breaking news
Karimnagar District Latest News
-
స్తంభాలపై అల్లుకున్న ప్రమాదం
సిరిసిల్లఅర్బన్: ఇంటర్నెట్ వైర్లు.. డిష్వైర్లు కరెంట్ స్తంభాలపై వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో కరెంట్ స్తంభాలపై ప్రమాదకరంగా వివిధ రకాల తీగలు వెళ్తున్నాయి. విద్యుత్ స్తంభాలపై చిందరవందరగ వెళ్తుండడంతో షార్ట్సర్క్యూట్ జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా సెస్ అధికారులు కరెంటు స్తంభాలపై ఏర్పాటు చేసిన వైర్లను సరిచేసి జరుగకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రమాదాలు ఇలా.. ● జిల్లా కేంద్రంలోని గణేష్నగర్లో ఓ విద్యుత్ స్తంభంపై డిష్కేబుల్ వైర్లు, నెట్ కేబుల్వైర్లు, విద్యుత్తు వైర్లు తగిలి షార్ట్సర్కూట్తో విద్యుత్తు స్తంభంపై ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డిష్వైర్లతోనే షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● గీతానగర్ స్కూల్ ప్రహరీని ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న మీటర్బాక్స్కు డిష్, ఇంటర్నెట్కు సంబంఽధించిన వైర్లు తగిలి షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగాయి. ● సిరిసిల్ల పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీ విద్యుత్ తీగలకు తగిలి మంటలు చెలరేగాయి. ● జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద గల ఎస్బీఐ బ్యాంకు ఎదుట గల ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై లూజువైర్లు తగిలి నిప్పురవ్వలు పడి ట్రాన్స్ఫార్మర్పై ఉన్న చెత్త,చెదారానికి అంటుకొని ఒక్కసారిగా మంటలు లేచాయి. ఇంటర్నెట్, డిష్కేబుళ్లతో షార్ట్సర్క్యూట్ చెలరేగుతున్న మంటలు భయాందోళనలో స్థానికులు పోల్ రెంటల్ చార్జీలు వసూలు చేస్తాం సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను కేబుల్ ఆపరేటర్లు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. తీగలను గుర్తించి వారి నుంచి ఎన్పీడీసీఎల్ నింబంధనల ప్రకారం పోల్ రెంటల్ చార్జీలను వసూలు చేయాలని 10 రోజుల క్రితమే నిర్ణయించాం. కేబుల్ ఆపరేటర్లతో కూడా చర్చించాం. విద్యుత్పోల్పై చిందరవందరగా వైర్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – రామసుబ్బారెడ్డి, సెస్ ఏడీఏ -
విశిష్ట సేవలకు అరుదైన గౌరవం
సిరిసిల్ల: మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపు.. వ్యాపారాల్లో రాణించేలా శిక్షణ.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా జావాబుదారీతనం పెంపొందించడంలో ఇల్లంతకుంట మండల సమాఖ్య కృషి ఎనలేనిది. ఏళ్లుగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల సమాఖ్య ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఈ అవార్డు అందుకోనుంది. ఈమేరకు గురువారం ఆహ్వానం అందింది. 46 వీవోలు.. 1103 సంఘాలు ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య పరిధిలో 46 విలేజ్ ఆర్గనైజేషన్(వీవో)లు ఉండగా 1,103 స్వయం సహాయక సంఘాలు 11వేలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ఆర్థికంగా అండగా.. నిలుస్తూ.. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుంది. గత ఐదేళ్లకు పైగా స్వయం సహాయక సంఘాలకు(ఎస్హెచ్జీ)ల సభ్యులకు రుణాలు అందించడం వాటిని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించేలా చూడడం, సభ్యులకు బీమా కల్పించడం, వివిధ వ్యాపారాల్లో రాణించేలా నిరంతరం శిక్షణ, సలహాలు ఇస్తుంది. సామాజికంగా అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, నీటి వనరుల సంరక్షణ ప్లాస్టిక్ వినియోగించొద్దని, సైబర్ మోసాలకు గురి కావద్దని అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు జీవనోపాధి పెంచే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇల్లంతకుంట మండల సమాఖ్య చేస్తున్న సామాజిక, ఆర్థిక సేవలను గుర్తిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేశారు. 22 క్లస్టర్ లెవల్ ఫెడరేషన్లలో ఎంపిక దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న మండల సమాఖ్యలకు అవార్డులు అందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండల సమాఖ్యల పనితీరును పరిశీలిస్తారు. దీన్దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మండల సమాఖ్యలను గుర్తించి ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డు–2024 ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు దేశవ్యాప్తంగా 22 మహిళా సంఘాలను ఎంపిక చేసింది. అవార్డులకు దేశంలోని ఆరు రీజియన్ల పరిధిలో 22 క్లస్టర్ లెవల్ ఫెడరేషన్లు(సీఎల్ఎఫ్)లు ఎంపికవగా.. సదరన్ రీజియన్ కింద రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య రెండో స్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద నిర్వహించే అవార్డుల ప్రదాన ఉత్సవానికి ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులను ఆహ్వానించారు. ఈమేరకు ఢిల్లీకి వెళ్లి అవార్డును అందుకోనున్నారు. అభినందించిన కలెక్టర్ ఇల్లంతకుంట మండలం ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలందించి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా గురువారం అభినందనలు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, మండల సమాఖ్య బాధ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇల్లంతకుంట మండల సమాఖ్యను ఆదర్శంగా తీసుకుని మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇల్లంతకుంట మండల సమాఖ్యకు జాతీయ అవార్డు ఆగస్టు 15న ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డు ప్రదానం అభినందించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
సీనియర్ సిటిజన్లే టార్గెట్
● రెచ్చిపోతున్న సైబర్నేరగాళ్లు ● సీబీఐ పేరుతో వీడియోకాల్స్ బెదిరింపులు ● యువతుల పేర్లతో సొమ్ము దోచుకుంటున్న వైనం ● భారీగా మోసపోతున్న బాధితులు‘మంచిర్యాల జిల్లా లక్షటిపేట్కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ను సైబర్నేరగాళ్లు భారీగా మోసం చేశారు. మీ అమ్మాయి ఓ కేసులో పట్టుబడిందని సీబీఐ పేరుతో వీడియోకాల్స్ చేసి సీబీఐ లోగోతో వార్ రూం సృష్టించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మీరు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లవద్దు. మీపై సీబీఐ నిఘా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్లో కన్పించి నమ్మేలా చేశారు. భారీ మొత్తం అకౌంట్లో వేయాలని, లేకుంటే కుటుంబం మొత్తం కేసులో ఇరుక్కుంటారని చెప్పి రూ.1.70కోట్లు దండుకున్నారు. మొత్తం చెల్లించాక బాధితుడు మోసపోయామని గ్రహించి రామగుండం సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించారు’. ‘స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా లాభం వస్తుందని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ముందుగా రూ.10వేలు లాభం చూపించారు. తర్వాత వాట్సాప్లో లింక్లు ఇచ్చి దాన్ని క్లిక్ చేయమని లాభాలు చూపిస్తూ రూ.1.40కోట్ల వరకు మోసం చేశారు. తాను పెద్దమొత్తంలో మోసపోయాయని భావించి బాధితుడు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు’. గోదావరిఖని(రామగుండం): అమాయకత్వం, అత్యధిక డబ్బు సంపాదించాలనే ఆశ పెద్ద మొత్తంలో నష్టపోయేలా చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి లావాదేవీలు, ఇతర వ్యాపకాలను గమనించి వారి కుటుంబ సభ్యుల ఫొటోలు సేకరించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. రామగుండం సైబర్క్రైం పోలీస్స్టేషన్ పరిధిలోని లక్షట్టిపేట్కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ భారీగా నష్టపోయాడు. బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి శ్రీమీ అమ్మాయి ఓ కేసులో చిక్కుకుందని ఆమె ఫొటోలను వాట్సప్లో షేర్ చేసి వారం నుంచి నెలరోజుల పాటు సీబీఐ ఆఫీసర్ల మాదిరిగా వీడియోకాల్లో మాట్లాడుతూ, ఐపీఎస్ ఆఫీసర్ దుస్తుల్లో బెదిరించి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలాంటి కొత్తరకం సైబర్ మోసాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. వాట్సప్లో లింక్లు ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసి అందులో డబ్బులు వేయాలని సూచిస్తున్నారు. ముందుగా పెట్టిన పెట్టుబడికి రూ.10వేల వరకు లాభం చూపించి తర్వాత మోసానికి పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల సెల్ఫోన్ నంబర్లు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అలాగే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నారు. క్రిఫ్టోలో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తున్నాయని వారి అకౌంట్లో చిన్న పాటి లాభాలు చూపిస్తున్నారు. తర్వాత ఒక్కో వ్యక్తి నుంచి రూ.40లక్షల నుంచి రూ.2కోట్లవరకు మోసం చేశారు. దీంతో పాటు మ్యారేజ్బ్యూరో పేరుతో తాము పెళ్లికాని యువతిని అని పరిచయం చేసుకుని కొన్నాళ్లపాటు చాటింగ్ చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్యాప్ ఇచ్చి తాను విదేశాల్లో ఉన్నానని ఈ–మార్కెటింగ్ చేస్తున్నానని ఇందులో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపిస్తున్నారు. వారి మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టి పెద్దమొత్తంలో మోసపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. డబ్బులు ఊరికేరావని గమనించాలి ఆన్లైన్లో డబ్బులు ఊరికే రావన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. ఆన్లైన్ లింక్లను క్లిక్చేసి మోసపోవద్దు. దీనివల్ల అకౌంట్ డిటేయిల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయి. ఇటీవల కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. ఢిల్లీ సీబీఐ ఆఫీసర్లమని చెప్పి వీడియో కాల్స్ ద్వారా బెదిరిస్తూ భారీగా సొమ్ము డిమాండ్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ప్రజలు భయపడి మోసపోవద్దు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే సైబర్ క్రైం పోలీసులు లేదా 1930 నంబర్ను సంప్రదించాలి. – వెంకటరమణ, ఏసీపీ, సైబర్క్రైం, రామగుండం -
కూరగాయల సాగుకు అనువైన పరిస్థితులు
జగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయల సాగుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ జిల్లాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో గురువారం జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు, డ్రిప్ కంపెనీలు, ఆయిల్ పాం కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ రెండు జిల్లాల్లో ఎర్రనేలలు ఎక్కువగా ఉండటంతో కూరగాయలతోపాటు పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. మామిడి తోటలకు జగిత్యాల జిల్లా హబ్గా ఉన్నందున మామిడిలో దిగుబడి పెంచేలా కృషి చేయాలని కోరారు. రెండు జిల్లాల్లో అరటి తోటల విస్తీర్ణం పడిపోయిందని, ఆ వైపు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున.. వరి సాగు చేసే రైతుల దృష్టిని మరల్చేందుకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రిప్ పరికరాలను సబ్సిడీపై మరింత ఎక్కువ మంది రైతులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఉద్యానశాఖ పథకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉద్యానశాఖాధికారులు శ్యాంప్రసాద్, జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
స్మార్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● హాజరైన తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీ వేములవాడ: నాలుగు వేదాలు చదివే పాఠశాల వేములవాడలోనే ఉండటం, వేదపండితులకు జాతీయస్థాయిలో స్మార్థ పరీక్షలు రాజన్న సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేదాలను ఇతర దేశాలు ఆచరిస్తున్నాయన్నారు. రాజన్న ఆశీస్సులతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చేస్తున్నారన్నారు. రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న స్మార్థ పరీక్షల ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. ఆలయాన్ని 4 ఎకరాల్లో విస్తరిస్తున్నామని, అభివృద్ధికి మొదటి దశలో రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు గోషాలలో వేములవాడలో ఒకటి ఉందన్నారు. సువిశాలమైన గోశాల నిర్మాణానికి 40 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ రాజన్న ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ప్రాచీన ప్రాముఖ్యత గల ఆలయమన్నారు. ఆలయ విస్తరణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ఈవో రాధాభాయి, అర్చకులు పూర్ణకుంభ కలశంతో ఘనస్వాగతం పలికారు. -
జల్సాల కోసం చోరీలు
● పోలీసులకు చిక్కిన ముఠా ● వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ పెద్దపల్లిరూరల్: జల్సాగా జీవితం గడిపేందుకు సులువుగా సొమ్ము సంపాదించాలని చోరీలకు పాల్పడిన సద్దాం అలీతో పాటు అతడికి సహకరించిన అన్న అన్వర్ అలీ, తల్లి సలీమా, బంధువు మహమ్మద్ సలాంపై కేసు నమోదు చేశామని ఏసీపీ కృష్ణ తెలిపారు. నిందితుడి తల్లి సలీమా పరారీలో ఉండగా సద్దాం, అన్వర్, సలాంను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. గురువారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సద్దాం అలీ 25 మే 2025 రోజున పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్లో నివాసముండే కొట్టె శ్రీవిద్య ఇంట్లోకి చొరబడి 58 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,260 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లాడు. అదే రోజున గండు అనూష ఇంట్లో 8గ్రాముల బంగారు, 300 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేల నగదు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంగా ఏర్పడి పెద్దపల్లితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు గాలిస్తున్నారని గ్రహించిన సద్దాం, అతడి తల్లి, సోదరుడు మంచిర్యాలకు మకాం మార్చారు. దొంగిలించిన సొత్తును మంచిర్యాలకు చెందిన బంధువు మహమ్మద్ సలాం సాయంతో అమ్మేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. పరారీలో ఉన్న నిందితుడి తల్లి సలీమా కోసం గాలిస్తున్నట్టు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా దొంగలముఠాను పట్టుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, మల్లేశ్, రమేశ్, నరేశ్కుమార్, సనత్రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్ ప్రభాకర్, రాజు, శరత్, వెంకటేశ్, శ్రీనివాస్, అనిల్ సతీశ్ను డీసీపీ కరుణాకర్, ఏసీపీ అభినందించారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
గంగాధర: కరీంనగర్– జగిత్యాల ప్రధా న రహదారిలో గతనెల 30న ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆయన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వేముల రవి(42) గత నెల 30న తన తమ్ముడు, కొడుకుతో కలిసి కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మధురానగర్ శివారులో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. బైక్పై ఉన్న ముగ్గురు కింద పడగా వెనుకాల కూర్చున్న వేముల రవికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వేముల లచ్చయ్య ఫిర్యాదుతో బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. గడ్డి మందు తాగి వివాహిత..ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తిప్పాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఐశ్వర్య అలియాస్ శైలజ బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐశ్వర్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం మరణించింది. మృతురాలికి భర్త లక్ష్మణ్, కొడుకు ఆర్యన్(2) ఉన్నారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరితనం భరించలేక ఆత్మహత్యఇల్లంతకుంట(మానకొండూర్): ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బుధవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లంతకుంట ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని గాలిపల్లికి చెందిన దండు శ్రీనివాస్(40) గత పదమూడేళ్లుగా చీర్లవంచలోని తన అక్క వద్ద ఉంటున్నాడు. ఒంటరితనంతో ఏమి చేయాలో తోచక రెండు రోజుల క్రితం తన స్వగ్రామం గాలిపల్లిలో ఉన్న తన అన్న ఎల్ల య్య ఇంటికి వచ్చాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని అన్న ఎల్లయ్య ఫిర్యాదుతో ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వివాహిత..ధర్మపురి: ఇంట్లో జరిగిన చిన్న గొడవకు మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన సమ్మయ్యతో బోయినపల్లి మండలం విలాసాగర్కు చెందిన శ్రీవాణితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు అజయ్, కూతురు అక్షిత ఉన్నారు. సమయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో తన పిల్లలతో గొడవ పడింది. క్షణికావేశంలో ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకుంది. పిల్లలు కొద్దిసేపటికి గమనించి గట్టిగా అరవడంతో ఇంటి పక్కనున్న బంధువులు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి శ్రీవాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీవాణి తండ్రి సంపంగి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కూలీగా మారిన కళాకారుడు
జూలపల్లి(పెద్దపల్లి): తెలంగాణ ఉద్యమంలో ఆటాపాటలతో ఉద్యమకారులను ఉర్రూతలూగించిన కోనరావుపేటకు చెందిన కళాకారుడు మల్లారపు అనిల్ ఉపాధి కరువై కూలీగా మారాడు. మిలియన్ మార్చ్లోనూ కాళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రత్యేక వేతనంతో కళాకారులను నియమించగా.. ఇందులో అనిల్కు స్థానం లభించలేదు. సంక్షేమ పథకాల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో అప్పటి కలెక్టర్ శ్రీదేవసేన ప్రశంసాపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు, సంక్షేమ పథకాల ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్న అనిల్కు సాంస్కృతిక శాఖ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంటర్వ్యూకు పిలిచినా.. కొందరు ఉద్యమ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక ఉద్యోగావకాశాలు కల్పించింది. కానీ, అనిల్కు అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 జనవరి 13న ఇంటర్వ్యూలకు పిలిచి, పాటలు పాడించింది. ఆ తర్వాత కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పటికై నా తనకు ప్రోత్సాహం అందించాలని అనిల్ కోరుతున్నాడు. -
విపత్తులో ‘ఆపద మిత్ర’ ముందుండాలి
కరీంనగర్ అర్బన్: ప్రకతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించేందుకు ‘ఆపద మిత్ర’ వలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్సీసీ వలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం బీసీ స్టడీ సర్కిల్లో ఆమె ప్రారంభించారు. అవగాహన లేకపోవడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎదుర్కునేందుకు మొదటిదఫాలో గ్రామాల్లో, పట్టణాల్లో పని చేసే ప్రభుత్వరంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. రెండో విడతలో డిగ్రీ, ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫైర్, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ, సైబర్ తదితర అధికా రుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క కాటు, అగ్నిప్రమా దం, సీపీఆర్, షాట్ సర్క్యూట్, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణను ఇవ్వనున్నామని అన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు శిక్షణ తీసుకున్న వారు ప్రమాదాల నివారణకు ముందుంటారన్నా రు. నైపుణ్యాలతో కూడిన శిక్షణతో తమను రక్షించుకోవడంతో పాటు పదిమంది ప్రాణాలు కాపాడగలరని పేర్కొన్నారు. శిక్షణకు హాజరైన వారు నేర్చుకున్న నైపుణ్యాలను, మెలకువలను మరో పదిమందికి నేర్పించాలని సూచించారు. ఆపద ఎప్పుడైనా రావొచ్చని.. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. డీఆర్వో వెంకటేశ్వ ర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
జమ్మికుంట: పట్టణంలోని ఆర్వోబీ కింద స్థలాల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ రెండోరోజు కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ ఎండీ.అయాజ్ ఆధ్వర్యంలో పలు దుకాణాలను, టేలాలను తొలగించారు. జమ్మికుంట పట్టణం వ్యాపారకేంద్రంగా కొనసాగుతోందని, చుట్టు పక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిపోతుంటారని కమిషనర్ తెలిపారు. వారి వాహనాలను నిలిపేందుకు ఆర్వోబీ కింద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిజమైన చిరువ్యాపారులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, టీపీవో శ్రీధర్, టీపీటీవో దీపిక, శానిటరీ ఇన్స్స్పెక్టర్ మహేశ్, సదానందం, ఏఈ నరేశ్, ఆర్ఐ భాస్కర్, ఎన్వీరాల్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఎకరాకు ఒకటే బస్తా
● యూరియాపై నియంత్రణ ● బ్లాక్మార్కెట్కు తరలకుండా చర్యలు ● ఏడీఏలకు పర్యవేక్షణ బాధ్యతలు ● ఆందోళనలో జిల్లా రైతులుకరీంనగర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం యూరియా వినియోగం తగ్గించడంతోపాటు బ్లాక్మార్కెట్కు తరలిపోకుండా చర్యలు చేపట్టింది. రైతులు విచ్చలవిడిగా పంట పొలాల్లో యూరియాను వాడడంతో పలు సమస్యలేర్పడుతున్నాయి. దిగుబడి పెంచేందుకు ఉపయోగిస్తున్న యూరియా పంటల ఉత్పత్తులపై ప్రభావం చూపుతోంది. యూరియా వాడకం తగ్గించాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం యూరియా వాడకం తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు ఒకటే బస్తాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కన్నా ఎక్కువ బస్తాలు పంపిణీ చేస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఏడీఏలకు పర్యవేక్షణ బాధ్యత జిల్లాలో యూరియా అమ్మకాలను పర్యవేక్షించే బాధ్యతను నలుగురు ఏడీఏలకు అప్పగించారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి ఏడీఏల ఆధ్వర్యంలో నాలుగు తనీఖీ బృందాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ డివిజన్లో చొప్పదండి ఏడీఏ, హుజూరాబాద్లో మానకొండూరు ఏడీఏ, మానకొండూరులో హుజురాబాద్ ఏడీఏ, చొప్పదండిలో కరీంనగర్ ఏడీఏకు తనిఖీ బాధ్యతలు అప్పగించారు. వీరు సంబంధిత ఏవోలతో కలిసి ఆయా డివిజన్లలోని ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజు తనిఖీ చేస్తున్నారు. ఈ పాస్ మెషిన్లు పరిశీలించి ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలిస్తున్నారు. ఇటీవల కరీంనగర్రూరల్ మండల పరిధిలోని డీలరు ఓ రైతుకు ఒకే పట్టాదారు పాసుపుస్తకంపై 50 బస్తాలను అమ్మినట్లు అధికారులు గుర్తించారు. తనకు సమాచారం లేకపోవడంతో యూరియా అమ్మానని, మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటానని సదరు డీలరు చెప్పడంతో అధికారులు విడిచిపెట్టారు. పక్కదారి పట్టకుండా ఉండేందుకే యూరియా బ్లాక్మార్కెట్కు తరలకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు పంటల దిగుబడి పెంచేందుకు యూరియాను వినియోగిస్తుండగా అక్రమార్కులు పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్ల్లో ఉపయోగిస్తున్నారు. యూరియాతో లిక్కర్ తయారు చేసే అవకాశముండటంతో కంపెనీల యాజమాన్యాలు అడ్డదారిలో సేకరిస్తున్నాయి. కొంతమంది దళారులు రైతులు పేరిట యూరియాను పెద్దమొత్తంలో సేకరించి బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎకరాకు ఒటే బస్తా ఇవ్వాలనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. ఎకరానికి ఒక బస్తా సరిపోదని, కనీసం రెండు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన దరిమిలా.. ప్రభుత్వం వేలాది మంది లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయగానే.. ఇంటి నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం... ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. అందులోనూ కట్రౌతు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, స్టీలు టన్నుకు రూ.2000, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం రూ.200 చొప్పున ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికాదు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపైనా తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు ధరాభారం పడుతోంది. సిమెంట్ ధరలు పెరుగుతాయని అని ప్రచారం ఊపందుకుంది. దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది.జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 2,04,504 8,219 8,219 742 129 జగిత్యాల 1,99,965 7,601 7,601 209 30 పెద్దపల్లి 1,63,000 9,421 6,018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7,826 7,826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1,810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2,700 రూ. 3,900 రూ.1,200 కంకర(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 ఐరన్(టన్ను) రూ. 55,000 రూ. 57,000 రూ. 2,000 ఇసుక(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 మొరం(ట్రిప్పు) రూ. 1,000 రూ. 1,200 రూ. 200 -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను త్వరగా పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో చేపట్టిన 34 ప్రాజెక్టుల పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ లైబ్రరీ భవనం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనం, బాలసదన్ భవనంతో పాటు ఇతర పనులను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన ప్రాజెక్టుల్లో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈలు లచ్చిరెడ్డి, ఓంప్రకాశ్, అయ్యూబ్ ఖాన్, ఏఈలు సతీశ్, గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అక్రమాలపై విచారణ జరిపించాలి● సుడా చైర్మన్ నరేందర్రెడ్డి కరీంనగర్కార్పొరేషన్: నగరంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పేరిట గత పాలకులు పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంచనాలు పెంచి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, చేసిన పనుల్లోనూ నాణ్యత లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ తాజ్, కట్ల సతీశ్, చర్ల పద్మ, కొరివి అరుణ్కుమార్, శ్రవణ్నాయక్, దన్నాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ల పరిశీలనకరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం గురువారం స్లాట్ బుక్ చేసుకున్న 626 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డి.శోభారాణి తెలిపారు. మూడో రోజు ఎప్సెట్ కౌన్సెలింగ్ సజావుగా సాగినట్లు ఆమె వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బహిరంగప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బహిరంగ మద్యసేవనంపై ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌస్ఆలం ప్రకటించారు. దీంతో పాటు డీజేలపై, డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత ఏసీ పీల నుంచి అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడని సూచించారు. విద్యాసంస్థల బంద్ విజయవంతం కరీంనగర్: పెండింగ్లో ఉన్న ఫీజుబకాయిలు, స్కాలర్షిప్ విడుదల చేయాలని జార్జ్రెడ్డి పీడీఎస్యూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన డిగ్రీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కోర్సు విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్ తెలిపారు. నాలుగేళ్ల నుంచి విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రూ.8వేల కోట్ల ఫీజుబకాయిలు పెండింగ్లో ఉంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థులు పైచదువులకు వెళ్లాలంటే వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా యా జమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నరేశ్, రత్న, ప్రకాశ్, రవీందర్, నాగరాజు, సు ధాకర్, సందీప్, రాకేశ్, శ్రీమాన్ పాల్గొన్నారు. -
జగిత్యాలలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 18వ స్టోర్ను సినీ నటి, యాంకర్ అనసూయ ప్రారంభించారు. ఆధునాతన కలెక్షన్స్తో నిత్యం నూతన వైరెటీలతో కాసం పేరుగాంచిందని తెలిపారు. జగిత్యాలలో ఈ స్టోర్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇది జగిత్యాల జిల్లావాసులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నిర్వాహకులు మల్లికార్జున్, కేదరినాథ్, శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 18 స్టోర్లను ప్రారంభించామన్నారు. షాపింగ్మాల్ ఎదుట సందడి యాంకర్ అనసూయ జగిత్యాలకు రావడంతో షాపింగ్మాల్వద్ద సందడి నెలకొంది. అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో షాపింగ్ మాల్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆటపాటలతో సందడి చేసిన అనసూయ -
వరదకు దారేది?
● కబ్జా కోరల్లో మత్తడి కాల్వలు ● నిర్జీవమైపోతున్న సిరిసిల్ల చెరువులు ● జలవనరులనూ వదలని కబ్జాదారులు ● పరాధీనంలో రూ.కోట్లు విలువైన ఆస్తులు ● పట్టింపులేని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సిరిసిల్లటౌన్: కబ్జాకు కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. అధికారుల పట్టింపులేమి తనం అక్రమార్కులకు కలసొస్తుంది. సిరిసిల్లలో నిబంధనలను అతిక్రమించి మత్తడికాల్వలు కబ్జాకు గురయ్యాయి. పట్టణ నడిబొడ్డున పారే చెరువుల మత్తడి(వ్యవసాయ) కాలువలు ఇప్పుడూ పరాధీనమయ్యాయి. సంబంధిత శాఖలు అటువైపు చూడకపోవడంతో చెరువులు జీవం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఏళ్ల తరబడిగా చెరువుల కాల్వలు(నాలాలు) దురాక్రమణ పాలైన తీరుపై సాక్షి ప్రత్యేక కథనం. ● సిరిసిల్ల చుట్టూ గొలుసు చెరువులు పూర్వీకులు వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం సిరిసిల్ల చుట్టూ తొమ్మిది చెరువులు గొలుసుకట్టు పద్ధతిలో నిర్మించారు. వర్షాలతో ఒక చెరువు నిండాక దాని కింద చెరువుకు నీరుపోయేలా తవ్వించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఇందులో రాయినిచెరువు, తుమ్మలకుంటలను నివాస స్థలాలుగా అభివృద్ధి చేయగా వాటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పట్టణానికి ఇరువైపులా ఉన్న కొత్తచెరువు, కార్గిల్లేక్ చెరువులు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి నీటిపారుదల, మున్సిపల్శాఖల ఆధీనంలో ఉన్నాయి. అర్జున్కుంట, ఈదులచెరువు, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్నాయి. కొత్తచెరువు, కార్గిల్లేక్ స్థలాలు, మత్తడికాల్వలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారు. కానీ చర్యలు తీసుకోవడంలో కినుక వహించడం విమర్శలకు తావిస్తోంది. ● నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయినిచెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం విస్తరించింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకే వరద పోటెత్తుతోంది. పై నుంచి వచ్చే వరదనీరు ఆయా ప్రాంతాల్లో నిలువకుండా వరదకాల్వలు లేకపోవడంతో వర్షాకాలంలో ముంపుకు గురువుతున్నాయి. ఇక చెరువుకట్టలను ఆనుకుని ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదన్న నిబంధనలకు భిన్నంగా పరిస్థితి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామరకుంటలను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొత్తచెరువు, కార్గిల్లేక్ల కాల్వలు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ లెవల్ స్థలాలు కబ్జాకు గురవడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల చెరువులు, కాల్వలకు 30 ఫీట్ల దూరంలోపే నిర్మాణాలు జరుగుతున్నాయని వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ● కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కార్గిల్లేక్, రాయినిచెరువు, తుమ్మలకుంట, కొత్తచెరువుల మత్తడికాల్వలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువు వందల కోట్లలోనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. ఒక్కో కాలువ 33 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ల పొడవుగా ఉండేవాటి విస్తీర్ణం వందల ఎకరాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో సగటున గజానికి రూ.30వేలకు తక్కువ లేదు. అందుకే అక్రమార్కులు అధికారులను మచ్చిక చేసుకుని తతంగం నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కాల్వల నుంచి గొలుసుకట్టు దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను కూడా అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్లలో చెరువుల వివరాలు చెరువు సర్వేనంబర్ విస్తీర్ణం కాలువ (ఎకరాల్లో) (కి.మీ) కొత్తచెరువు 1471 85.05 4 రాయినిచెరువు 703 152.10 3 ఈదులచెరువు 991 77.29 1.5 అర్జునకుంట 757 22.36 1 దేవునికుంట 1121 9.28 1.5 మైసమ్మకుంట 1294 11.02 1 దామరకుంట 232, 233 7.38 2 తుమ్మలకుంట 142, 143 29.23 2 వర్ధనికుంట – – – కాల్వను సరిగ్గా నిర్మించలేదు వెంకంపేట, పద్మనగర్ ప్రాంతాలు లోతట్టుగా ఉంటాయి. వర్షాలు పడితే బోనాల తదితర చెరువుల నుంచి మత్తడికాల్వలు సిరిసిల్లకు ప్రవహిస్తాయి. పైనుంచి వచ్చే వరదనీరు వెళ్లేందుకు బస్టాండు ప్రాంతంలో కాల్వ నిర్మించినా లాభం లేదు. పెద్దవర్షం పడితే చాలు నాలాలు నిండి నీరంతా షాపుల్లోకి, రోడ్డుపైకి వస్తుంది. ఏళ్లసంది సమస్యను ఇప్పుడైనా పరిష్కరించాలి. – చిక్కుడు శ్రీనివాస్, వెంకంపేట -
ఆరునెలల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
కాల్వ శ్రీరాంపూర్(పెద్దపల్లి): ఇద్దరు అన్నదమ్మలు ఏడాది వ్యవధిలోనే వేర్వేరు కారణాలతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన తూండ్ల రాజు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో పది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది వ్యవధిలోనే ఇద్దరు కుమారులు వేర్వేరు కారణాలతో మృతిచెందడంతో తల్లిదండ్రులు దేవమ్మ –మధునయ్య కన్నీటి పర్యంతమయ్యారు. దినసరి కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు.. వచ్చే ఆదాయంతోనే ఇద్దరు కుమారులను పెంచి పోషించి ప్రయోజకులను చేశారు. మలిదశలో తమ బాగోగు చూస్తారనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడం తల్లిదండ్రులకు శోకం మిగిల్చినట్లయ్యింది. కాగా, రాజుకు భార్య రేవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు కాల్వశ్రీరాంపూర్లో విషాదం -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కోరుట్లరూరల్: అనారోగ్యంతో బాధపడుతూ.. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన మైలారం గోపాల్ (53) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ యూ సుఫ్నగర్ పంచాయతీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవలే గుండెకు స్టంట్ వేశారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఊరు శివారులో ఉరేసుకున్నాడు. అటువైపు వెళ్లిన వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చా రు. గోపాల్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పురుగుల మందు తాగి వలసజీవి.. ధర్మపురి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వలస జీవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం తీగలధర్మారానికి చెందిన అలకుంట రాజశేఖర్కు ఎనిమిదేళ్ల క్రితం పట్టణానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వారికి ఓ కుమారుడు సంతానం. రాజశేఖర్ కొన్నాళ్లుగా దుబాయి వెళ్లి వస్తున్నాడు. జ్యోతి పుట్టింటి వద్ద ఉంటోంది. స్వగ్రామంలోనే కలిసి ఉందామని, త్వరగా ఇంటికి రావాలని జ్యోతి రాజశేఖర్ను పలుమార్లు ఫోన్లో కోరుతోంది. ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం రాజ శేఖర్ స్వగ్రామానికి వచ్చాడు. నెల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా.. జ్యోతి పుట్టింటికి వెల్లింది. కాపురానికి రావాలని రాజశేఖర్ పలుమార్లు కోరినా ఆమె నిరాకరించింది. మనస్తాపానికి గురైన రాజశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగాడు. బంధువులు జగి త్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని పోలీ సులు తెలిపారు. మృతుడి తల్లి శంకరమ్మ ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కట్టలేదని భార్య..జూలపల్లి(పెద్దపల్లి): ఇల్లు కట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మెండె రజిత(35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. జూలపల్లికి చెందిన మెండె రజిత – చిన్నరాజయ్య భార్యాభర్తలు. తాము నివాసం ఉండే ఇల్లు పాతది కావడంతో కొత్తది నిర్మించాలని కొంతకాలంగా రజిత తన భర్తను కోరుతూ వస్తోంది. ఆయన ఎంతకూ ఆమె మాట వినలేదు. కొత్త ఇల్లు కట్టలేదు. మనస్తాపం చెందిన ఆమె.. జూన్ 26న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రుద్రంగి గుట్టల్లో మృతదేహం? రుద్రంగి(వేములవాడ): హాస్టల్ వెనుక మా మిడితోట పక్కన గల అడవిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహం కోసం పోలీసులు గుట్టల్లో గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ను వివరణ కోరగా గొర్లకాపరులు చూసి గ్రామస్తులకు చెప్పడంతో ఈ చర్చ మొదలైనట్లు తెలిపారు. అనుమానిత స్థలంలో గాలించినట్లు పేర్కొన్నారు. మృతదేహం దొరకలేదని, గురువారం సైతం గాలిస్తామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
కొడిమ్యాల/మల్యాల: వారిద్దరూ స్నేహితులు. ఒకరు ముంబయిలో ఉంటూ వంట పనులకు వెళ్తున్నాడు. మరొకరు స్థానికంగా ఉంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ముంబయి నుంచి స్నేహితుడు రావడంతో ఇద్దరూ కలిసి బైక్పై వేములవాడ వెళ్లేందుకు బయల్దేరారు. ఇంతలోనే వారిని విధి వెక్కిరించింది. బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది. మృతులిద్దరిది మల్యాల మండలకేంద్రం. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ సోమయ్య, లత దంపతుల కుమారుడు గణేశ్.. దయాల మల్లేశం కుమారుడు రాజ్కుమార్ స్నేహితులు. గణేశ్ తండ్రి సోమయ్య ఇరవై ఏళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి లత గణేశ్ను పోషిస్తుండగా ఆయన ఆమెకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రాజ్కుమార్ తల్లి గతంలోనే చనిపోయింది. మల్లేశం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజ్కుమార్ కొన్నాళ్లుగా ముంబయిలో ఉంటూ అక్కడే వంట పనులకు వెళ్తున్నాడు. ఓ కేసు నిమిత్తం రాజ్కుమార్ రెండు రోజుల క్రితం మల్యాలకు వచ్చాడు. స్నేహితుడైన గణేశ్తో సరదాగా గడిపారు. గణేశ్ మంగళవారం పులి వేషంవేసి వేశాడు. బుధవారం ఇద్దరూ కలిసి వేములవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం నల్లగొండ శివారుకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో దయ్యాల రాజ్ కుమార్ (25), జడ గణేశ్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు కొడిమ్యాల పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు విడవడంతో మల్యాలలో విషాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్రూరల్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి విచారణ జరపగా.. కరీంనగర్కు చెందిన మర్రి దీక్షిత్, సిద్ధార్థ, శశిధర్గా గుర్తించారు. ఎస్ఐ ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా.. గంజాయి ప్యాకెట్లు లభించాయి. రూరల్ స్టేషన్కు ముగ్గురు యువకులను తరలించి విచారణ చేపట్టారు. మర్రి దీక్షిత్ కొంతకాలంగా ఆంధ్రా నుంచి గంజాయి అక్రమంగా తెప్పిస్తూ ఇతరులకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు యువకుల నుంచి ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
గోదావరిఖని: కాళేశ్వరం జోన్స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరంజోన్లోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు
ఫెర్టీలైజర్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమినగర్ రైల్వేగేట్ వద్ద ఇద్దరు యువకులను లోకో పైలెట్లు కాపాడారు. మూసి ఉన్న రైలు గేట్ దాటేందుకు యువకులు ప్రయత్నం చేయగా.. స్కూటీ పట్టాల కంకరలో కూరుకుపోయింది. అప్పటికే సింగరేణి బొగ్గులోడ్తో గూడ్స్రైలు వేగంగా దూసుకు వస్తోంది. అయితే, ట్రాక్పై ఉన్న యువకులను గుర్తించిన లోకో పైలెట్ సీహెచ్ రవి, అసిస్టెంట్ లోకో పైలెట్ దీపక్ కుమార్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును ఆపారు. దీంతో గేట్ వద్ద ఉన్నవారు ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సాయంతో ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టేశారు. ప్రమాదం జరగకుండా చాకచక్యంగా వ్యవహరించిన లోకో పైలెట్లను స్థానికులు అభినందించారు. -
రైల్వే సేవలన్నీ ఒకేయాప్లో..
● ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రైల్వన్ యాప్ రామగుండం: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకేయాప్ను డిజైన్ చేసిన రైల్వే.. ఈనెల ఒకటో తేదీన అమలులోకి తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొచ్చిన ఈయాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సెస్ చేసే వీలుంటుంది. ప్రయాణికులకు అందే సేవలు.. ● టికెట్ బుకింగ్, రిజర్వ్డ్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ల బుకింగ్ ● ప్లాన్ మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులు, కోటాలో టికెట్ల బుకింగ్ ● అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం... ● రైలు స్థితి, ప్లాట్ఫారం నంబర్, ఆలస్యం తదితర వివరాలు ● కోచ్ పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్ రిఫండ్.. ● ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్థితిగతులు.. టికెట్ పీఎన్ఆర్ నంబర్ ద్వారా సీటు కన్షర్మేషన్ స్టేటస్.. రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్డరింగ్.. ● ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం.. రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడం యాప్ను ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ● అండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. https://play.google.com/store/apps/details?=org.cris.aikyam IOS యాపిల్ యాప్ స్టోర్ నుంచి అయితే.. https://apps.apple.com/in/app/railone/id6473384334ఉపయోగించే విధానం.. ● యాప్ను డౌన్లోడ్ చేశాక రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి ● కొత్త వినియోగదారులు మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా రిజిష్టర్ చేసుకోవాలి ● mPI N లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ చేయవచ్చు. ● ‘ప్లాన్ మై జర్నీ’ లేదా ‘మై బుకింగ్స్’ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. ● ఒకేయాప్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు ● బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజీలు ఆదా చేసుకోవచ్చు ● సరళమైన ఇంటర్సేఫ్, సింగిల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం ● డిసెంబర్ 2025 నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్ బుకింగ్స్, 40 లక్షల ఎంకై ్వరీలను నిర్వహించగల సామర్ధ్యం. -
యువకుడు అదృశ్యం
కరీంనగర్క్రైం: నగరంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన ఒక యువకుడు అదృశ్యమైనట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన మర్రిబోయిన అనిల్(25) గత నెల 26న బయటకు వెళ్లివస్తానని చెప్పి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతికోరుట్లరూరల్: పట్టణ శివారు అయోధ్యపట్నం ప్రాంతానికి చెందిన కొరిమె లక్ష్మణ్ (57) గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన భార్య రాజవ్వ జాతీయ రహదారి పక్కన స్వీట్కార్న్ విక్రయిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇంటికి వస్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం లక్ష్మణ్ను ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలు ఇంట్లో చోరీజమ్మికుంటరూరల్: జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. సైదాబాద్ గ్రామానికి చెందిన వేముల సత్యనారాయణ బుధవారం జమ్మికుంట వెళ్లాడు. అతని భార్య సుజాత ఇంటికి తాళంవేసి వనభోజనాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని రెండు తులాల బంగారం, 12తులాల వెండి, రూ.26వేల నగదు అపహరణకు గురయ్యాయి. టౌన్ సీఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. స్వగ్రామానికి చేరిన మృతదేహంజగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన రేవెళ్ల రవీందర్ (57) ఇటీవల గుండెపోటుతో ఇజ్రాయిల్లో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
దేహదానానికి ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం
సిరిసిల్లకల్చరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ కుటుంబం దేహదానానికి అంగీకరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తమ దేహాలను ఇచ్చేందుకు అంగీకరిస్తూ అర్జీ పెట్టుకున్నారు. అభ్యర్థనను అంగీకరిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ రఘునందన్తోపాటు అతని సతీమణి, తండ్రిని సైతం దేహదానానికి ఒప్పించారు. జిల్లాలో దేహదానానికి ముందుకొచ్చిన మొదటి వ్యక్తి ప్రిన్సిపాల్ విజయ రఘునందన్. అతనితోపాటు తన కుటుంబంలోని మరో ఇద్దరిని ఒప్పించడం అభినందించాల్సిన విషయం. మెడికల్ కాలేజీకి ఇచ్చేందుకు అంగీకారం -
భూములకు భద్రత
● త్వరలో రంగంలోకి లైసెన్స్డ్ సర్వేయర్లు ● రెండు, మూడు రోజుల్లో జీపీవోల నియామకం కరీంనగర్ అర్బన్: పట్టా, ప్రభుత్వ భూములకు భద్రతతో పాటు హద్దుల బెంగ త్వరలోనే తీరనుంది. భూ రికార్డుల పారదర్శకతతో పాటు పర్యవేక్షణ పక్కాగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణనిస్తుండగా గ్రామ పాలన అధికారుల నియామకానికి శరవేగంగా కసరత్తు జరుగుతోంది. మొత్తంగా భూములను వివాదరహితంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండు రకాల చర్యలు చేపట్టేలా భూ భారతి చట్టంలో మార్గనిర్దేశం చేసింది. మొదట క్రయ విక్రయాలకు సర్వే మ్యాప్ను తప్పనిసరి చేయనుండగా తదుపరి శాశ్వత భూధార్ నంబర్లు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో జీపీవోల నియామకం గ్రామ పాలన అధికారులను నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆప్షన్లు తీసుకుని పరీక్షలు నిర్వహించగా పక్షం రోజుల క్రితం ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 191 మంది పరీక్షకు హాజరవగా 163 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 318 గ్రామ పంచాయతీలుండగా 163 మందిని నియమిస్తే మిగతా 155మందిని ఎవరిని నియమిస్తారన్నది తెలియడం లేదు. కాగా జీపీవోల నియామకం ప్రక్రియ ఈ నెల 4వరకు పూర్తవనుందని పక్కా సమాచారం. భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించగా వేల సంఖ్యలో అర్జీలు రాగా వాటి పరిష్కారంలో జీపీవోల సహకారముంటేనే నిర్ణీత సమయంలోగా పూర్తవనుంది. పక్షం రోజుల్లో లైసెన్స్డ్ సర్వేయర్లు లైసెన్స్డ్ సర్వేయర్లను జూన్ 27నుంచి శిక్షణ ప్రక్రియ మొదలైంది. 50 రోజుల శిక్షణలో భాగంగా రెండు బ్యాచ్లుగా జిల్లాకేంద్రంలో శిక్షణనిస్తున్నారు. సాగు, ప్రభుత్వ భూములకు హద్దుల గొడవ ఉండకుండా ఉండాలనే సదుద్దేశంతో లైసెన్స్డ్ సర్వేయర్లను తెరపైకి తెచ్చారు. 300మందికి శిక్షణనిస్తుండగా జిల్లాలో 318 గ్రామాలున్నాయి. ప్రభుత్వ సర్వేయర్లు 20మంది ఉండగా భూ కొలతలకు ఇబ్బంది ఉండదిక. భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్ల సమయంలో భూనక్షా(పటం) సమర్పించాలనే నిబంధన త్వరలోనే అమలవనుంది. సర్వేతోనే భూధార్ భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూ ధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావి స్తే టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహశీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దుల్లేని భూమి గా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూదార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తోంది. ఈ రెవెన్యూ రికార్డు ల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో నే పూర్తవుతుంది. కానీ, రెండో ప్రక్రియ మాత్రం లైసెన్సుడ్ సర్వేయర్లు, సర్వేయర్లు, తహసీల్దార్ల విధుల్లో భాగం. రికార్డుల వెరిఫికేషన్ కోసం జీపీవోలు కూడా పని చేయాల్సి ఉంటుంది.భూ రికార్డుల నవీకరణలో తేలిన గణాంకాలు సాగు విస్తీర్ణం: 3,33,450 ఎకరాలు వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు ప్రభుత్వ భూమి: 40,366 వక్ఫ్ భూములు: 517 ఎకరాలు అటవీ భూములు: 1,748 ఎకరాలు ఖాతాల సంఖ్య: 1,92,687 మొత్తం సర్వేనంబర్లు: 3,51,545జిల్లాలో గ్రామాలు: 318 రెవెన్యూ గ్రామాలు: 205 జీపీవో పరీక్షలో ఉత్తీర్ణులైనవారు: 163 శిక్షణ పొందుతున్న లైసెన్స్డ్ సర్వేయర్లు: 300 -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్క్రైం: నగరంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతామని సీపీ గౌస్ ఆలం అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్తో కలిసి నగరంలోని వివిధ బ్లాక్స్పాట్లను గుర్తించారు. పద్మనగర్ బైపాస్, రాంనగర్, టూ టౌన్ పోలీస్స్టేషన్, మంచిర్యాల చౌరస్తా, గాంధీరోడ్డు, నాఖాచౌరస్తా, కేబుల్ బ్రిడ్జి, బైపాస్ రోడ్డులోని మలుపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ఆలం మాట్లాడుతూ.. నగరపాలక పరిధి లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించామని తెలిపా రు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల ఐలాండ్లు, యూటర్న్లు, యూటర్న్ల కుదింపు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. -
ఆర్వోబీ ఆక్రమణపై కొరడా
● ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన కమిషనర్ అయాజ్ జమ్మికుంట: పట్టణంలోని ఆర్వోబీ కింద పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించినవారికిపై బుధవారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. మే 26న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పార్కింగ్ పరిషాన్’ కథనానికి స్పందించారు. కమిషనర్ ఎండీ అయాజ్ పర్యవేక్షణలో సిబ్బంది ఆర్వోబీని ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారుల సామగ్రిని తొలగించారు. నెలరోజులుగా మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారుల వివరాలు సేకరించారు. నిర్వహణ లేని వాటిని గుర్తించి, పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్ల అధారంగా అక్రమణలు తొలగించారు. నిజమైన వ్యాపారులు బ్రిడ్జి కింద రోడ్డుకు ఆరుఫీట్ల దూరంలో బిజినెస్ చేసుకోవాలని సూచించారు. ఆర్వోబీ కింద డబ్బాలు వేసుకొని నిజ మైన ఉపాధి పొందే వారికి న్యాయం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. టీపీవో శ్రీధర్, ఏఈ నరేశ్, శానిటరీఇన్స్పెక్టర్ మహేశ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కరీంనగర్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. పోలీస్ గార్డులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కే.మహేశ్వర్, వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య పాల్గొన్నారు. ఇండోర్ తరహాలో డంప్యార్డు సమస్య పరిష్కారం కరీంనగర్ కార్పొరేషన్: సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ డంప్యార్డు సమస్యల పరిష్కారంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఇండోర్ తరహాలో కరీంనగర్ డంప్యార్డు సమస్యను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. బుధవారం నగరంలోని డంప్యార్డును కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. డంప్యార్డుతో నగరంలోని చాలా డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఇండోర్లో గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నరహరి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లానని తెలిపారు. త్వరలోనే నరహరి కరీంనగర్కు వచ్చి సమస్య పరిష్కారానికి మార్గదర్శనం చేస్తానని తెలిపారు. నాయకులు వైద్యుల అంజన్కుమార్, కట్ల సతీశ్, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, గంట శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆహార నాణ్యతపై నజర్ కరీంనగర్ అర్బన్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించింది. వారికి అందించే ఆహార నాణ్యతను పక్కాగా పర్యవేక్షించాలని ఫుడ్సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో అందించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడంతో పాటు పరీక్ష చేయాలని ఆదేశించింది. ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ అంకిత్రెడ్డి, గెజిటెడ్ ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ రోహిత్రెడ్డి నేతత్వంలో బుధవారం పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా పరీక్షించారు. ప్రతి శనివారం హాస్టళ్ల తీరుపై నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నారు. అన్ని హాస్టళ్లను తనిఖీ చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. -
ఇందిరమ్మకు బలం లేదని..
● ముందుకు సాగని ఇళ్ల గ్రౌండింగ్ ● ముహూర్తాల కోసం ఆగుతున్న లబ్ధిదారులు ● ఇళ్ల నిర్మాణం కోసం అధికారుల ఒత్తిడిచొప్పదండి: ‘నా పేరు మీద బలం లేదట సార్. ఈ నెలాఖరుకు శ్రావణం వస్తుంది. అప్పుడే ఇళ్లు మొదలుపెడుతా. నాలుగు రోజులు ఓపిక పట్టండి సార్’.. అంటూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అధికారులను వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మార్కింగ్ ప్రక్రియ వేగం పుంజుకున్నా.. ఆశించినస్థాయిలో గ్రౌండింగ్ కావడం లేదు. నలుబై రోజుల క్రితమే ప్రొసీడింగ్లు అందించే ప్రక్రియ చేపట్టినా ఇంకా బేసిమెంట్స్థాయికి నిర్మాణాలు చేరడం లేదు. ముహూర్తాలు లేవని.. ఇంటి నిర్మాణానికి ముహూర్తాలు చూడటం సాధారణ విషయమే. మే నెలాఖరులో ప్రొసీడింగ్ అందించే ప్రక్రియ చేపట్టడంతో జూన్ మొదటివారంలో చాలా మంది లబ్ధిదారులు ముగ్గుపోసి మార్కింగ్ ప్రక్రియ ప్రారంభించారు. నెలరోజుల్లో జిల్లావ్యాప్తంగా 8,219 మందిలో 62శాతం మంది మార్కింగ్ పూర్తి చేశారు. మరో మూడు వేల మంది ప్రస్తుతం ఆషాఢం కావడంతో ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా మానకొండూరు మండలానికి 852 ఇల్లు మంజూరు చేశారు. 423 ఇళ్లకు ముగ్గుపోశారు. బేసిమెంట్ లెవల్, రూఫ్ లెవల్, స్లాబల్ లెవల్లో 30 ఇండ్లే ఉండటం గమనార్హం. చొప్పదండి పట్టణంలో 110మందిని ఎంపిక చేయగా.. 84మంది మార్కింగ్ చేశారు. ముగ్గురు మాత్రమే బేసిమెంట్ స్థాయికి వచ్చారు. శ్రావణంలో ఇంటినిర్మాణం ప్రారంభిస్తామని చాలామంది చెబుతున్నారు. పిల్లర్లకే రూ.లక్షన్నర ఫిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. స్థలనాణ్యత, పునాది గట్టిగా ఉండాలనే భావనతో చాలామంది బేస్మెంట్కు బదులు ఫిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొదటి బిల్లు రావాలంటే లబ్ధిదారులు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. మరికొందరు కంపౌండ్, మొరంతో కలిపి రూ.రెండు లక్షల వరకు వెచ్చిస్తున్నారు. శ్రావణం వస్తోంది శ్రావణ మాసం సమీపిస్తుండటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో కార్యదర్శుల సూచన మేరకు ఇంటి మార్కింగ్ చేసుకొని వదిలేసిన వారు జూలై 27నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో యాభై నుంచి 70 శాతం వరకు అధికారుల ద్వారా మార్కింగ్ ప్రక్రియ పూర్తయినా వివిధదశల్లో ఉన్న ఇళ్లనిర్మాణం 15శాతం కూడా దాటలేదు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మంజూరైనవి 8,219 మార్క్ అవుట్ చేసినవి 5,089 గ్రౌండింగ్ అయినవి 742 గ్రౌండింగ్ అయిన వాటిలో బేసిమెంట్స్థాయి 511 రూఫ్ లెవల్ 128 రూఫ్ కంప్లీటెడ్ 103మార్కింగ్ పూర్తి చేస్తున్నాం ప్రొసీడింగ్ అందుకున్న లబ్ధిదారుల ఇండ్ల స్థలాలలో మార్కింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. లబ్ధిదారులు ఉత్సాహంగానే పనులు ప్రారంభిస్తున్నారు. జూన్ మొదటి వారంలోనే మెజారిటీ ఇళ్లకు మార్కింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే బేసిమెంట్ ప్రక్రియకు వస్తున్నాయి. ఫాలోఅప్ చేస్తున్నాం. – వేణుగోపాల్, ఎంపీడీవో, చొప్పదండి -
శాకాంబరీగా అమ్మవారు
కరీంనగర్రూరల్: దుర్శేడ్లో శ్రీవిశ్వంభరీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ మరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రశాంత్శర్మ, శ్రీనివాస్శర్మ, విశాల్శర్మ మరకత లింగానికి విశేష అభిషేకం చేశారు. భక్తులు సమర్పించిన 108 రకాల పండ్లు, కూరగాయలు, పూలతో రాజరాజేశ్వరిదేవిని అలంకరించారు. స్వామివారు, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నందాల తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, సాయిని తిరుపతి, గౌడ నర్సయ్య పాల్గొన్నారు. -
గీత దాటిన బల్దియా!
కార్పొరేషన్ కహానీ–3సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కన్నా అక్రమాలే అధికం. కాంట్రాక్టర్లంటే అమితమైన అభిమానం ప్రదర్శించడం, ఒకే కంపెనీకి, కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం ఇక్కడ సాధారణ విషయం. కిందిస్థాయి సిబ్బంది గురించి పక్కనపెడితే, మున్సిపల్ కమిషనర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. నిధుల దుర్వినియోగం విషయంలో చిన్నా చితకా అధికారుల మీద కాదు.. సాక్షాత్తూ మున్సిపల్ కమిషనర్ మీదే పోలీసు కేసు నమోదు అవడంతో కరీంనగర్ బల్దియా అవినీతికి పరాకాష్టగా నిలిచింది. గతేడాది నమోదైన కేసులో పురోగతి కోసం మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెంటబడటం మరోసారి చర్చానీయాంశంగా మారింది. తన పరిధి కాకున్నా.. సమీప విలీన గ్రామాల్లోకి చొచ్చుకెళ్లి మరీ రూ.కోట్లు ఖర్చు పెట్టడం కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, అధికారులకే చెల్లింది. గీత దాటిన అధికారులు.. కరీంనగర్ స్మార్ట్సిటీ పనులు నగరంలోనే జరగాలి. స్మార్ట్సిటీ మిషన్ కింద కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్సీసీఎల్)ను అనే స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ను ఒక పర్యాటక, వాణిజ్య నగరంగా తీర్చిదిద్దడం దీని ఉద్దేశం. నగరంలోని 50 డివిజన్లలో కాకుండా పరిధిదాటి.. స్మార్ట్సిటీ నిధులను వెచ్చించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వాస్తవానికి బొమ్మకల్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీ. ఈ ఏడాది ఆరంభంలోనే దాన్ని బల్దియాలో ప్రభుత్వం విలీనం చేసింది. 2022లో బొమ్మకల్ జంక్షన్ పనులను బల్దియా చేపట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నిధుల దుర్వినియోగమేనని వన్టౌన్లో కేసు (ఎఫ్ఐఆర్ 480/2024) నమోదు చేశారు. అందులో ఏ–1గా అప్పటి మున్సిపల్ కమిషనర్, ఏ–2 సూపరింటెండెంట్ ఇంజినీర్, ఏ–3గ్రా ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను చేర్చారు. అయినప్పటికీ.. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దాంతోపాటు బొమ్మకల్ వరాహ స్వామి టెంపుల్ నుంచి లారీ అసోసియేషన్ వరకు స్మార్ట్సిటీ నిధులతో రోడ్లు, డ్రెయిన్, కల్వర్టులు నిర్మించారు. రేకుర్తిలోనూ స్మార్ట్సిటీ నిధులతో పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, బ్యూటిఫికేషన్, హైమాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. బొమ్మకల్, రేకుర్తిల్లోనూ స్మార్ట్సిటీ పనులు పరిధి కాకున్నా హద్దుమీరి నిర్వహణ కరీంనగర్ కార్పొరేషన్ సొమ్ము రూ.కోట్లు పక్కదారి నిధుల దుర్వినియోగం కేసులో ఏ–1గా మున్సిపల్ కమిషనర్ ముందుకు సాగని పోలీసుల దర్యాప్తురూ.కోట్లాది నిధులు పక్కదారి.. బొమ్మకల్, రేకుర్తిలో రూ.కోట్లాది స్మార్ట్సిటీ నిధులు వెచ్చించి అనేక పనులు చేశారు. ఈ విషయంలో వన్టౌన్లో కేసు నమోదు అయిన సమయంలో పలువురు కార్పొరేటర్లు మరిన్ని ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లతో వారిని నిలువరించగలిగారు. అదే సమయంలో గ్రామ పంచాయతీగా ఉన్న బొమ్మకల్లో వికలాంగుల పార్కు కోసం దాదాపుగా రూ.4 కోట్ల వరకు విలువైన పనులకు పరిపాలన అనుమతి, టెండరు ఖరారు కూడా చేశారు. ఆఖరు నిమిషంలో ఆ టెండరు రద్దు అయింది. లేకపోతే.. పార్కు పనులు కూడా బొమ్మకల్లో నిర్వహించేవారే. -
అభ్యాసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన
కరీంనగర్: అభ్యాసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన సాగాలని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. బుధవారం సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 9,10వ తరగతుల్లో జరుగుతున్న జీవశాస్త్ర, గణితశాస్త్ర బోధనాభ్యాసన ప్రక్రియలను పరిశీలించారు. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులతో సమావేశమై అభ్యసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన సాగాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త మిల్కూరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఎం.రాజేందర్ పాల్గొన్నారు. -
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
కరీంనగర్: కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కష్టపడి చదువుకుని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలో కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన ఏడుగురు పిల్లల్లో నలుగురికి 18ఏళ్లు నిండాయి. వీరితో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం కలెక్టరేట్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బాల బాలికలకు పీఎంకేర్ ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. 18ఏళ్లు నిండేసరికి రూ.10 లక్షలు వారిఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. సదరు పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నామని అన్నారు. కష్టపడి చదివి జీవితంలో నిలదొక్కుకోవాలని సూచించారు. ఏం చదువుకోవాలన్నా ప్రభుత్వసంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు బ్యాంకు పాస్బుక్, ఆరోగ్యకార్డులు అందజేశారు. అనంతరం పిల్లలతో కలిసి ఓ హోటల్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీడబ్ల్యూవో సబిత, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి చొప్పదండి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని గుమ్లాపూర్లో ఇందిరమ్మ ఇండ్లనిర్మాణం పరిశీలించారు. లబ్ధిదారుతో మాట్లాడారు. బేస్మెంట్ పూర్తి చేసి మొదటి బిల్లు తీసుకోవాలని సూచించారు. గ్రామ శివారులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఎంపీవో రాజగోపాల్, హౌజింగ్ ఏఈ సుప్రియ, మోహన్రెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
ఆధా(ర్)రం లేక.. అక్షరానికి దూరం
‘సారూ.. మేము గుడిసెలో పుట్టాం. మా తల్లిదండ్రులకు సదువు రాదు. మేమన్నా సదువుకుందామంటే ఆధార్కార్డు లేదని సర్కారు బడిలోకి రానిస్తలేరు. ఏదన్నా పని చేసుకుందానుకుంటే బాలకార్మికులంటుర్రు. గిదెక్కడి అన్యాయం. సారూ మాకు ఆధా(ర్)రం చూపండి’ అంటూ.. కనిపించిన వారినల్లా ఈ చిన్నారులు ప్రాధేయపడుతున్నారు. జిల్లాకేంద్రంలోని ఆరెపల్లి శివారులోని శ్రీరాజరాజేశ్వరకాలనీకి చెందిన చిన్నారులు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు లేక చదువుకు దూరం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వీరికి స్థిర నివాసం లేకపోవడమే అని చెబుతున్నారు. కలెక్టర్ను కలిసినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
నమ్మితే నట్టేట ముంచుడే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రపంచం మొత్తం కంప్యూటర్, ఏఐ టెక్నాలజీ అంటూ పరుగులు తీస్తుంటే.. పల్లెల్లో మంత్రాలు తంత్రాలు అంటూ పంచాయితీలు పెట్టుకుంటున్నారు. చేతబడితో ఏదైనా చేయగలమని కొందరు మోసగాళ్లు చెబుతున్న మాటలు నమ్మి అమాయకులు డబ్బులు ఇస్తూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి వెళ్లాల్సిన వారు పల్లెల్లో తాయత్తులు కట్టేవారిని నమ్మి ప్రాణాలు తీసుకుంటున్నారు. పలుచనవుతున్న బంధాలు సమాజంలోని బంధాలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయనేందుకు తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో జరిగిన ఘటనే ఉదాహరణ. సొంత అల్లుడిని చంపించి బిడ్డను తమ వద్దకు తీసుకెళ్లేందుకు అత్తామామలే కుట్ర పన్నడం ఆలస్యంగా వెలుగుచూసింది. అది కూడా చేతబడి చేయించి చంపేందుకు అదే గ్రామానికి చెందిన ఒకరికి సుపారీ ఇవ్వడం సంచలనం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమాయకత్వమే ఆసరా సైబర్నేరగాళ్లు లోన్లు ఇస్తామంటూ, బంపర్ డ్రా గెలుచుకున్నారంటూ ఫోన్లో మాట్లాడి పల్లెప్రజలను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాకేశ్ అనే యువకుడికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి బంపర్ డ్రా గెలుచుకున్నారని, హైదరాబాద్ ఆఫీస్కు వస్తే బహుమతి ఇస్తామని నమ్మబలికారు. దీనికి ముందుగా రాకేశ్ ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పాల్సి ఉంటుందని నమ్మించారు. వారి మాటలు నమ్మి ఓటీపీ చెప్పడంతో రాకేశ్ బ్యాంక్ ఖాతాలో రూ.25వేలు మాయమయ్యాయి. నమ్మించి.. నగలు మాయం చేసి ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో నగలు మెరుగుపెడతామంటూ ఇద్దరు వ్యక్తులు గ్రామంలో సంచరించారు. వారిని నమ్మిన ఓ మహిళ తన నగలు ఇవ్వగా, ఆమెను మాటల్లో పెట్టిన కేటుగాళ్లు ఆ నగలను ఓ మూటలో కట్టారు. ఆమైపె మత్తుమందు చల్లి పరారయ్యారు. కొద్ది సమయం తర్వాత ఆమెకు మెలకువరావడంతో మోసపోయానని గుర్తించి కేకలు వేయగా, చుట్టుపక్కల వారు గుమిగూడి ఊరిలో గాలించినా మోసగాళ్ల ఆచూకీ లభించలేదు. అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణులు మోసపోతున్న తీరుపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరైతే కనిపిస్తే సమాచారం అందించాలని చెబుతున్నారు. అయినా ప్రజలు ఇతరులను నమ్మి మోసపోతూనే ఉన్నారు. చేతబడి పేరుతో డబ్బులు గుంజుతున్న కేటుగాళ్లు లింక్లు పంపుతూ ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు మూఢనమ్మకాలు, అమాయకత్వంతో ఆర్థికంగా చితికిపోతున్న జనం అవగాహన కల్పిస్తున్నాం సైబర్మోసాలు, క్షుద్రపూజలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మంత్రాలు అనే వాటిని నమ్మవద్దని కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు వివరిస్తున్నాం. అత్యాశకు పోయి మోసపోతున్నారు. సైబర్క్రైం జరిగితే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలి. మూఢవిశ్వాసాలకు దూరంగా ఉండాలి. – శ్రీనివాస్గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేట -
రైల్వేగేజ్ రాడ్ను ఢీకొట్టిన లారీ
కరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లి రైల్వేగేటు వద్ద భారీ వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన గేజ్రాడ్ను మంగళవారం ఓ లారీ ఢీకొట్టడంతో విరిగిపోయింది. కరీంనగర్ నుంచి చొప్పదండి వైపు ప్రధానరోడ్డుపై ఉన్న రైల్వేగేటును ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా దారి మళ్లించారు. భారీ వాహనాలు రాకుండా రైల్వేగేటుపై గేజ్రాడ్ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం భారీ వాహనం రావడంతో గేజ్రాడ్ విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం మేర్పడింది. రైల్వేసిబ్బంది వచ్చి గేజ్రాడ్ను తొలగించగా పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
గ్రామపంచాయతీ గదికి తాళం
ఓదెల(పెద్దపల్లి): అద్దె చెల్లించడం లేదనే కారణంతో హరిపురం గ్రామ పంచాయతీ గదికి యజమాని తాళం వేశారు. దీంతో సోమవారం పంచాయతీ కార్యదర్శితోపాటు సిబ్బంది ఆరుబయటనే విధు లు నిర్వహించారు. గ్రామ పంచాయతీ పక్కాభవన నిర్మాణానికి పదేళ్లక్రితం శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పంచాయతీ కార్యకలాపాలు అద్దెగదిలోనే కొనసాగిస్తున్నారు. ప్రతీనెల రూ.800 చొప్పు న అద్దె చెల్లించేందుకు యజమానితో ఒప్పందం కుదిరింది. అయితే, రెండేళ్లకు సంబంధించి రూ.20వేల అద్దె బాకీ ఉండిపోయింది. అద్దె చెల్లించకపోవడంతో యజమాని ప్రభాకర్రెడ్డి పంచాయతీ గదికి తాళం వేశాడు. -
కళాసిల్క్ చేనేత హస్తకళకు ఆదరణ
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అంబేద్కర్భవన్ సాయినగర్–8వ క్రాస్రోడ్డులో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ ప్రదర్శనకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్, పోచంపల్లి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చుడీదార్స్, షూటింగ్స్ షర్టింగ్స్, జ్యువెల్లరీ, బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వహకుడు వినోద్ జైన్ తెలిపారు. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్కవర్లు, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టన్స్, స్టోన్ జ్యువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్స్, బంజారా, కోల్కతా బ్యాగులు, ఒడిశా పెయింటింగ్స్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరీ, రాజస్థాన్ కోటా బాందేజన్, బ్లాక్ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నోవి డ్రెస్ మెటీరియల్స్ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
శ్రీచైతన్య ఫార్మసీ విద్యార్థులకు జాతీయ ర్యాంకులు
తిమ్మాపూర్: ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలలో మంగళవారం అభినందించారు. జీప్యాట్లో డి.సౌమ్య మొదటి ర్యాంకు, భూక్యా సౌడన్న రెండోర్యాంకు సాధించగా, నీఫర్ ప్రవేశ పరీక్షలో డి.సౌమ్య, వి.సుచిత్ర, వి.శివకష్ణ ఉత్తీర్ణులయ్యారు. టీఎస్పీజీఈసీఈటీలో సుచిత్ర 42వ ర్యాంకు, కె.ప్రభాస్ 125వ ర్యాంకు, ఎస్.గౌతమి 160వ ర్యాంకు, వి.వర్షిత్ 168వ ర్యాంకుతో సహా మొత్తం 49 మంది రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. రమేశ్రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామనరసింహరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.అప్పారావు, హెచ్వోడీలు ఎం.రవీందర్, జి.చంద్రకళ, కె.రామ్ప్రసాద్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
సిరిసిల్లటౌన్: ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పతకాలు సాధించారు. మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20 మంది క్రీడాకారులు పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి తమిళనాడులోని చైన్నెలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సీనియర్ క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో ఎలగందుల శ్రీనివాస్ బంగారు, ఫైట్ జూనియర్ బాలికల విభాగంలో గంగనవేణి ప్రవళిక, అన్నాళదాస్ లక్ష్మీప్రసన్న, జూనియర్ బాలుర విభాగంలో చోడిబోయిన లోకేశ్, ఏర్నాల రాజశేఖర్, సబ్ జూనియర్ బాలికల విభాగంలో గజ్జెల శ్వేదిక, కర్నె యుతిక, బాలుర విభాగంలో గౌతమ్ఆనంద్, చోడిబోయిన శివష్, కొండ శ్రీరామ్, చిల్డ్రన్ కెడేట్ విభాగంలో గజ్జెల హిరణ్మయి, షేక్ ఆజహన్ రజత, కాంస్య తదితర పతకాలు సాధించారు. ఈసందర్భంగా క్రీడాకారులను తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ మహిపాల్, కోశాధికారి పన్నీరు శ్రీనివాస్ అభినందించారు. -
ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లికి చెందిన మర్రిపల్లి హన్మండ్లు (85) మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మండ్లు కొద్దిరోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడు. హన్మండ్లు భార్య దుబ్బరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. హన్మండ్లు కుమారులు ఇద్దరు దుబాయ్లో ఉన్నారు. వారు బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలిపారు. అప్పులు తీర్చే మార్గం కానరాక..మల్యాల: ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు వైద్యానికి చేసిన అప్పులు.. వాటిని తీర్చే మార్గం కానరాక ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మద్దుట్లలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లూరి తిరుపతి(59) ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సెప్టిక్ కావడంతో వైద్యానికి చాలా డబ్బులు ఖర్చయ్యాయి. కుటుంబ అవసరాలకు కూడా అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం కానరాక మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి భార్య దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. శతాధిక వృద్ధురాలు మృతిచందుర్తి (వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గసికంటి రాజవ్వ ఉరఫ్ ధర్మారం రాజవ్వ(110) మంగళవారం మృతిచెందింది. రాజవ్వకు నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు సంతానం. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు పదేళ్లక్రితం మృతిచెందారు. చిన్న కుమార్తె పోశవ్వ తల్లితోనే ఉంటూ బాగోగులు చూసుకుంటోంది. సోమవారం సాయంత్రం వరకు తన పనులు చేసుకున్న రాజవ్వ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి జారుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి చితికి చిన్నకూతురు నిప్పు పెట్టడాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కంటతడి పెట్టారు. పోక్సో కేసులో పదేళ్ల జైలు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): పోక్సో కేసులో షేక్ అన్వర్(25)కు పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి సునీత తీర్పు ఇచ్చినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం.. 2018లో బాధితురాలిని ప్రేమిస్తున్నాని నమ్మించి ఇంటినుంచి తీసుకెళ్లాడు. ఆ తర్వాత లైంగికంగా లోబర్చుకొని వదిలేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాజేశ్.. నిందితుడు అన్వర్పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. నేరం రుజువు కావడంతో షేక్ అన్వర్కు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరం రుజువయ్యేందుకు తగిన సాక్ష్యాలను ప్రవేశపెట్టిన పోలీసులను సీఐ అభినందించారు. -
బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను మంగళవారం ఎత్తారు. గేట్లను ఏటా జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు తెరిచి ఉంచనున్నారు. ఎగువప్రాంతాల నుంచి బాబ్లీ ప్రాజెక్ట్లోకి వచ్చే వరద దిగువకు రానుంది. జగిత్యాల జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఎస్సారెస్పీలోకి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉంది. గేట్లు ఎత్తివేత కార్యక్రమంలో పోచంపహడ్, ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్రావు గుప్తా, సీడబ్ల్యూసీ హైదరాబాద్ ఈఈ ఎంఎల్.ఫ్రాంక్లిన్, మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ ఈఈ సీఆర్.బన్సార్, పోచంపహాడ్ ఈఈ చక్రపాణి, కొత్త రవి ఉన్నారు. -
ఎరువులపై పక్కా నిఘా
● శాంపిల్స్ సేకరణకు ఆదేశాలు ● అక్రమాలకు అడ్డుకట్ట కరీంనగర్ అర్బన్: ఎరువుల విక్రయాల్లో అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రికార్డుల నిర్వహణతో పాటు తనిఖీలకు ఆదేశించింది. పంటల సాగులో విత్తనాలు, ఎరువులే దిగుబడులపై ప్రభావం చూపుతాయి. ఎరువుల ద్వారానే పంటలకు పోషకాలు అందుతాయి. నత్రజని, భాస్వరం, పొటాష్, డీఏపీ, ఎన్పీకే కాంప్లెక్సులు, ఎన్పీకే మిక్సర్లు, నీటిలో కరిగేవి, సూక్ష్మపోషకాలు, సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్లు, నానో డీఏపీ, తదితర రకాల ఎరువులు లభ్యమవుతాయి. ఈ క్రమంలో వర్దిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారం ఎరువుల పరిమాణం, నాణ్యతపై నియంత్రణను సూచిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ గ్రామం, మండలం, జిల్లాల వారీగా పంటల సాగు విస్తీర్ణం అంచనాల ప్రకారం ఎరువుల వినియోగంపై అధికారులు ప్రణాళిక రూపొందిస్తారు. మండల స్థాయిలో ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా ఏఓ వ్యవహరిస్తుండగా ఎరువుల నాణ్యతను తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపిస్తారు. ప్రణాళిక ప్రకారం ఎరువులు అందుబాటులో ఉంచేలా కలెక్టర్ పర్యవేక్షిస్తుండగా వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన ఎరువుల రిటైల్ డీలర్లు, సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారు. ఈపాస్ యంత్రం ద్వారా అమ్మకాలు ఎరువుల అమ్మకాలు ఈపాస్ యంత్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. రైతులు తమ ఆధార్ కార్డు చూపించి ఈపాస్ యంత్రం ద్వారా ఎరువులు తీసుకోవడం జరిగే ప్రక్రియ. దుకాణ నిర్వాహకులు పారదర్శకంగా వ్యవహరించేలా ఈపాస్ ఉపయోగపడనుండగా పక్కదారి ఏ మాత్రం అస్కారం లేదు. దీని ద్వారా ఎరువుల దుకాణంలో భౌతిక నిల్వ, ఈపాస్ యంత్రంలో నిల్వ సరిపోవాలి. అంటే ఎరువుల నిల్వలు, అమ్మకాలు పారదర్శకంగా ఉండనున్నాయి. శాంపిల్స్ సేకరణతో చర్యలు ఈ సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 10వేల ఎరువుల నమూనాలు సేకరించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్యం నిర్దేశించారు. జిల్లాలో 510 నమూనాలు తీసుకోనున్నారు. ఎరువుల నమూనాల విశ్లేషణలో ప్రమాణాలకు భిన్నంగా ఉంటే.. అలాంటి వాటిని ‘నాన్ స్టాండర్డ్’గా వ్యవహరిస్తా రు. ఇలాంటి ఎరువులు విక్రయించే డీలర్లపై న్యా య, పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటారు. అక్రమాలకు అడ్డుకట్ట ఎరువుల దుకాణాల్లో నిల్వలు, అమ్మకాల నియంత్రణకు వ్యవసాయశాఖ ‘ఫైవ్స్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్నే ‘ఫర్టిలైజర్ వెరిఫికేషన్ సిస్టం’ అంటారు. ఇందులో భాగంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకుడు, మండల వ్యవసాయశాఖ అధికారులు ప్రతీ వారంలో రెండు సార్లు ఎరువుల దుకాణాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. రిజిస్టర్లో నిల్వలు, భౌతిక నిల్వలు, ఈపాస్ యంత్రంలోని నిల్వలను యాప్లో నిక్షిప్తపరుస్తారు. రిజిస్టర్లోనూ ధ్రువీకరిస్తారు. తేడాలేమైనా ఉంటే ఫర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. ఎరువుల విక్రయాలపై పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలుంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. ఎరువుల అవసరమిలా (మెట్రిక్ టన్నుల్లో) యూరియా 26,850 డీఏపీ 43,097 ఎంవోపీ 10,201 కాంప్లెక్స్ 24,540 ఎస్ఎస్పీ 11,089 -
