక ల్యాబ్ల్లో చేసే వివిధ రకాల రక్త పరీక్షలకు వసూలు చేసే ఫీజులో 40 నుంచి 60శాతం వరకు వైద్యులకు ముట్టచెబుతున్నారు. సాయంత్రానికి కమీషన్ పంపించకుంటే మరునాడు తమ స్కానింగ్ సెంటర్ లేదా ల్యాబ్కు రోగులను పంపటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కమీషన్ల దందా బహిరంగమే అయినా యంత్రాంగం నియంత్రణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కలెక్టర్ దృష్టి సారించాలి -
నేపాలీ ముఠా కోసమే సోదాలు..?
● రైళ్లలో ఆకస్మిక సోదాలతో ప్రయాణికుల బెంబేలు ● లక్నో, గోరఖ్పూర్ రైళ్లపైనే ప్రత్యేక నిఘా రామగుండం: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఇటీవల ఓ మాజీ డీజీ సతీమణిని ఇంట్లోనే మట్టుబెట్టిన నేపాలీ గ్యాంగ్పైనే పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. రామగుండం రైల్వే స్టేషన్తోపాటు రైళ్లలో పోలీసుల ఆకస్మిక సోదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తోందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆదివారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐలు కొదురుపాక రాజేంద్రప్రసాద్, లింగమయ్య, ఎస్సై క్రాంతికుమార్ తదితరులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్తో గోరఖ్పూర్ రైలులో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ప్రధానంగా నేపాల్ రాష్ట్రానికి సమీపంలో ఉన్న లక్నో, గోరఖ్పూర్ రైళ్లలో ఎక్కువగా నేపాల్ రాష్ట్రానికి చెందిన వారు కూడా ప్రయాణిస్తుండడంతో.. వారి కదలికలు, లగేజీపై ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ రాష్ట్రానికి చెందిన వేలాది మంది రోహింగ్యాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు సమాచారమందడంతో వారిపై కూడా నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటికే తమ కాలనీల్లో అద్దెకు దిగే ఇళ్లలో అనుమానితులను గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఓవైపు చోరీ నిందితులు, మరోవైపు దేశ ద్రోహులను పట్టుకునేందుకు రైళ్లలో నిఘా వ్యవస్థను పెంచినట్లు స్పష్టమవుతోంది. -
మెడిటేషన్, జాతీయ గీతాలాపన
ప్రతీ సబ్జెక్టుల్లో ఉత్తమ అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నాం. నాలుగేళ్లుగా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం. పోటీపరీక్షల్లో రాణించేలా విద్యార్థులకు మెరుగైన మెటీరియల్తోపాటు మెడిటేషన్ చేయిస్తున్నాం. ప్రతీరోజు శిక్షణ తర్వాత జాతీయ గీతాలాపన చేయిస్తున్నాం. పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగావకాశాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – గోశికొండ బాలరాజు, సత్యసాయి సమితి జిల్లా యువజన సమన్వయకర్త -
రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం
వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆరెపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన వంశీ(19), కేసీఆర్నగర్కు చెందిన నవీన్ కరీంనగర్ నుంచి కారులో వస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులో లారీని ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ నవీన్ను వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ధర్మపురిలో..ధర్మపురి: ధర్మపురిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తోగిటి వాసు(32) ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లి తిరిగి వస్తున్నాడు. పట్టణ శివారులో ట్రాక్టర్ బైక్ను ఢీకొనడంతో వాసుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాక్టర్ డ్రైవర్ పబ్బతి జగదీష్గా గుర్తించారు. వాసు ధర్మపురిలో ఓ జువెల్లరీ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి గతంలోనే మృతిచెందాడు. తల్లి వరలక్ష్మిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కొడుకు మృతి వార్త తెలియగా తల్లి గుండెలవిసేలా రోదించింది. వాసు చిన్నాన్న వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శతాధిక వృద్ధురాలు మృతికథలాపూర్(వేములవాడ): సిరికొండ గ్రామానికి చెందిన చిలుక రాజుబాయి(105) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉండగా.. 60 మంది వరకు మనుమలు, మనుమరాళ్లున్నట్లు బంధువులు పేర్కొన్నారు. రాజుబాయి వందేళ్ల వయస్సులోనూ తన పని తాను చేసుకునేదని, మనుమలు, మనుమరాళ్లకు పురాతన కథలు చెప్తూ ఆనందంగా గడిపేదన్నారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా.. ఆదివారం మృతిచెందిందని తెలిపారు. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
● గాడిదల గండి వద్ద యువకుడి మృతదేహం లభ్యం ● కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాల ఆందోళన యైటింక్లయిన్కాలనీ/మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ(29) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 29న కనిపించకుండా పోయిన వంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో ఆదివారం మంథని మండలం గాడిదల గండి వద్ద పొదల్లో లభ్యమైంది. వంశీ కనిపించడం లేదని ఈనెల 1న గోదావరిఖని టూటౌన్ పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాలు గాడిదల గండి వద్ద మంథని ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. వంశీ చిన్ననాటి స్నేహితురాలు అలేఖ్యతోపాటు నవీన్, భాస్కర్కు ఎక్కువగా కాల్ చేశాడని తెలిపారు. అలేఖ్యకు వంశీతో ఉన్న గొడవల కారణంగా హైదరాబాద్కు పిలిపించి శంషాబాద్లో భాస్కర్ అనే వ్యక్తి గదిలో హత్య చేసినట్లు తెలిపారు. శవాన్ని చాపలో చుట్టి గాడిదల గండి వద్ద పడేసినట్లు పేర్కొన్నారు. విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సర్కారుకు ఆదాయం.. సామాన్యులపై భారం
కరీంనగర్క్రైం: భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను 50శాతం నుంచి 100 శాతం వరకు పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ఈనెల 8న చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ ఆడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అధికారులు వీసీలో సమీక్షించారు. ఈ నెల 13లోపు నివేదిక పంపాలని ఆదేశించారు. జిల్లాల నుంచి నివేదిక రాగానే జూన్ 1వ తేదీ నుంచే కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. ఎక్కడ ఎంత వరకు? ప్రస్తుత మార్కెట్ విలువ, వాస్తవ మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసముందని ప్రభుత్వం భావిస్తోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పట్టణ విస్తరణ, కొత్త లేఅవుట్లు, కమర్షియల్ నిర్మాణాలు, రహదారి అభివృద్ధితో భూముల అసలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొత్త విలువలు నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ పరిసర ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ధరల విలువలు పెంచుతున్నట్లు తెలిసింది. రేకుర్తి, పద్మనగర్, చింతకుంట, అలుగునూర్, హౌసింగ్బోర్డు, బొమ్మకల్, నగునూరుతో తదితర ప్రాంతాల్లో భారీగా పెంపు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెలకు రూ.20 కోట్ల వరకు ఆదా యముంటుంది. మార్కెట్ ధర పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.10 లక్షల మార్కెట్ విలువ ఉన్న స్థలం కొత్త ధర ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.20 లక్షలకు చేరితే, రిజిస్ట్రేషన్ ఖర్చు రెట్టింపవుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్శాఖకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కాగా.. మధ్యతరగతి, చిన్న స్థలాలు కొనుగోలు చేసేవారు పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వృద్ధే లక్ష్యమా? భూముల మార్కెట్ విలువల పెంపు వెనుక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఉద్దేశమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్శాఖ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం గత కొంతకాలంగా కీలక వనరుగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో భూముల అసలు ధరలు ఎక్కువగా, ప్రభుత్వ విలువ తక్కువగా ఉండటంతో భారీగా ఆదాయం కోల్పోతున్నామన్న అభిప్రాయమున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుత మార్కెట్ ధరకు దగ్గరగా ప్రభుత్వ విలువలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములపైనా ప్రభావం వ్యవసాయ భూముల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ధరల పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. హైవేలకు సమీ పంలో ఉన్న భూములు, త్వరలో మున్సిపల్ పరిధి లోకి వచ్చే గ్రామాలు, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రభా విత ప్రాంతాల్లో గణనీయమైన పెంపు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అధికారులు ప్రాథమిక అంచనాలు, మార్కెట్ సర్వే, రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుండగా, పెంపు శాతం, అమలు తేదీపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
1,893 బ్లాకులు.. 1,967 ఎన్యుమరేటర్లు
కరీంనగర్ అర్బన్: జనగణన– 2027 ప్రక్రియ తొలి దశ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణనివ్వగా, యాప్ వివరాలు అప్లోడ్ చేశారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయి గృహాన్ని జియోట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోగా, హెచ్తో ప్రారంభమయ్యే 11అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీని భద్రపరిచారు. ఎన్యుమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేసుకోనుండగా , ఐడీ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ద్వారా కుటుంబ వివరాలను ధ్రువీకరిస్తారు. జనగణన ప్రక్రియ కాగిత రహితమే కా గా.. సాంకేతికతతో డిజిటల్ గణన చేయనున్నారు. జూన్ 10వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో)లో భాగంగా బ్లాకులవారీగా ఇళ్లకు నంబర్లు కేటాయించనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9నుంచి 25వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉండనుంది. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. జిల్లాస్థాయిలో ముఖ్య గణాంక అధికారిగా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నోడల్ అధికారిగా వ్యవహరించనుండగా మండలస్థాయిలో చార్జ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అర్బన్లో మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారు. జిల్లాలోని 16 మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1,227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించగా 1,234 మంది ఎన్యుమరేటర్లు, 215 మంది సూపర్వైజర్లను నియమించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 666 బ్లాకులుగా విభజించగా 733 మంది ఎన్యుమరేటర్లు, 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహించనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్, ఒక్కో ఎన్యుమరేటర్ సుమారు 200 ఇళ్ల వివరాలు సేకరిస్తారు.2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 10,05,711 నివాసాలు 2,58,485 కుటుంబాలు 2,90,657 కుటుంబ యజమాని పేరు, కుటుంబంలోని ఒకరి మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి. ఆ నంబర్తో ఒక కుటుంబం వివరాల నమోదుకు మాత్రమే అవకాశముంటుంది. మొబైల్ నంబరుతో పాటు ఈ మెయిల్కు ఐడీ నంబరు వస్తుంది. పిన్కోడ్, గ్రామం/నగరం, ప్రాంతం, స్థానిక ల్యాండ్ మార్క్, భవనం నంబరు, నివాసయోగ్య స్థితి, వసతులు, మతం, షెడ్యూల్ కులాలు, తాగునీటి వసతి, గృహ వినియోగం, ఇంధనం తదితర వివరాలను చెప్పాల్సి ఉంటుంది. -
ఇసుక.. ఇక చౌక
కొత్తపల్లి(కరీంనగర్): ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, సామాన్యులకు తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్ను తీసుకువచ్చింది. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 24 గంటల్లోపు ఇంటికే ఇసుక సరఫరా అవుతుంది. ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం వల్ల అక్రమ రవాణాను గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్ లేని వారు పంచాయతీ కార్యదర్శి ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ శివారుల్లోని మానేరు వాగులో రీచ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందిరమ్మ ఇళ్లకు.. ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ రీచ్ల్లో ఇసుక తీసుకునేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. చాలాచోట్ల ఇందిరమ్మ ఇళ్లు ఇసుక లేక నిలి చిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఎంపిక చేసిన రీచ్ల్లో ఇసుక తవ్వుకునే అవకాశమి చ్చింది. వినియోగదారులు gmiv. cgg. gov. in వెబ్సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా.. ఇసుక నూతన విధానాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైల ట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ జిల్లాల్లో ఫలితాలను బట్టి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ జరగడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం వల్ల విని యోగదారులపై అదనపు ఆర్థిక భారం పడదు. ఇసుక లోడ్తో బయలుదేరిన ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుతారు. దీంతో వాహనం ఏ మార్గంలో వెళుతోంది..? ఎక్కడ ఆగుతోంది అనే వివరాలను అధికారులు పర్యవేక్షించవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి రెవెన్యూ, పోలీస్, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017లో పెద్దపల్లి జిల్లాలో ‘స్యాండ్ టాక్సీ’ పేరుతో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టినా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని జోడించి మరింత పకడ్బందీగా దీనిని అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో... ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగా -
ఆడపిల్ల పుట్టిన ఇంటికి రూ.10 వేలు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నిక ల సమయంలో తన డివిజన్లోని దంపతులకు ఆడపిల్ల పుడితే రూ.10వేలు అందిస్తానని ఇచ్చిన హామీని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ నెరవేర్చా రు. డివిజన్కు చెందిన పైండ్ల రవళి, ప్రశాంత్ దంపతులకు ఆడపిల్ల జన్మించగా ఆ మొత్తాన్ని ఆదివారం అందించారు. రవీందర్ సింగ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ పుట్టిన ఇంట్లో ఆనందం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు. సభకు తరలిన బీజేపీ శ్రేణులు కరీంనగర్: సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. కరీంనగర్ నుంచి వెళ్లిన వాహనాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లానుంచి 120 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు దాదాపు 500 సొంత వాహనాల్లో సభకు తరలి వెళ్లారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, సీనియర్ నాయకుడు గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూముల అనిల్ పాల్గొన్నారు. నైపుణ్యం పెంచుకోవాలి కరీంనగర్ టౌన్: కళాకారులు శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉ పాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జానపదం, యక్షగాన, బుర్రకథ, ఒగ్గుకథ, వీధి బాగోతం కళాకారుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, వారికి గుర్తింపు కార్డులతో పాటు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు ఈనెల 25, 26వ తేదీల్లో హైదారాబాద్లో జరగనున్నాయని, విజయవంతం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు కవ్వంపల్లి స్వామి, అందె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
వాతావరణం జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఉక్కపోత ఉంటుంది. వడగాలులు వీస్తాయి.
నేటి నుంచి పీఎంశ్రీ స్కూళ్లలో క్రీడా శిబిరాలుకరీంనగర్స్పోర్ట్స్: విద్యార్థుల వేసవి సెలవులను విజ్ఞానదాయకంగా మార్చేందుకు పీఎంశ్రీ పాఠశాలల్లో నేటి నుంచి ఈ నెల 25 వరకు సమ్మర్ క్యాంప్లు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ పాఠశాలల్లో విజ్ఞాన, క్రీడా శిబిరాల కోసం ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.50వేలు కేటాయించింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న 17 పాఠశాలలకు రూ.8లక్షలు, జగిత్యాలలోని 15 పాఠశాలలకు రూ. 7.5లక్షలు, రాజన్న సిరిసిల్లలోని 9 పాఠశాలలకు రూ.4.5లక్షలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని 8 పాఠశాలలకు రూ.4లక్షలు కేటా యించారు. పీఎంశ్రీతో పాటు సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ ఈ క్యాంప్ల్లో అవకాశం కల్పించనున్నారు. -
11 నుంచి ప్రత్యేక విద్యా వారోత్సవాలు
కరీంనగర్టౌన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు జిల్లాలో ప్రత్యేక విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదుశాతం పెంచడం లక్ష్యంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 11న ఫౌండేషన్ డే, సమ్మర్ క్యాంప్, 12న ఎస్సెస్సీ రిమీడియల్ క్యాంపుల ప్రారంభం, ఇంటర్ రిమీడియల్ క్యాంపుల ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13న పాఠశాల విద్యా అభివృద్ధిపై సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో వర్క్షాప్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్చ నిర్వహించాలన్నారు. 14న జయశంకర్ బడిబాట కార్యక్రమంతో పాటు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 15న లైబ్రరీ డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 16న ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డే కళావైభవం పేరుతో జిల్లావ్యాప్తంగా నిర్వహించాలి. చిత్రలేఖనం, హస్తకళలు, నృత్యం, సంగీతం, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయాలి. 17న విద్యా విజయోత్సవం కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు. -
హలో.. టీజీఎన్పీడీసీఎల్
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు పారదర్శక విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇప్పటికే విద్యుత్ యాప్ ద్వారా సేవలందిస్తున్న సంస్థ మరింత వేగవంతంగా వినియోగదారులను చేరుకునేందుకు ‘వాట్సాప్ చాట్ బాట్‘ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐని జోడిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ ఫీచర్ సేవలందించనుంది. ఎంచుకున్న భాషలో వినియోగదారుడి ప్రశ్నను ఏఐలో విశ్లేషించి సమాచారం ఇవ్వనుంది. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచిన విద్యుత్ సంస్థ కొత్తగా ఏఐ ఆధారిత వాట్సాప్ ఫీచర్ను 24/7 వినియోగంలోకి తెచ్చింది. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో గల 70.39 లక్షల వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు విద్యుత్ సంస్థ సిద్ధమైంది. 8712481489 వాట్సాప్ నంబర్ ద్వారా సేవలు మొదటగా వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్లో 8712481489 సంప్రదించి అవరమైన సేవలను సులభంగా పొందవచ్చు. వినియోగదారుడి ప్రస్తుత బిల్లు మొత్తం, చెల్లింపు తేదీ వివరాలు, చెల్లించిన బిల్లు వివరాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషలో ఫిర్యాదు చేస్తే టికెట్ ఇస్తుంది. ఈ టికెట్ ఆధారంగా ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఉంటున్న ప్రాంతంలోని ప్రస్తుత అంతరాయ స్థితులను తెలుసుకోవచ్చు. చాట్బాట్కు సమాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుని ఏజెంట్కు తరలించి సమస్య పరిష్కరించబడుతుంది. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
నాణ్యమైన సేవలందించడానికే
నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా విద్యుత్ సంస్థ పనిచేస్తోంది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ సంస్థ ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులోకి తెచ్చిన ఏఐ ‘వాట్సాప్ చాట్ బాట్‘ కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు, వినియోగదారులకు అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచారాన్ని పొందవచ్చు. విద్యుత్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని అవాంతరాలు లేని విద్యుత్ను పొందాలి. – రాపెల్లి రవీందర్, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
బీఆర్ఎస్, బీజేపీ బల నిరూపణకు అల్లర్లు
ముత్తారం: బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో శనివారం మంత్రి ఇందిరమ్మ గృహప్రవేశం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను హింసాత్మకం చేస్తున్నారని విమర్శించారు. గూండాయిజం, రౌడీయిజంతో కొట్లాడుకుంటూ ప్రశాంతతను దెబ్బతీశారని ఆరోపించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ మిత్ర పక్షంగా ఉంటూ అధికారం లేకపోవడంతో అల్లర్లు సృష్టిస్తోందని, కేటీఆర్ పేదలకు గూడు ఇవ్వలేక మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బంద్ ప్రశాంతం
కమలాకర్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుషాప్ మూసివేయిస్తున్న బీఆర్ఎస్ నాయకులుటవర్ సర్కిల్లో సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణకరీంనగర్టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ చేపట్టిన కరీంనగర్ బంద్ ప్రశాంతంగా సాగింది. పోలీసులు ముందస్తుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మానకొండూర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, రసమయి బాలకిషన్, చొప్పదండిలో సుంకె రవిశంకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రవీందర్ సింగ్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గంగుల ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గంగుల బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో రోడ్డెక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. పలువురు కార్యకర్తలు కోర్టు చౌరస్తాలో బీజెపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజంతా హైరానా బంద్లో పాల్గొనవద్దని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలకు పిలుపునివ్వడం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బంద్ జరిగి తీరుతుందని ప్రజలు సహకరించాలని కోరడంతో నగరంలో హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో ప్రజలు హైరానా పడ్డారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ప్రతినిధులపై దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి బంద్ను విఫలం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించినా ప్రజలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. గుగ్గిళ్ల జయశ్రీ, తిరుపతినాయక్, బోనాల శ్రీకాంత్, జమీలోద్దీన్, గందె మాధవి, ఎడ్ల అశోక్, మైకెల్ శ్రీనివాస్, సోహన్ సింగ్, లక్ష్మయ్య, శ్యాంసుందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, దిండిగాల మహేశ్, పావని, రుద్ర రాధ, గంటల రేణుక పాల్గొన్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్
● డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్న కేటీఆర్ ● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో రహస్య ఒప్పందాలు చేసుకొని బహిరంగంగా కొట్టుకొన్నట్లు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మండిపడ్డారు. గురువారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ మేయర్, కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకోవడం అందరికీ తెలిసిందేనన్నారు. అవసరమైనప్పుడు సహకరించుకుంటూ.. మరోవైపు తిట్టుకుంటూ.. పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రజాపాలనను అపవాదుకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మత్తులో ఉండి కేటీఆర్ ఇంకా తానే రాజనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. జువెల్లరీ షాప్లో జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. కౌశిక్రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, కాంతాల జగన్రెడ్డి, పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్, ఎండీ తాజొద్దీన్, కొరివి అరుణ్కుమార్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.కరీంనగర్ నుంచి విహార యాత్రకు బస్సులువిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్–2 డిపో నుంచి మైసూర్ మీదుగా ఊటి విహార యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని డిపో–2 మేనేజర్ ఎం.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న మైసూర్లో మైసూర్ ప్యాలెస్, చాముండే టెంపుల్, బృందావన్ గార్డెన్ మొదలగు ప్రదేశాలు చూసి అదేరోజు మైసూర్లో బస చేసి 17న ఉదయం 4 గంటలకు మైసూర్ నుంచి బయలుదేరి ఊటి వెళ్తుందన్నారు. ఊటిలో రెండు రోజులపాటు బస చేసి ఊటిలోని వివిధ ప్రదేశాలు సందర్శించి 18న రాత్రి డిన్నర్ తరువాత బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ప్యాలెస్ సందర్శన అనంతరం బెంగళూరు నుంచి బయలుదేరి 21న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500 టికెట్ ఉంటుందని, భోజనం ఖర్చులు, దర్శనం టికెట్ చార్జీలు ప్రయాణికులే భరించాలని పేర్కొన్నారు. వివరాలకు 7382847727, 7382850707, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మాటలు.. మంటలు.. దాడులు!
