breaking news
Karimnagar District Latest News
-
కరీంనగర్ను నంబర్వన్స్థానంలో నిలుపుతాం
2026లో రాష్ట్రంలో కరీంనగర్ను నేరాల నియంత్రణలో మొదటిస్థానంలో నిలుపుతామని సీపీ గౌస్ ఆలం అన్నారు. శనివారం కమిషనరేట్లో వార్షిక నేరాల నివేదిక–2025ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది కన్నా ఈసారి క్రైంరేట్ తగ్గిందన్నారు. మిస్సింగ్ కేసులను లోతుగా విచారిస్తున్నామని, చాలా వరకు మిస్టరీ మర్డర్లుగా మారుతున్నాయని, నాణ్యమైన దర్యాప్తుతోనే కేసులను వేగంగా ఛేదిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త పోలీస్ స్పోర్ట్స్మీట్, ఎమ్మెల్సీ, గ్రామపంచాయతీ ఎన్నికలు, వివిధ పండగలు, ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. టాస్క్ఫోర్స్, ఎస్బీ, సీసీఎస్లకు నూతన భవనాలు కేటాయించామని, అన్ని పోలీసుస్టేషన్లు ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. షీలీడ్స్ ద్వారా మహిళ పోలీసులకు విధులు కేటాయించి, శిక్షణ ఇచ్చామన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, సీసీ కెమెరాల ద్వారా చాలా వరకు నేరాలు స్వల్ప వ్యవధిలోనే ఛేదిస్తున్నామన్నారు. ట్రాఫిక్ విషయంలో ప్రతీరోజు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలపై దృష్టిసారిస్తామన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని హెచ్చరించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్కుమార్, మాధవి పాల్గొన్నారు. -
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్ష
కరీంనగర్క్రైం: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల ప్రకారం.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డి.శరత్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్ష సమావేశం శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. శరత్ మాట్లాడుతూ ప్రాసిక్యూటర్లు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసుల విచారణ సమయంలో పూర్తి అవగాహనతో వెళ్లాలని సూచించారు. అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వేముల లక్ష్మీ ప్రసాద్ బెయిల్ పిటిషన్లతోపాటు కేసుల విచారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మల్యాల ప్రతాప్, రవీందర్, మంచికట్ల రాజేశం, సీహెచ్ రామకృష్ణ, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఆరెల్లి రాములు, కాసారం మల్లేశం, బిట్ల నర్సయ్య, ఝాన్సీ, పద్మజా పాల్గొన్నారు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలుకరీంనగర్: కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతు కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. కోర్టు వెనుక భాగం ప్రాంతం, కెమిస్ట్భవన్ ఏరియా, వెంకటేశ్వర ఆలయం, శివథియేటర్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు. -
చలితో జాగ్రత్త..
కరీంనగర్: చలి గాలులు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కొద్దిరోజుల నుంచి విపరీతమైన చలి, పొగమంచు కారణంగా పట్టపగలు కూడా సూర్యుడి ప్రభావం కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. శీతల గాలుల ప్రభావం, సమతుల్యత లేని వాతావరణం, కాలుష్యంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో శనివారం ‘సాక్షి’ ఫోన్ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్వో వివరంగా సమాధానం ఇచ్చారు. -
ఇదీ.. బాలానగర్కాలనీ
బాలానగర్లోని చర్చి బాలానగర్లోని విశాలమైన రోడ్లు వేములవాడరూరల్: తాటి కమ్మలు.. ఈత ఆకులు.. పూరి గుడిసెలు.. ఇది ఐదు దశాబ్దాల క్రితం బాలానగర్కాలనీలో పరిస్థితి. కానీ నేడు అధునాతన బంగ్లాలు.. కార్లు.. హైస్పీడ్ బైక్స్.. నేటి దృశ్యాలు. యాభై ఏళ్లలో వలసల ఊరు అద్భుతంగా అభివృద్ధి చెందింది. కష్టాన్ని నమ్ముకున్న పల్లెప్రజలు ఒక్కో రూపాయి కూడబెట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యారు. నాడు తాటికమ్మల గుడిసెల్లో కాలం వెల్లదీసిన వారు.. నేడు జూబ్లిహిల్స్.. బంజారాహిల్స్లను తలదన్నేలా భవంతులు నిర్మించుకున్నారు. జీవనశైలిలోనూ మార్పులు వచ్చాయి. పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తుండగా.. పెద్దలు వ్యవసాయాన్ని నమ్ముకొని ఊరిపట్టున ఉంటున్నారు. వలస ప్రజలతో ఏర్పడ్డ బాలానగర్కాలనీ ఉరఫ్ గుంటూరుపల్లి గురించి తెలుసుకుందాం. 1970లో మొదలైన వలసలు ఇప్పటి రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి 1970 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుంచి ఆరు కుటుంబాలు వలస వచ్చాయి. పత్తిపంటను ఈ ప్రాంతానికి వీరే పరిచయం చేశారు. ఆ సమయంలో వీరికి వేములవాడ శివారు ప్రాంతంలో మల్లయ్య అనే ఫాదర్ దాదాపు 15 ఎకరాలలో నివాసాలకు అవకాశం కల్పించారు. అలా మొదలైన బాలానగర్కాలనీ ఏర్పాటైంది. ఆరు కుటుంబాలతో మొదలైన కాలనీ నేడు 105 కుటుంబాలకు చేరింది. ప్రస్తుతం ఈ ఊరిలో 350 ఓటర్లతో 70 నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారు. గుంటూరు నుంచి వలస రావడంతో గుంటూరుకాలనీ అనే మరో పేరు కూడా ఉంది. మున్సిపాలిటీలో 15వ వార్డుగా గుర్తించారు. విశాలమైన ఇళ్లు నిర్మించుకున్నారు. ఒక్కో కుటుంబం ఇంటి కోసం 15 నుంచి 20 గుంటల స్థలాన్ని ఉంచుకుంటున్నారు. ఇందులోనే అన్ని సౌకర్యాలతో ఇళ్లను కట్టుకుంటున్నారు. కాలనీలో అన్ని సీసీరోడ్లు కనిపిస్తాయి. క్యాథలిక్ చర్చిని నిర్మించుకున్నారు. పంటల సాగులో ఆదర్శం బాలానగర్కాలనీ(గుంటురుకాలనీ) ప్రజలు పత్తి, పచ్చిమిచ్చి సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా సరికొత్త పంటలు పండిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. అన్నింటికి ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీరోడ్లు, చర్చి, వాటర్ ట్యాంకు, ఇతర సౌకర్యాలు వారి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు బాలానగర్ రైతులు తమ పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. 105 కుటుంబాల్లో దాదాపు 15 మంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 10 కుటుంబాల్లోని పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. రెడ్డి సొసైటీగా అభివృద్ధి బాలానగర్ రైతులంటేనే గతంలో గుంటూరు పల్లె అనేవారు. ప్రస్తుతం ఒకే మతానికి చెందిన వీరందరు రెడ్డి సొసైటీని ఏర్పాటు చేసుకుని వార్డులో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. ఈ కమిటీకి ఇతర సొసైటీల నుంచి నిధులు తీసుకుని అభివృద్ధి చెందుతున్నారు. కలిసికట్టుగా ఉంటాం బాలానగర్ కాలనీలోని వాళ్లం ఒకే కుటుంబంగా కలిసి ఉంటాం. అందరం ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్లమే. ఎప్పుడూ గొడవలు పడము. ఎవరి ఇంట్లో ఆపద వచ్చినా అందరం ముందుంటాం. కష్టసుఖాల్లో కలిసి ఉంటాం. – మ్యాకల రాయపురెడ్డి, బాలానగర్కష్టపడి ఎదిగాం బాలానగర్ రైతులంటేనే గతంలో చిన్నచూపు చూసేవారు. అలాంటి కష్టకాలంలో మేము వ్యవసాయాన్ని నమ్ముకొని సొంతంగా ఎదిగాము. మా పిల్లలు కూడా మా కష్టాన్ని అర్థం చేసుకుని ఉన్నతస్థానంలో ఉండడం మాకెంతో సంతోషం. అందరం ఇప్పటికీ కలిసికట్టుగా ఉంటాం.– తుమ్మ ఎన్నారెడ్డి, బాలానగర్ గుంటూరు నుంచి వలసలు కష్టాన్ని నమ్ముకున్నారు పేదరికాన్ని జయించారు శ్రీమంతులకు కేరాఫ్ గుంటూరుపల్లి -
దైవదర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుండగా..
మెట్పల్లిరూరల్(కోరుట్ల): దైవదర్శనం అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. వారి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మారుతినగర్ శివారులో జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్(41), అతడి భార్య లావణ్య(35), పదిహేనేళ్ల కూతురు కీర్తి శనివారం కొండగట్టు అంజన్నస్వామి దర్శనానికి కారులో వచ్చారు. దర్శనం తర్వాత కుటుంబసభ్యులు సాయంత్రం సమయంలో తిరిగి ఇంటికి పయణమయ్యారు. ఈ క్రమంలో మెట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మారుతినగర్ శివారులోకి చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న లారీ, వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొన్నాయి. దంపతులు తీవ్రగాయాలపాలై మృతిచెందారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మోహన్ మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు రెండుగంటల పాటు శ్రమించారు. ఘటన స్థలాన్ని మెట్పల్లి సీఐ అనిల్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మోహన్–లావణ్య దంపతుల మృతదేహాలను మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోహన్(ఫైల్) లావణ్య(ఫైల్) మెట్పల్లి మండలం మారుతినగర్లో లారీ–కారు ఢీ దంపతులు మృతి, కూతురు పరిస్థితి విషమం మృతులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు -
ఒలింపిక్స్లో పతకాలు సాధించాలి
కరీంనగర్స్పోర్ట్స్: ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలపై సంపూర్ణ అవగాహన కలిగి, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. రాబోయే ఒలింపిక్స్ మొదలు ప్రతీ ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మువ్వన్నెల జెండా ఎగరవేయాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. కాగా, 30 ఏళ్ల నుంచి మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్కుమార్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీలు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం: ఎంపీ ఈటల వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 800 మీటర్ల రన్నింగ్ను ప్రారంభించి మాట్లాడారు. ఆటలు ఆటవిడుపుగానే కాకుండా ఆరోగ్యకర జీవనానికి దోహదపడుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాల మొదలు కళాశాల అన్ని స్థాయిల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, వరాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కవాతు పోటీల్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగారెడ్డి జిల్లాకు ప్రథమ, ని జామాబాద్కు ద్వితీయ బహుమతులను మంత్రి పొ న్నం, విప్ ఆది, ఎమ్మెల్యే కవ్వంపల్లి అందజేశారు. బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ దివ్యారెడ్డి అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా బెస్ట్ ఇయర్ ఆఫ్ ది మాస్టర్ అథ్లెట్ అవార్డును బి.దివ్యారెడ్డి (మేడ్చల్)కి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి అందజేశారు. 45 ఏళ్ల వయస్సు విభాగంలో 800 మీటర్ల రన్నింగ్ను 3.33 నిమిషాల్లో చేరుకొని బంగారు పతకం సాధించింది. అలాగే కొన్నేళ్లుగా 100, 400, 800 మీటర్ల రన్నింగ్లో పాల్గొని బంగారు పతకాలు కై వసం చేసుకుంది. దీంతో అవార్డును ప్రదానం చేశారు. క్లాప్ కొట్టి పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్మాట్లాడుతున్న మంత్రి పొన్నం, చిత్రంలో విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు మంత్రి పొన్నం ప్రభాకర్ -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శనివారం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. పురుషుల విభాగంలో సూర్యపేట, జనగాం, నిజామాబాద్ జట్లు క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 2, రంగారెడ్డి జట్లు సెమీస్లో చేరగా ఆదివారం వరంగల్, గద్వాల్ జట్లు, కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. పోటీలను విప్ ఆది శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. కాగా స్టేడియంలో రాత్రి మంచు ఎక్కువగా కురవడంతో టెక్నీకల్ కమిటీ బాధ్యులు అనిల్కుమార్, శ్రీనివాస్ పోటీలను వాయిదా వేశారు. పురుషుల విభాగంలో హనుమకొండ– నల్గొండ, మేడ్చల్– రంగారెడ్డి జట్లు, మహిళల విభాగంలో గద్వాల్, వరంగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లను ఆదివారం తిరిగి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో కరీంనగర్ పురుషుల జట్టు జనగాం జట్టుతో తలపడగా 51–21 స్కోర్తో ఓటమి చెందింది. మహిళల జట్టు సూర్యపేటపై 43–13 స్కోర్తో క్వార్టర్స్కు చేరింది. ఆదివారంతో పోటీలు ముగియనున్నట్లు సంఘం బాధ్యులు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కా ర్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నా రు. కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అ మిత్కుమార్, మల్లేశ్గౌడ్, సీహెచ్ సంపత్రావు, ల క్ష్మీనారాయణ, ఎల్లాగౌడ్, మల్లేశం, మహేందర్రెడ్డి, రవీందర్, పోలీస్ అధికారులు భీంరావు, విజయ్కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మహిళల సెమీస్లో హైదరాబాద్– 2, రంగారెడ్డి జట్లు నేడు ముగింపు.. హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ -
5లక్షల గొర్రెలకు నట్టలమందు
కరీంనగర్రూరల్: జిల్లాలోని 5.20లక్షల గొర్రెలు, మేకలకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తోందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి తెలిపారు. శనివారం కరీంనగర్ మండలం చేగుర్తిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 25 పశువైద్యశాలలు, 37 ఉపకేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలకు నట్టల నివారణమందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేస్తున్న నట్టల నివారణ మందును గొర్రెపెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, సర్పంచ్ బాషవేణి సరోజన, ఉపసర్పంచ్ గాలిపల్లి రవీందర్, పశువైద్యులు జ్యోత్స్య, రామకృష్ణ, గట్టయ్య పాల్గొన్నారు. -
252 జీవోను సవరించాలి
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో ఫీల్డ్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025 జర్నలిస్టుల మధ్య విభజన సృష్టిస్తున్నాయన్నారు. డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా ‘మీడియా కార్డు’ పేరిట వేరుచేయడం అసంతృప్తికి కారణమవుతోందన్నారు. కొత్త జీవోలోని నిబంధనలు అస్పష్టంగా ఉండటం, చిన్న పత్రికలు, కేబుల్ చానళ్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై కఠిన నియమాలు విధించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా ఒకే విధంగా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించేలా జీవోను సవరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో టీయూడబ్ల్యూజే హెచ్–143 జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, నాయకులు ప్రకాశ్రావు, వేణుగోపాలరావు, జెర్రిపోతుల సంపత్, రామకృష్ణ, హృషికేష్, కొండల్రెడ్డి, యాదగిరి, డెస్క్ జర్నలిస్ట్లు సంపత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
కళ్లలో కారం కొట్టి యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుర్ర మహేందర్గౌడ్ (33) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్గౌడ్ మెడికల్ రిప్రజంటేటివ్గా పనిచేస్తున్నాడు. అతడు ఓ మహిళను కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఆమె వరుసకు సోదరి అయిన లక్ష్మీపూర్కు చెందిన సంధ్యకు చెప్పుకుంది. శుక్రవారం ఇద్దరూ లక్ష్మీపూర్లో సంధ్య ఇంట్లో ఉండగా, రాత్రి మహేందర్గౌడ్ అక్కడికి వచ్చాడు. వారి మధ్య గొడవ కావడంతో మహేందర్ కళ్లలో కారంపొడి చల్లారు. దీంతో అతను బయటకు పరుగులు తీయడంతో అక్కడే ఉన్న సంధ్యతో పాటు, మరికొంత మంది బలమైన ఆయుధాలతో దాడిచేయడంతో మృతిచెందాడు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కాగా, హత్యలో ప్రమేయం ఉన్న వ్యక్తులు పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు. బైక్ చెట్టుకు ఢీకొని యువకుడి మృతిజూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని పెద్దాపూర్– తేలుకుంట గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన తోడేటి సాయికిరణ్(24), రోహిణికి వివాహం కాగా, 6 నెలల బాబు ఉన్నాడు. గ్రామంలో కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కోగా, నెలరోజులుగా బంధువుల ఊరైన తేలుకుంటలో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి మోటారుకు మరమ్మతు చేయించేందుకు కొత్తూరు వెళ్లాడు. పనులు ముగించుకొని రాత్రి బైక్పై తేలుకుంటకు వస్తుండగా పెద్దాపూర్– తేలుకుంట గ్రామాల మధ్య మైస మ్మ ఆలయ సమీపంలో చెట్టుకు ఢీకొని దారి పక్కన పడి మృతిచెందాడు. శనివారం వేకువజామున వాకింగ్కు వెళ్లినవారు చూసి మృతుడి బంధువుకు సమాచారమిచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి ఒకరు..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన కీర్తి సందీప్ (35) శుక్రవారం రాత్రి ఎస్సారెస్పీ డీ–83 కాల్వలో జారిపడి మృతిచెందాడు. రూరల్ ఎస్సై మల్లేశ్ వివరాల ప్రకారం.. సందీప్ సమీపంలోని గొల్లపల్లిలో దశదిన కార్యక్రమంలో పాల్గొని మద్ది కుంటకు వస్తుండగా మార్గమధ్యలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వంతెన పైనుంచి జారి కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. కాలువపై వంతెన శిథిలమై ఉండడాన్ని గుర్తించని కారణంగా ఈ ఘాతుకం జరిగిందని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక
కొడిమ్యాల(చొప్పదండి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక టీ– 20లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఎర్రోజు తక్షిల్ ఎంపికయ్యాడు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 26 వరకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జట్ల మధ్య నిర్వహించిన టోర్నమెంట్లో తక్షిల్ జగిత్యాల కెప్టెన్గా వ్యవహరించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై న సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జ్ భాస్కర్ అధ్యాపకులు అభినందించారు. న్యాయం చేయాలని ఆందోళనకరీంనగర్క్రైం: క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ కేసులో బాధితుడైన తమ కొడుకును కాపాడాలని కరీంనగర్లోని జ్యోతినగర్కు చెందిన వంగల స్వప్న, రమణ శనివారం కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని తమ కుమారుడి నమ్మించి రమేశ్తో పాటు మరికొంత మంది రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారన్నారు. ఈ విషయంలో మోసపోయిన తమ కుమారుడిని కూడా పోలీసులు జైలుకు పంపించారని తెలిపారు. రూ.11 లక్షలు చెల్లించాలని రమేశ్, పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. జీవన మార్గదర్శిని భగవద్గీతకరీంనగర్టౌన్: కరీంనగర్లోని కోట పబ్లిక్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీత్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీఆర్ఎస్ఎంఏ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు విద్యాసంస్థలను సందర్శించి కోటా కుటుంబానికి తమ ఆశీర్వాదాలు అందించారు. ఈసందర్భంగా రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ, శ్రీభగవద్గీత కేవలం గ్రంథం మాత్రమే కాదని, జీవన మార్గదర్శి అని పేర్కొన్నారు. గీతలో చెప్పిన కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం విద్యార్థుల జీవితాలను సరైన దిశలో నడిపిస్తాయని, చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరం వివరించారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కోటా విద్యాసంస్థలు విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. చైర్మన్ డి.అంజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులున్నారు. దూషించినవారిపై కేసుపెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని దూషించినవారిపై కేసు నమోదైంది. రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి మండలం మారెడుగొండ పంచాయతీ సర్పంచ్ పదవికి సిరిసెట్టి కొమురయ్య పోటీ చేసి ఓడిపోయాడు. కాగా తనకు ఓటు వేయలేదని కొమురయ్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన జక్కుల నాగమణిని ఇష్టారీతిన దూషించి, దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు. కూలీలపై తేనెటీగల దాడికోనరావుపేట(వేములవాడ): మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన తడకమడ్ల అరవింద్, అతడి తల్లి సత్తమ్మ వరినాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. వీరితోపాటు మరికొంత మంది కూలీలు ఉన్నారు. నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అరవింద్, సత్తమ్మ, వజ్రవ్వ, సుమన్, విక్రమ్ గాయపడ్డారు. బాధితులను 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
తగ్గిన నేరాలు..
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 30నుంచి 60ఏళ్ల వయసులోనూ 20ఏళ్ల యువతలా పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 800 మీటర్ల రన్నింగ్కు క్లాప్ కొట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. పలువురు ఆటల్లో రాణించి.. పతకాలు సాధించారు. – వివరాలు 8లోu తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి -
బెల్ట్షాపులు మూసివేయండి
● బూర్గుపల్లి పాలకవర్గానికి గ్రామస్తుల వినతి బోయినపల్లి(చొప్పదండి): గ్రామంలో బెల్ట్షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామస్తులు శుక్రవారం గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. సాయంత్రం అయ్యిందంటే మహిళలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలతో మహిళలు భయాందోళన చెందుతున్నారన్నారన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే గ్రామంలో బెల్ట్షాపులు మూసివేయాలని కోరారు. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రిస్వామి తిమ్మాపూర్: ధూప దీప నైవేద్య అర్చుకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రిస్వామి కోరారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో మాట్లాడారు. హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ మాట్లాడుతూ డీడీఏ అర్చకుల వేతనం రూ.35వేలకు పెంచాలని, ప్రతీ నెల 5లోపు వేతనం ఇవ్వాలని, అర్చక సంక్షేమ పథకాల అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ శ్రీరంగం గోపి కృష్ణమాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవర్జుల ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి, వెగ్గళం సంతోష్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మాధవాచార్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకవరం మఠం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్రోడ్డుపై అదుపుతప్పిన ఆటో
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, తిరుగు ప్రయాణంలో ఘాట్రోడ్డు వెంట వెళ్తున్న ఆటో బోల్తాపడి నలుగురు గాయపడిన సంఘటన మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో చోటుచేసుకుంది. గోదావరిఖని చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘాట్రోడ్డు వెంట వెళ్తుండగా, ఆటో అదుపుతప్పి, గతంలో బస్సు ప్రమాదం జరిగిన స్థలంలో ఏర్పాటు చేసిన సేఫ్టీవాల్ను ఢీకొని బోల్తాపడింది. ఘటనలో సరస్వతి, హేమంత్ తీవ్రంగా, విద్యాధర్ శ్రీధర్, కిరణ్మయి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి బ్లూకోల్ట్స్ సిబ్బంది సురేశ్, అంజన్న చేరుకొని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర, ఇద్దరికి స్పల్ప గాయాలు -
అమ్మను దొంగలెత్తుకెళ్లారమ్మా..