జాతీయ పోటీలకు మాధవి
కరీంనగర్స్పోర్ట్స్: గుజరాత్ ఈ నెల 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్బాల్ సీనియర్ మహిళల చాంపియన్ షిప్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారిణి మాధవి ఎంపికై నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్రావు, బసరవేణి లక్ష్మణ్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా మంద్రమర్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయపోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. మాధవి ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా కొనసాగుతున్నారు. మాధవిని తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, నమిలికొండ ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్ అభినందించారు. తైక్వాండో పోటీల్లో ప్రతిభచొప్పదండి: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్న మండలంలోని రుక్మాపూర్ మాడల్ స్కూల్ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. పదోతరగతి విద్యార్థి శ్రీగాధ స్పందన గోల్డ్ మెడల్ సాధించగా, జునగారి రాంచరణ్ రెండు విభాగాల్లో గోల్డ్, బ్రౌంజ్ మెడల్ సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నిమ్మల సుధాకర్ అభినందించారు. -
నన్ను చంపి నా భూమి తీసుకోండి
● ఉద్రిక్తల మధ్య జాతీయ రహదారి పనులు ● అడ్డుకున్న రైతు.. పోలీసు స్టేషన్కు తరలింపు మానకొండూర్: ‘నాకు న్యాయం జరిగేంతవరకు జాతీయరహదారి 563కి నా భూమిని ఇచ్చేది లేదు. అలా కాదంటే.. నన్ను చంపి నా భూమిలోంచి రోడ్డు వేయండి’ అని మండలంలోని చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ తన భూమిలో జరుగుతున్న పనులను మంగళవారం అడ్డుకున్నాడు. నేషనల్ హైవే–563 కోసం మానకొండూర్ మండలంలోని మానకొండూర్, ముంజంపల్లి, అన్నారం, ఈదులగట్టెపల్లి, చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి వరకు అధికారులు భూ సేకరణ చేపట్టి, ప్రారంభించిన రహదారి విస్తరణ పనులు పూర్తి కావస్తున్నాయి. పలుచోట్లో సేకరించిన భూమికి పరిహారం తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో గుంటకు రూ.10లక్షలు ఉండగా.. అధికారులు రూ.63వేలు ఇవ్వడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. సుడా పరిధిలోని భూములకు రూ.63 చెల్లిస్తున్నారని, సుడా పరిధిలోని లేని గ్రామాలకు రూ.2లక్షలకు పైగా చెల్లించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొంత మందిరైతులు తమకు న్యాయం చేయాలని రోడ్డు పనులకు ఇప్పటికీ భూములు ఇవ్వలేదు. చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ సైతం తన భూమిని ఇవ్వలేదు. మంగళవారం ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ విజయ్కుమార్, సీఐలు సంజీవ్, సదన్కుమార్ తమ సిబ్బందితో కుమార్ భూమి వద్దకు చేరుకున్నారు. బందోబస్తు మధ్య హైవే పనులు చేపట్టారు. తన భూమిని లాక్కోవద్దని, న్యాయం చేయాలని కుమార్ ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. నోటీసులు ఇవ్వకుండా పనులు ఎలా చేపట్టుతున్నారని ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి స్టేషన్కు తరలించారు. అనంతరం నేషనల్ హైవే పనులు కొనసాగించారు. -
వర్షపునీరు ఎక్కడా నిలవొద్దు
● బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఖాళీ స్థలా లు, రోడ్లపై వర్షంనీరు నిలువకుండ పారిశుధ్య అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, ఎల్ఎండీలోని నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో పారిశుధ్య పనులు మెరుగు పరచాలన్నారు. చెత్త కనిపించకుండా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వర్షపునీరు నిలువకుండా డ్రైనేజీల్లోకి మళ్లించాలన్నారు. డ్రైనేజీల్లో సిల్ట్ లేకుండా చూడాలన్నారు. దోమల లార్వా పెరగకుండా నీటి గుంటలను తొలగించాలన్నారు. డివిజన్ల వారీగా దోమలు పెరగకుండా స్ప్రే, ఫాగింగ్ చేయాలని, ఆయిల్బాల్స్ వేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలని, నాటేందుకు స్థలాలు గుర్తించి వివరాలు అందించాలన్నారు. -
పైసా లేకుండా వైద్య సేవలు
మానకొండూర్: ప్రభుత్వాస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లేబర్రూం, మెడికల్ స్టోర్ పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 100శాతం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ సేవల ప్రగతిని తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో బీపీ, షుగర్కు మందులు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. మండలకేంద్రంలోని భవత కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగ విద్యార్థులతో ఆటలు ఆడారు. కేంద్రానికి ఏమైన అవసరాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కేంద్రం ఆవరణలో మొక్క నాటారు. తరువాత గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇల్లు వేగంగా పూర్తి చేయాలని, దశలవారీగా సొమ్ము జమ చేయిస్తామని సూచించారు. నర్సరీని పరిశీలించి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పండ్లు, పూలమొక్కలు పెంచాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, మండల విద్యాధికారి మధుసూదనాచా రి, భవిత కేంద్రం సిబ్బంది ఉమ, రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విస్తృత ప్రచారం చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి -
ఐదెకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్
● జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత మల్లారెడ్డి చొప్పదండి: త్వరలో చొప్పదండి సహకార సంఘం సొంత భూమి ఐదెకరాల్లో సోలార్ పవర్ ప్లాంటు నిర్మించి, ప్రభుత్వానికి రోజుకు 4,500 యూనిట్ల కరెంటు విక్రయిస్తామని జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని సహకార సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో చొప్పదండి పీఏసీఎస్లో క్రిబ్కో సంస్థ ద్వారా అంతర్జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ సంఘం అర్జించే లాభాల్లో రైతులకు పదిశాతం డివిడెంట్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు మాట్లాడుతూ రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించాలని కోరారు. ఏరియా మేనేజర్ నవీన్ కుమార్, సంఘం ఉపాధ్యక్షుడు ముద్దం మహేశ్ గౌడ్, మాజీ సహకార అధికారి గుర్రం ఇంద్రసేనారెడ్డి, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఖర్గే సభకు తరలిరావాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఈ నెల 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే బహిరంగసభకు కరీంనగర్ నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సమన్వయకర్త ఫక్రుద్దీన్ కోరారు. ఇందిరాభవన్లో మంగళవారం జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ బాధ్యులు, కార్యకర్తలు, ఇటీవల పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీఒక్కరు తరలిరావాలన్నారు. త్వరలో మై నార్టీలకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ నా యకులకు ఇందిరమ్మఇళ్ల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడికి ఇల్లు ఇస్తే, జీర్ణించుకోలేని మాజీ ఎమ్మె ల్యే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నా రు. కాగా సమావేశం జరుగుతుండగా, కొంతమంది కరీంనగర్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి లేరని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ నిలదీసే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి ఆడెం రాజు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్కుమార్ కర్ర సత్యప్రసన్నరెడ్డి పాల్గొన్నారు. వనమహోత్సవానికి సిద్ధం కండి జమ్మికుంట రూరల్: వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే వనమహోత్సవం, వెబ్సైట్లో మార్పులపై జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రతీ ఒక్కరు చేరుకోవాలన్నారు. ఏడీపీ కృష్ణ, ఎంపీడీవోలు భీమేశ్, శ్రీధర్, పుల్లుయ్య, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ పాఠశాల సందర్శన జమ్మికుంట: పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలను జిల్లా మలేరియా అధికారి ఉమాశ్రీరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో చందు మంగళవారం సందర్శించారు. వసతి గృహంలోని వాటర్ప్లాంట్, వంటగదిని పరిశీలించారు. వాటర్ ప్లాంట్ లీకేజీ లేకుండా, వంటగదిలోకి ఈగలు, దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బయటి నుంచి తినుబండారాలు తీసుకురావొద్దన్నారు. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వర్షాకాలంలో వ్యాపించే డెంగీ, మలేరియా, చికెన్గున్యా, మెదడువాపు, అతిసారం, టైఫాయిడ్, జాండీస్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 32 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జ్వరంతో బాధపడుతున్న నలుగురి రక్త నమూనాలు సేకరించారు. ప్రిన్సిపాల్ లచ్చయ్య, డాక్టర్లు రాజేశ్, మహోన్నత పటేల్ పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు 11 కేవీ చెర్లభూత్కుర్ ఫీడర్, ఇరుకుల్ల ఫీడర్లో చెర్లభూత్కూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ క్రిస్టియన్ కాలనీ ఫీడర్, 11కేవీ సివిల్ ఆసుపత్రి ఫీడర్ 33/11 కేవీ ఎస్ఎస్ వావిలాలపల్లిలో ఫీడర్లో సవరన్ స్ట్రీట్ ఏరియా, ఎస్వీజేసీ కళాశాల, రామాలయం, ప్రశాంత్నగర్, రాణి ఆసుపత్రి, జానకి చికెన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. -
సాగులో ‘డిజిటల్ టెక్నాలజీ’
● ఆధునిక వ్యవసాయం దిశగా అడుగులు ● యాప్, వాట్సాప్తో యువతరం కొంతపుంతలు ● ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం.. మార్కెట్ ధరలుజగిత్యాలఅగ్రికల్చర్: మొన్నటివరకు పాతతరం రైతులు సాంప్రదాయ వ్యవసాయం చేస్తే.. నేటి యువతరం సాగును లాభసాటిగా మార్చుకుని.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల్లో సిరులు పండిస్తున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన యాప్లను మోబైల్స్లో డౌన్లోడ్ చేసుకుని.. ఆధునిక సేద్యానికి సన్నద్ధం అవుతున్నారు. సాగులో వస్తున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా తమ స్నేహితులతో పంచుకుంటూ సాగుకు మరింత మెరుగులు దిద్దుకుంటున్నారు. ● విత్తనాలు వేసినప్పటి నుంచే.. బీటెక్, ఎంబీఏ చేసి.. కార్పొరేట్ కొలువులు చేస్తున్న యువత వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్లు ఉండటం, అందులో వ్యవసాయ సమాచారాన్ని అందించే యాప్లు అందుబాటులోకి రావడం యువ రైతులకు కలిసి వస్తోంది. యాప్ల ద్వారా ఏ సమయంలో విత్తనం వేయాలి..? ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి..? పంట ఎప్పుడు వస్తుంది..? ఆ పంటను కూలీల అవసరం లేకుండా యంత్రాల సహాయంతో ఎలా చేయవచ్చు..? పంటకు రోగాలు వస్తే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, పంట పండితే ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు..? అనే విషయాలపై విపులంగా వీడియో రూపంలో ఉంటుండటంతో వాటిని ఆచరిస్తూ అధిక దిగుబడి తీస్తున్నారు. ఈ యాప్లను జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ప్రత్యేకంగా రైతుల కోసం తయారు చేస్తున్నాయి. ఏ పంట సాగు చేస్తే.. ఆ పంట సాగు చేసే రైతులతో వాట్సాప్ గ్రూప్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలపై ఏ పురుగు కనబడినా వెంటనే సెల్ఫోన్ ద్వారా ఫొటో తీసి శాస్త్రవేత్తలకు పంపిస్తూ.. వాటికి అవసరమైన సస్యరక్షణ చర్యలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ● వ్యవసాయ వర్సిటీ యూ ట్యూబ్ ఛానల్ తెలంగాణ వ్యవసాయ వర్సిటి అగ్రికల్చర్ వీడియోస్ పేరుతో తెలుగులో యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోంది. ఇందులో పంటల సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రైతుల విజయగాథలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించి మార్కెటింగ్ చేయడం, ఆధునిక వ్యవసాయ పనిముట్ల గురించి వివరిస్తున్నారు. ● ప్లాంటిక్స్ యాప్ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇక్రిశాట్ రైతుల కోసం తెలుగు భాషలో ఈ యాప్ను రూపొందించింది. స్మార్ట్ఫోన్లోని కెమెరాతో తెగులు సోకిన మొక్కలను యాప్లో డౌన్లోడ్ చేయగానే.. కొద్ది వ్యవధిలోనే తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరిస్తారు. ● తెలంగాణ రైతు వెబ్ పోర్టల్ తెలంగాణ రైతు పోర్టల్ ద్వారా రైతులు వాతావరణం, మార్కెట్ సమాచారాన్ని పొందవచ్చు. అలాగే కిసాన్ పోర్టల్ ద్వారా రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు, మట్టి నమూనా పరీక్షల వివరాలు తదితర వివరాలు ఉంటాయి. ● వరి నాలెడ్జ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఈ పోర్టల్ను భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించింది. ఈ పోర్టల్ ద్వారా రైతులు వరి రకాలు, ఎరువుల యాజమాన్యం, కిసాన్ కాల్ సెంటర్కు వచ్చే ప్రశ్నలకు సమాధానాలు, శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలను తెలుసుకోవచ్చు. అన్నపూర్ణ కృషి ప్రసార సేవ ద్వారా వ్యవసాయంతోపాటు ఉద్యాన పంటలు, పశుపోషణ, చేపల ఉత్పత్తి పెంపకంపై సలహాలు పొందవచ్చు. ● కిసాన్ సువిధ దీని ద్వారా రైతులు రాబోయే ఐదు రోజులకు తమ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, వ్యవసాయ సూచనలను తెలుసుకోవచ్చు. అలాగే, ఈనామ్ పోర్టల్ ద్వారా రాష్ట్రం, దేశంలోని ఈనామ్తో అనుసంధానమైన మార్కెట్లలో పంటల ధరలను తెలుసుకోవచ్చు. తెలంగాణ అగ్రిస్ నెట్ ద్వారా పురుగుమందుల వినియోగం, పంటలు విత్తే సమయం, ఎరువుల మోతాదు వంటి సేద్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. యాప్లను ఉపయోగిస్తాను పంటల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అగ్రికల్చర్ యాప్స్లో ఉండే సమాచారాన్ని తెలుసుకుంటాను. కొత్త విషయాలను వాట్సాప్ గ్రూప్ల ద్వారా తోటి రైతులకు తెలియజేస్తాను. ఇంట్లోనే కూర్చుని సాగు సమాచారాన్ని యాప్ల ద్వారా తెలుసుకునే అవకాశం రావడం నేటి యువతరం అదృష్టం. – మెక్కొండ రాంరెడ్డి, యువ రైతు, ఆలూర్ శాస్త్రవేత్తలు, రైతులతో వాట్సాప్ గ్రూప్ రాబోయే రోజుల్లో ఆయా పంటల శాస్త్రవేత్తలు, సాగు చేసే రైతులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే డాట్ సెంటర్ల పరిధిలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అలాగే, తెలంగాణ వ్యవసాయ వర్సిటీ రైతుల కోసం యూట్యూబ్ ఛానల్తో పాటు అనేక యాప్లు ఉన్నాయి. – శ్రీలత, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస -
పల్లెల్లో స్థానిక సందడి
● పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సమాయత్తం ● హైకోర్టు ఆదేశాలతో మొదలైన కదలిక ● రిజర్వేషన్లపై వీడని ఉత్కంఠకరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు 90 రోజుల్లో నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్న ఆశావహులతో పాటు ప్రజలు సైతం ఆసక్తితో ఉన్నారు. ఈనెల 30లోగా బీసీ రిజర్వేషన్ల ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ అవకాశముంది. ఎన్నికల ప్ర క్రియను ప్రారంభించేలా అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశనం చేసింది. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. తరువాత పంచా యతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవ ల పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి బలా న్ని చేకూరుస్తున్నాయి. ఈ మేరకు ఓటరు జాబి తా సవరణలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదలైన హంగామా హైకోర్టు ఆదేశాలతో బరిలో నిలిచే ఆశావహులు హంగామా మొదలు పెట్టారు. గ్రామాల్లో యువతను, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమకు అనుకూలంగా ఇప్పటి నుంచే మౌత్టాక్ ప్రజల్లోకి వెళ్లేలా అనుచరులను సమాయత్తం చేస్తున్నారు. గ్రామాలు, వార్డులవారీగా అర్హులు, సమర్థులు ఎవరన్నదానిపై ప్రధాన పార్టీల లీడర్లు అంచనాకు వస్తున్నారు. మూడు విడతల్లో జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతల్లో కరీంనగర్, హుజూ రాబాద్ డివిజన్లవారీగా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 318 గ్రామపంచాయతీలు, 2,962 వార్డులు, 170 ఎంపీటీసీస్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 200లోపు ఓట్లున్న పోలింగ్ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, 200నుంచి 400 ఓట్లున్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 650 పైన ఓట్లున్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారులు, ముగ్గురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. 650 ఓట్లు పైన గ్రామాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గతంలోనే సూచించింది. దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రిజర్వేషన్లపైనే దృష్టి రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ ఉండేలా గత ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో మళ్లీ కొత్తగా పంచాయతీరాజ్ చట్టం–2024 బిల్లును ఆమోదించారు. దీని ప్రకారం ఎన్నికల్లో ఒకసారి మాత్రమే రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని స్థానాలకు రిజర్వేషన్లు మారనుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చిన నిర్వహించడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. జనాభా, పోలింగ్స్టేషన్లు మ్యాపింగ్ చేశాం’. అని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ వివరించారు.జిల్లాలో మొత్తం ఓటర్లు 10,82,751 మహిళలు 5,30,337 పురుషులు 5,52,353 ఇతరులు 61 గ్రామపంచాయతీలు 318 వార్డులు 2,962 జెడ్పీటీసీ స్థానాలు 15 ఎంపీటీసీలు 170 పోలింగ్ కేంద్రాలు 2,962 -
ఒక్క ఇల్లూ రాకపాయే
● నగరంలో జాడ లేని ‘ఇందిరమ్మ’ ● కమిటీలు లేక నిలిచిన ఎంపిక ● లబ్ధిదారులుగా మారని అర్హులు ● త్వరలో ప్రకటిస్తామన్న డీసీసీ ప్రెసిడెంట్కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రమంతా ఇందిరమ్మ ఇండ్ల హడావుడి కొనసాగుతుండగా, నగరంలో ఆ జాడే లేకుండా పోయింది. ఇప్పటివరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు అర్హుల జాబితా సిద్ధం చేసి ఉంచినా, కమిటీలు లేక అధికారిక ముద్ర పడడం లేదు. కాంగ్రెస్ అంతర్గత విభేదాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా, త్వరలో కమిటీలు వేసి, ఇండ్లు ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. అర్హుల జాబితా రెడీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్హుల జాబితాను నగరపాలకసంస్థ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. నగరంలోని 66 డివిజన్ల నుంచి 40,773 దరఖాస్తులు వచ్చాయి. 12,491 దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించారు. ఎల్–2లో (స్థలం, ఇళ్లు లేని) 25,978దరఖాస్తులు ఉండగా, ఎల్–1లో (స్థలం ఉండి, ఇళ్లు లేని) 2,304 దరఖాస్తులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎల్–1 దరఖాస్తుదారులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం తెలిసిందే. నగరానికి మొదటివిడతలో 1,737 ఇండ్లు మంజూరయ్యాయి. విచారణ చేసిన నగరపాలకసంస్థ అధికారులు 1,567 మందిని అర్హులుగా గుర్తించి కలెక్టర్కు జాబితా పంపించారు. ఇంకా 170మంది అర్హులను గుర్తించాల్సి ఉంది. చేతులు కలవక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై దృష్టి సారించడం తెలిసిందే. దరఖాస్తుదారుల్లో అర్హులను అధికారులు గుర్తిస్తే, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఇందిరమ్మ కమిటీలు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందించారు. డివిజన్లవారీగా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆ కమిటీలు ఇన్చార్జీ మంత్రి ద్వారా అధికారులకు జాబితాను అందిచాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల మూలంగా కమిటీల ఏర్పాటు ఇప్పటివరకు జరగలేదు. జిల్లా ఇన్చార్జీ మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్న సమయంలో, కరీంనగర్ నుంచి అప్పటి నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ద్వారా రెండు జాబితాలు వేర్వేరుగా వెళ్లాయి. దీంతో ఏ జాబితా ఆమోదించాలో తెలియని పరిస్థితిల్లో ఆమోద ముద్ర పడలేదు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు లేదు. ఇందిరమ్మ జాడ లేని కరీంనగర్ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మొదటి విడుత ఇందిరమ్మ ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, రూ.లక్ష కూడా ఖాతాల్లో పడే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్లో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కాగితాలను దాటి రావడం లేదు. అధికారులు జాబితా రూపొందించినా, కేవలం ఇందిరమ్మ కమిటీలు లేకపోవడంతో అర్హులు లబ్ధిదారులుగా మారడం లేదు. దీంతో కమిటీలతో సంబంధం లేకుండా ఉన్నతాధికారులే నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేసే అంశంపైనా దృష్టిపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో కమిటీలు కరీంనగర్లో త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటవుతాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ నుంచి రెండు జాబితాలు పంపించడం వాస్తవమేనని అంగీకరించారు. ఇన్చార్జిఇ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అనారోగ్య, ఇతరత్రా సమస్యల వల్ల పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారన్నారు. తన మానకొండూరు నియోజకవర్గంలోకి వచ్చే సదాశివపల్లి, అలుగునూరులో ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేసి, నగరంలోనూ ఇండ్లు ఇస్తామని పేర్కొన్నారు.నగరపాలకసంస్థలో డివిజన్లు 66 మంజూరైన ఇండ్లు 1,737 ఎంపిక చేసిన అర్హులు 1,567 -
కొసరి కొసరి వడ్డింపు
కార్పొరేషన్ కహానీ–2● గత కమిషనర్ హయాంలో కాంట్రాక్టర్లపై దయ ● టెండరు లేకుండా పనులు.. అంతకు ముందే బిల్లులు ● సమాచార హక్కుతో నిలిచిన రూ.40లక్షల చెల్లింపులు ● గరుడ జంక్షన్పై మరోసారి స.హ.చట్టం దరఖాస్తు ● అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీకి మాజీ మేయర్ ఫిర్యాదు ● కొత్త కమిషనర్ ప్రఫుల్ దేశాయ్పై గంపెడాశలతో సిబ్బందిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో మొన్నటి వరకు పరిపాలన అస్తవ్యస్తంగా సాగింది. గత కమిషనర్ హయాంలో తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు బల్దియా పరువును పెనం నుంచి పొయ్యిలో పడేశాయి. మరికొన్ని ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూన్నే ఉన్నాయి. అక్రమాలకు అవినీతికి బల్దియా అడ్డాగా మారిందన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాక్షాత్తూ తాజా మాజీ కార్పొరేటర్లే బల్దియాలో అవినీతి జరిగిందని సమాచార హక్కు కింద దరఖాస్తులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండడం బల్దియా దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వచ్చీరాగానే ఎంబీ మాయం ఘటనలో ఏఈ గఫూర్ను సస్పెండ్ చేయడంతో మరిన్ని అవినీతి వ్యవహారాలకు చరమగీతం పాడతారని బల్దియా సిబ్బంది, నగరపౌరులు గంపెడాశలతో ఉన్నారు. ఆర్టీఐ దరఖాస్తుతో నిలిచిన రూ.40 లక్షల చెల్లింపులు ఇటీవల బొమ్మకల్ ఫ్లై ఓవర్ సుందరీకరణ పనులు చేయకముందే కాంట్రాక్టర్కు రూ.40లక్షలు చెల్లించేందుకు కమిషనర్ చెక్కుసిద్ధం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ చెక్కు పాస్ కాకుండా ఒక సహచట్టం (ఆర్టీఐ) దరఖాస్తు కావడం గమనార్హం. పనులు చేయకుండానే చెక్కులు ఎలా కాంట్రాక్టరుకు ఇస్తున్నారని సిక్వాడీకి చెందిన ఓ పౌరుడు దరఖాస్తు చేయగానే.. విషయం బయటికి పొక్కిందన్న ఆందోళనలో రూ.40 లక్షల చెక్కు జారీ నిలిపివేశారు. అప్పటి వరకు మార్చి 31 గడువు ముగుస్తుందన్న తొందరలో చెక్కు సిద్ధం చేశామంటూ సమర్థించుకున్న కమిషనర్ తరువాత మాత్రం పేమెంట్ వోచర్లు, ఎంబీ రికార్డులు అసలు ప్రిపేర్ చేయలేదని ఆర్టీఐకి లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. మాజీ కార్పొరేటర్ల పోరాటం గత కమిషనర్ హయాంలో జరిగిన అవినీతిపై పలువురు కార్పొరేటర్లు బహిరంగ పోరుకు దిగారు. పద్మనగర్ గరుడ జంక్షన్లో రూ.కోటి అంచనాతో ప్రారంభించిన పనులను అదనంగా రూ.80లక్షలకు అదే కాంట్రాక్టర్కు ఎలా అప్పగిస్తారని సమాచార హక్కు ద్వారా బల్దియా కమిషనర్ను కోరడం కలకలం రేపుతోంది. ఈ పనులకు సంబంధించి వర్క్స్లిప్, డ్రాయింగ్ సమర్పించాలని దరఖాస్తులో కమిషనర్ను కోరడం గమనార్హం. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. బొమ్మకల్ ప్రాంతం 2022లో కరీంనగర్ స్మార్ట్సిటీలో భాగమే కానప్పుడు అక్కడ స్మార్ట్సిటీ నిధులతో పనులు ఎలా చేస్తారు అని నిలదీస్తున్నారు. ఈ నిధుల దుర్వినియోగంలో కేసు నమోదైందని, కరీంనగర్ స్మార్ట్సిటీ కమిషనర్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, కరీంనగర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రతినిధి, తదితరులు అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలంను మంగళవారం కోరారు.ప్రఫుల్ దేశాయ్పై ఆశలున్నాయి జిల్లాలో నిజాయితీగా పనిచేసే ఐఏఎస్లు కానరావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్లు ప్రజాసమస్యలపై వేగంగా స్పందిస్తుంటే కరీంనగర్లో ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరం. బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్పై చాలా ఆశలు ఉన్నాయి. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారిగా మంచి పేరుంది. బల్దియాలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కోడై కూస్తున్న నేపథ్యంలో కమిషనర్ అక్రమార్కులైన అధికారులు, గుత్తేదారులపై కొరఢా ఝుళిపిస్తారని ఆశిస్తున్నాం. – ఆమెర్, కాంగ్రెస్ నేత -
సమస్యలు వేనవేలు.. తీర్చర సార్లూ?
– వివరాలు 8లోu కరీంనగర్ అర్బన్: సమస్యల పరిష్కారం ఎండమావేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తుండగా బాధితుల సాంత్వన కరవవుతోంది. పరిపాలన మరింత సులువుగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాల విభజన జరగగా ఆశించినా ఫలితం అంతంతమాత్రమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ వస్తుండగా కాగితాల్లో మాత్రం పరిష్కార శాతం ఎక్కువగా ఉండటం విశేషం. మండలస్థాయిలో పరిష్కారం లేక కలెక్టరేట్కు వస్తే అవే అర్జీలను సదరు అధికారులకే ఇస్తుండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు కూడా సదరు అర్జీల బాధ్యత ఇవ్వడం శోచనీయం. ప్రతీ ప్రజావాణిలో అర్జీలు కుప్పలు తెప్పలుగా వస్తుండగా తమ సమస్యల పరిష్కారానికి ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించగా పలుసమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే చొరవ చూపారు. ప్రధానంగా భూసమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అర్జీలు అందజేశారు. ప్రజావాణికి 317 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని సాక్షి పలకరించగా వారి ఆవేదనను వివరించారు.● ప్రజావాణికి 317 అర్జీలుమొత్తం అర్జీలు: 317 ఇందులో ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్: 54 ఆర్డీవో కరీంనగర్: 19 డీపీవో: 14, తహసీల్దార్ వీణవంక: 13 సీపీ ఆఫీస్: 13 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 12 గంగాధర తహసీల్దార్: 12 తహసీల్దార్ కొత్తపల్లి: 11, వారధి సొసైటీ: 07 -
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు
యైటింక్లయిన్కాలనీ: రామగుండం మండలం న్యూమారేడుపాకలోని నర్సింహపురం(ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వి.అనిల్కుమార్ తన ఇద్దరు కుమారులను అదే పాఠశాలలో చదివిపిస్తున్నారు. పెద్దకుమారుడు శ్రీహన్ 5వ తరగతి, చిన్నకుమారుడు 2వ తరగతి చదువుతున్నారు. వారిద్దరిని నిత్యం తనతోపాటు బైక్పై ప్రభుత్వ బడికి తీసుకొస్తున్నాడు. తను పనిచేస్తున్న పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిపిస్తూ.. గ్రామంలోని తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచినట్లు టీచర్ అనిల్కుమార్ తెలిపారు. -
అందరికీ పీఎం బీమా చేయించండి
కరీంనగర్ అర్బన్: పీఎంజేజేబీవై, ఎస్బీవై, ఏపీవై వంటి బీమాలపై అవగాహన కల్పించి అందరికీ బీమా చేయించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకర్లు, అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి తక్కువ ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉన్న పీఎం బీమా యోజనపట్ల అవగాహన కల్పించాలన్నారు. 17 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అర్హత ఉన్న ఈ ప్రీమియం వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి సూరజ్ ఘర్ ముక్త్ బిజిలీ యోజన కార్యక్రమంలో భాగంగా ఒక రెవెన్యూ గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేయాలన్నారు. 5వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో ప్రతీ ఇంటికి, ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి సోలార్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ పదోతరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఐసీసీ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అర్జీదారులందరికీ నోటీసులు జారీచేసి పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.నగర సమస్యలపై పట్టింపేది?● 15 రోజుల్లో పరిష్కరించాలి● లేదంటే బల్దియా ముట్టడి● మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్కరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజల సమస్యలపై ప్రభుత్వ పెద్దలకు పట్టింపులేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. పదిహేనురోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే బల్దియాను ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లతో కలిసి నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసంపూర్తిగా ఉన్న 65 పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. షైనింగ్ కరీంనగర్ను అంధకారం చేశారన్నారు. 40 శాతం లైట్లు వెలగడం లేదని, వాటిని మార్చేవాళ్లే లేరన్నారు. జంక్షన్లను గాలికి వదిలివేశారని, వాటర్లేదు, ఫౌంటెన్లేదన్నారు. మూడు రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. స్వీపింగ్ మిషన్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వర్షాకాలం దోమలు పెరిగిపోతాయని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న డీఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగించాలన్నారు. డంప్యార్డ్ సమస్యను పరిష్కరించేలా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చర్యలు చేపట్టాలన్నారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే బల్దియాను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులు గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, సుధగోని మాధవి, రుద్ర రాజు, బండారి వేణు, ఎడ్ల అశోక్, జంగిలి ఐలెందర్యాదవ్, కోల సంపత్, జంగిలి సాగర్, తోట రాములు, మర్రి సతీశ్, నాంపల్లి శ్రీనివాస్, బోనాల శ్రీకాంత్, కుర్ర తిరుపతి, దిండిగాల మహేశ్, బాలయ్య, సంపత్రావు పాల్గొన్నారు.సాగులో మెలకువలపై నేడు శిక్షణకరీంనగర్ అర్బన్: రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు చిరుధాన్యాల సాగులో మెలకువలపై వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో కార్యక్రమం జరగనుండగా శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులందరూ సమీప రైతు వేదికల్లో సకాలంలో హాజరుకావాలని సూచించారు. -
మా ఆస్తులు తిరిగి ఇవ్వండి
మాకు ఇద్దరు కొడుకులు మహేందర్రెడ్డి, బుచ్చిరెడ్డి. వీరిద్దరికి ఆస్తులను ఇచ్చాం. కరీంనగర్లోని గణేశ్నగర్, కోతిరాంపూర్లో మేమిచ్చిన భూముల్లో ఉంటున్నారు. అలాగే నగరంలోని పలుప్రాంతాల్లోని ఆస్తులను దానంగా ఇచ్చాం. ఒక్కొక్కరికి రెండిళ్లు కట్టించి ఇచ్చాం. ఇంత చేస్తే మమ్మల్ని సాదడంలేదు. వృద్ధులమని చూడకుండా కొడుతున్నరు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నా భార్య నడవలేని స్థితిలో ఉంది. అయినా.. వారిలో మానవత్వం లేదు. మా ఆస్తులను తిరిగి మాకే ధారాదత్తం చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. – కాల్వ శంకర్రెడ్డి దంపతులు, కన్నాపూర్, శంకరపట్నం -
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్కు చెందిన స్రవంతి కరీంనగర్రూరల్ మండలం చెర్లభూత్కూర్లోని జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట కాగా కరీంనగర్లో నివాసముంటున్నారు. భర్త శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషీయన్. కూతురు అమూల్య 6వ తరగతి, కుమారుడు సాయిమోక్షిత్ 4వ తరగతి చదువుతున్నారు. గతంలో వీరు కరీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువగా.. ప్రస్తుతం తల్లి వెంటే చెర్లభూత్కూర్ ప్రభుత్వ బడికి వెళ్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కల్పించేందుకు తన పిల్లలనూ అక్కడే చదివిపిస్తున్నట్లు టీచర్ స్రవంతి తెలిపారు. -
సర్కార్ బడికి జైకొట్టి
బడిపై నమ్మకం కల్పించాలని● తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు ● స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఉద్యోగులుప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం.. గవర్నమెంట్ టీచర్లపై భరోసా పెంచాలనే పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని చెప్పేందుకే తాము పనిచేస్తున్న స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్తున్నారు. సార్లే.. తమ పిల్లలను ఊరిలోని బడికి తీసుకొస్తుంటే.. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలనూ చేర్పిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.రుద్రంగి(వేములవాడ): తన ముగ్గురు పిల్లలనూ సర్కార్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరునితండాకు చెందిన టీచర్ భూక్య తిరుపతి. రుద్రంగి ప్రైమరీ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న భూక్య తిరుపతికి భూక్య ప్రీతిజ, భూక్య నిహారిక, భూక్య అయాన్ అద్వైత్ పిల్లలు. నిహారికను గతంలో తాను పనిచేసిన రుద్రంగి ప్రైమరీ స్కూల్కు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మానాలలోని స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి తన కొడుకు అయాన్ అద్వైత్ను అదే పాఠశాలకు వెంట తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూతుళ్లు భూక్య ప్రీతిజ 10వ తరగతి, భూక్య నిహారిక 7వ తరగతి.. గురుకులాల్లో చదువుతున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గుండేటి రవికుమార్–పద్మలత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు మండలంలోని పోసానిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల చిన్నకుమారుడు లౌకిక్ నాలుగో తరగతి వారు పనిచేస్తున్న పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. నిత్యం తమ వెంటే స్కూల్కు తీసుకెళ్తున్నారు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలకు పంపడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రుల బడికి కొడుకు -
ఫస్ట్ వికెట్ డౌన్!