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ టౌన్: కేటీఆర్పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలు, దానిని ఖండిస్తూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి చేసిన ప్రతివిమర్శలు భౌతికదాడులకు దారితీశాయి. గురువారం ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండిపై కౌశిక్ చేసిన వివాదాస్పద విమర్శలతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కర్రలతో ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడికి దిగారు. గన్మన్లు కౌశిక్ను లోపల గదికి తరలించి ఆయనపై దాడిని తప్పించారు. కౌశిక్ చిక్కకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయం ఫర్నిచర్ను అక్కడే ఉన్న పాడి కారును బీజేపీ నేతలు ధ్వంసంచేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకురాలు పావనిగౌడ్ ఇంటి మీద దాడిచేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలను అడ్డగించిన బీజేపీ నాయకులు సంపత్గౌడ్ అనే బీఆర్ఎస్ నాయకుడి తలపగులగొట్టారు. అనంతరం పాడికౌశిక్ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు పలువురు బీజేపీ నాయకులు హుజూరాబాద్ తరలేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. మరోవైపు హుజూరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. మొత్తానికి ఇటు కరీంనగర్లో అటు హుజూరాబాద్లో పోలీసుల అప్రమత్తతో ఉద్రిక్త పరిస్థితులను నివారించగలిగారు. ఇంకోవైపు పాడి కౌశిక్పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు సోమిరెడ్డి వేణు ప్రసాద్, కొలిపాక చంద్రమౌళి, కామారపు విశ్వ ప్రసాద్, కనుకయ్య పెద్దపెల్లి జితేందర్ రెడ్డి, శ్రీలేఖ, ఊస కోయిల రమేశ్, వెన్న ఆనందం కోరారు. ఘటనపై ఎవరేమన్నారంటే.. లా అండ్ ఆర్డర్ ఉందా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడినైన తనను చంపేయత్నం జరిగింది. అసలు కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఉన్నాయా? ఈ విషయంలో సీఎం, బండి ఒక్కటయ్యారు. ఎమ్మెల్యేపైనే దాడులు చేస్తే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? దాడులకు భయపడం. నోటికివచ్చినట్లు తిట్టి ఇదేంటని అడిగితే దాడులు చేస్తారా? ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల నిరసనకేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. డ్రగ్స్ టెస్టుకు సంజయ్ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటీఆర్ భయపడుతున్నారని కౌశిక్ మాటల ద్వారా అర్థం అవుతుంది. – ప్రవీణ్రావు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్‘మిస్టర్ కౌశిక్ రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మానుకోకపోతే ఇదేవిధంగా దాడులు కొనసాగుతాయి. తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, డీసీసీ ప్రెసిడెంట్ కరీంనగర్కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా దాడులు చేయించడం సిగ్గుచేటు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి తెగబడి, ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు, కారు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. – జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
సోలార్ విద్యుత్ కేంద్రాలతో ప్రయోజనం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ కరీంనగర్రూరల్: రైతులు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవ డం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ అన్నారు. గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా దుర్శేడ్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకంలో సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించిందన్నారు. సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యుత్ను విక్రయించడం ద్వారా ఆదాయం పొందొచ్చని తెలిపారు. డీఈ రాజం, ఏఈ ప్రదీప్రెడ్డి, ఏవో సత్యం, ఏఈవో స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు. -
ఇసుక లారీలు ఇలా.. వెళ్లేదెలా?
ఇసుక లారీలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీణవంక మండలం కొండపాక గ్రామ మానేరు వాగు శివారులో రెండు ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడ ఇసుక నింపుకొని హిమ్మత్నగర్ గ్రామం మీదుగా రెడ్డిపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో రెడ్డిపల్లి గ్రామ మూలమలుపు వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. లారీ డ్రైవర్లు ఒకరి కంటే మరొకరు పోటీపడి రోడ్డుకు ఇరువైపులా నిలపడం కూడా సమస్యగా మారింది. వీణవంక మండల కేంద్రంలో బస్టాండ్ వెనుక రోడ్డు ప్రమాదకరంగా ఉంది. జనం రద్దీగా ఉండే ఈ ఏరియాలో లారీల ఓవర్ స్పీడ్తో వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. – వీణవంక -
ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్య
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్గా నగరంలోని కట్టరాంపూర్కు చెందిన ఆకుల నర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్గా ఆకుల నర్సయ్య, వైస్చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణగౌడ్, సభ్యులుగా పంజాల శ్రీనివాస్గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావనవేని సంపత్, కే శవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్ల శివకుమార్లను నియమించారు. వీరితో పాటు కరీంనగర్ సింగిల్విండో చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ ఏడీ, నగరపాలకసంస్థ మేయర్ సభ్యులుగా ఉంటారు. పంతం నెగ్గించుకున్న ‘వెలిచాల’ ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్య నియామకంతో కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు తన పంతం నెగ్గించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన అనంతరం కరీంనగర్లో పట్టుపెంచుకోవడానికి వెలిచాల తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏఎంసీ చైర్మన్గా తన మద్దతుదారుడు ఆకుల నర్సయ్య పేరును అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ పేరును రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తుమల్లేశం సూచించారు. దీంతో ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో అనే ఉత్కంఠ కొంతకాలంగా కాంగ్రెస్ వర్గీయుల్లో నెలకొంది. చివరకు ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్యను నియమించడంతో వెలిచాల రాజేందర్రావు తనపంతం నెగ్గించు కొన్నట్లయింది. కాగా.. చైర్మన్గా నియమితులైన నర్సయ్యను నగరంలోని ఆయన కార్యాలయంలో రాజేందర్రావు సన్మానించారు. -
అభివృద్ధికి యూసీఎఫ్ గొప్ప అవకాశం
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని సుందరంగా మార్చేందుకు అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం గొప్ప అవకాశమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం మేయర్ శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ యూసీఎఫ్ స్కీంలో ప్రవేశం, కేంద్ర,రాష్ట్ర, నగరపాలక సంస్థ వాటాలు, పనుల అమలుపై సభ్యులకు వివరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ త్వరలో ప్రకటించనుండడంతో ఈ పథకం లో కరీంనగర్ నగరపాలక సంస్థ ను చేర్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.1150 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్దం చేసి పంపిస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతామన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ వైద్యుల అంజన్కుమార్ మాట్లాడుతూ... యూసీఎఫ్ స్కీం విజయవంతం కావాలంటే మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పాలకవర్గానికి వారధిగా ఉండాల్సిన అధికారులు నిబంధనల సాకుతో ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విధానం మార్చుకోవాలన్నారు. అనంతరం రూ.1150 కోట్ల ప్రతిపాదనలను ఆమోదిస్తూ నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్రావు, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, ఎస్ఈ రాజకుమార్, ఈఈ సంజీవ్ కుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆగ్రహం
గంగాధర: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకుందామంటే జరుగుతున్న జాప్యం, అధిక తూకం, మిల్లుకు వెళ్లిన తరువాత మరోసారి కోతలు విధించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదన్నారు. కేంద్రం ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు రెండు లారీలు మాత్రమే తూకం వేశారని అన్నారు. సంచికి 41 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా.. 42.200 కిలోల తూకం వేస్తున్నారని, మిల్లుకు వెళ్లిన తరువాత మరో కిలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో రైతులు ఆందోళన విరమించారు. మంగపేట రైతులు.. ధాన్యం తూకం వేయడంలో జాప్యం జరుగుతోందని, కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలు కరువయ్యాయని మంగపేట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని, తూకం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలోని మంగపేట స్టేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ రజిత సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
తాలు, తరుగు పేరిట కొర్రీలొద్దు
కరీంనగర్ అర్బన్: తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే సహించమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, రానున్న 15 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. సమస్య ఎక్కువగా ఉన్న కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లుపై ముందుగా దృష్టి సారించాలని తెలిపారు. స్థానిక హమాలీలకు ప్రాధాన్యం ఇస్తూ వారితో మాట్లాడి హమాలీ కొరత పరిష్కరించాలని తెలిపారు. అవసరమైతే నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుండి హమాలీలను మాట్లాడుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. ధాన్యం రవాణా కోసం మరో 200 అదనపు వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కొన్న ధాన్యాన్ని మిల్లులు, స్టోరేజీ కేంద్రాలకు తరలించాలన్నారు. రైతులకు చెల్లింపు ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. కలెక్టర్ చిత్ర మిశ్రా మాట్లాడుతూ... రానున్న 15 రోజులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్ బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.రజనీకాంత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పిలుపు
కరీంనగర్టౌన్: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ ఈనెల 9న శనివారం కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని... ఈ ఘటనతో కరీంనగర్ పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందన్న విషయం స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని కరీంనగర్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ పట్టణ బంద్కు పిలుపునిస్తున్నామని కరీంనగర్ నగర ప్రజలు, వ్యాపార వర్గాలు, యువత, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
సౌదీలో మోసపోయిన జగిత్యాల యువకుడు
● రక్షణ కోసం ప్రజావాణిలో తల్లి ఫిర్యాదుజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లికి చెందిన దాసరి అరవింద్ (23) ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ ఎడారిలో గొర్రెల కాపరిగా అష్టకష్టాలు పడుతున్నాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగమని చెప్పి రూ. 90 వేలు తీసుకున్న ఏజెంట్ అతడిని ఎడారిలో వదిలేశాడు. కనీస వసతులు, తిండి లేక అరవింద్ పడుతున్న కష్టాల వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్చార్జి జి.చిన్నారెడ్డి.. బాధితుడిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి, మోసం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని ఎన్నారై విభాగం అధికారులను, జగిత్యాల ఎస్పీని ఆదేశించారు. -
నగర బంద్ విజయవంతం చేయండి
కరీంనగర్టౌన్: దాడులకు ప్రతి దాడులు తప్పవని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో మాట్లాడారు. బీజేపీ దాడులకు నిరసనగా శనివారం కరీంనగర్ నగర బంద్కు ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య ఇతరాత్ర సంఘాలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ గూండాలను ప్రోత్సహిస్తే దేశ సైనికులకు ఏ సందేశం ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ లక్ష్యం కేసీఆర్, కేటీఆర్ను బద్నాం చేయడమే అని విమర్శించారు. ప్రతీ రాజకీయ కార్యక్రమానికి పోలీసులు కరీంనగర్ను మరో బిహార్లా మార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. సంజయ్ వ్యాఖ్యలు దాడి ఘటనను సమర్థించినట్లు ఉన్నాయని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలు కూడా అలాగే ఉండటంతో రెండు పార్టీల వైఖరి ఒకటేననే అనుమానం కలుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతిపక్షాలపై దాడులు చేయించడం జరుగుతోందని విమర్శించారు. నాయకులు చల్లా హరిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్, రుద్ర రాజు, జమీల్, ప్రశాంత్రెడ్డి, పావనిగౌడ్, చిట్టీ రాజేందర్రావు, తిరుపతి నాయక్, వసంతరావు, ఆరే రవి తదితరులున్నారు. ప్రజలు సహకరించాలి కరీంనగర్టౌన్: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యం, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కరీంనగర్ చరిత్రలో ప్రథమంగా తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం కరీంనగర్ నగర బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్కు మద్దతు ఇవ్వాలని, బీఆర్ఎస్ శ్రేణులందరూ శాంతియుతంగా పాల్గొని సహకరించాలని కోరారు. -
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
కొన్నేళ్లుగా నిర్లక్ష్యపు శిథిలాల కింద చిక్కుకున్న జిల్లాలోని ప్రభుత్వ బడులు ప్రస్తుతం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పొచ్చు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు విద్యాశాఖపై ప్రత్యేక దృష్టిసారించడమే కాకుండా అత్యధిక నిధులు కేటాయిస్తుండడంతో సర్కార్ బడి గాడిలో పడింది. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నిధులు కేటాయిస్తుండడంతో విద్యాశాఖ తీరులో గణనీయమైన మార్పు జరుగుతుంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత సదుపాయాలు, బోధనలో మార్పులకు చిహ్నంగా నిలుస్తున్న డిజిటల్ తరగతులు, క్రీడలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్న దృక్పథంలోకి ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయి. –కరీంనగర్టౌన్...●తల్లిదండ్రుల్లో కొన్నేళ్లుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా జిల్లాలోని ప్రభుత్వ బడులు కూడా ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ప్రయోజనంగా నిలిచినట్లు జిల్లా విద్యాశాఖ గణంకాలు చెబుతున్నాయి. సన్నబియ్యంతోమధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు బడుల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పౌష్టికాహారంగా వారానికి మూడు కోడిగుడ్లు అందించడం, కూరల్లో గతేడాది నుంచి నాణ్యత మెరుగుపడింది. ఉచిత పుస్తకాలు, దుస్తులు ప్రభుత్వ బడిలో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా పుస్తకాలు అందజేస్తుంది. విద్యార్థులకు ఏటా రెండు జతల దుస్తులు, దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి రవాణా భత్యం కూడా అందజేస్తుంది. ఉపాధ్యాయుల కృషి మార్గదర్శకం విద్యార్థుల ప్రవేశాల కోసం పలు ప్రభుత్వ స్కూళ్ల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అంకితభావాన్ని ప్రదర్శిస్తూ వినూత్న తరహాలో చేపడుతున్న చర్యలు మిగతా ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు విద్యను అందించి మెరుగైన ఫలితాలు సాధిస్తూనే పేద, మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి. జిల్లాలోని సర్కార్ బడుల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా పాలకులు, అధికారులు పలు రకాల వసతులను గతానికి భిన్నంగా కల్పిస్తున్నారు. తరగతి గదిలో రోజంతా కూర్చున్న విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ప్రైవేటును పోలిన రీతిలో డ్యూయల్ డెస్క్లను జిల్లాలోని అన్ని స్కూళ్లకు విద్యాశాఖ సరఫరా చేసింది. తాగునీటి వసతి, ఆటలాడే విశాలమైన క్రీడా మైదానాలు తదితర వసుతులు కల్పిస్తున్నారు. కాగా, వసతులు, పాఠశాల నిర్వహణ, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, ఆటల పరికరాల కోసం ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తుండగా వాటి వినియోగంపై నిర్లిప్తత లేకుండా పోతుంది.ప్రభుత్వ బడుల్లో గతంతో పోలిస్తే బోధనలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. ఐదేళ్లుగా జిల్లాలోని విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్కు దీటుగా సాధిస్తున్న ఫలితాలను నిదర్శనంగా తీసుకోవచ్చు. వివిధ పాఠ్యాంశాల్లో మంచి అవగాహన కలిగి బోధన నైపుణ్యాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని చదువులో ముందుకు నడిపిస్తున్నారు. -
మొక్కజొన్న పంట దగ్థం
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కౌలు రైతు గోపు శ్రీనివాస్ కు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. పొరుగు రైతు కొయ్యకాలుకు నిప్పంటించడంతో నిప్పులు ఎగిరిపడి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మొక్కజొన్న పంట కాలిపోయింది. సుమారు ఎకరన్నర పంట మంటల్లో కాలిబూడిదైనట్లు, సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు రోదించాడు. గంజాయి విక్రేత రిమాండ్సిరిసిల్ల అర్బన్: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు. వేములవాడకు చెందిన భరత్కుమార్ తంగళ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారంతో స్థానిక ఎస్సై ఉపేంద్రచారి తన సిబ్బందితో కలిసి దాడి చేశాడు. అతని వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి వేములవాడ, సిరిసిల్ల, తంగళ్లపల్లి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
కరీంనగర్స్పోర్ట్స్: దేశ భవిష్యత్, అభివృద్ధి ప్రణాళికలను నిర్ణయించేందుకు జనాభా లెక్కింపు అత్యంత కీలకమైన ప్రక్రియ అని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బల్దియా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు జరిగిన 2కే రన్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. 2011లో జనాభా గణన జరిగిందని, అప్పటి నుంచి దేశంలో అనేక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రతీ పౌరుడు తమ వివరాలను నమోదు చేయించుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలు సొంతంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 11 నుంచి జనాభా లెక్కింపు ప్రారంభమవుతుందని, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు ఇళ్లకు వచ్చి జనాభా లెక్కల వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలు కచ్చితమైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. సుడా చైర్మన్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా లెక్కింపు చాలా ప్రధానమైందని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి 1 నుంచి 10వతరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.భాస్కర్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన 6 నుంచి 14 ఏళ్లున్న అంధ బాలబాలికలు ప్రవేశానికి అర్హులని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన వారికి ప్రవేశంలో ప్రాధాన్యముంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9701190127, 9440338424 నంబర్లలో సంప్రదించాలన్నారు.ఒంటరితనం భరించలేక ట్రాన్స్జెండర్ ఆత్మహత్యగోదావరిఖని: ఒంటరితనం భరించలేక ట్రాన్స్జెండర్ అరారి రేవతి(34) గురువారం అర్ధరాత్ధ్రాత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాంనగర్లో నివాసం ఉంటున్న రేవతి పదేళ్ల క్రితం ట్రాన్స్జెండర్లలో కలిసిపోయింది. మూడేళ్ల క్రితం సర్జరీ చేయించుకుంది. అప్పటినుంచి యాచన చేస్తూ జీవిస్తోంది. ఈక్రమంలో మద్యానికి బానిసైంది. ఒంటరితనం వేధించడంతో భరించలేక జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఇంట్లోని పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుంది. ఆమె అన్న ఆరారి రాజు ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేకున్నారు. నూకలమర్రిలో వివాహిత..వేములవాడరూరల్: తల్లిగారింటి నుంచి వచ్చిన కొద్దిసేపటికే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో శుక్రవారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపురం గ్రామానికి చెందిన గుగులోతు దివ్య(26)ను వేములవాడరూరల్ మండలం నూకలమర్రికి చెందిన గుగులోతు వినోద్కు ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. భర్త వినోద్ బతుకుదెరువు కోసం 16 నెలల క్రితం గల్ఫ్ దేశం వెళ్లాడు. నూకలమర్రిలో ఉంటున్న దివ్య 15 రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తండ్రి అత్తగారింటిలో దింపి వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే దివ్య తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఎస్సై చల్లా వెంకట్రాజం విచారణ చేపడుతున్నారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. రూ.3.50కోట్లకు వ్యాపారీ కుచ్చుటోపివేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓ వ్యాపారి రూ.3.50కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నివసించే ఓ వ్యాపారీ రూ.7.56కోట్ల వరకు అప్పులు చేశారు. ఇందులో రూ.4.77 లక్షల వరకు అప్పు తిరిగి చెల్లించాడు. మిగిలిన రూ.3.51 కోట్లకు ఐపీ పెట్టారు. బాకీ ఇచ్చిన 39 మందికి ఐపీ నోటీసులు పంపారు. వారం రోజులుగా వ్యాపారీ కనిపించడం లేదు. ఈక్రమంలోనే బాకీ ఇచ్చిన వారికి ఐపీ నోటీస్లు అందుతుండడం కలకలం రేపింది. పెద్ద మొత్తంలో ఐపీ దాఖలు చేయడంతో వేములవాడలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడి అరెస్ట్బుగ్గారం: మండలంలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చిన్నాపూర్కు చెందిన ఎనగంటి గంగయ్య తన చికెన్ సెంటర్లో దొంగతనం జరిగి రూ.12,500 ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేయగా వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి గట్టు రాజేందర్ వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. గతంలో బుగ్గారం శివాలయంతో పాటు మరో రెండు దొంగతనాల కేసుల్లో నిందితుడికి ప్రమేయం ఉందని తెలిపారు. రూ.5,800 నగదు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
విద్యానగర్(కరీంనగర్): కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లుతోపాటు ప్రయాణికులకనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగడిమర్రి సోలమన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో కరీంనగర్ జోన్ పరిధిలోని రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రీజియన్ల పనితీరుపై చర్చించారు. అన్ని బస్ స్టేషన్లలో చల్లని తాగునీటి వసతి కల్పించి తగినన్ని బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం రీజనల్ మేనేజర్లు ఎస్.భవానీప్రసాద్, డి.విజయభాను, టి.జ్యోత్న్స, ఎ.సరిరాం, డిప్యూటీ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, ఎస్.మధుసూదన్, భానుకిరణ్, డి.శ్రీహర్ష, ఎస్.రామయ్య, పి.మల్లయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యదర్శి కె.యుగంధర్ పాల్గొన్నారు. -
ఉపాధి పొడిగింపు
కరీంనగర్రూరల్: ఉపాధి హామీ పథకాన్ని మే నెలాఖరు వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరామ్జీ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాల్సి ఉండగా గైడ్లైన్స్ ఖరారు కాకపోవడంతో పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. గత నెలలో ఉపాధి హామీలో చేపట్టిన పనులనే ఈ నెలాఖరువరకు కొనసాగించాలని ఆదేశాలిచ్చారు. జిల్లాకు 4.76లక్షల పనిదినాలు... ఉపాధి పథకంలో ప్రతీ గ్రామం నుంచి కనీసం 50 మంది కూలీలకు పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాకు ఏప్రిల్లో మొత్తం 4,59,612 పనిదినాలు కేటాయించగా నెలాఖరు వరకు 2,74,110 పనిదినాలు పూర్తి చేశారు. మే లో 4.76 లక్షలను కేటాయించగా అన్ని గ్రామాల్లో కూలీలు ఎక్కువ సంఖ్యలో పనులకు వచ్చేలా మండలాలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండు నెలలకు సంబంధించి మొత్తం 6.92లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.63లక్షల పనిదినాలను పూర్తి చేశారు. కరీంనగర్ మండలంలో మొత్తం 42,112 పనిదినాలు లక్ష్యం కేటాయించగా ఇప్పటివరకు 13,592 పనిదినాలు పూర్తిచేసినట్లు ఉపాధి అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. పంచాయతీల వారీగా కూలీల హాజరు పెంచేందుకు లక్ష్యాలను పెట్టడంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లకు రోజువారీగా నగదు బహుమతులను అందిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో ఉపాధి పనులకు కూలీలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. -
క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు..