ముప్పిరితోటలో కొమురయ్య ఇంటి ఎదుట ఆవు కనిపించట్లేదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తల్లి లేక లేగదూడ ఏమి తినడం లేదని ‘సాక్షి’కి తెలుపుతున్న కొమురయ్య అమ్మ ఎప్పుడొస్తుందోనని ఆ మూగజీవి తల్లిఆవు కోసం ఎదురుచూస్తుంటే, యజమాని గుండె తరుక్కుపోతోంది. నెలరోజులైనా ఆవు జాడ కానరాలేదని, మీ అమ్మను ఎవరో ఎత్తుకెళ్లారమ్మా అని అరిచి చెప్పాలని ఉన్నా.. ఆ లేగదూడతో చెప్పలేక కుమిలిపోతున్నాడు. ఊరూ..వాడా.. చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికినా ఫలితం లేక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని చెవుల కొమురయ్య తన ఆవును గత నెల 28న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారంటూ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ‘సాక్షి’కి కనిపించింది. తల్లి ఆవుకోసం గాలింపు ఒకవైపు, దూడ ఆరాటం మరోవైపు వెరసి కొమురయ్య దంపతులు నిద్రలేమి రాత్రులు గడుపుతూ, ఆవు దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
రూటు మార్చిన టైగర్
మంథనిరూరల్: వారం పది రోజులుగా రామగుండం ఓసీపీ ప్రాంతంలో మకాం వేసి రెండు రోజుల క్రితం గోదావరినది దాటిన పెద్దపులి శుక్రవారం తిరిగి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి గోదావరినది దాటిన పులి మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్ ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు వ చ్చింది. అక్కడి నుంచి మూసివేసిన మేడిపల్లి ఓసీపీ డంప్ 1లో మకాం వేసింది. పది రోజుల పాటు ఆ ప్రాంతంలోనే సంచరించగా అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించి సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఓసీపీ ప్రాంతాలు సేఫ్గా భావించని పులి తిరిగి మంచిర్యాల ఇందా రం మీదుగా ఫారెస్ట్లోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధి కారులు గుర్తించారు. వారం పది రోజుల పాటు పు లి కదలికలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు గోదావరి నది దాటి వెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే తిరిగి శుక్రవా రం పులి నది దాటిందన్న సమచారం తెలుసుకున్న సెక్షన్ ఆఫీసర్ అఫ్జల్ అలీ, బీట్ ఆఫీసర్లు ప్రదీప్, రాంసింగ్లు గాలింపు చర్యలు చేపట్టగా మంథని మండలం ఆరెంద ఖాన్సాయిపేట ప్రాంతం నుంచి నది దాటినట్లు అధికారులు గుర్తించారు. శివ్వారం మీదుగా ఎల్ మడుగు దాటి ఇవతలి వైపు వచ్చిన ట్లు అడుగులను గుర్తించారు. సాయంత్రం వరకు ఎటు వైపు వెళ్లిందోనని ఫారెస్ట్ అధికారులు గాలించగా ఆరెంద, ఖాన్సాయిపేట, భట్టుపల్లి అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పెద్దపులి గో దావరినది దాటి ఇవతలి వైపు వచ్చిందనే ప్రచారం జరుగడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో అటవీ శాఖ అధికారులు సైతం ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అడవిలోకి వెళ్లవద్దని, పులికి హాని కలిగించే చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఆరెంద వైపు వచ్చినట్లు ఆనవాళ్లు గోదావరితీరంలో అడుగుల గుర్తింపు గాలింపు చర్యల్లో అటవీ అధికారులు -
బొగ్గు బ్లాకులపై కార్మిక సంఘాల పోరు
● పీకే ఓసీపీ సింగరేణికే కేటాయించాలి ● ఉద్యమానికి సిద్ధమవుతున్న సంఘాలుగోదావరిఖని(రామగుండం): బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కార్మిక సంఘాల పోరాటం ఉధృతమైంది. సింగరేణిలోని మణుగూరు ప్రకాశంఖని ఓసీ డిప్సైడ్ బ్లాక్ను టెండర్ ద్వారా కేటాయింపు బిడ్ ప్రకటించడంతో కార్మిక సంఘాలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం గనిలోని బొగ్గు నిల్వలు మరో ఆరేళ్లు మాత్రమే ఉండటం, పీకేఓసీ డిప్సైడ్ సింగరేణికి రాకపోతే ఏరియా మొత్తం మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ యూనియన్లు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఈక్రమంలో ఈకోల్బ్లాక్కు రెండు సంస్థలు టెండర్లు వేశాయి. వీటిలో సింగరేణి సంస్థ, తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ సంస్థలున్నాయి. కాగా, పీకేఓసీపీలో బొగ్గుపైన ఉన్న ఓబీ వెలికితీసి సింగరేణి సంస్థకే అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, సింగరేణికే ఈఓసీపీని కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి బిడ్లో రెండు సంస్థలు టెండర్ వేయడంతో వేలంపాట ద్వారా కేటాయింపులను కేంద్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వేరేసంస్థలు వస్తే ఒప్పుకోం.. పీకేఓసీపీ గనిలో వేరే సంస్థలు టెండర్ దక్కించుకుంటే ఒక్క బొగ్గు పెళ్ల కూడా తీసేందుకు ఒప్పుకోబోమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మణుగూరు పీకేఓసీపీలో ఓబీ వెలికితీస్తే ఆ మట్టి పోసేందుకు స్థలం లేదని, అదే సింగరేణికి టెండర్ కేటాయిస్తే సొంత స్థలంలోనే ఓబీ మట్టి డంప్చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అయినా వేరే సంస్థలు వస్తే తాము ఊరుకోబోమని దీర్ఘకాలిక ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నాయి. టెండర్ రాకుంటే మణుగూరుకు కష్టకాలమే.. పీకేఓసీపీ డిప్సైడ్ టెండర్ సింగరేణికి రాకుంటే మణుగూరు ఏరియాకు కష్టకాలమే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న బొగ్గు ఆరేళ్లవరకే ఉందని, టెండర్ దక్కకుంటే ఏరియాలో ఉత్పత్తి నిలిచి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గని డిప్సైడ్లో 60మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల మరో 20ఏళ్ల భవిష్యత్ ఉంటుందని పేర్కొంటున్నారు. బొగ్గు వెలికి తీసేందుకు 800మిలియన్ క్యూబిక్మీటర్ల ఓబీ(ఓవర్బర్డెన్)ని వెలికితీయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మణుగూరు ఏరియాకు కేంద్రం బిడ్ ప్రకటించిన పీకేఓసీ కీలకంగా మారనుంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిడ్వేలం పాటలో కేటాయిస్తుందా? లేక వేలం ఎక్కువ పాట పాడి సింగరేణి దక్కించుకుంటుందా అని చర్చ కొనసాగుతోంది. బొగ్గు నిల్వలు: 60మిలియన్ టన్నులు భవిష్యత్: మరో 20ఏళ్లు ఓబీ వెలికితీత: 800మిలియన్ క్యూబిక్మీటర్లు కార్మికులు: 800 మంది (సుమారు) -
స్వల్పంగా పెరిగిన రైల్వేచార్జీలు
రామగుండం: భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే చార్జీలను స్వల్పంగా పెంచింది. 215 కిలోమీటర్లపై ప్రయాణించే వారిపై కిలోమీటర్కు పైసా చొప్పున టికెట్ ధర పెంచుతూ శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఆరు నెలల క్రితమే స్వల్పంగా పెంచిన చార్జీల నేపథ్యంలో ఆర్డినరీ, నాన్ ఏసీ 215 కిలోమీటర్లపై ప్రయాణించే వారిపై కిలోమీటరుకు పైసా, మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు రెండు పైసల పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, హంసఫర్, తేజస్, అమృత్భారత్ తదితర రైళ్లతో పాటు ప్రీమియం రైళ్లకు పెంపు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కాగా లోకల్ రైళ్లు, నెలసరి సీజన్ టికెట్లు, రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ సర్చార్జీ, సీఎస్టీ తదితర చార్జీలులు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రామగుండం–సికింద్రాబాద్కు పెంపు వర్తింపు రామగుండం నుంచి సికింద్రాబాద్కు 224 కిలోమీటర్లు దూరం ఉండడంతో చార్జీల పెంపు వర్తించనుంది. ఫలితంగా నిన్నటి నుంచి భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్లకు రామగుండం నుంచి సికింద్రాబాద్కు రూ.90 ఉండగా పెంచిన చార్జీతో రూ.95 అయింది. సూపర్ఫాస్ట్ చార్జీ రూ.110కి చేరింది. కాగా పెద్దపల్లి–సికింద్రాబాద్కు మధ్య దూరం 207 కిలోమీటర్లు ఉండడంతో చార్జీల పెంపు వర్తించకపోవడం గమనార్హం. శుక్రవారం నుంచి అమలు -
ధర్మపురిని నాశనం చేసింది బీఆర్ఎస్సే
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 పేరుతో 1,020 ఎకరాల రైతుల భూములు లాక్కొని, గిరిజనులు, ఒడ్డెర జాతి ప్రజలను బెదిరించి ధర్మపురి నియోజకవర్గాన్ని నాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథిగృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి మాట్లాడారు. 2016లో జీవో నంబరు 71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును ఆరేళ్లపాటు కొనసాగించి, పూర్తి చేయకుండానే అంచనాలను రూ.66కోట్ల నుంచి రూ.136 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఇదేనా బీఆర్ఎస్ పాలకుల అభివృద్ధి మోడల్ అని ప్రశ్నించారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రశ్నించలేదని విమర్శించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించి, రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. తను రాజీనామా చేయాలా వద్దా అనేది నిర్ణయించేది ధర్మపురి ప్రజలేనని... బీఆర్ఎస్ నేతలు కాదని స్పష్టం చేశారు. మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. -
అత్తింటి వేధింపులు తాళలేక..
ముత్తారం: ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్కు చెందిన పాండవుల అంజలి(21) ఐదు నెలల గర్భిణి శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండవుల స్వా మి–భాగ్యలక్ష్మి దంపతుల పెద్ద కూతురు అంజలికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లంపల్లికి చెందిన బండి వెంకటేశ్తో 8నెలల క్రి తం వివాహమైంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక అడవిశ్రీరాంపూర్లోని పుట్టింటికి వ చ్చింది. పెళ్లికి ముందు ఒప్పందం ప్రకారం క ట్నకానుకలు చెల్లించినా మళ్లీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని మనస్తాపం చెందిన అంజలి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ మడుత రమేశ్, మంథని సీఐ రాజు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఉరేసుకొని గర్భిణి ఆత్మహత్య -
అంతరాల్లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
కరీంనగర్టౌన్: భారతదేశ సంపదను దోచుకునే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ఆగడాలకు ఎప్పటికప్పుడు కళ్లెం వేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100 ఏళ్ల సందర్భంగా శుక్రవారం కరీంనగర్లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సోయగం
విరబూసిన మోదుగుచెట్టు భట్టుపల్లి సమీపంలో రంగురంగు ఆకులతో చెట్టుమంథనిరూరల్: ప్రకృతిలో కాలానికనుకుణంగా చెట్లు తమ సహజతత్వాన్ని చాటుతుంటాయి. ఒక్కో చెట్టు ఒక్కో కాలంలో చోటు చేసుకునే మార్పులు కనువిందు చేస్తుంటాయి. కొన్ని చెట్లు విరగబూసి ఆకర్షణగా నిలిస్తే, మరికొన్ని చెట్లు సీజన్ మార్పుతో చూపరులను ఆకట్టుకుంటాయి. మంథని మండలం భట్టుపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై ఓ చెట్టు ఇలా పసుపు, ఆకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తోంది. అలాగే మండలంలోని గోపాల్పూర్లోని అటవీ ప్రాంతంలో మోదుగు చెట్టు ఇలా విరగబూసి చూపరులను ఆకట్టుకుంటోంది. -
అంజన్నకు నోటీసులు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు పరస్పరం వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. వివాదం ఇదీ.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. కొండగట్టు ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. వైజంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో.. కొండగట్టు ఆలయానికి వెళ్లే దారిలో ఘాట్రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పాటు సన్నాహాలు రెండు శాఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరిసరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజక్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటు ఏర్పాటుతో వై జంక్షన్కు వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కొరతతో ఇబ్బంది పడుతుండగా, వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పాటు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం. – పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ నేటి నుంచి
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో శని, ఆదివారాల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్, నీలం లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను వారు స్టేడియంలో పర్యవేక్షించారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. 2014లో కరీంనగర్ వేదికగా తొలిసారి రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని, తిరిగి 11 సంవత్సరాల అనంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ ఈజ్ వెల్త్ నినాదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. 35 నుంచి 100 మధ్య వయస్సున్న మాస్టర్ అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. రన్నింగ్, త్రోస్, జంప్స్ లాంటి 48 అంశాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ప్రతిభ చాటిన అథ్లెట్స్ను రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీరాలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. -
ఎములాడలో భక్తుల సంబురం
వేములవాడ: వరుస సెలవులు రావడంతో వేములవాడకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం 50 వేల మంది భక్తులు భీమన్నను, బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. భీమన్నకు కోడె.. బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకున్నారు. ట్రాఫిక్ ఎస్సై రాజు నేతృత్వంలో ట్రాఫిక్ను నియంత్రించారు. వీఐపీ రద్దీ పెరగడంతో ప్రొటోకాల్ ఆఫీస్ బిజీగా మారింది. వీఐపీలకు రూ.500 కోడె టికెట్, రూ.300 టికెట్తో బ్రేక్ దర్శనాలకు అనుమతించారు. భక్తుల వద్ద డబ్బులు తీసుకుని దర్శనాలు చేయిస్తున్న ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను ఆలయ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ చేపట్టి ఏడుగురిని రిమాండ్కు తరలించనున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. -
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో ఉపాధి లేక గల్ఫ్ దేశానికి వెళ్లిన వలస జీవి అక్కడే గుండెపోటుతో మృతిచెందగా.. 20 రోజులకు శుక్రవారం మృతదేహం వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు రవి(45) రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఈనెల 6న పనిచేస్తుండగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రవి మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని తెప్పించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. దాదాపు 20 రోజుల తర్వాత రవి మృతదేహం స్వగ్రామానికి చేరింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ తదితరులు నివాళి అర్పించారు. మృతునికి భార్య మంజుల, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గుంటపల్లిచెరువుతండాలో విషాదం -
శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని, అందుకు చెకుముకి సంబరాలు, సైన్స్ ఫెయిర్ దోహదం చేస్తాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెకుముఖి పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతీ అంశాన్ని శాసీ్త్రయ కోణంలో ఆలోచించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్, చెకుముకి సంబరాలు వంటివి ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గణితం, సైన్స్ సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. తాను గతంలో సైంటిస్ట్గా పని చేశానని గుర్తు చేశారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి పి.మనీంద్రం, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు, నిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు, చక్రపాణి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, జేవీవీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, నాయకులు ఆనంద్కుమార్, వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య, శ్రీకాంత్, వరప్రసాద్, అందే సత్యం, సీహెచ్ రామరాజు, ఆర్.వెంకటేశ్వరరావు, ఎన్.దేవేందర్, గంగారాం, శంకర్, రమేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కబడ్డీ.. కబడ్డీ.. హోరాహోరీ
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ లీగ్ దశ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం రాత్రి వరకు లీగ్దశలో సగానికి పైగా మ్యాచ్లు ముగిశాయి. ఉదయం, రాత్రి జరిగిన పలు మ్యాచ్లను రాష్ట్ర, జిల్లా కబడ్డీ సంఘం బాధ్యులతో పాటు పలు జిల్లాల క్రీడాశాఖ అధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు ప్రారంభించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సీహెచ్.అమిత్ కుమార్, బుర్ర మల్లేశ్ గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యకుడు సీహెచ్.సంపత్రావు, మల్లేశ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కరుణాకర్, బాబు శ్రీనివాస్, కృష్ణ, అంతడ్పుల శ్రీనివాస్, యూనిస్పాషా పాల్గొన్నారు. దూసుకెళ్తున్న కరీంనగర్ జట్లు రాష్ట్రస్థాయి సీనియర్స్ పోటీల్లో భాగంగా కరీంనగర్ పురుషుల, మహిళల జట్లు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసుకుని దూసుకెళ్తున్నాయి. పురుషుల జిల్లా జట్టు కామారెడ్డిపై 68–20, సిద్దిపేటపై 50–33 భారీ స్కోర్తో విజయాలు నమోదు చేసింది. మహిళల జట్టు నిర్మల్పై 36–10, వికారాబాద్పై 59–18 భారీ స్కోర్తో విజయాలు సాధించింది.ఉత్కంఠగా సాగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు కరీంనగర్ జట్లకు రెండేసి విజయాలు -
ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం
● హాజరు కానున్న ముగ్గురు మంత్రులు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హాజరవుతారని వివరించారు. పంటలకు లాభసాటి ధర చెల్లించాలికరీంనగర్: రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర రాని కారణంగా చాలామంది వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు, జీవనోపాధి వైపు పరుగెడుతున్నారని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్రావు అన్నారు. కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 3 రోజులపాటు నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళా శుక్రవారం ముగిసింది. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లు తిలకించారు. మెషినరీ, మందులు, విత్తనాలపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ రైతు నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అధిక క్రిమిసంహారక ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుందన్నారు. ప్రముఖ రైతు నాయకుడు నరసింహనాయుడు మాట్లాడుతూ.. రైతులు సంఘటితమై ఉద్యమించనిదే ప్రభుత్వాలు దిగి రావని అన్నారు. కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్, ప్రముఖ వైద్యులు బీఎన్ రావు, రైతు నాయకులు మల్లారెడ్డి, నేలమడుగు శంకరయ్య, ఏపీవోల అధ్యక్షులు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు. 31న మా‘నీరు’ విడుదలతిమ్మాపూర్: యాసంగి పంటల కోసం కరీంనగర్ దిగువ మానేరు జలాశయం నుంచి ఈనెల 31న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ పి.రమేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు కాకతీయకాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తామని వివరించారు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జోన్–1 (కి.మీ. 146.00 నుంచి 284.00)కు 7 రోజులు, జోన్–2 (కి.మీ. 284.09 నుంచి 340.00)కు 8 రోజులు వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీర్ బాల్ దివస్ చరిత్ర స్ఫూర్తిదాయకంకరీంనగర్టౌన్: పదవ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్జి యువ కుమారుల అసాధారణ ధైర్యం, త్యాగాన్ని స్మరించుకుంటూ వారి వీరత్వానికి నివాళిగా ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను నిర్వహిస్తామని, ఈ దివస్ చరిత్ర, ప్రాముఖ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వీర్ బాల్ దివస్ నిర్వహించారు. దివస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్దార్ బల్వీర్సింగ్, బీజేపీ శ్రేణులు కరీంనగర్లోని టవర్ సర్కిల్ నుంచి సిక్కువాడిలోని గురుద్వార వరకు నగర కీర్తన యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి యాత్రను ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ గురుద్వార అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్సింగ్, కార్యదర్శి సర్దార్ యస్పాల్సింగ్, కమిటీ సభ్యులు రవీందర్ పాల్సింగ్, మంజిత్సింగ్, జస్పాల్సింగ్, రణధీర్సింగ్, సురేందర్ పాల్సింగ్, స్వరణ్సింగ్, భూపేందర్సింగ్, బీజేపీ నాయకులు కన్న సాయిని మల్లేశం, కోలగని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, సతీశ్, కటకం లోకేశ్, బొంతల కళ్యాణ్ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు. -
దగ్గు.. జలుబు.. జ్వరం
ఓపీ ఎక్కువ.. ఐపీ తక్కువ ● ఆసుపత్రులకు బాధితుల వరుస ● చలి ప్రభావమే అంటున్న డాక్టర్లు చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట చలి, పొద్దంతా ఎండ అన్నట్లు వాతావరణంలో విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. జలుబుతో కూడిన దగ్గు, జ్వరంతో తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు రోజులు సొంత చికిత్సకే పరిమితమై తగ్గకపోవడంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.కరీంనగర్: 2 వారాలుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధానాసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అన్సీజన్ లాగే ఉన్నా.. ప్రతిరోజు 700 నుంచి 900 వరకు ఔట్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో 50 శాతం జలుబుతో కూడిన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో కూడా పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పిల్లల ఆసుపత్రులతోపాటు జనరల్ ఫిజీషియన్ల వద్ద పేషెంట్లు వరుస కడుతున్నారు. ఇబ్బంది పెడుతోంది.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో జ్వరాలు సాధారణ స్థితిలోనే ఉంటున్నాయని ప్రభుత్వాసుపత్రి జనరల్ ఫిజీషియన్ వైద్యులు చెబుతున్నారు. జలుబుతో కూడిన దగ్గు, జ్వరాల కేసులే ఎక్కువగా వస్తున్నాయని, ఒకటి, రెండు రోజుల్లోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. జీజీహెచ్లో ఓపీ మాత్రమే ఎక్కువగా ఉండడం, ఐపీ చాలా తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. అయితే స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, ఇతరులకు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధులు సమాజం నుంచి దూరమవుతాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. చలి తీవ్రతతో చిన్నారుల్లో దగ్గు, జలుబు సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత బాధితులే ఓపీకి ఎక్కువగా వస్తున్నారు. చిన్నారులతోపాటు వృద్ధులు, గర్భిణులు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రమాదకర పరిస్థితి ఏ ఒక్కరిలో లేకపోయినా.. ఈ వ్యాధులు వారంపాటు ఇబ్బంది కలిగిస్తున్నాయి. పిల్లలను చల్ల గాలికి తిప్పొద్దు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగొద్దు. పాఠశాల, ఇతర పనులకు బయటకు వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరిస్తూ గాలి వెళ్లకుండా చెవులు, ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. – డాక్టర్ నవీన, జీజీహెచ్ ఆర్ఎంవో -
● ఘల్ ఘల్.. వెన్నుపూస ఝల్ ఝల్
కరీంనగర్ సిటీ రోడ్లపై ఈ మధ్య ప్రయాణించారా? మీ వాహనం నుంచి ఘల్ ఘల్ శబ్దం.. మీ వెన్నుపూజ నుంచి ఝల్ఝల్ నొప్పిని గమనించారా? అవును ఇటీవల నగరంలోని ప్రయాణిస్తున్న ప్రతీ వాహనదారుడి నుంచి ఇదే మాట వినిపిస్తోంది. నగరంలోని చౌరస్తాలు.. మూల మాలుపుల వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన రంబుల్ స్ట్రిప్స్ పరిమితికి మించి ఎత్తుగా ఉండడంతో బండి డ్యామేజ్, ఒళ్లుహూనం అవుతోందని వాహనదారులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
పురుగుల మందుతాగి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన భా రతపు శేఖర్ (35) శుక్రవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తిప్పన్నపేటకు చెందిన శేఖర్ ఇటీవలే తన భార్యతో మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పురుగుల మందుతాగగా, ఎవరూ గమనించలేదు. సాయంత్రం ఇంట్లో ఉన్న తల్లి లోపలికి వెళ్లి చూసేసరికి మృతిచెందాడు. పోలీ సులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి మృతిమెట్పల్లి: పట్టణంలో ని బస్డిపో సమీపంలో అనుమానాస్పద స్థితిలో సుమారు 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు. నలుపు రంగు టీషర్టు, అలివ్ గ్రీన్ ప్యాంటు, పింక్ బ్లాక్ షూ ధరించి ఉన్నాడని, అతని వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలని ఎస్ఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ కార్మికుని మృతికోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్క పేటకు చెందిన కార్మికుడు కర్రోళ్ల నర్సయ్య(70) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. నర్సయ్య అదే గ్రామానికి చెందిన జంగిటి దేవయ్య ట్రాక్టర్పై గడ్డికుప్పలు తరలించేందుకు గత నెల 28న కూలి పనికి వెళ్లాడు. ట్రాక్టర్ను డ్రైవర్ కొంచెం ముందుకు కదిలించగా.. పైన ఉన్న నర్సయ్య కిందపడి స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటి నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందా డు. మృతుని కుమారుడు కర్రోళ్ల స్వామి ఫిర్యాదుతో జంగిటి దేవయ్య, సాగర్ల శ్రీనివాస్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిందు కళాకారుడు మృతిచొప్పదండి: కాట్నపల్లికి చెందిన చిందు కళాకారుడు గజ్జెల నగదరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. పట్టణానికి చెందిన వేముల వెంకట్రాజం(70) మృతిచెందగా.. దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేయాలని చొప్పదండిలోని రామకృష్ణా సేవాసమితి సభ్యులను ఆశ్రయించారు. దాత ఆడెపు సహకారంతో రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు. కొక్కుల క నకయ్య, పడకంటి కృష్ణ పాల్గొన్నారు. -
డ్యూటీకి డుమ్మా.. పీహెచ్సీకి తాళం
మానకొండూర్ రూరల్: అత్యవసర సేవల విభాగాల్లో ఒకటైన వైద్య, ఆరోగ్యశాఖను నిర్లక్ష్యం వెంటాడుతోంది. కలెక్టర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ.. సమీక్షిస్తున్నా వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. పండుగ రోజైనా రోగులకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది గైర్హాజరు కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, పీహెచ్సీకి తాళం వేసిన ఘటన మానకొండూర్ మండలం లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెల్ది పీహెచ్సీ లక్ష్మీపూర్లో కొనసాగుతోంది. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో వైద్యాధికారి సాయిప్రసాద్ ఓ మేల్ స్టాఫ్నర్సుకు విధులు కేటాయించారు. అతను ఉదయం 9గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12దాటినా రాలేదు. దీంతో చికిత్స కోసం వచ్చిన 20మంది వరకు రోగులు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉపసర్పంచ్ రాపాక ప్రవీణ్, గ్రామస్తులు పీహెచ్సీ ఎదుట నిరసన వ్యక్తం చేసి, గేటుకు తాళంవేశారు. మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. మెడికల్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ విషయమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి, గైర్హాజరైన వ్యక్తిపై చర్యలకు సిఫారసు చేస్తామని మెడికల్ ఆఫీసర్ వివరించారు. -
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సీఎస్ఐ క్యాథడ్రల్ చర్చిలో గీతాలు ఆలపిస్తున్న క్యారల్స్ బృందంసీఎస్ఐ సెంటనరీ వెస్లీచర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో క్రిస్టియన్లుకరీంనగర్కల్చరల్: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం నూతన వస్త్రాలు ధరించి చర్చికి వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ పఠించారు. ప్రత్యేక గీతాలాపనలు చేశారు. మతపెద్దలు దైవ సందేశాన్ని అందించారు. కరీంనగర్లోని సీఎస్ఐ (వెస్ట్) క్యాథడ్రల్ చర్చి, సీఎస్ఐ సెంటినరీ వెస్లీ, సెయింట్ మార్క్చర్చితో పాటు వివిధప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలు కిటకిటలాడాయి. పోలీసు కమిషనరేట్ ఎదురుగా ఉన్న సీఎస్ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ పాల్ కొమ్మాలు సందేశం ఇచ్చారు. అసిస్టెంట్ ప్రెస్బిటర్లు మధుమోహన్, పాస్టరేట్ సెక్రటరీ జీబీ. సంజయ్కుమార్, ట్రెజరర్లు ముల్కల సంజయ్, ఎర్ర జాకబ్ పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీలోని సీఎస్ఐ సెంటినరీవెస్లీ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ ఎస్.జాన్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అసిస్టెంట్ ప్రెస్బిటర్ రెవ ఎం.పింటు, సెక్రటరీ సి.సంజయ్కుమార్, ట్రెజరర్ సి.నారాయణ పాల్గొన్నారు. -