కార్పొరేషన్ కహానీ–1సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలోని కిసాన్నగర్ సమీకృత మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన అక్రమాల వ్యవహారంలో తొలి వేటు పడింది. లేని రాళ్లను కట్ చేశామని రూ.80లక్షలు బిల్లు చేసినట్లుగా చెబుతున్న ఎంబీ 152 మాయమైన ఘటనలో ఏఈ అబ్దుల్ గఫూర్ను సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాలు జారీచేశారు. కిసాన్నగర్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన ఎంబీ 152ను వారం రోజుల్లో తీసుకురావాలని, లేదంటే సస్పెండ్ చేస్తానంటూ ఇటీవల హెచ్చరించినట్లుగానే కమిషనర్ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ఈక్రమంలో కమిషనర్ చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో ఏడాది పాటుగా పోరాడుతున్న ‘సాక్షి’ పోరాటం ఫలించింది. కానీ... అదే సమయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్షన్ తరువాత విచారణ కొనసాగుతోందని కమిషనర్ పేర్కొనడంతో మరింత మందిపై చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎంబీ మాయం.. నగరంలోని కిసాన్నగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం రూ.5.80 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టారు. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మకై ్క అంచనాలు పెంచారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. లేని గుట్టను చూపించి, రాక్ కటింగ్ పేరిట సుమారు రూ.80 లక్షల బిల్లుస్వాహా చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఇదే సమయంలో రాక్ కటింగ్కు సంబంధించినదిగా చెబుతున్న ఎంబీ 152 మాయం కావడం ఆరోపణలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలోనే ఎంబీ 152 పోయిందంటూ సర్టిఫైడ్ కాపీ కోసం కాంట్రాక్టర్ చిందం శ్రీనివాస్ వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఏఈ వద్ద ఉండాల్సిన ఎంబీ పోయిందని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఎంబీ మాయం ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో, రూ.80 లక్షలు బిల్లులు చేశారనేది అబద్దమని, కేవలం రూ.1,99,468 మాత్రమే చెల్లించామని ఏఈ అబ్దుల్ గఫూర్ పేరిట పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా ఇష్టారీతిన ప్రకటన ఇవ్వడంతో అప్పటి ఇన్చార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సదరు ఏఈ గఫూర్కు షోకాజు నోటీసు జారీ చేశారు. ఆ తరువాత రెగ్యులర్ కమిషనర్ విధుల్లో చేరడంతో ఎంబీ మాయం వ్యవహారం అటకెక్కింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ బాధ్యతలు చేపట్టడం, ఎంబీ మాయంపై దృష్టి సారించి సస్పెండ్ చేయడంతో తొలి వేటు పడింది. ఈ విషయంలో ఏఈ గఫూర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతోనే సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.ఎంబీ బుక్ మాయం వ్యవహారంలో బల్దియా ఏఈ సస్పెన్షన్ ఫలించిన ‘సాక్షి’ ఏడాది పోరాటం బుక్ను పోగొట్టింది.. ఫిర్యాదు చేసింది కాంట్రాక్టరే ఏఈకి బదులు కాంట్రాక్టర్ పోలీసులను ఆశ్రయించిన వైనం కమిషనర్ ప్రఫుల్ తర్వాత ఏం చేస్తారన్న ఉత్కంఠఏఈ పావే! ఎంబీ మాయం వ్యవహారంలో ఏఈ గఫూర్ కేవలం పావు మాత్రమేననే ప్రచారం ఉంది. ఎంబీకి బాధ్యత వహించాల్సింది ఏఈనే కాబట్టి సాంకేతికంగా ఆయనను సస్పెండ్ చేయడం సరైనదే అయినా.. ఆయన వెనక ఉన్న పెద్ద తలకాయలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఆగస్టులో ఎంబీ మాయమైందంటూ కాంట్రాక్టర్ వన్టౌన్లో సర్టిఫైడ్ కాపీ కోసం ఫిర్యాదు చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డూప్లికేట్ ఎంబీ పేరిట తప్పుడు బిల్లులు రూపొందించే వ్యూహంలో భాగంగానే ఫిర్యాదు ఇచ్చి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆగస్టులో ఎంబీ రికార్డును ఏఈ గఫూర్ తాను కాంట్రాక్టర్ చిందం శ్రీనివాస్కు అప్పగిస్తే అతని వద్ద గల్లంతయ్యిందని లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చాడు. ప్రభుత్వ రికార్డు మాయమైతే కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు దాన్ని అంగీకరించడం, సర్టిఫైడ్ కాపీ జారీచేయడం, దాన్ని బల్దియా అధికారులు ఆమోదించడం విడ్డూరం. దాదాపు 10 నెలల కాలంగా ఎంబీ బుక్ విషయంలో బల్దియా చర్యలు తీసుకోకపోవడానికి చిందం శ్రీనివాస్కు రావాల్సిన బిల్లలు విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు కాలయాపన జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఎంబీ బుక్ కాంట్రాక్టర్ వద్దే మాయమైందని ఏఈ గఫూర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఇంతవరకూ కాంట్రాక్టర్పై శాఖాపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని నగర ప్రజలు నిలదీస్తున్నారు. దీని మొ త్తానికి గతంలో ఇక్కడ ఇంజినీరింగ్ సెక్షన్లో పని చేసి బదిలీ మీద వెళ్లిన సీనియర్ ఇంజినీరే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● స్కానింగ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్ ● జూన్లో 8 సెంటర్లకు నోటీసులుకరీంనగర్టౌన్: స్కానింగ్ సెంటర్లపై వైద్యారోగ్యశాఖాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అయినా కొంతమంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, వైద్యులు కలిసి స్కానింగ్లో ఆడపిల్ల అని తెలుసుకొని గుట్టుచప్పుడు కాకుండా కానరాని లోకాలకు పంపుతున్నారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండి ఆదాయం లేని కొన్ని నర్సింగ్ హోంలు, పెర్టిలిటీ కేంద్రాల్లో ఎవరికీ అనుమానం రాకుండా జరుగుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేటు ప్రాక్టీషనర్లు మధ్యవర్తులుగా ఉండి ఆడపిల్లలకు మరణ శాసనం లిఖిస్తున్నారు. అడ్వయిజరీ కమిటీ సమావేశం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర వెంకటరమణ అన్నారు. సోమవారం డీఎంహెచ్వో చాంబర్లో జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎంహెచ్వో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును సమీక్షించారు. 8 సెంటర్లకు నోటీసులు గతనెలలో లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని అతిక్రమించిన 8 స్కానింగ్ సెంటర్లకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్కానింగ్ సెంటర్లు గర్భంలోని పిండం ఆడ లేదా మగ శిశువు అని తెలపడం చట్టరీత్యా నేరం. 3 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.50,000 వరకు జరిమానా విధిస్తారు. తనిఖీలు.. వైద్యారోగ్య శాఖ జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లు, మెటర్నిటి హోంలు, ఫెర్టిలిటీ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. అక్రమాలకు పాల్పడితే సీజ్ నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. గడువు ప్రకారం సమాధానం చెప్పకుంటే వాటిని సీజ్ చేస్తాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ఆర్ఎంపీలు, పీఎంపీలు మధ్యవర్తులుగా లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – వెంకటరమణ, డీఎంహెచ్వో -
గురుకులం విద్యార్థులకు పురుగుల అన్నం
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలోని బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థులకు ఆదివారం పురుగులు పట్టిన భోజనం అందించడం కలకలం సృష్టించింది. పాఠశాలకు సందర్శనకు వెళ్లిన ఓ విద్యార్థి తండ్రి పురుగుల భోజనం చూడడంతో విషయం బయటకు తెలిసింది. గురుకులాల్లో తరచుగా నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా.. ప్రతీరోజు బియ్యం శుభ్రం చేసిన తర్వాతే వండుతామని, ఆదివారం కావడంతో అధ్యాపకులు అందరూ సెలవులో ఉన్నారని, అందుకే పర్యవేక్షించలేదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపారు. నాసిరకం బియ్యం పాఠశాలలకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
ఉపసంహరించుకోవాలి
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ ఉత్తర్వుల వల్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడి విద్యా ప్రమాణాలు మరింత దిగజారుతాయి. ఉపాధ్యాయుల మధ్య తగువులకు దారితీసి పాఠశాల వాతావరణం కలుషితమవుతుంది. – ఎ.తిరుపతిరావు, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులను నియమించాలి పాఠశాలలో పర్యవేక్షణ చేసి బోధన మెరుగుపరచాలనే విధానం మంచిదే. కానీ, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి పర్యవేక్షణకు నియమించాలనుకోవడం సరికాదు. పాఠశాలల పర్యవేక్షణకు ఉన్నతాధికారులను నియమిస్తేనే బాగుంటుంది. – పీఆర్ శ్రీనివాస్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
తాజా మాజీల రాజకీయం
● డివిజన్ల పునర్విభజనలో కీలక పాత్ర ● తమకు అనుకూలంగా డీలిమిటేషన్? ● బల్దియా అధికారుల తీరుపై అనుమానం ● కోర్టుకు వెళ్లేందుకు పలువురి సన్నాహంకరీంనగర్ కార్పొరేషన్: అన్ని పార్టీల తాజా మాజీ కార్పొరేటర్ల కనుసన్నల్లోనే డివిజన్ల పునర్విభజన సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన తుది జాబితా వెల్లడి కాగా, శాసీ్త్రయంగా కాకుండా, మాజీ కార్పొరేటర్లకు అనుకూలంగా రూపొందించినట్లుగా ఆరోపణలు న్నాయి. 66 డివిజన్లలో సగానికి పైగా మాజీల ప్ర భావంతో రూపురేఖలు మారినట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం కొందరు టౌన్ప్లానింగ్ అధికారులు నానా పాట్లు పడ్డారనే అభియోగాలపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందు కు, కోర్టుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. మాజీలకు అనుకూలంగానే ‘ఈ ఇంటి నంబర్ నుంచి ఆ ఇంటి నంబర్ వరకు నా డివిజన్. రాసి పెట్టుకోండి. ఇదే ఫైనల్ లిస్ట్లో ఉంటది.’ అంటూ ఓ మాజీ కార్పొరేటర్ పునర్విభజన ప్రక్రియ పూర్తికాక ముందునుంచి బలంగా చెబుతుండగా, అందుకు అనుగుణంగానే జాబితా రావడం పునర్విభజన జరిగిన తీరును తెలియజేస్తోంది. ప్రాథమిక జాబితా లీకు కావడంతోనే కొంతమంది మాజీలు అలర్ట్ అయ్యారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కావడంతో, డివిజన్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదిపారు. రిజర్వేషన్, గెలుపు కోసం రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ల రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉండాలని, తాము గెలవాలనే ఆలోచనతో మాజీ కార్పొరేటర్లు పునర్విభజనపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. కొంతమంది పట్టణ ప్రణాళిక అధికారుల సహకారంతో డ్రాఫ్ట్లో పేర్కొన్న ఇళ్లను ఇతర డివిజన్లో కలపడం, ఇతర డివిజన్లో ఉన్న అనుకూలమైన ఇళ్లను తమ డివిజన్లో కలపడంలో విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్ అవుతాయనే డివిజన్లలో ఇండ్ల మార్పి డి ఎక్కువగా జరిగినట్లు సమాచారం. కొన్ని డివిజ న్లలో తమకు అనుకూలమైన ఇళ్లను వీధులు దాటి మరీ కలుపుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏయే ప్రాంతాలు తమకు అనుకూలంగా ఉంటాయో చూ సుకొని, తమ డివిజన్లో ఉండేలా చూసుకొన్నారు. శాసీ్త్రయత ఏదీ..? నగరంలో ఆరుగ్రామాలు, ఒక పట్టణం విలీనం కావడంతో 60 డివిజన్లు 66గా మారడం తెలిసిందే. దీనితో డివిజన్ల పునర్విభజనను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 4వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రక్రి య కొనసాగింది. 21వ తేదీన కాకుండా, అదే తేదీ తో 27వ తేదీన డివిజన్ల హద్దులతో ఒక జాబితా, 28వ తేదీన ఇంటినంబర్లు, కాలనీలతో తుది జాబి తా రావడం తెలిసిందే. హద్దులతో రూపొందిన డివిజన్లు జాబితాకు, ఇంటినంబర్లు, కాలనీలతో వచ్చిన జాబితాకు వ్యత్యాసాలున్నట్లు ఆరోపణలున్నాయి. భౌగోళికంగా, పారిశుధ్య సేవలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాల కోసం డివిజన్లను శాసీ్త్రయంగా రూపొందించాల్సి ఉండగా, కేవలం రాజకీయ కోణంలోనే డివిజన్ల డీలిమిటేషన్ చేశారనే అపవాదును బల్దియా మూటకట్టుకొంది.వ్యక్తుల కోణంలోనే పునర్విభజన మాజీ కార్పొరేటర్లకు అనుకూలంగా డివిజన్లను పునర్విభజించారు. ముసాయిదాపై అభ్యంతరాలు చెబితే, అంగీకరించినట్లు చెప్పి, మళ్లీ తుది జాబితా లో పరిగణలోకి తీసుకోకుండానే రూపొందించారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలున్నాయి. విచారణ జరిపి, శాసీ్త్రయంగా పునర్విభజన చేపట్టాలి. కేవలం వ్యక్తుల కోసం జరిగిన పునర్విభజనపై కోర్టును ఆశ్రయిస్తాం. – మహమ్మద్ ఆమీర్, సామాజిక కార్యకర్త -
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
చందుర్తి(వేములవాడ): ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వృద్ధుడు ఆదివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలో ని ఆశిరెడ్డిపల్లికి చెందిన నేరెళ్ల వెంకటి(72) ఈనెల 11న తన ఇంటి ముందర కూర్చోగా.. అదే మండలం నర్సింగపూర్కు చెందిన పూడూరి భరత్ బైక్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడు రెండు కాళ్లు, చేతు విరగ్గా, తలకు బలమైన గాయమైంది. 15 రోజులపాటు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం తిరిగి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందాడు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై రమేశ్ తెలిపారు. కోరుట్లలో ఒకరికి కత్తిపోట్లుకోరుట్ల: కోరుట్లలోని రవీంద్రరోడ్లో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో బాధితుడిని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన ఇట్యాల సత్యనారాయణ (45) పోచమ్మ బోనాల సందర్భంగా రవీంద్రరోడ్లోని తమ సంఘం భవనం వద్ద ఉండగా ఇల్లుటపు గంగనర్సయ్య(40) అనే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కత్తితో కడుపులో పొడిచినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పాత కక్షలు, గొడవలు కత్తి పోట్లకు కారణమని పేర్కొన్నారు. -
బో ‘నమో’ పెద్దమ్మతల్లీ
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025కరీంనగర్ కల్చరల్: డప్పు చప్పుళ్లు.. నెత్తిన బోనాలు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాల మధ్య ఆదివారం నగరంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. కట్టరాంపూర్, బోయవాడ, భగత్నగర్, జ్యోతినగర్కు చెందిన ముదిరాజ్లు బోనాలతో తరలివచ్చారు. భగత్నగర్ భగత్సింగ్ విగ్రహం నుంచి అందరూ కలిసి భారీర్యాలీగా ఆలయానికి బయల్దేరారు. పెద్దమ్మ ఆలయంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, గాజులు, నూతన వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పాల్గొని బోనం ఎత్తారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు మూల జయపాల్, నర్సయ్య, నాగరాజు, లింగయ్య, కనకయ్య పాల్గొన్నారు.నృసింహుడి సన్నిధిలో భక్తులుధర్మపురి: ఆషాఢ శుద్ధ చవితి ఆదివారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. -
మాదిగలకు అండగా ఉంటా
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ● అల్గునూర్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనంతిమ్మాపూర్: మాదిగలకు అన్నివిధాలా అండగా ఉంటానని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. అల్గునూరులో ఆదివారం మాదిగ అఫీషియల్ కాంగ్రెస్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదిగ సమాజ సంక్షేమం కోసం అందరికన్నా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. సామాన్య వ్యక్తిగా కష్టాలను అనుభవించిన తాను, ప్రజల సుఖదు:ఖాల్లో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాదిగలు గతంలో తమ గుర్తింపును చెప్పుకోలేని స్థితి నుంచి ఇప్పుడు గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవడం శుభపరిణామమన్నారు. ఈ ఘనత మందకృష్ణ మాదిగ, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో సాధ్యమైందని కొనియాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ మాదిగ జాతి జాతీయ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిందని అన్నారు. సమ్మేళనంలో ప్రొఫెసర్ చింతకింది ఖాసీం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సోమన్న పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకం కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ నిర్వహణలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఆది వారం స్థానిక టీఎన్జీవో భవన్లో రాష్ట్ర ఆంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కిల్ల ర్ 145వ జయంతిని ఘనంగా నిర్వహించా రు. మంత్రి లక్ష్మణ్ కుమార్, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ను టీఎన్జీవోల జిల్లా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆంధ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీని వాస్, కరీంనగర్ అంధ ఉద్యోగుల అధ్యక్షుడు గురుస్వామి, టీఎన్జీ వోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ
● ప్రకృతి సేద్యం చేసే రైతుల ఎంపిక ● జగిత్యాల జిల్లాలో 2,500 మంది గుర్తింపు ● పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంజగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయంలో వస్తున్న మార్పులతో పంటల్లో దిగుబడి పెరిగినప్పటికీ.. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు మందులను పంటలపై విచ్చలవిడిగా వాడుతుండటంతో మనుషుల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారింది. దీంతో రైతులకు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు భారంగా తయారైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ వైపు రైతుల ఖర్చు తగ్గించడంతోపాటు మరోవైపు వినియోగదారులకు మేలైన ఆహారపదార్థాలను అందించేందుకు ప్రకృతి సేద్య పద్ధతులను పాటించాలని అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ప్రా రంభించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల దృష్టి మరల్చేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించింది. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో అవగాహన కార్యక్రమాలతోపాటు వారి తోటలను ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన రైతులకు పలు విధాలుగా శిక్షణ ఇచ్చేందుకు నిధులు మంజూరు చేస్తోంది. మరోవైపు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకృతి సేద్యంతో ఓ వైపు ప్రజల ఆరోగ్యానికి భద్రత ఇవ్వడంతోపాటు మరోవైపు రైతులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రోత్సాహం అందించనుంది. ముఖ్యంగా సాగులో రసాయన ఎరువులను ఇబ్బడిముబ్బడిగా వాడుతుండడంతో క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు సాగుభూములు నిర్జీవంగా మారి పనికి రాకుండా పోతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీటే వేస్తూ.. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకర ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని చూస్తోంది. ఈ మేరకు రైతులను ఎంపిక చేసి, వారితో రసాయనాలు లేని సేంద్రియ పంటలను పండించాలని సంకల్పించింది. ఇందుకు గాను రెండేళ్లపాటు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కార్యాచరణకు సిద్ధమైంది. 2500 మంది ఎంపిక జగిత్యాల జిల్లాలో సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయించేందుకు ఆసక్తి గల 2500 మంది రైతులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 72 ఏఈఓ క్లస్టర్లు ఉండగా.. అందులో ప్రాథమికంగా 20 క్లస్టర్ల పరిధిలో ఈ పథకాన్ని ప్రస్తుత ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి క్లస్టర్ నుంచి 125 మంది రైతులను ఎంపిక చేస్తారు. వీరికి ఎల్ఎన్ఎఫ్ఐ శాస్త్రవేత్తలు, మాస్టర్ ట్రైనర్లు, శిక్షణ పొందిన సీఆర్పీలు ప్రకృతి సేద్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి సేద్య పద్ధతులకు దేశీయ ఆవులు ప్రధానం కాబట్టి ఆవులు ఉన్న రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం తయారుచేసి ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ప్రకృతి సేద్య స్టాళ్ల ఏర్పాటు ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా కూరగాయలు, భోజనానికి ఉపయోగించే సన్నరకం వరి పంట సాగు చేసే రైతులను తొలుత ఈ పథకంలోకి తీసుకురానున్నారు. వారు పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ ఉంటే ఇతర రైతులు కూడా సేంద్రియ పద్ధతులను అనుసరించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించడంతోపాటు ఈ పద్ధతిలో ఆసక్తి ఉన్న రైతులకు పలు దఫాలుగా శిక్షణ ఇచ్చాను. మామిడి, వరి పంటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నాను. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి. – మిట్టపెల్లి రాములు, తుంగూర్ రైతులను ఎంపిక చేస్తున్నాం సేంద్రియ వ్యవసాయ పథకం కోసం రైతులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. రసాయన ఎరువులను తగ్గించి, సహజ ఉత్పత్తులు అందించాలన్నది లక్ష్యం. – భాస్కర్, వ్యవసాయ శాఖ అధికారి, జగిత్యాల -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
తిమ్మాపూర్: మండలంలోని ఎల్ఎండీ డ్యాంలో చేపలు పట్టేందుకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి కనుకయ్య(61) రోజూ మాదిరిగానే చేపలు పట్టేందుకు ఈనెల 28న ఎల్ఎండీలోని రిజర్వాయర్కు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తెప్పపై నుంచి పడి నీళ్లలో పడి మునిగిపోయాడు. నరేడ్ల రవి అనేవ్యక్తి కనుకయ్య కుటుంబ సభ్యులకు, పోలీసులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి కుమారుడు పిల్లి సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. -
హోమియోను మించిన వైద్యం లేదు
● స్వీయ అనుభవాన్ని వివరించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ● కరీంనగర్లో హోమియో వైద్యుల ఐదో రాష్ట్రస్థాయి సైంటిఫిక్ సెమినార్కరీంనగర్టౌన్: వైద్యరంగంలో హోమియోను మించిన చికిత్స లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని పద్మనగర్లో 5వ రాష్ట్రస్థాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ సైంటిఫిక్ సెమినార్ను ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సెమినార్లో కరీంనగర్కు చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు కొడిత్యాల శ్రీనివాస్ లైవ్లో ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీపై, డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాతలాజికల్ ప్రిస్క్రిప్షన్న్పై, డాక్టర్ గణేశ్ ఆచారి కార్డియోమైపోతిపై, డాక్టర్ హీరాలాల్ అగర్వాల్ రేనల్ వ్యాధులపై, సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తన చేతుల మీదుగా వందల హాస్పిటళ్లు ప్రారంభించానని, హోమియో వైద్య సదస్సుకు రావడం ఇదే ప్రథమమన్నారు. ఈ సదస్సుకు తను ఇష్టంతో వచ్చానని అన్నారు. ఈ సందర్భంగా తన స్వీయ అనుభవాన్ని వివరించారు. మానేరు రివర్ ఫ్రంట్ స్టడీ కోసం సీయోల్కు వెళ్లగానే తనకు విపరీతమైన దగ్గు వచ్చిందన్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా తగ్గలేదని, ఒక మంత్రి సూచన మేరకు హోమియో వాడిన వారం రోజుల్లోనే పూర్తి రిలీఫ్ వచ్చిందని తెలిపారు. హోమియో వైద్యుల సంఘ భవన స్థలానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 2025–27 సంవత్సరానికి గానూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా గుజరాత్కు చెందిన డాక్టర్ నిశికత్ తాపే వ్యవహరించారు. కరీంనగర్ యూనిట్ ప్రెసిడెంట్గా డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. హోమియోపతి వైద్యుల జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శివమూర్తి, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ.రావు, డాక్టర్ ఎంఎన్ రాజు, డాక్టర్లు దీపక్ బాబు, ఎన్ఎస్.రెడ్డి, దయాకర్, దినకర్, రవికుమార్, రవీంద్రచారి, హప్సాన, కృష్ణకాంత్, 300మంది వైద్యులు పాల్గొన్నారు. -
ఓటరుకు శుభవార్త
● పక్షం రోజుల్లో ఇంటికే ఓటరు కార్డు ● ఎప్పటికప్పుడు సమాచారంకరీంనగర్ అర్బన్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నవారికి 15 రోజుల్లో ఓటరు కార్డు అందించాలన్న కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓటర్లకు ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఈపీఐసీ) చేసేందుకు నెలకు పైగా సమయం పడుతోంది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 15 రోజుల్లో కార్డులు అందనున్నాయి. ఇందుకోసం ఈసీఐ నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) ని ప్రవేశపెట్టింది. ఎన్నికల నమోదు అధికారి(ఈఆర్వో) ఎపిక్ జనరేట్ చేపట్టిన రోజు నుంచి పోస్టల్ విభాగం ద్వారా చేరేంతవరకూ ఓటరుకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఆన్లైన్లో చేయడం ఇలా ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్ నంబరు, మెయిల్ ఐడీతో సైనప్ కావాలి. క్రియేట్ చేసిన ఆకౌంటుపై క్లిక్ చేసి పేరు, పాస్వర్డును నమో దు చేయాలి. సైనప్ అయిన మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో లాగిన్ కావాలి. కొత్తగా నమోదు చేసుకునే వారు (పారం–6) వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేయాలి. అందులో పేర్కొన్న డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. మరోసారి వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. స్టేటస్ తెలుసుకోవచ్చు ఎన్వీఎస్పీ పోర్టల్ మొబైల్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో లాగిన్ కావాలి. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేయా లి. దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్ వచ్చిన రెఫరెన్స్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకొని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.మంచి అవకాశం గతంలో ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేస్తే కార్డు చేతికి రావడానికి చాలా రోజులు పట్టేది. కొత్తగా నమోదు చేసుకున్న వారు ఓటు వేయడానికి ఇబ్బంది పడేవారు. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ఓటరు కార్డు రానుంది. కొత్తగా నమోదు చేసుకునేవారు, ఇదివరకు జారీ అయిన ఓటర్లు కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – కుందారపు మహేశ్వర్, ఆర్డీవో, కరీంనగర్ -
పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ
గోదావరిఖని:పోయింది ఎక్కువ.. రికవరీ తక్కువ.. ఇదీ రామగుండం పోలీస్కమిషనరేట్లో సెల్ఫోన్ రికవరీ పరిస్థితి. వారసంతలు, బస్స్టేషన్లు, రద్దీప్రాంతాల్లో సెల్ఫోన్ ఎక్కువగా చోరీకి గురవుతున్నాయి. సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సంబందిత సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) పోర్టల్లో నమోదు చేయడంతో పాటు సంబందిత పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. సెల్ఫోన్ చోరీ చేసిన దొంగలు మరో అడుగు ముందుకేసి ఐఎంఈఐ నంబర్ తొలగించి వినియోగిస్తుండటంతో బాధితులకు పోగొట్టుకున్న సెల్ఫోన్లు తిరిగి దక్కడం లేదు. మోబైల్ ట్రాక్ ద్వారా రికవరీ పోయిన సెల్ఫోన్ ఒరిజినల్ బిల్లుల ద్వారా ఐఎంఈఐ నంబర్తో ట్రాక్ చేస్తున్నారు. సెల్ఫోన్ కాల్స్పై ట్రాక్ రికార్డింగ్ ఉంచడం ద్వారా గుర్తిస్తున్నారు. అయితే కొందరు సిమ్ వేసి ఆన్చేయకుండా వీడియోగేమ్లు, ఇతర పనులకు వినియోగిస్తుండటంతో పోగొట్టుకున్న సెల్ఫోన్లు రికవరీ కావడం లేదు. దొరికేది తక్కువే.. సీఈఐఆర్ పోర్టల్ రంగప్రవేశంలో సెల్ఫోన్ చోరీ లకు అడ్డుకట్టపడింది. అయినప్పటికీ రామగుండం పోలీస్ కమిషనరేట్లో 6,683 మోబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. వీటిలో 40శాతం మాత్రమే రికవరీ అయ్యాయి. పోగొట్టుకున్న సెల్ఫోన్లలో 2020 సెల్ఫోన్ మాత్రమే రికవరీ అయ్యాయి. ప్రతీ పోలీస్స్టేషన్లో ప్రత్యేక విభాగం పోయిన సెల్పోన్ల రికవరీ కోసం రామగుండం పోలీస్కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా ఏర్పాటు చేశారు. ఎవరైన సెల్పోన్ కోల్పోతే వెంటనే సీఈఐఎంఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో పాటు సంబందిత పోలీసుస్టేషన్లో సంప్రదించాలని కోరుతున్నారు. వీటిపై నిఘా కోసం సీసీఎస్, ఐటీ సెల్ విభాగాలు పనిచేస్తున్నాయి. సెల్ఫోన్ రికవరీలో వెనుకంజ కమిషనరేట్లో పోయింది 6,683 రికవరీ అయిన 2,020 సెల్ ఫోన్లు -
బోధన వదిలి.. తనిఖీ బాధ్యతలా?