ఐపీఎల్ మ్యాచ్లను టీవీల్లో చూస్తున్న చిన్నారులు తమను తాము విరాట్ కోహ్లి.. రోహిత్శర్మ.. ఇషాన్ కిషన్.. మార్ష్.. బుమ్రాలా పోల్చుకుంటూ గల్లీల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జిల్లా కేంద్రంలోని కాలేజీ మైదానానికి బ్యాట్లు, గ్లౌజ్లు, హెల్మెట్లు, ప్యాడ్లతో వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు క్రికెట్ శిక్షణ శిబిరం సాగుతోంది. 35 మంది విద్యార్థులు ప్రస్తుతం శిక్షణ పొందుతుండగా.. మరింత మంది వచ్చేందుకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు.● సిరిసిల్లలో క్రికెట్ క్యాంపు ● వేసవి సెలవుల్లో శిక్షణ ● ఉదయం.. సాయంత్రం ప్రాక్టీస్సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ బ్యాటింగ్ ప్రాక్టీస్సిరిసిల్ల: ఇన్నాళ్లు పుస్తకాల బ్యాగులు.. టిఫిన్ బాక్స్లతో కనిపించిన చిన్నారులు సెలువులు మొదలుకావడంతో ఇష్టమైన క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. చేతిలో బ్యాట్లు.. కాళ్లకు ప్యాడ్లతో ప్రొఫెషనల్ క్రికెటర్లను మరిపించేలా శిక్షణ తీసుకుంటున్నారు. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్లలో ట్రెయినింగ్ పొందుతున్నారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ శిబిరం కొనసాగుతోంది. చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతున్న క్రికెట్ శిక్షణ శిబిరంపై సాక్షి కథనం. -
అన్నదాత సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్ అర్బన్: అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని, రైతులే తమకు తొలి ప్రాధాన్యతని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. నూతనంగా నియామకమైన మార్కెట్ పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. వైస్ చైర్మన్గా నియమితులైన సుధగొని లక్ష్మీనారాయణగౌడ్ పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్లుగా పంజాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసల శంకర్, తాపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేని సంపత్, కాశవేణి భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్ల శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ విముఖత కరీంనగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నియామకమైన సుధగొని లక్ష్మీనారాయణగౌడ్ తనకు ఆ పదవి వద్దని స్పష్టం చేస్తున్నారు. లాబీయింగ్ ద్వారా వెలిచాల రాజేందర్రావు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. కాగా, వారం క్రితం లక్ష్మీనారాయణగౌడ్ చైర్మన్గా ప్రతిపాదనలు పంపగా మూడు రోజుల క్రితం ఆకుల నర్సయ్య చైర్మన్గా మార్కెట్ కమిటీ నుంచి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఆకుల నర్సయ్య వెలిచాల రాజేందర్రావు వర్గం కాగా లక్ష్మీనారాయణ మరో వర్గం. ఈ క్రమంలో రాజేందర్రావు ప్యానెల్కే చైర్మన్ పదవి దక్కగా లక్ష్మీనారాయణకు వైస్ చైర్మన్ ఇవ్వగా ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. -
యంగ్ ఇండియా సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్
● రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహణ ● ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణకరీంనగర్స్పోర్ట్స్: వేసవి సెలవుల్లో విద్యార్థులను క్రీడల వైపు మళ్లించి, వారిలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) క్రీడా శిబిరాలకు శ్రీకారం చుట్టింది. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్– షేపింగ్ యంగ్ ఇండియా చాంపియన్స్–2026 పేరుతో శిబిరాలను నిర్వహించనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11 నుంచి ఆయా జిల్లాల కేంద్రాలు, మండల కేంద్రాల్లో శిబిరాలు ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, కరీంనగర్లో నగర పాలక సంస్థ, క్రీడాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో పాల్గొనే చిన్నారులకు పాలు, గుడ్డు, అరటిపండు ఇస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏయే క్రీడల్లో శిక్షణ శిబిరాలు జరుగనున్నాయి, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి.. తదితర వివరాలతో కథనం. ఉమ్మడి జిల్లాలో నిర్వహించే క్రీడలివే.. కరీంనగర్: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, వాలీబాల్, యోగా, జూడో, రెజ్లింగ్. రాజన్న సిరిసిల్ల: కబడ్డీ, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, వాలీబాల్, కరాటే, యోగా, టేబుల్ టెన్నీస్, బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్బాల్, ఆర్చరీ, క్యారమ్, చెస్, ఖోఖో, నెట్బాల్. పెద్దపల్లి: ఫుట్బాల్, ఖోఖో, తైక్వాండో, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్. జగిత్యాల: వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, తైక్వాండో, అథ్లెటిక్స్, కరాటే. శిక్షణ వేళలు: ఉదయం 6 నుండి 9, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు. రిజిస్ట్రేషన్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ( https:// satgasc. telangana. gov. in).అర్హత: 10 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సువారు అర్హులు. ఫీజు: ఆన్లైన్లో ఎంచుకున్న క్రీడ, వేదికను బట్టి ఫీజు వివరాలు మారుతూ ఉంటాయి. -
ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతి
జూలపల్లి: పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్లో సైకిల్పై వెళ్తున్న సుంకె గంగయ్య(64) ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గంగయ్య (64) గురువారం బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆకుల సందీప్ ద్విచక్రవాహనంతో అతివేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో గంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత పెద్దపల్లి, ఆ తర్వాత కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి అల్లుడు మార్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. గుర్తు తెలియని వ్యక్తి.. జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఓ వ్యక్తి(40) మృతి చెంది కనిపించాడని టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పదిహేను రోజులుగా లేబర్ పనులు చేసుకుంటూ, స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాలో ఉంటున్నాడని పేర్కొన్నారు. వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిఓ భద్రపరిచామన్నారు. బంధువులెవరైనా ఉంటే జమ్మికుంట టౌన్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఆయన కోరారు. బైక్ను ఢీకొని ఒకరు.. సిరిసిల్ల: కారుతో అతివేగంగా బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సిరిసిల్ల రెండో బైపాస్రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్కు చెందిన అలువాల అంజయ్య(62) సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తుండేవాడు. శుక్రవారం అదే పనిపై బయటకు వెళ్లాడు. స్థానిక రగుడు చౌరస్తా సమీపంలో డివైడర్ నుంచి యూటర్న్ తీసుకుంటుండగా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి దేవరాజు కారులో వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో బైక్పై వెళ్తున్న అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వరదకాలువలో గుర్తు తెలియని మృతదేహం మల్యాల: మల్యాల మండలం నూకపల్లి శివారులోని వరదకాలువలో నీటిపై తేలియాడుతూ గుర్తు తెలియని శవం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సీఐ నీలం 8712656818, ఎస్సై నరేశ్కుమార్ 8712656830 నంబర్లో సంప్రదించాలని ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. -
ఏఎంసీ రేటు రూ.3.50 కోట్లు
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విలువ రూ.3.50 కోట్లు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ సంచలన ఆ రోపణలు చేశారు. ఏఎంసీ చైర్మన్ విషయంలో జరిగిన అన్యాయానికి నిరసనగా, తనకు ఇచ్చిన వైస్ చైర్మన్, మానకొండూరు బ్లాక్కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో మాట్లాడారు. 35 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న తనకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యానారాయణ, మే డిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, అర్బన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ సిఫారసు చేశారని, కానీ, పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆకుల నర్సయ్యకు వెలిచాల రాజేందర్రావు పదవి కట్టబెట్టారన్నారు. మున్సిపల్ ఎన్నికల సమసయంలో రూ.3 కోట్లు, ఏఎంసీ చైర్మన్ కోసం రూ.50 లక్షలు మొత్తం రూ.3.50 కోట్లు ఇచ్చారనే ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చారని విమర్శించారు. డైరెక్టర్లుగా నియమించిన వారిలో కేవలం ఒక్కరు మా త్రమే కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, పార్టీతో సంబంధం లేని ఇతర పార్టీ నాయకులకు డైరెక్టర్ పదవులు ఇచ్చారని ఆవేదన చెందారు. వెలిచాల రాజేందర్రావును అసెంబ్లీ ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తేనే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ జోక్యం చేసుకొని ఏఎంసీ కమిటీని రద్దు చేసి, పార్టీకి కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలతో కొత్తగా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రెడ్డిగాని రాజు, బుర్ర కనుకయ్యగౌడ్, తిరుపతి, కిరణ్, తిరుపతిరెడ్డి, వరాల అనిల్, రాజమల్లు పాల్గొన్నారు. -
సాక్షితోనే ఉత్తమ ఫలితాలు
కథలాపూర్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అనేకమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. విద్యార్థుల విజయంలో శ్రీసాక్షిశ్రీ యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ ఎంతగానో దోహదపడిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ‘సాక్షి’ మెటీరియల్తో ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభతరంగా మెటీరియల్.. పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలపై కొంత ఆందోళన ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు ‘సాక్షి’ దినపత్రిక ప్రముఖ విద్యానిపుణులు, సీఎస్ఆర్ సంస్థ సౌజన్యంతో అత్యంత సులభమైన పద్ధతిలో మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించడంతో వారు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు ప్రభుత్వం, ప్రైవేట్ హైస్కూళ్లకు చెందిన అనేకమంది విద్యార్థులకు దాతల సాయంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతోపాటు ‘సాక్షి’ పదోతరగతి పాఠ్యాంశాలపై సమగ్ర సమాచారం, మోడల్ పేపర్లను ప్రచురించింది. దీంతో విద్యార్థులు గతంకంటే మెరుగైన ఫలితాలను సులభంగా సాధించారు. టెన్త్ విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీమెటీరియల్ వినియోగించుకున్న విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి డిసెంబర్లో సిలబస్ పూర్తి చేశారు. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో సాక్షి మెటీరియల్ గ్రూప్లవారీగా చర్చించుకునేందుకు ఉపయోగపడింది. మరింత ఫోకస్ చేయడంతో సైన్స్లో 93 మార్కులు సాధించా. సరైన సమయంలో కీలక సబ్జెక్టుల మెటీరియల్ ఇచ్చినందుకు సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – గాజుల లిఖిత, జెడ్పీ హైస్కూల్, సిరికొండ -
మంచి మార్కులు సాధించగలిగా
ఉపాధ్యాయుల కృషితో మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. పరీక్షలకు రెండు నెలల ముందు ఇచ్చి న సాక్షి మెటీరియల్ కటింగ్ చేసి తరగతి గదిలో విద్యార్థులందరం చర్చించుకునేవాళ్లం. గణితం, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ స్పెషల్ మెటీరియల్ మాకు మరింత ప్రోత్సాహం లభించింది. సాక్షి మెటీరియల్ వల్ల సోషల్ స్టడీస్లో 96 మార్కులు సాధించా. – ఉత్కం నవిత, జెడ్పీహైస్కూల్, చింతకుంట ప్రతి టాపిక్ నుంచి పరీక్షల్లో రాయడానికి కష్టతరమైన వాటిని సులభతరమైన రీతిలో నమూనా ప్రశ్నలు విశ్లేషించి అందించారు. తద్వారా ఫిజికల్ సైన్స్లో ప్రతి ప్రశ్నకూ విభిన్న కోణాల్లో సమాధానం రాసేవిధంగా విద్యార్థులకు దోహదపడింది. విద్యార్థుల్లో సాక్షి మెటీరియల్తో భయం పోయింది. పరీక్షల్లో సమయాన్ని సమన్వయం చేసుకునేలా ఉపయోగపడింది. – వంతడుపుల రవికుమార్, ఫిజికల్ సైన్స్ టీచర్, జెడ్పీ హైస్కూల్, సిరికొండ సోషల్ సబ్జెక్ట్ ఎంత చదివినా పరీక్షల వేళ ఏదో వెలితిగా ఉందని విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. తరగతి గదిలో మేం విశ్లేషించి బోధించాం. సాక్షి మెటీరియల్లో పట్టికల విశ్లేషణ, మ్యాప్ పాయింటింగ్ విద్యార్థులకు సలువుగా అర్థమయ్యేలా ఉంది. విద్యార్థులు వ్యాసరూప, లఘు ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాసేందుకు సహకరించింది. – ఉశకోల విశ్వనాథం, సోషల్ టీచర్, జెడ్పీ హైస్కూల్, చింతకుంట -
అల్ట్రాటెక్ ఎన్నికల్లో ‘మల్క’ విజయం
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్ల బసంత్నగర్లోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో గురువారం జరిగిన పర్మినెంట్ కార్మికసంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు, కన్నాల గ్రామ సర్పంచ్ మల్క రామస్వామి ఫ్యానెల్ ఘన విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన పోరులో అధ్యక్ష అభ్యర్థి రామస్వామి ప్రత్యర్థి బయ్యపు మనోహర్రెడ్డిపై 76 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా రమేశ్ మౌర్య, పోతుల ప్రసాద్పై 88ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 307 ఓట్లకు అన్నీ పోలయ్యాయి. వీటిలో ఒక పోస్టల్ బ్యాలెట్ ఉండగా 1 ఓటు చెల్లకుండా పోయింది. ఒక ఓటు మిస్సింగ్ అయింది. రామస్వామికి 167, మనోహర్రెడ్డికి 91 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థి నల్ల మనోహర్రెడ్డికి 48, ప్రధాన కార్యదర్శి జేసీబీ శ్రీనివాస్కు 48 ఓట్లు వచ్చాయి. ఈసందర్భంగా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడారు. కార్మికుల సమష్టి విజయమని అన్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, మనాలిఠాకూర్ సహకారంతో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం మద్దతుదారులతో కలిసి బసంత్నగర్లో విజయోత్సవ ర్యాలీ తీశారు. ఉత్కంఠ పోరులో 76 ఓట్ల మెజార్టీతో గెలుపు -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
● ఇంటి పర్మిషన్కు రూ.20 వేలు డిమాండ్ ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి గురువారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐ తిరుపతి తెలిపిన వివరాలు.. పొత్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పర్మిషన్ కోసం కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈనేపథ్యంలో ఇంటి పర్మిషన్కు కార్యదర్శి రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా రూ.15వేలు క్యాష్ ఇచ్చాడు. మిగతా రూ.5వేలు ఫోన్ పే చేశాడు. అయినా పర్మిషన్ ఇవ్వకుండా దరఖాస్తును కార్యదర్శి రిజెక్టు చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యదర్శి డబ్బు తీసుకుంటుండగా పట్టుకొని రిమాండ్కు పంపినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఇద్దరు దొంగల అరెస్టు
కరీంనగర్రూరల్: మద్యానికి బానిసైన ఇద్దరు ఆటోడ్రైవర్లు దొంగలుగా మారి గతేడాది నుంచి దొంగతనాలకు పాల్పడుతుండగా గురువారం కరీంనగర్రూరల్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మకల్, చింతకుంటకు చెందిన ఆటోడ్రైవర్లు ఎండీ మహ్మద్, మహ్మద్ మెయిన్లు మద్యానికి బానిసై దొంగతనం చేసేందుకు ఆటోలో గతేడాది జూలైలో చొప్పదండికి వెళ్లి ఓ ఇంటి తాళం పగులకొట్టారు. బీరువా నుంచి బంగారం, వెండిని దొంగతనం చేశారు. ఈనెల 5న రాత్రి విజయ్నగర్కాలనీ, సిటిజన్కాలనీ, బొమ్మకల్లోని తాళాలు వేసి ఉన్న నాలుగిళ్లల్లో బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. కరీంనగర్లో కొంత బంగారం విక్రయించి జల్సా చేసిన అనంతరం మొబైల్ఫోన్లను నాందేడ్లో విక్రయించేందుకు గురువారం కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఆటోలో చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకొని విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. ఇద్దరి నుంచి సుమారు 7.3 తులాల బంగారం, 90 గ్రాముల వెండి, 2 సెల్ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. బంగారం విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని, ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రూ.10లక్షల విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం -
జేసీబీ తగిలి ఒకరి దుర్మరణం
పెగడపల్లి: వ్యవసాయ భూమి చదును చేస్తుండగా జేసీబీ బకెట్ తగిలిన ఓ రైతు మృతి చెందిన ఘటన పెగడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన ఎనగందుల రాములు (57)కు పెగడపల్లి మండలం లింగాపూర్ శివారులో వ్యవసాయ భూమి ఉంది. జేసీబీతో బండరాళ్లు తొలగిస్తున్న క్రమంలో రాములుకు జేసీబీ బకెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని జగిత్యాల అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. డ్రైవర్ ఉప్పుల అఖిల్ అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా జేసీబీని నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని, రాములు భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు..● ఒకరికి గాయాలు వీణవంక: వీణవంక మండలం వల్భాపూర్ గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం కృష్ణకాలనీలో ఉంటున్న మైస సురేందర్(52), మారపెల్లి దేవేందర్(50)తోపాటు మరొకరు ద్విచక్ర వాహనంపై చల్లూరు నుంచి జమ్మికుంటకు వెళ్తున్నారు. వల్భాపూర్ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మైస సురేందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మారపెల్లి దేవేందర్ను 108లో జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సురేందర్ కరీంనగర్లోని ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు. జమ్మికుంట నుంచి వీణవంక వరకు ఫోర్లైన్ ఉండగా.. ఒకవైపు రైతులు ధాన్యం ఆరబోశారు. ఒక సైడ్ నుంచే వాహనాలు వెళ్తున్నాయి. ఈక్రమంలో ఎడ్లబండిని గమనించక ఢీకొనడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. కొలనులో పడి యువకుడి మృతిగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయ ఆవరణలోని కొలనులో ప్రమాదవశాత్తు పడిపోయి యువకుడు మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అచ్చనూర్కు చెందిన నీరడి వినయ్(16) సిద్దిపేటలోని అమ్మమ్మ దగ్గర ఉంటాడు. ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టి మల్లారెడ్డిపేటలోని ఆలయ సందర్శనకు మిత్రులతో వచ్చాడు. కొలనులో స్నానం చేస్తుండగా అందులో పడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
నా బాల్యం
● పంచ్ పడాల్సిందే.. ● ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ● వేములవాడలో కరాటేకు క్రేజీకరాటే అంటే కళ కాదు. మన శరీరాన్ని, మనసును క్రమశిక్షణగా ఉంచే మార్గం. బాలికలు స్వీయరక్షణకు తప్పకుండా శిక్షణ తీసుకోవాలి. వేసవిలో కరాటే శిక్షణతో స్వీయరక్షణ కలుగుతుంది. – కె.ఆయుశ్రీ, వేములవాడ ఈ శిక్షణకు వస్తుండడంతో ఫిట్నెస్పై అవగాహన కలిగింది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతున్నాను. ఫిట్నెస్తోపాటు స్టడీలోనూ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రతీ బాలిక తప్పకుండా కరాటే నేర్చుకోవాలి. – కె.అవంతిక, వేములవాడ ఆత్మరక్షణ అంటే కేవలం శారీరకంగా పోరాడటం కాదు. అది ఒక మనోభావం. దాడులకు గురికాకుండా ముందుగా అప్రమత్తంగా ఉండే చైతన్యం. ఇప్పటి సమాజంలో బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఎంతో అవసరం. ఈ శిబిరంలో పాల్గొంటున్న చిన్నారులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.ఎ.మన్నాన్, కరాటే మాస్టర్ కరాటే కేవలం ఆట కాదు. కరాటే యోగాలా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కోచ్ బాగా నేర్పిస్తున్నారు. ఉచితంగా నేర్పించడం బాగుంది. అమ్మాయిలు ఆత్మరక్షణకు ఇలాంటి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. – పి.శివగౌతమ్, వేములవాడ సెలవుల్లో ఇంట్లో కూర్చుని బోరు కొట్టకుండా ఈ కరాటే క్లాసులకు వస్తున్నాను. ఇక్కడ పంచ్లు, కిక్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా బలంగా తయారవుతున్నాను. ఏదైనా ఆపద వస్తే ఎదురించగలననే ధైర్యం కలుగుతుంది. కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. – బి.క్రాంతికుమార్, వేములవాడ వేములవాడ: వేసవి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేవాడినని.. సెలవులన్నీ రోజులు ఆటలతోనే గడిచేవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన చిన్ననాటి వేసవి సెలవుల ముచ్చట్లు వివరించారు. ఆయన మాటల్లోనే.. రుద్రంగిలోని మా అమ్మమ్మ పుప్పాల మల్లమ్మ–నర్సయ్యల ఇంటి కాడి నుంచి 1971లో బండమీది పెద్దబడిలో చేరాను. స్కూల్కు దోస్తు లక్ష్మీనారాయణ, బావ శ్రీనివాస్లతో కలిసి వెళ్లేవాడిని. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న. బడి నుంచి రాగానే ఆటలు ఆడుకునేవాళ్లం. ఉశికనూతి బావిలో ఈతకు వెళ్లేవాళ్లం. సోరకాయ బుర్రలతో ఈతనేర్చుకున్నాం. రామకృష్ణాపూర్ వెళ్లే దారిలోని ఒర్రె ఒడ్డున ఉన్న చింతచెట్టుపై కోతికొమ్మ ఆట ఆడుకునేటోళ్లం. మూడుబజార్ల కాడ రాత్రిపూట లైటు కింద దొంగ, పోలీసు ఆడుకునేవాళ్లం. గోటీలు, సిర్రగోనె, తాడు–బొంగురం ఆడేవాళ్లం. ఎండాకాలం వచ్చిందంటే ఆటలతోనే పొద్దుపోయేది. తిండి తినాలని కూడా గుర్తుండేది కాదు. ఆటలతోనే నా బాల్యం ఎంతో ఆనందంగా గడిచిపోయింది.వేములవాడ: ‘అలర్ట్.. బో..’ అరుపులతో వేములవాడ సినారె కళామందిరం పరిసరాలు మారుమోగుతున్నాయి. పిడికిలి బిగించి పంచ్లు ఇవ్వడంలో నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. గాలిలో ఎగురుతూ కిక్స్తో చిన్నారులు అదుర్స్ అనిపిస్తున్నారు. ఎలాంటి ఆపద ఎదురైనా తమను తాము రక్షించుకునేందుకు బేసిక్ కరాటేలో ప్రావీణ్యం పొందుతున్నారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు మొదలైనప్పటి నుంచి నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థినులు కరాటేలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల ఆత్మరక్షణ విద్యపై ఆసక్తి పెరిగింది. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని తల్లిదండ్రులు గుర్తిస్తుండడంతో ఈ శిక్షణకు నిత్యం 50 నుంచి 60 మంది చిన్నారులు హాజరవుతున్నారు. కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్ వీరిని చిచ్చరపిడుగుల్లా తయారు చేసేందుకు కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. సెలవుల్లో ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదని కరాటే ఉచిత శిక్షణను మాస్టర్ మన్నాన్ ప్రారంభించారు. శారీరకంగా బలంగా తయారయ్యేందుకు ఈ విద్య ఎంతగానో దోహడపడుతుందని మాస్టర్ తెలిపారు. శారీరకంగా బలంగా ఉంటే మానసికంగా ధైర్యంగా ఉంటామని.. ఆ సమయంలో ఎలాంటి ఆపద వచ్చిన ఎదుర్కోగలుగుతామంటున్నారు. కరాటేతో క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా చదువుల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
నైపుణ్యంతోనే ఉద్యోగావకాశాలు
పెద్దపల్లి: నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన మెగా జాబ్మేళాలో మంత్రి మాట్లాడారు. 77 కంపెనీల్లో 4,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించగా.. 4,156 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 1,500 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేమని అన్నారు. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారిలో 261 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. త్వరలోనే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్, ఫినిషింగ్ స్కిల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతీఒక్కరు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని, డాటా సైన్స్ నైపుణ్యం కలిగి ఉండాలని కోరారు. ప్రభుత్వ విప్ విజరమణారావు మాట్లాడుతూ, ఉత్పత్తుల బ్రాండింగ్ కేంద్రంగా పెద్దపల్లి నిలవాలన్నారు. రెండేళ్లక్రితం పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇందులో శిక్షణ పొందిన 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఖరితోనే నిరుద్యోగ సమస్య పెరిగి, యువకులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాలలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు. జాబ్ మేళాకు భారీ స్పందన మెటీ జాబ్ మేళాకు స్పందన లభించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశ్రమల శాఖ, టాస్క్ సహకారంతో చేపట్టిన మేళాకు 77 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. అగ్నివీర్, పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం ఆసక్తిగల నిరుద్యోగ యువతకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారితో మంత్రి శ్రీధర్బాబు, విప్ విజయరమణారావు, ఎంపీ వంశీకృష్ణఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మెగాజాబ్ మేళాకు విశేష స్పందన -
● జన సమీకరణకు 4 రోజులుగా కరీంనగర్లో మకాం వేసిన కేంద్ర మంత్రి ● పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీ
కరీంనగర్: ఈనెల 10న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. 4 రోజులుగా కరీంనగర్లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్లో గ్రామాలవారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు. మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెట్ కార్పొరేటర్లతోనూ మీటింగ్లు నిర్వహించారు. జిల్లాలవారీగా మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లవారీగా జన సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకంగా వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. నేటి నుంచి సికింద్రాబాద్లో మకాం బండి సంజయ్కుమార్ గురువారం నుంచి సికింద్రాబాద్లోనే మకాం వేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు సిటీ నుంచే భారీఎత్తున జనాన్ని సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ నేతలతో బర్కత్పురాలోని సిటీ కార్యాలయంలో భేటీ కానున్నారు. -
బీఆర్క్, బీబీప్లానింగ్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): ఐఐటీ–జెఈఈ (మెయిన్) బీఆర్క్, బీప్లానింగ్–2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని అల్ఫోర్స్ టూనీటాట్స్లో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో విద్యార్థులను సత్కరించారు. బీఆర్క్లో ఎస్.శ్రీహిత 174వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, పటేల్ అక్షయ 189వ ర్యాంకు, డి.తనుశ్రీ 227, వి.రితిక 287, ఎస్.ఆధ్య 319, టి.వెంకట నిహిత్ 903, సి.హెచ్.భీమ 1107, ఆర్.నేహగాయత్రి 1719, పి.శ్రీనిధి 1776, పి.హర్షిణి 2325, ఉమైరా సన్నున్ 2626, పి.అక్షయప్రియ 2786వ ర్యాంకు సాధించిందన్నారు. బీప్లానింగ్లో వి.ప్రణతి 858వ ర్యాంకు, పి.క్రిష 1281, ఎమ్.వివేక్ రెడ్డి 1554, ఎమ్.షాలిని 1757, రహీన్ ఉమేద 2448, జి.మహాలక్ష్మి 3053, పి.ఆదిత్యలక్ష్మి 3122వ ర్యాంకు సాధించారన్నారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్) పరీక్ష రాసేందుకు ఎంపికై న విద్యార్థులకు అధ్యాపక బృందంతో కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నట్లు పేర్కొన్నారు. -
యూరియా ఎటెళ్లినట్టు..?