ప్రతీ హిందువు భగవద్గీత పఠించాలి
చొప్పదండి: ప్రతి హిందువు భగవద్గీత పఠించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయార్ స్వామి పేర్కొన్నారు. చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి ఆలయాన్ని గురువారం సందర్శించి ప్రచనాలు అందించారు. శ్రీవేంకటేశ్వర మణికంఠ ఆలయంలో పూజలు జరిపారు. ప్రతి హిందువు భగవద్గీతను నేర్చుకోవాలని, 700 శ్లోకాల్లో ప్రతిరోజు రెండు శ్లోకాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. వికాస తరంగిణీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గుర్రం నీరజ, ఇప్పనపల్లి విజయలక్ష్మి, పుల్యాల లక్ష్మారెడ్డి, గుర్రం ఆనందరెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తిప్పర్తి శ్రీనివాస్, జగన్మోహన్ పాల్గొన్నారు. కరీంనగర్లో పర్యటనరామానుజ దేవనాఽథ జీయర్ స్వామి కరీంనగర్లోని వావిలాలపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష్మీపూజ నిర్వహించారు. తిరుమలనగర్లో వికాస తరంగిణి యూని ట్ను ప్రారంభించారు. సప్తగిరికాలనీ కోదండ రామాలయాన్ని సందర్శించారు. కరీంనగర్కల్చరల్: అణుబాంబు కన్నా కవి త్వం బలమైందని ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఏటా అందిస్తున్న కాళోజీ పురస్కారాల వేడుకను గురువారం ఫిలింభవన్లో నిర్వహించారు. కొత్త అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 2024 ఏడాదికి గాను సిద్దిపేటకు చెందిన పప్పుల రాజిరెడ్డికి, 2025కు బోధన్కు చెందిన మొగిలి స్వామిరాజుకు పెద్దింటి అశోక్ కుమార్ చేతుల మీదుగా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో దోహదపడే కవులపాత్రకు పురస్కారాలే అసలైన గుర్తింపు అన్నారు. పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయన్నారు. కవులు సుదర్శనం వేణు, గుండేటి రాజు, కాండూరి వెంకటేశ్వర్లు, అన్నాడి గజేందర్రెడ్డి, స్తంభంకాడి గంగాధర్, దొమ్మటి శంకర్ ప్రసాద్, నీలగిరి అనిత, బొమ్మకంటి కిషన్, గంగుల శ్రీకర్, సునీత, కాసు మహేందర్ రాజు, గందె పరశురాములు,, రేగులపాటి విజయలక్ష్మి, సుగుణ, కూకట్ల తిరుపతి పాల్గొన్నారు. అర్చక చైతన్య యాత్రను విజయవంతం చేయాలి కరీంనగర్కల్చరల్: ఽదూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్లోని తాపాల నరసింహస్వామి ఆలయంలో జరిగే అర్చక చైతన్య యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తిరునగరి వెంకటాద్రి స్వామి ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి జిల్లా అర్చకులతో సదస్సు జరిగిన అనంతరం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయానికి యాత్రగా వెళ్లి కమిషనర్కు తీర్మానాలతో కూడిన వినతిపత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. -
కబడ్డీ ప్రారంభం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా కబడ్డీ కూత షురూ అయ్యింది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు గురువారం రాత్రి అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతా కాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాల బృందాల మార్చ్పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలిమ్యాచ్ పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. 8లోu -
కేన్సర్పై టీకాస్త్రం
● యుక్త వయసు బాలికలకు హెచ్పీవీ టీకాలు ● ఏర్పాట్లలో నిమగ్నమైన వైద్య ఆరోగ్యశాఖ ● జిల్లాలో 11వేల మంది అర్హులుగా గుర్తింపు ● ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తి ● ఆరోగ్య మహిళ ద్వారా జిల్లాలో మూడేళ్లలో 2.81 లక్షల మందికి స్క్రీనింగ్కరీంనగర్: మహిళలు ఇటీవల ఎక్కువగా కేన్సర్ బారిన పడుతున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా గుర్తించిన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అవసరం అయినవారికి చికిత్స అందిస్తోంది. రొమ్ము, సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) కేన్సర్ ఎక్కువగా వస్తోందని గుర్తించింది. యుక్త వయసులోని వారూ దీని బారిన పడుతున్నారు. కేన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుక్త వయస్సు (14–15 సంవత్సరాలు మధ్య) గల బాలికలకు టీకాలు ఉచితంగా వేయాలని సంకల్పించాయి. ఈ వయసు బాలికలకు హర్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకి కేన్సర్కు దారితీసే ప్రమాదముంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నిలువరించేందుకు హ్యూమన్ పాపిల్లో మా వైరస్ (హెచ్పీవీ) టీకాలు వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. జనవరిలో టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.బాలికల గుర్తింపు ప్రక్రియ జిల్లాలోని హైస్కూళ్లు, వసతి గృహాల్లో నమోదై ఉన్న 14–15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలను గుర్తించడంతో పాటు ఇంటింటి సర్వే చేపట్టి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బాలికల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 11 వేల మంది వరకు 14నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు ఉంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీరికి హెచ్పీవీ టీకాలు వేయడం ద్వారా కేన్సర్ మహమ్మారి నుంచి రక్షించే అవకాశముంది. ఇప్పటికే జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులకు కేంద్ర బృందం హెచ్పీవీ టీకాలపై సూచనలు ఇచ్చింది. మెడికల్ ఆఫీసర్లకు అవగాహన జిల్లాలో త్వరలో నిర్వహించే హెచ్పీవీ (కేన్సర్ నిరోధక) టీకాల నిర్వహణకు ఈనెల 10న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. టీకాలు వేసే కార్యక్రమంపై పూర్తిస్థాయిలో వివరించారు. వీరంతా తిరిగి మండలస్థాయిలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరిలో ప్రారంభమైన తేదీ నుంచి 90 రోజులలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.హెచ్పీవీ టీకాలు 2026 జనవరిలో జిల్లాకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో టీకాల కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్పీవీ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ టీకాలు వేసిన మాదిరిగానే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేసే కార్యక్రమం చేపడతాం. – డాక్టర్ సాజిదాఅతహరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐవో)గర్భాశయ, రొమ్ము, నోటి కేన్సర్, రుతుస్రావ ఇబ్బందులు, బరువు, థైరాయిడ్, లైంగిక వ్యాధులు, బీపీ, మధుమేహం, రక్తహీనత వంటి పరీక్షలు చేస్తున్నాం. జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారిరాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మంగళవారం మహిళా వైద్యాధికారులు, సిబ్బంది మహిళలకు పరీక్షలు చేస్తూ అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే మారుమూల ప్రాంతాలకు వెళ్లి శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు, మహిళా పోలీసులకు వైద్య పరీక్షలు చేశారు. రొమ్ము, గర్భాశయ, నోటి కేన్సర్ల గుర్తింపుతోపాటు మూత్ర పిండాల పరీక్షలు, రుతుస్రావ ఇబ్బందులు, లైంగికంగా వచ్చే సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, బరువు, థైరాయిడ్, బీపీ, మధుమేహం (షుగర్), అయోడిన్ లోపం, రక్తహీనత పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,81,000 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించగా, 89 మందికి గర్భాశయ కేన్సర్, 109 మందికి బ్రెస్ట్కేన్సర్, 101 మందికి ఓరల్ కేన్సర్ నిర్ధారణ అయింది. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. -
మత్స్యసాగు వైపు దృష్టి సారించాలి
కరీంనగర్: గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధితోనే దేశ ఆర్థికవృద్ధి సాధ్యపడుతుందని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్రావు అన్నారు. కరీంనగర్లో నిర్వహిస్తున్న ‘కిసాన్ గ్రామీణ మేళా’ గురువారం రెండోరోజు కొనసాగింది. కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు, మేళా నిర్వాహకుడు సుగుణాకర్రావు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎగువ మానేరు, కాళేశ్వరంతో వాటర్జంక్షన్గా మారిందన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు వరిసాగుకే పరిమితం కాకుండా, చేపలు, రొయ్యల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఎల్.జలపతిరావు మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పంట మార్పిడి విధానాలు అనుసరించాలన్నారు. ప్రముఖ వ్యవసాయ నిపుణుడు వెంకటేశ్వర్లు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై వివరించారు. ఆయన రచించిన పుస్తకాన్ని ఆవి ష్కరించి రైతులకు అంకితమిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. గొర్రెల పెంపకందారుల రాష్ట్ర ఫెడరేషన్ మాజీ చైర్మన్ రాజయ్యయాదవ్, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రభాకర్రావు, కరీంనగర్ డైరీ జనరల్ మేనేజర్ శంకర్రెడ్డి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన బుర్ర శ్రీనివాస్ (53) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన మేనకోడలు మానసను బైక్పై ఎక్కించుకుని చొప్పదండి వైపు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో జాబితాపూర్ శివారు బీబీరాజ్పల్లి సమీపంలోకి చేరగానే.. తన ముందు వెళ్తున్న వాహనదారుడు దొనకొండ రాజయ్య సడెన్ బ్రేక్ వేయడంతో శ్రీనివాస్ ఢీకొని కిందపడ్డాడు. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేదు. శ్రీనివాస్ కూతురు బుర్ర శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో రైతు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు మొడుసు మద్దుల భగవంతరెడ్డి(58) గురువారం పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. అమెరికాలో ఉన్న కుమారుడు హరీష్రెడ్డి రాక కోసం మృతదేహన్ని ఫ్రీజర్లో ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రెండు నెలల వ్యవధిలో ఎల్లారెడ్డిపేట మండలంలో ఐదుగురు అన్నదాతలు గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందడం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు. వ్యవసాయ పనులు చేసే భగవంతరెడ్డి ఒక రోజు ముందు నుంచి చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఆస్పత్రికి వెళ్దామని చెప్పి పొలానికి మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అక్కడే తీవ్ర నొప్పి రావడంతో వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భగవంతరెడ్డికి భార్య మణెమ్మ, కుమారుడు హరీశ్రెడ్డి, కూతురు అనిత ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. బ్యాటరీ దొంగల అరెస్ట్చొప్పదండి: మండలంలోని గ్రామాల్లో వాహనాల నుంచి బ్యాటరీల చోరీ చేస్తున్న ముఠాను చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ మహేశ్ జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేసి జైలుకెళ్లి వచ్చాడు. అక్కడ తిమ్మాపూర్ మండలం నల్లగొండకు చెందిన నిషాని నరేశ్ పరిచయం అయ్యాడు. నరేశ్ డబ్బు అవసరం ఉందని మహేశ్ను కోరగా, స్కూటీతో రావాలని సూచించాడు. స్కూటీపై ఇద్దరూ చొప్పదండి మండలంలో వాహనాల బ్యాటరీలు దొంగతనం చేస్తూ వచ్చారు. గుమ్లాపూర్, కాట్నపల్లి, ఆర్నకొండ గ్రామాల్లో అయిదు బ్యాటరీలు దొంగలించి చొప్పదండిలోని అనుమాండ్ల మల్లేశంకు విక్రయించారు. భూపాలపట్నం రోడ్డులో నిలిపి ఉన్న లారీల్లో అయిదు బ్యాటరీల దొంగిలించడానికి ప్రయత్నించారు. లారీ డ్రైవర్ చాకచక్యంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నరేశ్రెడ్డి కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కారు దగ్ధంమల్లాపూర్: నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు దగ్ధమైన సంఘటన మల్లాపూర్ మండలకేంద్రం శివారులో గురువారం వేకువజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన సంజీవ్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో ఆడెల్లి పోచమ్మ ఆలయానికి బయల్దేరారు. మండలంలోని పాతదాంరాజుపల్లిమార్గంలో 61వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తుండగా.. కారు ఇంజిన్లోంచి పొగలు రావడంతో సంజీవ్ అప్రమత్తమై కుటుంబసభ్యులందరిని కారులోంచి కిందకి దింపా డు. ఇంజిన్లో మంటలు చేలరేగి కారు పూర్తి గా దగ్ధమైంది. డ్రైవర్ సహా మిగిలిన వారందరూ క్షేమంగా ఉన్నారు. మల్లాపూర్ పోలీసులు ఘటనస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. -
‘గురుకులం సొసైటీ’కి పుల్స్టాప్
● విద్యార్థులందరూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి ● కేవలం విద్యార్థుల ఖర్చులు భరిస్తున్న గురుకుల సొసైటీలుజగిత్యాలఅగ్రికల్చర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ ద్వారా ఎస్సీ, బీసీ విద్యార్థినిలకు గురుకులం సొసైటీ కింద వ్యవసాయ విద్య అందించేందుకు మహిళా వ్యవసాయ కళాశాలకు శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతి రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కోరుట్లలో ఒకటి, బీసీ వెల్ఫే సొసైటీ ద్వారా కరీంనగర్లో మరొకటి ఏర్పాటు చేశారు. వ్యవసాయ కోర్సులో చేరిన విద్యార్థినులకు వసతులు కల్పించలేక సొసైటీలు చేతులెత్తేశాయి. దీంతో విద్యార్థినులు, ధర్నాలు, ఆందోళనలు చేయడంతో ప్రభుత్వ ఒత్తిడి మేరకు నిబంధనలు సవరించి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సొసైటీ కింద ఉన్న విద్యార్థినులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోకి మార్చారు. కోరుట్ల విద్యార్థులు పొలాస కళాశాలకు సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ కింద 2023–24లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను కోరుట్లలో ఏర్పాటు చేయగా.. 83 మంది చేరారు. అడ్మిషన్లు తీసుకున్నప్పటికీ టీచింగ్ స్టాఫ్ లేదు. ల్యాబ్లు లేవు. ప్రాక్టీకల్స్ లేవు. ఎలా ముందుకెళ్లాలో తెలియదు. పాఠాలు బోధించేందుకు, విద్యార్థినులు ఉండేందుకు సరైన వసతులు లేక అద్దెభవనాల్లో నెట్టుకుంటూ వచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ స్టాఫ్ను నియమించారు. ఇంత చేసినా జాతీయస్థాయిలో ఉండే ఐకార్ సంస్థ గుర్తించలేదు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో వారిని పొలాస కళాశాలకు తరలించారు. కరీంనగర్ మొదటి ఏడాది విద్యార్థినుల తరలింపు బీసీ గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో 2021లో మహిళా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయగా ప్రస్తుతం 360 మంది చదువుతున్నారు. ఇక్కడ కూడా చదువు, వసతుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ఇటీవల బీసీ సంక్షేమ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేర్చేందుకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే మొదటి ఏడాది విద్యార్థులను రాష్ట్రంలోని ఏడు కళాశాలల్లో 10 నుంచి 15 మందిని కేటాయించారు. రెండు, మూడో ఏడాది విద్యార్థులను త్వరలో సిరిసిల్ల, వరంగల్ వంటి ఇతర కళాశాలలకు తరలించనున్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిబంధనలు కఠినంగా ఉండటంతో సవరించే బాధ్యతలను ప్రభుత్వం వర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్యకు అప్పగించింది. ఆయన గురుకులం సొసైటీ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ వ్యవసాయ వర్సిటీ బోర్డు మెంబర్లు, ఫ్యాకల్టీ, అకడమిక్ కౌన్సిల్తో చర్చించి సామాజిక కోణంలో ఆలోచించి, విద్యార్థినుల భవిష్యత్ దెబ్బతినకుండా వ్యవసాయ కళాశాలల్లో కలపాలని నిర్ణయించారు. -
స్పోర్ట్స్ క్యాపిటల్గా కరీంనగర్ ఎదగాలి
● రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు ● అట్టహాసంగా సీనియర్స్ కబడ్డీ పోటీలు ప్రారంభంకరీంనగర్స్పోర్ట్స్: క్రీడల్లో కరీంనగర్ జిల్లా తెలంగాణలో స్పోర్ట్స్ కాపిటల్గా ఎదగాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనీయర్స్ పురుషులు, మహిళల కబడ్డీ చాంపియన్షిప్ పోటీ ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేయగా.. వారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. 2036లో జరగనున్న ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే దిశగా క్రీడాపాలసీని తీసుకొచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. నిఖత్ జరీన్ లాంటి ఎందరో క్రీడాకారులకు ప్రోత్సాహాన్నిచ్చి క్రీడల్లో ఆసక్తిని మరింత పెంచేలా ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అమిత్కుమార్ మాట్లాడుతూ.. 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు, 200 మంది రెఫరీలు, కోచ్లు, మేనేజర్లు, సంఘం బాధ్యులు హాజరైనట్లు చెప్పారు. 28 మంది పురుషులు, మహిళా క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ శాసన సభ్యుడు ఆరెపల్లి మోహన్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారులు శ్రీనివాస్రెడ్డి, గంగాధరి మల్లేశ్, కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ ఇ.ప్రసాద్రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, డీవైఎస్వోలు శ్రీనివాస్గౌడ్, సురేశ్, రాష్ట్ర, జిల్లాల కబడ్డీ సంఘం బాధ్యులు, కోచ్లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన మంత్రి సీనియర్స్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. మహిళల పోటీలను సైతం ప్రారంభించారు. పారమిత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీల సందర్భంగా రూపకల్పన చేసిన అల్బమ్లు ఆకట్టుకున్నాయి. -
ముగింపు దశకు కొనుగోళ్లు ..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరాయి. ఇప్పటికే చాలా సెంటర్లు మూసివేశారు. ఐదారు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయి. వడ్లు అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమవుతున్నాయి. గతంలో డిఫాల్ట్ ఉన్న మిల్లులకు ఈసారి వడ్లను ఇవ్వలేదు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే వడ్లను అందించాం. ప్రారంభంలో వర్షాలతో కొంత ఇబ్బంది ఎదురైనా.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ముగించాము. – బంధం చంద్రప్రకాశ్, డీసీఎస్వో, రాజన్న సిరిసిల్ల -
బర్కత్ లేని వానాకాలం
సిరిసిల్ల: వానాకాలం సీజన్లో వరికి పెద్దగా చీడపీడలు ఆశించలేవు. అలాగని చెప్పుకోతగ్గ స్థాయిలో పంట దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి గరిష్టంగా 30 క్వింటాళ్ల వడ్లు రావాల్సి ఉండగా 16 నుంచి 25 క్వింటాళ్ల మేరకే దిగుబడి వచ్చింది. వ్యవసాయాన్ని ముందుచూపుతో చేసే ఆదర్శ రైతులకు సైతం 30 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ పంట సీజన్లో వరికి దోమపోటు, సుడిదోమ, మెడవిరుపు వంటివి సోకలేదు. కానీ అకాల వర్షాలు.. అతి వర్షాలు.. పంట పొట్టదశలో ఉండగా కురిసిన వర్షాలతో దిగుబడి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 1,74,176 ఎకరాల్లో వరి పంట వేయగా.. ఇంతకుమించి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 1,84,860 ఎకరాల్లో వరి పంట వేసినా దిగుబడి డీలా పడ్డది. జిల్లాలో పంట దిగుబడి అంచనా 3,69,720 మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటి వరకు 2,65,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 50వేల మెట్రిక్ టన్నులను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా.. గత ఏడాది మేరకు దిగుబడి రాలేదు. ఈసారి మెజార్టీ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆధారపడ్డారు. సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇలా -
హత్యనా.. ఆత్మహత్యనా..?
● గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ● మల్లాపూర్ మండలం వాల్గొండకు చెందిన కుర్ర మల్లేశ్గా నిర్ధారణరాయికల్: రాయికల్ పట్టణంలోని చెరువులో రెండు రోజుల క్రితం కనిపించిన మృతదేహం మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన కుర్ర మల్లేశ్ (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వాల్గొండకు చెందిన కుర్ర మల్లేశం చిన్నతనంలోనే తల్లి నర్సు, తండ్రి పోచయ్య చనిపోయారు. మల్లేశ్ తన అక్క నవ్యతో కలిసి పనులు చేసుకుంటున్నాడు. నవ్యకు రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి మల్లేశ్ రాయికల్లో ఓ కాంట్రాక్టర్ వద్ద రోడ్డు పనులు చూసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఈనెల 11న పంచాయతీ ఎన్నికల్లో వాల్గొండలో ఓటు హక్కు వినియోగించుకుని అక్క వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో నవ్య రాయికల్ వచ్చింది. దీంతో మల్లేశ్ తిరిగి కాంట్రాక్టర్ వద్దకు వెళ్లినట్లు నవ్య భావించింది. మల్లేశ్ చెరువులో శవమై కనిపించడంతో బోరున విలపించింది. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు మల్లేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్యకు గురయ్యాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరు మృతి
మంథనిరూరల్: రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి శివారులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మంథని మండలం సూరయ్యపల్లికి చెందిన పిడుగు రాజ్కుమార్(33), 8వ కాలనీకి చెందిన రాంశెట్టి కిష్టయ్య(39) అక్కడికక్కడే మృతిచెందారు. మంథని ఎస్సై–2 సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ అతడి స్నేహితుడు కిష్టయ్య ద్విచక్రవాహనంపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భట్టుపల్లి శివారులోని మైసమ్మ గుడి వద్ద ఎలాంటి సూచికలు లేకుండా రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మంథని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చాలా ఇబ్బంది పడ్డాం
గురుకుల సొసైటీ పరిధిలో ఉన్నప్పుడు వ్యవసాయ చదువు పూర్తవుతుందనే భావన ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో చేర్చడంతో మంచి ప్రొఫెసర్లు వచ్చారు. నాణ్యమైన విద్య భోదిస్తున్నారు. – ఎస్.రోష్న, మంచిర్యాల ల్యాబ్లు ఉండేవి కావు గురుకులం సొసైటీ వ్యవసా య కళాశాలలో ల్యాబ్లు పెద్దగా ఉండేవి కావు. పొలా స కళాశాలలో చక్కటి తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్లు, ఆధునాతన లైబ్రరీ ఉన్నాయి. దీంతో వ్యవసాయ విద్యపై మరింత ఆసక్తి పెరిగింది. – డి.స్వప్న, హైదరాబాద్ కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి గురుకులం వ్యవసాయ కళాశాల నుంచి పొలాస కళాశాలకు వచ్చిన తర్వాత కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విద్యార్థినులందరం 80 శాతం ఉంటాం. విద్యతోపాటు ఇతర క్రీడా, సాంస్కృతిక రంగాలపై శిక్షణ ఇస్తున్నారు. – జి. పల్లవి, ములుగు -
రెండు ఆలయాల్లో చోరీ
ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని పురాతన ఆలయాలైన అక్కపల్లి శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మినృసింహాస్వామి ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. తాళాలు పగులగొట్టి.. విగ్రహాలపై ఉన్న వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో పట్టెనామాలు, కోరమీసాలు, రాజరాజేశ్వర స్వామి ఆలయం శివలింగానికి ఉన్న రెండు కిలోల వెండిపానవట్టం, అమ్మవారికి అలంకరించిన 80 గ్రాముల వెండి ముక్కుపుడక తొడుగు ఎత్తుకెళ్లారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం ఐదు గంటలకు పూజారి ప్రవీణ్కుమార్ ఆలయానికి చేరుకోగా.. తాళం పగులగొట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్ చేరుకుని ఆలయాల్లో పరిశీలించారు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో క్లూస్టీం చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
● నెలరోజుల్లో తల్లీకొడుకుల మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్కు చెందిన వంగల శ్రీనివాస్రెడ్డి(42) గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లి వంగల సుశీల నెల రోజుల క్రితం గుండెపోటుతో మరణించింది. తల్లి మొదటి మాసం పెట్టడానికి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం తల్లికి మొదటి నెల కార్యక్రమాలు పూర్తి చేశాడు. తల్లి మరణంతో కుంగిపోయిన శ్రీనివాస్రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకోవడంతో అప్పుల పాలైనట్లు తెలిపారు. అప్పులు తీర్చడానికి పెద్ద ఉద్యోగం లేకపోవడం, మరోవైపు తనకు అండగా ఉన్న తల్లి మరణించడంతో మనోధైర్యం కోల్పోయి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో తల్లి, కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య అర్చన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. -
ఐదుతరాల అను‘బంధం’
మంథని: ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకరమవుతున్న తరుణంలో ఆదర్శమైన అపురూప సన్నివేశం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య అమ్మాయి దంపతుల వారసులు గురువారం హైదరాబాద్లోని కొండాపూర్లో ఓ హాల్లో కలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 200 మంది ఒకే వేదికపై ఆనందం పంచుకున్నారు. ఆరునెలల శిశువులు మొదలు 80 ఏళ్ల వృద్ధులు ఐదుతరాల వారు ఈ అపురూప సన్నివేశంలో పాలుపంచుకున్నారు. నాటి కష్టాలను తలుచుకుంటూ నేటి విజయాలను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారుల ఆటాపాటలతో సంతోషంగా గడిపారు. -
క్రీస్తు జననం.. ఎల్లజనుల ఆనందం
● అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు ● నగరంలోని చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలుకరీంనగర్కల్చరల్: లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జిల్లాకేంద్రంలోని అన్ని చర్చిల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. మందిరాలను విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, బెలూన్లతో అలంకరించారు. నగరంలోని సెయింట్ జాన్స్ స్కూల్ పక్కన గల లూర్థూమాత మందిరంలో రోమన్ కాథిలిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్ తుమ్మ సంతోష్కుమార్ దైవ సందేశాన్ని వినిపించారు. క్యారల్స్బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చి, సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చిలోనూ తెల్లవార్లూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు దక్షిణ ఇండియా సంఘం కరీంనగర్ అధ్యక్ష మండలం మోడరేటర్ దిమోస్ట్ రెవ కె.రూబెన్ మార్క్ ఆధ్వర్యంలో కోర్టు సర్కిల్ నుంచి గీతాభవన్చౌరస్తా వరకు శాంతి యాత్ర నిర్వహించారు. రెవ జాన్, రెవ సి.రాములు ఇమ్మాన్యుయేల్, రెవ పాల్ కోమల్, పాస్టర్లు తిమోతి, డేవిడ్, జార్జ్ డేవిడ్, క్రిస్టోఫర్, సత్యానందం, బొబ్బిలి విక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మానాన్న ఆశ్రమానికి అవ్వ
జ్యోతినగర్(రామగుండం): కుటుంబసభ్యులు వద్దన్నా..అవ్వకు ప్రభుత్వ అధికారులు ‘అమ్మానాన్న’లో ఆశ్రయం కల్పించారు. దిక్కులేని వారికి ప్రభుత్వమే అండగా ఉందని నిరూపించారు. వివరాలు.. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన వృద్ధురాలు మొగిలమ్మ కొద్దిరోజులుగా రామగుండం రాజీవల రహదారి బీ – పవర్హౌస్ బస్స్టాప్ వద్ద అనాథగా ఉంటోంది. భిక్షాటన చేయడంతోపాటు తినడానికి ఎవరైనా ఇస్తేతీసుకుని కాలం గడుపుతోంది. సమాచారం అందుకున్న జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి స్వర్ణలత.. కలెక్టర్ ఆదేశాల మేరకు వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి యత్నించగా.. తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. శిశు సంక్షేమాధికారి ఆదేశాలతో వృద్ధురాలిని హైదరాబాదు చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు. నెలరోజుల క్రితం పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో ఓ వయోవృద్ధురాలు(80) కూడా ఇదేస్థితిలో ఉండడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యస్థితి బాగుపడిన తర్వాత చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రయానికి పంపించారు. హైదరాబాద్ తరలించిన ఎఫ్ఆర్వో స్వర్ణలత -
సాధారణ ప్రసవాలు చేయాలి
కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ సమావేశం నిర్వహించారు. ఒక్కో పీహెచ్సీ వారీగా సాధించిన ప్రగతి, కాన్పులు తదితర వివరాలపై సమీక్షించా రు. ప్రతీ పీహెచ్సీ, ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల కు గర్భిణులను ప్రోత్సహించాలన్నారు. ప్రసవాలు, ఆరోగ్య మహిళ, ఎన్ఆర్సీ, ఆర్బీఎస్కే, 108సేవలు, ఆరోగ్యశ్రీ, కంటి, డెంటల్ ఎగ్జామినేషన్, లెప్రసీ సర్వే, టీబీ, ఇమ్యూనైజేషన్ క్యాలెండర్, బూస్టర్ డోస్, గర్భిణుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంపై చర్చించారు. 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఆర్బీఎస్కే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని, పనితీరు మెరుగు పరచుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారి జిల్లాలో డెంటల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నామని పాఠశాలల్లో, పంచాయతీల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. టీబీ ముక్త్ భారత్లో భాగంగా నిక్షయ్ పోర్టల్లో టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా కేక్కట్ చేశారు. డీఎంహెచ్వో వెంకటరమణ, అదనపు డీఎంహెచ్వో సుధా, డిప్యూటీ డీఎంహెచ్వోలు చందునాయక్, రాజగోపాల్, ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన ఉన్నారు. -
రైతులకు న్యూ టెక్నాలజీ అందించాలన్నదే లక్ష్యం
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేసేందుకు వ్యవసాయ వర్సిటీలో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్, సెంటర్ ఫర్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. మానవ రహిత వ్యవసాయం చేసేలా రోబోటిక్స్, డ్రోన్స్, సెన్సార్ వంటి టెక్నాలజీపై పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఓ వైపు పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు రైతులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం ఖరీఫ్ సీజన్కు ముందు 1200 గ్రామాల్లో శ్రీరైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించాం. పరిశోధన స్థానాల్లో రూపొందించిన విత్తనాలను అభ్యుదయ రైతులకు ఉచితంగా ఇచ్చేలా విత్తన మేళాలు ఏర్పాటు చేశాం. వారు పండించిన విత్తనాలను గ్రామంలోని రైతులందరికీ అందేలా చూస్తున్నాం. గతంలో రైతు పిల్లలకు మాత్రమే వ్యవసాయ విద్యలో రిజర్వేషన్పరంగా సీట్లు ఉండేవి. ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు కూడా 180 సీట్లు ఇచ్చాం. గతంలో అగ్రికల్చర్ స్పెషల్ కోటా సీట్ల ఫీజు రూ.10 లక్షలు ఉంటే.. సామాన్యుడికి భారం కాకుడదని రూ.5లక్షలకు తగ్గించాం. ఈ మొత్తం కూడా ఒకేసారి కాకుండా సెమిస్టర్కు రూ.62,500 చొప్పున 8 విడతలుగా చెల్లించేలా నిబంధనలు తెచ్చాం. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వివిధ దేశాలతో పలు ఒప్పందాలు చేసుకుంది. అమెరికాలోని కాన్సాప్ స్టేట్ యూనివర్సిటీ, ఫ్లోరిడా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకున్నాం. దేశీయ సంస్థలైన బిట్స్పిలాని, ఐసీఎఆర్, ఐఐఆర్ఆర్, స్విట్జర్లాండ్కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ యూనివర్సిటిలో 2013 నుంచి వైస్ చాన్స్లర్ పోస్టు మినహా మిగతా ఖాళీగా ఉండేవి. నేను బాధ్యతలు తీసుకున్న 100 రోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారులు పోస్టులు భర్తీ చేసి పాలన సజావుగా జరిగేలా చూశాను. రిజిస్ట్రార్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డీన్ ఆఫ్ రిసెర్చ్, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్..ఇలా అన్ని పోస్టులను భర్తీ చేశాం. రసాయనాలు తగ్గించేలా సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు చేస్తున్నాం. పురుగుల మందులతో రక రకాల సమస్యలు వస్తున్నాయి. యూరియాపై సబ్సిడీ ఇవ్వడంలో కేంద్రప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలి. రాష్ట్రంలో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేని చోట రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఏడు వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటికి తోడు అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల, రెండు ఫుడ్ సైన్స్ కళాశాలలు, ఒక హోం సైన్స్ కళాశాల ఉంది. ఒక వ్యవసాయ కళాశాల స్థాపించేందుకు ఐసీఎఆర్ నిబంధనల ప్రకారం 100 ఎకరాలతోపాటు రూ.150 కోట్లు నిధులు అవసరం. ప్రతి కళాశాలకు 180 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో 40 మంది టీచింగ్ సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ జానయ్య జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లోకి తీసుకెళ్లేందుకు న్యూ టెక్నాలజీ రూపంలో ముందుకెళ్తున్నామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చిన ఆయన శ్రీసాక్షిశ్రీతో ముచ్చటించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య -
ఆర్డీవో కార్యాలయం ఎదుట వ్యక్తి హఠాన్మరణం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓదెల రాజేందర్ ఉరఫ్ రాజు(40) బుధవారం హఠాన్మరణం చెందారు. భూసంబంధమైన సమస్య పరిష్కరించాలంటూ గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఆరా తీసేందుకు ఆయన ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి రాజేందర్.. కార్యాలయం ఎదుట గుండెపోటుకుగురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు సుల్తానాబాద్లోని ఓప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతిధర్మపురి: తల్లిదండ్రులు మందలించారని క్షణికావేశంలో గడ్డిమందు తాగిన విద్యార్థిని చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్సై మహేష్ కథనం ప్రకారం.. మండలంలోని ఆరెపెల్లికి చెందిన నూతికట్ల రాజన్న దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు నీరజ (20) సంతానం. ధర్మపురిలో డిగ్రీ చదువుతోంది. చిన్నప్పటి నుంచే ఏ పని చేయకుండా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోంది. ఈనెల 17న తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. రాజన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తిమృతదేహంరాయికల్: పట్టణంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు. నాలుగు రోజుల క్రితం 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు శవాన్ని బయటకు తీసి చూడగా.. తల వెనుక గాయం కనిపించింది. ఎవరైనా దాడిచేశారా..? లేకుంటే చెరువులో నాలుగురోజులుగా ఉండటంతో క్రిమికీటకాలు తిన్నాయా..? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని చాతిపై అమ్మ, నాన్న, కుడిచేతిపై మౌనిక, మల్లేశం అనే టాటూలు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. -
పతుల పెత్తనానికి చెక్
కరీంనగర్రూరల్: గ్రామపంచాయతీ పరిపాలన వ్యవహారాల్లో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్పంచులుగా సతుల విధుల్లో పతులతో పాటు కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. గ్రామాల్లో గెలిచిన మహిళా సర్పంచులకు బదులుగా భర్తలు, కొడుకులు, కుటుంబసభ్యులు అధికారం చెలాయించడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 22న జరిగిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో సైతం కొన్ని గ్రామాల్లో భార్యలకు బదులుగా భర్తలు ప్రమాణం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం మెమో నంబరు–3,292 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీతో పాటు మండల పరిషత్, జెడ్పీలకు సైతం ఈ ఉత్వర్వులు వర్తింపచేయాలని సూచించింది. స్థ్ధానికసంస్థల్లో సగం సీట్లు మహిళలకే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. జిల్లాలో 316 సర్పంచు స్థానాలకు మహిళలకు 158, మొత్తం 2,946 వార్డు స్థానాలకు 1,483 కేటాయించారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 80 సర్పంచ్ స్థానాలు కేటాయిస్తే మహిళలకు 40స్థానాలు, బీసీలకు 73 స్థానాలిస్తే 37, మిగితా 163 జనరల్ స్థానాల్లో 81 మహిళలకు కేటాయించారు. జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎ న్నికల్లో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 1,641 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. జనరల్ స్ధానాల్లో సైతం మహిళలు పోటీచేసి సర్పంచులు, వార్డుసభ్యులుగా గెలుపొందారు. ఆచరణలో అమలయ్యేనా? మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబసభ్యుల పెత్తనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకాలేదు. గత పాలకవర్గంలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులస్థానంలో భర్తలు పాలన సాగించిన ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం భార్యలకు బదులుగా భర్తలకే ప్రాధాన్యత ఇవ్వడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. కరీంనగర్రూరల్ మండలంలోని ఓ పంచాయతీలో మహిళా సర్పంచ్కు బదులుగా భర్త అధికారం చెలాయించడంతోపాటు వేధింపులు భరించలేక కార్యదర్శులు బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వుతో మార్పు వస్తుందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల మార్కు కనిపిస్తుందని అంటున్నారు. -
వ్యవసాయం.. జీవన విధానం
కరీంనగర్: వ్యవసాయం వృత్తి కాదు.. జీవన విధానమని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళాను ప్రారంభించారు. స్టాల్స్ను సందర్శించారు. అధునాతన వ్యవసాయ యంత్రాలు, సీడ్స్, డెయిరీ, ఆర్గానిక్ స్టోర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకోసం రైతులు సంఘటితంగా మారాలన్నారు. తమ భూములను భూసార పరీక్ష చేసుకొని, తగిన మోతాదులో ఎరువులు వాడటం ద్వారా అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. కిసాన్ జాగరణ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, యువత వ్యవసాయం, ఇతర చేతివృత్తుల పైపు కాకుండా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వైపు వలసలు వెళ్తున్నారని అన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు, వారిని చైతన్యపరచుటకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు సమగ్ర వ్యవసాయం వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన రైతు రక్షణవేదిక యూట్యూబ్ చానల్ను దత్తాత్రేయ చేతుల మీదుగా ప్రారంభించారు. వరంగల్ మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్రావు, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ సమ్మిరెడ్డి, గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు మల్లేశం యాదవ్, మారుతి, బ్రహ్మం, శ్రీకాంత్రెడ్డి, మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షం హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కరీంనగర్లో కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం -
నానీ లే.. అన్నం పెడతా
● సెప్టిక్ ట్యాంకు తొట్టిలో పడి చిన్నారి మృతి ● సిరిసిల్లలో విషాదం సిరిసిల్లటౌన్: నానీ లే నానీ..ఆకలి అన్నావుగా..అన్నం పెడతా..ఆడుకునేటోన్ని నేను స్ట్రాంగ్ అంటావుగా ఇలా పడిపోయావు..లే నాన్న అంటూ.. ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటనీరు పెట్టించింది. బడి నుంచి వచ్చి ఆటకని బయటకు వెళ్లిన చిన్నారి సెప్టిక్ట్యాంకు తొట్టిలో పడి మృతిచెందిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మామిడి లావణ్య–శ్రీనివాస్ దంపతులకు నికేశ్(6) కొడుకు. లావణ్య అనారోగ్యంతో పట్టణంలోని సర్దార్నగర్లో తల్లి వద్దే ఉంటూ.. కొడుకును చదివిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదివే నికేశ్ రోజు మాదిరిగానే బడికెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆడుకునేందుకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి తల్లి లావణ్య కొడుకు కోసం ఆ ఏరియా మొత్తం గాలించింది. అదే ప్రాంతంలో కుసుమ శ్రీనివాస్ కొత్త ఇల్లు కడుతున్నాడు. సెప్టిక్ట్యాంకులో ఏదో పడిందని చూస్తుండగా బాలుడు పడిపోయినట్లు గమనించి స్థానికుల సాయంతో బయటకు తీయించారు. లావణ్య అక్కడికి చేరుకొని అచేతన స్థితిలో ఉన్న కొడుకుని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా సెప్టిక్ట్యాంకు తొట్టికి మూత లేకపోవడంతో ఆ ప్రదేశానికి ఆటకు వచ్చిన నికేశ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. -
వెంకన్న ‘ముక్కోటి’ ఉత్సవాలకు హాజరుకండి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆలయ కమిటీ సభ్యులు కోరారు. బుధవారం హుస్నాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ధర్మకర్తలు పూల లచ్చిరెడ్డి, శేషం నర్సింహాచార్యులు, జీల సంపత్, ఎనగందుల లక్ష్మణ్, దుబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.కరీంనగర్టౌన్: సీపీఐ ఆవిర్భవించి డిసెంబర్ 26నాటికి 100 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఖమ్మంలో 2026 జనవరి 18న నిర్వహంచతలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ నగరంలోని కట్టారాంపూర్లో సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. వందేళ్లుగా సుదీర్ఘ ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపెల్లి రాజు, కసిరెడ్డి, మణికంఠరెడ్డి, కసిబోజుల సంతోష్చారి పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,450జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,450 పలికింది. బుధవారం 253 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,350, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. గురువారం నుంచి ఆదివారం వరకు మార్కెట్కు సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు. వోఅండ్ఎం సిబ్బందికి పదోన్నతికొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని పలువురు వోఅండ్ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేయగా ఎస్ఈ మేక రమేశ్బాబు వారికి పోస్టింగ్లు కేటాయించారు. ముగ్గురు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లకు ఫోర్మెన్ గ్రేడ్–1గా, ఆరుగురు లైన్ ఇన్స్పెక్టర్లకు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లుగా, ఫోర్మెన్ గ్రేడ్–4ను ఇన్చార్జి ఫోర్మెన్ గ్రేడ్–2గా పోస్టింగ్ ఇస్తూ ఎస్ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్జెండర్లకు పునరావాస పథకంకరీంనగర్ టౌన్: జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక పునరవాస పథకం కింద రూ.75 వేల చొప్పున 3 యూనిట్లకు రూ.2,25000 ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో కేటాయించినట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ మూడు యూనిట్లకు జిల్లాలో అర్హులైన ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు తగిన ధృవపత్రాలతో ఈనెల 31లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55ఏళ్ల వయసువారు అర్హులని, కలెక్టర్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించరాదన్నారు. అభ్యర్థులు ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ పొంది ఉండకూడదని, ఏదైనా యూనిట్ కోసం శిక్షణ పొందిన అభ్యర్థికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తిగల వారు తగిన ధ్రువీకరణపత్రాలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
డబ్బులు ఇప్పించాలని సెల్ టవర్ ఎక్కిన రైతు
● ఎస్ఐ సూచనతో దిగివచ్చిన బాధితుడు ఇల్లంతకుంట(వేములవాడ): అమ్మిన భూమి పైసలు ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కగా.. పోలీసులు కల్పించుకోవడంతో దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్ కర్ల రవి బుధవారం వల్లంపట్ల పొలిమేరలోని సెల్టవర్ ఎక్కాడు. అది చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెల్టవర్ పై నుంచే తన బాధను ఫోన్లో ఎస్సైకి వివరించగా.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దిగి వచ్చాడు. తన 3.13 ఎకరాల వ్యవసాయ భూమిని రూ.75.47లక్షలకు గ్రామానికి చెందిన మాందాటి కరుణాకర్రెడ్డికి మూడేళ్ల క్రితం అమ్మి రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. అయితే ఇంకా తనకు వడ్డీతో సహా రూ.43లక్షలు రావాల్సి ఉందని, ఇవ్వడం లేదని తెలిపారు. రెవెన్యూ అధికారి శశికుమార్ రిపోర్ట్ నమోదు చేసి తహసీల్దార్ ఫరూక్కు అందజేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కర్ల రవి అధికారులను వేడుకున్నాడు. -
రైళ్ల వేగం మరింత పెంపు
● రైలుపట్టాల కింద సిమెంట్ స్లీపర్లు ● పాత సిమెంట్ స్లీపర్ల తొలగింపు ● కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య పనులు ఓదెల(పెద్దపల్లి): కాజీపేట బల్హార్షా సెక్షన్ల మధ్య రైళ్లవేగం మరింత పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు రైలుపట్టాల కింద కొత్త సిమెంట్ స్లీపర్లు అమర్చుతున్నారు. ప్రస్తుతం మూడోలైన్ అందుబాటులోకి రావడంతో ఒకేమార్గంలో రెండు రైళ్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. కాలం చెల్లిన సిమెంట్ స్లీపర్లను తొలగించి రైలు వేగాన్ని తట్టుకునేలా గేజ్పెంచిన ఆధునిక సిమెంట్ స్లీపర్లు వేస్తున్నారు. ఒక్కో రైలు వేగం గంటకు 110 కి.మీ. ఉందని, దానిని గంటకు 130 కి.మీ. వరకు పెంచేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడోలైన్తో గూడ్సురైళ్ల వేగం కూడా పెంచనున్నారు. ఒక రైలు వెనకాల మరోరైలు వెళ్లేందుకు వీలుగా ఆటోమెటిక్ సిగ్నల్స్ సిస్టం ప్రారంభించారు. -
ముక్కిపోయి.. పురుగుపట్టి..
జిల్లాలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం వివరాలుబఫర్ గోదాముల్లో : 4,732.223 మెట్రిక్ టన్నులుఎంఎల్ఎస్ పాయింట్లలో : 481.248 మెట్రిక్ టన్నులుమొత్తం : 5,213.471 మెట్రిక్ టన్నులుజిల్లాలోని రేషన్ దుకాణాలు : 566మిగిలిపోయిన బియ్యం : 5,821.31 క్వింటాళ్లుమానకొండూర్ మండలం కొండపల్కల రేషన్ దుకాణంలో మిగిలిపోయిన దొడ్డుబియ్యంమానకొండూర్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తుండగా.. డీలర్లకు పెద్ద సమస్యే వచ్చి పడింది. సన్నబియ్యం ప్రారంభానికి ముందు దుకాణాలతో పాటు స్టాక్యార్డుల్లో పెద్ద ఎత్తున దొడ్డుబియ్యం మిగిలిపోయాయి. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించగా.. మిగిలిపోయిన దొడ్డు బియ్యం పది నెలలుగా రేషన్షాపులు.. స్టాక్యార్డుల్లో ముక్కిపోయి.. పురుగు పడుతున్నాయి. బియ్యం తరలింపునకు టెండర్లకు ఆహ్వానించగా.. ధర ఎక్కువగా ఉందని నిర్వాహకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా రెండుసార్లు జరగ్గా.. మూడోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే ఉన్న దుకాణాల్లో ఇప్పటికే స్థలం సరిపోవడం లేదనే.. ఇరుకు గదులతో రేషన్ పంచేందుకు ఇబ్బంది పడుతుంటే దొడ్డుబియ్యం తలనొప్పిగా మారాయని డీలర్లు అంటున్నారు. రేషన్ డీలర్ల ఇబ్బందులు జిల్లాలో సన్నబియ్యం పథకం ప్రారంభమై పది నెలలు అవుతోంది. అప్పటికే స్టాక్ పాయింట్లు, రేషన్షాపుల్లో దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. ఈ బియ్యాన్ని అధికారులు తీసుకెళ్లాల్సి ఉండగా.. నేటికి, స్టాక్ పాయింట్లు, రేషన్షాపుల్లోనే మూలుగుతున్నాయి. బియ్యంలో పురుగు తయారై డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డు బియ్యంలో ఉన్న పరుగు ప్రతినెల రేషన్షాపునకు వస్తున్న సన్నబియ్యంలోకి చేరుతుండంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. చాలీ చాలని స్థలంలో రేషన్షాపులు నిర్వహిస్తున్నామని, పురుగు తీవ్రత పెరిగిపోతోందని, మిగిలిపోయిన దొడ్డు బియ్యం స్టాక్ను తీసుకెళ్లాలని కోరుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, రుక్మాపూర్ గోదాముల్లో 4,732.223 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగిలి పోగా, కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట ఎంఎల్ఎస్ పాయింట్లలోని గోదాంల్లో 481.248 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. జిల్లాలోని 566 రేషన్షాపుల్లో 5,821.31 క్వింటాళ్ల దొడ్డుబియ్యం మిగిలిపోయాయి. గతంలో సివిల్ సప్లై అధికారులు మిగిలిపోయిన దొడ్డుబియ్యానికి టెండరు నిర్వహించగా, రేటు గిట్టుబాటు కాక ఎవరూ ముందుకు రాలేదు. సమస్య తీవ్రం అవుతోందని, ఎలాగైనా బియ్యం తరలించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.రేషన్షాపుల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెల వచ్చిన స్టాక్ దింపుకునేందుకు స్థలం లేకుండా పోతోంది. మిగిలి ఉన్న దొడ్డుబియ్యం పాడవుతోంది. నల్ల, తెల్ల పురుగులొస్తున్నాయి. వీటితో సన్నబియ్యం సైతం పాడవుతున్నాయి. దొడ్డు బియ్యం తరలింపునకు రెండుసార్లు టెండరు పిలిచారు. రేటు ఎక్కువగా ఉందని ఉవరూ ముందుకు రావడం లేదు. మరోసారి టెండరు పిలిచినా, ఉన్నరేటు కారణంగా ముందుకువస్తారన్న నమ్మకం లేదు. – రొడ్డ శ్రీనివాస్, రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
గ్రామాల్లో పెద్దన్న పాత్ర పోషించాలి
కొత్తపల్లి(కరీంనగర్): గ్రామాల్లో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలతో సఖ్యతగా మెదులుతూ పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజెపీ సర్పంచ్లు గెలిచిన 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కరీంనగర్ సూర్యనగర్లోని శుభం గార్డెన్స్లో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీ గెలిచిన గ్రామాల్లో మొదటి ప్రాధాన్యంగా ఊరికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్నారు. పీహెచ్సీలకు అవసరమైన వైద్య పరికరాలు అందిస్తానన్నారు. సర్కారు స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇతర సర్పంచ్లకు ఆదర్శంగా బీజేపీ సర్పంచులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పార్టీ గుర్తుతో ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్కు ఒక్కసీటు వచ్చే పరిస్థితి లేదని తెలిసే, గెలిచిన వాళ్లంతా కాంగ్రెసోళ్లేనని గంప కింద కమ్మేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులంతా గెలిపించుకునేందుకు పార్లమెంట్కు వెళ్లకుండా అమిత్షా నుంచి అనుమతి తీసుకుని కరీంనగర్లో మకాం వేశానని, కొంత మంది కార్యకర్తలు పోటీ చేయాలంటే నామినేషన్ వేయడానికి కూడా పైసల్లేని పరిస్థితుల్లో 500 పంచాయతీల్లో పోటీ చేసి బీజేపీ ఉనికి చాటిందన్నారు. కరీంనగర్ ఇన్చార్జి డాక్టర్ మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
నేటినుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: నేటి నుంచి నాలుగు రోజుల పాటు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం కబడ్డీ కూతతో హోరెత్తనుంది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారు. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు క్రీడాదుస్తులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ అమిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, కోచ్లు మల్లేశ్, శ్రీనివాస్, పద్మ అందించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ, ప్రముఖులు హాజరుకానున్నారు. -
కబడ్డీ.. కబడ్డీ
కరీంనగర్స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ.. కూత రేపటినుంచి నగరంలో హోరెత్తనుంది. రాష్ట్రస్థాయి కబడ్డీపోటీలకు కరీంనగర్ వేదికై ంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అంబేద్కర్స్టేడియంలోని హాకీ మైదానంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. 17ఏళ్ల తరువాత రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళల విభాగంలో 32 జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి 2 జట్లు హాజరుకానున్నాయి. మొత్తంగా 34 చొప్పున పురుషుల, మహిళల జట్లు ట్రోపీ కోసం పోటీపడనున్నాయి. 952 మంది క్రీడాకారులు, 156 మంది కోచ్, మేనేజర్లు, 100 మంది రెఫరీలు, 40 మంది కబడ్డీ సంఘం ప్రతినిధులు హాజరుకానున్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఆస్ట్రో టర్ఫ్ కోర్టులపై ఆట అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానాన్ని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్లో తొలిసారిగా ఆస్ట్రోటర్ఫ్ కోర్టులపై కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. గతంలో ఇదే స్టేడియంలోని ఇండోర్హాల్లో కబడ్డీ ప్రీమీయర్ లీగ్ నిర్వహించారు. ఈసారి ఆరు కోర్టులు సిద్ధం చేస్తున్నారు. మంత్రులతో ప్రారంభం 17 ఏళ్ల తరువాత కరీంనగర్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నట్లు కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు తెలిపారు. 28న జరిగే ముగింపు పోటీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. 8 చొప్పున పూల్లు.. 142 మ్యాచ్లు అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులు కబడ్డీ కూత మోగనుంది. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. మహిళలు, పురుషుల జట్లను 8 విభాగాల చొప్పున మొత్తం 16 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తంగా 142 మ్యాచ్లు జరుగనున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో మ్యాచ్లు జరుగనున్నాయి. రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపికచేసి, 72వ జాతీయస్థాయి సీనియర్స్ పోటీలకు పంపనున్నారు. మహిళల జాతీయ కబడ్డీ పోటీలు హైదరాబాద్లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుండగా, పురుషుల పోటీలు గుజరాత్లో ఫిబ్రవరి 24 నుంచి 27వరకు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జరిగే 72వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్, పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ.ప్రసాద్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో పోటీల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వేదికగా 17ఏళ్ల అనంతరం కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, కబడ్డీ సంఘం కోశాధికారి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. రేపటి నుంచి కరీంనగర్ వేదికగా రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు 33 జిల్లాల నుంచి హాజరుకానున్న క్రీడాకారులు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కబడ్డీ సంఘం -
వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చితేనే రైతులకు మనుగడ సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయంలోనూ ఇతర దేశాలతో పోటీపడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మనం పండించిన పంటల్లో రసాయనాల శాతం అధికంగా ఉండటంతో అమెరికా వంటి చాలా దేశాలు మన ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని తెలిపారు. సహకార సంఘాలు, ఎఫ్పీఓ సంఘాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రతి పంటకూ ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. రైతు భూసార పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు రసాయన ఎరువులు వాడాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ మాట్లాడుతూ.. మానవ రహిత వ్యవసాయం చేసేందుకు వర్సిటీ పరిధిలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ.. మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటల సరళి మార్చాలన్నారు. వరి పంటల్లో యాజమాన్య పద్ధతులపై శ్రీనివాస్, నూతన వరి రకాలపై సతీష్చంద్ర, యాసంగి పంటల్లో వచ్చే తెగుళ్లపై ఎన్.సుమలత, పంటల్లో యాజమాన్య పద్ధతులపై వై.స్వాతి, రవి, మామిడి పంటపై కె.స్వాతి, రబీలో జింక్లోపంపై సాయినాథ్ వివరించారు. కోతుల బెడదతో వ్యవసాయం చేయలేకపోతున్నామని, రైతులకు అవసరమైన విషయాలపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని రైతులు కోరారు. ఉత్తర తెలంగాణలోని వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, చెరుకు, పత్తి, నువ్వులు, మొక్కజొన్న రకాలను ప్రదర్శనగా పెట్టారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్, పొలాస సర్పంచ్ శంకరయ్య పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్, హాజరైన వివిధ జిల్లాల రైతులు రైతు వ్యాపారిలా ఆలోచించాలి అప్పుడే అన్నదాతలకు మనుగడ పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ రైతు సదస్సు పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు అలరించిన స్టాళ్లు -
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ను జీపీటీ హుస్నాబాద్ కళాశాల జట్టు కై వసం చేసుకోగా బాలికల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు కై వసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్ బాలికల విభాగంలోలో కె.కీర్తన (కరీంనగర్), బాలుర విభాగంలో బి.అభిషేక్(కోరుట్ల) చాంపియన్గా నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి ట్రోపీలు అందజేశారు. బాలికల విజేత కరీంనగర్, బాలుర చాంపియన్ హుస్నాబాద్ -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..?
● హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళనజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద శక్తి మిల్క్ డెయిరీలో కలవేని కిరణ్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన కిరణ్ మిత్రుడు రాజేశ్తో కలిసి అన్నపూర్ణ థియేటర్ వద్ద శక్తి మిల్క్ డెయిరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరు కలిసి దుకాణం మూసి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం ఉదయం లేచేసరికి కిరణ్ దుకాణంలో ఉరేసుకుని కనిపించాడు. దీంతో రాజేశ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కిరణ్కు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి భార్య వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. -
మా బతుకులు మారవా..?
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన ● జీతం చారెడు.. పని బారెడు ● అరకొర వేతనాలతో ఇబ్బందులు కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1,993 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నా ప్రభుత్వాలు తమపై చిన్నచూపు చూస్తున్నాయని వాపోతున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు చర్చలకు పిలిచినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సచివాలయానికి పిలిచి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ నెరవేరకపోవడంతో తమ పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,993 మంది ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్షా విభాగంలో వివిధ కేటగిరీల్లో 1,993 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 560 మంది, కరీంనగర్లో 560, పెద్దపల్లిలో 428, రాజన్నసిరిసిల్లలో 445 మంది ఉన్నారు. కేజీబీవీల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, యూఆర్ఎస్ పాఠశాలల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, డీపీవో కాంట్రాక్ట్ స్టాఫ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్, ఎంఆర్సీ కంప్యూటర్ ఆపరేటర్స్, భవిత సెంటర్లలో ఐఈఆర్పీలు, సీర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఎంఆర్సీ మెసెంజర్లుగా, వాచ్మెన్లుగా, స్కావెంజర్, కుక్స్గా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత కరువు విధి నిర్వహణలో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి, ఇతరకారణాల వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణిస్తే ప్రభుత్వం నేటి వరకు ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆదుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా టీఏ, డీఏలు ఇస్తూ ఉద్యోగ భద్రత, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మొండిచేయి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, గతంలో ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ నియామకాలకు సరిపోయే విద్యార్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
అనారోగ్య సమస్యలతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన పర్స ధనుష్ (17) అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ధనుష్ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు పుట్టుకతోనే షుగర్, ఫిట్స్ వ్యాధులతో బాధపడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించిన ముస్తాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమేడిపల్లి: మానసిక ఒత్తి డి తట్టుకోలేక ఉరేసుకు ని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్లో చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. గొల్లపల్లి జలందర్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, కొద్ది నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జలందర్ ఇలీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 18 నెలలుగా ఒంటరిగా ఉంటున్న జలందర్ మానసికంగా బాధపడుతున్నాడు. జీవితం మీద విరక్తితో మంగళవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేతరాయికల్: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను మంగళవారం తహసీల్దార్ నాగార్జున మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. వివాహేతర సంబంధం అనుమానంతో దాడి సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని సుగ్లాంపల్లి వద్ద మేకల శ్రీనివాస్పై మంగళవారం దాడి జరిగింది. కరీంనగర్ జిల్లా మందలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్కు పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె భర్త, కొడుకు, కొడుకు స్నేహితులు ఈ దాడి చేశారు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. సదరు వివాహిత, ఆమె భర్త మధ్య గొడవలు జరుగుతుండగా.. భర్తపై ఫిర్యాదు చేసేందుకు పరిచయం ఉన్న శ్రీనివాస్తో కలిసి వివాహిత ద్విచక్రవాహనంపై తొలుత పెద్దపల్లికి వెళ్లింది. అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తుండగా.. ఆమె కొడుకు సోన్నాయిటెంకం అభిషేక్, భర్త చంద్రమోహన్, కొడుకు స్నేహితులు ఎల్లంకి సాగర్, తాటిపల్లి వినయ్ కలిసి సుగ్లాంపల్లి వద్ద కాపుకాసి శ్రీనివాస్పై కత్తితో దాడి చేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీ కోల్సిటీ(రామగుండం): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ ఆదేశాలతో గోదావరిఖనిలోని స్కానింగ్ కేంద్రాలను, ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోగ్రాం అధికారి వాణిశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ, లింగనిర్ధారణ చట్ట విరుద్ధమన్నారు. పుట్టబోయే పిల్లలు ఆడ అయినా, మగ అయినా సమానమే అనే భావన ప్రజల్లో పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చదువులకు లేని పైసలు అందాల పోటీలకు ఎక్కడివి?
● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి పెద్దపల్లి: చదువులకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అందాల పోటీలు, ఆటలకు ఎక్కడి నుంచి వెచ్చిస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నాలుగో మహాసభలు మంగళవారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ విద్యార్థులకు ఇచ్చిన ఒక్కహామీ కూడా అమలు చేయలేదన్నారు. కేంద్రప్రభుత్వం మతం పేరిట రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి కమాన్ చౌరస్తా, ఎన్ఎస్ గార్డెన్ వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జెండాను ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మార్కపురి సూర్య ఆవిష్కరించారు. సాయిఆజాద్ అధ్యక్షతన మహాసభలు జరిగాయి. రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్, కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఉపాధ్యక్షుడు మొలుగూరి నితిలేశ్, కోశాధికారి ఎల్కపల్లి సురేశ్, కార్యవర్గ సభ్యులు మాతంగి సాగర్, గుండ్లా లక్ష్మీప్రసన్న, పల్లె హర్ష, సాయిఅనుప్, సాయితేజ, పూదరి సాయి, అభిషేక్, చైత్ర, మైథిలి, సాయిశరణ్య, వైశాలి తదితరులు పాల్గొన్నారు. -
ఇటుకబట్టీల్లో విచారణ
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట గ్రామశివారులోని ఓ ఇటుకబట్టీలో రెవెన్యూ, పోలీస్, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. కనీస సౌకర్యాలు లేవని జాతీయ మానవహక్కుల సంఘానికి కొంతకాలం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేసినట్లు తెలిసింది. ఇటుకబట్టీ నిర్వహణ తీరు పరిశీలించిన కార్మికశాఖ అధికారి హేమలత, రూరల్ ఎస్సై మల్లేశ్, రెవెన్యూ డెప్యూటీ తహసీల్దార్ విజేందర్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు తనిఖీచేసి నివేదిక రూపొందించారు. బుధవారం కలెక్టర్కు నివేదించనున్నట్లు కార్మికశాఖ అధికారి హేమలత తెలిపారు. -
పొగమంచుతో రైళ్ల ఆలస్యం
రామగుండం: ఉత్తరాదిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో న్యూఢిల్లీ, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి వచ్చే పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. అయ్యప్ప మాలాధారణ స్వాములు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. న్యూఢిల్లీ నుంచి చైన్నె, త్రివేండ్రం వైపు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్ల మంగళవారం చాలా ఆలస్యంగా నడిచాయి. మధురై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20494) మధ్యాహ్నం 2.53 గంటలకు రామగుండం రావాల్సి ఉంది. కానీ, ఏడు గంటల ఆలస్యంతో రాత్రిపది గంటలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్(20806) మధ్యాహ్నం 3.50గంటలకు రావాల్సి ఉండగా ఆరు గంటల ఆలస్యంగా నడుస్తోంది. జీటీ ఎక్స్ప్రెస్(12616) సాయంత్రం 4.10గంటలకు రావాల్సి ఉండగా 4 గంటల ఆలస్యంగా నడుస్తోంది. కేరళ ఎక్స్ప్రెస్(12626) మధా్య్హ్నం 3.23గంటలకు రావాల్సి ఉండగా 11 గంటల ఆలస్యంతో బుధవారం వేకువజామున నాలుగు గంటలకు రామగుండం రానుంది. సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12296 ) రాత్రి 9.45గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటల ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. -
కొత్త పంటల గురించి తెలిసింది
మా ప్రాంతంలో పత్తి, జొన్న, మక్క వేస్తాం. పరిశోధన స్థానంలో సాగుచేసే ఆవాలు, అలిసెంత వంటి కొత్త పంటల గురించి తెలుసుకున్నాం. కొత్త విషయాలు తెలుసుకునేందుకు పొలాస పరిశోధన స్థానంలో జరిగే ప్రతి సదస్సుకు హాజరవుతుంటాను. – గంగుబాయి, ఊట్నూర్, మంచిర్యాల జిల్లా ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలను ఆకళింపు చేసుకుని, మా పొలంలో ప్రయోగాలు చేస్తుంటాను. రైతు సదస్సుకు రావడంతో ఎన్నో కొత్త సాగు విషయాలు తెలిశాయి. తోటి రైతులు సాగు చేసే పంటల గురించి తెలుసుకున్నాను. – పవన్కుమార్, బోధన్, నిజమాబాద్ జిల్లా రైతు సదస్సులో ఖర్చు తగ్గించే పద్ధతులు చెప్పారు. యాసంగిలో పంటల్లో ఏ సమస్యలు వస్తాయి..? వాటిని ఎలా ఎదుర్కోనాలనే విషయాలను వివరించారు. వరిని ఎక్కువగా సాగు చేస్తుండటంతో ఇతర పంటలవైపు దృష్టి మళ్లింది. – మహేష్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
విద్యుత్ బిల్లు రద్దు చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ బిల్లు, ససవరణ బిల్లు(విద్యుత్ ప్రైవేటీకరణ)–2025 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్, ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈ) పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ శాంతి అనే విద్యుత్తు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు ను నిలిపివేయాలన్నారు. బిల్లును ప్రవేశపెడితే విద్యుత్ ఉద్యోగులు, రైతులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ నాయకులు రమేశ్, రఘు, రాజు, షరీఫ్, పవన్ కుమార్ వెంకట్ నారాయణ, శ్రీనివాస్, స్వామి, సంపత్ కుమార్, సత్యనారాయణ, శ్యామయ్య, శ్రీనివాస్, మహేందర్, శ్రీమతి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్అండ్బీ, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, ఇతరశాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, గతంలో గుర్తించిన బ్లాక్స్పాట్ల నివారణ చర్యలు, గత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్బోర్డులు ఏర్పా టు చేయాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డుసేఫ్టీ కమిటీ మీటింగ్లో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకొని, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలన్నారు. పాఠశాల బస్సులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ అతికించాలని సూ చించారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్– జగిత్యాల రోడ్డు కు ఇరువైపులా చెట్లకొమ్మలు ఎక్కువగా ఉన్నందున రాత్రివేళలో దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులను తొలగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
కరీంనగర్క్రైం: రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ పోలీసులకు కమిషనరేట్లోని కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ గౌస్ ఆలం హాజరై మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. నేరగాళ్ల కొత్త పద్ధతులపై పోలీసులకు అవగాహన ఉంచుకోవాలన్నారు. సైబర్ మోసాలు, డిజిట ల్ అరెస్టు, యూపీఐ లావాదేవీలు, నకిలీనోట్ల గుర్తింపు, సైబర్నేరాలపై ఫిర్యాదు చేసే విధా నం, ఆర్బీఐ, అంబుడ్స్మెన్ల సేవలపై వివరించారు. నగదు రహిత లావాదేవీలతో కలిగే ప్ర యోజనాలు, సైబర్ భద్రతా చిట్కాలను వివరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్బీఐ ఇంటిగ్రెటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజీత్ హోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు. మానకొండూర్: గత రెండేళ్లలో ప్రజలు బీఆర్ఎస్ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్చి పోయారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి వడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే సత్యం చేసిన వ్యాఖ్య లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ఖండించారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ కేసీఆర్పై అసందర్భంగా మాట్లాడటం అనుచితమన్నారు. హైడ్రా, మూసీ అక్రమ కూల్చివేతలు, బనకచర్ల భూసే కరణపై పోరాటం చేశామన్నారు. రాజకీయ అవగాహన లేకుండా ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. మాజీ జెడ్పీటీసీ టి.శేఖర్, యాదగిరి పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: ఉపాధి పఽథకాన్ని రద్దు చేసి, దానిస్థానంలో పేదల పొట్టగొట్టే పథకాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇందుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం గాంధీరోడ్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాయకులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు పాల్గొన్నారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు జెడ్పీ పాఠశాలలో మంగళవారం నెహ్రు యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్స్పోర్ట్స్ మీట్ను జిల్లా యువజనశాఖ అధికారి రాంబాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్పోటీలు హోరాహోరీగా జరిగాయి.కబడ్డీలో మా సేవా, నగునూరు జట్లు ఫైనల్కు చేరాయి. సర్పంచ్ సాయిల్ల శ్రావణి, హెచ్ఎం రవీందర్, మై భారత్ యూత్ వలంటరీ గణేశ్, పీడీ సౌజన్య పాల్గొన్నారు. -
త్వరలో కాంగ్రెస్ కొత్త కమిటీలు
● కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్కుమార్ కరీంనగర్కార్పొరేషన్: జనవరి 1వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కమిటీల ఎన్నిక నేపథ్యంలో పాత కమిటీలు రద్దయ్యాయని అన్నారు. వారం రోజుల్లోగా కార్పొరేషన్ పరిధిలో కమిటీలను పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం పీసీసీ నుంచి పరిశీలకులుగా నమిండ్ల శ్రీనివాస్,గుత్తా అమిత్రెడ్డిలు నియమితులయ్యారన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సూచన మేరకు త్వరలో పరిశీలకులతో సమావేశం ఉంటుందన్నారు. నగరంలోని 66 డివిజన్లకు గాను 11 డివిజన్లకు ఒకటి చొప్పున ఆరు జోన్లుగా విభజించి కమిటీలను నియమిస్తామన్నారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. నాయకులు ఎండీ.తాజ్, మడుపు మోహన్, సిరాజ్ హుస్సేన్, శ్రావణ్ నాయక్, మహమ్మద్ అజీమ్, బోనాల శ్రీనివాస్, అహమ్మద్ అలీ, అబ్దుల్ రహమాన్, వంగల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల(కోమండ్లపల్లి)కి చెందిన ఐలవేణి వెంకటేశ్(28) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం పైనుంచి పడి మృతిచెందాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. వెంకటేశ్ ద్విచక్రవాహనంపై నీరుకుల్ల రంగనాయకస్వామి ఆలయం వైపు వెళ్లారు. పనిముగించుకుని రాత్రి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రంగంపల్లి వద్ద వద్ద ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే విజయరమణరావు పరామర్శించారు. వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలు చీకట్ల సమ్మక్క సోమవారం తప్పిపోయినట్లు టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లికి చెందిన సమ్మక్కగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 81064 79146, 83319 40691లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఒంటరైన చిన్నారి● నాడు తల్లి... నేడు తండ్రి మృతి కోనరావుపేట(వేములవాడ): నాడు తల్లి.. నేడు తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన మారు అంజిరెడ్డి(65) భార్య మల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ మూడేళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి అంజిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. దీంతో వారి కూతురు నైనిక ఒంటరిగా మారింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి పరామర్శించారు. -
అన్నదమ్ములను కలిపిన పంచాయతీ ఎన్నికలు
వీర్నపల్లి(సిరిసిల్ల): సర్పంచ్ ఎన్నికలు విడిపోయిన అన్నదమ్ములను కలిపాయి. ఏళ్లుగా మాటలు లేని సోదరులను దగ్గర చేశాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్సింగ్తండా, గర్జనపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు అన్నదమ్ములను ఒక్కటి చేశాయి. 23 ఏళ్ల తర్వాత.. లాల్సింగ్తండాకు చెందిన అన్నదమ్ములు భూక్య గంగారెడ్డి, భూక్య చిన్నారెడ్డి మధ్య 23 ఏళ్లుగా మాటలు లేవు. 2001లో ఎన్నికల సమయంలో అన్న గంగారెడ్డిని దగ్గర ఉండి గెలిపించిన చిన్నారెడ్డి తర్వాత దుబాయి వెళ్లి 2002లో తిరిగి వచ్చారు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 23 ఏళ్లుగా మాటలు లేవు. గతంలో వీర్నపల్లి ఎస్సైగా పనిచేసిన ఎల్లాగౌడ్ అన్నదమ్ములను పిలిపించి సఖ్యత పెంచేందుకు ప్రయత్నించారు. అయినా వారు ఎడమొహం.. పెడమొహంగానే తిరిగారు. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటయ్యారు. అన్న గంగారెడ్డిని గెలిపించేందుకు తమ్ముడు చిన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారు. 23 ఏళ్ల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అన్న విజయం సాధించడంతో అన్నదమ్ములను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత ఒక్కటయ్యారు వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన బుచ్చగారి భాస్కర్గౌడ్, రాకేశ్గౌడ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఆరేళ్లుగా మాటలు లేవు. తమ్ముడు రాకేశ్గౌడ్ గ్రామ సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. అన్నకు ఫోన్ చేసి సహకరించాలని కోరడంతో భాస్కర్గౌడ్ ముందుకొచ్చాడు. తమ్ముడిని గెలిపించేందుకు భాస్కర్గౌడ్ గ్రామస్తులను ఒక్కటి చేశారు. రాకేశ్గౌడ్ విజయం సాధించడంతో గ్రామస్తులు సైతం హర్షద్వానాలు వ్యక్తం చేశారు. -
తాళం వేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం బాలపల్లిలో ఆదివారం రాత్రి తాళం వేసిన నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పడిగెల లచ్చవ్వ ఇంటికి తాళం వేసి కూతురు వద్దకు వెళ్లింది. ఎనగందుల జయలక్ష్మీ, బుర్ర రమ, గాలిపల్లి కవిత తమతమ ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి బుర్ర రమ ఇంట్లోనుంచి రెండు బంగారు ఉంగరాలు, పడిగెల లచ్చవ్వ ఇంట్లోనుంచి వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బంగారు ఉంగరాలు, నగదు చోరీ -
హామీ ఇచ్చి.. అమలు చేసి..
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చేగుర్తి సర్పంచ్ బాషవేణి సరోజన సోమవారం ఆరుగురు పంచాయతీ సిబ్బంది నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతీనెల వారికి నిత్యావసరాలు పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించారు. వారి కుటుంబాలకు ఐదేళ్లపా సరిపడే కిరాణా సామగ్రిని ప్రతీనెల అందిస్తామన్నారు. అంతేకాదు.. ఆడపిల్ల జన్మిస్తే రూ.5,116 విలువైన పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ బహుమతి అందిస్తామని సర్పంచ్ సరోజన–మల్లేశం దంపతులు వెల్లడించారు. ఆడపిల్లకు రూ.5,116 కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ సర్పంచ్ కూర నరేశ్రెడ్డి, జూబ్లీనగర్ సర్పంచ్ సుద్దాల కమలాకర్ మాట్లాడుతూ.. ఇకనుంచి తమ ఊళ్లలో జన్మించే ఆడపిల్ల పేరిట రూ.5,116 డిపాజిట్ చేస్తామన్నారు. నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణి.. ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రోజే.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్ పూర్మాని రాజశేఖర్రెడ్డి.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం రోజే అమలు చేశారు. తాను సర్పంచ్గా గెలిచాక గ్రామంలో ఆడబిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్డ్ డిపాజిట్, పెళ్లికి రూ.5వేలు నగదు కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈఏడాది గ్రామంలో జన్మించిన 9 మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.45 వేలు పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. రూపాయికే 20 లీటర్ల మినరల్వాటర్.. బోయినపల్లి(చొప్పదండి): విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనుయ్య.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలపల్లి రామారావు కుటుంబంలో జన్మించిన ఆడపిల్లకు రూ.5వేలు విలువైన చెక్కు అందించారు. పంచాయతీ పాలకవర్గంతో కలిసి రూపాయికే 20 లీటర్ల ప్యూరిఫైడ్ వారట్ పథకం ప్రారంభించారు. పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొందరు అనేక వాగ్దానాలు చేస్తారు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు హామీలు ఇస్తారు.. ఇంకొందరు నగదు, విలువైన బహుమతులు అందిస్తారు.. గద్దెనెక్కాక చాలామంది మాటతప్పుతారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మాటిచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు.. పదవీ ప్రమాణం స్వీకరించిన సోమవారం రోజే హామీలు అమలు చేసి ‘ప్రజాప్రతినిధి’ గౌరవం పెంచారు. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి కొందరిపై కథనం..పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొందరు అనేక వాగ్ధానాలు చేస్తారు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు హామీలు ఇస్తారు.. ఇంకొందరు నగదు, విలువైన బహుమతులు అందిస్తారు.. గద్దెనెక్కాక చాలామంది మాటతప్పుతారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మాటిచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు.. పదవీ ప్రమాణం స్వీకరించిన సోమవారం రోజే హామీలు అమలు చేసి ‘ప్రజాప్రతినిధి’ గౌరవం పెంచారు. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి కొందరిపై కథనం ఇది.. ఆదర్శంగా నిలిచిన సర్పంచులు ప్రమాణం చేసినరోజే అమలు -
రూ.35వేలతో వార్డు ప్రజలకు సౌకర్యాలు
● వార్డుసభ్యురాలి ఉదారత కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో 3వ వార్డు సభ్యురాలిగా గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సోమవారం బాధ్యతలు చేపట్టిన వార్డు సభ్యురాలు గుజ్జుల జయ రూ.35వేల నగదును స్థానికులకు అందజేశారు. వార్డు ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టారు. స్థానికులకు ఐదేళ్లపాటు ఉచితంగా దినపత్రిక వేయించడం, వార్డులోని అన్ని వీధుల్లో వీధిదీపాలకు రూ.15వేలతో ఎల్ఈడీ లైట్లను బిగించడం జరుగుతోంది. విద్యార్ధులు, యువకుల కోసం రూ.5వేలతో క్రీడాసామగ్రి కొనుగోలు, మిగిలిన రూ.15వేలను వార్డు ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి ఖర్చుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం వార్డుసభ్యురాలు జయ రూ.35వేలతో చేపట్టిన పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దాడిచేసిన వ్యక్తులపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్నగర్కు చెందిన సంపంగి సతీశ్పై దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. టీఆర్నగర్కు చెందిన సంపంగి సతీశ్ ఇంటిపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మద్యంమత్తులో ఫిరోజ్, కోటగిరి సుమన్, కొండ నాగేంద్ర, దాగిమల్ల రమేశ్ నానాబూతులు తిట్టి రాళ్లతో కొట్టారు. అడ్డువచ్చిన సతీశ్ తల్లి లక్ష్మీపై కూడా దాడిచేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. నేడు ఫుడ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ మేళాకరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల) కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ వెనకాల గల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీస్లో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94048 93871, 70320 87727లో సంప్రదించాలని సూచించారు. భీమన్నకు మొక్కులువేములవాడ: వేములవాడలో ప్రచారరథం వద్ద రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈవో రమాదేవి, ఏఈవోలు, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
ఓవరాల్ చాంపియన్ మైనార్టీ గురుకులం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాస్థాయి స్పోర్ట్స్మీట్లో ప్రతిభచాటి ఓవరాల్ చాంపియన్షిప్ సాధించినట్లు ప్రిన్స్పాల్ చంద్రమోహన్ తెలిపారు. బొమ్మకల్లో ఈ నెల 19నుంచి 21వరకు 3వ ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. పలు క్రీడల్లో విద్యార్థులు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కప్ అందించారు. కప్ సాధించిన విద్యార్థులను సోమవారం మైనార్టీ గురుకులాల ఇన్చార్జి సుభాన్, కోఆర్డినేటర్ విమల, విజిలెన్స్ అధికారులు అక్రమ్, ఇంతియాజ్ అభినందించారు. -
‘జ్యోతిష్మతి’లో వర్క్షాప్ ప్రారంభం
తిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి (అటానమస్) కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీపై మూడు రోజుల జాతీయస్థాయి వర్క్షాప్ను సోమవారం ప్రారంభించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహింంచనున్నట్ల కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ , కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి తెలిపారు. ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. డీన్ డా. పి.కె. వైశాలి విద్య, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివద్ధి ప్రాముఖ్యతను వివరించారు. హైఈఈ – ఎంపవరింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. మదన్ మోహన్ గౌడ్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తాజా సాంకేతిక పరిణామాలు, సవాళ్లు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ వోడీ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అల్ఫోర్స్లో రామానుజన్ జయంతి
కొత్తపల్లి(కరీంనగర్): గణిత పితామహుడు శ్రీనివా స రామానుజన్ జయంతి సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డితో కలిసి గణిత అవధాని, ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఇ.చంద్రయ్య రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గణితం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, మన దేశ గణితశాస్త్రానికి నిర్వచనం రామానుజన్ అని, ఆయన సేవలు చారిత్రాత్మకమన్నారు. ప్రతీ విద్యార్థి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. కాగా, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్(అమోట్)–2025లో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందించి సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
టెంట్ కిందనే..