● విద్యాశాఖలో వింత నిర్ణయాలు ● వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు కరీంనగర్: ‘రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీసుకుంటున్న కొన్ని వింత నిర్ణయాలతో ఆ శాఖ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంటుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం, ఫలితాలు లేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం యంత్రాంగానికి రివాజుగా మారింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు సీనియర్ ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించాలనే నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యాభిమానులు వ్యతిరేకిస్తున్నారు.’ విద్యాశాఖ ఆదేశాలతో.. ప్రభుత్వ పాఠశాలలపై సరైన పర్యవేక్షణ లేక విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులకు సర్కార్ బడులపై నమ్మకం సన్నగిల్లి పిల్లలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందు కు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరు తమ పరిధిలోని స్కూ ళ్లను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు డీఈవోకు నివేదిక ఇవ్వనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసి న కమిటీతో వీరిని ఎంపిక చేయాలని పాఠశా ల విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. అనుభవమున్న వారికి ప్రాధాన్యత ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసేందుకు పదేళ్ల అనుభవమున్న హెచ్ఎం లేదా ఎస్జీటీలను నియమించాలి. వీరు రోజూ రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి. యూపీఎస్లకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ను నియమించుకోవాలి. ఉన్నత పాఠశాలలకు పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్ను ఎంపిక చేయాలి. వీరు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 ఉన్నత స్కూళ్లను తనిఖీ చేయాలి. అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే కమిటీ వీరిని ఎంపిక చేస్తుంది. హెచ్ఎంలు సహకరిస్తారా? పర్యవేక్షణకు టీచర్లను నియమించే విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. గెజిటెడ్ హెడ్మాస్టర్ల పర్యవేక్షణలో ఉన్న హైస్కూ ళ్లను స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీ చేయించడం సరికాదని భావిస్తున్నారు. పర్యవేక్షణకు వచ్చే వారికి హెచ్ఎంలు ఎంత వరకు సహకరిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మండలానికి ముగ్గురిని అధికారులుగా నియమించడం వల్ల జిల్లాలో 48 మంది పాఠశాలలకు దూరం కావాల్సి వస్తోంది. ఇలా మార్పు చేస్తే బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు.ప్రాథమిక 426ప్రాథమికోన్నత 76ఉన్నత 149మోడల్, కేజీబీవీలు 23 -
బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీజీఎన్పీడీసీఎల్ గ్రౌండ్లో జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో 30మంది బాలికలు, 35 మంది బాలురు పాల్గొన్నారు. బాలుర జట్టుకు భరత్రాజ్, అక్షిత్సాయి, సిద్ధార్థ, రిషి, త్రినేశ్, శివమణి, కౌశిక్, అఖిల్, సల్మాన్, స్పృహిత్, ఉమేశ్, సాయివిగ్నేశ్, స్టాండ్ బైగా సాయితేజ, రాఘవేంద్ర, రిత్విక్, అభినయ్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు అక్షయ, ముగ్ధా, హాసిని, భద్ర బిబేశ్, త్రయ, మీనాక్షి సుహాక్షి, సహస్ర, మనాలి, అశ్విక, జస్లిన్, శాన్వి, అక్షిత, స్టాండ్ బైగా విధాత్రిరెడ్డి, విన్మయి, మాయ, సూర్యమిత్ర ఎంపికయ్యారు. వీరు జూలై 11 నుంచి 13 వరకు ఉత్తనూరు, గద్వాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ సెక్రటరీ బి.అనంతరెడ్డి ప్రకటించారు. సీనియర్ క్రీడాకారులు శ్రీధర్రావు, సత్యానంద్, సునీల్కుమార్, అరుణ్ తేజ, అభి, వెంకటేశ్, జీవన్, భార్గవ్, అనిల్, పరిమితకౌర్, జీవన్ కుమార్, రాకేశ్ పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెలో పాల్గొనండికరీంనగర్: నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో లారీ డ్రైవర్లు పాల్గొనాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం లారీ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన లారీ డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం మోటార్ వాహన సవరణ చట్టం 2019 తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం సవరణతో డ్రైవర్లకు హిట్ అండ్ రన్ చట్టం ప్రకారం జైలుశిక్ష, భారీ జరిమానా వేయాలని రూల్స్ చేశారన్నారు. డ్రైవర్లకు కనీస వేతనం చట్టం, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్, సమ్మె హక్కు, యూనియన్స్ రిజిస్ట్రేషన్ చట్టం లేబర్ కోడ్స్లో తీసుకొచ్చి అన్యాయానికి గురిచేసిందన్నారు. ఆనంతరం సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు ఆరిఫ్, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, పురుషోత్తం, రాజు, నారాయణ, శుభాని, అయ్యుబ్, అంజయ్య, లక్ష్మణ్, రావూస్ పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ నగునూర్లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాడమాసం శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని కరివేపాకు మాలతో అలంకరించారు. ఆలయ పూజారులు విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. -
మంత్రి కారు ప్రమాద ఘటనలో ఇద్దరిపై కేసు● అతివేగం, నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు గుర్తింపు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం మారుతినగర్ శివారులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కారు శనివారం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మంత్రి అడ్లూరి మెట్పల్లిలో పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తున్న సమయంలో కోరుట్ల వైపు నుంచి టోచన్తో వస్తున్న కారు మంత్రి ప్రయాణిస్తున్న కారు టైరుకు తగలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఘటనకు కారకులైన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన పాషా, ఇమ్రాన్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యవేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన నాగుల వేణు(35) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు. వేణు గతంలో గల్ఫ్ వెళ్లి అప్పుల పాలు కావడంతో తిరిగి వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపంతో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముకాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా హరిశంకర్ కరీంనగర్టౌన్: మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చల్ల హరిశంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని జలవిహార్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చేతుల మీదుగా అందించారు. హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. మున్నూరు కాపులను సంఘటిత పరచి ఒకే తాటిపైకి తీసుకువెళ్తానని తెలిపారు. -
అనాలోచిత నిర్ణయం
సీనియారిటీ పరంగా ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం వల్ల పాఠశాలల్లో బోధన కుంటుపడుతుంది. పూర్తిస్థాయి ఎంఈవోలను నియమించి పాఠశాలల పర్యవేక్షణ కొనసాగించాలి. ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం. – చకినాల రామ్మోహన్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారులతో పర్యవేక్షించాలి ప్రస్తుతం ప్రతీ మండలంలో ఎంఈవో, మండల నోడల్ ఆఫీసర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. వీరితోపాటు రిపోర్ట్ల సేకరణకు కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లను వాడుకుంటున్నారు. ఉన్న అధికారులతోనే పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది. – అయిలేని కరుణాకర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు
రామగుండం: హైదరాబాద్ – కరీంనగర్ – రామగుండం(హెచ్కేఆర్) మధ్యగల రోడ్డును రాజీవ్ రహదారిగా వ్యవహరిస్తున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), రాష్ట్రప్ర భుత్వం, కాంట్రాక్టర్ సంయుక్త భాగస్వామ్యం(పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్–పీపీపీ విధానం)లో ఈ రోడ్డు నిర్మించారు. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్లో దీనికి ఒప్పందం కుదిరింది. నిర్వహణ బాధ్యతలు హెచ్కేఆర్ రోడ్డు వేస్ చేపట్టింది. భారతదేశంలోని మోటారు వాహన చట్టం, 1988, కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989లో పేర్కొన్న నిబంధనలు వర్తించనున్నాయి. హెచ్కేఆర్ సమగ్ర సమాచారం.. రాజీవ్ రహదారి నిర్మాణం కోసం 1995లో ప్రపంచ బ్యాంకు రుణం తీసుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానంతో రెండు లేన్లు, పది మీటర్ల వెడల్పుతో స్టేట్ హైవేగా నిర్మించారు. 2011లో పనులు ప్రారంభమై 2013లో పూర్తయ్యాయి. షామీర్పేట ఓఆర్ఆర్ ప్రవేశం నుంచి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ ఎక్స్రోడ్డు హైవే–63కు రాజీవ్ రహదారిని అనుసంధానించారు. దీని పొడవు సుమారు 206.85 కి.మీ. 22.5 సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. 2035 వరకు హెచ్కేఆర్ రోడ్డు నిర్వహణ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. బాధ్యతలు విస్మరిస్తున్న సంస్థ.. రహదారిపై గతుకులు, పగుళ్లు, శిథిలాలను గుర్తించి సకాలంలో మరమ్మతు చేయడం, ట్రాఫిక్ సిగ్న ల్స్, రోడ్డుకు ఇరువైపులా సైన్బోర్డులు, లైన్ మా ర్కింగ్స్, జీబ్రా క్రాసింగ్స్ ఉండేలా పర్యవేక్షణ చేయ డం, రోడ్డు డివైడర్లు, రిఫ్లెక్టర్లు, హైవే లైటింగ్, భద్ర తా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత హెచకేఆర్దే. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకూ చర్యలు చేపట్టడం, ఎమర్జెన్సీ సర్వీస్ (అంబులెన్స్, క్రేన్ సర్వీస్) అందుబాటులో ఉండం ప్రధాన విధి. రహదారి పక్కన పచ్చదనం, చెట్లు నాటడం, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్వహించడం,వర్షాకాలంలో నీటినిల్వ లేకుండా చూడడం, రహదారి పక్కన విశ్రాంతి స్థలాలు, టా యిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాల్సి ఉంది. రాజీవ్ రహదారిపై అస్తవ్యస్తంగా ప్రయాణం రోడ్డుపై వరద నిలుస్తున్నా పట్టించుకోని వైనం మూలమలుపుల వద్ద కనిపించని రక్షణ స్తంభాలు కానరాని హెచ్చరిక బోర్డులు.. తరచూ రోడ్డు ప్రమాదాలు -
ముంబయ్లో పొరండ్ల వాసి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన పర్స రమేశ్ (40) ముంబయ్లో శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్ కొద్దికాలంగా ముంబయ్లోని కామటిపూర్ కల్లు దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు ఫోన్ మాట్లాడాడు. అనంతరం ఉరేసుకున్నాడు. కల్లు దుకాణం నిర్వాహకుడు రమేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రమేశ్కు భార్య భాగ్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆర్థిక ఇబ్బందులతో యువకుడు.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. లక్ష్మీపూర్కు చెందిన ముగ్ధం అశోక్(25) పెళ్లి కాకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. తన అవసరాల కోసం పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి పురుగుల మందుతాగి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి చెప్పాడు. దీంతో అశోక్ను హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శనివారం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా ప్రాణాలు పోయాయి. మృతుడికి తండ్రి రాజయ్య, అన్నలు మహేశ్, సురేశ్ ఉన్నారు. మృతుడి చిన్నాన్న రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఎం.ఉపేంద్రచారి తెలిపారు. చికిత్సపొందుతూ విద్యార్థి మృతిగన్నేరువరం: గన్నేరువరంకు చెందిన కూన వైష్ణవి(14) అనే విద్యార్థి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు. కూన సంపత్– అనిత కూతురు వైష్ణవి గన్నేరువరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. 8వతరగతి చదివేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో ఇటీవల సీటు లభించింది. దీంతో ఈ ఏడాది విద్యాభ్యాసానికి తల్లిదండ్రులు హాస్టల్ పంపించారు. అక్కడ ఉండి చదువుకోవడానికి వైష్ణవి నిరాకరించడంతో తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. హాస్టల్లో ఉంటూ చదువుకోవాలని తల్లిదండ్రులు కోరగా.. చదువుకోనని మనస్తాపం చెంది ఈనెల 23న పురుగు ల మందు తాగింది. గమనించిన కుటుంబ స భ్యులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన చి కిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంజన్న గర్భగుడి దర్శనం సులభం
మల్యాల: కొండగట్టు అంజన్నను భక్తులు దర్శించుకునేందుకు ఆలయ అధికారులు కొన్ని మార్పులు చేపట్టారు. భక్తులకు గర్భగుడి దర్శనం కల్పించేలా ధర్మదర్శనం క్యూ లైన్ను పది అడుగుల దూరం పెంచారు. ఆలయ ఆదాయం పెంపు కోసం గర్భగుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెంచేందుకు.. వారు గర్భగుడి వద్ద కూర్చుని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. గతంలో సాధారణ క్యూలైన్ల ద్వారా స్వామివారిని అతి సమీపం నుంచి దర్శించుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మరో పది అడుగుల దూరం నుంచి స్వామివారి దర్శనం ఉండనుంది. ప్రస్తుతం గర్భగుడి దర్శనం టికెట్ ధర రూ.400 నుంచి రూ.800కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆలయ ఆదాయం పెంపుపై దృష్టి సారించిన అధికారులు.. భక్తులకు వసతి సౌకర్యాల ఏర్పాట్లపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు. ధర్మదర్శనం క్యూలైన్ దూరం పెంపు -
మట్టి టిప్పర్ల పట్టివేత
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ శివారులోని రామప్ప ఆలయం గుట్టల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లు, 2 హిటాచ్చి జేసీబీలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. గుట్ట నుంచి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారంతో వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ముగ్గురు ఉత్తమ్ కరుణాకర్, భువనగిరి మహేశ్, లంబ ప్రశాంత్లపై కేసు నమోదు చేశారు. 10 టిప్పర్లు, 2 హిటాచీలు స్వాధీనం ఎస్పీ మహేశ్ బీ గీతే -
పొంచిఉన్న ప్రమాదాలు
మల్యాలపల్లి సబ్స్టేషన్ నుంచి రామగుండం బైపా స్ మధ్య తరచూ రోడ్డు ప్ర మాదాలు జరుగుతున్నా యి. ఇప్పటికే పలువు రు మృత్యువాతపడ్డారు. రోడ్డు పక్కన డ్రైనేజీ మట్టితో నిండిపోయింది. రోడ్డుకు చివరగా రక్షణ సిమెంట్ దిమ్మెలు విరిగిపోయినా పునరుద్ధరించలేదు. రోడ్డు మధ్య లో వరద నిలిచి ఉంది. వర్షాకాలంలో రోడ్డుపైనే వరద ప్రవహిస్తుండడంతో వాహనదారు లు ఆందోళన చెందుతున్నారు. మూలమలుపు లు, బ్లాక్ స్పాట్స్ వద్ద కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు. కానీ, టోల్గేట్ ఫీజు వసూ లు చేస్తూనే ఉన్నారు. – సురేశ్వర్మ, గ్రామస్తుడు, మల్యాలపల్లి -
గడ్డి మందును నిషేధించాలి
కరీంనగర్అర్బన్: పారా క్వాట్ హెర్బిసైడ్ (గడ్డిమందు)పై దేశవ్యాప్తంగా నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని హెల్త్కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) జిల్లా శాఖ, డాక్టర్స్ అగైన్ట్స్ పెరాక్విడ్ పాయిజన్ (డీఏపీపీ) శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేసింది. పారాక్వాట్ అత్యంత విషపూరితమైన ఔషధమని, 10–15 మి.లీ తాగినా మృతిచెందడమేనని, ఇది చాలా వేగంగా గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్ని దెబ్బతీసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు దారితీస్తుందని వివరించారు. సదరు గడ్డి మందు తీసుకొని దేశంలో చాలామంది అత్యంత సాధారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి విరుగుడు మందు లేకపోవడం వల్ల 50 శాతం నుంచి 90 శాతం వరకు మృత్యువాత పడుతున్నారని, పొలాలపై వేసే క్రమంలో తెలియకుండానే రైతుల ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తీవ్రమైన అనారోగ్యాలకు గురి అవుతున్నారని తెలిపారు. పారా క్వాట్ ఉత్పత్తి, అమ్మకం, నిల్వ, వినియోగంపై తక్షణ నిషేధం విధించాలని, మార్కెట్లో ఉన్న స్టాక్ను వెనక్కి తీసుకొని సురక్షితంగా నిర్వీర్యం చేయాలన్నారు. పారాక్వాట్ విష ప్రయోగాలను పర్యవేక్షించేందుకు శ్రీపాయిజన్ రిజిస్ట్ఙ్రీ ఏర్పాటు చేయాలని, యూరప్, బ్రిటన్, బ్రెజిల్, చైనా, శ్రీలంక, దక్షిణకొరియా లాంటి దేశాలు ఇప్పటికే నిషేధించాయని పేర్కొన్నారు. హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డా.బండారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు డా.పి.గౌతమ్, ప్రధాన కార్యదర్శి డా.జిఎస్.శరణ్ పాల్గొన్నారు. -
పల్లెతల్లీ.. ప్రణమిల్లి
విద్యానగర్ (కరీంనగర్)/సిరిసిల్లకల్చరల్: బోనం అంటే భోజనం. అమ్మ ప్రసాదించిన ఆహారాన్ని అమ్మకే నివేదించడం బోనాల సంప్రదాయం. జగన్మాత ఉత్సవంలో ఘటం, బోనం, రంగం.. అంటూ మూడు అంకాలుంటాయి. శక్తి పూజకు సీ్త్రమూర్తులే ప్రధానమైన భూమిక పోషించడం బోనాల ప్రత్యేకత. కొత్త కుండకి సున్నం, పసుపు రాసి, కుంకుమ అద్దుతారు. చందనం చల్లుతారు. వరి లేదా జొన్నతో నింపిన ఘటానికి మామిడాకులు, వేపరెమ్మలు కడతారు. దీపం వెలిగించడానికి అనుకూలంగా కుండపైన మట్టి మూకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి, ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు బోనాలు సమర్పిస్తారు. దేహదారుఢ్యం కలిగిన వ్యక్తిని పోతురాజుగా ముందు నిలబెడతారు. అన్ని ఇళ్ల నుంచి బోనాన్ని సేకరించడం పోతురాజు బాధ్యత. బోనాల సమర్పణకు ముగింపుగా ఆ ఏటి భవిష్యత్తును ప్రకటించడమే ‘రంగం’. ఓ భక్తురాలే భవిష్యవాణిని వినిపిస్తుంది.● విశ్వవ్యాప్తం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టి జనపదాల్లో పుట్టిన ఈ వేడుక నేడు విశ్వవ్యాప్తమైంది. ఆషాఢమాసంలో జగన్మాతకు భక్తితో సమర్పించే భోజన నైవేద్యాలలే బోనాలు. భోజన పదమే జనవ్యవహారంలో బోనంగా మారింది. ప్రతీ ఇల్లు సిరులతో నిండి అందరూ ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని వేడుకోవడం బోనాల పండుగలోని ప్రత్యేకత. ● తెలంగాణ తల్లికి బోనం మెట్లకు బొట్లు, గట్లకు పూజ. గోపురాల కొత్త పరిమళ గుబాలింపు. అమ్మ రుణం తీర్చుకునే వేడుకల్లో ఇవన్నీ భాగమే. అమ్మవారు ఆప్యాయతల అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుందోనని.. అంబారీనెక్కి ఆశీర్వాదాలు పలుకుతుందోనని.. రంగమెత్తి సందేశమిస్తుందోనని ‘అమ్మా.. తల్లీ.. కాపాడమ్మా’ అని వేడుకునే మనుసులు ఆషాఢమాసం నెల పాటు ఉత్సవాలు చేసుకుంటారు. ఊరుగాచే ఆ తల్లికి బోనం పెట్టే బిడ్డలు ఉన్నది ప్రపంచంలో ఒక్క తెలంగాణలోనే. ● గోల్కొండలో తొలి బోనం ఆషాఢమాసంలో గోల్కొండ ఖిల్లా వేదికగా, ఉజ్జయినీ తల్లి సాక్షిగా అమ్మకు బిడ్డలు తొలి వీరబోనమెత్తుకుంటే రాష్ట్రమంతటా బోనాల నగారా మోగుతుంది. గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా ఆలయంలో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇది తరాలు మారినా తరగని తెలంగాణ సంస్కృతికి నిదర్శనం. ● బోనంతో అనుబంధం ఆషాఢానికి బోనాలు ఆరంభమై శ్రావణానికి గ్రామాలకు చేరి గ్రామదేవతలైన మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, రేణుక ఎల్లమ్మల రుణం తీర్చుకుంటాయి. అదే ఆ అమ్మలకు ఈ బిడ్డలకు ఉన్న అనుబంధం. 500 ఏళ్ల క్రితం మలేరియా వల్ల ప్రాణాలు పోతున్న వేళ జనాన్ని రక్షించేందుకు పెట్టిన తొలి బోనం ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం అంటే అమ్మ– బిడ్డల అనుబంధానికి నిదర్శనం. ● చరిత్ర వైభవం పురాణగాథలు, చారిత్రక నేపథ్యాలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రులు, కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటున్నారు. గోల్కొండ జగదాంబిక (ఎల్లమ్మ) ఆలయంలో మొదలయ్యే బోనాలు లష్కర్ ఉజ్జయినీ మహంకాళి, లాల్దర్వాజ సింహవాహిని, హరిబౌలి మహంకాళి ఆలయాల్లో జాతర వేడుకలు జరుగుతాయి. గోల్కొండ బోనాలకు 500 ఏళ్లు, ఉజ్జయినీ బోనాలది 200 ఏళ్ల చరిత్ర. లాల్దర్వాజ బోనాలకు వందేళ్ల చరిత్ర ఉంది. అమ్మవారికి బోనం సమర్పిస్తాం ఏటా ఆషాఢమాసంలో మా ఇంటి నుంచి పోచమ్మతల్లికి బోనం సమర్పిస్తాం. వాడలోని వారందరితో డప్పుచప్పుల్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి, మొక్కులు చెల్లించి సల్లంగా చూడాలని వేడుకుంటాం. – చొప్పరి జయశ్రీ, మాజీ కార్పొరేటర్, కరీంనగర్ -
ఏసీబీ వలలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి
● ఇంటి నంబర్ కోసం లంచం ● రూ.5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇంటి నంబరు కేటాయించాలని దరఖాస్తు చేసిన వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాంపల్లి విజయ్కుమార్ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆర్నకొండ ప్రసాద్ ఇటీవల ఇల్లు నిర్మించుకున్నారు. దానికి ఇంటి నంబరు కేటాయించాలని అధికారులను ఆశ్రయించారు. అయితే, రూ.10 వేలు లంచం ఇస్తేనే ఇంటి నంబరు కేటాయిస్తామని అధికారులు డిమాండ్ చేశారు. తాను రూ.3 వేలు చెల్లిస్తానని బతిమిలాడినా వినలేదు. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. శనివారం పట్టణంలోని ఓ దుకాణంలో ఆర్నకొండ ప్రసాద్ రూ.5 వేలు ఇస్తుండగా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నాంపల్లి విజయ్ కుమార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్నూ అదుపులో తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ కృష్ణకుమార్, సిబ్బంది పున్నం చందర్, తిరుపతి పాల్గొన్నారు. నిందితులను ఆదివారం కోర్టులో హాజరు పర్చనున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఇంటి నంబరు కేటాయించాలని బాధితుడు రెండేళ్లుగా తిరుగుతున్నాడని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
ఎంత పనిజేస్తివి కొడుకా..
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎంత పనిజేస్తివి కొడుకా.. పిల్లలు లేరని నిన్ను సాదుకుంటే మధ్యలో అన్యాయం చేస్తివా.. అంటూ ఆ మాతృమూర్తి రోదనలు స్థానికులు కన్నీరు పెట్టేలా చేశాయి. కట్టుకున్న భర్త ఆరేళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడితే.. సంతానం లేక ఆసరాగా ఉంటాడనుకున్న దత్తకొడుకు సైతం ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి ఒంటరైంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తెల్ల వారే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బద్దిపడిగె మల్లారెడ్డి, విజయ దంపతులకు సంతానం కలగకపోవడంతో అజయ్రెడ్డిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం తండ్రి మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోగా, తల్లి విజయ అన్నీ తానై కొడుకును పోషిస్తోంది. ముస్తాబాద్లోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న మరుసటి రోజే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లి విజయ రోదనలు మిన్నంటాయి. ఆరేళ్ల క్రితం భర్త ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు కుమారుడు అజయ్రెడ్డి(22) కూడా ప్రాణాలు తీసుకోవడంతో విజయ ఒంటరైంది. యువకుడి మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దత్తపుత్రుడి మృతితో ఒంటరైన తల్లి ఆరేళ్ల క్రితం తండ్రి.. నేడు కొడుకు మృతి -
తాళం వేసిన ఇంట్లో చోరీ కేసులో అరెస్ట్
మంథని: వరుస దొంగతనాలతో పట్టణ ప్రజల్లో నెలకొన్న భయాందోళనకు పోలీసులు తెరదించారు. కేవలం నాలుగు రోజుల్లోనే రెండు చోరీలను ఛేదించారు. ఈ నెల 22న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో గ్రామానికి వెళ్లిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో చోరీచేసిన స్థానికుడు తిరునహరి రాజనర్సింహస్వామిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించి, టీవీ, వెండివస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్కు తరలించనట్లు పేర్కొన్నారు.. కేసును ఛేదించిన ఎస్సై రమేశ్, ఏఎస్సై స్వామి, కానిస్టేబుళ్లు రమేశ్, రాజ్కుమార్, శివ, అశోక్ను సీఐ అభినందించారు. అలాగే కరీంనగర్కు చెందిన చీర్ల తిరుపతిరెడ్డి స్థానిక పెట్రోల్ బంక్లో ద్విచక్రవాహనం పార్క్ చేసి వెళ్లగా.. ఈనెల 27న అదృశ్యమైంది. ఈ కేసులో మంథని మండలం అడవిసోమన్పల్లి గ్రామానికి చెందిన రత్నం రాజ్కుమార్ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
పునర్విభజనలో కాంగ్రెస్ జోక్యం లేదు
● సుడా చైర్మన్ నరేందర్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్ల పునర్విభజనలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా జోక్యం చేసుకోలేదని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. మతం పేరుతో రాజకీయ లబ్ధిపొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. శనివారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పచ్చకామెర్ల వ్యాధి ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగా కనిపించినట్టు, గతంలో వారి హాయాంలో జరిగినట్టే ఇప్పుడు జరిగిందనుకుంటున్నారని ఎద్దేవా చేవారు. అధికారులు అందరి వినతులను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా పునర్విభజనచేశారన్నారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ ఒక్క రూపాయి తేలేదన్న వ్యక్తి, ఈ రోజు సంజయ్ అభివృద్ధి ప్రదాత అంటున్నాడని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ నాయక్, జీడీ రమేశ్, దన్నా సింగ్, దండి రవీందర్, ఆస్థాపురం రమేశ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, బషీర్, బారి, సాయిరాం, రాజ్ కుమార్, షబాన, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
కరీంనగర్క్రైం: ప్రభుత్వ భూములను ఆక్రమించేవారిపై, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. శనివారం కమిషనరేట్ కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భూములకు సంబంధించి చట్టాలకనుగుణంగా నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. చిట్ఫండ్ మోసాలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టంను సరైన పద్ధతిలో అమలు చేయాలని ఆదేశించారు. ఆకస్మికంగా తలెత్తే శాంతిభద్రతల సమస్యలు ఎదుర్కొనేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ బారికేడ్లు, లాఠీలు, హెల్మెట్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రౌడీ, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి (టౌన్), హుజురాబాద్ ఏసీపీ వి.మాధవి, యాదగిరి స్వామి (ట్రాఫిక్), శ్రీనివాస్ (ఎస్బీ), వేణుగోపాల్ (సీటీసీ) తదితరులు పాల్గొన్నారు. -
పల్లెతల్లీ.. ప్రణమిల్లి
బోనం.. ఆగమనం●● ఆషాఢ మాసంలో బోనాల వైభవం ● తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ● పల్లె తల్లులకు పట్టాభిషేకం ● ఇయ్యాల్టి నుంచి బోనాల వేడుకలుఆషాఢ మాసం.. శుభకార్యాలకు దూరంగా ఉంటూనే పుణ్య కార్యాలకు, ఆధ్యాత్మిక వేడుకలకు ఆలవాలమైన మాసం. ఈమాసంలో తెలంగాణ పల్లె, పట్టణం బోనాల వేడుకలతో హోర్తెతిపోతుంది. ముల్లోకాలు కాపాడే అమ్మవారిని ఆరాధించడం బోనాల వెనుక సిసలైన నేపథ్యం. పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలకు కొత్త కుండలో బోనం (భోజనం) నివేదన చేసి పిల్లాపాపల్ని చల్లగా చూడాలంటూ కోరుకుంటారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, మేళతాళాలతో మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. – విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్లకల్చరల్– వివరాలు 8లోu -
ఎంఐఎంకు అనుకూలంగా డీలిమిటేషన్
● మాజీ మేయర్ యాదగిరి సునీల్రావుకరీంనగర్టౌన్: కరీంనగర్ నగరపాలక సంస్థ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అశాసీ్త్రయంగా.. ఎంఐఎంకు అనుకూలంగా జరిగిందని మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. శనివారం కరీంనగర్లో మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ సర్వేలు చూసినా బీజేపీయే గెలుస్తుందని తెలుసుకొని అధికార కాంగ్రెస్ హైడ్రామాకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్కు పడిపోతుందనే భయంతోనే ఎంఐఎంకు అనుకూలంగా డివిజన్ల మార్పు చేపట్టిందన్నారు. కేవలం 6 డివిజన్లలో ఎంఐఎంకు బలం ఉండగా, దాన్ని 16 డివిజన్లలో అనుకూలంగా మార్చారని మండిపడ్డారు. ఇందులో అధికారులు ఒత్తిళ్లకు లోనయ్యారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని, ఎంఐఎం పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ను కట్టబెట్టే కుట్రలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ నాయకత్వంలో అభివృద్దిని నమ్ముకొని ముందుకెళుతున్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. నాయకులు శ్రీనివాస్, చంద్రమౌళి, రమణారెడ్డి, లెక్కల వేణు, కాసర్ల ఆనంద్, సతీశ్, గాయత్రి, గాజ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జవాన్ల వేధింపులు ఆపాలి
కరీంనగర్కార్పొరేషన్: జవాన్ల వేధింపులను నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు బీఆర్టీయూ ఆధ్వర్యంలో శనివారం నగరపాలక సంస్థకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కార్మికుల వద్ద జవాన్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే విధుల నుంచి తొలగిస్తున్నారన్నారు. నెలరోజుల క్రితం నలుగురు కార్మికులను డబ్బులు ఇవ్వని కారణంగా తొలగించారన్నారు. జవాన్లకు స్థానచలనం లేకపోవడం, అధికారుల అండతో ఇష్టానుసారంగావేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జవాన్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని, పారిశుద్ధ్యకార్మికులపై వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శానిటేషన్పై అవగాహన లేని వ్యక్తిని పర్యావరణ ఇంజినీర్గా నియమించారని విమర్శించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగికి బదులు పర్యావరణ ఇంజినీర్గా ప్రభుత్వ అధికారిని నియమించాలని కోరారు. నిరసనలో మున్సిపల్ యూనియన్ నగర అద్యక్షుడు గడ్డం సంపత్, మైస తిరుపతి, ఎల్లయ్య, రాజేందర రాజేశ్, స్వామి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
మారిన రూపురేఖలు
పెరిగిన డివిజన్లు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● మారిన పాత డివిజన్ల ముఖచిత్రంకరీంనగర్కార్పొరేషన్: నగరపాలక సంస్థలో 66 కొత్త డివిజన్లను అధికారులు శనివారం ప్రకటించారు. డివిజన్ల పునర్విభజన అనంతరం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీతో కొత్త డివిజన్లను వెల్లడించాల్సి ఉన్నప్పటికి, జాబితాలో జాప్యం జరగడం తెలిసిందే. పాత డివిజన్లు, ముసాయిదాతో పోల్చితే కొత్త డివిజన్ల నెంబర్లు, ఇంటి నెంబర్లలో చేర్పులు, మార్పులు భారీగా చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే తుదిజాబితా అంటూ లీకై న జాబితాలోని కొన్నిడివిజన్ల హద్దులు కూడా మారడం గమనార్హం. పునర్విభజన తుది జాబితాలోనూ తప్పులు దొర్లాయని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కొత్త డివిజన్లు ఇవే.. నగరానికి ఉత్తరంలో ఉన్న ఆరెపల్లి నుంచి డివిజన్ల పునర్విభజన చేపట్టగా, ఒకటో డివిజన్ ఆరెపల్లిలో ఆరెపల్లి, తీగలగుట్టపల్లిలోని కొంత భాగం కలుపుకొని 4,874 ఓట్లతో డివిజన్ ఏర్పడింది. అలాగే పూర్తిగా తీగలగుట్టపల్లితోనే 5,088 ఓట్లతో రెండో డివిజన్ ఏర్పడగా, 5,249 ఓట్లతో వల్లంపహాడ్, పాత తీగలగుట్టపల్లి, విద్యారణ్యపురి, బుట్టిరాజారాంకాలనీ, అంబేడ్కర్ నగర్లోని కొంతభాగంతో మూడో డివిజన్ ఉంది. విలీన గ్రామాలైన గోపాల్పూర్, దుర్శేడ్లోని కొంతఏరియా కలిపి 4,997 ఓట్లతో నాలుగో డివిజన్, మరో విలీన ప్రాంతమైన శ్రీపురంకాలనీ, రజ్విచమాన్, రాయల్హోం, చల్మెడ హాస్పిటల్, దుర్శేడ్లోని కొంతభాగంతో 5,015 ఓట్లతో ఐదో డివిజన్, పాత బొమ్మకల్, ఆటోనగర్, గుంటూరుపల్లితో కలిపి 4,920 ఓట్లతో ఆరో డివిజన్ను ఏర్పాటు చేశారు. పూర్తిగా హౌసింగ్బోర్డు కాలనీ, సదాశివపల్లితో ఏడో డివిజన్ను 5,207 ఓట్లతో మార్చారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కాలనీ మొత్తం ఒకే డివిజన్లోకి వచ్చింది. ఇక పూర్తి అలుగునూరుతో 5,697 ఓట్లతో 8వ డివిజన్, కోతిరాంపూర్, అలకాపురికాలనీ, హనుమాన్నగర్ కలిపి 4,763 ఓట్లతో 9వ డివిజన్, కట్టరాంపూర్, తిరుమల్నగర్, గౌతమినగర్ కొంతభాగం కలిపి 5,078 ఓట్లతో 10వ డివిజన్ను ఏర్పాటు చేశారు. కట్టరాంపూర్, గౌతమినగర్, రామచంద్రాపూర్ కాలనీల్లోని ప్రాంతాలను కలుపుకొంటూ 5,457 ఓట్లతో 11వ డివిజన్, రామచంద్రాపూర్కాలనీ, హస్నాపూర్, సప్తగిరికాలనీ, భగత్నగర్లలోని ప్రాంతాలను కలుపుతూ 5,338 ఓట్లతో 12వ డివిజన్, సప్తగిరికాలనీ, ప్రగతినగర్, శివనగర్, మార్కండేయనగర్ ప్రాంతాలను కలుపుతూ 5,339 ఓట్లతో 13వ డివిజన్, విలీనగ్రామం చింతకుంట, గాంధీనగర్, పాత పద్మనగర్లోని కొంతప్రాంతాన్ని కలుపుతూ 4,658 ఓట్లతో 14వ డివిజన్, పూర్తిగా చింతకుంటతో 5,174 ఓట్లతో 15వ డివిజన్, మల్కాపూర్, లక్ష్మీపూర్లు కలిపి 4,212 ఓట్లతో 16వ డివిజన్, కొత్తపల్లిలోని సగ భాగంతో 5,427 ఓట్లతో 17 డివిజన్, కొత్తపల్లి మిగతా సగభాగంతో 5,245 ఓట్లతో 18వ డివిజన్, రేకుర్తిలోని 5,166 ఓట్లతో 19వ డివిజన్, రేకుర్తి ఓట్లు 5,455 తో 20వ డివిజన్ ఏర్పాటు చేశారు. కొత్తయాస్వాడ, రేకుర్తిలోని కొంతభాగంతో కలిపి 5,326 ఓట్లతో 21, కొత్తయాస్వాడ, హిందుపురి కాలనీ,జగిత్యాల రోడ్, చైతన్యపురి, జ్యోతినగర్ కొంతభాగంతో కలిపి 5,200 ఓట్లతో 22వ డివిజన్, సీతారాంపూర్, మెహర్నగర్లను కలిపి 4,786 ఓట్లతో 23వ డివిజన్, మెహర్నగర బ్యాంక్ కాలనీ, సుభాష్నగర్ కొంతభాగంతో 5,251 ఓట్లతో 24వ డివిజన్, సుభాష్నగర్, బుట్టిరాజారాం ప్రాంతాలను కలిపి 4,945 ఓట్లతో 25వ డివిజన్, ఆదర్శనగర్, సుభాష్నగర్ ప్రాంతాలతో 5,027 ఓట్లతో 26వ డివిజన్, శర్మనగర్, అంబేడ్కనగర్ కొంతభాగం, కార్ఖానగడ్డ, గాంధీరోడ్లలోని 4,698 ఓట్లతో 27వ డివిజన్, తీగలగుట్టపల్లి, కిసాన్నగర్ ప్రాంతాల్లోని 4,955 ఓట్లతో 28వ డివిజన్, కిసాన్నగర్లోని 4,879 ఓట్లతో 29వ డివిజన్, కిసాన్నగర్, ఖాన్పుర, దుర్గమ్మగడ్డ, కార్ఖానగడ్డ, గాంధీరోడ్లోని 5,448 ఓట్లతో 30వ డివిజన్ ఏర్పడింది. ఖాన్పుర, దుర్గమ్మగడ్డలోని 5,364 ఓట్లతో 31వ డివిజన్, హుస్సేనిపురలోని 5,273 ఓట్లతో 32, హుస్సేనిపురలోని 5,050 ఓట్లతో 33వ డివిజన్, కృష్ణానగర్, మధురానగర్, విజయనగర్కాలనీ, సలాఫీనగర్ల్లోని 5,059 ఓట్లతో 34వ డివిజన్, కాపువాడ, మారుతినగర్, హుస్సేనిపురల్లోని 4,765 ఓట్లతో 35వ డివిజన్, కాపువాడ, మారుతినగర్ల్లోని 5,195 ఓట్లతో 36వ డివిజన్, షాహబ్స్ట్రీట్లోని 5,417 ఓట్లతో 37వ డివిజన్, గాయత్రినగర్, అమీర్నగర్, లక్ష్మీనగర్ల్లోని 4,849 ఓట్లతో 38వ డివిజన్, కోతిరాంపూర్, అలకాపురికాలనీల్లోని 4,744 ఓట్లతో 39, కట్టరాంపూర తిరుమల్నగర్, గణేష్నగర్, హనుమానగర్ల్లోని 4,903 ఓట్లతో 40వ డివిజన్ ఏర్పాటు చేశారు. కట్టరాంపూర్, గౌతమినగర్, భగత్నగర్ల్లోని 4,851 ఓట్లతో 41వ డివిజన్, భగత్నగర్లోని 5,239 ఓట్లతో 42వ డివిజన్, గోదాంగడ్డ, శ్రీనగర్ కాలనీల్లోని 5,344 ఓట్లతో 43వ డివిజన్, శ్రీనగర్కాలనీ, సప్తగిరికాలనీల్లోని 5,392 ఓట్లతో 44వ డివిజన్, మంకమ్మతోటలోని 5043 ఓట్లతో 45వ డివిజన్, రాంనగర్, ప్రగతినగర్ల్లోని 4,968 ఓట్లతో 46వ డివిజన్, రాంనగర్, మంకమ్మతోట, సంతోష్నగర్ల్లోని 5,225 ఓట్లతో 47వ డివిజన్, రాంనగర్, సంతోష్నగర్, విద్యానగర్ల్లోని 5,110 ఓట్లతో 48వ డివిజన్, జ్యోతినగర్, రాంనగర్, సంతోష్నగర్ల్లోని 4,789 ఓట్లతో 49వ డివిజన్, జ్యోతినగర్, చైతన్యపురి, భాగ్యనగర్ల్లోని 5,193 ఓట్లతో 50వ డివిజన్ ఏర్పాటైంది. వావిలాలపల్లిలోని 5102 ఓట్లతో 51వ డివిజన్, డాక్టర్స్ స్ట్రీట్, వావిలాలపల్లిల్లోని 5,442 ఓట్లతో 52వ డివిజన్, కార్ఖానగడ్డ, గాంధీరోడ్, శర్మనగర్, సాహెత్నగర్ల్లోని 4,826 ఓట్లతో 53వ డివిజన్, అశోక్నగర్, కార్ఖానగడ్డ, గాంధీరోడ్ల్లోని 5,034 ఓట్లతో 54వ డివిజన్, కాపువాడ, మారుతినగర్ల్లోని 5,055 ఓట్లతో 55వ డివిజన్, షాహబ్స్ట్రీట్, సిక్వాడీ, బోయవాడల్లోని 5,028 ఓట్లతో 56వ డివిజన్, గణేశ్నగర్, ధోబీవాడ, గంజ్ ఏరియా, మార్కెట్ ఏరియా, తిరుమల్నగర్ల్లోని 4,772 ఓట్లతో 57వ డివిజన్, సిక్వాడీ, బోయవాడ, లక్ష్మీనగర్, గణేశ్నగర్, స్టేడియంరోడ్డు, ముకరాంపురల్లోని 4,987 ఓట్లతో 58వ డివిజన్, ముకరాంపురలోని 4,711 ఓట్లతో 59వ డివిజన్, మంకమ్మతోట, కాశ్మీర్గడ్డ, రైతుబజార్, మహిళా కళాశాల ప్రాంతాల్లోని 5,236 ఓట్లతో 60వ డివిజన్, మంకమ్మతోటలోని 5,595 ఓట్లతో 61వ డివిజన్, మంకమ్మతోటలోని 4,927 ఓట్లతో 62వ డివిజన్, జ్యోతినగర్లోని 5,044 ఓట్లతో 63వ డివిజన్, ముకరాంపుర, జ్యోతినగర్ల్లోని 4,754 ఓట్లతో 64వ డివిజన్, డాక్టర్స్స్ట్రీట్, అజ్మత్పుర, ఆదర్శనగర్, సుభాష్నగర్, కార్ఖానగడ్డ, గాంధీరోడ్ల్లోని 5,156 ఓట్లతో 65వ డివిజన్, టవర్ సర్కిల్, తిలక్నగర్, శాసీ్త్రరోడ్, వీక్లీమార్కెట్ల్లోని 5,276 ఓట్లతో 66వ డివిజన్ను ఏర్పాటు చేశారు. -