యూరియా వాడకంపై కేంద్ర ప్రభుత్వం సునిశిత పరిశీలనకు ఆదేశించింది. గత యాసంగి కన్న ఈసారి యూరియా వాడకం విపరీతంగా పెరిగింది. ఈక్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి తదనుగుణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖను అలర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయితే యాప్ ద్వారా యూరియా కొనుగోళ్లు జరిగినా.. హోల్సేల్ దగ్గరి నుంచే పక్కదారి పట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తమ చెప్పుచేతల్లో ఉంటారన్న హోల్సేల్ డీలర్ల అత్యుత్సాహంతో ఇష్టారీతిగా యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించారన్న ఆరోపణలున్నాయి. మిల్క్ డెయిరీల్లోనూ కుప్పలు తెప్పలుగా వినియోగించారని తెలుస్తోంది.కరీంనగర్ అర్బన్: అవసరానికి మించి యూరియా వాడకమనేది పోషకాల అసమతుల్యతకు దారి తీయడమే కాకుండా నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ప్రతికూలమే. సదరు కారణంతో మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. తరచూ ఎరువు కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పరిశీలించడం.. ఏ డీలర్ల నుంచి కొనుగోలు చేశారు.. ఏ పంటలకు వాడారు.. సాగేతర వాటికి తరలించారా అనే అంశాలను పరిశీలించనున్నారు. రైతు యూరియాపైనే అక్రమార్కుల కన్ను రైతులకు రాయితీపై ఇచ్చే యూరియా కిలో రూ.6కే లభిస్తోంది. వ్యవసాయేతర రంగాలు యూరియా వినియోగించాలంటే టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడాల్సి ఉంటుంది. అయితే ఇది మార్కెట్లో కిలో రూ.65కు లభిస్తోంది. దీంతో ఇతర రంగాల వ్యాపారులు సబ్సిడీ యూరియాకే మొగ్గు చూపుతున్నారు. అధికారులతో మామూలు బంధాలు నెరుపుతూ పక్కదారి పట్టిస్తుండగా.. మరికొందరు రాజకీయ బలాన్ని చాటుతున్నట్లు తెలుస్తోంది. రాయితీ యూరియాను 15 రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. యాడ్ బ్లూ యూనిట్లు, పశువుల దాణా తయారీ యూనిట్లు, ప్లయ్వుడ్, మిల్క్ డెయిరీలు మొదలైన వాటిలో యూరియా వాడుతున్నారు. క్లాజు 25, ఫెర్టిలైజర్(కంట్రోలు) ఆర్డర్ 1985 ప్రకారం వ్యవసాయ యూరియా వేరే పరిశ్రమల్లో వాడకం నిషేధం. అలా వాడే ప్రదేశాలను తనిఖీ చేయడం, చర్యలు తీసుకోవడం చేయాలి. అయితే ఎరువుల కేటాయింపు, పంపిణీ అనేది ఫెర్టిలైజర్ మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్, 1973 ప్రకారం జరుగుతోంది. ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి కేటాయించిన దాన్ని వేరొక చోటుకు డైవర్షన్, రవాణా చేయడం నిషేధం. అక్రమాలు నిగ్గు తేలేనా..? యూరియా వినియోగంలో అక్రమాలు వెలుగుచూస్తాయా అన్నది అనుమానమే. తనిఖీ చేసే అధికారులు వారి తప్పులను వారెలా బయటకు చెప్పుకుంటారన్నది ఇక్కడ ప్రశ్న. జిల్లాలో ఎక్కువగా హోల్సేల్ డీలర్ల నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఇంటాబయట వినిపిస్తున్న మాట. యాప్ వినియోగంతో కూడా యూరియా అక్రమార్కులకు చేరిందని తెలుస్తోంది. గతంలో సాగు భూములను సర్వే చేసిన వ్యవసాయ శాఖ.. సదరు భూములకు రైతు భరోసా ఇవ్వడం లేదు. కాగా యాప్లో అలా లేదని తెలుస్తోంది. పట్టా పాస్బుక్లో ఉన్న విస్తీర్ణం ప్రకారం యూరియా కేటాయింపు జరుగుతోంది. అంటే సాగులో లేని భూమికి కూడా యారియా వెళ్లిందన్న మాట. -
కొనసాగుతున్న సర్వే
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకశాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కొనసాగుతోంది. జాతీయ గణాంక శాఖ 2026 సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులను నమోదు చేస్తున్నారు. గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో సర్వే చేస్తుండగా ప్రజల జీవన స్థితిగతులను నివేదించనున్నారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, విద్యార్హతలు, చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్యా కోర్సులు, ఉద్యోగం, సరోజువారీ కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, వేతన వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వారయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సర్వే జరగగా కార్పొరేటర్ గంట శ్రీనివాస్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నాగారపు హరికృష్ణ, మున్సిపల్ మెప్మా సెక్షన్ సిబ్బంది ఆర్పీలు రమ్య, కల్పన, మున్సిపల్ సిబ్బంది తంగళ్లపల్లి కల్యాణ్ పాల్గొన్నారు. ఎస్సీసెల్ పరిశీలకుడిగా అరుణ్కుమార్కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ఎస్సీసెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్కు చెందిన కొరివి అరుణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీచేశారు. పీసీసీ ఎస్సీసెల్ చైర్మన్గా కవ్వంపల్లి నియామకం తర్వాత, నూతన కమిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే పాత కమిటీలన్నింటిని రద్దు చేశారు. కొత్త కమిటీల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిశీలకుడిగా కరీంనగర్ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు అరుణ్కుమార్ను నియమించారు. అరుణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షుల అనుమతితో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశాల ద్వారా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం నివేదికను కవ్వంపల్లికి అందించనున్నారు. -
దోపిడీకి స్కెచ్!
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో కేసులు. బిహార్ జైలు నుంచివెయ్యి కార్లు.. 250 బస్సులుసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్నే కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా బొమ్మ శ్రీరాం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా నగరానికి చెందిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి నియమితులయ్యారు. నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్, వైస్చైర్మన్లను ప్రకటించింది. మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరాంను నియమించింది. మాజీ ఎమ్మెల్యే, బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడు శ్రీరాం ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌజ్ఫెడ్ చైర్మన్గా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మున్నూరుకాపు సామాజిక కార్యక్రమాలు, సంఘం వ్యవహారాల్లో శ్రీరాం చురుకై న పాత్ర పోషిస్తున్నారు. మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహం చైర్మన్గా, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. కాగా తన నియామకంపై సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు తొలి కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లకు కరీంనగర్కు తొలి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా రామడుగు మండలానికి చెందిన నేరెళ్ల శారద నియమితులు కాగా.. సుడా, లైబ్రరీ, ఆర్టీఏ తదితర పదవులను భర్తీ చేయడం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలిసారిగా శ్రీరాం ద్వారా కరీంనగర్కు వచ్చింది. -
సిటీకి మరో రూ.1,150 కోట్లు!
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేయనున్న అర్బన్ చాలెంజ్ ఫండ్ (సీయూఎఫ్)పథకంలో కరీంనగర్ నగరాన్ని చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, న గరపాలకసంస్థ భాగస్వామ్యం కలిగిన ఈ పథకంలో ఆమోదం లభిస్తే సుమారు రూ.1150 కోట్ల నిధులతో నగరంలో అభివృద్ధి పనుల జాతర నెలకొననుంది. ఈ పథకం నిధుల్లో ఎక్కువ భాగం నగరపాలకసంస్థయే భరించాల్సి ఉండగా...ఆస్థాయిలో ఆదాయాన్ని ఎలా సృష్టించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అర్బన్ చాలెంజ్ ఫండ్.. నగరపాలకసంస్థ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడం, ప్రభుత్వాల నుంచి పెద్దగా నిధులు రాకపోవడం నగర అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప నగర అభివృద్ధి అనుకున్న మేర సాగే అవకాశం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలకు నిధులు కేటాయించే ఈ పథకానికి, ఐదు సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్లు కేటాయించింది. పట్టణాల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఈనెల 11వ తేదీలోగా ఆయా మున్సిపల్ పాలకవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. బల్దియాపైనే భారం... అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలకసంస్థ భాగస్వామ్యంగా ఉంటాయి. ఎంపికై న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులు నేరుగా ఇస్తుంది. మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం లేదా నగ రపాలకసంస్థ వాటా ఉంటుంది. మిగతా 50 శాతం నిధులు నగరపాలక సంస్థ బాండ్లు, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా సమీకరించుకోవాలి. అంటే అధిక బాధ్యత బల్దియాపైనే ఉంది. రూ.1,150 కోట్లతో ప్రతిపాదనలు అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో భాగంగా రూ.1150 కోట్లతో నగరపాలకసంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సుమారు రూ.650 కోట్లతో నగరంలో రో డ్లు, డ్రైనేజీల ని ర్మాణం, మిగతా నిధులతో డంప్యార్డ్, ఎస్టీపీ, ఆదాయం వచ్చే వాణిజ్య భవనాలు, సుందరీకరణ, పర్యాటకానికి కేటాయించనున్నారు. బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి డి.తారా మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నగరం నుంచి రావాల్సిన ప్రణాళికలు, ప్రతిపాదనలపై చర్చించారు. కరీనగర్ నుంచి మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అమలైతే.. అద్భుతమే.. సీయూఎఫ్ పథకం సాఫీగా అమలైతే కరీంనగర్ సిటీ స్వరూపమే మారిపోనుంది. గతంలో స్మార్ట్ సిటీలో నగరం ఎంపిక కావడంతో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి జరగడం తెలిసిందే. అయినప్పటికీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు తదితర సమస్యలు అలానే ఉన్నాయి. సీయూఎఫ్ పథకం ఆచరణకు నోచుకొంటే నగర రూపురేఖలు మారిపోనున్నాయి. నేడు అత్యవసర సమావేశం అర్బన్ చాలెంజ్ ఫండ్లో ఎంపిక చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మాణం పంపించేందుకు గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు నగరమేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రూ.1150 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి, యూసీఎఫ్లో నగరపాలకసంస్థను చేర్చాలని కోరుతూ తీర్మానించనున్నారు. -
మాయామురళి..సాహసికుడు
చాలాకాలం క్రితం నీలగిరి పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆర్యన్ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. ఆ గ్రామానికి దగ్గర్లో చీకటి అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రారని అక్కడి ప్రజలు నమ్మేవారు. ఒకరోజు గ్రామంలోని పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఒక ముసలితాత ‘అడవి మధ్యలో ఒక మాయా మురళి ఉంది. దానిని ఊదితే వానలు కురుస్తాయి..నేల పచ్చబడుతుంది’ అని చెప్పాడు. సాహసం ప్రారంభం గ్రామస్తుల కష్టాలను చూడలేక ఆర్యన్ ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. అడవిలో వింతవింత శబ్దాలు.. దట్టమైన పొగమంచు అతన్ని భయపెట్టాయి. కానీ... ఆర్యన్ వెనకడుగు వేయలేదు. దారిలో అతనికి ఒక గాయపడిన పక్షి కనిపించింది. ఆర్యన్ దానికి చికిత్సచేసి, తన దగ్గర ఉన్న నీటిని తాగించాడు. ఆ పక్షి ఒక అడవి దేవతగామారి, ‘నీ దయాగుణానికి మెచ్చాను. ఈ దారిలో వెళ్తే నీకు మురళి కనిపిస్తుంది. కానీ.. దాన్ని పొందే ముందు నువ్వు నీ అహాన్ని వదులుకోవాలి’ అని చెప్పి మాయమైపోయింది. ముగింపు చివరికి ఆర్యన్ ఒక పెద్ద గుహలోకి చేరుకున్నాడు. అక్కడ బంగారంలా మెరుస్తున్న మురళి ఉంది. దాన్ని తాకగానే, ఒక గంభీరమైన స్వరం వినిపించింది: ‘దీన్ని నువ్వు నీ స్వార్థం కోసం వాడుకుంటావా? లేక ఇతరుల కోసమా?’ అని శబ్ధం వచ్చింది. ఆర్యన్ ఏమాత్రం ఆలోచించకుండా, ‘నా గ్రామం క్షేమం కోసమే నాకు ఇది కావాలి’ అని సమాధానమిచ్చాడు. అతని నిస్వార్థానికి మెచ్చి ఆ మురళి ఆర్యన్ చేతికి చిక్కింది. అతను గ్రామానికి వచ్చి మురళిని ఊదగానే, ఆకాశం నుంచి వర్షం కురిసి గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. ఆర్యన్ అందరికి హీరో అయ్యాడు. నీతి: నిస్వార్థమైన మనసుతో చేసే ఏ ప్రయత్నమైనా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. మనన్, బాలరచయిత 4వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామం: రాచ్పల్లి, మండలం: ధర్మారం జిల్లా: పెద్దపల్లి -
ఉచిత కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతం
కరీంనగర్: కరీంనగర్లోని రెనే హాస్పిటల్, శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోకాలి కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతమైంది. ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఎంపికై న 18 మంది లబ్ధిదారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, వారిని ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ చేశారు. ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ఈసారి ఆరోసారి నిర్వహించారు. మార్చి 2026లో జరిగిన మెడికల్ క్యాంపుకు హాజరైన సుమారు 600 మంది పేషెంట్లలో నుంచి లక్కీ డ్రా విధానం ద్వారా 18 మందిని ఎంపిక చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో 8 మందికి అత్యాధునిక జాన్సన్ అండ్ జాన్సన్ రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి చేయగా.. మిగతావారికి సాధారణ పద్ధతిలో చికిత్స అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. సుమారు రూ.40లక్షల విలువైన వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఆధునిక రోబోటిక్ వైద్యసేవలను జిల్లాకు తీసుకురావడమే కాకుండా పేదలకు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ... తన తల్లిదండ్రుల స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెనీ హాస్పిటల్ వైద్యులు మునిష్, కృష్ణారెడ్డి, లతీశ్రెడ్డి, సురేశ్కుమార్, సుధీర్ ద్వారాక్ నాయుడు, నిఖిల్ లక్ష్మణ్, విశాల్, వైభవ్, కమలుద్దీన్, పులి స్ఫూర్తి, నవ్య, సారా ఫాతిమా, ఆదిత్య, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. 18 మందికి ఆపరేషన్లు చేసిన డాక్టర్ బంగారి స్వామి -
సరిహద్దులు దాటిన సాహితీ పరిమళాలు
హాజరైన కవులు కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న జీవీ శ్యాం ప్రసాద్లాల్కరీంనగర్ కల్చరల్: సాహితీ పరిమళాలు సరిహద్దులు దాటి ఫరిడవిల్లుతోంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి నే పాల్లో అరుదైన రీతిలో తెలుగుకవి సమ్మేళనం జరిగింది. ఇండో– నేపాల్ కవి సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రఖ్యాత కవులు కవితా గానం చేశారు. వంద మందికి పైగా తెలుగు వారు దీనికి హాజరయ్యారు. ఖాట్మాండులోని క్రిస్టల్ పశుపతి హోటల్ ఈ సమ్మేళనానికి వేదికై ంది. ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో చేపట్టిన నేపాల్ యాత్రలో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జీవీ శ్యాంప్రసాద్లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవి అన్నవరం దేవేందర్ కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వజనీనమైందన్నారు. సమ్మేళనంలో బూర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్, నాంపల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్, రావికంటి శ్రీనివాస్, స్థంభంకాడి గంగాధర్, సీవీ శ్రీనివాస్, డాక్టర్ కూరెళ్ల పద్మాచారి, కృష్ణ గోపాల్, ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, సంపత్, అశోక్, జ్యోతి, గోనె శ్రీనివాస్, ప్రేమలత తదితరులు కవితలు వినిపించారు. మల్లికార్జున్ దేవ్, నల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖాట్మాండులో తెలుగు కవి సమ్మేళనం -
క్లుప్తంగా
అరుణాచలం, రామేశ్వరం ప్రత్యేక బస్ విద్యానగర్(కరీంనగర్): తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, చిదంబర నటరాజ ఆలయం, శ్రీరంగం, మధురై, జంబుకేశ్వర్, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలకు కరీంనగర్ 1 డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు వెళ్తున్నట్లు డీఎం ఐ.విజయమాధురి తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి 19 తిరిగి చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు రూ.8,800, పిల్లలకు రూ.6,600 టికెటు ఉంటుందని తెలిపారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491లలో సంప్రదించాలని కోరారు. గంజాయి అమ్మితే సమాచారం ఇవ్వండివేములవాడ: గంజాయి అమ్మిన వారి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. పట్టణంలోని పెద్దమ్మగుడి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం దాడి చేశారు. బైక్పై వచ్చిన నాంపల్లికి చెందిన జడల నాగరాజు(50), వడిచర్ల జాన్ ప్రతాప్రెడ్డి(60)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 160 గ్రాముల గంజాయి (రూ.8 వేల విలువ), మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
వెదిరలో రాస్తారోకో చేస్తున్న రైతులుశంకరపట్నం మండలం కరీంపేటలో తడిసిన ధాన్యంహుజూరాబాద్ మండలంలో తడిసిన ధాన్యంవెదిరలో రాస్తారోకోలో చిక్కుకున్న 108 వాహనంరామడుగు/శంకరపట్నం/హుజూరాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు ధాన్యం విక్రయించుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. కల్లాల్లోని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహానికి గురవుతుండగా, పలుచోట్ల అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఎటుతిరిగీ అన్నదాతే నష్టపోతుండగా.. కొనుగోళ్లు వేగిరం చేయాల్సిన అవసరం ఉంది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, వేసిన ధాన్యానికి 4కిలోల తరుగు తీస్తున్నారని కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపైన వెదిరలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపుగా గంటపాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంగాధర ఎస్సై వంశీకృష్ణ రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింప జేసే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. తహసీల్దార్ రాజేశ్వరి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. శంకరపట్నం మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కరీంపేట, కొత్తగట్టు, మొలంగూర్, మెట్పల్లిలో అకాలవర్షంతో సంచుల్లో కాంటా వేసిన ధాన్యంతో పాటు కుప్పలు తడిసిపోయాయి. హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొట్టుకు పోయింది.అన్నదాత అరిగోస -
నేతన్నకు తోడుగా..
కరీంనగర్కల్చరల్: చేనేత వస్త్రాలంటే మక్కువ లేని మగువలు చాలా అరుదు. సంప్రదాయం, అందం, హుందాతనం కలిసిన ఈ హస్తకళను కరీంనగర్ ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కళాసిల్క్ సంస్థ ముందుకొచ్చింది. కోర్టు చౌరస్తా సమీపంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత వస్త్రాలు, హస్తకళల ప్రదర్శనతో పాటు అమ్మకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. నేతన్నలకు ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా చేనేత కళను ప్రతి ఇంటికీ చేర్చేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు అద్భుత అల్లికలతో తయారు చేసిన సిల్క్, కాటన్ వస్త్రాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఎగ్జిబిషన్లో పలు రాష్ట్రాల ప్రత్యేకతలు తెలంగాణలోని గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి; ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పడ, అస్సాంలోని మూగా, ఎరి సిల్క్, బిహార్లోని బాగల్పూర్ సిల్క్, టస్సర్, ఛత్తీస్గఢ్లోని కోసా సిల్క్, ట్రైబల్ వర్క్స్, గుజరాత్ బంధని, కచ్ ఎంబ్రాయిడరీ, జమ్ము– కశ్మీర్ పాష్మీనా షాల్స్, కర్ణాటక ప్రింటెడ్ శారీస్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్థాన్ కోటా, బంధని, బ్లాక్ ప్రింట్స్, ఉత్తరప్రదేశ్ బనారస్, లక్నో డ్రెస్ మెటీరియల్స్ వంటి అనేక రాష్ట్రాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. అదనంగా హర్యానా బెడ్ కవర్లు, కుషన్ కవర్లు, కుర్తీలు, డోర్ కర్టెన్లు, హ్యాండీక్రాప్ట్స్’ న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో సందడి ప్రత్యేక స్టాళ్లతో ఆకట్టుకుంటున్న ప్రదర్శన పలు రాష్ట్రాల ఉత్పత్తులు ఒకేచోట కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆసక్తిచేనేత వస్త్రాలు, హస్తకళల ను ప్రోత్సహించండి. కళా కారుల అల్లికలతో రూపొందించిన సిల్క్, కాటన్ వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తున్నాయి. దేశం నలుమూలల కళాకారుల ఉత్పత్తులను ఒకేచోట అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నేతన్నలకు చేయూత అందించాలని కోరుతున్నాం. – ఎన్.వినోద్, ఎగ్జిబిషన్ మేనేజర్ -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యతా?
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్య, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్లే బాధ్యత వహిస్తారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్హౌజ్లో గడుపుతున్న కేటీఆర్ విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడి, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
అమ్మా.. బతకాలని ఉంది..!