ఇల్లంతకుంట: మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో రెండేళ్లుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని ఓ గదిలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవాన్ని టెంట్ కింద నిర్వహించారు. చిక్కుడువానిపల్లె, కృష్ణరావుపల్లి గ్రామాల్లోనే ఇదే పరిస్థితి. బోటుమీదిపల్లెలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో కుర్చీలు వేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. తాళ్లల్లపల్లిలో పంచాయతీ భవనం కోసం కేటాయించిన స్థలంలో కార్యక్రమం నిర్వహించారు. -
కరీంనగర్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 20257భీమన్నకు మొక్కులువేములవాడ: వేములవాడలో ప్రచారరథం వద్ద రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. క్వింటాల్ పత్తి రూ.7,400జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,400 పలికింది. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. వాతావరణం పొడిగా ఉంటుంది. పొద్దంతా ఎండగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. -
పైసల్లేని ప్రయోగం..!
‘ఇంటర్ చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్లో సాధించే మార్కులు కూడా అంతే కీలకం. సాధారణంగా సైన్స్ గ్రూప్లు, ఓకేషనల్ విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పరీక్షలకు ముందు నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్రాక్టికల్స్ నామమాత్రంగా కొనసాగుతున్నాయానే విమర్శలు ఉన్నాయి.’కరీంనగర్టౌన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్కు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ను ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. మరో 40 రోజుల్లో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి చివరి మాసంలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలు నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రయోగ పరీక్షలంటే వాటికి సంబంధించిన పరికరాలు, కెమికల్స్, ఇతరత్రా వస్తువులు అవసరం ఉంటాయి. కానీ, ప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాక్టికల్స్ తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. జిల్లాలో 17,128 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, 6 టీఎస్ సోషల్ వెల్ఫేర్, 9 మైనార్టీ, 6 ఎంజేపీ, 11 మోడల్ స్కూల్స్, 8 కేజీబీవీ, 49 ప్రైవేట్ కళాశాలలు జిల్లావ్యాప్తంగా మొత్తం 104 కళాశాలున్నాయి. నిధుల లేమితో భారంగా నిర్వహణ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ కళాశాలలకు భారంగా మారింది. చదువుకున్న పాఠాన్ని ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలున్నాయి. మూడేళ్లుగా ప్రాక్టికల్స్ నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో కళాశాలల్లోని ల్యాబ్లలో అరకొర వసతులు, శిథిలావస్థలో ఉన్న ల్యాబ్లు, తుప్పుపట్టిన పరికరాలతోనే విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పాతవాటితో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రైవేటు విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ కళా శాలలవారు తక్కువ మార్కులను సాధిస్తున్నారు. ఈ ప్రభావం ఎంసెట్ ర్యాంకులపై, ఇతరాత్ర పోటీ పరీక్షల సమయంలో చూపే అవకాశం ఉంది. అరకొర వసతులు... సిబ్బంది, నిధులు లేక ప్రభుత్వ కళాశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. గ్రామీణ ప్రాంత క ళాశాలల్లో సమస్యలు అధికంగా ఉంటున్నాయి. జి ల్లాలోని 11 ప్రభుత్వ కాలేజీల్లో 6,500 మంది వర కు విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు తెలుస్తోంది. 7వేల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చ దువుతున్నారు. ప్రతీ విద్యార్థికి రూ.38 చొప్పున క ళాశాలల నిర్వహణకు ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. కానీ, ఆరునెలలుగా బిల్లుల రాక కళాశాలల్లో శానిటైజర్లు, రిజిస్టర్లు ఇతరత్రా వస్తువులు కొనేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. -
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్
కొత్తపల్లి(కరీంనగర్): భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు భేష్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ ప్రశంసించారు. పోలీసుశాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కొత్తపల్లి శివారులో ఏర్పాటు చేసిన కేంద్రం మొదటి వార్షికోత్సవం సోమవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు, వేధింపులకు గురైన సమయంలో ఆదరణకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఏడాది క్రితం ప్రారంభమైన భరోసా కేంద్రం ఎన్నో మైలురాళ్లను దాటిందని, అనేక కేసుల్లో మహిళలు, చిన్నారులకు అండగా నిలిచి బాధితుల్లో ధైర్యం నింపిందన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 47 పోక్సో, 13 లైంగికదాడి కేసులు నమోదు చేశామని చెప్పారు. బాధితులకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించినట్లు వెల్లడించారు. మహిళలు, 18 ఏళ్లలోపు బాలబాలికలు ఎవరైనా నేరుగా, పోలీస్స్టేషన్ ద్వారా భరోసా కేంద్రం సేవలు పొందవచ్చని తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్.. రెండో విజయం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా అండర్ –14 క్రికెట్ జట్టు హెచ్సీఏ వన్డే నాకౌట్ టోర్నీలో రెండోవిజయం నమోదు చేసింది. సోమవారం ఘటకేసర్లోని కీసర ఏకలవ్య మైదానంలో కరీంనగర్, విజ్ఞాన్ విద్యాలయం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన విజ్ఞాన్ విద్యాలయం జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. 50 ఓవర్ల ఫార్మాట్లో భాగంగా కరీంనగర్ జట్టును 43 ఓవర్లలో 172 పరుగులిచ్చి ఆలౌట్ చేసింది. కరీంనగర్ జట్టులో కెప్టెన్ అచ్యుతానంద్ హాఫ్ సెంచరీ(54 పరుగులు) చేయగా, ప్రేంసాయి 44 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన విజ్ఞాన్ విద్యాలయం జట్టును కరీంనగర్ జట్టు 42.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ చేసింది. జిల్లా జట్టులో సిద్ధార్థ అద్భుతంగా బౌలింగ్ చేసి 9 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. అదేవిధంగా శ్రయాంక్, వర్షిత్ రెండేసి వికెట్లు తీశారు. బౌలింగ్లో అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సిద్ధార్థ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈనెల 24న గౌతం మోడల్ స్కూల్, అమీర్పేట జట్టుతో మూడోమ్యాచ్ జరుగనుందని పేర్కొన్నారు. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే కరీంనగర్ జట్టు క్వార్టర్స్కు అర్హత సాధిస్తుందని జట్టు మేనేజర్, జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు మహేందర్గౌడ్ తెలిపారు. -
పాలన మురువాలె!
కరీంనగర్: గ్రామాభివృద్ధే ధ్యేయంగా కోటి ఆశలతో కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పల్లెల్లో జోష్ పెరిగి పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల మూడు విడతల్లో పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లాలో 318 గ్రామపంచాయతీలకు గాను 315 పంచాయతీలు, 2,946 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో 23 నెలల నుంచి కొనసాగిన ప్రత్యేక పాలన ముగిసినట్లయింది. ఇన్నాళ్లు గ్రామాల్లో పత్యేక అధికారుల పాలన కొనసాగడంతో.. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టారు. ఇక నుంచి పాలకవర్గాలు పగ్గాలు చేపట్టడంతో పల్లెప్రజలు అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు సర్పంచ్లు, వార్డు సభ్యులకు గ్రామాల్లో నిధుల లేమి సవాలుగా మారనుంది. కొత్తగా గెలుపొంది ఉత్సాహంగా ఏ పనులైనా చేపడతామంటే ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో పాలన ఎలా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి తోడు గ్రామాల్లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో పేరుకుపోయిన పలు సమస్యలు, అప్పుల చిట్టా, పెండింగ్ బిల్లులు చెల్లించడమే వారికి ఇబ్బందిగా మారనుంది. ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే.. కాస్త ఉపశమనం లభించనుంది. అంతకుముందు 23 నెలలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిబంధల ప్రకారం పాలకవర్గాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు సర్పంచ్లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, ఇటు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం చేపట్టిన ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాకపోవడంతో వారు అప్పుల పాలయ్యారు. సర్కార్ నిధులిస్తేనే అభివృద్ధి పంచాయతీల్లో గత ప్రభుత్వం ప్రతి నెలా కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి నిధులు ఇస్తూ వచ్చింది. దీంతో చిన్న పంచాయతికి రూ.50 వేలు, పెద్ద పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రతి నెలా ఆయా గ్రామాల్లోని జనాభాను బట్టి నిధులు ఇచ్చింది. ఆ నిధులతో పారిశుధ్యం, వీధి లైట్ల మరమ్మతు, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు తెచ్చి పనులు చేశారు. చివరకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతుండడంతో.. పాత బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే పడనుంది. -
డ్రగ్స్ మూలాలను పెకిలించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్అర్బన్: మాదకద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలోని అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్, ఎకై ్సజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్స్లో అమ్మకాలను పరిశీలించాలని, వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, పోలీసుశాఖ తరఫున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.కరీంనగర్అర్బన్: గొర్రెలు, మేకల ఎదుగుదలకు నట్టలే ప్రధాన అవరోధం. పెంపకందారులు వాటిని గుర్తించకపోవడం వల్ల అనారోగ్యంతో మరణిస్తుంటాయి. పదులు, వందల సంఖ్యలో మరణాలు సంభవించడం ఏటా జరుగుతున్న తంతు. ఈ క్రమంలో గొర్రెల పెంపకందారులు లక్షల్లో నష్టపోవడం జరుగుతున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం జిల్లాలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి పలు ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 31వరకు కార్యక్రమాలు జిల్లాలో ప్రాంతీయ, ప్రాథమిక వైద్యశాలలు, ఉప కేంద్రాలు 64 ఉండగా వాటి పరిధిలో నట్టల నివారణ మందును ఉచితంగా అందజేయనున్నారు. గొ ర్రెల వయసు, శరీర బరువు, మందు రకం తదితర అంశాల క్రమంలో మందు మోతాదును నిర్ణయిస్తారు. జీవాల పెంపకందారులు పశు వైద్య సిబ్బంది సూచించే మోతాదు ప్రకారం నట్టల మందు వా డాలని ఏడీహెచ్ డా.వినోద్కుమార్ వివరించారు. కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. పో టీలను ఉదయం జిల్లా క్రీడా శాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, కళాశాలల మధ్య స్నేహబంధాన్ని కలిగించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి, కె.వెంకటేశ్వర్లు, ఎం.చంద్రప్రకాశ్, బి.ఝాన్సీ, సీహెచ్.స్వప్న, తుల్జారామ్ షా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి: విద్యుత్ లైన్ల మరమ్మతు నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు గోపాల్పూర్, దుర్శేడ్, సీతారాంపూర్, ఆర్టీసీ కాలనీల్లో సరఫరా నిలిపివేస్తామని రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. -
● పంచాయతీల ఓటమి జీర్ణించుకోలేక ప్రగల్భాలు ● సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వంపై.. సీఎం రేవంత్రెడ్డిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లపాటు ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. గత పాలనలో రాష్ట్ర బడ్జెట్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఎంపై వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని, ఎవరి దయదాక్షిణ్యాలతోనో కుర్చీలో కూర్చోలేదని పేర్కొన్నారు. బయట విమర్శలు చేయడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. కేటీఆర్కు అహంకారం ఎక్కువగా ఉందని, హరీశ్రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బుద్ది తెచ్చుకొని ప్రజలు ఆమోదించే పనులు చేయాలని హితవుపలికారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు కడితే రూ.లక్ష
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండేళ్లవుతున్నా కొంతమంది మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందా ఆగడం లేదు. పదవిలో ఉన్నప్పుడు చేసిన వసూళ్లకు కొనసాగింపుగా జోరు తగ్గడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ‘సీ ట్యాక్స్’ (నిర్మాణదారులు పెట్టుకున్న పేరు ‘కార్పొరేటర్ ట్యాక్స్’) వసూళ్లలో ఆరితేరినవారు మాజీలైనా చేతివాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటికో రూ.లక్ష నగరంలో గృహ నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యతరగతి, ఇతరత్రా వర్గాలు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే అ దనుగా కొందరు మాజీ కార్పొరేటర్లు వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారు. కొత్తగా ఎవరు ఇంటి నిర్మాణం చేపట్టినా, అక్కడికి అనుచరులను పంపించి తమను అనివార్యంగా కలిసేలా చేస్తున్నారు. త మకు డబ్బులు ముట్టచెబితే నిర్మాణానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూస్తామని హామీ ఇస్తున్నా రు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, ఒక్కో అంతస్తుకు రూ.లక్ష అదనం. ఎన్ని అంతస్తులు వేస్తే అన్ని రూ. లక్షలుగా ఫిక్స్ చేశారు. అపార్ట్మెంట్లకు ప్రత్యేక రేటు. టౌన్ ‘ప్లానింగ్’తోనే వసూళ్ల దందాలో మాజీ కార్పొరేటర్లు సూత్రధారులైతే, నగరపాలకసంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు పాత్రధారులు. తాము చెప్పినట్లు డబ్బులు ఇవ్వని నిర్మాణదారులను టౌన్ప్లానింగ్ విభాగంతో వేధింపులకు గురిచేయడం మాజీ కార్పొరేటర్ల ప్రత్యేకత. నిర్మాణం జరుగుతున్న ఇంటి పక్కల వారితో లేనిపోని ఫిర్యాదులు చేయించడం, టౌన్ప్లానింగ్తో నోటీసులు ఇప్పించడం, మామూళ్లు ఇచ్చేలా ఒప్పించుకోవడం మాజీ కార్పొరేటర్ల స్టైల్. తమకు సహకారం అందించిన టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి పర్సంటేజీలు ఇస్తుండడం బల్దియాలో బహిరంగ రహస్యమే. మొన్నటి వరకు విధులు నిర్వర్తించిన కొంతమంది చైన్మెన్న్లు ఇందులో ఆరితేరిన వాళ్లే. ఇలాంటి ఆరోపణలతో నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఇటీవల గంపగుత్తగా చైన్మెన్లను బదిలీ చేయడం తెలిసిందే. బాధితుల బెంబేలు మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందాతో భవన నిర్మాణదారులు బేజారెత్తిపోతున్నారు. బ్యాంక్లోన్లు, అప్పులు, కూడబెట్టుకొన్న సొమ్ము, ఇతర ఆస్తులు అమ్మి ఇల్లు కట్టుకుంటున్న తమను బెదిరించి మరీ రూ.లక్షలు వసూలు చేయడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ కార్పొరేటర్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలో అర్థం కావడం లేదని, టౌన్ప్లానింగ్ విభాగం జోక్యంతో ఎందుకొచ్చిన సమస్యలని ఇష్టం లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ఓ భవన నిర్మాణదారుడు ‘సాక్షి’తో వాపోయాడు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ కార్పొరేటర్తో బాధితులంతా ఇటీవల నగరపాలకలసంస్థకు వచ్చారు. నగరానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సహకారంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాజీ కార్పొరేటర్ల దందాకు సహకరిస్తూ, అధికారులు నోటీసులు ఎలా ఇస్తారంటూ నిలదీయడంతో ఈ వసూళ్ల దందా మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికై నా మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందాకు టౌన్ప్లానింగ్ సహకరించకుండా, భవన నిర్మాణాల్లో పారదర్శకంగా వ్యవహరించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ‘నగరంలోని ఓ శివారు డివిజన్ వివాదాలకు చిరునామా. ఆ ప్రాంతంలోనూ భవన నిర్మాణాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఓ ఇంటి నిర్మాణదారుడిని డివిజన్ మాజీ కార్పొరేటర్ సంబంధీకులు సంప్రదించారు. ఇంటి నిర్మాణం జరుగుతున్నందున మాజీ కార్పొరేటర్ను కలవాలంటూ హుకూం జారీ చేశారు. తనకున్న పలుకుబడితో యజమాని ఇంటి నిర్మాణాన్ని కొనసాగించారు. చుట్టు పక్కలవారితో తరచూ ఏదో ఒక ఫిర్యాదు ఇప్పిస్తూ, సదరు యజమానిపై వ్యూహాత్మకంగా మానసిక ఒత్తిడి పెంచారు. తట్టుకోలేక ఆ మాజీ కార్పొరేటర్కు రూ.50వేలు ఇవ్వడంతో నిర్మాణం సాఫీగా సాగుతోంది.’‘కలెక్టరేట్కు కూతవేటులో ఉన్న ప్రాంతంలో ఇంటి నిర్మాణాలు రెగ్యులర్గా కొనసాగుతాయి. ఇదే అదనుగా మాజీ కార్పొరేటర్ అక్రమ వసూళ్లకు తెరలేపారు. ‘సీ’ ట్యాక్స్లో ఆరితేరిన సదరు మాజీ కార్పొరేటర్ నిర్మాణదారులకు ‘ఫిక్స్డ్ రేట్’ పెట్టారు. ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, అంతస్తు పెరిగితే అదనంగా రూ.లక్ష ఇవ్వాలని రూల్ పెట్టారు. పదవి పోయి రెండేళ్లవుతున్నా వసూళ్లు ఆగడం లేదు. డబ్బులు ఇవ్వనివారిని టౌన్ప్లానింగ్ అధికారుల నుంచి ఏదో ఒక వంకతో నోటీసులు ఇప్పిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంత బాధితులంతా కమిషనర్కు ఫిర్యాదు చేశారు.’ -
శాసనసభ కార్యదర్శి స్వగ్రామం కల్వచర్ల
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన రేండ్ల తిరుపతిని తెలంగాణ శాసనసభ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు సామాన్య రైతు కుటుంబానికి చెందిన నర్సయ్య–లక్ష్మి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన తిరుపతి భువనగిరి, వరంగల్, బోధన్, హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మం, రంగారెడ్డి, తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్గా, హైదరాబాద్ ఏసీబీ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో సనిచేశారు. 2023 ఆగస్టు 21 నుంచి 2025 ఆగస్టు 20 వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శిగా, 2025 ఆగస్టు 22 నుంచి తెలంగాణ వక్ఫ్ ట్రెబ్యునల్ చైర్మన్గా పనిచేయగా ప్రభుత్వం శాసనసభ కార్యదర్శిగా నియమించింది. తిరుపతి నియామకంపై కల్వచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు -
బోగస్ ఏరివేతకు ఈ– కేవైసీ
కరీంనగర్ అర్బన్: బోగస్ కార్డులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ– కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేపడుతోంది. రేషన్ కార్డు యజమానితో పాటు కార్డులోని సభ్యులంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రేషన్ దుకాణాల్లోనే సదరు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతి నెల 1 నుంచి 15– 17వ తేదీ వరకు సరుకుల పంపిణీ ఉంటుండగా డీలర్లు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 3,17,748 రేషన్కార్డులుండగా 9,45,665 మంది సభ్యులుండగా ఇప్పటివరకు ఈకేవైసీ జరిగింది కేవలం 71.86శాతమే. 7,20,517 యూని ట్లు మాత్రమే ఈకేవైసీ కాగా మరో 2లక్షల మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. రేషన్ దుకాణాల్లో సదరు ప్రక్రియ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండగా క్షేత్రస్థాయిలో రేషన్ దుకాణాలు మూసివేసి ఉండటం గమనార్హం. మరో 9రోజులే గడువు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. పౌరసరఫరాల అధికారులు మాత్రం నిర్ణీత గడువంటూ లేదని కా నీ ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. వా స్తవానికి డిసెంబర్ 31లోపు కేవైసీ చేసుకోకుంటే కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. నిజమైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ధృవీకరణ చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. కాగా రేషన్ దుకాణాలు మాత్రం మూసివేసి ఉండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగుంటే ఎలా ఈకేవైసీ చేసుకోవాలని వాపోతున్నారు. కొత్త సభ్యులు కూడా చేసుకోవాల్సిందే జిల్లాలో కొత్తగా 42వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 1.01లక్షల మంది సభ్యులుండగా వీరంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. పాత కార్డుల్లో పేరు తొలగించుకొని వీటిల్లో చేరిన వారు సైతం ఈ ప్రక్రియ పూర్తిచేయించుకోవాల్సిందే. ఇందుకు లబ్ధిదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. రేషన్ డీలర్ పూర్తి ఉచితంగా సేవలందించాల్సిందే. ఎంత మంది వచ్చినా బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 3,17,748కార్డుల్లో మొత్తం సభ్యులు: 9,45,665రేషన్ దుకాణాలు: 566మొత్తం గ్రామాలు: 316మున్సిపాలిటీలు: 4ఈకేవైసీ చేసుకున్న సభ్యులు: 7,20,517ఈకేవైసీ చేసుకోవాల్సిందే ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర కార్డుల్లో ఇప్పటివరకు 70 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలి. – నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని..
● ఉరేసుకుని తనువు చాలించిన యువకుడు ధర్మపురి: ప్రేమించిన అమ్మా యి పెళ్లికి నిరాకరించిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రామయ్యపల్లెలో జరిగింది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాల్ల లింగన్న, కరుణ దంపతులకు కుమారుడు నవీన్, ఇద్దరు కూతుళ్లున్నారు. లింగన్న ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. నవీన్ కూడా రెండేళ్లపాటు దుబాయి వెళ్లివచ్చి ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేసుకుంటున్నాడు. కొంతకాలంగా రామయ్యపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఆమె పెళ్లికి నిరాకరిస్తోందని తరచూ బాధపడుతుండేవాడు. పది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన నవీన్.. అమ్మాయి వ ద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని కోరగా ఆమె ని రాకరించింది. దీంతో మనస్తాపానికి గురై శని వారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కాసేపటికి తల్లి చూడగా నవీన్ (24) వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు తనువు చా లించడంతో కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న లింగన్న దుబాయి నుంచి వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి కావడం లేదని వ్యక్తి.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామానికి చెందిన బండారి నరేశ్ (31) పెళ్లి కావడం లేదన్న బెంగతో మానసిక వేదనకు గురై పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్సై మల్లేశ్ కథనం ప్ర కారం.. కొంతకాలంగా నరేశ్కు పెళ్లిసంబంధాలు చూసినా కుదరడం లేదు. మానసిక వేదనకు గురై శనివారం క్రిమిసంహారక మందుతాగాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధ భరించలేక ఒకరు.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం దస్తగిరిపల్లి గ్రా మానికి చెందిన నూనెల రవి (37) అప్పుల బాధతో ఆది వారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లు కట్టేందుకు చేసిన అప్పు ఎలా తీర్చాలోనని తరచూ మదనపడుతుండేవాడు. అదే వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. మృతుడి భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చలిమంట కాగుతూ.. నిప్పంటుకొని వృద్ధురాలు మృతిగన్నేరువరం చలిమంట కాగుతుండగా.. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ (85) మృతి చెందింది. స్థానికులు, ఎస్సై నరేందర్రెడ్డి కథనం ప్రకారం నర్సవ్వ ఇంటి ముందు ఉన్న పొయ్యి వద్ద ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఆదివారం చలిమంట కాగుతోంది. ఈ క్రమంలో మంట వేడికి కుర్చీ విరిగి వృద్ధురాలు మంటలో పడి తీవ్రంగా గాయపడింది. చుట్టూపక్కల వారు గమనించి నర్సవ్వను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. నర్సవ్వ మనమడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. ఇద్దరు కుమారులు అనారోగ్యంతో గతంలోనే మృతిచెందారు. -
భక్తులు ఎక్కువ.. రైళ్లు తక్కువ
రామగుండం: కాగజ్నగర్ (కోల్బెల్ట్) నుంచి నేరుగా తమిళనాడులోని తిరువన్నామలై (అరుణాచలం) అరుణాచలేశ్వరాలయానికి వెళ్లేందుకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్నా రైల్వేశాఖ క్యాష్ చేసుకోవడంలో విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీని గుర్తించి కాలానుగుణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరిఖని, కరీంనగర్ డిపోల నుంచి అరుణాచలంకు నేరుగా బస్సులను నడిపిస్తూ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది. ప్రస్తుతం కరీంనగర్–తిరుపతి మీదుగా అనే రైళ్లు నడుస్తున్నాయి. ఇదే తరహాలో అరుణాచలంకు కూడా నేరుగా రైలు సర్వీసులు నడిపించాలని భక్తుల నుంచి డిమాండ్ వస్తుంది. ప్రత్యేక రైలుతో పుణ్యక్షేత్రాల దర్శనం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి అరుణాచాలంకు ప్రత్యేక రైళ్లు నడిపితే విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి శివాలయం, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరాలయం, చిత్తూరులోని కాణిపాకం, వేలూర్ (తమిళనాడు)లోని గోల్డెన్ టెంపుల్, కాంచీపురంలోని కామాక్షి ఆలయాలు తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు సౌకర్యంగా ఉంటుంది. ఫలితంగా భక్తుల రద్దీ పెరిగి రైల్వేశాఖకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. అరుణాచలంకు రోజురోజుకు పెరుగుతున్న భక్తులు వీక్లీ రైళ్లు నడిపించాలని డిమాండ్ ఆర్టీసీ బస్సు ప్రయాణం గంటల తరబడి అంటే అసౌకర్యం. చార్జీలు, ప్రయాణ సమయం ఎక్కువే. రైలు ప్రయాణం చార్జీలు తక్కువ, సౌకర్యవంతంగా ఉంటుంది. నాలుగైదు కుటుంబాలతో వెళ్లే తీర్థయాత్రలు మరపురాని జ్ఞాపకాలను మిగుల్చుతాయి. – కమ్మల చంద్రశేఖరశర్మ, రామగుండం కాగజ్నగర్ నుంచి రామగుండం మీదుగా త్రివేండ్రంకు నడిచే రైళ్లు కేరళ, తమిళనాడులోని కా ట్పాడి మీదుగా వెళ్తాయి. కాట్పా డి నుంచి అరుణాచలంకు 80 కిలోమీటర్లు ఉంటుంది. తొలుత వీక్లీ రైళ్లను నడిపించాలని ఒత్తిడి తీసుకువస్తా. ప్రధానంగా ఎంపీలు సైతం ఈ రూట్పై ప్రత్యేక దృష్టి సారించాలి. – కంకటి ఫణికుమార్, అధ్యక్షుడు, రైల్వేఫోరం -
సుపారీ ఇచ్చి కొడుకు హత్య
కరీంనగర్క్రైం: ఉపాధి కోసం కొడుకు గల్ఫ్ దేశాలకు వెళ్తే.. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. కొద్దిరోజులకు కొడుకు ఇంటికి వచ్చి భార్య, తండ్రి మధ్య నడుస్తున్న వ్యవహారంపై మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న కొడుకును చంపించాలని అనుకున్నాడు. ఇందుకు రూ.3లక్షల సుపారీ ఇచ్చి పథకాన్ని అమలు చేశాడు. పోలీసుల విచారణలో నేరం బయటపడగా.. నిందితులను ఆదివారం ఆరెస్టు చూపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో వెల్లడించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య(36)కు శిరీషతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు ఆడ పిల్ల లున్నారు. అంజయ్య 2017లో విదేశాలకు వెళ్లి 2019లో తిరిగొచ్చాడు. తన తండ్రి గాదె లచ్చయ్య, శిరీష మధ్య సాన్నిహిత్యాన్ని చూసి పలుమార్లు ఇరువురిని మందలించాడు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్న కొడుకును హతమార్చాలని లచ్చయ్య నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్లతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా రూ.1.25 లక్షలు ఇచ్చాడు. అంజయ్యను చంపాలని పథకం వేసిన కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్ అతనితో స్నేహం చేశారు. ఈనెల 2న అతిగా మద్యం తాగించి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని సమీపంలోని కెనాల్లో పడేశారు. 5వ తేదీన కాలువలో అంజయ్య శవంలభ్యం కాగా.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించేందుకు యత్నించారు. పోలీసులకు దర్యాప్తులో పలు అనుమానాలు రావడంతో లోతుగా విచారించారు. గాదె లచ్చయ్య సుపారీ ఇచ్చి చంపించాడని నిర్ధారణకు వచ్చారు. నిందితులు గాదె లచ్చయ్య, గాదె శిరీష, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్, కొలిపాక రవిని ఆదివారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.40వేల నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్సై రాజు పాల్గొన్నారు. కోడలితో మామ వివాహేతర సంబంధం అడ్డు తొలగించుకునేందుకు పథకం రూ.3లక్షలు ఇచ్చి కొడుకును చంపించిన తండ్రి వివరాలు వెల్లడించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్ -
పారా మోటారింగ్ టూరిజంపై పరిశీలన
రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పారామోటారింగ్ టూరిజం ఏర్పాటుకు ఆదివారం పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు రైడర్స్ పరిశీలన నిమిత్తం వచ్చారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్తో స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన పారా మోటారింగ్ రైడర్ అర్జున్ పలు విషయాలు చర్చించారు. పారా మోటారింగ్ యంత్రంతో నిష్ణాతులైన రైడర్స్ రామగుండంకు చేరుకోగా స్థానిక జెన్కో గ్రౌండ్ నుంచి యంత్రం సాయంతో ఫ్లయింగ్ చేస్తూ కొండలు, వాగులు, గోదావరినది, అటవీ ప్రాంతం, రాజీవ్ రహదారి, రైల్వే ట్రాక్, విద్యుత్ కేంద్రాలు, అంజనాద్రి జంక్షన్, రామునిగుండాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతీ పంపుహౌజ్ తదితర సుందరమైన దృశ్యాలను తిలకించి పారా మోటారింగ్ రైడింగ్కు స్థానికంగా అనుకూలంగా ఉందని ధ్రువీకరించినట్లు అర్జున్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పారా మోటారింగ్తో సుందర దృశ్యాలను వీక్షించేలా ఒక ప్లాట్ఫాం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశీలనలో పారా మోటారింగ్ రైడర్స్ సుజిత్ (ముంబయి), పరమేశ్ (హైదరాబాద్), అర్జున్ (రామగుండం) తదితరులు పాల్గొన్నారు. ఫ్లయింగ్తో ఆకర్షణీయమైన దృశ్యాలు తిలకించేందుకు పర్యాటకుల ఆసక్తి -
విద్యతోనే మహిళల ఉన్నతి
కరీంనగర్కల్చరల్: మహిళల ఉజ్వల భవితకు ఏకై క మార్గం ఉన్నత విద్యేనని ప్రముఖ రచయిత, విశ్రాంత ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ ప్రాంగణం, చింతకుంట సాంఘీక సంక్షేమ జూనియర్ కళాశాల ఆవరణలో వేర్వేరు కార్యక్రమాల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పేదరికాన్ని తరిమే ఆయుధం ఉన్నత విద్య మాత్రమే అన్నారు. ప్రముఖ ధ్యాన శిక్షకుడు లయన్ సింగమ రాజు మాట్లాడుతూ ధ్యానం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, సామాజిక శ్రేయస్సు కలుగుతుందన్నారు. సీనియర్ లైబ్రేరియన్ అర్జున్, లైబ్రేరియన్ సరిత, కళాశాల అధ్యాపకురాలు ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
జనావాసాల్లోకి జింక
పెద్దపల్లిరూరల్: అడవుల్లో చెంగుచెంగున ఎగిరే జింకపిల్ల దారి తప్పింది.. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని జనావాసాల్లోకి వచ్చింది. ఆదివారం కొమ్ము మోహన్ ఇంటి ఆవరణలో గుర్తించిన స్థాని కులు దాన్ని పట్టుకున్నట్లు తెలుసుకున్న సర్పంచ్ తనయుడు కొమ్ము అభిలాష్ అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స తీశ్కుమార్ వాహనాన్ని సమకూర్చి సెక్షన్ ఆఫీసర్ మంగిలాల్, బీట్ ఆఫీసర్ రామ్మూర్తితో జింకను బ సంత్నగర్ అటవీప్రాంతంలో వదిలేశారు. అట వీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గొర్రెల మందలో కలిసి గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: ఈ నెల 22న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున, అధికార యంత్రాంగం సదరు పనుల్లో ఉంటారని పేర్కొన్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ప్రకటనలో వివరించారు. ఈ నెల 29నుంచి కార్యక్రమం యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని, సోమవారం కలెక్టరేట్కు రావద్దని సూచించారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ఆస్పత్రులుకరీంనగర్టౌన్: ధనా ర్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ మాఫి యా రెచ్చిపోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే నిలువునా దోచుకుంటున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రోగికి ఎంఎన్సీ మందులతో వైద్యం అందించాల్సిన వైద్యులు, లోకల్ మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. అనవసరమైన వైద్య పరీక్షలు చేసి, అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మందుల ధరలు ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యాలు నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రైవేటు ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. నాసిరకం మందులతో వైద్యం అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’లో పాల్గొన్న సుడా చైర్మన్కరీంనగర్ కార్పొరేషన్: భారత రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము శీతకాల విడిది సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. ఎన్నికల ఆర్వోపై వేటు? చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తిలో ఈనెల 14న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని ఆర్వోపై వేటు వేసినట్లు తెలిసింది. ఇందుర్తిలో 12 వార్డులున్నాయి. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యుర్థులు గెలుపొందారు. సీపీఐ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు. మొదట 10వ వార్డు సభ్యురాలు అందె స్వరూపను ఉపసర్పంచ్గా ఐదుగురు ఎన్నుకున్నారు. బీజేపీ వార్డు సభ్యులు తటస్థంగా ఉన్నారు. ఆర్వో రెండోసారి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించి, చింతపూల అనిల్ గెలిచినట్లు ధ్రువీక రించారని సర్పంచ్ నరేందర్, మిగితా వార్డు సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్వోను కలెక్టర్ స స్పెండ్ చేసినట్లు తెలిసింది. సస్పెన్షన్ ఉత్తర్వు లు రావాల్సిఉందని ఎంపీడీవో తెలిపారు. -
లోక్ అదాలత్లో 3,031కేసులు పరిష్కారం
కరీంనగర్క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నిర్వహించిన లోక్ అదాలత్లో 3,031 కేసులు పరిష్కరించినట్లు కరీంనగర్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి జడ్జి హాజరై మాట్లాడారు. రాజీ ద్వారా తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతోషంగా ఉంటారని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ.. అందరి సహకారంతో లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అవుతున్నాయన్నారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్జీ మాట్లాడుతూ రాజీతో లోక్ అదాలత్లో కేసుల పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుదన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి కే.రాణి లోక్ అదాలత్ గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 3,031 కేసులు పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 85, క్రిమినల్ కేసులు 2,859, ఇతర కేసులు 87 పరిష్కరించారు. వాహన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.78 లక్షల పరిహారం చెక్కును జిల్లా జడ్జి చేతుల మీదుగా అందించారు. -
రాష్ట్రానికే ‘పెద్ద’పల్లి ఆదర్శం
పెద్దపల్లిరూరల్: యూరియా కృత్రిమ కొరత సృిష్టించే అవకాశం లేకుండా.. రైతు తన అవసరాలకు మించి ఎరువును వినియోగించకుండా.. ఇంటి నుంచే బుకింగ్ చేసుకుని దుకాణం నుంచి సులువుగా తీసుకెళ్లేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ‘యూరియా బుకింగ్యాప్’ను అందుబాటులోకి తెచ్చారు. యాప్ను జిల్లాలో 15రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇంటి నుంచే సులువుగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్ను శనివారం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఇంటినుంచే బుకింగ్ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆలోచనల్లో నుంచి పుట్టిన యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా పట్టా పాసుపుస్తకం నంబరు నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్కు ఓటీపీ వస్తోంది. ఆ నంబరు నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు అనే వివరాలతో పాటు యూరియా ఎంతమేర అవసరమవుతుందనే సమాచారంతో బుకింగ్ ఐడీ వస్తుంది. వాటి ఆధారంగా సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఐదెకరాల భూమికలిగిన రైతులు రెండు విడతల్లో, 20 ఎకరాల లోపుగలవారు మూడు దఫాలుగా, అంతకన్న ఎక్కువ ఉంటే నాలుగు దశల్లో యూరియా తీసుకెళ్లేలా యాప్ను రూపొందించారు. ఈ నెల 20 నుంచి పొరుగు జిల్లాలో.. పెద్దపలి జిల్లా నుంచి మొదలైన యూరియా బుకింగ్ యాప్ నమోదు ప్రక్రియ రాష్ట్రంలోని పొరుగు జిల్లాలకు పాకింది. ఈనెల 20న తొమ్మిది జిల్లాల్లో సాగింది. కొద్దిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ను రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. పెద్దపల్లిలో ఈనెల 1నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. శనివారం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్నగర్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ యూరియా బుకింగ్ ప్రక్రియ మొదలైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రానికి ఆదర్శం జిల్లా తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అలగు వర్షిణి పాలనలో అమల్లోకి తెచ్చిన ‘సాండ్టాక్సీ పాలసీ’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని విద్య, వైద్యశాఖల్లో అమలు చేసేలా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. తా జాగా ఎరువుల కృత్రిమ కొరత రాకుండా యూరి యా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇబ్బంది పడొద్దనే యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దనే యూరి యా బుకింగ్ యాప్ రూ పొందించాం. ఇంటినుంచే సులువుగా బుకింగ్ చేసుకుని ఏ దశలో ఎంత యూరియా అవసరమో సులువుగా తీసుకెళ్చొచ్చు. ఈ విధానంతో రైతులు క్యూలో నిలబడే పరిస్థితికి ఆస్కారం ఉండదు. విలువైన సయమం వృథాకాదు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ పెద్దపల్లి -
ప్రజల మనసులోంచి గాంధీని ఎలా తొలగిస్తారు
కరీంనగర్ కార్పొరేషన్: జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగిస్తారేమో కాని, ప్రజల గుండెల్లో ఉన్న గాంధీని ఎలా తొలగిస్తారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని కిసాన్నగర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉపాధి హామీ పథకానికి గాంధీపేరుకొనసాగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర తీసుకువచ్చిన గాంధీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. పేదల ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి పెట్టిన గాంధీ పేరు ను తొలగించడం సిగ్గుచేటన్నారు. కొత్త సర్పంచ్లు తమ గ్రామపంచాయతీల మొదటి సమావేశంలో ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని తొలి తీర్మాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంబేడ్కర్, నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నారన్నా రు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆకా రపు భాస్కర్రెడ్డి, ఉప్పుల అంజనీప్రసాద్, చాడగొండ బుచ్చిరెడ్డి, మెండి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ ‘కిసాన్ గ్రామీణ మేళా’
కరీంనగర్: రైతులు, మహిళా సంఘాలు, గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ ‘కిసాన్ జాగరణ్’ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా మరోసారి భారీ ఎత్తున శ్రీకిసాన్ గ్రామీణ మేళ్ఙాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారని వెల్లడించారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 2022, 2023లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రైతులు హాజరైన రికార్డు ఉందని, ఈసారి అంతకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ప్రదర్శనలకు దూర ప్రాంత రైతులు వెళ్లలేకపోతున్నారని, అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలనే ఉద్దేశంతో కరీంనగర్ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ మేళాలో లాభదాయక ప్రత్యామ్నాయ పంటలు, కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా.. పామాయిల్, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వంటి మార్గాల ద్వారా ఎకరాకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఎలా పొందాలనే అంశంపై రైతులకు దిశానిర్దేశం చేయనున్నామన్నారు. ఎస్సారెస్పీ కెనాల్ పరీవాహక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వరి పంట దెబ్బతింటున్న పొలాల్లో.. చేపలు, రొయ్యల పెంపకం ద్వారా అధిక లాభాలు గడించే విధానాలను వివరిస్తారని అన్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ వినియోగం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం, గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే ఆధునిక పరికరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన ప్రగతిశీల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రారంభించనున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు -
ఉపాధి.. పల్లె ఊపిరి
కరీంనగర్ అర్బన్: పల్లెలే పట్టుకొమ్మలన్నది మహాత్ముడి మాట. మరీ అ మాటను సర్పంచిలు ఔపోసన పడితే గ్రామీణాభివృద్ధి ఇట్టే సాధ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ క్రమంలో ప్రభుత్వ పథఽకాలను లక్షిత వర్గాలకు చేర్చడమే కాకుండా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆయుధంగా మలచుకోవాల్సిన తరుణమిది. జిల్లావ్యాప్తంగా ఎన్నికై న సర్పంచిలు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నందున కథనం.. స్వచ్ఛత.. నీటి నిల్వ గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో నిధులు పుష్కలం. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊట కుంటలు, ఫాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తి చేస్తే భూగర్భ జలాలు పెరగనున్నాయి. సాగుకు ఊతం.. మొక్కలు నాటుదాం గ్రామాల్లో మొక్కలు నాటి హరిత వనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంది. గుంతలు తవ్వడం మొదలు, మొక్కలను నాటేందుకు, పోషణకు కూడా డబ్బులు ఇస్తున్నారు. గ్రామాల్లో చెరువులు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు, ప్రాజెక్టు కాల్వల్లో నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే అటు వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులను బాగు చేసుకోవచ్చు. ఉపాధితో బాట గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద దారులు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది. ఎవరిని సంప్రదించాలంటే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో డిఆర్డీవోతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి. సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సర్పంచ్లూ దృష్టిసారించండి -
పల్లె పాలన
ఖాళీ ఖజానా..కరీంనగర్/కరీంనగర్ టౌన్: గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య పాలన తిరిగి ప్రారంభమవుతున్న వేళ.. సర్పంచ్లు, వార్డు సభ్యులకు సమస్యలు స్వా గతం పలుకుతున్నాయి. రెండేళ్లు ప్రత్యేకాధికారుల చేతిలో కొనసాగిన గ్రామాల్లో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. నిధులు లేక పల్లెలు కుదేలయ్యాయి. ఇప్పుడు బాధ్యతలు చేపట్టనున్న పాలకవర్గాలకు ఖాళీ ఖజానా, పెరిగిన నిర్వహణ భారమే మిగిలింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంట్ బిల్లులు, తరచూ వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్థికం భారంగా మారబోతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న జిల్లాలోని 316 పంచాయతీలు, 2,946 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 11న మొదటి విడతలో 92 పంచాయతీలు, 866 వార్డులకు.. 14న రెండో విడతలో 113 పంచాయతీలు, 1046 వార్డులకు, మూడో విడతలో 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 17న ఎన్నికలు నిర్వహించింది. సర్పంచులు సహా వార్డు సభ్యు ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ 22న(నేడు) ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. అదే రోజు నుంచి పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పెండింగ్లో నిధులు పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్లకు 2024– 2025, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.2000 కోట్లకుపైగా నిధులు పెండింగ్లోనే ఉన్నాయి. మేజర్ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా... పేరుక పోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. జీపీలను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వం 500 జనాభా కలిగిన తండాలను జీపీలుగా మార్చింది. ప్రతీ జీపీలో కార్యదర్శి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య కార్మికులను నియమించాల్సి ఉంది. చాలా గ్రామాల్లో సరిపడా ఉద్యోగులు లేక ఉన్నవారితో సర్దుబాటు చేయాల్సి వస్తోంది.15వ ఆర్థిక సంఘం నిధులపైన కొత్త సర్పంచ్లు కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రతి గ్రామానికి జనాభా ప్రకారం.. ఒక్కొక్కరికి రూ.900 నుంచి రూ.1,400 చొప్పన నిధులు రానున్నాయి. 3వేల జనాభా ఉంటే రూ.27లక్షల నిధులొస్తాయి. రెండేళ్లకు రూ.54లక్షలు రానున్నాయి. వచ్చే మార్చి ఆఖరి నాటికి ఆర్థికసంఘం గడువు ముగిసిపోనుంది. రెండేళ్లు నిధులొస్తే కొత్త సర్పంచ్లకు ఊరట కలగనుంది. 15వ ఆర్థిక సంఘంతో పాటు ఎస్ఎఫ్సీ నిధులు వస్తేనే పల్లెల అభివృద్ధి పట్టాలెక్కనుంది.జిల్లాలోని గంగాధర మండలం హిమ్మత్నగర్ గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి వైకుంఠధామం నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడికి వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఇక్కడ పారుతున్న ఓ ఒర్రైపె కల్వర్టు నిర్మాణం చేపడితే వైకుంఠధామం ఉపయోగంలోకి వస్తుంది. నూతన పాలకవర్గం సమస్యను పరిష్కరించి, చివరి మజిలీలో ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.పాలకవర్గాలదే బాధ్యత ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కోసం వెచ్చించే బాధ్యత సర్పంచ్లదే. ఐదేళ్లపాటు ప్రభుత్వాలకు, అధికారులకు అనుసంధానం ఉంటూ గ్రామాల్లో జవాబుదారి పాలన అందించాలి. ప్రజల శ్రేయస్సే, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలి. నూతన పాలకవర్గాలకు అభినందనలు. – జగదీశ్వర్, డీపీవో ఆనందంగా ఉంది సర్పంచ్గా గెలవడం ఆనందంగా ఉంది. నేటినుంచి పద వీ బాధ్యతలు చేపట్టడం మరి చిపోలేని అనుభూతి. గ్రామంలోని సమస్యలను అన్ని వర్గాలతో చేర్చించి పరిష్కరించేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామంలోని అన్ని రకాల పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేసి.. రేణికుంట అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా. – ఎలుక ఆంజనేయులు, రేణికుంట సర్పంచ్ -
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బీసీలవిజయబావుటా69745698120156224648212657పెద్దపల్లికరీంనగర్సిరిసిల్లజగిత్యాలజనరల్లో బీసీలుగెలిచినవి మొత్తంబీసీరిజర్వ్ -
వెహికిల్ షెడ్డు వెనక్కి!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీలో నగరపాలకసంస్థ వాహనాల పార్కింగ్కు తలపెట్టిన షెడ్డు నిర్మాణ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నారు. వాహనాల షెడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వస్థలంలో కాలనీ అభివృద్ధికి ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వెహికిల్షెడ్డు వెనక్కి నగరపాలకసంస్థ వాహనాల పార్కింగ్కు హౌసింగ్బోర్డుకాలనీలోని సమ్మక్కసారలమ్మ గద్దెల పక్కనున్న స్థలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే సప్తగిరికాలనీలో వాహనాల షెడ్డు ఉండగా, అక్కడే వాహనాలు పార్క్ చేస్తున్నారు. పారిశుధ్య, ఇతర అవసరాలకు సంబంధించి కొత్తగా 30 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, సప్తగిరికాలనీలోని షెడ్డు సరిపోకపోవడంతో మరోచోట షెడ్డు నిర్మించాలని నిర్ణయించారు. హౌసింగ్బోర్డుకాలనీలోని 728 సర్వే నంబర్ పరిధిలో దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలంలో వాహనాల షెడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవల ప్రతిపాదించారు. నాలుగు రోజుల క్రితం స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. చుట్టూ ఇండ్లు ఉన్న ఈ స్థలంలో వాహనాల షెడ్డు నిర్మిస్తే, వాహనాలు రాకపోకలు, మరమ్మతులు కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతాయని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి స్థానికులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్ ఆదేశం మేరకు షెడ్డు ప్రతిపాదనను విరమించారు. ఎస్టీపీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని సూచనాప్రాయంగా నిర్ణయించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. -
కొలువుదీరనున్న పల్లె పాలకవర్గం
కరీంనగర్టౌన్: గ్రామాల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లావ్యాప్తంగా 316 గ్రామపంచాయతీలు, 2,946 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విజయం సాధించిన సర్పంచ్లు, వార్డుమెంబర్లు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొదటగా ఈ నెల 20న ప్రమాణం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముహుర్తాలు సరిగా లేవని వచ్చిన ఫిర్యాదులతో 22వ తేదీన ప్రమాణ స్వీకారానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీల పరిపాలన సాగనుంది. ప్రత్యేకపాలన నుంచి.. గత సర్పంచ్ల పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియగా ఇన్నాళ్లు ప్రత్యేక అధికారులపాలన సాగింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడ్డారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్లు, పాలకవర్గాలతో సోమవారం నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అదేరోజు తొలి సమావేశం కొత్తపాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. చట్టప్రకారం నెలకోసారి పాలకవర్గాలు భేటీ కావాల్సి ఉంటుంది. సారి గెలుపొందిన సర్పంచ్ల్లో ఎక్కువ మంది యువకులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, సర్పంచ్లుగా పని చేసిన వారే మళ్లీ గెలుపోందడంతో అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బలబలాలు ఇవే.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకున్నా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుదారులే కావడంతో రాజకీయ రంగు అంటుకుంది. 316స్థానాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 123 స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 114, బీజేపీ మద్దతుదారులు 43, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ మద్దతుదారులు 36మంది మిగతా చోట్ల విజయం సాధించారు. నిధుల ఇక్కట్లు తీరేనా? గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. పల్లెల్లో పారిశుధ్యం, తక్షణ అవసరాలు, వీధిలైట్లు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పచ్చదనం వంటి ప్రాథమిక అంశాలు, జీపీ కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించలేక కార్యదర్శులకు పాలన తలకు మించిన భారంగా మారింది. ఖజానా మొత్తం ఖాళీ కావడంతో కొత్తసర్పంచ్లు మొదట సొంతనిధులు వినియోగించాల్సిన అవసరముంది. రెండుళ్లుగా ఆర్థిక సంఘం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. తర్వలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన వస్తుడడంతో మళ్లీ నిధుల ఇక్కట్లు తప్పేలా లేదు. సంక్రాంతి లోపు నిధులు రాకుంటే పరిషత్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. -
ఏ విద్యార్థికి దంత సమస్యలు ఉండొద్దు
కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి విద్యార్థులందరికీ దంత వైద్య పరీక్షలు చేయాలన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంకమ్మతోట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దంత చికిత్స చేశారు. కలెక్టర్ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీరును పరిశీలించారు. కార్పొరేట్ స్థాయిలో ఉచి తంగా అందిస్తున్న దంత వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 12వేల మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నామని, దంత సమస్యలతో బాధపడుతున్న 1500మందిని గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23 వరకు మొదటి విడత క్యాంపులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, వైద్యులు రవి ప్రవీణ్, రణధీర్, ప్రవీణ్, రాజిరెడ్డి, మంగ, శరత్ పాల్గొన్నారు. కంగ్రాట్స్.. మేడమ్ కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ ముందు వరుస స్థానంలో నిలవడంపై ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అప్రమత్తతతోనే నష్ట నివారణ ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ, నష్టాలను నివారించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 22న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు విపత్తు నివారణ చర్యలపై చర్చించారు. -
ఎస్పీఈని పునరుద్ధరించాలి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ (ఎస్పీఈ యాక్ట్ 1976)ను పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్ఆర్యూ) కరీంనగర్శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ.. నాలుగు కొత్త కార్మిక చట్టాలతో దేశంలో ఉన్న కార్మికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అనంతరం జిల్లా కార్మికశాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శులు జి.విద్యాసాగర్, ఏ.సదానందచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.అంజయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలికరీంనగర్రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంట ర్మీడియట్ అధికారి గంగాధర్ సూచించారు. బొమ్మకల్లోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల–1లో మూడు రోజుల పాటు నిర్వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. మానసిక ఒత్తి డితగ్గి, శారీరక ఎదుగుదలకు క్రీడలు దోహాదపడతాయన్నారు. మైనార్టీ గురుకులాల కో–ఆర్డినేటర్ విమల మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతా యన్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్స్ వీర్ల మహేశ్, పిడిశెట్టి సంపత్, పి.చంద్రమోహన్, కుమారస్వామి, విజిలెన్స్ అధికారి అక్రమ్పాషా, అకడమిక్ కో–ఆర్డినేటర్ మీరాజ్ పాల్గొన్నారు. ఆక్రమణలు తొలగింపుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రోడ్డు ఆక్రమణలపై నగరపాలకసంస్థ అధికారులు ఎట్టకేలకు మరోసారి చర్యలు పూనుకున్నారు.. ‘ఆక్రమణలకు అడ్డా’ పేరిట ‘సాక్షి’లో శుక్రవారం వచ్చిన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్, సిరిసిల్ల మెయిన్రోడ్డుపై ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగింగే రోడ్డు, పుట్పాత్ ఆక్రమణలౖపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. టీపీఎస్ తేజస్విని ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో డీఆర్ఎఫ్ సిబ్బంది ఆక్రమణలను తొలగించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల మరమ్మతు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు 11 కేవీ మహాశక్తి ఆలయం ఫీడర్ పరిధిలోని మహాశక్తి ఆలయం, సంతోష్ నగర్, బాలాజీ సూపర్మార్కెట్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. 33/11 కె.వీ.కొత్తపల్లి, రేకుర్తి, బొమ్మకల్ సబ్స్టేషన్లలో విద్యుత్ పనులు చేపడుతున్నందున మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి సబ్స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, శ్రీపురం కాలనీ, రజ్వీచమన్, సిటిజన్కాలనీ, ప్రియదర్శినికాల నీ, కృష్ణానగర్, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూర్, నల్లకుంటపల్లి, మరియాపూర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నారు. సర్వీస్ క్రమబద్ధీకరించండికరీంనగర్ అర్బన్: వీఆర్ఏ నుంచి జీపీవోలుగా నియామకమైనవారి సర్వీస్ క్రమబద్ధీకరించాలని గ్రామ పాలన అధికారులు శుక్రవారం కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని వార్డు ఆఫీసర్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా సేవలందించామని వివరించారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుతో తమ సర్వీస్ ఆగమ్యగోచరంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మాతృశాఖకు తీసుకోవడం హర్షణీయమని వివరించారు. జీపీవోల సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్పై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వీస్ క్రమబద్ధీకరణతో పాటు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు. -
ప్రజాక్షేత్రంలో పనిచేయండి
చిగురుమామిడి: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన సీపీఐ శ్రేణులు, అధైర్యపడకుండా ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడాలని పార్టీ సీనియర్ నాయకుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. చిగురుమామిడిలోని ముస్కురాజిరెడ్డి స్మారకభవనంలో శుక్రవారం పార్టీ మండలస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం ముల్కనూర్ ఉపసర్పంచ్ పైడిపల్లి వెంకటేశ్ అధ్యక్షతన జరిగింది. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీకి కొంత నిరాశ కలిగించినప్పటికీ.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివేకా మిషన్ గ్రామీణ పేరిట మహాత్మాగాంధీని అవమానపరుస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 22న అన్నిజిల్లాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి నట్లు తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందెస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కౌన్సిల్ సభ్యులు బోయిని పటేల్, చాడ శ్రీధర్రెడ్డి, బూడిద సదాశివ, తేరాల సత్యనారాయణ, జాగిరి సత్యనారాయణ పాల్గొన్నారు. -
పార్క్ నిర్మించాలి
సమ్మక్కసారలమ్మ గద్దెల ప్రక్కనున్న స్థలంలో గతంలో ప్రతిపాదించినట్లు సీనియర్ సిటిజన్స్ పార్క్ నిర్మించాలి. ఓపెన్ థియేటర్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ తదితర సదుపాయాలతో పార్క్ను తీర్చిదిద్దాలి. కాలనీలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నందున, పార్క్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. – తోట సాగర్, హౌసింగ్ బోర్డుకాలనీకాలనీలోని ప్రభుత్వ స్థలంలో మున్సిపల్కార్పొరేషన్ గెస్ట్హౌస్ నిర్మించాలి. నగరపాలకసంస్థ పరిధిలో ప్రస్తు తం మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్ ఎక్కడా లేదు. గతంలో ఉన్న ము న్సిపల్ గెస్ట్హౌస్ను ఇతర అవసరాలకు భవ నం నిర్మించారు. ఈ స్థలంలో గెస్ట్ హౌస్ ని ర్మిస్తే, కాలనీ అభివృద్ధికి దోహదమవుతుంది. – వాడె వెంకటరెడ్డి, హౌసింగ్బోర్డుకాలనీ -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. టవర్సర్కిల్ సమీపంలో వేసిన బీటీరోడ్డు పనులు తనిఖీ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద తాగునీటి సరఫరా పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనులు పరిశీలించారు. పైప్లైన్ లీకేజీని త్వరగా అరికట్టాలని ఆదేశించారు. అశోక్నగర్లో రోడ్డు పనులు, మదీనా కాంప్లెక్స్లోని ఐడీఎస్ఎంటీ భవన ఆధునీకరణ పనులను, మానేరుడ్యాం సమీపంలోని వాకింగ్ ట్రాక్ను పరిశీలించారు. అమరవీరులస్తూపం సమీపంలో చేపట్టిన తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి లీకేజీని అరికట్టాలన్నారు. 30ఏళ్ల క్రితం వేసిన తాగునీటి ౖపైప్లైన్ కాబట్టి తరుచుగా లీకేజీలు సంభవిస్తే, శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఐడీఎస్ఎంటీ భవన ఆధునీకరణ పనులు జనవరి 1వ తేదీలోగా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలన్నారు. సప్తగిరికాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ కోసం స్థల పరిశీలన చేసి, భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలకసంస్థ ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ మేయర్ జి.రమేశ్ పాల్గొన్నారు. స్మార్ట్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలినిర్ణీత వ్యవధిలో స్మార్ట్సిటీ పనులు పూర్తిచేసి, జీఎంఐ పోర్టల్లో నమోదు చేయాలని స్మార్ట్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. స్మార్ట్సిటీ మిషన్ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ, స్మార్ట్ సిటీ మిషన్ నేషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ నుంచి నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. -
మేడారం జాతరకు 700 బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు కరీంనగర్టౌన్:జనవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు మరమ్మతులు, భక్తుల సురక్షిత ప్రయాణంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఖర్చు దాచితే కుర్చీ గల్లంతే
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాక గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ల ఖర్చులెక్క చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డగోలుగా ఖర్చుచేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి ఎక్కువ కాకుండా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే పదవి గల్లంతయ్యే అవకాశముంది. ఖర్చు చేయడం ఒక ఎత్తయితే.. దానిని నిబంధనల ప్రకారం తగ్గించి లెక్కచెప్పడం తలకు మించిన భారంగా అభ్యర్థులు భావిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల లెక్కలను 45 రోజుల్లోగా ఎంపీడీవోలకు సమర్పించి రశీదు తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసారి సదరు వివరాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ– పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. గడువులోపు సమర్పించకపోతే వేటే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలను అప్పచెప్పకుంటే అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు... వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీవోలకు అప్పగించాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడినవారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. 316 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలు ఉండగా 316 పంచాయతీలు, 2,946 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్లు నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదముంది. ఈ మేరకు కొత్త సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. కరీంనగర్స్పోర్ట్స్: శాతవాహన యూనివర్సిటీలోని సైన్స్ కళాశాలలో శనివారం వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ క్రీడాశాలను ప్రారంభించారు. క్యారమ్ ఆడి విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. క్రీడలతో శారీరక దృఢత్వం వస్తుందని, విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. ప్రిన్సిపాల్ ఎస్.రమాకాంత్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మున్వర్, కృష్ణ కుమార్ పాల్గొన్నారు.ఈ తేదీల్లోగా సమర్పించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు మెంబర్ పోటీ చేసే అభ్యర్థి అయితే రూ. 30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2,50,000 వరకు... వార్డు అభ్యర్థి రూ.50,000 వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026, జనవరి 24 లోపు, రెండో విడత జనవరి 27న, మూడో విడతలో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలి. -
పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్గా విజయం సాధించాడు. -
హుజూరాబాద్ రుణం తీర్చుకుంటా
హుజూరాబాద్/ఇల్లందకుంట: రాజకీయ జన్మనిచ్చి, శాసనమండలి సభ్యుడిగా నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డరుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సత్కరించారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా 30కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, ఇల్లందకుంట ఆలయ చైర్మన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ కరీంనగర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22నుంచి గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రాధమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం కరీంనగర్ జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయకపోవడంతో గొర్రెకాపరులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన ప్రభాకర్ వెంటనే సంబంధిత పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వద్దకు మల్లేశం బృందాన్ని తీసుకెళ్లారు. నట్టల మందు పంపిణీ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 22నుంచి మందు పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో మంత్రులకు మల్లేశం కృతజ్ఙతలు తెలిపారు. అడహక్ కమిటీ సభ్యులు కాల్వ సురేశ్, దాడి అంజనేయులు, సతీశ్, రంజిత్, రవీందర్, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు. బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి కరీంనగర్టౌన్: సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశాడని, 42శాతం రిజర్వేషన్లపై చెప్పేదొకటి, చేసేదొకటి అని, పరిషత్ ఎన్నికలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో శనివారం మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం.. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమైక్య కార్యదర్శి తవటం సత్యం, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి కాలువ మధుబాబు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరిగె కోటేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ల మహేశ్ పాల్గొన్నారు. రేషన్కు ఈకేవైసీ తప్పనిసరి కరీంనగర్ అర్బన్: రేషన్ కార్డుదారులందరూ తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. జిల్లాలో 3,17,748 రేషన్కార్డులుండగా 9,45,605 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. ఇందులో 7,20,517 మంది మాత్రమే ఈ– కేవైసీ చేసుకున్నారని, మిగతా రేషన్కార్డుదారులు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి సదరు ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు. కార్డుదారుతో పాటు కార్డులో ఉన్నవారంతా రేషన్ దుకాణంలో వేలిముద్ర, ఐరిస్ చేయించుకోవాలని సూచించారు. -
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా. ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్గా ఎన్నికై న జీల రాజుయాదవ్కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. -
సమష్టి కృషి అభినందనీయం
కరీంనగర్అర్బన్/కరీంనగర్టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తి కాగా జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవోలు శనివారం అదనపు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఆయా మండలాల ఎంపీడీవోలు కీలకంగా పని చేశారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. -
వ్యక్తి మృతిపై అనుమానాలు
● అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పోలీసులకు ఫిర్యాదు ● పోస్టుమార్టంకు తరలించిన అధికారులు ● అనుమానాస్పద మృతిగా కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
రాజన్న ఎన్కౌంటర్కు 40 ఏళ్లు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి ప్రాంతంలోని రెబ్బల్దేవులపల్లి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన అ ప్పటి పీపుల్స్వార్, ప్రస్తు త మావోయిస్టు పార్టీకి చెందిన దళనేత తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్న చనిపోయిన ఆదివారం నాటికి 40 ఏళ్లు. పీడిత, తాడిన ప్రజల పక్షాన పెద్దపల్లి గడ్డపై గళమెత్తిన ధీరుడు రాజన్న. దొరలను గడగడలాడించిన వీరుడు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని రెబ్బల్దేవులపల్లిలోని ఓ ఇంట్లో తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్నతోపాటు ధర్మారం మండలం ఖానంపల్లికి చెందిన చంద్రయ్య ఉరఫ్ శీనన్న షెల్టర్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు రాజన్న, శీనన్న షెల్టర్ తీసుకున్న గుడిసెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం కావటంతో తొలు కానిస్టేబుల్ నర్సయ్య మృతిచెందారు. ఆగ్రహం చెందినపోలీసులు.. గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆనాటి జ్ఞాపకాలు జిల్లా ప్రజల మదిలో ఇంకా మెదలుతూనే ఉన్నాయి. రాజన్న చనిపోయిన 40 ఏళ్లు కావడంతో భార్య తుంగాని రాధక్క, కూతురు క్రాంతి, కుటుంబసభ్యులు ఆయనను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యున్ని కోల్పోయి కన్నీటిపర్యంతమయ్యారు. స్మరించుకున్న కుటుంబసభ్యులు -
అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ ఎన్నికల జాబితా విస్తృత సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధారణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గం ఓట్లు కరీంనగర్ 3,68,166చొప్పదండి 2,35,849మానకొండూరు 2,26,385హుజురాబాద్ 2,52,351రామగుండం 2,19,723మంథని 2,39,699పెద్దపల్లి 2,57,192కోరుట్ల 2,48,270జగిత్యాల 2,39,114ధర్మపురి 2,33,182సిరిసిల్ల 2,23,115వేములవాడ 2,13,284 ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధి, వలసలు, వివాహా లు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూ డు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మ డి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకు కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది. -
సమస్యలపై అవగాహనతో..
బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి 2014 నుంచి లాయర్గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు. కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. -
చెక్డ్యాం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి చెక్డ్యాంను ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సాయంత్రం పరిశీలించారు. మూడురోజుల క్రితం చెక్డ్యాం కూలిపోగా ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు చెక్డ్యాం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మానేరులో పడిపోయిన గోడ బండరాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంపిళ్లు సేకరించారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి వాటిని పరీక్షిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. -
సుడా భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (సుడా) కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని నగరపాలకసంస్థ కమిషనర్, సుడా వైస్చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని సిక్వాడీలో నూతనంగా నిర్మిస్తున్న సుడా కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పునాది, పిల్లర్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత డిజైన్ ప్రకారం సుడా కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ చేపడుతున్న ప్రతి పనిపై ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, సుడా డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. 713 మందికి షోకాజ్ నోటీసులు కరీంనగర్టౌన్: మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు జిల్లా విద్యాధికారి, గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ ఆఫీసర్లుగా విధులు కేటాయించినప్పటికీ కొందరు విధులకు హాజరు కాలేదని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అసౌకర్యం ఏర్పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు, సీసీఏ నియమాల ప్రకారం సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. -
చలితీవ్రతకు వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు. లారీ ఢీకొని ఒకరు..కోరుట్ల: కోరుట్ల బస్టాండ్ ఇన్గేట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన దశరథ్ సోనాజి ఉసరె శనివారం బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో దశరథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన ఆయన కొంతకాలంగా కోరుట్లలో ప్లంబింగ్ పని చేస్తున్నాడు. బంధువుల ఫిర్యాదుమేకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ అలీ(70) అనేడు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పాతబస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న మహబూబ్ అలీని బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహబూబ్ అలీ మృతి చెందాడని అతని కుమారుడు రషీద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాపీ మేస్త్రీ ఆత్మహత్యసిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన తాపీమేస్త్రీ చిద్రాల రవీందర్(45) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే వివాహాలు జరగగా, కుటుంబ పోషణకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతోపాటు మరో కూతురి వివాహం ఎలా చేయాలనే ఆలోచనలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలోనే తాను మేస్త్రిగా పనిచేస్తున్న ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గదుల నిర్మాణానికి స్థల పరిశీలన మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆల య పరిసరాల్లో 96 గదుల సత్రం నిర్మాణానికి రూ.35.19కోట్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఇంజినీరింగ్ అధికారులు కొండగట్టులో స్థల పరిశీలన చేశారు. ఆలయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై చర్చించారు. కొండగట్టులో 96గదుల సత్రం భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినట్లు ఇంజినీర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, అధికారులు పాల్గొన్నారు. -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్లో గోల్మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ -
నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్కు ఫోన్పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు. బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు -
మోడల్ విలేజ్గా..
మా ఆయన విజయ్కుమార్ సైన్యంలో చేరి దేశరక్షణ కోసం సేవలందించారు. ఆయన స్ఫూ ర్తి, ప్రోత్సాహంతో ప్రజా సేవ చేయాలన్న తపనతో సర్పంచ్గా పోటీచేశా. గ్రామస్తులంతా తనకే అండగా నిలవడంతో 1,124 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఎ మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన. గ్రామాభివృద్ధికి పాటుపడతా. గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతా. పెద్దపల్లి: భోజన్నపేట గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎంకాం, డీఈడీ, బీఈడీ చదువుకున్న. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ వర్తింప జేసేలా అధికారులను కోరుతా. గ్రామంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని పరిష్కరిస్తా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. -
జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్తోపాటు ఓనర్ విజయ్ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రయాగ్రాజ్కు మరిన్ని ప్రత్యేక రైళ్లు రామగుండం: ధనుర్మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 23, 24, 25, 26వ తేదీల్లో 07402/03/04/05 రైళ్లు ప్రయాగ్రాజ్కు నడుస్తాయన్నారు. ఇవి చర్లపల్లిలో రాత్రి 7.45గంటలకు బయలుదేరి కాజీపేటకు రాత్రి 9.42 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.50గంటలకు, మంచిర్యాలకు అర్ధరాత్రి 12.35గంటలకు చేరుకుంటాయన్నారు. రెండోరోజు వేకువజామున 4.30గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటాయని వివరించారు. -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో.. విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జ యశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వ చ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చే శారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపా టు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షి ఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో పనిచేస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు. -
ఆక్రమణలకు అడ్డా..!
నగరంలోని శనివారం అంగడి చౌరస్తా వద్ద ఉన్న ఎస్ఆర్ఆర్ కాంప్లెక్స్లోని దుకాణదా రులు ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణలు తొలగించినా.. కొద్ది రోజులకు షరా మా మూలుగానే ఫుట్పాత్తోపాటు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు.నగరంలోని గీతాభవన్ చౌరస్తా నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే కరీంనగర్, సిరిసిల్ల మెయిన్ రోడ్డుపైనే దుకాణాలున్నాయి. టూటౌన్ పోలీసుస్టేషన్ ముందున్న షాపు ఏకంగా రోడ్డుపైనే కొనసాగుతోంది. ఇక్కడ ఫుట్పాత్లే కాదు.. రోడ్డుపై వైట్ లైన్ కూడా కనిపించని పరిస్థితి. గతంలో బల్దియా అధికారులు తొలగించినా.. మళ్లీ యథాస్థానంలోనే వ్యాపార సామగ్రి ఆక్రమించుకుంది. -
15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్కు చెందిన 15 ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతుండగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లో అలోజెనిక్ బోన్ మ్యా రో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలు డు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్ల డించారు. గురువారం కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ.. హెమటాలజీ, బోన్ మ్యా రో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమియా, లింఫోమాస్, మల్టీపుల్ మై లోమా, అప్లాస్టిక్ అనీమియా, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు పెద్దలు, పి ల్లలకు సమగ్ర చికిత్స అందిస్తున్న ట్లు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీల ను నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా యశోద హాస్పిటల్స్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. -
బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్కాస్ట్ –1, ఎక్స్టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్గ్రౌండ్ కోల్మైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, వకీల్పల్లి మైన్తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం.. బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్కాస్ట్గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్పల్లి మైన్ను కూడా ఓపెన్కాస్ట్గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజల ప్రధానమైన డిమాండ్లు ● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి ● ఓపెన్కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు ● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు ● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి. నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తొమ్మిది గ్రామాల్లో భూమి.. వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన -
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరి ధిలో సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం రేకుర్తి,హౌసింగ్బోర్డుకాలనీల్లోని జాతర నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. జనవరిలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.కరీంనగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన బీమారంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు అతిపెద్ద విఘాతంగా పరిణమించనున్నదని ఎల్ఐసీ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు సతీశ్ అన్నారు. బిల్లు, బీమా చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఇప్పటివరకు ఉన్న 74శాతం పరిమితిని 100శాతం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చి పడతాయ ని, కొత్త టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తుందని, ఇన్సూరెన్స్ విస్తరణ మరింతగా దేశం నలుమూలలకు పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు అబద్ధాలని రుజువైందన్నారు. రామ్మోహన్రావు, సూర్యకళ, వామన్రావు, బసవేశ్వర్, అనుపమ పాల్గొన్నారు.పత్తి మార్కెట్కు మూడురోజులు సెలవుజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,450 పలికింది. గురువారం మార్కెట్కు 19వాహనాల్లో 144 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకాని కి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.6,800కు వ్యాపారులు కొనుగోలు చే శారు. మార్కెట్కు శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు సెలవులుంటా యని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయ ని ఇన్చార్జి కార్యదర్శి రాజా పేర్కొన్నారు. 27న ఎస్యూలో మెగా జాబ్మేళాసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో ఈనెల 27న మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఆవరణలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ వంటి 50కి పైగా కార్పొరేట్ కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
పైసలు పాయే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలుబడే వరకూ విజయం తనదేననే ధీమాతో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నిక ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా.. ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు.సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్: జిల్లాలోని 316 గ్రామ పంచాయతీలు 2,946 వార్డుస్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 8 సర్పంచ్, 657 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ఖర్చుచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకు నేందుకు డబ్బు, మద్యంతోపాటు విలువైన బహుమతులూ అందజేశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు నగదు కూడా పంపిణీ చేశారు. చాలామంది ఆస్తులు విక్రయించగా, కొందరు మరీ అప్పు తీసుకొచ్చారు. ఓటమి పాలయ్యాక అప్పులే మిగిలాయని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గెలిచిన వారు సైతం అప్పుచేసి గెలిచామని, ఎలా తీర్చాలన్న మదనతో ఉన్నారు. ఖర్చుకు వెనుకాడలేదు.. సర్పంచ్తోపాటు వార్డుస్థానాల్లోని అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు. రూ.లక్షల్లో వెచ్చించారు. చెక్పవర్ ఉండడంతో రిజర్వేషన్ కలిసిరాని పంచాయతీల్లో వార్డుస్థానాల్లో పోటీచేసిన కొందరు ఉప సర్పంచ్ పదవి చేజిక్కించుకోవాలని వ్యూహం పన్నారు. వార్డు అభ్యర్థులు.. సర్పంచ్ అభ్యర్థులతో సమానంగా ఖర్చు చేశారు. ఫలితం తేడా రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తే గెలుపు ‘నల్లేరుపై నడకే’నని భావించిన కొందరు ఓటమి చెందారు. తమ ఓటమికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషించుకుంటున్నారు. నగదు పంపిణీ, తమ క్యాంపులో ఉంటూ ప్రత్యర్థికి సహకరించిన వారెవరనే కారణాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. రెబల్స్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు.. పార్టీలో ఉండి రెబల్స్కు సహకరించిన వారిని గుర్తించి, వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేస్తున్నారు. వారిపై ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీలకు సహకరించిన వారిపై తమ పార్టీ ముఖ్యనాయకులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు.. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ఈసారి పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా రిజర్వేషన్ కలిసి వస్తే ఓడిపోయిన సానుభూతితో ఎంపీటీసీగా గెలవవచ్చని భావిస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల వేళ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాల సమయంలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవచ్చని పరిషత్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్యాంప్ఫైర్లో నృత్యం చేస్తున్న క్రిస్టియన్లుసింగరేణి సంస్థ చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. – సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లోu తీగలవంతెనను కమ్మేసిన మంచు దుప్పటిమొగ్ధుంపూర్లో ఉదయిస్తున్న సూర్యుడు చెర్లభూత్కూర్లో లైట్లు వేసుకుని వస్తున్న లారీజిల్లాలో చలి వణికిస్తోంది. కొన్ని రోజుల నుంచి చలితీవ్రతతో ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. నగరశివారులోని తీగలవంతెన, ప్రధాన రహదారులపై ఉదయం 8 గంటల వరకు పొగ మంచు వీడడం లేదు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పొగమంచు నిండిపోయింది. రాజీవ్ రహదారి, రాయపట్నం స్టేట్ హైవే, మొగ్ధుంపూర్– నగునూరు రహదారి కన్పించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొద్ది రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్/ కరీంనగర్రూరల్మంచు కురిసే వేళలో.. -
పంచాయతీ కిక్కు రూ.151కోట్లు
కరీంనగర్క్రైం: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఎకై ్సజ్శాఖకు కాసులవర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.151 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27వ తేదీన విడుదల కాగా... డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 94 మద్యం దుకాణాలు, 34 బార్లు ఉన్నాయి. 17 రోజుల వ్యవధిలో ఎన్నికల సందర్భంగా 1,16,963 కాటన్ల మద్యం, 1,57,659 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయని ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మూడు దఫాలుగా పోలింగ్ జరిగింది. ఆయా ప్రాంతాల్లో రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేశారు. ఆయా సందర్భాల్లో పక్క ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసుకెళ్లారు. మొత్తంగా కొత్త మద్యం పాలసీలో దుకాణాలు దక్కించుకున్న వారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోణీ కొట్టగా మంచి ఆదాయం సమకూరుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందుకు మరిన్ని ఎన్నికలు ఉండడంతో ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా వేడినీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలోపే అల్పాహారం తిన్నాం. – మాధవి, ఉపాధ్యాయురాలు ఏర్పాట్లు బాగున్నాయ్ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. మాకు రాత్రిబస చేసేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు కలుగకుండా స్థానిక అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది పంచాయతీ ఎన్నికల విధులను నిర్వహించడం సంతృప్తినిచ్చింది. పోలింగ్ సమయానికల్లా సిద్ధంగా ఉండేంలా సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. – సామ శిరీష, ఉప్పట్ల, మంథని