వన మహోత్సవానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: వనమహోత్సవ కార్యక్రమ విజయవంతానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. మొక్కలు నాటేందుకు టెండర్లు పూర్తి చేయాలన్నారు. ప్రజావాణి, పౌరసేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. సుందరీకణ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ సువార్త, ఈఈ యాదగిరి, సంజీవ్, డీఈలు లచ్చిరెడ్డి, అయ్యూబ్ ఖాన్, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, శ్రీనివాస రావు, ఏఈలు సతీశ్, గట్టు స్వామి, గఫూర్ తదితరలు పాల్గొన్నారు. -
క్యాప్సికమ్తో అమ్మవారికి అలంకరణ
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ నగునూర్లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం అమ్మవారిని క్యాప్సికమ్ మాలలతో అలంకరించారు. భక్తులు ఒడిబియ్యం, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ వంగల లక్ష్మన్, కమిటి సభ్యులు పాల్గొన్నారు.సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయండి చొప్పదండి: గత ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన సెంట్రల్ లైటింగ్ పనులకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ పనులపై శనివారం సంబంధిత కాంట్రాక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం తగదని, నాణ్యతగా నిర్వహించాలని సూచించారు. నాణ్యత విషయంలో అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కొండగట్టు ఉత్సవ సమితి చైర్మన్ ఇప్ప శ్రీనివాస్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, కొట్టె అశోక్, నిజానపురం చందు, గుర్రం రాజేందర్రెడ్డి, ముద్దసాని రంగయ్య, వల్లాల కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. 3, 4 తేదీల్లో విద్యాసంస్థల బంద్ విద్యానగర్(కరీంనగర్): జిల్లాలో జూలై 3,4వ తేదీల్లో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు జార్జిరెడ్డి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విద్యారంగంపై ప్రభుత్వ వివక్ష కారణంగా రాష్ట్రంలో సు మారు రూ.8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని ఆ రోపించారు. విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ, తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్తో బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నాయకులు రత్న నరేశ్, శివ, రోహిత్, సాయి, రామ్, కిరణ్, విష్ణు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలికరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఇందిరాగార్డెన్లో జరిగిన యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతీ ఒక్కరు కృషిచేయాలన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు విత్ ఐవైసీ యాప్ను వాడాలని సూచించారు. అంతకుముందు శివచరణ్రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా శ్రేణులు, నగరంలో ర్యాలీ నిర్వహించా యి. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి దశకు ఎంపిక పోటీలు
● జూలై 1 నుంచి హకీంపేట క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలు ● ఎంపికై తే 4వతరగతిలో ప్రవేశం కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వతరగతిలో ప్రవేశాలకు గాను ఎంపిక పోటీల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 25, 26ల్లో జిల్లాస్థాయిలో ఎంపిక ప్రక్రియను ఆయా జిల్లా క్రీడాశాఖ అధికారులు పూర్తి చేశారు. జిల్లాస్థాయిలో రాణించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక చేశారు. జూలై 1 నుంచి 5 వరకు హకీంపేటలోని క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు జూలై 1, 2ల్లో ఎంపిక పోటీలు జరగనున్నాయి. సికింద్రాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లుండగా.. 2025–26 విద్యాసంవత్సరానికి గాను 4వతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 60 మంది బాలురు, 60 మంది బాలికలకు ప్రవేశం దక్కనుంది. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల వివరాలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల విద్యార్థులు జూలై 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రిపోర్టు చేయాలి. 2న ఆంత్రోపోమెట్రిక్, మోటార్ క్వాలిటీ, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. పెద్దపల్లి జిల్లా విద్యార్థులు జూన్ 30న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రిపోర్టు చేయాలి. జూలై 1న ఆంత్రోపోమెట్రిక్, మోటార్ క్వాలిటీ, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే ఆంత్రోపోమెట్రిక్ పరీక్షలు ఎత్తు, బరువు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే మోటార్ క్వాలిటీ పరీక్షలు 30 మీటర్ల ప్లయియింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6.10మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ పరీక్ష, మెడిసన్ బాల్త్రో(కిలో), 800 మీటర్ల రన్నింగ్ మొత్తం 9 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు 3 పాయింట్లు మొత్తం 27 పాయింట్లుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాయింట్లిస్తారు. ఆధార్ కార్డు ఒరిజినల్, 4వతరగతి చదువుతున్నట్లు స్కూల్ వారిచ్చిన సర్టిఫికెట్, వయస్సు ధ్రువీకరణ పత్రం, 3వతరగతి ప్రొగ్రెస్ రిపోర్టు కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, 5 పాస్పోర్టు సైజ్ ఫొటోలు ఎంపికై న విద్యార్థులు తీసుకెళ్లాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట మండలం హకీంపేటలోని తెలంగాణ ప్రభుత్వ క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాల ఎంపిక పోటీలు జరుగుతాయి. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ పాఠశాలల్లో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. -
దేదీప్యమానంగా కొలనూరు పాఠశాల
ఓదెల(పెద్దపల్లి): ‘నా వయసు 23 ఏళ్లు ఉన్నప్పుడు కొలనూరు పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చా. 14 భాషాలు నేర్చుకున్న. వివాహం చేసుకున్న. ఇప్పటికీ పాఠశాల దేదీప్యమానంగా ఉందిశ్రీ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కాలోజీ సాహిత్య పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ ప్రశంసించారు. ఓదెల మండలం కొలనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మన ఊరు.. మనబడి వేదికలో పూర్వవిద్యార్థులు సన్మాన మహోత్సవం నిర్వహించారు. నలిమెల భాస్కర్ మాట్లాడుతూ, కొలనూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే చదువుకున్నానని చెప్పారు. ప్రపంచంలో అతిసులువైనది చదువు అని, దానికికోసం విధ్యార్థులు శ్రమించాలన్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు, అప్పటి విద్యార్థులు, గ్రామస్తులు అందరూ తనకు ఆత్మీయులేనన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న వారు ప్రస్తుతం పెద్ద హోదాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అనంతరం చేపట్టిన సాంస్రృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియల్, బాసిక్స్ సీఈవో దేవరకొండ సత్యనారాయణ, ఎంఈవో రమేశ్, ప్రధానోపాధ్యాయుడు ఏసుదాసు, మాజీ సర్పంచ్ సామ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ -
రాజన్నకు ఆషాఢపూజలు
వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను జూలై 1న ఓపెన్స్లాబ్లో లెక్కించనున్నట్లు ఈవో రాధాభాయి తెలపారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని సూచించారు. అంజన్న సన్నిధిలో ఫోరెన్సిక్ డైరెక్టర్ పూజలుమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ దనూజ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఏఎస్సై శ్రీనివాస్, పాల్గొన్నారు. యాదగిరి గుట్టకు ప్రత్యేక బస్సుజగిత్యాలటౌన్: యాదగిరి గుట్ట తదితర ఆలయాల దర్శనం కోసం జగిత్యాల నుంచి ప్రత్యేక బస్సు నడిపిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ కల్పన అన్నారు. శుక్రవారం ఆలయాల కోసం కేటాయించిన ప్రత్యేక బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 5గంటలకు జగిత్యాల నుంచి బయలు దేరిన ప్రత్యేక సూపర్లగ్జరీ బస్సు కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి, స్వర్ణగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.880, పిల్లలకు రూ.450 చార్జి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు. దాడి చేసుకున్న హిజ్రాలు● భయభ్రాంతులకు గురైన స్థానికులు జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పాతబస్టాండ్లో గురువారం రాత్రి హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన హిజ్రాలు పాతబస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా సిద్ధిపేట జిల్లాకు చెందిన మరికొంత మంది హిజ్రాలు పాతబస్టాండ్కు చేరుకున్నారు. దీంతో తమ అనుమతి లేకుండా తమ జిల్లాకు ఎందుకు వచ్చారంటూ రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో రెచ్చిపోయిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హిజ్రాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
పది నిమిషాల్లో ఇంటి వద్ద ఉంటా
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున (గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత) గుర్తుతెలి యని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యు వకులు దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి రూ రల్ ఎస్సై మల్లేశ్ కథనం ప్రకారం.. జిల్లాలోని గో దావరిఖని ఎన్టీఆర్నగర్కు చెందిన చిలుకల చక్రి(24) సింగరేణి గెస్ట్హౌస్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా ప నిచేస్తున్నాడు. తన మిత్రుడు తిలక్నగర్కు చెందిన సోగాల శ్యామ్ (22)తో కలిసి పెద్దపల్లి నుంచి గో దావరిఖనికి బైక్పై వెళ్తున్నారు. ఈక్రమంలో అప్పన్నపేట వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని వాహ నం వీరి బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అయితే, స్నేహితుడి వద్దకు వెళ్లొస్తామంటూ చెప్పి బయల్దేరిన కొడుకు ఇలా శవమై కనిపిస్తాడనుకోలేదంటూ మృతుల కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. ఇంకా ఇంటికి రాలేదేంటని ఫోన్చేస్తే.. పదినిమిషాల్లో ఇంటికాడ ఉంటా.. అని చెప్పిన తన కుమారుడు కని పించకుండా పోయాడని చిలుకల చక్రి తండ్రి వినో ద్ విలపించాడు. సింగరేణి గెస్ట్హౌస్లో పనిచేస్తు న్న చక్రికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉండగా, శ్యాం అవివాహితుడు. మృతదేహాలకు పె ద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆ వెంటనే రోడ్డు ప్రమాదం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఇద్దరు యువకుల దుర్మరణం అప్పన్నపేట వద్ద ఘటన -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి శివారులో జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో జగిత్యాల ఉప్పరిపేటకు చెందిన కట్ట ఆదిత్యి (19) మృతి చెందగా, తాటిపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. ఉప్పరిపేటకు చెందిన ఆదిత్యి గురువారం పనినిమిత్తం ద్విచక్రవాహనంపై మేడిపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తాటిపల్లి వద్ద మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ఆదిత్యికు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యికు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్కు కాలు విరగడంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. బాలుడి అదృశ్యంఇబ్రహీంపట్నం: పాఠశాలకు వెళ్తున్న అని చెప్పి ఓ బాలు డు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మూ లరాంపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి కందుకురి శ్రీధర్, వనితల కుమారుడు కందుకురి శ్రీకర్ (15) మండలంలోని వేములకుర్తిలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువా రం ఉదయం ఇంట్లో తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్తున్న అని చెప్పి బయలుదేరాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువులను, స్నేహితులను ఆరా తీయగా ఎక్కడ కనిపించలేదు. ఈవిషయమై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిస్తే శ్రీకర్ తండ్రి సెల్ 9133241459, తల్లి వనిత 9701190360 లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉరేసుకుని ఎస్సారెస్పీ ఉద్యోగి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో తులసీనగర్కు చెందిన కండ్లపల్లి ధర్మయ్య (61) ఎస్సారెస్పీ లష్కర్ ఉద్యోగి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మయ్య కొన్ని రోజులుగా నరాల వ్యాధితో పాటు, ఇతర వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మనస్థాపానికి గురై శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అనారోగ్య కారణాలతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించండి అంటూ లేఖ రాశాడు. దీంతో లేఖను చూసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. కాగా, మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ జగిత్యాల ఎస్సారెస్పీ కార్యాలయంలో లష్కర్గా పనిచేస్తున్న ధర్మయ్య ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర అనారోగ్య బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్సారెస్పీ ఉద్యోగులంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఐల బదిలీలుకరీంనగర్క్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పలువురు సీఐలు బదిలీ అయ్యారు. జమ్మికుంట రూరల్ సీఐగా కె.లక్ష్మీనారాయణను నియమించారు. అక్కడ పనిచేసిన కె.కిషోర్ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఆర్.ప్రకాశ్గౌడ్ను కరీంనగర్ సీసీఎస్కు, పి.రాజేంద్రప్రాద్ను ఎస్బీ రామగుండంకు, వై.కృష్ణారెడ్డిని సీసీఎస్ రామగుండంకు బదిలీ చేశారు. -
ఓపెన్ చదువు.. భవితకు వెలుగు
కరీంనగర్: డ్రైవింగ్ లైసెన్సు పొందాలన్నా, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందాలన్నా కనీసం పదోతరగతి ఉత్తీర్ణత అడుగుతున్నారు. నాడు కొన్ని కారణాలతో చదువు మధ్యలో ఆపేసినవారికి ప్రభుత్వం సార్వత్రిక విధానం(దూరవిద్య)ద్వారా చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. పదోతరగతి, ఇంటర్లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదోతరగతి కోసం 32సెంటర్లు, ఇంటర్ కోసం 24సెంటర్లు ఏర్పాటు చేశారు. 2024–25లో నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో 1,006 మంది, ఇంటర్లో 1,920మంది పాసయ్యారు. దూరవిద్య ద్వారా ఎస్ఎస్సీ, ఇంటర్ చదివే అవకాశం ఉన్నా చాలా మందికి అవగాహన లేక దూరంగా ఉంటున్నారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి సార్వత్రిక విద్యాపీఠం వారు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇవి సాధారణ విద్యార్థులకిచ్చే సర్టిఫికెట్ల మాదిరిగానే పనిచేస్తాయి. 2025–26 విద్యాసంవత్సరానికి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతిలో ప్రవేశాలకు.. సార్వత్రిక విద్యను అభ్యసించేందుకు 14ఏళ్ల నుంచి 50ఏళ్లు ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తారు. పదోతరగతిలో ఎలాంటి విద్యార్హత లేకున్నా ప్రవేశం పొందవచ్చు. వయస్సు నిర్ధారణకు తహసీల్దార్ లేదా మున్సిపాలిటీ అధికారులు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉండాలి. గతంలో ప్రాథమిక పాఠశాలలో చేరిన వారు మధ్యలో బడి మానేస్తే టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు పాస్ ఫొటోలతో ప్రవేశాలు పొందవచ్చు. ఓసీ కేటగిరికీ చెందిన పురుషులు రూ.1,000, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, వికలాంగులు, మహిళలు రూ.600 రుసుం చెల్లించాలి. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. ఇంటర్లో చేరాలంటే ఇంటర్ అడ్మిషన్కు 15ఏళ్ల వయస్సు కలిగి పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. పదోతరగతి ఒరిజినల్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు పాస్ ఫొటోలతో ప్రవేశం పొందవచ్చు. సైన్సు గ్రూపులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఓసీ కేటగిరి పురుషులకు ప్రవేశ రుసుం రూ.1,100, రిజర్వేషన్ వర్తించే వారు రూ.800 చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉంటుంది. స్టడీ సెంటర్లలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మధ్యవర్తులను కానీ, దళారులను కానీ ఆశ్రయించకూడదని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్ ప్రవేశాలు పొందేందుకు మీసేవ ఆన్లైన్ రశీదు జత చేసి ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ పరిశీలనకు నిర్ణీత సమయంలో పంపించాల్సి ఉంటుంది. డీఈవోతో నియమించబడిన అడ్మిషన్ కమిటీ దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రవేశాన్ని నిర్ధారణ చేయనున్నారు. ఓపెన్ విద్యకు సంబంధించి సందేహాలు ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ చల్వాజి నాగేశ్వర్రావు సెల్నంబరు 8309212661ను సంప్రదించాలని జిల్లా విద్యాధికారులు వెల్లడించారు. దూరవిద్యలో పది, ఇంటర్ చదివేందుకు అవకాశం ప్రవేశాలకు ఆగస్టు 12వ తేదీ వరకు గడువు సద్వినియోగం చేసుకోండి చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ విద్య వరం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత సార్వత్రిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి. 2025–26 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ తరగతుల నిర్వహణకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తరువాత తప్పనిసరిగా దరఖాస్తు, అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో అందజేయాలి. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో -
కొత్త విద్యా సంవత్సరం.. కొత్త బంగారు లోకం
సుల్తానాబాద్(పెద్దపల్లి): కొత్త విద్యా సంవత్సరం ఈనెల 12న ప్రారంభమైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఈడీ తదితర కోర్సుల్లోనూ అడ్మిషన్ తీసుకుంటున్నారు. మరికొందరు హాస్టల్లోనూ చేరుతున్నారు. ఇంకొందరు స్నేహితులతో కలిసి గదులు అద్దెకు తీసుకుని వివిధ కళాశాలలకు వెళ్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల విద్యార్థులు కొందరు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటిదాకా అమ్మానాన్నతో గడిపిన విద్యార్థులు.. ఇక బ్యాచ్లర్గా జీవితం గడిపేందుకు సన్నద్ధమయ్యా రు. ఇలాంటి వారికి గదులు అద్దెకు ఇచ్చేందుకు ఇళ్ల యజమానులు సుముఖత చూపడంలేదు. కుటుంబం పరిస్థితితో అడుగులు వేయాలి కోర్సులు చేరిన వారు ఎవరైనా.. ఏ కోర్సులో ప్రవే శం పొందాలన్నా.. ట్యూషన్ ఫీజులు, బుక్స్, ప్యాకె ట్ మనీ, హాస్టల్ బిల్లులు, ప్రైవేట్ గదుల అద్దె చెల్లించడం తదితర వాటికి కుటుంబం ఆదాయంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి చూసి విద్యార్థులు నడుచుకోవాల్సి ఉంటుంది. కొందరు కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూసి పార్ట్టైం జాబ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరికొందరు ట్యూషన్ చెప్పేందుకు వెళ్తున్నారు. అనేక ఆలోచనలతో ఇంటర్లో ప్రవేశాలు -
డాక్టర్ భూంరెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలి
కరీంనగర్: తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్కు చెందిన ప్రముఖ వైద్యుడు భూంరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో శుక్రవారం పర్యటించారు. ముందుగా జాగృతి నాయకులు జాడి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి బీసీ సంఘాల నాయకులు, జాగృతి సభ్యులను కలిశారు. డాక్టర్ భూంరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ ఇటీవల మరణించగా ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. డాక్టర్ భూంరెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు సూర్యనారాయణరెడ్డి, సుధ, రామ, రవీందర్రెడ్డితో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూకు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేసిన డాక్టర్ భూంరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్యసేవలు అందించారని గుర్తు చేశారు. ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. భూంరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, జాగృతి నాయకులు జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతిరావు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
దొంగలిస్తూ.. విక్రయిస్తూ
● ఆరుగురు బైక్ దొంగల అరెస్టు ● 33 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 33 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సీపీ గౌస్ఆలం శుక్రవారం కమిషనరేట్ కేంద్రంలో వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా వెంకిచర్లకు చెందిన పంతుల నవీన్(24), కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కరావుపల్లికి చెందిన పెంటి బాలు (24), గంగాధర మండలం లింగంపల్లికి చెందిన తోట మధు(28), రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన పెద్ది నాగరాజు(29), ఇల్లంతకుంటకు చెందిన కుంబాల సురేశ్(35), మంథని మండలం కేశనపల్లికి చెందిన సాయిప్రసాద్(24) ముఠాగా ఏర్పడ్డారు. కొన్నేళ్లుగా వివిధ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన బైక్ను చోరీ చేస్తున్నారు. వీరిలో ఇద్దరు బైక్ దొంగిలిస్తే.. మిగితావారు విక్రయించి, అందరూ డబ్బులు పంచుకుంటారు. కొన్నేళ్లుగా కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 11బైక్లు, టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 9బైక్లు, త్రీటౌన్ స్టేషన్ పరిధిలో ఒకబైక్, రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండుబైక్లు, కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మూడు బైక్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు బైక్లు, వివరాలు లేని ఐదు బైకులు దొంగిలించారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పద్మనగర్ చౌరస్తా వద్ద టూటౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. రెండు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఆరుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో రూ.12,27,000 విలువైన 33బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూ టౌన్ సీఐ సృజన్రెడ్డి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, వన్టౌన్ సీఐ కోటేశ్వర్, త్రీటౌన్ సీఐ జాన్రెడ్డిని సీపీ అభినందించారు. -
ఆత్మీయ సమావేశం
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్ వెలిశాల కొండాల్రావు శుక్రవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి విద్యార్థులు హాజరై ప్రిన్సిపల్తో కలిసి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ వైస్చాన్స్లర్ వీరారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ భూమయ్య, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్తో పాటు, మాజీమంత్రులు రాజేశంగౌడ్, ఎల్.రమణ, సుద్దాల దేవయ్య ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల ఎంతో గొప్పదని, మాజీ ప్రధానమంత్రి పీవీ.నర్సింహరావు సహకారంతో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనర్సింహరావు చొరవతో ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయని తెలిపారు. -
సత్తా చాటాలి
రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాల ఎంపిక పోటోల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటాలి. 4వతరగతిలో అన్ని క్రీడాపాఠశాలల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులే సీట్లు సంపాదించాలి. తెలంగాణలో క్రీడల్లో ఉమ్మడి జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. క్రీడల్లో రాణించినవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. అది క్రీడాపాఠశాలతోనే సాధ్యమవుతుంది. – తుమ్మల రమేశ్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు 20కి పైగా సాధించాలి రాష్ట్రస్థాయి ఎంపికలో 9 కేటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ఈవెంట్లలో మంచి స్కోరింగ్ సాధించాలి. మెడిసిన్ బాల్త్రో, షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్లో స్కోరింగ్ ఎక్కువగా చేయొచ్చు. మొత్తం 27 పాయింట్లకు గాను 20 పాయింట్లకు పైగా స్కోరింగ్ చేస్తే సీటు సంపాదించొచ్చు. – నాగిరెడ్డి సిద్ధారెడ్డి, శాట్స్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ -
మహిళా సంఘం సభ్యులకు విద్యనందించాలి
కరీంనగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను పదోతరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేర్పించి మరింత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం విద్యాశాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మహిళా గ్రూపుల్లోని సభ్యుల్లో అర్హతను బట్టి పదోతరగతి, ఇంటర్ ఓపెన్స్కూల్లో ప్రవేశాలు పొందేలా చూడాలన్నారు. అంగన్వాడీల నుంచి పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించే విధంగా చూడాలన్నారు. విద్యాశాఖ తరఫున యూట్యూబ్ చానల్ స్థాపించాలని సూచించారు. భవిత కేంద్రాలను బలో పేతం చేయాలన్నారు. డీఆర్డీవో శ్రీధర్, మెప్మా పీడీ వేణుమాధవ్, డీఈవో మొండయ్య, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కోఆర్డినేటర్లు ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. అదనపు వసూళ్లు చేస్తే రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం జిల్లాలోని కొన్ని మీసేవా కేంద్రాల్లో పదోతరగతి, ఇంటర్ ఓపెన్స్కూల్(దూరవిద్య) కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల నుంచి చెల్లించాల్సిన ఫీజు కన్నా అదనంగా రూ.300వరకు మీ సేవ నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటివారి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. మీ సేవలో అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే 0878–2997247 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలన కరీంనగర్టౌన్: కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల, విద్యార్థుల వసతి గృహం, హాస్పిటల్లో ఉన్న వసతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో కలెక్టర్ పమేలా సత్పతితో బృందం సభ్యులు చర్చించారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శివరాం ప్రసాద్, రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు. పదోతరగతి, ఇంటర్ ఓపెన్స్కూల్లో చేర్పించాలి విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి -
హద్దులే విడుదల
● వెల్లడి కాని ఇంటి నంబర్లు, కాలనీలు ● పునర్విభజన తుది జాబితా జారీ ● కొనసాగుతున్న గందరగోళంకరీంనగర్ కార్పొరేషన్: ఎట్టకేలకు నగరపాలకసంస్థ డివిజన్ల పునర్విభజన తుది జాబితా విడుదలైంది. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం అనంతరం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీనే తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ దాదాపు వారం తరువాత 21వ తేదీ, జీవోఎంఎస్ నంబర్ 144 ద్వారా శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. 66 డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ముందుగా ప్రకటించిన ముసాయిదాతో పోల్చితే తుది జాబితాలో భారీగా మార్పులు చోటుచేసుకొన్నాయి. నగరానికి ఉత్తరాన ఉన్న ఆరెపల్లి నుంచి 1వ డివిజన్ను ప్రారంభించగా, టవర్సర్కిల్లోని మార్కెట్ ప్రాంతంలో 66వ డివిజన్తో పునర్విభజనను ముగించారు. దీంతో ముసాయిదాలో పేర్కొన్న డివిజన్ల నంబర్లన్నీ మారాయి. హద్దులే విడుదల చేయడం గందరగోళానికి దారితీసింది. హద్దులే మాత్రమే.. డివిజన్ల పునర్విభజనకు సంబంధించి శుక్రవారం హద్దులు మాత్రమే విడుదల చేయడంతో పూర్తిస్థాయిలో స్పష్టత కొరవడింది. ఈ నెల 4వ తేదీన జారీ చేసిన ముసాయిదాలో ఇంటినంబర్లు, కాలనీల పేర్లతో 66 డివిజన్ల వివరాలు ఇచ్చిన అధికారులు, తుది జాబితాను కేవలం డివిజన్ల హద్దులతోనే సరిపెట్టారు. దీంతో తుది జాబితాపై అస్పష్టత కొనసాగుతోంది. ముసాయిదా తరహాలోనే ఇంటినంబర్లు, కాలనీల పేర్లతో కూడిన డివిజన్ల వివరాలను వెల్లడిస్తేనే అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని సిటీ ప్రజలు అంటున్నారు. డివిజన్ల కాలనీలు, ఇంటినంబర్లు శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మారిన డివిజన్ నంబర్లు 60 డివిజన్లు ఉండగా, ఆరు గ్రామాలు, పట్టణం విలీనం 66కు చేరడం తెలిసిందే. 66 డివిజన్ల పునర్విభజనను ప్రభుత్వం చేపట్టింది. ముసాయిదాలో ఒకటో డివిజన్గా తీగలగుట్టపల్లిని పేర్కొంటూ పునర్విభజనను ప్రారంభించి, రాజీవ్చౌక్ దిగువ భాగాన 66వ డివిజన్తో ముగించారు. కొత్తపల్లి, గోపాల్పూర్, దుర్శేడ్ గ్రామాలు కార్పొరేషన్లో కలవడంతో ఉత్తర సరిహద్దు తీగలగుట్టపల్లి నుంచి ఆరెపల్లికి మారింది. దీంతో ఆరెపల్లి ఒకటో డివిజన్గా టవర్సర్కిల్ ఎగువ భాగమైన మార్కెట్ ఏరియా, వెంకటేశ్వర ఆలయం, కలెక్టర్ నివాసం కలిపి 66వ డివిజన్గా మారాయి. ముసాయిదాతో పోల్చితే అన్ని డివిజన్ల నంబర్లు మారాయి. కాగా పాత డివిజన్లలో 7,8,9 డివిజన్లకు స్వల్ప మార్పలతో అవే నంబర్లు ఉన్నాయి. లీకై న జాబితానే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన తుది జాబితా గతంలోనే లీకు కాగా, ఆ జాబితా దాదాపు మాజీ కార్పొరేటర్ల వద్ద ఇప్పటికే చేరింది. అధికారికంగా జాబితా వెల్లడి కానప్పటికీ టౌన్ప్లానింగ్ నుంచి మాజీ కార్పొరేటర్లకు జాబితా లీకై ంది. అయితే అధికారికంగా విడుదలయ్యే తుది జాబితాలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ ఉండింది. హద్దులు లీకై న జాబితా తరహాలోనే ఇది ఉండడం విశేషం. గందరగోళమే డివిజన్ల హద్దులు మాత్రమే ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర, తిరిగి ఉత్తరానికి సంబంధించిన డివిజన్ల హద్దులు ప్రకటించారు. డివిజన్ల ఉత్తరం నుంచి మొదలై చుట్టూ తిరిగి ఉత్తరంతో ముగియడంతో చాలామంది డివిజన్లను అంచనా వేయలేకపోతున్నారు. ఉత్తరం పేరుతో డివిజన్ మధ్య నుంచి మొదలు కావడంతో, సరిహద్దుల్లో ఉన్న ఇంటినంబర్లతో డివిజన్ను ప్రకటించడం తికమకకు గురిచేసింది. ఏ ఇంటి నంబర్ నుంచి ఏ ఇంటినంబర్ వరకు, ఏ కాలనీ అనేది ప్రకటిస్తేనే తుది జాబితాపై స్పష్టత రానుంది. -
హే మాధవా..!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: వర్క్స్లిప్ ప్రతీ సివిల్ వర్క్ పారదర్శకంగా జరిగేందుకు ఇది బ్లూప్రింట్ లాంటిది. పని అంచనాలు, ఎస్టిమేషన్, డ్రాయింగ్ తదితర కీలక వివరాలు ఇందులో పొందుపరుస్తారు. తరువాత వాటికి ఈఎన్సీ నుంచి అనుమతి పొందుతారు. అపుడే టెండర్లు పిలుస్తారు. కానీ... కరీంనగర్ స్మార్ట్సిటీ పనుల్లో రోజుకో వింత వెలుగుచూస్తోంది. రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పద్మనగర్ జంక్షన్ పనుల్లో అదనంగా రూ.80 లక్షల వర్క్స్ అదే కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించడంపై సర్వత్రా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పనులకు కనీసం వర్క్స్లిప్ కూడా లేదన్న విషయం కలకలం రేపుతోంది. సివిల్ పనుల్లో ఇంత భారీ తప్పిదాలకు ఇంజినీరింగ్శాఖ ఎలా అనుమతి ఇచ్చింది? అన్న విషయం చర్చానీయాంశమైంది. వివాదాస్పద కాంట్రాక్ట్దే ఆధిపత్యం.. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో వేల కోట్ల రూపాయలతో పలుఅభివృద్ధి పనులు చేపట్టడం తెలిసిందే. ఇందులో చాలామటుకు పూర్తయ్యాయి. కొన్ని కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనుల్లో అంచనాలు ఇష్టారీతిన భారీగా పెంచారని, అక్రమాలకు పాల్పడ్డారని, పనుల్లోనూ నాణ్యత పాటించలేదని అప్పట్లో ఆరోపణలు, ఫిర్యాదులు రావడం తెలిసిందే. అయితే ఆరోపణలు వచ్చిన అధిక పనులు సదరు కాంట్రాక్టర్ చేయడం ఇక్కడ విశేషం. అతను తలచుకుంటే.. టెండరు లేకుండానే పనులు అతని పరమవుతాయి. బ్లిలులు కూడా నడుచుకుంటూ వస్తాయి. రూ.లక్షల్లో అంచనా...రూ.కోట్లకు పెంపు లక్షల రూపాయల్లో అంచనాలుంటే, వాటిని కోట్ల రూపాయలకు పెంచడంలో సదరు కాంట్రాక్టర్ దిట్ట. గతంలో గీతాభవన్ జంక్షన్ను రూ.60 నుంచి రూ.70 లక్షల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఆ పనుల ను ఏకంగా రూ.1.30 కోట్ల అంచనాలు పెంచాయ న్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పైగా ఫిర్యాదులున్నా రూ.కోటి బిల్లును ఇప్పటికే తీసుకోవడం గమనార్హం. చివరికి జంక్షన్ పనులకు సంబంధించిన మట్టిని కూడా అమ్ముకున్న ఆరోపణలను సదరు కాంట్రాక్టర్ ఎదుర్కొన్నారు. అంతేకాదు ప్రారంభించిన కొన్నిరోజులు గీతాభవన్ చౌరస్తా వెలుగులు విరజిమ్మింది. ఇపుడు చీకటి అలుముకుంది. ఒకే కాంట్రాక్టర్పై బల్దియాకు అభిమానం టెండరు లేకుండా పనులు అప్పగింత కనీసం వర్క్స్లిప్ లేకున్నా వర్క్స్ అలాట్ ఐఏఎస్ల పర్యవేక్షణ ఉన్నా.. పట్టిపేది?గాంధీ జంక్షన్లో రికవరీ ఇదే కాంట్రాక్టర్ కార్ఖానగడ్డలోని గాంధీ జంక్షన్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఈ పనులకు మించి డబ్బులు తీసుకున్న వైనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అప్పట్లో ఇన్చార్జి కమిషనర్గా ఉన్న ప్రస్తుత కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్పందించి విచారణ చేపట్టారు. విచారణలో పనికి మించి డబ్బులు తీసుకున్నారని తేలడంతో డబ్బులను సదరు కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయించారు. తప్పు జరిగినట్లు నిర్ధారించి డబ్బులు తిరిగి బల్దియాకు కట్టించుకున్నా.. సదరు కాంట్రాక్టర్పై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఎందుకంటే ఉన్నతాధికారులకు ఇతను భారీ బహుమతులు ఇచ్చి వశపరుచుకుంటాడన్న విమర్శలు ఉన్నాయి. వీటిని బలపరిచేలా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కరీంనగర్ ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయమై ఈఎన్సీ భాస్కర్ రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన పద్మనగర్ జంక్షన్ మీద మాట్లాడేందుకు సుముఖత వ్యక్తంచేయలేదు. ఇదే విషయమై ఎస్ఈ (పీహెచ్) ఎన్ఎస్రావును సంప్రదించాలని ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
‘పార్లమెంట్ అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి’
కరీంనగర్టౌన్: జిల్లాలోని కొత్తపల్లి– హుస్నాబాద్ మధ్య రూ.77.2కోట్ల అంచనాతో చేపట్టిన ఫోర్లేన్ విస్తరణ శంకుస్థాపనకు, హుస్నాబాద్లో 250పడకల ప్రభుత్వ ఆసుపత్రి, 50పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభాని కి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చండీఘడ్ వెళ్లాల్సి రావడంతో హాజరుకాలేకపోయానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తన ను ఆహ్వానించిన పొన్నం ప్రభాకర్కు, అభివృద్ధి పనుల ప్రారంభానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహకు ధన్యవాదా లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సైతం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.అంధుల పాఠశాలకు అండగా ఉంటాంకరీంనగర్ కల్చరల్: శాతవాహన విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ అంధుల పాఠశాలకు అండగా ఉంటామని యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ పేర్కొన్నారు. ది వ్యాంగురాలు హెలెన్ కెల్లర్ పుట్టిన రోజు సందర్భంగా లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సౌజన్యంతో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధుల మెదడు చురు గ్గా పని చేస్తుందన్నారు. ఏకాగ్రతతో చదివితే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందన్నారు. పాఠశాలను దత్తత తీసుకుని తమ అధ్యాపకులతో వారానికి ఒకటి, రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. వీసీ, సిబ్బంది శ్రీకాంత్, సంతోష్, మారుతీ కలిసి రూ.12,000 విరాళం అందించారు. లీడ్ ఇండియా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్రెడ్డి, ఎం.మహేందర్రెడ్డి, సురేందర్, ఉపాధ్యాయులు రమేశ్, శ్రీనివాస్రెడ్డి, సరళ పాల్గొన్నారు. శుక్రవారం సభతో మహిళల సమస్యలు పరిష్కారంకరీంనగర్రూరల్: మహిళా సమస్యలకు శుక్రవారం సభ పరిష్కారవేదికగా నిలుస్తోందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పేర్కొన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలను శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని సూ చించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో షుగర్ బోర్డు ఏర్పాటు చేశామని, షుగర్తో వచ్చే అనారోగ్య సమస్యల గురించి స్పష్టంగా తెలుస్తుందన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళలో భాగంగా జిల్లాలో మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో సబితా, ఎంపీడీవో సంజీవ్, డిప్యూటీ డీఎంహెచ్వో సుధా పాల్గొన్నారు. పోలీసుల వాహనాల తనిఖీలు?కరీంనగర్క్రైం: పోలీసుల నిత్యం ఇతరుల వాహనాలు తనిఖీచేయడం సహజం. కానీ.. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వాహనాలనూ తనిఖీ చేసుకున్నారు. ఇదంతా స్థానిక పోలీసు హెడ్క్వాటర్స్ జరిగింది. చాలన్లు కట్టని వాటిని గుర్తించి కట్టించడం.. సరైన పత్రాలు లేని వాటిని సీజ్చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో డిపార్ట్మెంట్లో కొందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారి ఒకరు తాను విధినిర్వహణలో వాడే వాహనానాకి ఏమైనా చాలాన్ కట్టాల్సి ఉందా? అని అప్పటికప్పుడు చూసుకున్నట్లు సమాచారం. ఇకపై పోలీసులు వాడే వాహనాలకు సరైన పత్రాలు ఉండాల్సిందేనని ఈ తనిఖీ ద్వారా చెప్పకనే చెప్పారు. -