గొల్లపల్లి: వారిది నిరుపేద కుటుంబం. కూలీపనులు చేసుకుంటూ.. ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న ఆ కుటుంబంలో పెద్ద ఆపద వచ్చిపడింది. కుమారుడికి కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ముందుగా జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది ప్యాంక్రియా టైటిస్గా గుర్తించారు. అక్కడ వైద్యం అందించినా.. నయం కాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. అప్పు చేసి హైదరాబాద్లోని యశోధ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని బతికించుకునేందుకు ఆ కుటుంబం తాపత్రయపడుతోంది. ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది. కన్నీరు పెట్టిస్తున్న బాలుడి కథ గొల్లపల్లి మండలం భీంరాజ్పల్లి గ్రామానికి చెందిన రజితను మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన ఆరే తిరుపతికి ఇచ్చి 20ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కుమారుడు దీక్షిత్, కూతురు ఉన్నారు. తండ్రి తిరుపతి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. పిల్లల ఆలనాపాలన తల్లి రజిత చూసుకుంటోంది. దీక్షిత్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో రజిత ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అతడికి ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. మందులు వాడినా.. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా అల్లాడుతున్నాడు. ఏడాది కాలంగా దీక్షిత్ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆ తల్లి కొడుకును కాపాడుకునేందుకు జగిత్యాలతోపాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తోంది. అప్పుల ఊబిలో కుటుంబం కుటుంబం గడిచేందుకే ఆ కుటుంబం పడరానిపాట్లు పడుతోంది. ఇక దీక్షిత్ చికిత్స కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ కుటుంబానికి సొంత ఇల్లు లేదు. గుంటభూమి లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పు చేసి.. సుమారు రూ.7లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెడుతోంది. తీవ్ర కడుపునొప్పితో కొడుకు విలవిల్లాడిపోతుంటే ఆ తల్లి ఏం చేయాలో తెలియక మౌనంగా రోదిస్తూ.. లోలోపల కుమిలిపోతోంది. చదువులో ముందంజ అనారోగ్యంతో ఉన్నా దీక్షిత్కు చదువుపై ఆసక్తి తగ్గలేదు. మందులు వాడుతూనే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఉపాధ్యాయులు అతడిని అభినందించి.. ఆయన దీనస్థితిని చూసి చలించిపోయారు. దాతల సాయం కోసం ఎదురుచూపులు ‘నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి.. దేవుడా.. బతికించు..’ అంటూ ఆ తల్లి కలిసిన ప్రతిఒక్కరికీ చేతులెత్తి దండం పెడుతోంది. కళ్లముందే కొడుకు దీనస్థితికి చేరడం.. వైద్యం అందిస్తామన్నా.. చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో ఆ తల్లి వేదన వర్ణణాతీతం. ప్రస్తుతం దీక్షిత్కు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.7లక్షలు ఖర్చయ్యాయని, మరో రూ.7లక్షలు అయితే కొడుకు బతికే అవకాశం ఉందని ఆ తల్లి వేడుకుంటోంది. దాతలు స్పందించి తన కొడుకును బతికించాలని అర్థిస్తోంది. మృత్యువుతో పోరాడుతున్న 17 ఏళ్ల బాలుడు ప్యాంక్రియా టైటిస్గా గుర్తించిన వైద్యులు అప్పు చేసి వైద్యం అందిస్తున్న పేద కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు దాతలు స్పందించాలని వేడుకోలు సహాయం చేయాలనుకునే దాతలు 96664 21275 నంబర్లో సంప్రదించాలని వేడుకుంటోంది. -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు. -
ఆడుకోవడం.. కథలు వినడం
ఎండాకాలం సెలవులో ఎగిరిన మధురస్మృతులు. వేసవి సెలవులు వచ్చినాయి అంటే అమ్మమ్మ ఊరు పెద్దపహాడ్ వెళ్లడం మేనమామలతో రామాయణం భారతం కథలు చెప్పించుకోవడం ఒక జ్ఞానం. ఇంకా ఆ కాలంలో చుట్టాలు ఇళ్లల్లో తిరగడం కూడా ఒక అలవాటు.మా ఊర్లో ఉన్నప్పుడు ఎండాకాలం సెలవులు లోనే చెరువులలో భావులలో ఈత నేర్చుకునేది. చింత చెట్టు కింద చిర్రగోని ఆట ఆడేది. ఇంటిదగ్గర చింతపండు కొట్టేది . వ్యవసాయ పనులు చేసేది. అట్లాగే రానున్న తరగతి పుస్తకాలను పాత వాటిని సగం ధరకు కొనుక్కునేది. పుట్టలేసుకునేది. రేడియో పాటలు వినడం. ఇంటి బయట వాకిలిలో పడుకొని మా తాత చెప్పే కథలు వినడం అలవాటు. ఇప్పటి యువతరం కూడా ముఖ్యంగా సెల్ ఫోన్లకు టీవీలకు కంప్యూటర్లకు దూరంగా ఉండి శారీరక శ్రమకు సంబంధించిన ఆటలలో పాల్గొనాలి. సాహిత్య కళాత్మక క్రీడా రంగాలలో తర్ఫీదు పొందాల్సిన అవసరం ఉంది. డిజిటల్ మాధ్యమ సాధనాలకు దూరం జరగాల్సిన అవసరం ఉంది. – అన్నవరం దేవేందర్, కవి, రచయిత, దాశరధి పురస్కార గ్రహీత -
వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం
గంభీరావుపేట(సిరిసిల్ల): వ్యవసాయ రంగంలో సరికొ త్త విప్లవానికి నాంది పలుకుతూ గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ప్రా జెక్టును ప్రజాప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నా రు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాధారణంగా రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం ద్వారా వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుందన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి రక్షణతోపాటు రైతులకు వ్యవసాయ వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయాన్ని మరింత లాభాసాటిగా మార్చేందుకు రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని సూచించారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతులు పాటించాలని సూచించారు. 11 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 11 ప్రాంతాల్లో రూ.30కోట్ల అంచనాతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు గంభీరావుపేటలోని సబ్స్టేషన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గంభీరావుపేటలో కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
మానకొండూర్: రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యామ్నాయ పంటలు ఎంతో ఉపయోగకరమని డీఏవో భాగ్యలక్ష్మీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి కమలాకర్రెడ్డి అన్నారు. మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భా గంగా ఉద్యాన పంటల సాగు, ఆయిల్ఫాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుమల్రెడ్డి, సర్పంచ్ బొట్ల స్వరూప, కె.తిరుపతి, ఉప సర్పంచ్ సతీశ్, స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డీసీవో రామానుజచార్యులు, ఏడీఏ శ్రీధర్, ఏవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ‘సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’కరీంనగర్టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యల ను ఖండిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విధానా లపై, ప్రజాసమస్యలపై విమర్శలు ఉండాలి కానీ.. వ్యక్తిగత దూషణలు అనైతికమన్నారు. కేటీఆర్ మాజీ సీఎం చంద్రశేఖర్ రావు కుమారుడని నిరూపించుకోవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని పేర్కొన్నారు. బండి సంజయ్ వంటి నాయకులు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వంటి సంస్థల్లో ఆయనకు ఇదే శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించారు. కరీంనగర్ టౌన్: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పని చేసిందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్లో మాట్లాడుతూ వామపక్షాలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవమన్నారు. కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయమైందన్నారు. రాష్ట్ర ఏఐటీయూసీ 4వ మహాసభలు సెప్టెంబర్లో కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుందని, కార్మిక లోకం కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మికవర్గానికి పితామహుడు, కార్పొరేట్, పెట్టుబడిదారుల గుండెల్లో గునపం లాంటి మహోన్నతమైన వ్యక్తి కారల్ మార్క్స్ అని కొనియాడారు. పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కారల్ మా ర్క్స్ 209వ జయంతిని నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వీఎస్బోస్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, తాండ్ర స దానందం,విశ్వనాథం, సుదర్శన్ పాల్గొన్నారు. ప్రధానాసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలుకరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రి (జీజీహెచ్)లో మంగళవారం విజిలెన్స్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. జీజీహెచ్, ఎంసీహెచ్, ఫార్మసీ, స్కానింగ్లు, ఆపరేషన్ థియేటర్, ఓపీ, ఐపీ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. రోగుల సంఖ్య, డాక్టర్ల హాజరుపట్టిక, అటెండెన్స్ తీరును పరిశీలించారు. మెడికల్ కళాశాల నుంచి అటెండెన్స్ కాపీలు తెప్పించుకొని పరిశీలించారు. ఆస్పత్రిపై ఏవైనా ఫిర్యాదులు రావడం వల్ల తనిఖీ లు నిర్వహించారా..? లేదా సాధారణ తనిఖీ లా..? అనే అంశంపై సూపరింటెండెంట్ వీ రారెడ్డిని వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సాధారణ తనిఖీలేనని తెలిపారు. 7న అవగాహన సమావేశంకొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్ర ఇంధనశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహి స్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 7న ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ‘వ్యవసాయ క్షేత్రాలు– సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుమ్) అంశంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. రైతులు, రైతు సంస్థలు, సహకార సంఘాలు హాజరుకావాలన్నారు. -
రూ.70 కోట్లతో పనులు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ నిధులు రూ.70 కోట్లతో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని స్మార్ట్సిటీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. సీడీఎంఏ శ్రీదేవి, ఈఎన్సీలతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ హాజరయ్యారు. రూ.70 కోట్ల గ్రాంట్తో నగరంలోని టవర్సర్కిల్ వద్ద మల్టీ పార్కింగ్ భవనం నిర్మించాలని తీర్మానించారు. మదీనాకాంప్లెక్స్ వద్ద గతంలో నిర్మించిన భవనం ఉపయోగంలోకి రాకపోగా, శిథిలావస్థకు చేరడం తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.50 కోట్లతో మల్టీపార్కింగ్ భవనం నిర్మించాలని నిర్ణయించడంతో టవర్సర్కిల్ వద్ద పార్కింగ్ తిప్పలు తప్పే అవకాశం ఉంది. ప్రతి వర్షాకాలం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పడుతున్న ముంపును నివారించేందుకు నిధులు కేటాయించారు. మంచిర్యాల చౌరస్తా, ముకరాంపుర, రాంనగర్, ఆర్టీసీ వర్క్షాప్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో వరద ముంపును తప్పించేందుకు నాలా నిర్మాణాలను చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. -
చేతకాకపోతే తప్పుకోండి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్: రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతోందని, కొనుగోళ్లు చేతకావడం లేదని తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్ లో కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కమాన్పూర్లో రూ.20 లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మంజూరైన పనిముట్లను లబ్ధి దారులకు అందజేశారు. సంజయ్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, ఎంతమంది రైతులు చస్తే స్పందిస్తారని నిలదీశారు. వడ్ల కొనుగోలుకు టోకెన్లు ఇవ్వడానికి దళారులు కమీషన్లు తీసుకోవడం దురదృష్టకరని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే మంత్రులను రైతులు కొట్టేలా ఉన్నారన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే...ఇప్పటిదాకా 15 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారా? అంటూ మండిపడ్డారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఖాజీపూర్, కమాన్పూర్ సర్పంచ్లు కోమటిరెడ్డి అంజనికుమార్, నునుగొండ మానసప్రవీణ్, నాయకులు తిరుపతి, రతన్కుమార్, అనిల్కుమార్ పాల్గొన్నారు. మోడీ సభకు వాల్ రైటింగ్ ఈనెల 10న సికింద్రాబాద్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్ చైతన్యపురిలోని తన నివాసం వద్ద గోడపై వాల్ రైటింగ్ చేశారు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రజాప్రతినిధి సహా కార్యకర్తలంతా తమ తమ డివిజన్లలో మోదీ సభ తేదీ, సమయం, ప్రాంతం తెలిసేలా వాల్ రైటింగ్తోపాటు వినూత్న రీతిలో ప్రచారం చేయాలని కోరారు. సాయంత్రం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ తోపాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, డీ.శంకర్, గుగ్గిళ్లపు రమేశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి జే.సంగప్ప, బి.ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేటకు చెందిన బండారి లక్ష్మి (55) నాగుపాము కాటుతో మృతిచెందింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లిన లక్ష్మిని పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వడదెబ్బతో వృద్ధుడి..బుగ్గారం: మండలంలోని చిన్నాపూర్కు చెందిన బియ్యాల బాపురావు (65) వడదెబ్బతో మృతిచెందాడు. భార్య మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని కరీంనగర్లోని కుమారుల వద్ద ఉంటోంది. బాపురావు తన కూతురు గ్రామమైన మల్యాల మండలం మద్దుట్లకు రెండు రోజుల క్రితం వెళ్లాడు. మంగళవారం చిన్నాపూర్ వచ్చాడు. ఇంట్లో నిద్రపోయాడు. రాత్రి అయినా ఆయన బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేశారు. కాలువిరిగిన ఉపాధిహామీ కూలిచందుర్తి(వేములవాడ): ఉపాఽధిహామీ పనులు చేస్తున్న స్థలంలో ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడి కూలీ కాలు విరిగింది. ఈ సంఘటన చందుర్తి మండలం నర్సింగపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు. చందుర్తి మండలం నర్సింగపూర్లో ఉపాధిహామీ పథకంలో కందకాల పనులు చేస్తున్నారు. ఈ పనులు చేస్తున్న సమయంలో కూలీ దేశవేని లక్ష్మి(45) కాలు జారి గుంతలో పడడంతో కాలు విరిగింది. దీంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మొక్కజొన్న పంట దగ్ధంమల్లాపూర్ : షార్ట్ సర్క్యూట్తో ఎకరంన్నర మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని వేంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుమ్ముల లత ఎకరంన్నర మొక్కజొన్న సాగుచేసింది. కూలీలతో కంకులను రాశిగా పోసింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి మొక్కజొన్న పంటకు అంటుకున్నాయి. బాధితురాలు, కుటుంబసభ్యులు, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మొత్తంగా రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు పేర్కొంది. ఆర్ఐ అశోక్, సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, ఉపసర్పంచ్ రొడ్డ హరీకరాజు వెళ్లి పంటను పరిశీలించారు. -
మూడు నెలలకోసారి జాబ్మేళా
కరీంనగర్టౌన్: జిల్లాలో మూడు నెలలకు ఒకసారి జాబ్మేళా నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్మేళాను పర్యవేక్షించారు. ఎంతమంది హాజరయ్యారు, ఏయే కంపెనీలకు అవకాశం కల్పించారు.. తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తామని, తద్వారా వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన 90 కంపెనీలు నియామక ప్రక్రియను నిర్వహించాయి. మూడు వేల మంది యువత హాజరుకాగా, 997మంది వివిధ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికయ్యారు. మరో 478 మందిని వివిధ కంపెనీలు తక్షణమే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, త్వరలో వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆర్డీవో కే.మహేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, పరిశ్రమలశాఖ జీఎం సాల్మ న్ రాజు, పీడీ మెప్మా స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు. -
చెట్టంత ఆలోచనతో కథ రాశాను
వేసవి కాలం, ఎండ తీవ్రతకు అంతా ఇబ్బంది పడుతున్న విషయంపై నేను రాసిన కథ అందరికి నచ్చింది. తోవ వెంబడి ఒక్క చెట్టు లేదు అని వృద్దుడు చెప్పిన విషయంతో చెట్లు నాటితే అవి మనుషులకు ఎంత సేవ చేస్తాయే రాశాను. స్వచ్ఛమైన గాలిని ఇవ్వడమే కాదు.. నీడనిచ్చి పండ్లను ఇచ్చే చెట్టుకు ఉన్న ప్రాధాన్యతను కథలో వివరించాను. అందరు చెట్లు నాటి వాటిని సంరక్షించాలని కథలో చెప్పాను. మేము కూడా కథలు రాయగలమని మా టీచర్లు ప్రోత్సహించారు. – చిగురు ప్రణయ్, 8వ తరగతి కథలు, కవితలు రాయాలంటే పెద్ద చదువులు చదివి ఉండాలని అనుకునేదాన్ని. మా స్కూల్లో పెద్ద సారు, తెలుగు టీచర్ మాతో కథలు రాయించారు. మనం చూసినవి, విన్నవి, మన చుట్టూ జరిగే సంఘటనలతో కథలు రాయవచ్చని చెప్పారు. పెద్ద పెద్ద పదాలు అవసరం లేదన్నారు. అలా నేను కూడా మామిడిపండ్ల గంప పేరుతో కథ రాశాను. అది అందరికీ నచ్చింది. ఆటపాటలతోపాటు చదువు ఉండాలని, అల్లరి ఒక స్థాయి వరకే అని చెప్పే కథ ఇది. – కీర్తన, పదో తరగతి -
డీఎఫ్వో బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ అర్బన్: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఫారెస్ట్ అధికారి(డీఎఫ్వో)గా ఎస్.సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఇక్కడ డీఎఫ్వోగా వ్యవహరించిన బాలమణి కొమురంభీం అసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయిన విషయం తెలి సిందే. సత్యనారాయణ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన డీఎఫ్వోను అటవీ అధికా రుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎఫ్ఆర్వోలు, డిప్యూటీ ఆర్వోలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భూసార పరీక్షలు చేయించుకోవాలికొత్తపల్లి: ప్రతిరైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ ఉప సంచాలకుడు డీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఉషారాణి సూచించారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కొత్తపల్లి రైతు వేదికలో చింతకుంట, రేకుర్తి, సీతారాంపూర్ రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారిస్తూ సేంద్రీయ ఎరువులు వాడితే అధిక దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, పంట రుణాలు, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాలు, సమతుల ఎరువులపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్టె ఎరువులు వాడాలని ఏవో అనూష తెలిపారు. ఏఈఓ రాము, ఆదర్శ రైతులు చిట్కూరు శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ రెడ్డి, కోదాడ శంకర్ పాల్గొన్నారు. సమ్మక్క చెరువు ప్రాంతంలో ‘ఇనార్ట్’ వ్యర్థాలుకరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్లో చెత్తను బయోమైనింగ్ చేసిన అనంతరం వెలువడే ‘ఇనార్ట్’ వ్యర్థాలను నగరంలోని 7వ డివిజన్ సమ్మక్క సారలమ్మ గద్దె సమీపంలోని లోతట్టు ప్రాంతంలో వేయడం వివాదంగా మారింది. డంప్యార్డ్లో చెత్తను యంత్రాల ద్వారా జల్లెడ పట్టినప్పుడు వెలువడే రీసైకిల్కు వీలులేని వ్యర్థాలను ఇనార్ట్ అంటారు. ఈ వ్యర్థాలను సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో ఎస్టీపీ పక్కన లోతట్టు ప్రాంతంలో నగరపాలకసంస్థ సిబ్బంది పడేస్తున్నారు. దీంతో సోమవారం స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని ఇనార్ట్ వ్యర్థాలను తీసుకొచ్చిన లారీని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. ఈ వ్యర్థాలు వేయడం మూలంగా తమ ప్రాంతం కలుషితం అవుతుందని, ఇప్పటికే దుర్వాసన వస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాశ్ పాల్గొన్నారు. రూ.50 కోట్లతో అభివృద్ధి పనులుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 40వ డివిజన్ తిరుమల్నగర్లో రూ.10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్తో కలిసి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కాలనీలో పలు డ్రైనేజీ సమస్యలు, రోడ్డు సమస్యలను స్థానిక ప్రజలు మేయర్ దృష్టికి తేవడంతో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.50 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. -
సాక్షితోనే ఉత్తమ ఫలితాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): పదోతరగతి విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఉపయోగపడిందని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ‘సాక్షి’ యాజమాన్యం 10వ తరగతి పరీక్షలకు రెండు నెలల ముందు నిష్ణాతులైన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ స్టడీ మెటీరియల్ను రూపొందించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసింది. ఈక్రమంలోనే మండలంలోని రహీంఖాన్పేట మోడల్స్కూల్కు 10 సాక్షి దినపత్రికలను కూడా అందించారు. విద్యార్థులకు అందజేసిన స్టడీ మెటీరియల్తో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు సులభతరమయ్యాయని విద్యార్థులు పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించడంతోపాటు ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. ● స్టడీ మెటీరియల్ ఉపయోగపడిందన్న విద్యార్థులు ● ఉత్తమ మార్కులతో విద్యార్థుల ఉత్తీర్ణత ఉపాధ్యాయులు సిలబస్ను డిసెంబర్ వరకే పూర్తి చేశారు. సెప్టెంబర్ నుంచి అదనపు త రగతులు నిర్వహించారు. పరీ క్షలకు రెండు నెలల ముందు ‘సాక్షి’ స్టడీమెటీరియల్ ఫిజి క్స్, మ్యాథమెటిక్స్ ఉచితంగా అందించారు. ఉపాధ్యాయులందించిన నోట్స్తోపాటు సాక్షి స్టడీ మెటీరియల్ చదువుకోవడం జరిగింది. సులభతరంగా ఉంది. 588 మార్కులు సాధించడంలో దోహదపడింది. సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – ఎం.హర్షిత, రహీంఖాన్పేట మోడల్స్కూల్ ‘సాక్షి’ యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ సులభతరంగా ఉంది. నోట్స్తోపాటు స్టడీమెటీరియల్ చదవడంతో కఠినంశాలు సులభంగా అర్థమయ్యాయి. సాక్షి స్టడీ మెటీరియల్తోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 582 మార్కులు సాధించాను. – నారెడ్డి మహిత, రహీంఖాన్పేట మోడల్ స్కూల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి స్టడీ మెటీరియల్ తోడు కావడంతో 572 మార్కులు సాధించాను. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో మార్కులు స్కోరు కావడానికి స్టడీ మెటీరియల్ దోహదపడింది. – అప్సా తహమీనా, రహీంఖాన్పేట మోడల్స్కూల్ -