సమన్వయంతో పనిచేయాలి
కరీంనగర్కార్పొరేషన్: పారిశుధ్యం, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు. కళాభారతిలో ఆర్వోలు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో సమావేశం నిర్వహించారు. గృహావసరాలకు నిర్మించి వాణిజ్యపరంగా వాడుతున్న భవనాలను గుర్తించి వాణిజ్య ఆస్తులుగా మార్చాలన్నారు. ఇలాంటి సమస్యలతో సిటీలో 1,200 ఆస్తులు ఉన్నాయని తెలిపారు. నివాసయోగ్యమమైన ఇళ్లకు మాత్రమే నంబర్లు ఇవ్వాలని, బోగస్ ఇంటినంబర్లు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణు మాధవ్, ఖాదర్ మోహియొద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్రావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు. -
తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. శవమైన తనయుడు
చందుర్తి(వేములవాడ): అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిన తనయుడు శవమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంఘని లక్ష్మీరాజం ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. పదిహేను రోజుల క్రితం లక్ష్మీరాజం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొడుకు తిరుపతి కరీంనగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ కాలు పై భాగానికి పోయిందని తెలపడంతో కొడుకు తిరుపతి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన తిరుపతి అక్కడే పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయమైంది. తలలోని నరాలు చిట్లిపోయాయని, వెంటనే ఆపరేషన్ చేశారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న తిరుపతి గురువారం మృతిచెందాడు. తిరుపతికి భార్య రజిత, ఆరేళ్ల కుమారుడు గణేశ్ ఉన్నారు. మమ్మల్ని చూసుకునే దిక్కెవరూ కొడుకా.. పోషించే కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. అయ్యను దవాఖానాకు తీసుకుపోయి నువ్వే ప్రాణాలు పోగొట్టుకుంటివా బిడ్డా.. అంటూ ఆ తల్లి లింగవ్వ రోదనలు స్థానికులను కలచివేశాయి. తండ్రి ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న కంటికి రెప్పలా చూసుకుంటివి బిడ్డా.. మాకిప్పుడు ఎవరూ దిక్కంటూ గుండెలవిసేలా రోదించింది. మల్యాలలో మిన్నంటిన రోదనలు -
అడవికి ఆపద
సిరిసిల్ల: జిల్లాలో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నా.. ఆఫీస్ల్లోనే అటవీశాఖ అధికారులు రెస్ట్ తీసుకుంటున్నారు. రికార్డుల్లోనే అడవిని రక్షిస్తున్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్–2023 ప్రకారం 251 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2020లో 22.50 శాతం ఉన్న పచ్చదనం ఏకంగా 20.45 శాతానికి పడిపోయినట్లు అటవీశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు ఇస్తుందనే నమ్మకంతో అటవీ శివారు పల్లెల్లో పోడు పేరిట ఫారెస్ట్ను పాడుచేసే పనులు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీశాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఎకరానికి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు దండుకుంటూ అక్రమార్కులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, సాగుచేయడం నేరమని తెలిసినా కొందరు గొడ్డళ్లు, ట్రాక్టర్లతో అడవికి ఎసరుపెడుతూనే ఉన్నారు. కొత్తపేట, మల్యాల, సనుగుల, రామారావుపల్లి, గోవిందరావుపల్లి, వట్టిమల్ల, గర్జనపల్లి, రంగంపేట శివా రుల్లో సుమారు 251 ఎకరాల్లోని జంగల్ను నరికేశారు. మార్కెట్లో ఆ భూముల విలువ రూ.37.65 కోట్ల మేరకు ఉంటుంది. కళ్లు తెరవకుంటే.. జిల్లా అధికారులు కళ్లు తెరవకుంటే పచ్చని అడవి ఆక్రమణల పాలై పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చించి హరితహారం చేపడుతున్నా నాటే మొక్కల కంటే నరికేస్తున్న చెట్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్న వారు ఇప్పటికే ఎకరాల కొద్ది భూములను ఆక్రమించి.. పోడు పేరిట అడవులకు కీడు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకుంటే భవిష్యత్లో అటవీ భూములకు రక్షణ కల్పించినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పోడుపట్టాలు అటవీ భూముల ఆక్రమణలు ఎలా ఉన్నా.. కొత్తగా అడవికి ఆపద రాకుండా రక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. స్పందించని అటవీశాఖ అధికారులు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై జిల్లా ఇన్చార్జి డీఎఫ్వోను ఫోన్లో ‘సాక్షి’ సంప్రదించగా స్పందించలేదు. కొత్తగా సాగులోకి వచ్చిన అటవీభూముల వివరాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఏది ఏమైనా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి.అటవీ స్వరూపం..(అటవీ శాఖ గణాంకాలు) గ్రామాలు: 260అటవీ సమీప గ్రామాలు: 64అటవీ విస్తీర్ణం : 390.85 చదరపు కిలోమీటర్లు మధ్యస్థ దట్టమైన అటవీ ప్రాంతం : 113.26 చదరపు కిలోమీటర్లు బహిరంగ అటవీ ప్రాంతం : 185.07 చదరపు కిలోమీటర్లు పోడు అటవీ ప్రాంతం : 15.32 చదరపు కిలోమీటర్లు అడవి కాని అటవీ ప్రాంతం : 76.06 చదరపు కిలోమీటర్లు అడవుల్లో నీటి వనరులు : 1.14 చదరపు కిలోమీటర్లు పచ్చదనం శాతం : 20.45ఉండాల్సిన పచ్చదనం: 33 శాతం ఇది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం కొత్తపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు 2015లో నిర్మించిన చెక్డ్యాం. ఈ చెక్డ్యామ్లో నీరు నిల్వ ఉండి.. వన్యప్రాణులకు దాహార్తి తీర్చుతుంది. ఈ చెక్డ్యామ్ పక్కనే ఓ పది ఎకరాలు మైదానంగా అటవీభూమి ఉంది. చెక్డ్యామ్లో నీరు ఉంటే.. ఆ భూమి సాగులోకి రాదు. దీంతో స్థానికుడు ఒకరు చెక్డ్యామ్లో ఇసుక నిండిన భాగాన్ని తవ్వేశాడు. తన ట్రాక్టర్తోనే కోర (కయ్య) కొట్టాడు. గతేడాది కురిసిన వర్షాలకు చెక్డ్యామ్ తెగిపోయింది. నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రజాధనం వరదపాలైంది. చెట్లు.. చెక్డ్యామ్లను కూల్చివేస్తూ.. అటవీ భూమికబ్జా ఫారెస్ట్ ప్లాంటేషన్నే దున్నేశారు ఆఫీస్లు దాటని ఫా‘రెస్ట్’ అధికారులు ఈ ఏడాది కొత్తగా 251 ఎకరాల్లో ఫారెస్ట్ ఆక్రమణలు పోడు భూములకు పట్టాల ఆశతో చెట్లను కొట్టేస్తున్నారు ఆ భూమి విలువ రూ.37.65 కోట్లపై మాటే ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడిఇది కొత్తపేట శివారులోనే చెక్డ్యామ్ను కూల్చివేసిన ప్రదేశం. చెక్డ్యామ్ లేకుండా పోవడంతో పది ఎకరాల ఫారెస్ట్ భూమి సాగులోకి వచ్చింది. ట్రాక్టర్ ఉండడంతో ఇటీవల అటవీ భూమిని దున్నేసి పత్తివిత్తనాలు పెట్టాడు. అటవీ భూమిలోనే గుట్టుగా బోరు వేశాడు. నీరు బాగానే పడింది. దూరంగా ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వైర్లు లాగి మోటారు పెట్టాడు. సదరు చెక్డ్యామ్ కూల్చిన కొత్తపేట వ్యక్తి పది ఎకరాల ఆసామి అయ్యాడు. ఆ భూమి విలువ ఇప్పుడు మార్కెట్లో రూ.కోటిన్నర. ఇది వీర్నపల్లి మండలం గర్జనపల్లి గిరిజనతండా శివారులో ఇటీవల ఇలా చెట్లను తొలగిస్తున్నారు. ఆ తొలగించిన చెట్ల కొమ్మలు అక్కడే ఎండిపోయిన తరువాత వంట చెరుకుగా వాడుతున్నారు. మరో ఏడాది ఆ భూమిని దున్నుకుని పంటను సాగు చేసుకునేందుకు వీలుగా వా డుకుంటున్నారు. సహజసిద్ధంగా అడవి లో ఎదుగుతున్న చెట్లను ఇలా కొట్టేశారు. వీరంతా వీర్నపల్లి మండలం రంగంపేట వాసులు. హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కులు నాటేందుకు బుధవారం వెళ్లగా ఆ భూములు తమవి అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు చెందిన తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏళ్లుగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్నామని, ఇప్పుడు మొక్కలు నాటితే తమకు బతుకుదెరువు లేదని వాదించారు. ప్రస్తుతం 132 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటకుండా రైతులు పంట వేయకుండా అలాగే ఉంది.. ఇవి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన వాస్తవాలు. -
లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.7లక్షలకు టోకరా
సిరిసిల్లక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి ఏకంగా రూ.7లక్షలు దండుకున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు గురువారం కటకటాలకు పంపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్ జిల్లా పిల్లోనా మండలం సీపూర్కు చెందిన కపిల్శర్మ, అదే ప్రాంతంలోని ఇస్మాయిల్పూర్కు చెందిన పంకజీ కౌశిక్ ఇద్దరు కలిసి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఓ వెబ్ అప్లికేషన్ లింక్ను రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుగులోతు రమేశ్కు 2024, డిసెంబర్ 8న పంపారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టబడి పెడితే అధి క లాభాలు వస్తాయని నమ్మించి రూ.2500 పెట్టుబడిగా పెట్టించారు. మరుసటి రోజు అదనంగా డబ్బులు వచ్చాయి. దీన్ని నమ్మిన రమేశ్ విడతల వారీగా రూ.7లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తర్వాత ఆ వెబ్సైట్ కనిపించలేదు. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన రమేశ్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఎస్సై జునైద్, హెడ్ కానిస్టేబుల్ గంగారం, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేశ్ నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. వెబ్లింక్తో మోసానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్ బీ గీతే -
జీప్యాట్లో విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్క్రైం: జాతీయ స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో శాతవాహన ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఎస్.సాయి మనిదీప్, ిసీహెచ్ చక్రధర్, బి.మాధురి, ఎన్.శిరీష, ఎ.నిత్యారెడ్డి, ఎం.అరుణ్, డి.పండరీనాథ్, సానియా, జి.సుగంధిక, ఎ.వర్ష ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీశైలం తెలిపారు. వారిని వీసీ ఉమేశ్కుమార్, రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందించారు. ఓఎస్డీ హరి కా ంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, విభాగా ధిపతి అర్చన, అధ్యాపకులు భాగ్యలక్ష్మి, అనిల్కుమార్, క్రాంతిరాజు,జె.అశ్విని పాల్గొన్నారు. జేసీబీతో పని పేరిట మోసం సిరిసిల్లక్రైం: జేసీబీతో భూమి చదును చేసే పనులు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బులు గుంజుతున్న ఇద్దరిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గోల్కొండ చందుకుమార్, చింతపట్టి జిల్లాలోని పలువురు జేసీబీ యజమానులకు ఫోన్ చేశారు. వేములవాడ సమీపంలోని అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని.. అందులో చెట్లను చదును చేయడానికి జేసీబీ కావాలని కోరారు. ఎంట్రీ ఫీజు కోసం రూ.9 వేలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికారు. డబ్బులు పంపిన వారు పని కోసం ఫోన్చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వీరి బాధితులు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఇద్దరు, ఎల్లారెడ్డిపేటలో ఒకరు ఉన్నట్లు తెలిపారు. -
నృసింహుడి హుండీ ఆదాయం రూ.71.53 లక్షలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.71,53,190 సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. మార్చి 21 నుంచి ఈనెల 26 వరకు (98 రోజులు) వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా నగదుతోపాటు 68 గ్రాములు మిశ్రమ బంగారం, 7.400 కిలోల మిశ్రమ వెండి, 32 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రజ, ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, అర్చకులు తదితరులున్నారు. ఆల్ ఇండియా సెమ్స్ ఒలింపియాడ్లో ప్రతిభసప్తగిరికాలనీ(కరీంనగర్): సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ నేషనల్ సెమ్స్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభకనబర్చి ఆల్ ఇండియా, స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. ఎన్.రక్షిత ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, కె.మహిత ఆల్ ఇండియా 4, స్టేట్ లెవల్లో పి.మహిధర్, ఆత్రేయులు 2, మహిత 3, మహి చౌదరి 7 పరీక్షిత్ సారధి, అభిగ్నలు 10వ ర్యాంకులతో పాటు పలువురు విద్యార్థులు జోనల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కో ఆర్డినేటర్లు, ఇన్చార్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ టోల్ బాదుడు!
● టికెట్పై 20శాతం చార్జీల పెంపు ● స్టూడెంట్ బస్పాస్ చార్జీలు 50శాతం పెంపు ● హైదరాబాద్ మార్గంలో రూ.20 నుంచి రూ.30 వరకు అదనంకరీంనగర్: తెలంగాణ ఆర్టీసీ చడీచప్పుడు లేకుండా సాధారణ ప్రయాణికులతో పాటు స్టూడెంట్ బస్పాస్ చార్జీలను భారీగా పెంచింది. స్టూడెంట్ బస్పాస్ కనిష్టధర నెలకు రూ.400 ఉండగా 50శాతం మేర పెంచి రూ.600గా నిర్ణయించింది. ప్రయాణించే మార్గంలో ఎన్ని టోల్గేట్లు ఉంటే టికెట్పై అన్ని పది రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల నుంచి ఎక్కువ బస్సులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటాయి. కరీంనగర్ ప్రధాన బస్స్టేషన్ నుంచి హైదరాబాద్కు 8వేల నుంచి పదివేల వరకు ప్రయాణిస్తుంటారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రేణిగుంట, దుద్దెడ టోల్ప్లాజాలు ఉండగా టికెట్పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. 50శాతం పెరిగిన బస్పాస్ చార్జీలు సాధారణ ప్రజలతో పాటు విద్యార్థుల బస్పాస్ ధరలను సైతం పెంచింది. తాజా పెంపుతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నెలవారీ స్టూడెంట్ బస్పాస్ చార్జీలు గతంలో రూ.400 ఉండగా దానిని రూ.600లకు, మూడు నెలల కాలానికి రూ.1200 నుంచి రూ.1800కు పెంచారు. దీంతో కరీంనగర్ రీజియన్ పరిధిలో దాదాపు 80 వేల నుంచి లక్ష మంది విద్యార్థులపై ప్రభావం పడుతోంది. టోల్ ధరలతో సంబంధం లేకుండా విద్యార్థుల బస్పాస్లకు సైతం ధరలు పెంచిన యాజమాన్యం కార్డు ముద్రణకు రూ.50 అదనంగా వసూలు చేస్తోంది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరో రకంగా... పల్లె వెలుగు బస్సుల్లో ఐదు కిలోమీటర్లకు ఒక స్టేజీ చొప్పన నిర్ణయించి చార్జీలు వసూలు చేస్తారు. ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రం మొత్తం కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. తాజాగా చేపట్టిన కిలోమీటర్ల సర్దుబాటుతో పలు మార్గాల్లో చార్జీలు పెరిగాయి. గతంలో చిల్లర సమస్య పేరుతో బస్సు చార్జీలను రౌండప్ చేయగా తాజాగా కిలో మీటర్ల సర్దుబాటు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. దీని వల్ల ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది.కరీంనగర్ నుంచి జేబీఎస్కు బస్సు పాతచార్జీ పెరిగిన (రూ.ల్లో) తర్వాత(రూ.ల్లో) రాజధాని 390 410 సూపర్లగ్జరీ(ఈవీ) 350 390 సూపర్లగ్జరీ 310 330 ఎక్స్ప్రెస్ 230 260 ఎక్స్ప్రెస్(ఈవీ) 240 270 గరుడ ప్లస్ 370 390 డీలక్స్ 260 280 -
ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
వేములవాడరూరల్: ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లకు చెందిన వాణి–లింగయ్యలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఫ్యాన్లు రిపేర్ చేస్తుండగా, తల్లి గ్రామంలోనే గాజులషాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె చేని వైష్ణవి(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. 15 రోజుల క్రితం ఇంటికొచ్చింది. పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు ● తప్పిన పెను ప్రమాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల బైపాస్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఇద్దరు వేములవాడ నుంచి సిరిసిల్ల బైపాస్ మీదుగా కారులో వెళ్తున్నారు. వెంకటాపూర్ వద్ద కుడివైపు మళ్లకుండా ఎదురుగా వెళ్లి వాగుమడి రాజయ్య ఇంటిని ఢీకొట్టారు. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే గ్రామస్తులు గుమిగూడారు. కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఇద్దరు పరారయ్యారు. కారులో బీరు బాటిళ్లు, బిర్యాని పొట్లాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పారు. కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. అనారోగ్యంతో కవయిత్రి మృతిధర్మపురి: హరిహరామృతం భక్తి గీతాల పుస్తకాన్ని రాసిన కవయిత్రి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. ధర్మపురికి చెందిన కవయిత్రి బుగ్గారపు సులోచన (85) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె రాసిన హరిహరామృతం పుస్తకాన్ని ఆమె కోరిక మేరకుబమూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. సులోచన భర్త గతంలోనే మరణించారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆమె కటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట అయ్యోరి రాజేష్, ఆకుల రాజేష్, సంగి శేఖర్, ఆసిఫ్ తదితరులు ఉన్నారు. -
అమ్మవారికి పుదీన మాల
విద్యానగర్(కరీంనగర్): నగునూర్లోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమా సం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గురువారం అమ్మవారిని పుదీనా మాలలతో అలంకరించారు. విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు● మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్: నియోజకవర్గంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని కరీంనగర్–వరంగల్ రహదారిపై మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రసమయి మాట్లాడుతూ, నియోజకవర్గంలో 48వేల మంది దరఖాస్తు చేసుకుంటే 2 వేల మందికి మంజూరు చేశారని, డబ్బు, కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై పల్లెమీద చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హుజూరాబాద్, కేశవపట్నం పోలీస్ స్టేషన్లకు తరలించారు. క్షయ నిర్మూలన అందరి బాధ్యతకరీంనగర్టౌన్: క్షయ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా టీబీ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. క్షయ నివారణ విభాగం, టీబీ అలర్ట్ ఇండియా– ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ సహకారంతో గురువారం కరీంనగర్ మండలం పరిషత్ కార్యాలయంలో టీబీ చాంపియన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయతో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్ సురేందర్, డాక్టర్ సాయి ప్రసాద్, ఎల్లయ్య, వనిత, శ్రీను, రాజబోస్, పారిజాతం రాజేందర్, అనిల్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఆఫీసర్లను కలవాలంటే టైం పాటించాల్సిందే..కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్లో ప్రధాన విభాగ అధికారులను కలవాలంటే సమయాన్ని అనుసరించాల్సిందే. రాజకీయ, ఇతర వ్యక్తులు కార్యాలయాల్లోనే తచ్చాడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనివేళల్లో మద్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే అధికారులు, సిబ్బందిని కలవచ్చని బోర్డును ఏర్పాటు చేశారు. -
మత్తు పదార్థాలకు బానిస కావద్దు
● కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి/కరీంనగర్ క్రైం: యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి వైద్య కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. వైద్య, ఇంజినీరింగ్ విద్యార్థులు కొందరు మత్తు పదార్థాల బారిన పడుతుండటం బాధాకరమన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి డ్రగ్ డిటెక్షన్ కిట్లను ఉపయోగించి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కళాశాలస్థాయిలో విద్యార్థులు ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ పాఠశాలస్థాయిలో విద్యార్థులు మత్తుకు బానిసకావడం దారుణమన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలోమాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీ గౌస్ఆలం ఆధ్యరంలో గురువారం నగరంలో రెండు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. అనంతరం కమిషనరేట్ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
పిల్లలు బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ ● అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్ ● తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్ ● గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024–25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో పురోగతి కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యాల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. ఇక పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి మరీ ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చేశాయి. అగ్రభాగాన జగిత్యాల.. ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో జగిత్యాల పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్రోల్మెంట్ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్రోల్మెంట్లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్తోపాటు సిరిసిల్లకు ఇన్చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్రోల్మెంట్లో కాస్త వెనకబడింది. రాజన్నసిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం) జగిత్యాల 3,690 5,147 39కరీంనగర్ 4,831 6,393 32పెద్దపల్లి 3,612 4,295 19సిరిసిల్ల 6,280 6,901 10 తల్లిదండ్రులను ఒప్పించాంబాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. – కె.రాము, డీఈవో, జగిత్యాల -
స్వచ్ఛత పాటిస్తే ర్యాంకు
● 20 గ్రామాల్లో కేంద్ర బృందం పరిశీలన ● నేడు కలెక్టరేట్లో అవగాహన కరీంనగర్రూరల్: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ ఏడాదికిగాను వచ్చేనెల మొదటి వారంలో కేంద్ర బృందం పర్యటించనుంది. నాలుగు రకాలుగా గ్రామాల పారిశుధ్య అంశాలు కేంద్ర బృందం సభ్యులు సేకరించి జిల్లాల వారీగా స్వచ్ఛత స్థాయిని అంచనావేస్తారు. గణాంకాలు, నాణ్యత ఆధారంగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి ర్యాకులు ప్రకటిస్తారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులకు అవగాహన ఏర్పాటు చేశారు. మార్కుల ఆధారంగా పురస్కారం.. గ్రామాల్లో చెత్తసేకరణ, వ్యర్థాల నిర్వహణ, కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడుగుంతల నిర్మాణం, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం, పరిశుభ్రత, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర బృందం పరిగణనలోకి తీసుకుంటుంది. నాలుగు అంశాలకుగాను 1000 మార్కులు కేటాయిస్తుంది. సేవా స్థాయిపురోగతికి 240 మార్కులు, ప్లాంట్ల పరిశీలనకు 120, నేరుగా పరిశీలనకు 540, పౌరుల అభిప్రాయాలకు 100 మార్కులు వేస్తారు. మెరుగైన ర్యాంకు సాధిస్తే పురస్కారాలకు ఎంపిక చేస్తారు. జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలుండగా కేంద్ర బృందం 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేయనుంది. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆయా గ్రామాల్లో సర్వే చేస్తారు. గ్రామంలో 16 ఇళ్లను సందర్శించి ఇంటి యజమానుల అభిప్రాయాలను సేకరిస్తారు. 20 గ్రామాల్లో నెలరోజుల పాటు సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. దీని ఆధారంగా స్కోర్, ర్యాంకును ప్రకటిస్తారు. జిల్లాకు మెరుగైన ర్యాంకు రావాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో పంచాయతీకార్యదర్శులు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ తెలిపారు. -
కొడుకును చూసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో చదువుతున్న కుమారుడు సుశాంత్ను చూసేందుకు వచ్చిన తల్లి చందన(32) గుండెపోటుతో మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన చందన–నరేశ్ దంపతుల కుమారుడు సుశాంత్ను వారం క్రితం రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. సుశాంత్ను చూడటానికి గురువారం తల్లిదండ్రులు వచ్చారు. అనంతరం చందన పై అంతస్తులో ఉన్న వాష్రూమ్కు వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయింది. గమనించిన సిబ్బంది సమాచారంతో వెంటనే చేరుకున్న ఉపాధ్యాయుడు ఆమెకు సీపీఆర్ చేశారు. అక్కడికొచ్చిన ఆర్బీఎస్కే వైద్యుల సైతం ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. వేములవాడ సంస్కృత పాఠశాలలో ఘటన -
బిర్యాని కోసం వెళ్లి.. మృత్యు ఒడికి
పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నర్సింహునిపేటలో మంగళవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో గాయపడిన భోగ సత్యనారాయణ (30) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ సత్యనారాయణ, తాటిపాముల భాస్కర్, తాటిపాములు మధూకర్, కొత్తూరి నవీన్ నలుగురు స్నేహితులు. మంగళవారం సాయంత్రం మద్యం సేవించారు. బిర్యాని తినేందుకుని రామడుగు మండలం గోపాల్రావుపేటకు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పెగడపల్లికి వస్తున్న క్రమంలో నర్సింహునిపేటలో ఆర్అండ్బీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనాదారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకాల వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టగా నలుగురూ కిందపడిపోయారు. ఈప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడగా భాస్కర్, నవీన్, మధూకర్కు స్వల్ప గాయాలయాయ్యయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీహనుమాన్ ఆలయం ఎదుట సిరిసిల్ల – వేములవాడ ప్రధాన రహదారిలో గూడ్స్ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు ఒంటెద్దు శేఖర్(21) బుధవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. కామారెడ్డి జిల్లా బస్వాపూర్కు చెందిన శేఖర్ మూడేళ్లుగా నందికమాన్ వద్ద పెట్రోల్బంక్లో పనిచేస్తున్నాడు. అగ్రహారంలో టిఫిన్ కోసం వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో హనుమాన్ ఆలయం ఎదుట ఫ్లిప్కార్డు గూడ్స్ఆటో యూ టర్న్ చేస్తుండగా బైక్ ఢీకొట్టడంతో శేఖర్ అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని ఒకరు..రాయికల్: రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన కన్నవేణి సంజీవ్ (42) బ్లేడ్ ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. సంజీవ్ తన ద్విచక్రవాహనంపై వస్తాపూర్కు వెళ్తుండగా గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్లో జగిత్యాల తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 780 క్వింటాళ్ల బియ్యం స్వాధీనంజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని హనుమాన్సాయి రైస్మిల్లులో మంగళవారం దాడులు చేసిన సివిల్ సప్లయ్, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు సుమారు 780 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యాన్ని బుధవారం మెట్పల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. బియ్యాన్ని నిల్వ చేసిన మిల్లు యజమాని కొండ లక్ష్మణ్తోపాటు 30 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్లో తరలించేందుకు సిద్ధమైన మంచాల అంజయ్యపైన సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ ఉమాపతి ఫిర్యాదు మేరకు 6ఏతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు. అధిక డబ్బుకు ఆశపడి..● రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆన్లైన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న ఘటనపై బుధవారం గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 4న తన సెల్ఫోన్కు టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని వచ్చిన మెస్సేజ్ను నమ్మాడు. మొదట రూ.1,000 పెట్టుబడి పెట్టగా రూ.1,200, రెండోసారి రూ.3,000 గానూ రూ.4,500 వచ్చాయి. ఈ నెల 21న మెస్సేజ్ రావడంతో దశల వారీగా రూ.1,30,880 పెట్టుబడి పెట్టాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో తనకు మెస్సేజ్ పంపిన నంబర్కు ఫోన్ చేయగా, మరో రూ.2 లక్షలు వేస్తే రూ.4 లక్షలు వస్తాయని చెప్పారు. బాధితుడికి అనుమానం వచ్చి 1930కు ఫోన్ చేసి వివరాలు తెలుపగా, సైబర్క్రైం జరిగినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పొలం నుంచి మట్టి వద్దన్నందుకు దాడి
వెల్గటూర్: తన పొలం నుంచి మట్టి తరలింపు వద్దన్నందుకు కర్రలతో దాడి చేసిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా మట్టి తరలించడమే కాకుండా అధికారులకు సమాచారం ఇచ్చాడన్న అనుమానంతో దాడికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వేముల గురువయ్య, అతని కుమారులు మహేశ్, ప్రశాంత్ మంగళవారం పైడిపెల్లి శివారులోని చెరువు నుంచి ఎనగందుల రమేశ్ పొలం మీదుగా జేసీబీ సహాయంతో మట్టిని అక్రమంగా తరలించారు. తన పొలం నుంచి ట్రాక్టర్లు నడిపితే పొలం పాడవుతుందని రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయమై మాట్లాడుదాం రమ్మని రమేశ్ను పిలిచి గురువయ్యతోపాటు ఆయన కుమారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువయ్య, మహేశ్, ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై శ్రీధర్రెడ్డి తెలిపారు. -
కేన్సర్ రాసిన మరణశాసనం
చందుర్తి(వేములవాడ): బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ మరణం తప్పదని మనోవేదనకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం తీరని విషాదం నింపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన కొలుకుల లక్ష్మి (55) కొద్ది రోజులుగా బ్లడ్ కేన్సర్తో బాధపడుతోంది. ఇటీవలే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కీమోథెరపీ చేసేందుకు కూడా శరీరం సహకరించదని వైద్యులు ఇంటికి పంపించారు. అప్పటి నుంచి లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కాగా, మంగళవారం ఓ మహిళ కేన్సర్తో మృతిచెందినట్లు తెలుసుకొని లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం వేకువజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా బయటకు వెళ్లిపోయి గ్రామశివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు దేవేంద్ర, కవిత, కుమారుడు తిరుమల్ ఉన్నారు. కొడుకు గల్ఫ్లో ఉండగా, కోడలు ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వివరించారు. మరణం తప్పదని బావిలో దూకి మహిళ బలవన్మరణం -
అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తేనే కిందకు దిగుత!
కొత్తపల్లి(కరీంనగర్): రోడ్డును కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ సీతారాంపూర్ (21వ డివిజన్) పరిధిలోని టీచర్స్ కాలనీలో బుధవారం వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ని రసన తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. 30 ఏళ్ల క్రితం సీతారాంపూర్లోని 13వ సర్వేనంబర్ భూమిలో 126 ప్లాట్లతో టీచర్స్కాలనీగా లే అవుట్ చేయగా, కాలనీ అధ్యక్షుడి సహకారంతో 128 ప్లాట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి రోడ్డును ఆక్రమించారని ఆరోపించాడు. 2015లో డీపీవోకు ఫి ర్యాదు చేయగా అప్పటి కార్యదర్శిని నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, తర్వాత మున్సిపల్లో విలీనం కావడంతో కమిషనర్కు విన్నవించగా.. అప్పుడు ని ర్మిస్తున్న రేకుల షెడ్డును కూల్చివేసారని పేర్కొన్నా రు. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ అనుమతి ఉందని ని ర్మాణాలు చేపడుతుంటే మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకో కుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, కాలనీలోని పలువురి ఆందోళన చూడలేక ట్యాంక్ ఎక్కానని, టీచర్స్ కాలనీ లే అవుట్ భూములపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకొని, రోడ్డు ఆక్రమణ తొలగించాలని విన్నవించారు. కాగా మున్సిపల్ అధికారులు, పోలీసులు బాధితుడిని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని గంటల పాటు జరిగిన హైడ్రామాకు మున్సిపల్ అధికారుల హామీతో తెరపడింది. -
పారమిత విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్: నగరంలోని జ్యోతినగర్ పారమిత ఎక్స్ఫ్లోరికా ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 6వ తరగతి విద్యార్థులు ఇటీవల ప్రకటించిన కేంబ్రిడ్జ్ ప్రైమరీ చెక్ పాయింట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ప్రైమరీ చెక్ పాయింట్ ఫలితాల్లో అంతర్జాతీయ స్థాయిలో సగటు 33వ స్థానం సాధించారు. విద్యార్థులందరూ ప్రతీ సబ్జెక్టులో 95శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించారని ప్రిన్సిపాల్ శర్మిష్ఠ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా. ప్రసాద్రావు మాట్లాడుతూ, ఈ విజయంతో కరీంనగర్ విద్యార్థుల ప్రతిభ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రశ్శిత, అనూకర్రావు, వినోద్రావు, రమణ, వీయూఎం ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మళ్లీ రోడ్డెక్కిన ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన ఔట్సోర్సింగ్ సిబ్బంది రెండో సారి బుధవారం నిరసనకు దిగారు. విధుల్లోకి తీసుకోవాలన్న గురుకులాల సెక్రటరీ ఉత్తర్వులను సైతం ప్రిన్సిపాల్ బేఖాతర్ చేస్తున్నారని పేర్కొంటూ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి గిరిజన సంఘాల నాయకులు అజ్మీరా తిరుపతినాయక్, అజ్మీరా రాజునాయక్, ప్రభునాయక్, గుగులోత్ సురేష్నాయక్, భూక్య గజన్లాల్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ సస్పెన్షన్కు గురైన ప్రిన్సిపాల్ మంజిత్ కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాస్, అశోక్, జగన్, నిర్మల, సుజాత, బాలు మాట్లాడుతూ.. ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామ్సూరత్యాదవ్ తమను స్కూల్కు రమ్మని చెప్పి తాను రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే పాఠశాల ముందు ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. కొనసాగుతున్న సస్పెండైన ప్రిన్సిపాల్ గురుకులాల సెక్రటరీ ఉత్తర్వులు బేఖాతర్ -
గుప్తనిధులు.. లంకె బిందెలు
● పూజల పేరిట ఘరానా మోసాలు ● రూ.లక్షలు దండుకుంటున్న మోసగాళ్లు ● నమ్మి మోసపోవద్దంటున్న పోలీసులుకరీంనగర్క్రైం: ‘మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయి... పలానా చోట లంకె బిందెలు ఉన్నాయి. వెలికితీస్తే కోటేశ్వరులు అవుతారు. ఇందుకోసం ముందుగా ప్రత్యేక పూజలు చేయాలి. ఆ పూజా సామగ్రికి కొంత ఖర్చవుతుందని మొదటగా మభ్యపెట్టి.. తరువాత రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దొంగబాబాల ముసుగులో గ్రామాల్లో సంచరిస్తూ.. గుప్తనిధులు, లంకెబిందెలు, మంత్రాలు, తాయెత్తులు, వాస్తుదోశాలు, గ్రహపీడ పూజల పేరిట ప్రజలను నట్టేటముంచుతున్నారు. బాధితు ల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి మోసగాళ్లను కటకటాలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. పరిస్థితులను ఆసరా చేసుకుని.. దొంగబాబాలు, స్వామీజీలు అనారోగ్య సమస్యలు, అప్పులు, పరిస్థితి బాగా లేనివారిని లక్ష్యంగా చేసుకుని పరిచయం చేసుకుంటారు. వారి వద్దకు వెళ్లి.. ఇలా జరగడానికి కారణాలు చెబుతూ ప్రత్యేక పూజలు చేస్తే పరిస్థితుల మారి అద్భుతాలు చూస్తారంటూ ఆశ చూపుతారు. ఇటీవల కొత్తపల్లి మండల పరిధికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని, వారి ఇంటి పక్కన క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మించారు. పూజల పేరిట అతని నుంచి విడతల రూ.15 లక్షలకు పైగా వసూలు చేశారు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. గతంలోనూ వీరు జనగామ జిల్లాకు చెందిన ఓ మహిళను పూజల పేరుతో మోసం చేసి రూ.10లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. క్షుద్ర.. గ్రహపూజల పేరుతో కరీంనగర్తో పాటు చుట్టుపక్కల పట్టణాల్లో, గ్రామాల్లో దొంగస్వాములు, బాబాలు చెప్పిన మాటలు వింటూ పూజల పేరిట ఇల్లు గుల్ల చేసుకున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంటివాస్తు, గ్రహచారం బాగోలేదని ప్రత్యేక పూజలు చేయాలంటూ అమాయకుల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. నగరంలో చాలామంది పూజల పేరిట పేరుగాంచారని, వారికి కలిస్తే రూ.లక్షల్లో సమర్పించుకోవాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. పోలీసులు ఇలాంటివారిపై నిఘా పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.పూజలపేరిట మోసంచేస్తే చర్యలు గుప్తనిధులు, మంత్రాలు, పూజల పేరితో అమాయక ప్రజలను మోసంచేస్తే నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలతో అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో స్వామీజీల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించాం. – నిరంజన్రెడ్డి, కరీంనగర్ రూరల్ సీఐ -
మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ?