విద్యుత్ భద్రత వారోత్సవాలపై విస్తృత ప్రచారం
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ భద్రత వారోత్సవాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ తెలిపారు. గృహ వినియోగదారులు, రైతులు విద్యుత్తో జాగ్రత్త వహించాలని కోరారు. జీరో ప్రమాదాలే లక్ష్యంగా ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సర్కిల్వ్యాప్తంగా విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అడవి పందుల నుంచి పంట పొలాలను రక్షించడానికి కరెంట్ ఫెన్సింగ్ అమర్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నాసిరకం వైరింగ్, నాణ్యతలేని పరికరాలు, ఎర్తింగ్ లేకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
గంట ముందే స్పాట్కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్ఎస్తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
దేశ విభజనవాదులకు గుణపాఠమిది
కరీంనగర్: దేశాన్ని ఉత్తరాది– దక్షిణాది పేరుతో విభజించాలనే ప్రయత్నాలు చేసిన వారికి ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గుణపాఠంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఆ పార్టీకి అధికారం దక్కిందని పేర్కొన్నారు. కరీంనగర్లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పీఎంజే జువెలర్స్ సిబ్బందిని సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ ఘటనను దారుణమైందన్నారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను పరామర్శించడం మానవత్వమని, బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనకు తాను రాజీనామా చేయాలనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
అర్జీ భద్రం.. పక్కా పరిష్కారం
కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యమని, అర్జీలను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదిలేదని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయాశాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతీ అర్జీని సునిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని, సదరు సమాచారం అర్జీదారుకు తెలుపాలని స్పష్టం చేశారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు అధికమొత్తంలో రాగా మొత్తం 99 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. మండలస్థాయి, డివిజన్స్థాయి, మునిసిపల్ స్థాయిలో ప్రజావాణి జరుగుతుండటంతో అర్జీలు తగ్గాయి. డివిజనల్ ప్రజావాణి షురూ డివిజన్స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం కలెక్టరేట్లో డివిజన్స్థాయి ప్రజావాణిని నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలోనే ఓ వైపున కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్ అర్జీలను స్వీకరించగా ఆయాశాఖల డివిజన్స్థాయి అధికారులకు బదలాయించారు. గ్రామంలోని 207, 301 సర్వే నంబర్లలో 6.08ఎకరాల భూమి ఉంది. కొంత భూమి సంపత్ పేరుపై కనిపిస్తోంది. ఇదెక్కడి అన్యాయమని అధికారులను కలిస్తే ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. ఏ రకంగా అతని పేరున మారిందో వివరాలివ్వాలని ఏడాదికాలంగా తిరుగుతుంటే జవాబు లేదు. ఒకరి భూమిని మరొకరి పేరున ఇష్టారీతిగా మార్చేందుకే అధికారమిచ్చిందా ప్రభుత్వం? – కె.చిన్నరాజయ్య, ముత్తారం, శంకరపట్నంజిల్లాకు మంజూరైన ఈఎస్ఐ డిస్పెన్సరీని అందుబాటులోకి తీసుకురావాలి. డిస్పెన్సరీ మంజూరై నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదు. జిల్లాలో అనేకమంది ఈఎస్ఐ కార్డు కలిగిన కార్మికులు ఉన్నారు. డిస్పెన్సరీ పనిచేయకపోవడంతో చిన్న చికిత్సలకై నా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. – శ్రవణ్, భారతీయ మజ్దూర్ సంఘ్ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇష్టారీతిగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వింటాల్కు 8కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. అక్కడి నుంచి మిల్లుకు వెళ్లాకా మిల్లర్లు 2కిలోలు తరుగు తీస్తున్నారు. నిబంధనలను అమలు చేయకుండా అక్రమాలకు పాల్పడుతుండగా సెంటర్ నిర్వాహకులు, సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – రైతులు, బొమ్మకల్, సైదాపూర్గ్రామంలో పెద్దచెరువు ప్రధాన జల వనరు. రానున్న రోజుల్లో లోటు వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ చెబుతోంది. ఈ క్రమంలో పెద్దచెరువు మరమ్మతు పేరుతో నీటిని విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం చేపల కాంట్రాక్టర్ కోసం గ్రామ పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. నీటిని వదలకుండా కలెక్టర్ తక్షణమే చొరవ చూపాలి. – రైతులు, ఎలగందుల, కొత్తపల్లి మొత్తం అర్జీలు: 99 డీఆర్డీవో: 33, డీపీవో:09 సీపీ ఆఫీస్: 07 ఆర్డీవో హుజూరాబాద్: 08 -
దొంగలను పట్టుకుంటాం
కరీంనగర్ కార్పొరేషన్: జువెల్లరీ దొంగలను పట్టుకొని, ఆభరణాలను రికవరీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన పీఎంఏ జువెల్లరీని సోమవారం సందర్శించారు. దొంగల దాడిలో గాయపడ్డ సిబ్బందిని హాస్పిటల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నా రు. దొంగతనంపై గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ కల్చర్, పబ్కల్చర్, గంజాయిలపై ఈగల్ను తీసుకువచ్చి ఉక్కుపాదం మోపారన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్రావు దంపతులను నడిరోడ్డుపై చంపిన దిక్కులేదని, దిశలాంటి ఎన్నో కేసులు జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం మూడు రోజుల్లో విరమింప చేస్తే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: మండలంలోని తిమ్మాపూర్కు చెందిన మెంగెని రాజ్కుమార్ (35) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ ఇటీవల ఇల్లు కట్టుకొని అప్పుల పాలయ్యాడు. అప్పుల సమస్యలతో పాటు ఇంట్లో కుటుంబ కలహాలు మొదలవడంతో భరించలేక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకొని..మేడిపల్లి: ఇటీవల ప్రకటించిన పదోతరగతి ఫలితాల్లో తన తోటి విద్యార్థుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని ఆవేదనతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడ్యాడ్కి చెందిన నిమ్మల రక్షిత(15) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. అయితే తన తోటి విద్యార్థుల కంటే మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ప్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి సుజాత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్తారింటి వేధింపులకు వివాహిత...ఇల్లంతకుంట(మానకొండూర్): సంతానం కలగడం లేదని భర్త, అత్త, ఆడబిడ్డలు తరచూ వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై–2(ఆర్) లక్పతి తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన ఎలుక మల్లేశంతో కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన బాలమణికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో బాలమణి(35)ని భర్త మల్లేశం, ఆడబిడ్డలు, అత్తలు వేధించడంతో ఆదివారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలమణిని అంబులెన్స్లో కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి సామర్ల వినోద ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలమణి అంత్యక్రియలు తల్లిగారి గ్రామం కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో నిర్వహించారు. బాలమణి భర్త ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
నిచ్చెనలెక్కుదాం
వైకుంఠపాళి(కై లాసం) ఆట ఇంట్లో కూర్చుని పిల్లలు, పెద్దలు ఆడుకుంటారు. చిన్నారులు నాయనమ్మలు, అమ్మమ్మలతో కూర్చుని ఆడుకోవడం ద్వారా కుటుంబ విలువలు, మానవీయ విలువలు పిల్ల లకు అర్థం అవుతాయి. ఇది ఈ ఆట పరమార్థం. ఆట ఇలా... వైకుంఠపాళి ఆటను ఎంతమందైనా ఆడవచ్చు.. ఒక్కొక్కరు వేరువేరు రకాల పావులు అమర్చుకోవాలి. ఆట ఆడేవారంతా పటానికి ఎదురుగా కూర్చోవాలి. నాలుగు గవ్వలతో వందెం వేయాలి. పటంలో 1నుంచి 132 గళ్లు ఉంటాయి. గళ్లల్లో రకరకాల బొమ్మలు ఉండి గళ్లకు కింది భాగాన పాములు, ఏనుగులు ఉంటాయి. ఆటను 1 నుంచి(పాతాళం) మొదలుపెట్టి పావులను కదుపుతూ ఆట ఆడుతారు. కన్ను, రెండూ, మూడు, నాలుగు, ఎనిమిది వంటి పదాలు చెలామణిలో ఉన్నాయి. పటంలో 16, 19, 30, 41, 52, 63, 65, 74, 79, 87 సంఖ్యల గళ్లల్లో నిచ్చెనలు ఉంటాయి. పందెం వేసిన సంఖ్యను బట్టి నిచ్చెన ఎక్కవచ్చు. పుణ్యం చేసిన వారు నిచ్చెన సహాయంతో సులభంగా స్వర్గం చేరుతారనేది ఈ ఆటలో నమ్మకం. పటంలో అక్కడక్కడా పాములు ఉంటాయి. పావు పాము నోటిలో పడితే ఆటగాడు కిందకు జారి పోతాడు. ఇలా పావులతో నిచ్చెనలు ఎక్కుతూ పాములు మింగేస్తూ ఆట ముందుకు సాగుతుంది. – సాక్షి, కరీంనగర్ డెస్క్ -
శుభకార్యానికి వెళ్లివస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిధర్మపురి: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యకిత మృతి చెందాడు. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండం దమ్మన్నపేటకు చెందిన మైదం రాజన్న (65) శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై ఓ గ్రామానికి వెళ్లాడు. రాత్రివేళ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ధర్మపురిలోని తమ్మల్లకుంట వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని వెంటనే 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. హుజూరాబాద్రూరల్: వరంగల్ – కరీంనగర్ ప్రధాన రోడ్డు మందాడిపల్లి గ్రామ సమీపంలో కంటైనర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిహార్కు చెందిన హమాలీ రాజు మంజిత్ (18) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. సిరిసిల్లలో హమాలీ పని చేసుకునే కూలీలు స్వగ్రామానికి వెళ్లేందుకు కరీంనగర్ వరకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి వరంగల్కు ఆటో మాట్లాడుకున్నారు. ఆటో మందాడిపల్లి వద్దకు చేరుకోగానే వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. కంటైనర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైలు నుంచి పడి యువకుడు.. జమ్మికుంట: మండలంలోని బిజిగిరిషరీప్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా చింతకాని గ్రామానికి చెందిన దేవళ్ల రాజేశ్(33) రెండేళ్లుగా వరంగల్ పట్టణంలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజేశ్ సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని మృతుడి అన్న సతీశ్ ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేశా తిరుపతి వివరించారు. -
సమ్మర్ క్యాంపుపై సందిగ్ధం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలపై ఈసారి సందిగ్ధం నెలకొంది. ఏడేళ్లుగా (కరోనా వైరస్, ఎన్నికల కోడ్ మినహా) నిరంతరంగా కొనసాగుతున్న శిబిరాలు ఈసారి ఉంటాయా? లేదా? అన్న సందేహం కోచ్లు, తల్లిదండ్రులు, చిన్నారులను కలవరపెడుతోంది. 2017 నుంచి వేసవి శిబిరాలను ప్రారంభించిన నగరపాలక సంస్థ 2020, 2021లో కరోనా వైరస్ కారణంగా, 2024లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి అడ్డంకి లేకున్నా శిబిరాల నిర్వహణపై నగరపాలక సంస్థ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. శిబిరాలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. భారం అనుకుంటున్నారా? నగరంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉందని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే పాలు, గుడ్లు, అరటి పండ్లు, కోచ్లకు ఇచ్చే గౌరవ వేతనాల భారం తప్పించుకోవడానికే శిబిరాలను పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి పెంచే ఈ శిబిరాలు నిలిచిపోతే, యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి శిబిరాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు. శిబిరం నిర్వహణపై బల్దియా మౌనం ఉచిత శిక్షణ శిబిరాల సంప్రదాయానికి బ్రేక్? నిరాశలో చిన్నారులు, తల్లిదండ్రులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహణ ఇలా ఏడాది క్రీడలు కోచ్లు చిన్నారులు గౌరవవేతనం 2017 17 28 1,500 రూ.5,000 2018 20 40 2,500 రూ.5,000 2019 22 45 2,600 రూ.5,000 2022 27 72 3,200 రూ.5,000 2023 28 70 3,000 రూ.8,000 2025 17 35 1,700 ఇవ్వలేదు -
కల్లు దుకాణాల్లో నియంత్రణ కరువు
జగిత్యాలక్రైం: కల్లు షాపులపై అధికారుల నియంత్రణ కరువైంది. కొద్దిపాటి కల్లులోనే రసాయనాలు కలిపి భారీగా తయారుచేస్తూ సీసాల్లో నింపి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. చిన్నారులకు మద్యం విక్రయించవద్దని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కల్లు షాపుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు విక్రయించే కల్లుతో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్రోడ్లో తండ్రితో కలిసి ఓ నాలుగేళ్ల బాలుడు వచ్చినా నిర్వాహకులు అడ్డుచెప్పలేదు. పైగా అతడికి తండ్రే కల్లు తాగిపించడం గమనార్హం. దీంతో బాలుడే అక్కడే నిద్రమత్తులోకి జారుకున్నాడు. బాలుడు కల్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రితో కలిసి చిన్నారి కల్లు సేవిస్తున్నా అక్కడి షాపు యజమానులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువవడంతో ప్రజలకు అనారోగ్యం కలిగించే రసాయనాలు కలిపి కల్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని షాపుల్లో మత్తు పెంచేందుకు గుల్ఫారామ్ వంటి పదార్థాలు కలుతున్నా వాటిని పరిశీలించే వారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. తండ్రితో కలిసి కల్లు తాగిన బాలుడు కల్లు నిర్వాహకుల ఇష్టారాజ్యం -
ప్రశాంతంగా నీట్
కరీంనగర్ టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్)/కరీంనగర్ అర్బన్: వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎంట్రెన్స్ పరీక్ష ఆదివారం కరీంనగర్లో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని ఏడు కేంద్రాల్లో మొత్తం 2,928 మంది అభ్యర్థులకు 2,865 మంది పరీక్ష రాశారు. మహిళా డిగ్రీ కళాశాలలో 725 మంది, ఎస్సారార్ కళాశాలలో 704 మంది, కేంద్రీయ విద్యాలయంలో 376 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 305మంది, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో 283 మంది, టీజీఎస్డబ్ల్యూ చింతకుంటలో 239 మంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 233 మంది పరీక్ష రాశారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. మెటల్ డిటెక్టర్లు, బయోమెట్రిక్ విధానం ద్వారా పారదర్శకతను పాటించారు. పరీక్షా ప్రశ్నాపత్రం ఈ ఏడాది మధ్యస్థంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు మంచి ర్యాంకులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ చిత్రామిఽశ్రా తెలిపారు. కరీంనగర్లోని మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోఆర్డినేటర్లతో వసతులు, అభ్యర్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో అత్యధిక సంఖ్యలో హాజరై పరీక్ష రాశారని, హాజరుశాతం సంతృప్తికరంగా నమోదయిందన్నారు. ఏడు కేంద్రాల్లో 100శాతం బయోమెట్రిక్ హాజరు నమోదు చేసినట్లు తెలిపారు. -
కనికరించని మానవత్వం
● అనారోగ్యంతో యువకుడి మృతి ● తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో యాకుబ్(35) మరణించగా, కుటుంబసభ్యులు తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేశవపట్నం గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మకు కొడుకు యాకుబ్, కూతురు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి, యాకుబ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వీరయ్య, రుక్కమ్మలు రోడ్డు పక్కన టేలాలో చెప్పులు విక్రయించగా, ప్రస్తుతం వ్యాపారం లేక పోవడంతో కేశవపట్నం మేన్ రోడ్డుపై తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. యాకుబ్ రోడ్డుపక్కన గదిలో ఉండగా ఆదివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై యాకుబ్ శవాన్ని తల్లిదండ్రులతో పాటు సోదరి, బావ తీసుకెళ్లారు. సాహిత్యంతో పౌర సమాజం జాగృతంకరీంనగర్కల్చరల్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలింభవన్లో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ఆదివారం ‘కవన గోదారి’ కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్రెడ్డి, డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్, బొమ్మకంటి కిషన్, అనిత పాల్గొన్నారు. -
నేటి నుంచి రైతు వారం
కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యాచరణను రూపొందించగా సోమవారం నుంచి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం సాగు రంగానికి చేసిన సేవలు, విప్లవాత్మక మార్పులు, పంట రుణాలు, గతంలో చేసిన రుణమాఫీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అందులో భాగంగా ఈ నెల 4నుంచి 9 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వారం నిర్వహించనున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలైన పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, ఆత్మ, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నదాతకు అవగాహన కల్పించనున్నారు. కాగా, రైతు వేదికలే వేదికగా ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కార్యక్రమాలు ఇలా.. ● 4వ తేదీన: సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలను వివరించనున్నారు. ● 5న: ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఆదాయం, ఆయా పంటల అభివృద్ధి, ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు. ● 6న పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, మార్కెటింగ్ అవకాశాలు. ● 7న: వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్. ● 8న: వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశువుల సంరక్షణ వంటి వివరాలు. ● 9న: చెరువుల్లో కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత. వివిధ కార్యక్రమాల రూపకల్పన రైతు వేదికల్లో నిర్వహణ భూసార పరీక్ష ఫలితాల వెల్లడి -
ఆలయాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు
గన్నేరువరం/చిగురుమామిడి: జిల్లాలోని పలు ఆలయాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట శ్రీ మానసాదేవిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. పారువెల్ల శ్రీ లక్ష్మీగణపతి, మైలారంలోని స్వయం భూ శ్రీ మల్లికార్జునస్వామి వారి ని దర్శించుకున్నారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి రేణుక ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయా ఆలయ కమిటీల చైర్మన్లు ఏలేటి చంద్రారెడ్డి, వరాల పర్శరాములు, బద్దం తిరుపతిరెడ్డి న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెండ్యాల ఆమర్నాథ్ శర్మ, మామి డాల నాగసాయిశర్మ, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు, సర్పంచ్లు కర్నె చంద్రయ్య, చింతపూల నరేందర్ పాల్గొన్నారు. 5న మెగా జాబ్ మేళాకరీంనగర్స్పోర్ట్స్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 5న మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆదివారం జాబ్మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఈఈట్, టాస్క్, ఉపాధి కల్పన కార్యాలయ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుని డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల పూర్వ విద్యార్థుల వివరాలను సేకరించి, నిరుద్యోగులుగా ఉన్నవారికి సమాచారం చేరేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధశాఖల అధికారులు శ్రీనివాస్గౌడ్, తిరుపతిరావు పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: 33/11 కె.వీ. శాతవాహన విశ్వవిద్యాలయ సబ్స్టేషన్లో నూతన 8.0 ఎంవిఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చింతకుంట, కమాన్పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల పనులు చేపడుతున్నందున ఉదయం 9.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపూరి పీడర్ పరిధిలోని అల్కాపురి, నాగుల ఎల్లమ్మ ఆలయం, సవరన్ స్కూల్ వీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
అంతా నిమిషాల్లోనే..
చికిత్స పొందుతున్న ముస్తాక్కమలాసన్మధుకర్రాజేశ్నాడు మొరాదాబాద్ దొంగలు 2022 సెప్టెంబరు 5న కరీంనగర్లోని సెవెన్హిల్స్ సమీపంలో సాయివాణి రెడీమిక్స్కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ వెళ్లారు. నిందితులు ధరంపాల్, మనీశ్, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్ఫోర్స్ సీఐగా ఉన్న సృజన్రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది.సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్క్రైం: ఆదివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్ – విద్యుత్ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వచ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషాల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సైగలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, క్లూస్టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హై దరాబాద్ నుంచి వచ్చిన క్లూస్టీం సిబ్బంది రాత్రి పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. బీదర్ లేదా మహారాష్ట్ర వైపు? జ్యోతినగర్లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్లోకి లేదా జగిత్యా ల రూట్లో పారిపోవచ్చని స్కెచ్ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్, బీదర్ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ్యాగ్జిన్.. బులెట్లు స్వాధీనం ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, బులెట్లపై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. పలువురి పరామర్శ ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. దుండగుల దాడిలో గాయపడిన జువెల్లరీస్ సిబ్బంది ముస్తాక్, మధుకర్, రాజేశ్, కమలాసన్ను ఆస్పత్రి లో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రరెడ్డి సూచించారు.ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
వలస బతుకులు.. ప్రసవ బాధలు
● ఈనెల 2న బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సీతాదేవి (25) తన భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి దర్భాంగా వెళ్లే భాగ్మతి రైలు ఎక్కారు. టికెట్ లేకుండానే ఎస్–6 బోగీలో కూర్చున్నారు. శనివారం వేకువజామున వరంగల్ రైల్వేస్టేషన్ దాటాక సీతాదేవికి పురిటి నొప్పులు వచ్చి కూర్చున్న చోటనే సుఖప్రసవమై ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రామగుండం: బతుకుదెరువు కోసం బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిరక్షరాస్యులైన దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనులు చేసుకునేందుకు వలస వెళ్తుంటారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో గర్భిణులు ప్రసవించడంపై సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అనారోగ్యంతో సొంతూరు వెళ్లే క్రమంలోనే రైళ్లలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కాగా, వీరందరూ నిరక్షరాస్యులు కావడం గమనార్హం. మూసివేసి ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ రూమ్ సూదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కనీసం రైల్వే ప్లాట్ఫాంపై ప్రాథమిక వైద్య సేవలు అందించని దుస్థితిలో రామగుండం రైల్వేశాఖ ఉంది. ప్రాథమిక చికిత్స కోసం అత్యవసర గదిని ఏర్పాటు చేసి బోర్డు తగిలించినా తెరుచుకున్న పాపానా పోలేదు. అమృత్ భారత్ పథకంలో కోట్లాది నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించలేని దుస్థితిలో రైల్వేస్టేషన్ ఉంది. అవగాహన లేమితో నిండు గర్భిణుల రైలు ప్రయాణం రామగుండం రైల్వేస్టేషన్లో రెండు ఘటనలు స్టేషన్లో అత్యవసర వైద్యసేవలు కరువునెలలు నిండిన గర్భిణులు, అస్వస్థతతో ఉన్న వ్యక్తులు రైళ్లలో ప్రయాణం చేయడం సరికాదు. అత్యవసరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పెద్ద సిటీలలో వైద్య సేవలకు అనుకూలత ఉంటుంది. అటవీ ప్రాంతం సమీపంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే రైలు ప్రయాణాలు చేయాలి. – తిరుపతి, ఇన్చార్జి రైల్వే పోలీస్, రామగుండం -
హిందూ ఏక్తాయాత్రతో చరిత్ర సృష్టిద్దాం
కరీంనగర్: కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’ను దిగ్విజయవంతం చేసి చరిత్ర సృష్టిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివచ్చి హిందూ సంఘటిత శక్తిని చాటి చెప్పాలన్నారు. ఏక్తా యాత్రపై మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. పార్టీ నాయకులంతా వార్డులు, గ్రామ, మండలాల్లో ఇంటింటికీ వెళ్లి వినూత్న రీతిలో బొట్టు పెట్టి యాత్రకు రావాలని ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. మే 12న సాయంత్రం 4 గంటలకు, వైశ్యా భవన్ నుంచి హిందూ ఏక్తాయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. మోడీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలను సమీకరించాలని ఆయన సూచించారు. సభకు వచ్చే వారికి రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అభివృద్ధి పనులకు శ్రీకారం జ్యోతినగర్లోని కేడీఆర్ పార్కు వద్ద బండి సంజయ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి రూ.16 లక్షల సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. -
సబ్స్టేషన్ ఆవరణలో మంటలు
కొత్తపల్లి(కరీంనగర్): 220 కె.వీ. దుర్శేడ్ విద్యుత్సబ్స్టేషన్ ఆవరణలోని పోల్ సెంటర్లో ఆదివారం రా త్రి మంటలు చెలరేగాయి. గాలి దుమారం రావడంతో అల్గునూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 32 కె.వీ. లైన్లు ఒకదానికొకటి రాపిడి జరిగి అగ్ని రవ్వలు కిండపడ్డాయి. అక్కడున్న చెత్త, గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుర్శేడ్ సబ్స్టేషన్ను ఆఫ్ చేసి ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విద్యుత్ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్కో డీఈ భూమయ్య వెల్లడించారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాల క్రైం: జగిత్యాలలోని వాణీనగర్కు చెందిన విద్యుత్ శాఖ లైన్మన్ రమేశ్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. రమేశ్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో డబ్బులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మానాన్న లేని అభాగ్యులు
● ఏ ‘ఆధార’మూ లేని చిన్నారులు ● చేరదీసిన అమ్మమ్మ, నాన్నమ్మ ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ బాలుడు పుట్టు మూగ. కన్నవారి ప్రేమకు నోచుకోలేదు. ఏ ఆధారమూ లేదు. కనీసం ఆధార్ కార్డు కూడా లేని అభాగ్యుడు. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామపంచాయతీ పరిధి బీరప్పతండాకు చెందిన బట్టు శంకు పుట్టుకతోనే మూగ. అతడు పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. అప్పటి నుంచి తన అమ్మమ్మ బట్టు నానుకు వద్దే పెరుగుతున్నాడు. కనీసం ఆధార్ కార్డు కూడా లేక దివ్యాంగుల పింఛన్, చదువు, ఇతర పథకాలకు దూరమయ్యాడు. మనవడే ప్రాణం భర్త మరణించిన తర్వాత నానుకు అండగా నిలిచేవారు కరువయ్యారు. వృద్ధాప్య పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేక, చిన్న పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. మనవడు శంకును సాకడం ఆమెకు భారంగా మారింది. వయసు మళ్లినా కూలీ పనులకు వెళ్తే వచ్చే ఆదాయంతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు ఏదోలా రెక్కలు ముక్కలు చేసుకుంటానని, తర్వాత తన మనవడిని ఎవరు చూసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి బాలుడికి ఆధార్ ఇప్పించి, పింఛన్ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు. మరో బాలుడిది అదే వ్యథ బీరప్పతండాకే చెందిన మరో బాలుడు బట్టు శివ పరిస్థితి కూడా ఇంతే. అతడి తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియదు. నాన్నమ్మ బట్టు సక్కుబాయి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మమకారానికి దూరమై, తోటి పిల్లలను చూస్తూ ఈ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సదరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. బీరప్ప తండాలో బట్టు నాను, ఆమె మనవడు శంకు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. తక్షణమే ఆ బాలుడికి ఆధార్ నమోదు చేయించి, బట్టు నానుకు పింఛన్ వచ్చేలా కృషి చేస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా చూస్తాం. – బట్టు కృష్ణ, సర్పంచ్, బంజేరు -
మండుటెండల్లో పచ్చని పందిరి
మండుతున్న ఎండ.. నిప్పులు కురిపిస్తున్న భానుడు.. నిర్మానుష్యంగా రహదారులు.. ప్రధాన రహదారుల్లో నిలువ నీడలేక ప్రజలు అల్లాడిపోతుండగా.. నగరంలోని అంబేడ్కర్ స్టేడియం దారిలో ఇరువైపుల ఏపుగా పెరిగిన చెట్లు పచ్చని పందిరిని తలపిస్తున్నాయి. భగత్సింగ్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం మీదుగా ఎల్ఐసీ చౌరస్తా వరకు వాహనదారులు, ప్రయాణికులు, వాకర్లు, చిరువ్యాపారులకు చల్లని నీడనిస్తున్నా యి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు కాసేపు ఆగి స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ సేదతీరుతున్నారు. 50 మందికి పైగా చిరువ్యాపారులు ఈ చెట్లనీడన ఉపాధి పొందుతున్నారు. పచ్చని తోరణంలాంటి ఈ వాతావరణం కాంక్రీట్ అడవిలో ప్రకృతి ఇచ్చిన గొప్ప బహుమతిగా కనిపిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఈ మార్గం చక్కని ఉదాహరణ. – కరీంనగర్స్పోర్ట్స్ భగత్సింగ్ విగ్రహం నుంచి ఇండోర్ స్టేడియం గేట్ రహదారిలోఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే రహదారిలో పచ్చని చెట్లు -
నేటి నుంచి డివిజన్స్థాయి ప్రజావాణి
కరీంనగర్ అర్బన్: ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణితో పాటు ఇక రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి డివిజన్ స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రజావాణి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ స్థాయిలో జరిగే ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషికరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని 21వ డివిజన్లో నగరపాలకసంస్థ సాధారణ నిధులు రూ.17.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. నగర ప్రజలకు సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గ ధ్యేయం అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లను అభివృద్ధి పరుస్తామన్నారు. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ లో అన్ని డివిజన్లకు నిధులను కేటాయించి, ప్రజలకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్రెడ్డి పాల్గొన్నారు. -
పోటెత్తిన భక్తులు
వేములవాడ: మండుతున్న ఎండలను లెక్క చేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వేములవాడకు చేరుకుని తమ ఇలవేల్పు రాజన్న, భీమన్నలకు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీటి క్యాన్లను అందుబాటులో ఉంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులచే నీటి సరఫరా చేయించారు. భీమన్న సేవలో సుడా చైర్మన్ వేములవాడ భీమన్నను శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి మండపంలో శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు. -
అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలతో కలిసి శనివారం కలెక్టరేట్లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. సమస్య ల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. మేయర్, సుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అధికారులు సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నగర్ పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్తో పాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు. పేదలు సంక్షేమ పథకాలను వినియోగించు కోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. శాఖలవారీగా సమస్యల పరిష్కారం గంగాధర: ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిస్తూ, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాలులో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి, సాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఇప్పటికే రూ.23.50 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.20 కోట్లు మంజూరవుతాయన్నారు. మద్ధతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రతి గ్రామంలో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ సీ్త్ర, శిశు సంక్షేమం, స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇల్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఆఫీసర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవో రాము, తహసీల్దార్ రజిత పాల్గొన్నారు. -
అనుమతి తప్పనిసరి!
కొత్తపల్లి(కరీంనగర్): గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు తప్పనిసరిగా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా గ్రామ పంచాయతీ అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమల అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలపై పంచాయతీ పాలకవర్గాల్లో కదలిక మొదలైంది. నిధులలేమితో నిర్వీర్యంగా మారిన గ్రామ పంచాయతీలను ఓ గాడిలో పెట్టేందుకు ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గ్రానైట్ పరిశ్రమల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఎలగందుల, ఖాజీపూర్, నాగులమల్యాల, బద్ధిపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలతో పాటు గ్రానైట్ క్వారీలు, పెట్రోల్ బంక్లు, ఫాంహౌజ్లు, ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో నిత్యం రూ.కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయినప్పటికీ పంచాయతీల్లో ఆదాయం కనిపించడం లేదు. బావుపేట పాలకవర్గ అడుగుజాడల్లో గ్రామ పంచాయతీలకు నిధులు సేకరించడమే లక్ష్యంగా బావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరహాలోనే మిగిలిన గ్రామ పంచాయతీలు కదిలేందుకు సిద్ధమవుతున్నాయి. అనుమతిలేని గ్రానైట్ పరిశ్రమలు, ఫంక్షన్హాల్లు, పెట్రోల్ బంక్లు, ఫాంహౌజ్లు, క్రషర్లను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. స్పందించకపోతే సీజ్ చేస్తున్నారు. బావుపేటలో ఒక గ్రానైట్ పరిశ్రమను సీజ్ చేయడంతో మిగిలిన ఐదు పరిశ్రమలు అనుమతులు పొంది ఇంటి నంబర్ తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. పంచాయతీ పాలకవర్గంపై రాజకీయ ఒత్తిడి ప్రయోగించిన్పటికీ ఆదాయమే ప్రధాన ఎజెండా కఠిన నిర్ణయం తీసుకోవడంతోనే గ్రానైట్ పరిశ్రమల యజమానులు దారికొస్తున్నారు. అనుమతులకు సంబంధించిన మొత్తం చెల్లించేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వేదికగా నిర్ణయం జరగడంతో నోటీసులిచ్చిన ‘గ్రానైట్ పంచాయతీ’ కొంతమేర సమసింది. ఇదే తరహాలో ఖాజీపూర్, బద్ధిపల్లి తదితర గ్రామ పంచాయతీలు ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. అనుమతిలేని నిర్మాణాలపై దృష్టి కొత్తపల్లి మండలంలో అనుమతిలేని నిర్మాణాలపై పంచాయతీ పాలకవర్గాలు దృష్టి సారించాయి. అనుమతిలేని ఫంక్షన్ హాళ్లు, ఫాంహౌజ్లు, పెట్రో ల్ బంక్లను గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతుల అంశాన్ని అమాత్యులకు తెలపకుండా క్షేత్రస్థాయిలో కొంతమంది వారి పేర్లు చెబుతూ పంచాయతీ అధికారులను బెదిరించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అసలు విషయం తెలియని అమాత్యులు అనవసరంగా బదనాం అవుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. -
ఇలాగైతే ఎలా
ధరలను తగ్గించాల్సిందిపోయి ఏటికేడు ధరలను పెంచుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ధర ఒకప్పుడు రూ.2వేలు ఉండేది. మూడున్నరేళ్లలో రూ.3వేలకు పైగా చేరింది. ఈ ధరను సాకుగా చూపి వినియోగదారులపై భారం వేస్తున్నారు. – శిరీష, కట్టరాంపూర్టిఫిన్ సెంటర్తో ఉపాధి పొందుతున్న. ఇప్పటికే మా రంగంలో పోటీ ఎక్కువ. ఇపుడేమో గ్యాస్ ధరను ఏకంగా రూ.993 పెంచారు. ఆ ధరతో టిఫిన్లు చేయడం.. ఇపుడున్న ధరతోనే కస్టమర్కు టిఫిన్ సరఫరా చేయాలంటే మాకు గిట్టుబాటు కాదు. టిఫిన్ ధర పెంచితే కస్టమర్లు వస్తారో.. రారో..? – అనిల్, వ్యాపారి -
ఎస్సారార్లో రెండు కొత్త కోర్సులు
కరీంనగర్ సిటీ: కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండు నూతన అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం(ఏఈడీపీ) కోర్సులు మంజూరు చేశారని ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ శనివారం తెలి పారు. కొత్తగా మంజూరు చేసిన బీకాం బీఎఫ్ ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), బీఎస్సీ హెల్త్ కేర్ ఏఈడీపీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. వీటితో పాటు బీఎస్సీ లైఫ్ సైన్స్లో ‘మెడికల్ ఫిజియాలజీ’ అనే కొత్త సబ్జెక్టు కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో సీట్ల పెంపు చేపట్టినట్లు తెలిపారు. బీఎస్సీ లైఫ్సైన్స్లో 300 సీట్లకు అదనంగా 60, బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో 60 , బీఏ (సీబీసీఎస్) ఇంగ్లిష్ మీడియంలో 60, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్లో 60 సీట్లు పెంచినట్లు పేర్కొన్నారు. దీంతో కళాశాలలో మొత్తం సీట్లు 1,980కు పెరిగినట్లు తెలిపారు. నూతన కోర్సులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకి ష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. శ్రీదేవసేన, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, ప్రొఫెసర్ పి.బాల భాస్కర్, కళాశాల విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ కె. సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపల్లి(కరీంనగర్): అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ భద్రతపై రైతులు, వినియోగదారులకు అవగాహన కల్పించాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ సూచించారు. శనివారం సర్కిల్ ఆఫీస్లో విద్యుత్ భద్రత వారోత్సవాల ఆవశ్యకతను వివరించి ప్రమాణం చేయించా రు. విద్యుత్ ప్రమాదాలను జీరోస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశింంచారు. స్తంభంపై సిబ్బంది పనిచేసేటప్పుడు విధిగా సేఫ్టీ బెల్ట్, ఎర్త్ రాడ్, హెల్మెట్, ఓల్టేజ్ డిటెక్టర్, ఇతర పరికరాలు ధరించాలని సూచించారు. ప్రమాద సూచనలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. డీఈలు ఉపేందర్, రాజం, ఏడీఈలు పి.శ్రీనివాస్, ఎం.లావణ్య పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి పథకం ద్వారా కరీంనగర్ అశోక్నగరలో ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వహిస్తున్న శక్తి సదన్ కేంద్రాన్ని శనివారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి డి.వెంకటేశ్ సందర్శించారు. శక్తి సదన్ నిర్వహణ, బాధితులకు అందిస్తున్న సేవలు, కల్పిస్తు న్న సౌకర్యాలను పరిశీలించారు. శక్తి సదన్ సూపరింటెండెంట్ ఎ.రమాదేవి, సిబ్బంది వసంత, రజిత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: నేడు జరిగే నీట్ ప్రవేశ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీ, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, అలుగునూరులోని కేంద్రీయ విద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్, ఉజ్వల పార్కు సమీపంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాల, చింతకుంట ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, కేబుల్ బ్రిడ్జి సమీపంలోని మైనార్టీ స్కూల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. పటిష్ట భద్రత కరీంనగర్క్రైం: నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు , ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయించాలని ఆదేశించారు. -
టెండర్ల మతలబేమిటి?
కరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్లో చెత్తను బయోమైనింగ్ చేసేందుకు పిలిచిన టెండర్లను ఎందుకు ఓపెన్చేయడం లేదని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. శనివారం నగరంలో మాట్లాడుతూ డంప్యార్డ్లో చెత్తను తగ్గించేందుకు ఇటీవల రూ.2 కోట్లతో బయోమైనింగ్ కోసం టెండర్ పిలిచారన్నారు. టెండర్లో ఐదుగురు పాల్గొన్నారని, టెండర్ ఓపెన్చేయడం లేదన్నారు. తమకు నచ్చిన వారికి రాదనే భయంతోనే టెండర్ ఓపెన్కు అధికారులు వెనుకాడుతున్నట్లున్నారని విమర్శించారు. ఓ వైపు డ ంప్యార్డ్తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే, టెండర్లో జాప్యం ఎందుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కార్పొరేటర్లు, వారి భర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. అదే కాంట్రాక్టర్లు తిట్టినా అధికారులు కిమ్మనడం లేదని మండిపడ్డారు. కార్పొరేటర్లపై కేసులు పెట్టడంలో ఉన్న ఉత్సాహం అవినీతి అధికారులపై కేసులకు ఉండడం లేదన్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నగర ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని విమర్శించారు. నగరపాలకసంస్థ కమిషనర్, ఎస్ఈ అవినీతిపై తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేసి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.ఉద్యమం ఏదైనా కరీంనగర్ నుంచే మొదలవుతుందని, కార్పొరేటర్లంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు తుల భాస్కర్రావు, దండబోయిన రాము, మల్లేశం, మైకెల్ శ్రీనివాస్, కెమసారం తిరుపతి, రంగు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
శివారు కాలనీలకు ప్రాధాన్యం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని శివారు కాలనీలు, విలీన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 21వ డివిజన్ విద్యానగర్లో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, తాగునీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తమ పాలకవర్గం లక్ష్యం అన్నా రు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో హౌసింగ్, మున్సిపల్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండ్లు త్వరగా పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరై నిర్మాణాలు చేపట్టలేమని నగరపాలకసంస్థకు రాసిచ్చిన వారిస్థానంలో కొత్తగా అర్హులైనవారిని ఎంపిక చేయాలని సూ చించారు. డివిజన్లవారీగా ఎల్–1లో ఉన్న లబ్ధి దారులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నిజమైన అర్హులను ఎంపిక చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): వానాకాలంలో రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి సూ చించారు. లైసెన్స్ కలిగిన విక్రయ కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసి, బిల్ తీసుకోవా లన్నారు. కొత్తపల్లి రైతు వేదికలో శుక్రవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. తక్కువ యూరియా వాడాలని, సాగు ఖర్చును తగ్గించాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని, సుస్థిర ఆదాయాన్ని పొందాలన్నారు. మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. వరిలో సాగుచేసే రకాల గురించి ఆర్ఏఆర్ఎస్ పొలా స శాస్త్రవేత్త డా.మధుకర్; కోతుల బెడదలేని ఆయిల్ పామ్ పంట సాగు గురించి సహాయ వ్యవసాయ సంచాలకుడు కె రణధీర్రెడ్డి వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.చత్రు నాయక్ పేర్కొన్నారు. ఏవో కె.సంతోష్కుమార్, ఏఈవో రాము పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా వి.ఆంజనేయరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పెద్దపల్లి ఇంటర్ విద్యాధికారి డి.కల్పన, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.సత్యవర్ధన్రావు, ఏ.సత్యనారా యణ, సీహెచ్.శశిధర్శర్మ, కె.రాజేశ్వర్రావు, రాష్ట్ర ప్రిన్సిపా ల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, జిల్లా జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, లైబరీయన్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్, ఇంటర్ విద్యా బాధ్యులు కిరణ్, బల్బీర్సింగ్ అభినందించారు. కొత్తపల్లి(కరీంనగర్): మేడేకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘శ్రమశక్తి’ అవార్డుకు టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని అలుగునూరు సెక్షన్ ఏఏవో కొండూరు శ్రీనివాస్ ఎంపికయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. -
జలగల దందా.. అడ్డుందా!
ఆటోలో ఉన్న క్యాన్లను పరిశీలించారా.. ఏ క్యానూ శుభ్రంగా లేదు. నగరంలోని భగత్నగర్లో గల శుద్ధజల కేంద్ర వాహనమిది. రోజు వేల లీటర్ల విక్రయాలు జరుగుతుండగా శుభ్రత శూన్యం. వినియోగదారులకు నీటిపై అవగాహన లేకపోవడంతో శుద్ధ జలమని తాగేస్తున్నారు.కరీంనగర్ అర్బన్: వేసవి అవసరాలను ఆధారంగా చేసుకుని విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు, గంగాధర, రామడుగు, శంకరపట్నం, తదితర ప్రాంతాల్లో సుమారు 750 వరకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించాయి. వీటిలో బీఎస్ఐ అనుమతి ఉన్న కేంద్రాలు కేవలం నాలుగే కాగా, మిగతావన్ని నామమాత్రపు అనుమతితో నడుస్తున్నవే. జిల్లా అధికారులుండే కరీంనగరంలోనే వందల సంఖ్యలో కేంద్రాలు దర్జా ఒలకబోస్తూ ప్రజల ప్రాణాలతో అటలాడుతున్నాయి. విచ్చలవిడి ప్లాంట్లు.. లక్షల వ్యాపారం జిల్లాలో 750కి పైగా శుద్ధజల కేంద్రాలు ఉండగా నాలుగింటికి అనుమతి ఉంది. అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లలో కరీంనగర్ నగరపరిధిలో 200 వరకున్నాయి. కూల్వాటర్, మినరల్ వాటర్ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. నీటిని శుద్ధి యంత్రాలకు ప్రభుత్వపరంగా గుర్తింపు లేకపోవడం గమనార్హం. గంటకు 2వేల లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల సామర్థ్యం గల వాటర్ ప్లాంట్లు నివాస ప్రాంతాల్లో చిన్న చిన్న గదుల్లో నిర్వహిస్తున్నారు. ప్లాంట్లలో వినియోగించే పైపులు, నిల్వ చేసే ట్యాంకులు స్టీలువి వినియోగించాల్సి ఉండగా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్రతిరోజూ సరఫరా అయ్యే నీటిని తనిఖీలు చేయాల్సి ఉన్నా ఏ ఒక్కచోటా అది జరగడం లేదు. నీటి కోసం ము న్సిపల్శాఖ అనుమతి లేకుండానే బోర్లు వేస్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు కనీసం 5గుంటల స్థలం కావాల్సి ఉండగా, 200 అడుగుల గదుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. మినరల్ వాటర్ క్యాన్లు నింపడానికి ప్రత్యేక సదుపాయాలతో గదులు కావాల్సి ఉండగా ఆరుబయట పైపుల ద్వారా నింపుతున్నారు. క్యాన్లను శుద్ధిచేసే ప్రక్రియ వేడి నీటిని ఉపయోగించి ప్రెజర్ బ్రష్లతో చేయాల్సి ఉండగా దానిని పూర్తిగా విస్మరించారు. కొందరు మున్సిపల్ కుళాయిల్లో వస్తున్న నీటినే క్యాన్లలో నింపి మినరల్ వాటర్ పేరుతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కేంద్రాల్లో ఇవెక్కడ? వాటర్ ప్లాంట్ నెలకొల్పాలంటే మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలి. శుద్ధజల కేంద్రాన్ని నిర్వహించాలంటే భారత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం మైక్రో బయోలజిస్టు, కెమిస్టులు ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్ను పరీక్షిస్తూ ఉండాలి. నీటిలో పూర్తిగా కరిగిన లవణాలను పరీక్షించాలి. పీహెచ్ 7.5శాతం కన్నా తగ్గితే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా నీటి ఽశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనీసం 10 గదులుండాలి. వాటర్ ప్లాంట్లో నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన యంత్రాలు, వాటి నిర్వహణ, నాణ్యత ప్రమాణాలను ఫుడ్ కంట్రోల్ శాఖాధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అనధికారికంగా నడిచే వాటర్ ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారులేం చేస్తున్నట్లు.. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తుండగా సంబంధితశాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఏనాడు సదరు కేంద్రాలపై కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి అక్రమంగా కేంద్రాన్ని కొనసాగించాలంటే సాహసంతో కూడుకున్న పని. అలాంటిది ఏళ్లకు ఏళ్లుగా దర్జాగా దందా చేస్తున్నారంటే అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి లభ్యత ఆధారంగా భూగర్బజల శాఖ నీటి ఏర్పాటుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఏ విధమైన పైపులు వాడుతున్నారు, నీటి శుద్ధికి ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో ఉపయోగిస్తారనే దానిని ఆహార తనిఖీ అధికారులు పరీక్షించాలి. శుద్ధి చేసిన నీటిని తాగేందుకు అనువుగా ఉందా లేదా అనేది వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ధారించాలి. -
చిరునవ్వులు చెదిరి‘పోయాయి’
అది వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే రహదారి. ఏమైందో ఏమో. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఒక్కరు మాత్రమే కొన ఊపిరితో చావుబతుకుల్లో ఉన్నారు. వేసవి సెలవుల్లో ముగ్గురు చిన్నారుల చిరునవ్వులు చెదిరిపోయాయి. అమ్మానాన్నలతో కలిసి సరదాగా వెళ్లి ఆ పసి హృదయాలు రోడ్డు ప్రమాదంలో ఆగిపోయాయి. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగు రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మరణించడం విషాదం నింపింది.● హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసుల మృతి ● ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం ● అందులో ముగ్గురు పిల్లలు ● చిన్న కారు.. పెద్ద ప్రమాదంసిరిసిల్ల: సిరిసిల్లలోని సర్ధార్నగర్కు చెందిన బొల్లి శివకుమార్కు వ్యాగనార్(టీఎస్23ఎఫ్2298) కారు ఉంది. అందులో అతడి భార్య బొల్లి లాస్య, కూతు రు బొల్లి రిషిత, బావ కోడం శ్రీనివాస్(ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్, వేములవాడ), చెల్లెలు శ్వేత(ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది), అల్లుళ్లు కోడం కృష్ణచంద్ర, కోడం మాధవ్తో కలిసి ఆలయానికి వెళ్లి వస్తుండగా.. అతివేగంగా వెళ్తూ శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. కోడం శ్వేత కొన ఊపిరితో ఉన్నారు. ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్న కారు పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇంటికి తాళం వేసి.. సిరిసిల్లకు చెందిన బొల్లి రాజు బీడీ కంపెనీ టేకేదార్. సర్ధార్నగర్లో నివాసముండే రాజు–భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు శివకుమార్, శిరీష్, ఒక కుమార్తె శ్వేత. ప్రమాదంలో కొడుకు, అల్లుడు, కోడలు, వాళ్ల ముగ్గురు పిల్లలు మరణించగా.. కూతురు శ్వేత చావుబతుకుల్లో ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో సిరిసిల్లలో విషాదం అలుముకుంది. ప్రమాద ఘటన సమాచారం తెలియగానే బొల్లి రాజు కుటుంబం ఇంటికి తాళం వేసి హుటాహుటిన హైదరాబాద్కు తరలివెళ్లారు. చివరి సెల్ఫీలో మృతులు ఆరుగురు.. సరదాగా నవ్వుతూ ఆ రెండు కుటుంబాలు ఎంతో ఉల్లాసంగా తీసుకున్న ఆ సెల్ఫీ చివరిదైంది. ఏడుగురు తీసుకున్న సెల్ఫీలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఫొటోలోని ఆరుగురు విగత జీవులు కాగా.. ఓఆర్ఆర్పై శవాలను ఉంచడం సిరిసిల్ల వాసులను ఆవేదనకు గురి చేసింది. ఆఖరు సెల్ఫీలో ఉన్న వారిలో ఒక్క శ్వేత తప్ప అందరూ మరణించడం బాధాకరం. హైదరాబాద్ తరలిన ఆత్మీయులు రెండు కుటుంబాలకు చెందిన ఆత్మీయులు హైదరాబాద్కు తరలివెళ్లారు. శవాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శ్వేత కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. సిరిసిల్లకు చెందిన పలువురు హైదరాబాద్ తరలివెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్లో బొల్లి రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చెట్టుకు ఢీకొన్న ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు
మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని రేగుంట శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన వాసం మురళి గూడ్స్ ఆటోలో గొర్రెపల్లి నుంచి రేగుంట వైపు వస్తుండగా, అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ మురళిని అంబులెన్స్లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మల్లాపూర్ ఎస్సై అనిల్, పోలీసు సిబ్బందితో ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి
కరీంనగర్ టౌన్: సమాజ అభివృద్ధిలో కీలకమైన కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ చిత్రామిశ్రా భరోసానిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన భవన నిర్మాణ రంగ కార్మికులను వెల్ఫేర్ బోర్డు కింద నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక సాయం గురించి తెలిసేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి వ్యాపారులు, గ్రిగ్, మున్సిపల్ తదితర విభాగాల్లో పనిచేస్తూ, అసంఘటిత కార్మికులుగా నమోదు కాకుండా ఉంటే వెంటనే నమోదు చేయించాలని ఆదేశించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల శ్రమతోనే దేశం, రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందుతున్నాయన్నారు. శానిటేషన్ కార్మికుల భద్రత, బీమా, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ బ్రోచర్ ఆవిష్కరించారు. బెస్ట్ ఎంప్లాయీమెంట్, బెస్ట్ మేనేజ్మెంట్, స్పెషల్ కేటగిరీ పురస్కారాలు అందించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ కోలా ప్రసాద్, జిల్లా ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ తిరుపతిరావు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గంగాధర్రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్ అశోక్ పాల్గొన్నారు. పక్కాగా నియోజకవర్గస్థాయి కార్యక్రమాలుకరీంనగర్ అర్బన్: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం నిర్వహించే నియోజకవర్గస్థాయి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్లో శనివారం జరిగే నియోజకవర్గస్థాయి సమావేశాలు, ధాన్యం కొనుగోలు..నీట్ పరీక్ష ఏర్పాట్లు.. రైతువారం విజయవంతంపై సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు పక్కా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 4నుంచి ప్రారంభమయ్యే రైతువారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఈ నెల 5న మెగా జాబ్మేళాను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో టాస్క్, ఎంప్లాయీమెంట్, ఇండస్ట్రియల్, స్పోర్ట్స్శాఖల అధికారుల సమక్షంలో జాబ్మేళా పోస్టర్ విడుదల చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తిమ్మాపూర్: మండలకేంద్రంలో రాజీవ్రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భాషాగూడకు చెందిన బడావత్ ప్రదీప్ నాయక్ (24) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ఏప్రిల్ 30న మధ్యాహ్నం ప్రదీప్ తన స్నేహితుడి మహీంద్రా థార్ను తీసుకొని సోదరి నందిని, ఆమె స్నేహితురాలు, స్నేహితుడు పవన్, మంచిర్యాలకు బయల్దేరారు. నందిని స్నేహితురాలిది మంచిర్యాల కావడంతో ఆమెను దించి రాత్రి అక్కడే ఉన్నారు. తిరిగి శుక్రవారం ఉదయం మహేశ్వరం బయల్దేరారు. మండలంలోని మహాత్మానగర్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రదీప్నాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనంలో ఉన్న నందిని, పవన్కున గాయాలయ్యాయి. వీరిని 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ప్రదీప్ తండ్రి బదావత్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరికి గాయాలు తిమ్మాపూర్ మండలకేంద్రంలో ఘటన -
గీత కార్మికుడి బలవన్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పంది ర్ల శ్రీనివాస్గౌడ్(56) అనే గీతా కార్మికుడు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్లో శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. తన భార్య గ్రామంలోని ఓ శుభకార్యానికి వెళ్లింది. అనంతరం తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కొంతకాలంగా శ్రీని వాస్గౌడ్ అప్పులతో బాధ పడుతున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లిఫ్ట్ ఇస్తానని చైన్ చోరీముస్తాబాద్(సిరిసిల్ల): అమ్మలాంటిదానివని నమ్మించి.. బైక్పై లిఫ్ట్ ఇస్తానని వృద్ధురాలిని ఎక్కించుకున్న అపరిచిత వ్యక్తి పుస్తెలతాడు దొంగిలించాడు. నిందితుడి ఫొటోలను ముస్తాబాద్ ఎస్సై గణేశ్ శుక్రవారం విడుదల చేశారు. ఎస్సై వివరాల ప్రకారం.. గత నెల 20న ఆవునూర్కు చెందిన పొన్నాల యాదమ్మ(65) అనే వృద్ధురాలు సిద్దిపేటలో ఉన్న కుమార్తె ఇంటికెళ్లింది. తిరుగు ప్రయాణంలో సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద యాదమ్మ బస్సు కోసం వేచి ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటూ యాదమ్మను పలకరించాడు. ముస్తాబాద్కు వెళ్లాలని యాదమ్మ చెప్పగా.. తాను అటే వెళ్తున్నానని, అమ్మలాంటిదనివని బైక్పై ఎక్కించుకున్నాడు. ముస్తాబాద్ శివారులోకి రాగానే యాదమ్మ మెడలోని బంగారు పుస్తెలతా డును లాక్కొని పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్సై వివరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యాదమ్మను మోసం చేసిన వ్యక్తి ఫొటోలు, వీడియోలు వెలుగు చూశాయన్నారు. సదరు గు ర్తుతెలియని వ్యక్తి తెల్లని షర్టులో ఉన్నాడని, మర్యాదస్తుడిలా కనిపిస్తూ మోసాలకు పాల్ప డుతున్నట్లు గుర్తించామని అన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులోని మానేరు తీరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. జిల్లాలోని ముత్తారం మండల కేంద్రానికి చెందిన తడవేన పోచాలు(35) పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి గ్రామ శివారులో శుక్రవారం చేపల వేటకు వెళ్లాడు. అక్కడ ఏమైందో ఏమోగానీ స్థానికులకు మృతి చెంది కనిపించాడు. వడదెబ్బతో మృతి చెందాడా? లేదా వేరే ఇతర కారణంతో మృతి చెందాడా? అనేది తెలియడం లేదు. ఈవిషయం పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. -
ప్రత్యామ్నాయం.. ప్రశాంత ప్రయాణం
● రద్దీ రూట్లలోనూ సులభంగా రైలు టికెట్లు ● పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం రామగుండం: ప్రస్తుత వేసవిలో పర్యాటక, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయి తే, తక్కువ వ్యయంతో సుఖంగా, ప్రశాంతంగా ప ర్యటన సాగేందుకు రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. సుదూర ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి.. ముఖ్యంగా సందర్శన స్థలాలకు రైల్వే కనెక్టివిటీ, రైళ్ల వివరాలు తదితర అంశాలపై కొంత అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు. వారణాసి, న్యూఢిల్లీ, బెంగళూరు, చైన్నె త దితర ప్రాంతాలకు నడిచే డైరెక్ట్ రైళ్లు రెండు నెలల ముందే రిజర్వేషన్లు పూర్తవుతాయి. సాధారణ బో గీల్లో కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అప్పటికప్పుడు టూర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నా ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించాల్సిందే. తద్వారా ఖర్చుభారం పెరుగుతుంది. ఇందుకు ప్ర త్యామ్నాయంగా సమీప ప్రాంతాలకు వెళ్లే రైళ్లపై ప్ర త్యేక దృష్టి సారిస్తే.. టికెట్లు సులభంగా లభ్యమ య్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ వైపు వెళ్లాలంటే హ జ్రత్ నిజాముద్దీన్, డెహ్రాడూన్, చైన్నె వైపు వెళ్లేవా రు ఎగ్మోర్, తాంబరం, పెరంబూర్, చెంగల్పట్టు, అ రక్కోణం, గూడూర్, రేణిగుంట, బెంగళూరు వైపు వెళ్తే యశ్వంతపూర్ తదితర రైళ్ల ద్వారా ప్రధా న కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. వీటిపై అవగాహన ఉంటే ప్రయాణం సుఖమయమవుతుంది.వారణాసి వైపు వెళ్లేందుకు.. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య సందర్శించాలనుకునే వారికి రైలు సౌకర్యం బాగానే ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి నేరుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. వీటికి రెండునెలల ముందే బుకింగ్ పూర్తయ్యింది. అయితే, ప్రత్యామ్నాయంగా వారణాసికి 16 కిలోమీటర్ల దూరంలో పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ(డీడీయూ) రైల్వేస్టేషన్ మీదుగా అనేక రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లను ఆశ్రయిస్తే డీడీయూ రైల్వేస్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా వారణాసి, అయోధ్య వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
గల్ఫ్లో గుండెపోటుతో గొల్లపల్లి వాసి మృతి
● స్వగ్రామం చేరిన మృతదేహం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉన్న ఊర్లో ఉఫాధి లేక పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ వెళ్లిన రైతు అక్కడే గండెపోటుతో మరణించగా.. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. శవపేటిక రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకట్రెడ్డి(48) అనే గల్ఫ్ కార్మికుడు మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై మలేషియాలో మృతిచెందాడు. స్వగ్రామంలో ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం ఆరేళ్ల క్రితం కంపెనీ వీసాపై గల్ఫ్కు వెళ్లాడు. 22 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి తిరిగి మలేషియాకి వెళ్లిన వెంకట్రెడ్డి గదిలోనే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ సమాచారాన్ని అక్కడి మిత్రులు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించాలని సిరిసిల్ల శాసన సభ్యుడు కేటీఆర్ను కోరగా.. స్పందించిన కేటీఆర్ అక్కడి అధికారులతో మాట్లాడి 4 రోజుల్లో మృతదేహం ఇంటికొచ్చేలా చర్యలు తీసుకున్నారు. అంత్యక్రియల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ పాల్గొన్నారు. మృతుడికి భార్య వనజ, కుమార్తె జావలి ఉన్నారు. -
విద్యుదాఘాతంలో వ్యక్తి మృతి
కోరుట్ల రూరల్: పట్టణంలోని హాజిపురాకు చెందిన వావిలాల నవీన్ (28) అనే వ్యక్తి శుక్రవారం విద్యుదాఘాతంలో మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. పట్టణ శివరులోని ఎల్లమ్మ గుడి వద్ద గల వాగులో చేపలు పట్టేందుకు కరెంటు వైర్ ఉపయోగించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని అన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో హోటల్ దగ్ధం వీర్నపల్లి: మండలంలోని కంచర్లలో షార్ట్ సర్క్యూట్తో బస్టాండ్ వద్ద ఓ గుడిసెతో పాటు చాట్ల శంకర్ అనే వ్యక్తికి చెందిన హోటల్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.20 వేలవరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీపీకి సంబంధించిన బోరుమోటార్ వైర్లు కూడా కాలిపోవడంతో, సుమా రు రూ.10 వేల వరకు నష్టం జరిగింది. సర్పంచ్ సామల్ల దేవరాజ్, జీపీ సిబ్బంది రైతులు మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. -
ఒకేరోజు 11 అగ్ని ప్రమాదాలు
కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా శుక్రవారం 11 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రాంతాలకు సమయానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఫైర్ అధికారుల వివరాల ప్రకారం కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో కేబుళ్లు, గంగాధర మండలం కురిక్యాల, కొత్తపల్లి మండలం మల్కాపూర్లో పంటచేలు, కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారంలో శక్తి కాటన్ ఇండస్ట్రీస్లో మంటలు చెలరేగాయి. చొప్పదండి మండలం మల్లన్నపల్లిలో, గుమ్లాపూర్లో పంటచేలు దగ్ధమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అల్గునూర్లో గడ్డివాము దగ్ధమైంది. హుజూరాబాద్ కోతుల నడుమలో గడ్డివాము, జయశంకర్ భూపాలపల్లి మండలం మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపేటలో మొక్కజొన్న చేనులో మంటలు తలెత్తడంతో జమ్మికుంట ఫైర్ సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆయా ఘటనల్లో కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, జమ్మికుంట ఫైర్ సిబ్బంది పాల్గొన్నట్లు డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు రైస్మిల్లుల్లో అగ్నిప్రమాదాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. -
ప్రమాదవశాత్తు బావిలోపడి యువకుడు మృత్యువాత
తిమ్మాపూర్: ప్రమాదవశాత్తు యువకుడు బావిలోపడి మృతి చెందిన ఘటన తిమ్మాపూర్లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పొరండ్ల గ్రామానికి చెందిన బొజ్జ రాజ్కుమార్(32) డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం మిత్రుడితో కలిసి మానేరు జలాశయం వైపు వెళ్లాడు. సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ముఖం కడుక్కునేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. రాజ్ కుమార్కు ఈత రాకపోవడంతో తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజకుమార్కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజ్కుమార్ మృతికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంతాపం వ్యక్తం చేశారు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కరీంనగర్: పిల్లల ఆరోగ్యం, భద్రత, సమగ్ర అభి వృద్ధికి సమాజం కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ప్రజాపాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రిలో నిర్వహించిన బాలల భద్రత, రక్షణ, సంక్షేమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అ మలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.మాట్లాడుతున్న డీఎంహెచ్వో వెంకటరమణ -
మేడే.. ‘ఫ్రై’డే
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 దాటితే బయటికి వెళ్లాలంటే భయమేస్తోంది. నెత్తిపై నిప్పుల కుంపటి కురుస్తోంది. శుక్రవారం 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రలు నమోదైన క్రమంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం మేడే సందర్భంగా కార్మికులకు విశ్రాంతి దొరకగా.. చిరువ్యాపారులు ఎండకు తల్ల డిల్లిపోయారు. ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరగా వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయాలు అనుసరిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
కొత్తపల్లి(కరీంనగర్)/సిరిసిల్ల/హుజూరాబాద్: విద్యుత్ వినియోగదారుల్లో భద్రతాపరమైన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ సింగాపూర్ సబ్స్టేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఎస్ఈ ఆఫీస్లో గురువారం వారోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ లైన్లను పరిశీలిస్తూ.. అంతరాయరహితంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి, ప్రజలకు ,రైతులకు విద్యుత్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించాలని సీఎండీ ఆదేశించారు. సమావేశాలు, ప్రచార కార్యక్రమాల ద్వారా భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగించాలని అన్నారు. విద్యుత్ ప్రమాదాలు అధికశాతం నిర్లక్ష్యం, అజాగ్రత్త, అవగాహన లేక జరుగుతున్నాయని తెలిపారు. జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చన్నారు. విద్యుత్ పరికరాలను నిర్లక్ష్యంగా వినియోగించడం, నాసిరకమైన లేదా పాడైపోయిన తీగలను వాడడం, సరైన ఎర్తింగ్ సదుపాయం లేకపోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకరమైన లైన్లు, వంగిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న తీగలను పొడవాటి స్తంభాలను అమర్చి ఎత్తు పెంచడం , ప్రజలకు సురక్షితంగా విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని చర్యలూ యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని వరుణ్రెడ్డి వివరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రోజూ 24 గంటలూ అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్ 1912 కు వెంటనే సంప్రదించాలన్నారు. కరీంనగర్ ఎస్ఈ ఆర్.రవీందర్, రాజన్న సిరిసిల్ల ఎస్ఈ టి.వేణుమాధవ్, డీఈలు లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, అనిల్ కుమార్, ఏడిఈ శ్రీనివాస్, ప్రశాంత, ఏఈ రమేష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల్లోనే 860 వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశామని సిరిసిల్ల సర్కిల్ ఎస్ఈ వి.వేణుమాధవ్ గురువారం తెలిపారు. జిల్లాలో గత ఏడాది 1,752 విద్యుత్ సర్వీసులు మాత్రమే మంజూరు అయ్యాయని, నెల రోజుల్లోనే 860 అనుమతులు ఇచ్చామన్నారు. పెండింగ్ ఉన్న 1540 సర్వీసులన్నీ జూన్లోగా పూర్తిచేశామని వివరించారు. జిల్లాలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, పనులు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తామని వేణుమాధవ్ తెలిపారు. నేటి నుంచి విద్యుత్ భద్రత వారోత్సవాలు 7వ తేదీ వరకు వినియోగదారులకు విద్యుత్ భద్రతపై అవగాహన పోస్టర్ ఆవిష్కరించిన టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరణ్రెడ్డి -
చెట్టుకు కారు ఢీకొని యువకుడి మృతి
రాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి శివారులో కారు చెట్టును ఢీకొనడంతో చాపల్లి రాంబాబు (31) అనే వలస కూలీ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఏఎస్సై సైఫోద్దీన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో పదేళ్లుగా మేసీ్త్ర పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఉదయం కూలీల కోసం కారులో జగిత్యాలకు వెళ్తుండగా.. కుమ్మరిపల్లి శివారుకు చేరగానే.. అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. డాడీ.. ఒక్కసారి మమ్మల్ని చూడు అంటూ ఐదేళ్ల చిన్నారులు రాంబాబు మృతదేహంపై ఏడ్వడం అందరినీ కలిచివేసింది. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలూరులో ఏడిళ్లలో చోరీరాయికల్: రాయికల్ మండలం ఆలూరులో ఒకేసారి ఏడు ఇళ్లలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గొల్ల పల్లి దుబ్బయ్య ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, పదహారు తులాల వెండి, పిట్టల సుజాత ఇంట్లో నుంచి రెండు తులాల బంగారం, రూ.40 వేలు, రాజారపు మనోహర్ ఇంట్లో నుంచి తులం బంగారం, సురతాని రాజు ఇంట్లో నుంచి 10 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. గొల్లపల్లి భూమరాజం, రాజారపు రాజేందర్, చిల్ముల మల్లక్క ఇళ్లలో దొంగతనానికి యత్నించారు. జగిత్యాల రూరల్ సీఐ సుదాకర్, ఎస్సై సుధీర్రావు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్, డ్యాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. వడదెబ్బతో వ్యక్తి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం సూరారంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జాడీ లచ్చయ్య (62) పంటపొలం కోయిస్తుండగా.. వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంటికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించేందుకని 108కు అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. లచ్చయ్య భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. క్యాటరింగ్కు వెళ్లి వస్తూ.. ఆటో బోల్తా ● ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు మంథనిరూరల్: శుభకార్యంలో క్యాటరింగ్ చేసి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామ సమీపంలోని గాడుదులగండి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదావరిఖని గంగానగర్కు చెందిన రజిత(35) మృతి చెందగా, ధనలక్ష్మి, శ్రవణ్కుమర్కు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. గోదావరిఖని గంగానగర్కు చెందిన రజిత, ధనలక్ష్మి క్యాటరింగ్ చేస్తుంటారు. గురువారం ఉదయం కాటారంలో జరిగిన ఓ శుభకార్యానికి ఆటోలో వెళ్లి క్యాటరింగ్ చేసి తిరిగి వస్తున్నారు. రేగులగూడెం వద్ద కమాన్పూర్కు చెందిన శ్రవణ్కుమార్ అనే పురోహితుడు మంథనికి వచ్చేందుకు ఈ ఆటోలో ఎక్కాడు. అయితే గాడుదులగండి మూలమలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రజిత అక్కడికక్కడే మృతి చెందగా ధనలక్ష్మి, శ్రవణ్కుమార్కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహంతోపాటు గాయడిన వారిని మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎల్నినో హెచ్చరికలతో నిద్రలేచిన సీఎం
జగిత్యాలటౌన్: ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు అంటూ కొత్త ఎత్తులు వేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. 152 మీటర్లకు మహా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని 148 మీటర్లకు ఇరు రాష్ట్రా ల మధ్యం ఒప్పందం కుదిరిన విషయం తెలిసి కూడా కా లయాపన కోసమే 150 మీటర్ల ఎత్తు అంటూ కొత్త కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడిచి, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆయన కుటుంబ ఆర్థిక లబ్ధి కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం గాలికొదిలేశారన్నారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం.. కేసీఆర్ను దోషిగా చూపెట్టడం తప్ప మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోయి 30నెలలు గడుస్తుంటే రేవంత్రెడ్డి ఇప్పుడు నిద్రలేచాడని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదని ప్రశ్నించారు. ఎల్నినో హెచ్చరికలతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తెలంగాణ ఎడారిగా మారితే దోషిగా నిలవాల్సి వస్తుందన్న భయంతోనే ఎత్తు పెంపు బాధ్యత కేంద్రమంత్రి కిషన్రెడ్డిదే అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు 152మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ను ఒప్పించాలని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందంలో కేంద్రమంత్రి పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. కిషన్రెడ్డిని బూచిగా చూపి మరింత కాలయాపనకు రేవంత్ కుట్ర చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. మాయమాటలు మానుకుని రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దావ వసంత, హరిచరణ్రావు ఉన్నారు.