వేములవాడ: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలిసింది. ఈమేరకు పట్టణంలోని బైపాస్రోడ్డులో గల రమేశ్బాబు నివాసానికి బుధవారం నోటీసు అంటించడంతోపాటు ఆయన అడ్రస్పై రిజిస్టర్డ్ పోస్టు చేసినట్లు సమాచారం. రమేశ్బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటర్ జాబితా నుంచి ఫామ్–7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీచేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు. సురక్షితంగా గమ్యం చేర్చాలివిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో 35 మంది డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి బుధవారం వివిధ డిపోలకు కేటాయించినట్లు రీజనల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. మద్యం, సెల్ఫోన్ డ్రైవింగ్కు దూరంగా ఉండి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, పర్సనల్ ఇన్చార్జి ఆఫీసర్ బి.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కపిల్ విద్యావారధికి స్పందనజమ్మికుంటరూరల్(హుజూరాబాద్): మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024–25 సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని గిరవేన స్పందన ఉత్తమ మార్కులతో మండల టాపర్గా ర్యాంకు సాధించింది. ఇటీవల కపిల్ చిట్ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించి కపిల్ విద్యావారధికి ఎంపికై ంది. విద్యార్థిని ఎంత వరకు చదివితే ఆ కోర్సులకు సంబంధించిన ఫీజులు మొత్తం కపిల్ చిట్ఫండ్సంస్థ చెల్లిస్తుంది. ఈ సందర్భంగా ఎంఈవో హేమలత, హెచ్ఎం సమ్మయ్య, అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ బండారి రజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఖాతాదారుల సొమ్ము స్వాహా.. చందుర్తి(వేములవాడ): పోస్టాఫీస్లో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన పోస్ట్మాస్టర్ను పోలీసులు అ రెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించా రు. చందుర్తి మండలం మల్యాల తపాలాశాఖ కా ర్యాలయంలో అసిస్టెంట్ పోస్ట్మాస్టర్గా పని చేస్తు న్న ఎండీ షరీఫ్ ఖాతాదారుల సొమ్ము రూ.50,600 స్వాహా చేశాడని జగిత్యాల వెస్ట్ సబ్డివిజన్ తపాలాశాఖ అధికారి ఎండీ సఫీయొద్దీన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఖాతానంబర్ల ఆధారంగా విచారణ చేపట్టి రూ.50,600 పక్కదారి పట్టినట్లు గుర్తించారు. షరీఫ్ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. సమావేశంలో చందుర్తి ఎస్సై రమేశ్, కానిస్టేబుల్స్ చైతన్య, కిషన్ ఉన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో నాల్గో తరగతిలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంపిక పోటీల్లో భాగంగా బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మొదలయ్యాయి. పోటీలను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్కు క్రీడాపాఠశాలలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. జిల్లాలోని 16 మండలాల నుంచి సుమారు 70 మంది విద్యార్థులు హాజరయ్యారని, పోటీలకు హాజరైన విద్యార్థుల ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లై?్యంగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, షటిల్ రన్, మెడిసన్ బాల్త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు నిర్వహించారు. ఎంపిక పోటీల్లో ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, మండల కార్యదర్శులు అంతటి శంకరయ్య, గిన్నె లక్ష్మణ్, బాబు శ్రీనివాస్, రొండి నర్సయ్య, బాబు శ్రీనివాస్, కొమురోజు కృష్ణ, కనకం సమ్మయ్య, దత్తాత్రి, సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఆడేపు శ్రీనివాస్, కోచ్లు కిష్టయ్య, పవన్, సాయిరాం, మల్లిక, శ్యామ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సారూ మాకేది రుణమాఫీ
మల్లాపూర్(కోరుట్ల): ‘అయ్యా సీఎం సారు.. మాకేది రుణమాఫీ.. కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం పాపం చేశాం..’ అంటూ రుణమాఫీ కాని రైతులు తమ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో బుధవారం జరిగింది. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ, రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఒక్క మొగిలిపేటలోనే 276మంది రైతులకు మాఫీ వర్తించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ గోడును ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వీరికి మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు సంఘీభావం ప్రకటించారు. రుణమాఫీ కాని రైతులు పార్టీలకతీతంగా ఉద్యమించేందుకు ముందుకు రావాలన్నారు. మూడునెలల క్రితం రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి ప్రజావాణిలో అర్జీలు సమర్పించామని, అయినా రైతులకు న్యాయం జరగకపోవడం శోచనీయమన్నారు. ప్యాక్స్ వైస్ చైర్మన్ దూలురి సుధాకర్రెడ్డి, నాయకులు దండవేని వెంకట్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
పనితీరు మార్చుకోవాలి
● పారిశుధ్యంలో మార్పు రావాలి ● అక్రమ నిర్మాణాలు అరికట్టాలి ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రత్యేకాధికారిగా నేను మొదట్లో చెప్పిన ఆదేశాలను ఇప్పటివరకు పట్టించుకున్నట్లు లేరు. గతంలో ఇచ్చిన టాస్క్లు ఏవీ పూర్తి చేయలేదు. పనితీరు మార్చుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు’.. అంటూ కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి అధికారులను హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాలకు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలైనట్లుగా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సెక్షన్లవారీగా పరిష్కరించాలని, ప్రజావాణిలో టౌన్ప్లానింగ్లోని అన్నిస్థాయిల అధికారులు పాల్గొనాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, కోర్టు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. పారిశుధ్యంలో మార్పులు తీసుకురావాలని, డీ సిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గార్బెజ్ పాయింట్లను, ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నగరవ్యాప్తంగా వీధిదీపాలు వెలిగేలా చూడాలన్నారు. రెవెన్యూ అధికారులు పెండింగ్లో ఉన్న 9500 ట్రేడ్ లైసెన్స్లను నెలరోజుల్లో పూర్తి చేయాలన్నారు. విలీన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ మ్యుటేషన్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ప్రకటనలపై పన్నులను వసూలు చేయాలని అన్నారు. రోడ్లపైకి నిర్మాణాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మోహియొద్దిన్, ఈఈలు సంజీవ్, యాదగిరి పాల్గొన్నారు. -
కరీంనగర్లో మినీ డంప్యార్డులు
కరీంనగర్లోని వివిధ కాలనీల్లోని ఖాళీ స్థలాలు మినీ డంప్యార్డ్లను తలపిస్తున్నాయి. రోడ్లవెంట చెత్తకుప్పలు గుట్టలుగా పేరు కుపోయాయి. వీధులు, పరిసరాల్లో చెత్తాచెదారం కనిపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో జనావాసాల నడుమ మురికికూపాలు ఏర్పడుతున్నాయి. స్వచ్ఛ ఆటోలు, డంపర్బిన్లు ఉన్నప్పటికీ.. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కార్మికుల్లో పట్టింపు లేకుండా పోయింది. తమకు కేటాయించిన డివిజన్లలో పారిశుధ్య పనులు చేపట్టాల్సిన కార్మికులు, హాజరు తరువాత కనిపించకుండా పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వాళ్లకు జరిమానా విధిస్తున్నాం’. అని బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వివరించారు. -
వర్షాకాలం.. వ్యాధుల భయం
● జిల్లాలోని పట్టణాల్లో మినీ డంప్యార్డులను తలపిస్తున్న ఓపెన్ప్లాట్లు ● కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ● స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు ● విజృంభిస్తున్న దోమలు ● పొంచి ఉన్న సీజనల్ వ్యాధులుకరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్టౌన్/జమ్మికుంట/చొప్పదండి: వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పు, పారిశుధ్యం, ఆహారం, తదితర కారణాలతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద పెరుగుతోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు పెరిగితే సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, విషజ్వరాలు, డయేరియా ప్రబలే ప్రమాదం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిస్తుంటాయి. ప్రజలు ఈ విషయమై ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు మినీ డంప్యార్డులను తలపిస్తున్నాయి. మున్సిపల్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయా పట్టణ ప్రజలు కోరుతున్నారు.కరీంనగర్లోని హుస్సేనిపుర 9వ వీధిలో పరిస్థితి ఇది. అర్బన్ హెల్త్ సెంటర్కు సమీపంలో ఉన్న ఈ వీధిలోని ఓ ఖాళీ స్థలంలో చెత్తచెదారం వేస్తుండడంతో మినీ డంప్యార్డ్లా మారింది. ముళ్లచెట్లు, పొదలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడే ప్లాస్టిక్కవర్లు, చెత్తాచెదారం పడేస్తున్నారు. రోజుల తరబడి చెత్తాచెదారం అలానే ఉండడంతో ఈ ప్రాంత వాసులు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.ఇది జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు వీరు. ప్రస్తుతం ఓపీ, ఐపీ కేసులు మామూలుగానే ఉన్నాయి. ఇంకా సీజనల్ వ్యాధులు ప్రారంభం కాకపోవడంతో జ్వర బాధితులు పెద్దగా ఆసుపత్రికి రావడం లేదు. గత జ్వరాల సీజన్లో 1000కి పైగా ఓపీ కేసులు, ప్రతిరోజు 150కి పైగా ఐపీ కేసులు ఉండేవి. ప్రస్తుతం ఓపీ 450, ఐపీ 50కి మించడం లేదు. -
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
కరీంనగర్టౌన్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేని రోజు 1975 జూన్ 25 అని, అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందని, ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాటు దేశ ప్రజలకు శాపమైందని మహా రాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. జిల్లా బీజేపీశాఖ ఆధ్వర్యంలో బుధవా రం స్థానిక ఈఎన్ గార్డెన్స్లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హా జరైన ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ అంటే నిర్బంధపు పిడికిలిలో కొన్ని తరాలవరకూ విని పించే మనోరోదన ఉందని తెలిపారు. ప్రధానంగా ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిరా స ర్కారు, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఉక్కుపాదం మోపారని అన్నారు. బీజేపీ నాయకులు కొప్పు భాష, వై.సునీల్ రావు, డి.శంకర్, బాస సత్యనారాయణ, కన్నెబోయిన ఓదెలు, గుగ్గిలపు రమేశ్, ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్రావు,తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. సోమయ్యను పరామర్శించిన సాగర్జీఎమర్జెన్సీలో విద్యాసాగర్రావుతో పాటు జైలుకు వెళ్లిన సోమయ్యను నగరంలోని మెహెర్నగర్లోని తన ఇంటికి వెళ్లి సాగర్జీ పరామర్శించారు. విద్యాసాగర్రావు రచించిన ‘ఉనికి’ అనే పుస్తకాన్ని సోమయ్యకు బహుకరించారు. అధికారం కోసం ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు -
● రేషన్ పంపిణీకి మరో నాలుగు రోజులే సమయం ● జిల్లావ్యాప్తంగా అందించింది 80శాతమే ● అక్కడక్కడా స్టాక్ కొరత.. దుకాణాల మూసివేత
కరీంనగర్ అర్బన్: రేషన్ పంపిణీ గడువు పెంపు ఉన్నట్టా.. లేనట్టా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరు వరకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలుండగా ఇంకా బియ్యం రవాణా జరుగుతోంది. చాలామంది కార్డుదారులకు బియ్యం అందకపోగా పడిగాపులు అనివార్యమయ్యాయి. ఒకటో తేదీన పంపిణీ కావాల్సిన బియ్యం ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులు నానాపాట్లు పడుతున్నారు. యూనిట్కు 18 కిలోలు కావడం.. మూవ్మెంట్ సకాలంలో జరిగినా రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో మళ్లీ మళ్లీ మూవ్మెంట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ రేషన్ దుకాణాలకు బియ్యం చేర్చుతుండగా పంపిణీ గడువు తేదీ మరో నాలుగు రోజులే ఉంది. పెంపు ఉంటుందా.. ఉండదా అన్నది స్పష్టత లేదు. జిల్లాలో 2.90 లక్షల కార్డుదారులుండగా ఇప్పటివరకు 80శాతం వరకు పంపిణీ అయినట్లు సమాచారం. ఒక్కో దుకాణంలో పావు వంతుకు పైగా రేషన్ తీసుకోని కార్డుదారులున్నారని సమాచారం. కిక్కిరిసిపోతున్న రేషన్ దుకాణాలు.. జిల్లాలో 2.90 లక్షల కార్డుదారులుండగా 8 లక్షలకు పైగా యూనిట్లున్నాయి. అత్యధికంగా కరీంనగర్ పాయింట్ నుంచి 278 దుకాణాలుండగా మిగతా దుకాణాలు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి పరిధిలో ఉన్నాయి. జిల్లామొత్తంగా 200కు పైగా రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం రాకపోవడం గమనార్హం. హుజూరాబాద్, చిగురుమామిడి, గన్నేరువరం, చొప్పదండి, రామడుగు, గంగాధర, సైదాపూర్ ప్రాంతాల్లోని అత్యధిక దుకాణాలు బియ్యం కోసం నిరీక్షిస్తున్నాయి. ఎంఎల్ఎస్ సామర్థ్యాన్ని బట్టి లారీలు లేకపోవడం మూవ్మెంట్ ఆలస్యానికి కారణం. ఒక్కోలారీలో వాటి మోడల్ను బట్టి 155 నుంచి 300 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నారు. గడువు పెంపు ఉంటుందా? ప్రతీనెలా ఒకటి నుంచి 15 వరకు రేషన్ పంపిణీ చేస్తుంటారు. ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండగా ఒక్కో కార్డుదారుకు సుమారు 20–30 నిమిషాలు పడుతోంది. ఈ లెక్కన రోజుకు 25 నుంచి 30 మందికి మాత్రమే పంపిణీ జరుగుతోంది. ఇక సిగ్నల్ సమస్య ఉంటే మరింత సంఖ్య తగ్గుతోంది. మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో జూలై మొదటివారం వరకు గడువు పొడిగిస్తేనే పంపిణీ పూర్తయ్యే అవకాశఽముంది. ఎలాగూ జూలై, ఆగష్టు నెలలో రేషన్ పంపిణీ ఉండదు. ఇక ఒక్కోకార్డుదారు అరక్వింటాల్ నుంచి క్వింటాల్ వరకు బియ్యం తీసుకుంటున్నారు. దీంతో సదరు బియ్యాన్ని రవాణా చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులుబియ్యం పంపిణీ తీరిలా ప్రతి నెలా కేటాయించే బియ్యం: 52,768 క్వింటాళ్లు మూడు నెలలకు కేటాయించిన బియ్యం: 1,58,304 క్వింటాళ్లు ఇప్పటివరకు పంపిణీ చేసిన బియ్యం: 1.15 లక్షల క్వింటాళ్లు (సుమారు) జిల్లాలో గ్రామాలు: 313మొత్తం జనాభా: 10,09,234రేషన్ కార్డులు: 2,90,399యూనిట్లు: 8,79,472రేషన్ దుకాణాలు: 566 -
చినుకు రాలక.. మొలక రాక
చిగురుమామిడి: కార్తెలు కరుగుతున్నా.. చినుకు రాలడం లేదు. కాలం గడుస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. ముందస్తు వర్షాలతో సంబరపడ్డ రైతులను మొగులు వెక్కిరిస్తోంది. వేసిన విత్తనం భూమిలోనే మాడిపోతోంది. రైతులు విత్తనాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిగురుమామిడి మండలంలో రోహిణికార్తెకు ముందే పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. అప్పుడు కురిసిన తేలికపాటి వర్షాలకు 50శాతం వరకు విత్తనాలు మొలకెత్తాయి. కొద్దిరోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు, మొలకలు మాడిపోతున్నాయి. మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, కొండాపూర్, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, చిగురుమామిడి, ఓగులాపూర్, పీచుపల్లితో పాటు పలు గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదు. పంటను కాపాడుకునేందుకు కొన్ని గ్రామాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని గ్రామాల్లో కూలీల సహాయంతో నీరు అందిస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో స్ప్రింక్లర్ల సాయంతో నీటితడులు పెడుతున్నారు. -
జింక్ కార్నర్ ప్రారంభం
కరీంనగర్టౌన్: స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ఓఆర్ఎస్, జింక్ కార్నర్ను డీఎంహెచ్వో వెంకటరమణ ప్రారంభించారు. చిన్నపిల్లల వార్డును పరిశీలించి పిల్లల అనారోగ్య సమస్యలను తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్సలపై ఆ రా తీశారు. ఆర్బీఎస్కే కార్యక్రమంలో నడుస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో పోషకాహార పునరావాసకేంద్రాన్ని సందర్శించి, సిబ్బంది హాజ రు పట్టిక, రికార్డులను పరిశీలించారు. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, పిల్లల వైద్యులు కల్యాణి, పవిత్ర, సరస్వతి పాల్గొన్నారు. ‘ఎమ్మెల్యే గంగులను విమర్శిస్తే సహించం’ కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను విమర్శించే నైతిక అర్హత మాజీ మేయర్ సునీల్రావుకు లేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం మీసేవ కార్యాలయంలో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ పదవులు పొంది అక్రమ సంపాదన, అడ్డగోలు అవినీతికి పాల్పడిన సునీల్రావుకు బీఆర్ఎస్ను, గంగులను విమర్శించే అర్హత లేదన్నారు. మేయర్గా ఉన్నన్ని రోజులు కేంద్ర మంత్రి బండి సంజయ్పై అనేక విమర్శలు చేసిన సునీల్రావు నేడు పొగుడుతుండడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకేనని ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు కార్పొరేటర్గా కమలాకర్ ప్రజల మన్ననలు పొంది వేల కోట్ల నిధులతో కరీంనగర్ రూపురేఖలను మార్చారన్నారు. దరఖాస్తులు ఆహ్వానం కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాల కరీంనగర్ బాయ్స్–3లో జూనియర్ లెక్చరర్, ఎలక్ట్రికల్ టెక్నిషియన్–2, చొప్పదండి గర్ల్స్–1లో పీజీటీ ఉర్దూ–1(మహిళ అభ్యర్థుల)ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జి ల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అభ్యర్థికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ అర్హత ఉండాలని, ఎలక్ట్రికల్లో ఏఎంఐఈ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా గుర్తింపు పొందిన అర్హ త ఉండాలని, పీజీటీ ఉర్దూ కోరకు సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉన్న మహిళా అభ్యర్థులు బీఈ డీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా మైనారిటీస్ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని పేర్కొన్నారు. వివరాలకు 08782957085 నంబర్ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ అభివృద్ధి పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్, విద్యారణ్యపురి, మాణికేశ్వర్నగర్, హుస్సేనిపుర, నాకా చౌరస్తా, గాంధీచౌరస్తా, డీసీఎంఎస్, సాహెత్పురా ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివా స్గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటల వరకు రేకుర్తి ఫీడర్ పరిధిలోని రేకుర్తి, రేకుర్తి పాతవాడ, సాసలెహ్నగర్, విజయపురికాలనీలో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు. -
పిల్లలు..‘యోగా’ విద్యలో పిడుగులు
● రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ సిరిసిల్లకల్చరల్: ప్రపంచానికి సనాతన భారతదేశం అందించిన అపురూప విద్య యోగాభ్యాసం. మనసును, శరీరాన్ని ఏకం చేసిన ఈ విద్యా విధానం ఇప్పుడు ప్రపంచదేశాల ప్రజలను ఏకం చేసింది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చేస్తూ దేహదారుఢ్యాన్ని అందించే యోగా విద్యను ప్రస్తుతం పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా సాధన చేస్తూ తమ ప్రతిభను పలు వేదికలపై చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వారిలో కొందరి సంక్షిప్త పరిచయం..ఐదు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించింది. పంజాబ్, హర్యానాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొనడం తనకు ఎక్కడాలేని ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించింది అని చెప్తోంది. యోగాపై ఏర్పడిన ఆసక్తితో తిరుపతిలో బీఎస్సీ యోగా సైన్స్ అధ్యయనం చేస్తోంది. నుదుటిపై దీపం ధరించి యోగాసనాలు వేయగలిగిన దేశంలోని ముగ్గురిలో ఒకరు సృజన. దీంతో రాష్ట్ర స్థాయిలో మంచి ఖ్యాతి దక్కించుకుంది. యోగా సాధనతో ఏర్పడిన శరీర దారుఢ్యంతో సైన్యంలో చేరాలనేది తన దీర్ఘకాల కోరిక. అస్సాం, మహారాష్ట్రలో జరిగిన రెండు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్నాడు. బంగారు పతకం సాధించి అప్పటి కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్చే ప్రత్యేకంగా సత్కరించబడ్డాడు. మారుమూల పల్లెటూరి నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించడంతో సొంతూరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యవసాయ విద్యను అధ్యయనం చేసి సాగులో తన ఊరి రైతులకు ఉపయోగపడాలనుకుంటున్నాడు. అలాగే యోగాను విస్తృతం చేసి అందరి ఆరోగ్యం మెరుగుపడడంలో తన పాత్ర పోషిస్తానంటున్నాడు.సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చదువుతున్న స్వర్గం విష్ణుప్రసాద్ మూడో తరగతి నుంచే యోగా సాధనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికీ జిల్లా స్థాయిలో 20 చోట్ల పాల్గొని 18 విజయాలు అందుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో మరో 20 సార్లు పోటీ పడి 8 సార్లు విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రశంసలు అందుకున్నాడు. పంజాబ్, రాజస్థాన్లో జరిగిన పోటీల్లో నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నాడు. వెల్దండి సృజన బీఎస్సీ యోగా స్వర్గం విష్ణుప్రసాద్ పసుల ప్రణయ్, బస్వాపూర్ -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
చొప్పదండి: ఈ నెల 25 నుంచి ఉత్తరాంచల్లోని హరిద్వార్లో జరుగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని ఏ.సౌమ్య ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ కొమురోజు కృష్ణ తెలిపారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున 42కేజీల వ్యక్తిగత కేటగిరీలో పాల్గొని ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించగా జాతీయస్థాయికి ఎంపికై ందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్యుల రాజిరెడ్డి, జిల్లా తైక్వాండో అసోషియేషన్ కార్యదర్శి శ్రీగాధ సంతోష్ అభినందించారు. ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలికరీంనగర్: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ బంజారాహిల్స్ హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ (సీఎస్ఏటీ–2025–26)కు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వ కృషి అభినందనీయంకొత్తపల్లి(కరీంనగర్): వి ద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి హర్షనీయమని అల్ఫో ర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల, శాతవాహన విశ్వవిద్యాలయంలో లా కోర్సును ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్రెడ్డి, అందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కట్టుబడటం అభినంనీయమన్నారు. -
నన్ను క్షమించండి.. నాదే తప్పు!
● నా చావుకు ఎవరూ బాధ్యులు కారు ● వేములవాడలో వివాహిత ఆత్మహత్య వేములవాడ: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నన్ను క్షమించండి.. నాదే తప్పు.. ఏమండీ మీరు నన్ను క్షమించండి.. మీ అమ్మడు మంజు’ అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వేములవాడలో చర్చనీయాంశమైంది. స్థానికుల తెలిపిన వివరాలు.. పట్టణంలోని గాంధీనగర్లో గంప మంజుల (58) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త ప్రసాద్, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులకు వివాహాలు జరిగాయి. వృత్తిరీత్యా ఒకరు కరీంనగర్, మరొకరు హైదరాబాదులో ఉంటుండగా ప్రసాద్– మంజుల దంపతులు మాత్రమే వేములవాడలో ఉంటున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారు, తప్పంతా నాదే, ఏమండీ నన్ను క్షమించండి అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. మంగళవారం పోలీసుల శవపంచనామ అనంతరం పోస్టుమార్టం నిర్వహించి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. -
రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడులు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని హనుమాన్సాయి రైస్మిల్లుపై మంగళవారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రిటైర్డ్ ఓఎస్డీ అంజయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మిల్లులో నిల్వ ఉంచిన సుమారు 400 క్వింటాళ్ల అనుమానిత రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకు అన్ని అనుమతులున్నాయంటూ మిల్లు యజమాని ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లై గోదాంకు తరలించారు. దాడుల్లో డీఎస్వో జితేందర్రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ వసంతకుమార్, అసిస్టెంట్ డీఎం శ్రీననాయక్, డీటీలు ఉమాపతి, విష్ణు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వామి, రాజేందర్రావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
అధికారుల దృష్టికి రైల్వే సమస్యలు
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్ నిలయంలో మంగళవారం డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్యూసీసీ) ప్రతినిధులో డీఆర్ఎం, డీఆర్యూసీసీ చైర్మన్ భరతేష్కుమార్జైన్ సమావేశం నిర్వహించారు. రామగుండం నుంచి డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ హాజరై పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నాగపూర్–కాజీపేట ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 27వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు సమాధానమిచ్చారు. రైలు నంబరు 17035/36 అజ్నీ– కాజీపేట (కాజీపేట–బల్హర్షా ఎక్స్ప్రెస్) రైలు సమయం మార్చి భద్రాచలం లేదంటే సికింద్రాబాద్ వరకు పొడిగించాలని, చైన్నె–అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చైన్నె–జైపూర్ రైలుకు రామగుండంలో హాల్టింగ్ కల్పించాలని, ఎల్సీ నంరు 49 రామగుండం–రాఘవపూర్ స్టేషన్ల మధ్య కుందనపల్లి వద్ద మూడు రైల్వేగేట్ల వద్ద వంతెన నిర్మించాలని కోరారు. అధికారులు సమాధానమిస్తూ, వంతెన నిర్మాణ ప్రక్రియ టెండరు ప్రక్రియలో ఉందన్నారు. డీఆర్యూసీసీ కార్యదర్శి, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సఫాలీ, ఏడీఆర్ఎం గోపాలకృష్ణ తదితరులున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● కిలో వెండి.. రూ.30 వేల నగదు అపహరణ రత్నాపూర్లో..మల్లాపూర్: మల్లాపూర్ మండలం రత్నాపూర్కు చెందిన పిప్పెర రమేశ్ ఇంట్లో చొరబడిన దొంగలు రెండు తులాల బంగారం, రూ.13,000 ఎత్తుకెళ్లినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉద్యోగి రీత్యా బెంగళూర్ వెళ్లగా దొంగలు చొరబడ్డారు. మంథని: వరుస దొంగతనాలు పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళ పోలీసుల గస్తీ ఉన్నా దొంగతనాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం ధర్మారం గ్రామంలో కందుకూరి లక్ష్మికి చెందిన రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే మంథనిలో మంగళవారం మరోచోరీ వెలుగుచూసింది. దొంతులవాడకు చెందిన ఐరన్ హార్డ్వేర్ వ్యాపారి ఇల్లందుల వెంకటేశ్వర్లు తన కుమారుడిని కళాశాలలో చేర్పించేందుకు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసిన అతడి భార్య స్థానికంగానే బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి ఊరునుంచి తిరిగివచ్చిన వెంకటేశ్వర్లు.. ఇంట్లోకి వెళ్లి చూడగా గదుల తలుపులు తెరిచి ఉన్నాయి. ప్రధాన గదికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. బీరువాలు తెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగినట్లుగా నిర్ధారించుకున్నాక బీరువాలో పరిశీలించగా రూ.30 వేల నగదు, పూజాగదిలోని సుమారు కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. అలాగే టీవీ, ల్యాప్ట్యాప్, ట్యాబ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. తులసీగద్దె సమీపంలోని ఇనుప గడ్డపారను తీసుకెళ్లి తాళాలు పగుల గొట్టినట్లు తెలుస్తోంది. బురదతో నడిచిన కాలిముద్రలు కనిపించాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్ల్యూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారంటే దొంగలముఠా సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సీసీలపై చర్యలేవి?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్లో సంచలనం రేపుతోన్న సీసీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరిపై ఎన్ని కథనాలు.. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కలెక్టరేట్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. దీంతో నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో సీసీల కారణంగా పరిపాలన పక్కదారి పడుతున్న విషయాన్ని కలెక్టర్ కార్యాలయం గుర్తించని వైనంపై ఆవేదన వ్యక్తంచేస్తూ డీవోపీటీని సంప్రదించారు. కలెక్టర్ కార్యాలయం స్పందించకుంటే.. తాను లోకాయుక్తను సైతం ఆశ్రయించేందుకు సిద్ధమేనని ‘సాక్షి’కి స్పష్టంచేశారు. ఇదే సమయంలో కలెక్టరేట్లో సీసీల వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు ‘ఎక్స్’ వేదికగా ఇది వరకే ఫిర్యాదు వెళ్లింది. మరోవై పు సీసీలు లోలోన హైరానా పడుతున్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొద్దునిద్రలో కలెక్టరేట్.. సీసీల వ్యవహారంపై ఇంత చర్చ నడుస్తున్నా.. దశాబ్దాలుగా పాతుకుపోయిన సీసీలను తప్పించేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది అంతుచిక్కడం లేదు. ఇదే విషయమై వివరణ కోరేందుకు కలెక్టర్ పమేలా సత్పతిని ఫోన్లో సంప్రదించగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. మీడియా కథనాలపై సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టరేట్లు వెంటనే స్పందిస్తాయి. సంబంధిత అధి కారులు, విభాగాలపై కొరడా ఝుళిపిస్తాయి. కానీ.. కరీంనగర్లో ఇవేమీ ఉండవంటే అతిశయోక్తి కాదు. పలు విభాగాల్లో అవినీతి అంటూ వార్తలు వచ్చినా.. క్రమశిక్షణ చర్యల కింద కనీసం ఇంతవరకూ ఎవరినీ సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. ఇటీవల మయన్మార్లో సైబర్ ముఠా చేతిలో చిక్కుకు న్న భారతీయుల స్థితిగతులపై ‘సాక్షి’లో వార్తలు రాగానే.. కేంద్రం స్పందించింది. మిలటరీ ఆపరేష న్ నిర్వహించి మరీ భారతీయులను కాపాడింది. ప్రత్యేకంగా రెండు విమానాలు పంపి వారిని స్వదేశానికి తీసుకువచ్చింది. గతంలోనూ కంబోడియాలో చిక్కుకున్న వారిని ఇలాగే మీడియా కథనాల ద్వారా తెలుసుకుని కేంద్రమే కాపాడింది. ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్లు, హైదరాబాద్లోని సచివాల యం, సీఎం కార్యాలయం, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు, అవినీతి వ్యవహా రాలపై వెంటనే స్పందిస్తున్నాయి. కానీ..కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఇందుకు మినహాయింపు అన్న విమర్శలను మూటగట్టుకుంటుంది.కదలరు.. వదలరు వారి అక్రమాలపై డీవోపీటీ, బండి సంజయ్కు ఫిర్యాదుల వెల్లువ ప్రజావాణిలో తమపై ఫిర్యాదుతో మల్లగుల్లాలు ఏసీబీ, ఇంటెలిజెన్స్లోనూ సీసీల మనుషులు సమస్యలపై వెంటనే స్పందిస్తున్న సచివాలయం, ఇతర జిల్లాలు, కేంద్రం కానీ.. మొద్దునిద్రలో కరీంనగర్ కలెక్టరేట్ఏసీబీ, ఇంటెలిజెన్స్లోనూ సీసీల మనుషులే.. కారుణ్య నియామకం ద్వారా సీసీలుగా చేరిన వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. దశాబ్దాలుగా అక్కడే పాతుకపోయి.. బదిలీ అంటే కరీంనగర్ కలెక్టరేట్లో సెక్షన్ మారడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా వీరికి అనుకూలంగా వ్యహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. ఇప్పటివరకూ వీరిపై ఏ చర్యలు తీసుకోకపోవడంపై జిల్లాపౌరులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఈ సీసీలు కేవలం కలెక్టరేట్ వ్యవహారాలకే పరిమితం కాలేదు. తమపై ప్రభుత్వానికి ఏ నివేదిక వెళ్తుందో తెలుసుకునేందుకు ఏసీబీ, ఇంటెలిజెన్స్లోనూ కొందరిని తమకు అనుకూలంగా మార్చుకున్నారంటే వీరి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా ఏ విభాగం నుంచి వీరికి, వీరి అనుచరులకు ప్రతికూల నివేదికలు, ఫిర్యాదులు వచ్చినా..వాటిని కలెక్టర్ల కంట పడకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అక్రమ వ్యాపారమైనా... విద్య, వైద్యం, వాణిజ్యం, టెండర్లు ఇలా విషయం ఏదైనా ‘సీసీ ఆశీస్సులు ఉంటే చాలు పనవుద్ది’ అన్న ధీమా అక్రమార్కుల్లో పెరిగిపోవడానికి కారణం వీరి అండదండలే. -
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు
వన సంపద కరువై పర్యావరణం ప్రమాదంలో పడుతుండగా దుకాణదారుల వికృత చేష్టలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలను నాటిస్తుండగా దుకాణాల పేర్లు కనిపించడం లేదని, గిరాకీ దెబ్బతింటుందని కొందరు వ్యాపారులు పచ్చని చెట్లను నరికేస్తున్నారు. నగరంలోని కలెక్టరేట్ దారితో పాటు మంకమ్మతోట, భగత్నగర్, కట్టరాంపూర్ తదితర దారుల్లో ఇదే పరిస్థితి. బల్దియా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సిటీ ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
ఇక ఫేస్ రికగ్నేషన్
● మండల పరిషత్ ఉద్యోగులకు అమలు ● త్వరలో ప్రారంభించేందుకు చర్యలు కరీంనగర్రూరల్: మండల, జిల్లా పరిషత్తు అధికారులకు ఇకనుంచి ముఖగుర్తింపుతోనే హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిసంస్థ డైరెక్టర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16నుంచి అన్ని మండల, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరును అమలు చేయాలని ఆదేశించారు. గతంలో ఆయా కార్యాలయాల్లో వేలిముద్ర హాజరు విధానం అమలులో ఉండగా పరికరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో మూలనపడింది. ప్రస్తుతం ఆఫ్లైన్ విధానంలో ఉద్యోగులు హాజరు రిజిస్టర్లో పేర్లు రాస్తుండగా కొందరు విధులకు ఆలస్యంగా వచ్చినప్పటికి సమయానికి వచ్చినట్లుగా హాజరు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని 15 మండల, ఒక జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తప్పనిసరిగా ముఖగుర్తింపుతోనే హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో సేవలు ముఖహాజరు విధానంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలవుతాయి. పథకాల అమలులో మండలస్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. గతేడాదితో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. మండలస్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, సూపరింటెండెంట్, పీఆర్,హౌజింగ్బోర్డు ఏఈలు, ఈజీఎస్ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులు సేవలందిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుండటంతో సమయపాలన పాటించకపోవడంతో సకాలంలో ప్రజలకు సేవలందడంలేదు. ముఖగుర్తింపు హాజరుతో ఉద్యోగులు సమయపాలన పాటించడంతో అర్హులందరు సంక్షేమ పథకాలను సకాలంలో అవకాశముంది. ఉద్యోగుల వివరాల సేకరణ ముఖగుర్తింపు హాజరు విధానంకోసం మండల, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ముఖగుర్తింపు పరికరంలో ఉద్యోగులు రెండుపర్యాయాలు హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఉదయం కార్యాలయానికి వచ్చినపుడు, తిరిగి సమయం ముగియగానే ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి హాజరు నమోదు చేయాల్సి ఉంది. హాజరు యంత్రానికి జీపీఎస్ను లింక్చేయడంతో ఉద్యోగుల నమోదైన రోజువారీ హాజరు నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల వివరాలను మాత్రమే సేకరిస్తున్నామని, ఇంకా హాజరు యంత్రాలు కార్యాలయాలకు రాలేదని మండల, జెడ్పీ అధికారులు తెలిపారు. -
రైతు వేదికలకు డబ్బులు
● విడుదల చేసిన వ్యవసాయ శాఖసాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు వి డుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా ప్రారంభం, ముగింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవోలకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రైతులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖర్చులను భరించడం వంటి పనులు ఏఈవోలే చూసుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రావా?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈవోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కరీంనగర్క్రైం: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ మంగళవారం నగరంలోని స్వధార్ హోమ్, శిశుగృహ, బాలసదన్ను సందర్శించారు. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు లోను కావద్దన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఎలాంటి న్యాయపరమైన సేవలు అవసరమైనా సంప్రదించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్వధార్హోమ్లో పండ్లు పంపిణీ చేశారు. లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపుఇల్లందకుంట: ఇల్లందకుంట జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించారు. ఈ నెల 24న ‘మధ్యాహ్న భోజనం నాసిరకం’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి తహసీల్దార్ రాణి స్పందించారు. మంగళవారం జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. గతంలోనూ ఇలాంటి ఘటనపై మధ్యాహ్న భోజన కార్మికులను హెచ్చరించినా.. తీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి, కొత్తవారిని నియమించాలని ఎంఈవో రాములునాయక్కు సూచించారు. అంతకుముందు సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు రాము, రత్నాకర్, విద్యార్థి సంఘం నాయకులు అనిల్, కౌశిక్ పాఠశాలను సందర్శించారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బాధ్యతగా విధులు నిర్వహించాలిజమ్మికుంట: పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలోని టౌన్ పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఏసీపీ మాధవి, టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సోలార్ సిస్టంతో ఏర్పాటు చేసిన 14సీసీ కెమెరాలు ప్రారంభించారు. రికార్డులు, సీసీటీఎన్ఎస్, కేసుల వివరాలను పరిశీలించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలిహుజూరాబాద్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లను సందర్శించారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, పి.వెంకట్ ఉన్నారు.పునర్విభజన జీవో జారీ● సోషల్ మీడియాలో చక్కర్లుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 66 డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నగరంలోని 60 డివిజన్లను 66కు పెంచడంతో చేపట్టిన పునర్విభజన ప్రక్రియ ఈ నెల 21వ తేదీతో ముగియడం తెలిసిందే. అదేరోజు ఫైనల్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉండగా జాప్యం చోటుచేసుకుంది. నోటిఫికేషన్పై మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 144, తేదీ 21, 06, 2025 ఉత్తర్వు ప్రతి మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాని జీవో ప్రతితో పాటు రావాల్సిన 66 డివిజన్ల వివరాలు లేకపోవడం అయోమయానికి దారితీసింది. అధికారులు సైతం తమకు 66 డివిజన్ల జాబితా అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం.