breaking news
Karimnagar District Latest News
-
ఎందుకు చంపారు
ఎలా చంపారు?సాక్షి,పెద్దపల్లి/మంథని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టువామన్రావు, నాగమణిల హత్యకేసులో విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఓ బీఆర్ఎస్ నేతకు సంబంధం ఉందంటూ వామన్రావు తండ్రి కిషన్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 12న సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం 2022లో నిషేధం విధించగా.. ఈ ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసహంరించుకోవడంతో గురువారం సీబీఐ అధికారులు పెద్దపల్లి జిల్లాలో విచారణ చేపట్టారు. దీంతో ఈ హత్య కేసులో ఏమైనా కుట్రకోణం ఉందా? అరెస్ట్ అయిన నిందితులే కాకుండా ఇతరుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనుండగా.. వామన్రావు దంపతుల హత్యకేసు ఉమ్మడి జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. 55 నెలల తరువాత పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టువామన్రావు, నాగమణి దంపతులు 2021 ఫిబ్రవరి 17న రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితులతో పాటు సహకరించిన ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిచారు. కొద్దిరోజులకు బెయిల్పై బయటకు వచ్చారు. కేసులో అప్పటి పోలీసు యంత్రాంగం సరైన దిశలో విచారణ చేపట్టలేదని, కీలక నిందుతుడిని తప్పించారంటూ వామన్రావు తండ్రి కిషన్రా వు ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుతోనే తనకు న్యా యం జరుగుతుందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పుతో హత్య జరిగి నాలుగేళ్ల 7నెలలకు సీబీఐ విచారణ చేపట్టింది. కేసు విచారణలో భాగంగా ముగ్గురు సీబీఐ అధికారుల బృందం గురువారం మంథనిలో పర్యటించారు. మొదట వామన్రావు తండ్రి కిషన్రావు, సోదరుడు చంద్రశేఖర్, కుటుంబ సభ్యులను వారి స్వగ్రామం గుంజపడుగులో కలిసి వివరాలు తెలుసుకున్నారు. మంథని కోర్టు ఆవరణలో పలు అంశాలను పరిశీలించారు. అక్కడి నుంచి హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. సీబీఐ బృందానికి రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఓ కార్యాలయాన్ని కేటాయించారు. కేసు సమన్వయం చేసేందుకు గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ను కేటాయించారు. కేసు పూర్వాపరాలతో పాటు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, రిమాండ్ కేసు డైరీ, చార్జీషీట్లను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన వాఖ్యలకు నిరసనగా అతని ఇంటి ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయగా, అన్ని మండలాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా ధర్నాలు, బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జంట హత్యకేసుల్లో సీబీఐ ఎంట్రీతో జిల్లాలో రాజకీయం మరింత హీటెక్కింది.సీబీ‘ఐ’ ఎంట్రీ! -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జమ్మికుంట: బంధువు అంత్యక్రియలకు వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన కొలుగూరి మధునమ్మ,బాలయ్య దంపతుల కొడుకు నవీన్(23) మండలంలోని మడిపల్లి గ్రామంలో గురువారం బంధువు మృతి చెందగా అంత్యక్రియలకు హాజరయ్యాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో జమ్మికుంట వైపుకు బైక్పై వస్తుండగా.. మడిపల్లి శివారు శాంతినగర్లో ఎదురుగా వస్తున్న టాటాఏస్ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అరటి సాగు చేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: వరి, మొక్కజొన్న పంటలకు భిన్నంగా అరటి సాగు చేసి ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యామ్ప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో అరటిసాగుపై గురువారం అవగాహన కల్పించారు. అరటి సాగుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎకరాకు రూ.28వేల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1500 ఎకరాల నుంచి 25 ఎకరాలకు సాగు పడిపోయిందని నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి స్వాతి అన్నారు. అభ్యుదయ రైతు జితేందర్రావు మాట్లాడుతూ ఢిల్లీ, హైదరాబాద్ అరటి వ్యాపారులు బైబ్యాక్ పద్ధతిలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హెచ్ఈవో అనిల్, ఆయిల్ పాం ప్రతినిధి విజయ్భరత్, డ్రిప్ కంపెనీ ప్రతినిధి దేవేందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసిన మహిళపై కేసుకరీంనగర్క్రైం: కరీంనగర్లోని ఓ బ్యూటీ సంస్థకు చెందిన ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసిన మహిళపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యూటీ సంస్థ ప్రతినిధి శైలజ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణవేణి అనే మహిళపై కేసు నమోదు చేశారు. -
వరదకాలువలో కొట్టుకొచ్చిన మహిళ శవం
● మోర్తాడ్ మండలానికి చెందిన వృద్ధురాలిగా గుర్తింపు మల్యాల: మండలంలోని నూకపల్లి శివారు వరదకాలువలో ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఆ శవాన్ని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ప్రభావతిగా మల్యాల పోలీసులు గుర్తించారు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. కామణి ప్రభావతి (66) కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈనెల 16న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. బంధువులు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుమారుడు శ్రీనివాస్ వెతుకుతున్నాడు. వరదకాలువలో శవమై కొట్టుకురావడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. శ్రీనివాస్ను పిలిపించగా.. తన తల్లిగా గుర్తించాడు. కేసు నమోదు చేసినట్లు మల్యాల పోలీసులు తెలిపారు. వృద్ధురాలి మెడలోంచి బంగారం చోరీజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లికి చెందిన నేరెల్ల లచ్చవ్వ మెడలోంచి గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని దొంగ తులంన్నర బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లాడు. లచ్చవ్వ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెను మాటల్లో దింపి బంగారు కుత్తికట్టును లాక్కుని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి దొంగ పారిపోయాడు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామంలోని సీసీ పుటేజీలు, ప్రధాన రహదారుల్లోని సీసీ పుటేజీని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో అనుమానితులు కన్పిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సుధాకర్ అన్నారు. రాజన్న హుండీ ఆదాయం రూ.1.21 కోట్లువేములవాడ: రాజన్నను దర్శించుకున్న భక్తులు హుండీలలో వేసిన కట్న, కానుకలను ఆలయ అధికారులు గురువారం ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపును ఈవో రమాదేవి పర్యవేక్షించారు. రూ.1,21,70,150 నగదు, బంగారం 64 గ్రాములు, వెండి 7.300 కిలోలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ అధికారులు, శ్రీశివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.93వేలకు టోకరాకరీంనగర్ క్రైం: నగరానికి చెందిన వ్యక్తికి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.93వేలకు పైగా టోకరా వేశారు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని మారుతినగర్కు చెందిన శ్రీరామోజు రఘు టెలిగ్రాం యాప్లో ట్రేడింగ్కు సంబంధించిన ఓ లింకును క్లిక్ చేశాడు. క్యూఆర్ కోడ్ ద్వారా మొదట రూ.20వేలు పంపాలని, అధిక మొ త్తంలో తిరిగి చెల్లిస్తామని వాట్సప్లో సందే శం పంపడంతో డబ్బులు పంపించాడు. తరువాత పలు దఫాలుగా రూ.93వేలు వసూలు చేశారు. తర్వాత స్పందన లేకపోవడంతో పో లీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చే స్తున్నామని త్రీటౌన్ సీఐ జాన్రెడ్డి తెలిపారు. ఏపీ సైబర్ క్రైం పోలీసుల అదుపులో మల్యాల యువకులుమల్యాల: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులను ఓ సైబర్క్రైం కేసులో ఏపీ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో జరిగిన ఓ సైబర్క్రైం కేసులో మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారని, తమ స్నేహితుడికి బ్యాంకు ఖాతా ఇవ్వడంతో వారి ఖాతాల్లో రూ.2లక్షలు జమ అయ్యాయని, ఆ మొత్తాన్ని డ్రా చేసి ఇచ్చారన్న సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని జగిత్యాలలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. -
తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు కౌన్సెలింగ్
వీణవంక: తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు వీణవంక మండలం బేతిగల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామానికి చెందిన కంబాల రాయమల్లు– చెన్నమ్మలకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కొడుకులు పోషించడం లేదని ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు కౌన్సెలింగ్ ఇచ్చి నెలకు ఒక్కొక్కరు రూ.4వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీవో ఆదేశాలను అమలు చేస్తున్నారా లేదా అని గురువారం జిల్లా సంక్షేమ ఆధికారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో విచారించారు. ఇద్దరు కుమారులు పోషించడంలేదని తల్లిదండ్రులు చెప్పడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల పోషణను చూసుకోవాలని చెప్పడంతో పాటు రూ.16వేలు ఇప్పించారు. ఆర్ఐ రవి, డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, సాయికిరణ్, వినోద్, ఆంజనేయులు ఉన్నారు. -
60 మందిపై పిచ్చికుక్క దాడి
● పది మంది పిల్లలు.. నలభై మందికి పైగా పెద్దలు ● సిరిసిల్ల ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులుసిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం పిచ్చికుక్క వీరంగం చేసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలను కరుస్తూ భయాందోళన సృష్టించింది. ఒకే కుక్క సుమారు 60 మందికి పైగా కరిచింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలో గురువారం సాయంత్రం ఓ పిచ్చికుక్క ఇందిరానగర్, తారకరామానగర్, బీవైనగర్, గణేశ్నగర్, మార్కెట్పల్లి, సాయినగర్, మార్కెట్ కమిటీ తదితర ప్రాంతాల్లో హల్చల్ చేసింది. ఇంటిబయట తిరుగుతూ కనిపించిన వారిని కరిచింది. మనుషులు కనిపిస్తే చాలు ఉక్రోషంతో ఊగిపోతూ దాడి చేసింది. సుమారు 60 మందికి పైగా దాడి చేయగా.. ఏడాదిన్నర వయస్సున్న పాప, మరో ఇద్దరు మూడేళ్లలోపు చిన్నారులు, పదమూడేళ్లలోపు ఏడుగురు ఉన్నారు. బాధితులు వరుసగా జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 50 మందికి పైగా చికిత్స అందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. బాధితులకు టీటీ, ఏఆర్వీ, ఇమ్యూనోగ్లోబిలెన్స్ ఇంజక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి మూడేసి ఇంజక్షన్లు వేయడమే కాకుండా యాంటిబయాటిక్స్, నొప్పి తదితర మందులను అందించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు ఎంతమంది ఉన్నా..చికిత్స అందించేందుకు ఆస్పత్రి సిబ్బందిని 24గంటల పాటు అందుబాటులో ఉంచారు. పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వ విప్ సిరిసిల్లలో పిచ్చికుక్క దాడిలో పెద్దసంఖ్యలో బాధితులు ఉండడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని సూచించారు. కుక్కను పట్టుకునే పనిలో బల్దియా కనిపించిన వారిపైన దాడి చేసిన కుక్కను పట్టుకోవడానికి సిరిసిల్ల మున్సిపల్ సిబ్బంది చర్యలకు దిగారు. కమిషనర్ ఎం.ఏ.ఖదీర్పాషా ఆదేశాలతో క్షతగాత్రులు ఉన్న ఏరియాల్లో సిబ్బందిని పంపి కుక్క కోసం గాలింపు చేపట్టారు. -
రేషన్షాపుల్లోనే దొడ్డుబియ్యం
పెగడపల్లి: మండలంలోని రేషన్ దుకాణాల్లో క్వింటాళ్ల కొద్ది దొడ్డు బియ్యం మూలుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం రేషన్కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్న విషయం తెల్సిందే. అయితే అప్పటికే దుకా ణాల్లో నిల్వ ఉన్న దొడ్డుబియ్యం అలాగే ఉండిపోయాయి. ఆ బియ్యం ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారుతున్నాయి. ఆర్నెళ్ల క్రితం రేషన్ దుకాణాలకు చేర్చిన దొడ్డుబియ్యాన్ని తిరిగి గోదాములకు పంపించాల్సి ఉండగా.. పట్టించుకునేవారు లేకపోవడంతో అలాగే ఉండిపోతున్నాయి. ఏ దుకాణంలో చూసినా 15 నుంచి 20 క్వింటాళ్లు వరకు నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు సన్యబియ్యం స్టాక్ వస్తే ఇబ్బందిగా ఉందని, అధికారులు స్పందించి దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని డీలర్లు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ లాస్యశ్రీని వివరణ కోరగా దొడ్డ బియ్యం నిల్వలపై ఉన్నతాధికారులు, సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. -
భారీ స్కాలర్షిప్తో ‘అల్ఫోర్స్ అటెమ్ట్– 2025’
● రూ.54,44,444 స్కాలర్షిప్ పోస్టర్ను ఆవిష్కరించిన చైర్మన్ నరేందర్ రెడ్డికొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి 25 తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు ఇవ్వబడే ఐఐటీ/నీట్ శిక్షణలో రాయితీ పొందడానికి స్కాలర్షిప్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో గురువారం అటెమ్ట్–2025 వాల్పోస్టర్ ఆవిష్కరించారు. నరేందర్రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు 35ఏళ్లుగా రాష్ట్ర విద్యారంగానికి చేయూతనివ్వడంతో పాటు ఎంతోమంది విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పదోతరగతి విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన వారికి సుమారు రూ.54,44,444 విలువగల స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 91335 37444/ 91602 94441/92469 34456/92469 34441 సెల్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
22 నుంచి దేవీ నవరాత్రోత్సవాలు
● 30న మహాసరస్వతీ పూజ ● అక్టోబర్ 1న తెప్పోత్సవంవేములవాడ: రాజన్న ఆలయంలో ఏటా జరిగే శ్రీదేవీ నవరాత్రోత్సవాలు ఈ ఏడాది 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రమాదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు దర్శనం, వసతి, రవాణా సౌకర్యాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రత్యేకత ఈ ఉత్సవాలు రాజన్న ఆలయంలో అత్యంత ప్రాధాన్యం కలిగినవి. నిత్యం విభిన్నమైన వాహనసేవలు భక్తులను ఆధ్యాత్మిక భక్తి ప్రవాహంలో ముంచెత్తుతాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ వేడుకల్లో హాజరయ్యేందుకు వేములవాడకు తరలివస్తారు. ఈనెల 29న ఉదయం 9.30 గంటలకు నక్షత్ర పుస్తకరూపిణి మహాసరస్వతీ పూజ, 30న రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్ధని అమ్మవారికి మహాపూజ, అక్టోబర్ 1న రాత్రి 8.15 గంటలకు పూర్ణాహుతి, బలిహరణం, స్వామి వారి ధర్మగుండంలో తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, అంబారీసేవ, శమీపూజలు నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి వివరించారు. -
హుండీలే టార్గెట్
● ఆలయాల్లో వరుస చోరీలు ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలంలో దొంగలు హుండీలను టార్గెట్ చేసి వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. మండలంలోని నాలుగు ఆలయాల్లో హుండీలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. దీంతో పోలీసులకు ఆలయ కమిటీ చైర్మన్లు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసుల నుంచి సరైన స్పందన లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మారం మండలం గోపాల్రావుపేటలోని శ్రీ వేంకటేశ్వరాలయం, నందిమేడారం అమరేశ్వరాలయం, ఇదే గ్రామంలోని హనుమాన్ ఆలయంలో దొంగలు హుండీలను పగులకొట్టి నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఒకవైపు నిఘా పెట్టినా తాజాగా సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దొంగలు హుండీ పగులగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆలయ చైర్మన్ ఈవోకు సమాచారం ఇవ్వడంతో అదే రోజు హుండీ డబ్బులు లెక్కించారు. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా నందిమేడారం అమరేశ్వరాలయం చైర్మన్ కోరిక మేరకు ఎన్ఆర్ఐ దామోదర్యాదవ్ ట్రస్టు ఆధ్వర్యంలో సోలార్ సీసీ కెమెరాలను ట్రస్టు కోఆర్డినేటర్ వేల్పుల నాగరాజు అందించారు. దొంగల బెడదతోనే హుండీ లెక్కింపు ధర్మారం మండలం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు ముసుగుతో వచ్చి హుండీ పగులగొట్టేందుకు ప్రయత్నించారు. హుండీకి నాలుగు రకాల తాళాలు వేయడంతో పగులగొట్టడం సాధ్యం కాలేదు. దీంతో వదిలిపెట్టి వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. హుండీని పగులగొట్టడంతోనే నగదు లెక్కించినట్లు ఆలయ చైర్మన్ సంతోష్ తెలిపారు. దొంగలను పట్టుకుంటాం ఆలయాల్లో వరుస చోరీలు జరగడంతో నిఘా పెట్టాం. ఫింగర్ ప్రింట్ తీసుకున్నాం. పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్లను టాలీ చేస్తున్నాం. సీడీఆర్ కాల్డాటాపై విచారణ చేస్తున్నాం. రాత్రి వేళ వాచ్మెన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆలయ కమిటీలకు సూచించాం. – ఎస్సై ప్రవీణ్కుమార్ -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి దంపతుల జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఫోన్ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకు అప్పగిస్తే ఉమ్మడి జిల్లాలోనే మూడు కేసుల విచారణ కొనసాగనుంది. ఈ మూడు కేసులతో ఉమ్మడి జిల్లాకు లింక్ ఉండటంతో రాజకీయం హీటెక్కుతోంది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలుండగా వారి కదలికలను పసిగట్టేందకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ట్యాపింగ్ చేసినట్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్రావును 2024 మార్చిలో సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో సంచలం సృష్టించిన ఈ మూడు కేసులు ఉమ్మడి జిల్లాతో ఉన్న లింకులు బయటపడనున్నాయి. వామన్రావు ఇంటి వద్ద సీబీఐ అధికారులు2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతులు రామగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సీబీఐ పునర్విచారణతో వామన్రావు తండ్రి ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత ప్రమేయంపై ఏం తేల్చస్తుందోనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోరుగా చర్చ నడుస్తోంది.మంథని నియోజకవర్గం పరిధిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వైఫల్యానికి ప్రణాళిక, డిజైన్, నాణ్యత లోపాలు, నిర్మాణం కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం లేఖ రాసింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా విచారణ చేపట్టొద్దని హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. -
మేదరుల సమస్యలు పరిష్కరించాలి
విద్యానగర్(కరీంనగర్): ప్రపంచ వెదురు దినో త్సవం సందర్భంగా జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు మేదర కులస్తులు ర్యాలీ నిర్వహించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందించారు. మేదరులకు ప్రభుత్వమే వెదురును ఉచితంగా అందించాలన్నారు. మేదరి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అందుకు తగిన నిధులు అందించాలన్నారు. పేదలకు ఇండ్లు అందించాలన్నారు. జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు మధిర రవీందర్, రాష్ట్ర కమిటీ నాయకులు అలిపిరెడ్డి లచ్చయ్య, ఏకుల రాజనర్సు, సిలువేరి సత్యనారాయణ, పిట్టల కనకయ్య, ఏకుల రమేశ్, మదిరే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
● మంథని కేంద్రంగా రెండు కేసుల దర్యాప్తు ● ‘కాళేశ్వరం’ అవినీతి ఆరోపణలు, వామన్రావు దంపతుల హత్య కేసు ● ఫోన్ట్యాపింగ్ కూడా తోడైతే మూడు కేసులు ఉమ్మడి జిల్లావే.. ● 33 నెలల తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ ఎంట్రీ ● రాజకీయ వేడి పెంచుతున్న దర్యాప్తు
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది. ● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి. ● 2022 సెప్టెంబరులో పీఎఫ్ఐ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్లోనూ ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ● లిక్కర్స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్లో 2022 సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది. ● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. -
కొత్త లే అవుట్లు ఏర్పాటు చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: సుడా పరిధిలో కొత్తగా లే అవుట్లు ఏర్పాటు చేయలని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ సమీక్ష గురువారం నగరంలోని కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన లే అవుట్లకు గతంలో గుర్తించిన ప్రాంతాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నివేదిక తయారు చేసిందని తెలిపారు. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. నగరంలో మిగిలిపోయిన కూడళ్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నామన్నారు. సుడా కమర్షియల్ భవనం, ఐడీఎస్ఎంటీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చొక్కారావు జంక్షన్ ప్రక్కన ఉన్న కూడలిని సుందరీకరించాలని సూచించారు.మెయిన్ రోడ్లలోని నాలాల బ్రిడ్జిలపై హైదరాబాద్ తరహాలో ప్లాంట్స్తో సుందరీకరించాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొక్కెరకుంట,కోనాయపల్లి రోడ్డుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. సుడా వైస్ చైర్మన్ ప్రఫుల్ దేశాయ్, సీపీవో ఆంజనేయులు, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ రొడ్డ యాదగిరి, డీఈ రాజేంద్ర ప్రసాద్, టీపీవో శ్రీధర్ ప్రసాద్, టీపీఎస్ సంధ్య, అజ్మల్ పాల్గొన్నారు. -
జాతీయజెండాకు అవమానం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో జాతీయ పతాకా నికి అవమానం జరి గింది. ప్రజా పాలనలో భాగంగా బుధవా రం ఉదయం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేశ్ జెండాను ఆవి ష్కరించారు. సూర్యస్తమయానికి ముందు జాతీయ పతాకా న్ని గౌరవంగా దింపాలి. కానీ నిర్లక్ష్యంగా వదిలేశారు. కొత్తపల్లి పట్టణానికి చెందిన వాక ర్స్ గురువారం ఉదయం గమనించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. విషయం ప్రచారమవుతుండటంతో పాఠశాలలోని ఓ విద్యార్థితో దింపించారు. దీనిపై మండల విద్యాధికారి తుమ్మ ఆనందంను వివరణ కోరగా జాతీయ పతాకాన్ని దింపడంలో నిర్లక్ష్యం వహించిన అటెండర్లకు మెమోలు జారీ చేశామన్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం హెచ్ఎం పాఠశాలల సందర్శన, మేళాకు వెళ్లడం జరిగిందని, పీఈటీ సెలవులో ఉండటంతో అటెండర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మెమోలిచ్చినట్లు పేర్కొన్నారు. పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయండికరీంనగర్ అర్బన్: జిల్లాలో పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 44,885 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,38,620 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని 15 జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు రైతుల ఆధార్ ప్రామాణికమని, రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో అనుసంధానం, కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకునే విధంగా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ‘కందుకూరి’కి ధర్మనిధి సాహిత్య పురస్కారంకరీంనగర్కల్చరల్: కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు కందుకూరి అంజయ్య తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ధర్మనిధి సాహిత్య పురస్కారం– 2025ను అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ధర్మనిధి సాహిత్య పురస్కారాల్లో ఒకటైన డాక్టర్ రావికంటి వసునందన్ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్య, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్.రాములు అవార్డు అందించారు. కవులు నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, కూకట్ల తిరుపతి, గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు అభినందించారు. -
భూ సమస్యలపై ఫోకస్
జిల్లా దరఖాస్తులు పరిష్కారమైనవి కరీంనగర్ 31,325 3,182 జగిత్యాల 25,675 1,600 రాజన్న సిరిసిల్ల 8,928 2,706 పెద్దపల్లి 17,592 2,217సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. భూభారతి చట్టం అమల్లోకి రావడం, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడం, గ్రామానికో గ్రామపంచాయతీ అధికారి(జీపీఓ)ను కేటాయించడంతో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. సర్వే నంబర్లు, భూయజమాని ఇంటి పేరు, యజమాని పేర్లలో తప్పులు దొర్లడం, విస్తీర్ణం తక్కువగా నమోదవడం, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూమి సర్వే నంబర్లు రావడం, సర్వే నంబర్లు మిస్ కావడం, సాదాబైనామా, మ్యుటేషన్, ఆసైన్డ్ భూముల పట్టా, వారసత్వ పట్టా వంటివి దాదాపు 20 కేటగిరీలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూసమస్యలపై 83,520 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9,705 దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 89శాతం దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువ ఉమ్మడి జిల్లా పరిధిలో మే నెలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కరీంనగర్ జిల్లాలో 31,325 దరఖాస్తులు వస్తే 3,182 పరిష్కారమయ్యాయి. జగిత్యాల జిల్లాలో 25,675 దరఖాస్తులు వస్తే 1,600 పరిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,929 దరఖాస్తులకు 2,706, పెద్దపల్లి జిల్లాలో 17,592 దరఖాస్తుల్లో 2,217 పరిష్కారమయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 40శాతం మేర సాదాబైనామావే ఉన్నాయి. గతంలో తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉన్నవారు 2020లో పట్టాదారు పాస్పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ధరణి చట్టం ప్రకారం.. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం వీలుకాదని గతంలో హైకోర్టు స్టే విధించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. భూభారతి చట్టంలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించినట్లు కోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో స్టే ఎత్తేసింది. దీంతో సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశముంది. -
ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి
కరీంనగర్కల్చరల్: సైగ భాష అందరూ నేర్చుకోవాలని, యూనివర్సల్గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని విద్యానగర్లో ఉన్న ప్రభుత్వ బధిరుల ఆ శ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. భాషలు లేనికాలంలో సైగల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేదన్నారు. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండడం ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దివ్యాంగుల భావాలను అర్థం చేసుకొని, వారితో మెరుగైన కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ద్వారా అధికారులకు, ఉత్సాహం ఉన్నవారికి సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ సర్వీసులో ఒకసారైనా అంధుల, బధి రుల పాఠశాలల్లో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్ఐఈపీఐడీ బాధ్యులు డాక్టర్ హిమాన్షు, ప్రియాంక, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జీసీడీవో కృపారాణి, తహసీల్దార్ నరేందర్, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు. పని ప్రదేశాల్లో ఫిర్యాదు కమిటీలుండాలి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్షాప్ నిర్వహించారు. పది మంది కన్నా ఎక్కువ కార్మికులు లేదా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు పూర్తి చేయాలన్నారు. కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు తమ సంస్థ లేదా ఐసీసీలో ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్, మెప్మా పీడీ స్వరూపారాణి, సీడీపీవో సబిత, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం
జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్కాంబ్) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు. వీటిని పెద్దాపూర్, తెలుకుంట, నాగులపల్లె, జూలపల్లి, చీమలపేట తదితర గ్రామాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. మూడు నెలలకే పంట కోతకు వస్తుంది. పెట్టుబడి తక్కువ, శ్రమతో కూడుకున్నది. అయినా, డిమాండ్ అధికంగా ఉండడంతో అన్నదాతలు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మ పండుగకు మూడు నెల ముందే నారుపోస్తారు. సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన పూలు పండిస్తున్నారు. గతంలో రెండు, మూడు ఎకరాలకే పరిమితమైన పట్టుకుచ్చుల సాగు.. ఇప్పుడు సుమారు 15 ఎకరాలకు పైగా పెరిగిందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామని రైతులు చెబుతున్నారు. పల్లెల నుంచి పట్టణాలకు.. వివిధ పల్లెల్లో పండిస్తున్న పట్టుకుచ్చుల పూలను రైతులు పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, గోదావరిఖని, కరీనంగర్, హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పెద్దాపూర్లో పెరిగిన సాగు విస్తీర్ణం రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని వినతి -
ప్రోత్సాహం ఇవ్వాలి
పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి. – పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్ బతుకమ్మ తయారీలో పట్టుకుచ్చులు అగ్రస్థానంలో ఉంటాయి. ఈ పూలు బతుకమ్మ పండుగకే వన్నె తెస్తాయి. మేము వీటినే ఉపయోగిస్తాం. – కె.రమాదేవి, కోనరావుపేట బంతి, చామంతి, లిల్లీ, గైలార్డియాపూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. తక్కువ పెట్టుబడి, శ్రమలేని బంతిపూలు సాగుచేయాలి. – మహేశ్, హార్టికల్చర్ ఆఫీసర్ -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● గతానికి భిన్నంగా వెసులుబాటు ● అక్టోబర్ 20 గడువు కరీంనగర్ అర్బన్: డిజిటల్ క్రాప్ సర్వేశ్రీ క్రమంగా పట్టాలెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో కొంత ఆలస్యంగా మొదలవగా సర్వే పురోగతిని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమీక్షిస్తున్నారు. వచ్చే అక్టోబరు 20నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గతేడాది సర్వే నిర్వహణకు ఏఈవోలు చేతులెత్తేయగా ఈ ఏడాది ఆ సమస్య తలెత్తకుండా, సజావుగా సాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 17 అంశాలతో వివరాల నమోదు మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలు, దిగుమతులు, ఎగుమతులు, ప్రాసెసింగ్ వంటి అవసరాల ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు వివరాలను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. 17 పేజీల మార్గదర్శకాలతో ప్రభుత్వం ఆదేశించింది. పచ్చిరొట్ట, అపరాలు, సీడ్ ప్రొడక్షన్ వివరాలు, అంతర పంట వివరాలు, సేంద్రియ వ్యవసాయం చేసే వారి వివరాలు, ప్రతి పంట వాటి రకాలు, నీటి వసతి, ఉద్యాన పంటలైతే వయసు, చెట్ల సంఖ్య నమోదు చేయనున్నారు. గత నెల వరకు 2,10,234 పాసుపుస్తకాలకు డిజిటల్ సైన్ కాగా ప్రతి సర్వే నంబర్ వారీగా పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం ప్రత్యేక సాఫ్ట్వేర్లో పొందుపరిచిన అనంతరం రైతుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్ రానుంది. పురుషులకు 2 వేలు.. మహిళలకు 1,800 లక్ష్యం సీజన్లో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్ పరిధిలోని రైతులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవంగా సాగులో ఉన్న క్షేత్రాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. మహిళా ఏఈఓలు కనీసం 1,800 ఎకరాల్లో, పురుష ఏఈఓలు కనీసం 2వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటికి సాధారణ క్రాప్ బుకింగ్ పద్ధతిలో చేస్తారు. ప్రతి పంటను ఫొటో తీసి అప్లోడ్ చేయటం తప్పనిసరి. నమోదు మొత్తాన్ని ఒకే మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేస్తారు. సర్వేలో వరి రకాల వివరాలు పేర్కొనటం తప్పనిసరి. ధాన్యం సేకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది. సర్వే ఎందుకంటే దేశంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే అంచనా సులువు. అలాగే దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల నిర్ణయం ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితత్వంతో నష్ట నిర్ధారణ ఉంటుంది. అలాగే చీడపీడల ఉనికి, తగిన విధంగా రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు సంసిద్ధతకు వినియోగించనున్నారు. వ్యవసాయ పురోగతి అంచనాకు ఈ సర్వే దోహదపడుతుంది. రైతుకు సంక్షిప్త సందేశం క్రాప్ బుకింగ్ 90శాతం పూర్తి కాగానే రైతులకు సంక్షిప్త సమాచారం ద్వారా వివరాలు పంపిస్తారు. రైతు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. నమోదులో తప్పులు దొర్లితే సరిచేయమంటూ రైతు దరఖాస్తు ఇవ్వాలి. ఏఈవో మూడు రోజుల్లో సరి చేసి తుది జాబితా ప్రదర్శించనున్నారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరంగా సాగుతోందని, తప్పుగా నమోదైన వివరాలు సరిచేసేందుకు అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. జిల్లాలో మొత్తం రైతులు : 2,10,234 మొత్తం క్లస్టర్లు : 77 రెవెన్యూ గ్రామాలు : 205 భూ విస్తీర్ణం : 3,33,450 ఎకరాలు -
బైండోవర్ ఉల్లంఘించిన ఏడుగురికి జైలు
మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్ మధుసూదన్రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ ఇన్స్పెక్టర్ రాజేశ్కుమార్ తెలిపారు. దీంతో వారికి ఏడాది జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారన్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్ నిమిత్తం కరీంనగర్కు తరలించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్, సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, నిరంజన్, వసంత, రవి పాల్గొన్నారు. మూడిళ్లలో చోరీజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోని హరిహర కాలనీలో బుధవారం వేకువజామున తాళం వేసి ఉన్న మూడిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కింటి వారు లేచేసరికి డోర్లు తెరిచి ఉండటంతో ఇంటి యజమానులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని హరిహర కాలనీలో సీసీపుటేజీలను పరిశీలించారు. ముగ్గురు దొంగలు ముసుగులు వేసుకుని వెళ్లినట్లు రికార్డు అయింది. సీఐ మాట్లాడుతూ.. ఇళ్లలో విలు వైన వస్తువులు ఉంచవద్దని, బ్యాంక్ ల్యాకర్లలోగానీ భద్రపర్చుకోవాలన్నారు. ప్రతి కాలనీల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
కుందనపల్లి రైల్వే వంతెనకు గ్రీన్సిగ్నల్
రామగుండం: పెద్దపల్లి జంక్షన్ – రామగుండం మధ్యగల కుందనపల్లి రైల్వేగేట్ (ఎల్సీ49) వద్ద వంతెన నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. వంతెన నిర్మాణానికి రూ.110 కోట్లు వెచ్చిస్తారని, రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేస్తారన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బుధవారం స్థానిక రైల్వేస్టేషన్ను సందర్శించారు. రామగుండంలో మరిన్ని కొత్త ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ యోచనలో ఉన్నామన్నారు. పెద్దంపేట రైల్వేగేట్ వద్ద వంతెన నిర్మాణం ప్రతిపాదనలో ఉందన్నారు. కాగా, అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల సమస్య పరిష్కరించాలని బర్మా, కాందీశీకుల సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని మసీదు కమిటీ, ఇతర సమస్యలపై రైల్వే బోర్డు సభ్యుడు అనుమాస శ్రీనివాస్ తదితరులు ఎంపికీ వినతిపత్రం అందజేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇటీవల గోదావరిలో గల్లంతైన అక్బర్నగర్లోని నారకట్ల రాజేశ్ కుటుంబసభ్యులను ఎంపీ పరామర్శించారు. -
అస్తిత్వ పోరాటానికి ప్రతీక
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రం ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా బుధవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. నాటి ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి మిలియన్ మార్చ్ వరకు ఉవ్వెత్తున చేసిన అనేక పోరాటాలు చరిత్రలో ప్రసిద్ధిగాంచాయన్నారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందన్నారు. 2000 సంవత్సరం నుంచి మలి దశ తెలంగాణ పోరాటం కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆచార్య జయశంకర్, జమలాపురం కేశవరావులు తెలంగాణ ప్రజలను చైతన్యం చేయగా, ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి, యాదయ్య లాంటి విద్యార్థులు, కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మబలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఊరూరా నిరాహార దీక్షలతో చారిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదికై ందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని 5 కోట్ల 35 లక్షల మంది మహిళలు వినియోగించుకుని, రూ.227 కోట్ల 34లక్షల లబ్ధి పొందారన్నారు. 6 లక్షల 33 వేల 737 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరుగుతోందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో ఒక లక్షా 58 వేల 875 సర్వీసులకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా లక్ష 90 వేల 186 మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు 15 వేల 436 మందికి రూ.44 కోట్ల 23 లక్షల విలువ చేసే శస్త్ర చికిత్సలు చేయించడం జరిగిందన్నారు. జిల్లాలో 11 వేల 575 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 39 వేల 645 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. -
పాక్షికంగా నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
కరీంనగర్టౌన్: ఆరోగ్య శ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు బుధవారం పాక్షికంగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు మూకుమ్మడిగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. గతేడాదికాలంగా ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోవడంతో విధిలేని పరిస్థితిలో సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే సేవలు నిలిపివేశారు. కరీంనగర్ శివారులోని రెండు మెడికల్ కళాశాలలతో పాటు అపోలోరీచ్, మెడికవర్, మరో రెండు,మూడు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తున్నారు. -
‘పటేల్ నిర్ణయంతోనే తెలంగాణకు విమోచనం’
కరీంనగర్టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ సా హసోపేత నిర్ణయంతోనే తెలంగాణకు రజాకర్ల నుంచి విమోచనం లభించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కా ర్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 చరిత్రలో మర్చిపోలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బాస సత్యనారాయణ రావు, యాదగిరి సునీల్రావు, డి.శంకర్, గుగ్గిల్లపు రమేశ్, మేకల ప్రభాకర్ యాదవ్, ఇ.నాగేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్: నిజాం నవాబుల పరిపాలన అంతం కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటాన్ని మతోన్మాదులు హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్నారని, సాయుధ పోరాట వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బావండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, బీర్ల పద్మ పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: గ్రామ పాలన అధికారులు(జీపీవో) విధుల్లో చేరారు. గత అయిదేళ్లుగా గ్రామస్థాయిలో రెవెన్యూ పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడే సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం జీపీవోలకు నియామక పత్రాలు అందించగా ఆయాశాఖలు రిలీవింగ్ అర్డర్ ఇవ్వడంలో జాప్యం చేశాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో ఈ నెల 12న ‘రిలీవింగ్ అర్డర్ కోసం నిరీక్షణ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కలెక్టర్ పమేలా సత్పతి ఆయాశాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణమే రిలీవ్ ఆదేశించారని సమాచారం. అత్యధికంగా మున్సిపల్, మిషన్ భగీరథ విభాగాల్లో విధులు నిర్వహిస్తుండగా రిలీవై మంగళవారం నుంచి వారికి కేటాయించిన స్థానాల్లో జీపీవోలుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలుండగా రెవెన్యూ క్లస్టర్లు 255 కాగా 187 మంది జీపీవోలుగా బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ అర్బన్: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో ల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివా స్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ భవన్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కలిసి ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. పీఆర్సీ, బకాయిలు, హెల్త్కార్డు, పెన్షనర్ల సమస్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్గౌడ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ రెండో విడత స్పాట్ అడ్మిషన్లు ఈనెల 18,19 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ తెలిపారు. విద్యార్థులు నేరుగా స్పాట్లో పాల్గొనే అవకాశం ఉందన్నా రు. అన్ని అర్హత పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. బీఎస్సీ లైఫ్సైన్స్లో 19, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్లో 23, బీకాం రిటైల్ ఆపరేషన్స్లో 8, బీకాం ఫైనాన్స్లో 3, బీకాం బిజినెస్ ఎనాల్టిక్స్లో 2, బీబీఏ, బీఏ ఇంగ్లిష్ మీడియంలో ఒక్కోసీటు మొత్తం 57 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇది చివరి అవకాశమని సూచించారు. -
తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సెలింగ్
హుజూరాబాద్రూరల్: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్బాబు గ్రామంలో విచారణ చేపట్టారు. ఒక్కొక్కరూ నెలకు రూ.మూడువేల చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు సరిగా అమలవుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలోని బృందం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో రాజమ్మను కుమారులు పట్టించుకోవడం లేదని తేలింది. ఆమె ముగ్గురు కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజమ్మను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణలో సోషల్ కౌన్సిలర్ పద్మావతి, డీవీసీ కౌన్సిలర్ ఆరె శేఖర్, ఎస్ఆర్వో రఫీ, హెడ్ కానిస్టేబుల్ మధు, మల్లయ్య, మర్రి శ్రీనివాస్ తదితరులున్నారు. -
గుంత.. డ్రైవర్లకు చింత
చింతకుంట– కొత్తపల్లి బైపాస్ రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. రహదారిపై ఏర్పడ్డ గుంతలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు వందల సంఖ్యలో భారీ వాహనాలు ప్రయాణించే రహదారిపై పెద్దపెద్ద గుంతలేర్పడ్డాయి. వర్షాలతో పెద్దవిగా మారి వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీ బుధవారం గుంతలో ఇరుక్కుపోయిన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. ఆ లారీని బయటకు తీసేందుకు డ్రైవర్, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – కొత్తపల్లి -
ఇండ్లు పోతే ఆధారమే లేదు
● సుందరగిరిలో రోడ్డు విస్తరణపై గ్రామసభ ● బైపాస్ చేపట్టాలని గ్రామస్తుల వినతి చిగురుమామిడి: మండలంలోని సుందరగిరిలో ఫో ర్లైన్ విస్తరణపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. తహసీల్దార్ రమేశ్ అధ్యక్షతన స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రహదారి కి ఇరువైపులా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గ్రామసభ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోతే తమకు ఆధారం లేదని వంతడ్పుల దిలీప్కుమార్, మొలు గూరి శ్రావణ్, కక్కెర్ల వెంకటేశ్, తాళ్లపల్లి చిన చంద్రయ్య, కెమసారం వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశా రు. ముందుగా నిర్ణయించిన ప్రకారం బైపాస్ నిర్మి స్తే బాగుంటుందని సూచించారు. నిర్వాసితుల ఆందోళనతో రసాభాసగా మారిన గ్రామసభ మధ్యలోనే వాయిదా పడింది. నిర్వాసితుల విన్నపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు. ఆర్అండ్బీ ఈఈ సురేశ్, సింగిల్విండో చైర్మన్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు దుర్మరణం
మాక్లూర్/నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటుకు ఇబ్రహీంపట్నం మండలం కొజన్కొత్తూర్కు చెందిన పూజ (25)తో పది నెలల క్రితమే వివాహమైంది. బీటెక్ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బైక్పై తమను నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి రావాలని చింటు తండ్రి నారాయణ (58)ను కోరాడు. ముగ్గురూ కలిసి బైక్పై బయల్దేరారు. చింటు డ్రైవింగ్ చేస్తున్నారు. దుర్గానగర్ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన పూజ, చింటును ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. మామ, కోడలు మృతితో తల్వేదలో విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. స్వల్పగాయాలతో బయటపడిన మృతురాలి భర్త పైళ్లెన 10 నెలలకే విషాదం మృతురాలిది ఇబ్రహీంపట్నం మండలం కొజన్కొత్తూర్ -
విద్యార్థులు కళల్లోనూ రాణించాలి
కరీంనగర్/కరీంనగర్టౌన్: విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళలు, క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ‘కళోత్సవ్’ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా వివిధ కళలు, ఆటల్లోనూ రాణించాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి పోటీలకు ప్రోత్సహించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబించేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా ఉంటాయన్నారు. డీఈవో మొండయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు. మహిళ ఆరోగ్యంతోనే దేశాభివృద్ధి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే తన కుటుంబం తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ‘స్వస్థ్ నారి– స్వశక్త్ పరివార్ అభియాన్’ 8వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోనూ ఈ వర్చువల్ ప్రారంభోత్సవం జరిగింది. హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళ తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం గర్బిణులకు వైద్య పరీక్షల గురించి తెలిపే ఎన్సీపీ కార్డులు అందజేశారు. క్రిటికల్ కేర్ విభాగాన్ని సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీంఎహెచ్వో వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు. -
కూలిన నాలా.. తప్పిన ప్రమాదం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కశ్మీర్గడ్డలో నాలా కూలింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆ సమయంలో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో నాలాపై ఉన్న పైకప్పు దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఒక్కసారిగా ఆర్బీ స్వీట్హౌస్, అపూర్వ కళాశాల మధ్యన నాలా పై ఉన్న పైకప్పు కూలిపోయింది. నగరంలోని ప్రధాన నాలాల్లో ముఖ్యమైన ఈ నాలా, రాంనగర్ నుంచి మంకమ్మతోట, జ్యోతినగర్, ముకరాంపుర, అంబేడ్కర్ స్టేడియం, గణేశ్నగర్, లక్ష్మినగర్ల మీదుగా వాగులో కలుస్తుంది. ముకరాంపురలోని టూటౌన్ పోలిసుస్టేషన్ పక్కనుంచి వెళ్తున్న ఈ నాలా శిథిలావస్థలో ఉండి, ఈ ప్రాంతంలో వరద సమస్యకు కారణమవుతోంది. శిథిలావస్థకు చేరిన ఈ నాలాను పునర్నిర్మించాలని ముకరాంపుర,కాశ్మీర్గడ్డ, మంకమ్మతోట తదితర ప్రాంతవాసులు ఏళ్లకాలంగా విన్నవిస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఈ నాలా కూలిపోవడంతో, మరోసారి నాలా పునర్నిర్మాణం తెరపైకి వచ్చింది. స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి ఘటనాస్థలికి వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
లారీ ఢీకొని కార్మికురాలి మృతి
పెద్దపల్లిరూరల్: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోదాం ఆవరణలో బుధవారం లారీ ఢీకొన్న ఘటనలో అఫ్జల్బేగం (58) అనే కార్మికురాలు అక్కడికక్కడే మరణించింది. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో నివాసముంటున్న అఫ్జల్బేగం.. ఎప్పటిలాగే గోదాంలో పనికి వెళ్లింది. పనిచేస్తున్న సమయంలో కార్మికురాలిని చూడకుండా డ్రైవర్ లారీని అజాగ్రత్తగా వెనక్కి తీసుకురావడంతో ఢీ కొందని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. మృతురాలి కూతురు పర్వీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.సెల్ఫోన్ వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య జగిత్యాలక్రైం: బీటెక్ చదువు మధ్యలో మానేసి ఇంటి వద్ధ ఖాళీగా ఉంటూ.. సెల్ఫోన్ చూస్తుండటంతో తండ్రి మందలించగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని విద్యానగర్కు చెందిన ఈగ రాహుల్ (25) బీటెక్ మధ్యలో మానేశాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ ఎక్కువగా సెల్ఫోన్ చూస్తున్నాడు. సెల్ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన రాహుల్ ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు.కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు..చందుర్తి(వేములవాడ): కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధురాలు బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. బండపల్లికి చెందిన న్యాత ఉరఫ్ సంద్రగిరి లచ్చవ్వ(52) ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొంది, బుధవారం మధ్యాహ్నం ఇంటికొచ్చింది. కుమారుడు నరేశ్ బయటకు వెళ్లాడని గమనించిన లచ్చవ్వ ఇంట్లో దూలానికి ఉరివేసుకుంది. కాగా మృతురాలు కుమారుడు నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై జిల్లెల్ల రమేశ్ తెలిపారు.యువకుడి ఆత్మహత్యాయత్నంధర్మపురి: విద్యుత్ బిల్లు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. బంధువుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన బండారి లక్ష్మణ్ జీవనోపాధి కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు సర్వీస్సెంటర్ పెట్టుకున్నాడు. కరెంట్ బిల్లులో సగం నాలుగు రోజుల క్రితం చెల్లించాడు. మిగిలిన మొత్తం చెల్లించాలని విద్యుత్ సిబ్బంది బుధవారం ఇంటివద్దకు వెళ్లి గొడవ చేశారు. దీనికి మనస్తాపానికి గురైన లక్ష్మణ్ ఇంటిపక్కనున్న విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లను పట్టుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో కరెంట్ పోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బంధువులు, స్నేహితుల చొరవతో కిందికి దిగి విద్యుత్ సిబ్బందితో మాట్లాడించారు. -
పోషకాహారంతో ఆరోగ్యమస్తు!
కరీంనగర్: నేటి బాలలే రేపటి పౌరులు నినాదంతో చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈనెల 17నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలు, పెద్దలు నిత్యం పోషక విలువలున్న పదార్థాలు తీసుకోవాలని తెలియజేస్తూ మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రతీ ఏడాది సెప్టెంబర్ను పోషణ మాసంగా నిర్వహిస్తోంది. బుధవారం నుంచి పోషణమాసం ప్రారంభమైంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులు పోషకాహార లోపాలను అధిగమించడానికి మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు, రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్లు, ఖనిజాలు, ప్రొటిన్లు, శక్తి పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషణ అభియాన్ కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి సరస్వతి తెలిపారు.జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 04 అంగన్వాడీ కేంద్రాలు 777 3–6 ఏళ్లలోపు పిల్లలు 21,107 గర్భిణులు, బాలింతలు 11,764 -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
విశ్వకర్మ భగవాన్ ఉత్సవమూర్తుల శోభాయాత్రమహా పూర్ణాహుతిలో పాల్గొన్న భక్తులుకరీంనగర్కల్చరల్: నగరంలోని కమాన్చౌరస్తాలో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం స్థాపిత దేవతారాధనలు, శ్రీగాయత్రీ విశ్వకర్మ సహస్ర నామార్చనలు, పూర్ణాహుతి, మహానివేదన, మంగళహారతి, మహామంత్ర పుష్పం అనంతరం తీర్థప్రసాద వితరణ గావించారు. భక్తులకు అన్నదానం చేశారు. విశ్వకర్మ భగవానుని ఉత్సవమూర్తుల శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈవో ఉడుతల వెంకన్న, చైర్మన్ ముత్తోజు రామ్కుమార్, ధర్మకర్తలు వెగ్గళం రామకృష్ణ, ఎదులాపురం అన్నయ్య, గోగులకొండ నరసింహాచారి, వంగల నవీన్, గోకులకొండ కరుణాకర్, రాగటి కవిత పాల్గొన్నారు.వైభవంగా సాగిన విశ్వకర్మ భగవానుడి శోభాయాత్ర -
తలవంచిన నిరంకుశత్వం
బాంచెన్ కాల్మొక్త అన్న సామాన్యులే.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం బందుకూతో గడి పునాదులను పెకిలించారు.. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం కదంతొక్కారు.. జాగిరీదారులు, మక్తేదారులు, ఇనాందారులు, వతన్దారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం సాగించారు..ఎందరో రజకార్లను తరిమికొట్టారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. అందులో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం మడమతిప్పని పోరాటం సాగించింది.. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా పలువురు యోధుల కథనాలు. – కరీంనగర్ / సిరిసిల్ల / ఇల్లంతకుంట / పెద్దపల్లి రూరల్ / బోయినపల్లి / మంథని రూరల్ -
ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ..
● టవర్ ఎక్కిన అడవిశ్రీరాంపూర్ మహిళలు మంథని: ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని మంగళవారం మహిళలు, గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమకు తొలిజాబితాలో ఉన్న పేర్లను తొలిగించి ఇతరులకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలో తమపేర్లు మాయంకావడంతో కలెక్టర్, స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా సమాధానం రాలేదన్నారు. దీంతోనే తాము నిరసనకు దిగామని బాధితులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తమపేర్లను తొలిగించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దడంతో బాధితులు టవర్ దిగారు. ధర్మపురి: ఇంటిపై పిడుగు పడడంతో డాబాపైన ఉన్న పిల్లర్ ధ్వంసమైంది. ఇంట్లో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. బాధితుల వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గ్రామానికి చెందిన వడ్లూరి సత్యం ఇంటిపై పిడుగు పడింది. భారీ శబ్దం రావడంతో ఇంట్లోనివారు పైకి వెళ్లి చూశారు. పిల్లర్ ముక్కలై కనిపించింది. ఇంట్లో ఐదురుగురు ఉండగా.. ప్రాణాపాయం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే గ్రామం పరిధిలోని లంబాడీతండాలోని ఓ మైదానంలో పిడుగు పడిందని గ్రామస్తులు తెలిపారు. శంకరపట్నం: మండలంలోని అర్కండ్ల వాగులో ఓ వ్యక్తి మంగళవారం కొట్టుకుపోయి...ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు... అర్కండ్ల వాగు లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా వీణవంక మండలం నుంచి వస్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా వరద ప్రవాహంలో కొంతదూరం కొట్టుకుపోయా డు. అనంతరం ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఆ వ్యక్తిని పలకరించినా మాట్లాడకుండా వీణవంక మండలం చల్లూరు వైపు వెళ్లాడని తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని కొత్తబస్టాండ్ ప్రాంగణంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన పత్రి తిరుపతి, బుగ్గారం మండలం వెల్గొండకు చెందిన ఎట్టెం రాములు 200 గ్రాముల గంజాయిని ఆర్టీసీ బస్సులో జగిత్యాలకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం విక్రయించేందుకు సిద్ధమవుతుండగా ఎస్సై రవికిరణ్ వారిని పట్టుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రూ.300 కోసమే మర్డర్
జగిత్యాలక్రైం: జగిత్యాలలో ఈనెల 14న జరిగిన ఆటో డ్రైవర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆటో అద్దె రూ.300 చెల్లించే విషయంలో గొడవ జరగడంతో ఆటో డ్రైవర్ను హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణంలోని సుతారిపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయిమోద్దీన్ ఈనెల 14న రాత్రి పాతబస్టాండ్లో ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. బిహార్కు చెందిన దర్శన్సాహ్ని, సునీల్ సాహ్ని, పంకజ్కుమార్ ఆటో డ్రైవర్ నయిమోద్దీన్ వద్దకు వచ్చారు. వారు పనిచేసే జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లి శివారులోని రైస్మిల్లుకు తీసుకెళ్లాలని సూచించారు. రూ.300కు కిరాయి కుదుర్చుకున్నారు. పొలాస శివారుకు వెళ్లేసరికి ఆటోకిరాయి చెల్లింపు విషయంలో డ్రైవర్తో గొడవ జరిగింది. పంకజ్కుమార్ ఆటో దిగి వెళ్లిపోయాడు. దర్శన్సాహ్ని, సునీల్ సాహ్ని కలిసి గుడ్డపేలుకతో నయిమోద్దీన్ గొంతు బిగించి, కింద పడేశారు. సునిల్ సాహ్ని బండరాయితో నయిమోద్దీన్ ముఖంపై బాదాడు. చనిపోయాడని నిర్దారించుకుని, మృతదేహాన్ని పక్కనున్న నీటిలో పడేశారు. అక్కడినుంచి హైదర్పల్లి శివారులోని రైస్మిల్లుకు వెళ్లిపోయారు. మృతుడి సోదరుడు ఇసాక్ఖాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు సీసీపుటేజీల ఆధారంగా పంకజ్కుమార్ను విచారించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో హైదర్పల్లి రైస్మిల్లులో ఉన్న దర్శన్సాహ్ని, సునీల్సాహ్నిను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్, ఏఎస్సై అజీమోద్దీన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, కిరణ్కుమార్ పాల్గొన్నారు. ● ఆటో డ్రైవర్ హత్యకేసు ఛేదన ● ఇద్దరు బిహారీల అరెస్టు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్ -
ఇక స్వచ్ఛతాహీ సేవా
కరీంనగర్రూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు బుధవారం నుంచి గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా – 2025 కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అక్టోబరు 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపడతారు. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన స్వచ్ఛతా హీ సేవా ప్రచార వాల్పోస్టర్ను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అశ్విని వాకడే, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇన్చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమాల నిర్వహణ ఇలా.. ● 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు చెత్త ఉన్న ప్రాంతాలను ఫొటో తీయాలి. దానిని తొలగించాక మరో ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ● 17నుంచి 20 వరకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు తదితర ప్రజా స్ధలాల్లోని చెత్త తొలగించాలి. విద్యార్థులతో స్వచ్ఛత ర్యాలీలు, ప్రతిజ్ఞ, మానవహారం నిర్వహించాలి. పనికిరాని వస్తువులతో బొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీ తదితర కార్యక్రమాలు చేపట్టి ఫొటోలు తీయాలి. ● 18 నుంచి 24 వరకు సఫాయి మిత్ర సురక్ష ద్వారా పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆరోగ్య, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలి. సంక్షేమ పధకాలు వర్తింపచేయాలి, సన్మానం చేయాలి. ● 25న ఏక్ దిన్, ఏక్సాధ్, ఏక్ గంటలో భాగంగా గ్రామస్తులు శ్రమదానం ద్వారా ప్రజాస్ధలాల్లోని చెత్త తొలగించాలి. ● 21 నుంచి అక్టోబరు 2వ తేదీవరకు క్లీన్, గ్రీన్ ఉత్సవ్ పేరిట సింగిల్యూస్ ప్లాస్టిక్ రహిత ఉత్సవాలు నిర్వహించాలి. ఉత్సవ మండపాలు, ముగ్గులతో అలంకరణ చేయాలి. ఫొటోలు తీయాలి. -
కార్మికుల సమస్యలపై పోరాటం
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసేందుకు సిద్ధమని, అందుకు కార్మికులంతా తనకు అండగా నిలవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ టీజీఎన్పీడీసీఎల్ డిస్కం నూతన సెక్రటరీ సల్వాజి వెంకట రమణారావు తెలిపారు. యూనియన్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయనను మంగళవారం కరీంనగర్లోని యూనియన్ కార్యాలయంలో అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సన్మానించారు. అంతకుముందు నగరంలో భారీర్యాలీ నిర్వహించి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ రమణ మాట్లాడుతూ జిల్లాకు చెందిన కొంతమంది ద్రోహం కారణంగా రాష్ట్ర అధ్యక్షపదవి చేజారిందని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు యూనియన్ కార్యకలాపాలతో ఏ సంబంధమని, ఇకనైనా స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితువు పలికారు. సమస్య చిన్నదా, పెద్దదా అని చూడకుండా కార్మికుల ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గతంలోని కొంతమంది నాయకులు కార్మికుల సమస్యలు గాలికొదిలి వ్యక్తిగత సమస్యలపై దృష్టిసారించడంతో కార్మికుల సమస్యలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ విజయోత్సవ సభలో జిల్లా కార్యదర్శి సీహెచ్ భాస్కర్, ప్రాంతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కన్నం నర్సింగ రావు, అడిషనల్ సెక్రటరీ రమణా రెడ్డి, సలహదారు సాన జయకర్, వివిధ డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు జి.సురేఖ, మల్లేశం, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, మోతే శ్రీనివాస్, శంకర్, రంగు వెంకటనారాయణ, రాష్ట్ర, కంపెనీ నాయకులు, మహిళలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కదనరంగంలో కరీంనగర్..
కరీంనగర్: నిజాం పాలన అంతం కోసం తొలిదళాన్ని ఏర్పాటు చేసి సాయుధ పోరులో హతమైన తొలి దళనాయకుడు అనభేరి ప్రభాకర్రావు తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన వారు. అలాగే చెన్నమనేని రాజేశ్వర్రావు, గట్టెపల్లి మురళీధర్రావు, చామనపల్లి చొక్కారావు, ఖాసీంపేట వెంకట్రెడ్డి, బొజ్జపురి వెంకటయ్య, వేముల నర్సింహులు, గాంభీరపు రామయ్య లాంటి ఎందరో అరాచక పాలనకు ఎదురుతిరిగారు. రణభేరి మోగించిన ‘అనభేరి’ జమీందారి కుటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకర్రావు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి దళ నాయకునిగా తుపాకి పట్టి పేదలకు బాసటగా నిలిచారు. 1910 ఆగస్టు 15న తిమ్మాపూర్ మండలం పొలంపెల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యను మచిలీపట్నం, ఉన్నత విద్యను హైదరాబాద్లో అభ్యసించారు. తెలంగాణ విముక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన తొలి సాయుధ దళ నాయకునిగా చరిత్రకెక్కారు. 1948 మార్చి 14న ప్రభాకర్ సాయుధ దళాన్ని హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ పోలీస్ పటేల్ భోజనానికి పిలిచి ఆ సమాచారాన్ని నిజాం ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో మహ్మదాపూర్ గుట్టలను మిలటరీ, రజాకార్లు చుట్టుముట్టారు. వారి తూటాలకు ఎదురొడ్డి పోరాడి ‘అనభేరి’తో పాటు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అయిరెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి.దామోదర్రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్గొండ రాజరాం, చిక్కుడు సాయిలు, రోండ్ల మాధవరెడ్డి అమరులయ్యారు. కొరియర్గా చిన్నమల్లయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్గా పాల్గొన్న దేశిని చిన్నమల్ల య్య మలి విడత తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలంగా వ్యవహరించారు. 1948 ఫిబ్రవరిలో అనభేరి ప్రభాకరరావును కలిసి ఆయన దళానికి కొరియర్గా పని చేశారు. తర్వాత ప్రజాజీవితంలో నాలుగుసార్లు సర్పంచ్గా, ఒకసారి సమితి ప్రెసిడెంట్గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. నిర్వర్తించారు. విద్యార్థిగా ఉద్యమంలో.. విద్యార్థి దశలోనే జువ్వాడి గౌతంరావు స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు. కరీంనగర్, వరంగల్ జైళ్లలో శిక్ష అనుభవించారు. 1947లో ఔరంగాబాద్ జైలు నుంచి తప్పించుకొని మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి లాంటి వీరుల మార్గదర్శకత్వంలో పనిచేశారు. అజ్ఞాత జీవితం తప్పలేదు బోయినిపల్లి వెంకటరామరావు 1947 అక్టోబర్ 2న అనేక గ్రామాల్ల్లో గాంధీజయంతి వేడుకలు జరిపారు. జాతీయ పతా కాలను ఆవిష్కరించారు. సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని ప్రచారం చేశారు. నిజాం పోలీసులు, రజాకార్లు తోటపెల్లిలో ని ఆయన ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ఉద్యమకారులకు కొరియర్గా జిల్లాకు చెందిన వెలిచాల కొండల్రావు హైదరాబాద్లో చదువుకుంటూనే విద్యార్థి కార్యకర్తగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల వయసులో కోర్టు విచారణలో మెజిస్ట్రేట్కే ఎదురు తిరిగినందుకు 7 రోజుల జైలు శిక్ష గడపాల్సివచ్చింది. చదువుకుంటూనే నాయకులకు కోరియర్గా గా పని చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ధీశాలి.. మహదేవ్పూర్కు చెందిన ఎస్.శంకరయ్య 1947లో ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. అప్పట్లో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఎస్సై గురుదయాళ్ సింగ్ వీరిని అరెస్ట్ చేశారు. మంథని వీధుల్లో లాఠీ దెబ్బలు కొడుతూ ఊరేగించారు. అనంతరం శంకరయ్య తప్పించుకుని చాందా క్యాంపులో చేరారు. తర్వాత మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్గా భావించి కాళేశ్వరం ఔట్పోస్ట్పై దాడి చేశారు. -
పోరాట యోధుడు అమృత్లాల్
నిజాంను ఎదిరించిన వారి లో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్లాల్ శుక్లా ప్ర ముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్స్టేషన్పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. సాయుధ దళాలను వ్యూహాత్మకంగా నడిపిస్తూ మూడు రంగుల జాతీయ జెండాలను ప్రాబల్య గ్రామాల్లో ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు. శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. చంచల్గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తప్పించుకున్నాడు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 ఏళ్ల వయస్సులో 1991 నవంబర్ 14న అస్తమించారు. -
తలవంచిన నిరంకుశత్వం
రక్తసిందూరం గాలిపెల్లిసిరిసిల్ల/ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జి ల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి తెలంగాణ సాయుధ పోరా టంలో వీరోచిత పోరా ట చరిత్రకు చిహ్నమైంది. నిజాం రాజ్యహింసకు ఒకేరోజు 11 మంది ప్రాణాలర్పించి న ఆ నేల రక్త సిందూరమైంది. గాలిపెల్లికి చెందిన కమ్యూనిస్టు యోఽ దుడు బద్దం ఎల్లారెడ్డి నిజాం వ్యతిరేక పోరాటాన్ని సాగించారు. ఈ నేపథ్యంతో ఉద్యమకారులు గాలిపెల్లిలో జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్య్ర పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉద్యమించారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పల్లెలు తిరగబడ్డాయి. పోలీసులు, రజాకార్లపై తిరగబడిన గాలిపెల్లిలో భీకర పోరు సాగింది. ఆ పోరులో గాలిపెల్లికి చెందిన పీసు బక్కయ్య, బద్దం నారాయణ, బుర్రయ్య, పుల్లుగారి ఎల్లయ్య, అల్లెం వెంకయ్య, తాళ్లపల్లికి చెందిన సింగిరెడ్డి రాజిరెడ్డి, నర్సక్కపేటకు చెందిన ఎలేటి రాజిరెడ్డి, సోమారంపేటకు చెందిన ఐరెడ్డి భూంరెడ్డి, బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన తుమ్మోజి నారాయణ అసువులు బాశారు. ఉద్యమంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన పెరంబుదూరి అనంతయ్య, రంగమ్మ వృద్ధ దంపతులు బలయ్యారు. గ్రామ సమీపంలోని మొక్కజొన్న చేనులో భయంతో తలదాచుకున్న వీరిని రజాకార్లు నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు. రజాకార్ల దాడిలో బద్దం ఎల్లారెడ్డి, రాజలింగం, అమృత్లాల్ శుక్లా చాకచక్యంగా తప్పించుకున్నారు. వీరు తప్పించుకున్నారని తెలిసి ఆగ్రహంతో రజాకార్లు గాలిపెల్లి ఊరును తగులబెట్టారు. స్ఫూర్తి ప్రదాత బద్దం ఎల్లారెడ్డి గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి–లచ్చవ్వ రెండో సంతానంగా 1906లో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి యుక్త వయసులోనే కమ్యూనిజం భావజాలాన్ని ఒంటబట్టించుకున్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. గాలిపెల్లిలో తన సొంత భూములను పేదలకు పంచడంతో పాటు సిరిసిల్ల ప్రాంతాల్లో దున్నేవాడిదే భూమి అంటూ ఉద్యమాన్ని రగిలించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మద్రాసులో అరెస్ట్ అయి 3 నెలల జైలుశిక్ష అనుభవించారు. జైలు నుంచి వచ్చి కరీంనగర్ జిల్లాలో సాయుధ పోరాటాన్ని సాగించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే పీడీఎఫ్ అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రత్యర్థి పీవీ నర్సింహరావుపై విజయం సాధించారు. 1956లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1958లో బుగ్గారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి 1972లో ఇందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై నిజాయితీ గల నేతగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. బస్సులోనే ప్రయాణిస్తూ సామాన్యులతో కలిసిపోయేవారు. బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీవై నగర్ పేరుతో కార్మిక క్షేత్రం, కరీంనగర్లో ఎల్లారెడ్డి భవన్ ఉంది. 1979లో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కొడుకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, కూతురు విజయ ఉన్నారు. పోలీసులు, దొరలు, భూస్వాములు, రజాకార్ల దౌర్జన్యాలను సహించలేని అణగారిన, పీడిత ప్రజలు ఉద్యమించిన రోజు.. గ్రామాల్లోని ప్రజలు ఎక్కడికక్కడ పలుగు, పార, కారం, రోకలి బండలు, వరిసెలు, బరిసెలు.. ఇలా అందిదల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఆయుధాలుగా మారాయి. అనేకమంది యోధుల త్యాగాల ఫలితమే సెప్టెంబర్ 17..మానాల క్యాంపులో సాయుధులు (ఫైల్) నిజాం సంస్థాన పరిధి సిరిసిల్ల: తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పీవీ నర్సింహరావు, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రధానంగా ముందున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎందరో త్యాగమూర్తులు ని జాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం తిరుపతిరెడ్డి, వేములవాడకు చెందిన గుమ్మి పుల్లయ్య, కోనరావుపేటకు చెందిన రాజలింగం, నిమ్మపల్లికి చెందిన అనుముల నర్సయ్య, మల్కపేటకు చెందిన కర్రోళ్ల నర్సయ్య, సిరిసిల్లకు చెందిన గర్ధాస్ గంగారాం వీరోచిత పోరాటాన్ని సాగించి విజయాన్ని సాధించారు. సాహసోపేత ఉద్యమంలో సిరి సిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు పోరాట కెరటమయ్యారు. కోనరావుపేట మండలం నాగారంకు చెందిన రాజేశ్వర్రావు 1948 నుంచి 1951 వరకు భార్య లలితతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి జైలుశిక్ష అనుభవించారు. 957, 1967, 1978, 1985, 1994, 2004లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. -
అండర్ 19 ఎస్జీఎఫ్ క్రీడా సంబురం
● రేపటి నుంచి నవంబర్ 7వరకు జరగనున్న పోటీలు ● షెడ్యుల్ విడుదల చేసిన డీఐఈవో, ఎస్జీఎఫ్ అండర్ 19 కార్యదర్శి కరీంనగర్స్పోర్ట్స్: కళాశాలల క్రీడా సంబురం ఆరంభమైంది. ఇప్పటికే స్కూల్ గేమ్స్తో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడా వాతావరణం నెలకొనగా గురువారం నుంచి అండర్ 19 సందడి మొదలు కానుంది. 2025–26 విద్యాసంవత్సరానికి కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలకు సంబంధించిన షెడ్యుల్ను మంగళవారం డీఐఈవో వి.గంగాధర్, అండర్ 19 కార్యదర్శి జి మధుజాన్సన్లు విడుదల చేశారు. గురువారం నుంచి నవంబర్ 7 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నేరుగా పోటీలు.. కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలను నేరుగా ఉమ్మడి జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి మధు జాన్సన్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జట్టుకు ఎంపిక చేయనున్నామని అన్నారు. పోటీలు నిర్వహించే వేదిక.. తేదీలు ఇలా.. ఈనెల 18న జగిత్యాల పొన్నాల గార్డెన్లో బాక్సింగ్, కరాటే, తైకై ్వండో, తాంగ్తా (బాలబాలికలు), 19న కొత్తపల్లి అల్ఫోర్స్లో 19న చెస్, యోగా (బాలబాలికలు), 20న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో పుట్బాల్ (బాలురు), అక్టోబర్ 6న కొత్తపల్లిలోని అల్ఫోర్స్ కాలేజీలో వుషూ, జూడో (బాలబాలికలు). 7న కొత్తపల్లి అల్ఫోర్స్లో కబడ్డీ (బాలురు), 8న చింతకుంట గురుకుల కళాశాలలో కబడ్డీ (బాలికలు), 9న తిమ్మాపూర్లోని శ్రీచైతన్య కళాశాలలో వాలీబాల్ (బాలురు).10న చింతకుంట గురుకుల కళాశాలలో వాలీబాల్ (బాలికలు). 13న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్(బాలబాలికలు). 15న కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రెజ్లింగ్ (బాలబాలికలు). 16న కొత్తపల్లి అల్ఫోర్స్లో హ్యాండ్బాల్ (బాలబాలికలు). 17న జగిత్యాల మినీ స్టేడియంలో క్రికెట్(బాలబాలికలు), 18న కొత్తపల్లి అల్ఫోర్స్లో టేబుల్ టెన్నీస్ (బాలబాలికలు), 23న గోదావరిఖని జేఎన్ స్టీడియంలో స్కేటింగ్, వెయిట్ లిఫ్టింగ్(బాలబాలికలు).24న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో(బాలురు). 25న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో(బాలికలు). 26న కొత్తపల్లి తేజస్ కళాశాలలో బాస్కెట్బాల్ (బాలబాలికలు). 28న జగిత్యాల మినీ స్టేడియంలో ఫెన్సింగ్, సాఫ్ట్బాల్, బేస్బాల్ (బాలబాలికలు). 29న కొత్తపల్లి అల్ఫోర్స్లో స్విమ్మింగ్ (బాలబాలికలు). 31న కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో హాకీ (బాలబాలికలు). కరీంనగర్ శాతవాహన వర్సిటీలో నవంబర్ 4న సైక్లింగ్ (బాలబాలికలు). 6న కొత్తపల్లి తేజస్ కళాశాలలో ఆర్చరీ (బాలబాలికలు). 7న జగిత్యాల మినీ స్టేడియంలో రగ్బీ (బాలబాలికలు). 7న జగిత్యాల క్లబ్లో లాన్ టెన్నీస్, బ్యాడ్మింటన్, షూటింగ్ (బాలబాలికలు). 7న జగిత్యాల మినీ స్టేడియంలో ఫుట్బాల్ (బాలికలు). ఉమ్మడి జిల్లా కళాశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలను అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తాం. క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలి. ఎస్జీఎఫ్ నిబదనలు ప్రతిఒక్కరూ పాటించాలి. అండర్ 19 రాష్ట్ర పోటీల్లో కరీంనగర్ జట్టు చాంపియన్గా నిలువాలనే లక్ష్యంతో పోటీలను నిర్వహిస్తాం. – జి.మధుజాన్సన్, అండర్ 19 ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి -
పోరులో ‘జోగినిపల్లి’ యోధులు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ సాయుధ పోరులో బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, మాన్వాడ గ్రామానికి చెందిన జోగినిపల్లి ఆనందరావు అలుపెరుగని పోరాటాలు చేశారు. 1920లో జన్మించిన కేశవరావు వ్యవసాయంతో పాటు సోషల్ వర్క్ చేసేవారు. 1940లో మహారాష్ట్ర చాందా, నాగ్పూర్ నుంచి ఆయుధాలు సేకరించి ఇక్కడ సాయుద దళాలకు అందించేవారని పూర్వికులు చెబుతారు. మూడుసార్లు పట్టుబడి వరంగల్ జైలుజీవితం గడిపారు. కేశవరావుకు భార్య లక్ష్మికాంతమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కూతుర్లు శోభమ్మ, శశికళ, స్వర్నలత ఉన్నారు. పెద్ద కుమార్తె శోభమ్మతో మాజీ సీఎం కేసీఆర్ వివాహం జరిగింది. 2000 సంవత్సరంలో కేశవరావు కాలం చేశారు. ఆనందరావు స్మారక స్తూపం మాన్వాడకు చెందిన ఆనందరావు 1921లో జన్మించారు. బీఏ, ఎల్ఎల్బీ చేశారు. చెన్నమనేని రాజేశ్వరరావుకు మేనమామ అయిన ఆనందరావు సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన సాయుధ పోరులో కీలక పాత్ర పోశించారు. 1952–1957 వరకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా, 1957–1962 వరకు మెట్పల్లి ఎమ్మెల్యేగా పని చేశారు. 2009లో ఆయన కాలం చేశారు. ఆనందరావు పోరాటాలకు గుర్తింపుగా మాన్వాడలో 2015లో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. కేశవరావు (ఫైల్) ఆనందరావు (ఫైల్) -
నిజాంపై సాదుల నంబయ్య పోరు
పెద్దపల్లిరూరల్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్దపల్లి ప్రాంతంలో సాగిన పోరాటంలో అనభేరి ప్రభాకర్రావు, గట్టెపల్లి మురళి లాంటి వారితో పట్టణంలోని జ్యోతినగర్కు చెందిన సాదుల నంబయ్య (బుక్క నంబయ్య) చురుకుగా పాల్గొన్నారు. నిజాం రాజులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో పోరాటపటిమ చూపిన నంబయ్యపై ఆనాటి పాలకు లు నజర్బంద్ కూడా ప్రకటించారు. అయినా ఽధైర్యంగా దేశభక్తిని పెంచేలా నాటకాలు, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. నిజాం పాలకులకు కొరకరాని కొ య్యగా మారారు. రజాకర్ల నుంచి ప్ర జలకు ఇబ్బందులు రాకుండా గ్రామరక్షక దళాలు ఏర్పాటు చే సి వాటిని పర్యవేక్షించారు. నిజాం పాలకుల చె రలోని భూములను పేదలకు పంచడంలో క్రియాశీలపాత్ర పోషించిన నంబయ్య.. తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తుది శ్వాస వరకు కట్టుబడి నిజాయతీ ఉన్న నంబయ్య ఈ ప్రాంత వాసులకు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. -
పర్యటన.. పరిశీలన
కరీంనగర్/చిగురుమామిడి: పాఠశాలల పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర విద్యాపరిశోధన , శిక్షణ సంస్థ డైరెక్టర్ గాజర్ల రమేష్ జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించి ఎల్ఎండీ కేంద్రంలోని డైట్ కళాశాలలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎల్ఎండీ కాలనీలోని ప్రైమరీ పాఠశాల, తిమ్మాపూర్ ఉన్నతపాఠశాల, ముల్కనూర్ హైస్కూల్, రేణిగుంట, చిగురుమామిడి హైస్కూళ్లలో పర్యటించి యూడైస్, ప్రీప్రైమరీ పాఠశాలల ప్రారంభం, పాఠశాలల్లో పనిచేస్తున్న కంప్యూటర్ల పనితీరు, పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు, ఎఫ్ఆర్ఎస్ స్టేటస్, పిల్లలకు అందించే వివిధ రకాల ఎన్టైటిమెంట్స్, ఏ ఎక్స్ ఎల్ఏఐ ల్యాబ్, టాస్ నమోదు, ఉల్లాస్ నమోదు, ఐఎఫ్సీ పనితీరు, అమ్మ ఆదర్శ పాఠశాల, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్, మధ్యాహ్న భోజనం, పీఎంసీ పాఠశాలలు,పెండింగ్ బడ్జెట్, ఎస్ఎల్ఎన్ఎఫ్ఎల్ ఎన్ఐపీ రిపోర్ట్స్, లర్నింగ్ ఔట్స్ కమ్స్ మొదలగు వాటిపై సమీక్షించారు. అనంతరం డైట్ కళాశాలలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విద్యా కార్యక్రమాల్లో అలసత్వం వద్దని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రమేశ్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాంమొండయ్య, సెక్టోరియల్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, కృపారాణి, మహేందర్ పాల్గొన్నారు. -
నిలిపివేయడం బాధాకరం
నిరుపేదలకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేయడం బాధాకరం. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బి.రాజాకిషన్గౌడ్, కరీంనగర్ఆరోగ్యశ్రీ సేవలు అంది స్తున్న ఆసుపత్రులకు ప్ర భుత్వం నుంచి రావాల్సి న బకాయిలు పెరిగిపోయాయి. నిర్వహణ భారంగా మారింది. వేతనాలు, మెయింటెనెన్స్ కష్టంగా మారడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా ఆసుపత్రుల యాజమాన్యాలు సమష్టిగా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే నిర్ణయం తీసుకున్నాం. – విష్ణువర్ద్దన్రెడ్డి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా -
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ వ్యవహారం రానురాను తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తోంది. తాజాగా ఈ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించడం గమనార్హం. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో నిందితులను ఎవరినీ వదలవద్దని డిపార్ట్మెంట్కు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసును కరీంనగర్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు డబ్బులు వసూలు చేసిన తీరుపై పోలీసులు దృష్టి సారించారు. టూ టౌన్, రూరల్ ఠాణాల్లో కేసులు నమోదైనా.. సీసీఎస్ సాయంతో కేసును సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులు, నిందితుల నుంచి డబ్బుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని బృందాలు ముందుకు వస్తుండగా.. మరికొందరు కేసు నమోదుకు వెనకాడుతున్నా.. దర్యాప్తునకు దోహదపడేలా ఆధారాలు మాత్రం పోలీసులకు ఇస్తున్నారు. ఓ వైపు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కస్టడీ పిటిషన్ వేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు, మాజీ మంత్రి పాత్రపై ఆరా మెటా క్రిప్టో స్కాంలో రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు నాలుగు నెలల క్రితమే వేర్వేరుగా వివరాలు సేకరించాయి. ఇప్పటి వరకూ అరైస్టెన ఐదుగురు నిందితుల్లో ఒకరికి మాజీ మంత్రి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడితో గతంలో బాగా సఖ్యత ఉండేది. సదరు వ్యక్తి మంత్రి హోదాలో తరచుగా కరీంనగర్ వచ్చిన ప్రతీసారీ, అతని ఇంటికి తప్పకుండా వెళ్లేవారు. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సదరు మాజీ మంత్రి పాత్రపై ఆరా తీశాయి. వసూలు చేసిన డబ్బును నిందితులు దేశం దాటించారని బాధితులు ఆరోపిస్తున్న క్రమంలో సదరు మాజీ మంత్రికి, నిందితుడికి ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో తనిఖీలు చేశాయి. అదే సమయంలో బాధితులు (ప్రభుత్వ ఉద్యోగులు) నిందితుడిని డబ్బుల కోసం నిలదీసిన ప్రతీసారి సదరు మాజీ మంత్రి పేరు చెప్పి వారిని బెదిరించినట్లు సమాచారం. అదే సమయంలో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐల వివరాలు కూడా నిఘా వర్గాలు సేకరించాయి. వారికి డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేయడమే కాకుండా.. పైపెచ్చు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వైనంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వేధిస్తున్న విధానాన్ని కూడా గుర్తించినట్లు తెలిసింది. అదే సమయంలో క్రిప్టో కేసులో మోసపోయిన బాధితులను బెదిరించి, నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎస్హెచ్వో పాత్రపైనా ఉన్నతాధికారులకు అన్ని వివరాలు అందాయి. -
మల్లన్నా.. సౌలత్ల సంగతేమిటి?
● లక్షమంది భక్తులు.. ఐదే మరుగుదొడ్లు ● అడ్రస్ లేని అదనపు వసతి గదులు ● రాత్రివేళ భక్తులకు తప్పని తిప్పలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా మల్లన్న జాతర ప్రారంభమై జూలై వరకూ కొనసాగుతుంది. పెద్దపట్నాలతో ఉత్సవాలు ముగుస్తాయి. వీటితోపాటు ప్రతీ ఆది, బుధవారాల్లో లక్షల మంది భక్తులు తరలివస్తారు. విశ్రాంతి కోసం సరిపడా గదులు లేవు. కేవలం ఐదు మరగుదొడ్లే అందుబాటులో ఉన్నాయి. శిథిలైన రేకులషెడ్ల కిందే సేదదీరుతున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు ఇటీవల ఓదెల మల్లన్న గుడిని సందర్శించారు. మాస్టర్ప్లాన్ అమలు చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. -
సాగుకు అనుబంధంగా పౌల్ట్రీ
జగిత్యాలఅగ్రికల్చర్: ఇటీవల కాలంలో రైతు కుటుంబాలకు చెందిన యువత సాగుకు అనుబంధంగా లేయర్ కోళ్ల ఫాం (గుడ్ల కోళ్లు)లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్నవారు తమ వ్యవసాయ భూమిలో అధునాతన టెక్నాలజీతో లేయర్ ఫాంలు ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం ద్వారా అనుకున్న స్థాయిలో ఆదాయం రాక కోళ్లఫాంలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ● 10వేల కోళ్లతో ప్రారంభిస్తూ.. ఒకప్పుడు కోళ్ల లేయర్ ఫాంలు అంటే బడా పారిశ్రామికవేత్తలే గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు తామేమి తక్కువ కాదంటూ యువత ఈ రంగంలోకి వస్తున్నారు. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లినవారు, హైదరాబాద్ వంటి నగరాల్లో చాలీచాలనీ జీతంతో పనిచేసేవారు, స్వగ్రామాలకు వచ్చి ఫాంలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దమొత్తంలో పెట్టుబడి కావడంతో ముందుగా ఆయా ప్రాంతాల్లో సక్సెస్ అయిన కోళ్ల ఫాంలను సందర్శించి, వారితో పలు విషయాలు తెలుసుకుంటూ అవగాహనకు వస్తున్నారు. తర్వాత మొదటి దఫాగా 10 వేల కోళ్లతో ప్రారంభిస్తున్నారు. అనుభవం పెరిగిన కొద్ది కోళ్ల సంఖ్యను పెంచుతున్నారు. కోళ్లఫాంలు ఏర్పాటు చేసేందుకు కనీసం రెండుమూడు ఎకరాలు ఉండేలా చూసుకుంటున్నారు. ● బ్యాంకుల చేయూత వ్యవసాయ భూమి ఉండి కోళ్లఫాంలు నిర్మించుకుంటామని ముందుకు వచ్చే యువకులకు బ్యాంకులు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. 10వేల కోళ్ల ఫాం నిర్మాణానికి రూ.కోటి వరకు ఖర్చు అవుతుండడంతో, ఆ మేరకు బ్యాంకులు రుణం అందిస్తున్నాయి. ఫాంలు నిర్మించిన తర్వాత ఏదైనా సమస్యతో కోళ్లను వేయకుంటే, అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కోడి గుడ్డుకు వస్తే దాదాపు ఏడాది పాటు గుడ్లు పెడుతుంటుంది. లేయర్ ఫాంలలో కేజీ కల్చర్ రావడంతో, కోళ్లు పోడుచుకోకుండా ఒక్కో బాక్స్కు 2 నుంచి 4 కోళ్లను పెడుతున్నారు. పెద్దగా కూలీల అవసరం లేకుండా అధునాత టెక్నాలతో దాణాను బాక్స్ల్లో ఉన్న కోళ్ల వద్దకు తీసుకెళ్లవచ్చు. మొక్కజొన్న వంటి ముడిపదార్థాలను కొని, ఫాంలోని ఓ గదిలో గ్రైండింగ్ చేసి, నేరుగా కోళ్లకు అందించే వెసులుబాటు ఉండడంతో యువత ముందుకు వస్తున్నారు. ● గుడ్ల అమ్మకందారులతో ఒప్పందం కోళ్లఫాం యజమానులు గుడ్ల అమ్మకందారులతో నేరుగా ఒప్పందం చేసుకుంటున్నారు. పేపర్ రేటు లేదా 25పైసలు తక్కువతో ఏడాదంతా రోజు మార్చి రోజు గుడ్లు తీసుకెళ్తారు. దీంతో గుడ్లు అమ్ముడు పోవనే భయం ఉండదు. కోళ్లకు ప్రొటిన్లు, విటమిన్లు ఇచ్చే దాణాను కంపెనీలు సరఫరా చేస్తుండడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. కోళ్లు విసర్జించిన పేడకు మంచి డిమాండ్ ఉంది. కొంత తమ పొలాలకు ఉపయోగించుకుని, మిగతాది రైతులకు అమ్ముతుంటారు. కోళ్లు గుడ్లు పెట్టడం ఆగిపోయిన తర్వాత ఫాంలను రసాయన మందులతో పిచికారీ చేస్తుండడంతో ఎలాంటి వ్యాధులు దరి చేరే అవకాశం లేదు. అలాగే పదివేల కోళ్ల ఫాంకు కేవలం రెండు లేదా మూడు కూలీల జంటలు చాలు. ఒక్కో జంటకు వారి పనితనాన్ని బట్టి రూ.12 వేల వరకు జీతం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఫామ్కు వెవెళ్లాల్సి ఉంటుంది. ఫాంలలో అశుభ్రత లేకుండా చూసుకోవడం తదితర పనులు చేస్తుంటారు. ఆసక్తి చూపుతున్న గ్రామీణ యువత మొన్నటి వరకు వ్యవసాయం చేసిన. పెద్దగా ఆదాయం లేదు. బ్యాంకు లోన్ తీసుకుని 10 వేల కోళ్ల ఫాంను మామిడి తోటలో ఏర్పాటు చేశా. ఎంత పని ఉన్నా ఉదయం, సాయంత్రం ఫాంను సందర్శిస్తా. కోళ్ల ఫాంతో భారీ ఖర్చుతో పాటు ఆదాయం ఉంటుంది. – రాజేందర్, కట్లకుంట, మేడిపల్లి వ్యవసాయానికి అనుబంధంగా లేయర్ కోళ్లఫాం ఏర్పాటు చేశా. అంతకంటే ముందు కోళ్ల ఫాం గురించి తెలుసుకున్నా. రోజూ ఫామ్ను సందర్శించి, కొత్తగా ఏమి చేయాలో ఆలోచిస్తా. – మహేందర్, రాయికల్ -
యూరియా కోసం బతుకమ్మతో నిరసన
యూరియా పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు యూరియా బస్తాలపై బతుకమ్మను ఉంచి ఆటాడి నిరసన తెలిపారు. సోమవారం గోపాల్పూర్ చౌరస్తాలో బతుకమ్మ ఆడుతున్న మహిళలకు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో కరీంనగర్ రూరల్, చొప్పదండి సీఐలు నిరంజన్రెడ్డి, ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన విరమించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గంగుల పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కరీంనగర్, దుర్శేడ్ సహకార సంఘాల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, తోట తిరుపతి తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్రూరల్ -
ఆలకించండి.. పరిష్కరించండి
కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి బాధితులతో కిక్కిరిసింది. ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో అర్జీలు రాగా ప్రజలను నిలువరించేందుకు యంత్రాంగం శ్రమించింది. వచ్చినవారిలో 30శాతం మంది మళ్లీ మళ్లీ వచ్చినవారే కావడం గమనార్హం. సంఖ్య పెరగడమే తప్ప తగ్గకపోవడం మండలస్థాయి అధికారుల పనితీరుకు తార్కాణం. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్ అర్జీలు స్వీకరించారు. పలు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. మొత్తం 387 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వివరాలు వారి మాటల్లోనే.. మొత్తం అర్జీలు: 387 ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్: 76 తహసీల్దార్ సైదాపూర్: 27 తహసీల్దార్ కరీంనగర్రూరల్: 18 డీపీవో: 16, తహసీల్దార్ తిమ్మాపూర్: 14 సీపీ ఆఫీస్: 11 ఎంపీడీవో మానకొండూర్: 09 -
పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి
కరీంనగర్: జిల్లాలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించే పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నెలరోజుల పాటు జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ పోషకాహారం ప్రాధాన్యతను వివరించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం, పోషణ పర్యవేక్షణపై గ్రామస్థాయిలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు తూచడం, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పోషకాహారం ప్రాధాన్యత వివరించడం, మగవారికి వంటల పోటీలు, కిశోర బాలికలకు వైద్య పరీక్షలు వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్య, వైద్య, పంచాయతీరాజ్, మెప్మా, తదితర శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పోషణ మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.రేపు ప్రజాపాలన దినోత్సవంకరీంనగర్ అర్బన్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల, గ్రామస్థాయిలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కేంద్రంలో జరిగే వేడుకల్లో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండాకు వందనం చేయనున్నారు. డీఈవోగా బాధ్యతలు తీసుకున్న మొండయ్యకరీంనగర్: జిల్లా విద్యాశాఖ అధికారిగా శ్రీరాం మొండయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఈవోగా కొనసాగిన చైతన్యజైనీ నెలరోజుల పాటు సెలవులో వెళ్లడంతో డైట్ ప్రిన్సిపల్ శ్రీరాం మొండయ్యను డీఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,300 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని ఖాసీంపేట శ్రీమానసాదేవి ఆలయంలో సోమవారం సినీనటి శ్రీలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మిని సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు. ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకుడు పెండ్యాల అమర్నాథ్శర్మ, బద్దం మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, రమణారెడ్డి, శివారెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సాయిని మల్లేశం, భక్తులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టుల త్యాగాలతోనే హైదరాబాద్ విలీనం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రెడ్డి చిగురుమామిడి(హుస్నాబాద్): కమ్యూనిస్టు పార్టీ నేతల ప్రాణ త్యాగాలతోనే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం అయ్యిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని ఇందుర్తి, ఒగులాపూర్, గాగిరెడ్డిపల్లి, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో అమరుల స్మారక స్తూపాల వద్ద నివాళి అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు. గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, దాస్యశృంఖలాల విముక్తి కోసం పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య
చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్న కనకయ్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి ఆరుబయట పురుగుల మందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేములవాడ: పట్టణంలోని భగవంతరావునగర్లో చల్లా లక్ష్మి(75) అనే వృద్ధురాలు సోమవారం బాత్రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరేళ్ల క్రితం భర్త చనిపోవడంతో లక్ష్మి ఒంటరిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. వృద్ధాప్యంతోపాటు ఒంటరిగా ఉంటున్న తాను మానసికస్థితి తట్టుకోలేక ఇంట్లోని బాత్రూమ్లో ఉరివేసుకుంది. పెద్దకొడుకు గంగాధర్ తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. జగిత్యాలక్రైం: పట్టణంలోని కరీంనగర్రోడ్లో అట్ల శ్రీకాంత్ను బీరుసీసాతో పొడిచి హత్యకు ప్రయత్నించిన సందీప్, సమీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్కు చెందిన శ్రీకాంత్, గోవిందుపల్లికి చెందిన సందీప్ ఓ పంచాయితీ విషయంలో ఆదివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే సందీప్తోపాటు సమీర్ ఆగ్రహంతో బీరుసీసా పగులగొట్టి శ్రీకాంత్పై దాడిచేసి పారిపోయారు. శ్రీకాంత్ సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు సందీప్తోపాటు సమీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మెట్పల్లి: తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వాలని అడిగిన యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. పట్టణానికి చె ందిన ఎనగందుల గణేశ్ కొంతకాలం క్రితం జగిత్యాలలోని మిర్యాల్కర్ రాజేశ్వర్ మటన్ దుకాణంలో పని చేశాడు. ఆ సమయంలో బకా యి ఉన్న రూ.5వేల గురించి ఆదివా రం అతడికి ఫోన్ చేసి అడిగాడు. దీనికి ఆగ్రహించిన రాజేశ్వర్.. దుర్భషలాడుతూ అంతు చూస్తానని బెది రించాడు. సాయంత్రం విష్ణు, నిఖిల్తో కలిసి మెట్పల్లిలోని గణేశ్ ఇంటికి వచ్చాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో వాళ్లని తిట్టి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో బస్ డిపో చౌరస్తాలో గణేశ్ తన మిత్రులతో ఉండగా.. అక్కడకు వచ్చి ముగ్గురూ అతనితో గొడవకు దిగారు. రాజేశ్వర్ తన వెంట తెచ్చుకున్న కత్తి తో గణేశ్ కడుపులో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గణేశ్ను మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడినుంచి నిజామాబాద్ తరలించారు. గణేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మధ్యాహ్నం వరకే 45 టన్నులు ఖాళీ
కరీంనగర్రూరల్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఉదయమే విక్రయ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో పాస్బుక్కులు, చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు. సోమవారం దుర్శేడ్, కరీంనగర్ సహకార సంఘాలు, నగునూరులోని ఆగ్రోస్ కేంద్రాలకు అన్నదాతలు తరలివచ్చారు. దుర్శేడ్ సంఘం వద్దకు ఉదయం 8గంటలకు రైతులు తరలిరాగా, పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకే దుర్శేడ్, కరీంనగర్, నగునూరు కేంద్రాల్లో 15 టన్నుల చొప్పున మొత్తం 45 టన్నుల యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు ఏవో సత్యం తెలిపారు. కాగా జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి యూరియా విక్రయాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 41,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 30వేల టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆగస్టులో స్టాక్ కేటాయింపులో జాప్యంతో జిల్లాలో కొరత ఏర్పడిందని, మంగళవారం 5వేల టన్నుల యూరియా వస్తుందని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగించుకోవాలని కోరారు. దుర్శేడ్ విండో చైర్మన్ తోట తిరుపతి, సీఈవోలు ఎం.రమేశ్, వేణుమాధవ్ పాల్గొన్నారు. -
మరగుదొడ్లు నిర్మించాలి
ఓదెల మల్లన్న దర్శనం కోసం వచ్చే మాలాంటి మహిల భక్తులకు సరిపడా మరగుదొడ్లు నిర్మించాలి. లక్ష మందికి ఐదు మరగుదొడ్లు ఉంటే ఎలా సరిపోతాయి. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలి. – దిడ్డిగ లక్ష్మి, భక్తురాలు, జమ్మికుంట మల్లన్నగుడిలో రాత్రిపూట నిద్రకోసం అదనపు గదులు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న గదులు సరిపోవడంలేదు. ఆరుబయట పడుకొంటే దొమలతో ఇబ్బందిగా ఉంది. గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి – వేముల సురేశ్కుమార్, భక్తుడు వరంగల్ ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధికి కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పా లకవర్గం ఆధ్వర్యంలో మాస్టర్ప్లా న్ అమలు చేయాలని నిర్ణయించారు. పా లకవర్గం కూడా తీర్మా ణం చేసింది. నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నారు. – సదయ్య, ఈవో, ఓదెల మల్లన్న ఆలయం -
కొత్తగా ఆటోనగర్ కేటాయించండి
మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం స్థలం కేటాయించడంతో ఆటోనగర్ ప్రాంతం కొనసాగుతోంది. వందల కటుంబాలకు ఉపాధి కలుగుతుండగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అయితే సదరు ప్రాంతం ఇంజన్ రీబోరింగ్, జనరల్ వర్క్షాప్ ఓనర్స్, వర్కర్లకు ఇబ్బందిగా ఉంది. కిరాయిలు కట్టలేని పరిస్థితి. నగర శివారు ప్రాంతాల్లో కొత్త ఆటోనగర్ను కేటాయిస్తే వందల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 2016 నుంచి ప్రభుత్వానికి అర్జీలు ఇస్తున్నం. – మెకానిక్లు, కార్మికులు, ఆటోనగర్, కరీంనగర్ -
వైద్య విద్యార్థులకు తప్పిన రవాణా కష్టాలు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల రవాణా కష్టాలు తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ముందుకొచ్చారు. గతంలో ‘వైద్య కళాశాల ఒకచోట.. వసతి గృహాలు మరో చోట’ శీర్షికన విద్యార్థుల రవాణా కష్టాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. విద్యార్థుల వసతి గృహాలు తీగలగుట్టపల్లి, సీతారాంపూర్, దుర్గమ్మగడ్డలో ఉండడంతో కళాశాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో విద్యార్థులు ఇటీవల కేంద్ర మంత్రికి తమ ఇబ్బందులపై మొరపెట్టుకోగా, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులు, దాతల నుంచి సేకరించిన నిధులతో కొనుగోలు చేసిన బస్సును సోమవారం ఎంపీ కార్యాలయం వద్ద విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో ప్రిన్సిపాల్కు అందజేశారు. అలాగే వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ చెప్పగా.. ఆ బాధ్యతను ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీసుకున్నారు. కాగా, కళాశాల నిర్వహణను నెలరోజుల్లో మరో మంచి భవనంలోకి మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమయ్యే వ్యయాన్ని భరిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రికి విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. హామీ మేరకు బస్సు సౌకర్యం కల్పించిన కేంద్ర మంత్రి బండి -
కొడుకు పట్టించుకోవడం లేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల అర్బన్: కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాలు. అజ్మీర విఠల్, వీరవ్వ దంపతులు ముప్పై ఏళ్ల క్రితం వీర్నపల్లి మండలం నుంచి రుద్రంగికి వలస వచ్చారు. ఇక్కడే 2.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకున్నారు. వీరికి ఒక కుమారుడు అజ్మీర నరేశ్, కూతురు ఉన్నారు. కొడుకు నరేశ్కు 10 నెలల క్రితం పెళ్లి చేశారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా ప్రస్తుతం కొడుకు, కోడలు వారిని పట్టించుకోవడం లేదు. ఇంట్లో నుంచి గెంటివేశారు. ఈ విషయమై పెద్ద మనుషులు, పోలీసుల సమక్షంలో పంచాయితీ పెట్టినా.. తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈనెల ఒకటో తేదీన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన విఠల్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్, జిల్లా అధికారులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం కలెక్టర్ వాహనంలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విఠల్ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు. సిరిసిల్ల కలెక్టరేట్లో ఘటన ఆస్పత్రికి తరలించిన అధికారులు -
నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు
హుజూరాబాద్: ‘నా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు..’ అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెడుతున్నారన్నారు. మీడియాను మేనేజ్ చేసి ఓర్లాపింగ్ టెక్నిక్తో నెట్టుకొస్తున్నారన్నారు. రూ.9వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థుల చదువులు బలిపీఠంపై ఎక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సమయానికి డైట్ చార్జీలు చెల్లించక వారు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. సంవత్సరానికి దాదాపు రూ.3వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఖర్చు అవుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తుందన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్లలో డైట్ చార్జీలు ఆరు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు రూ.5లక్షల కార్డు ఇస్తామన్నా హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు గౌతంరెడ్డి, బండి కళాధర్, వెంకట్రెడ్డి, సంపత్రావు, సురేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, కరుణాకర్, సురేందర్రాజు, సుదర్శన్రెడ్డి, శ్రీరామ్ శ్యామ్, తిరుపతి, కరుణాకర్, రత్నాకర్, సుమన్ పాల్గొన్నారు. మాటలకు, చేతలకు పొంతన లేదు యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
పొలాస శివారులో ఒకరి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొలాస.. గుల్లపేట గ్రామాల శివారులో జిల్లాకేంద్రంలోని సుతారిపేటకు చెందిన ఎండీ.నయీమోద్దీన్ (37) హత్యకు గురయ్యాడు. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి రోడ్డు పక్కనున్న నీటి కాల్వలో పడేసి వెళ్లారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నయీమోద్దీన్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పాతబస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయిన అతడు తిరిగి ఇంటికి వెళ్లలేదు. సోమవారం ఉదయం పొలాస, గుల్లపేట వెళ్లే రహదారిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలానికి డాగ్స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బందిని రప్పించి అణువణువునా తనిఖీ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి సోదరుడు ఇసాకోద్దీన్ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరారు. -
జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లయ్యగౌడ్, సీహెచ్.మల్లేశ్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, పెటా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు మాధవరెడ్డి, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు
మానకొండూర్: మండలకేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు రైతులకు అందించాల్సిన ఎరువుల బస్తాలను అక్రమంగా వ్యాన్లో తరలిస్తూ పట్టుబడ్డారు. స్థానికులు అందించిన స మాచారంతో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి మానకొండూర్కు చేరుకుని ఎరువుబస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. వ్యాన్లో 50 యూరియా, ఇతర ఎరువుల బస్తాలు ఉన్నట్లు తెలిపారు. వాటిని పరకాల నడికుడకు తరలిస్తున్నట్లు వివరించారు. అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వారిపై 6 ఏ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే గ్రోమోర్ సెంటర్లో సుమారు రూ.20 లక్షల వివిధ రకాల ఎరువుల బస్తాలు ఉండగా, వాటి రిజిస్టర్, లేబుళ్లు సరిగా లేక సీజ్ చేశామని వ్యవసాయాధికారి వెల్లడించారు. పట్టుకున్న అధికారులు -
తల్వార్తో జన్మదిన వేడుకలు..
● యువకుడిపై కేసు నమోదు జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలోని వాణినగర్కు చెందిన కోరుకంటి సాయికృష్ణ అనే వ్యక్తి రోడ్డుపై.. జనావాసాల మధ్య తల్వార్ను పట్టుకుని మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం సాయికృష్ణ శనివారం రాత్రి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తల్వార్ చేతపట్టుకుని మిత్రులతో కలిసి కేక్ కట్ చేశాడు. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద సాయికృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్రూరల్: కరీంనగర్ జిల్లా రోలార్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఉ మ్మడి జిల్లాస్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో రోడ్ ఈవెంట్ స్టేట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ బాధ్యులు విజయభాస్కర్, గట్టు అనిల్కుమార్గౌడ్, డి.వీరన్న, కృష్ణమూర్తిగౌడ్, సాయినరహరి తదితరులు పాల్గొన్నారు. -
అనంతారం అద్భుతం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతారం ప్రాజెక్టు 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటుంది. అనంతారం ప్రాజె క్టు నీటితో నిండితే బిక్కవాగు పరివాహక ప్రాంతమైన అనంతారం, రహీంఖాన్పేట, ఇల్లంతకుంట, వంతడుపుల, నర్సక్కపేట గ్రామాల్లోని పంటలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది. డాక్ బంగ్లా అనంతారం ప్రాజెక్టు పరిధిలోని డాక్ బంగ్లాను రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అనంతారం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడే సేద తీరేవారు. డాక్బంగ్లా మండలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. -
చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా
కొత్తపల్లి(కరీంనగర్): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహి (1724–1748) కాలంలో అమీన్ఖాన్ ఈ కోట ఖిలేదార్గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్ సలాబత్ జంగ్ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్ నుంచి కరీంనగర్కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎలగందుల ఖిలా -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● ఫేస్బుక్లో పోస్టుపై పోలీసులు కొట్టారని మనస్తాపం ● సెల్ఫీ వీడియోతో ఎలుకల మందు తాగిన వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తమ ఊరికి బస్సు కావాలంటూ ఓ యువకుడు పెట్టిన పోస్టు అ తని ఆత్మహత్యాయత్నానికి దా రి తీసింది. అకారణంగా తన ను పోలీసులు చావబాదారని మనస్తాపం చెందిన ఆ యువకుడు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎలుకల మందు తాగాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్నగర్కు చెందిన బండారి శ్రీనివాస్ అనే యువకుడు తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై నాచుపల్లి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి ఫోన్ చేసి దూషించాడు. శనివారం ఉదయం మల్యాల పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అక్కడ ఎస్సై నరేశ్ తనను దుర్భాషలాడుతూ రోజంతా చితకబాదారని, అందుకే తాను మనస్తాపంతో ఎలుకల మందు తాగుతున్నానను అంటూ శ్రీనివాస్ వీడియోలో పేర్కొన్నాడు. తన చావుకు ఎస్సై నరేశ్, మరో కాంగ్రెస్ నేత కారణమని స్పష్టం చేశాడు. గతంలో తాను ఇదే విషయమై ఎన్ని పోస్టులు పెట్టినా ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదని, పైగా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వాపోయాడు. ఎలుకల మందు తాగిన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. ఆదివారం వన్టౌన్ సమీపంలోని ఓ హోటల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. -
ప్రాజెక్టుల ల్యాండ్మార్క్ మిడ్మానేరు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ ప్రాజెక్టులకు ల్యాండ్మార్క్లా మధ్యమానేరు నిలుస్తోంది. ఎగువ మానేరు, దిగువ మానేరుకు మధ్యలో ఉన్న మిడ్మానేరు 5.8 లక్షల క్యూసెక్కుల వరదపోటును తట్టుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) ప్రాజెక్టును 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు రూ.750 కోట్ల అంచనాలతో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందకు 2006లో దివంగత సీఎం వైఎస్సార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ప్రాజెక్టు మొత్తం 32 సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. 25 రేడియల్ గేట్లు, పవర్ ప్యాక్స్, లోకల్ కంట్రోల్ ప్యానల్, రిమోట్ కంట్రోల్ ప్యానల్స్ వంటి కొత్త పద్ధతులు ఉన్నాయి. ప్రాజెక్టులో 4 రివర్స్ స్లూయిస్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో చేరిన సిల్ట్ రివర్స్స్లూయిస్ల ద్వారా బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంట్, కాంక్రిట్, మట్టి, రౌతు, స్టీల్, వాడారు. ప్రాజెక్టు అడుగు భాగానికి వెళ్లడానికి గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనిలోకి వెళ్లడానికి మెట్లు, అధునాతన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు నిల్వ చేయడం వల్ల ఎయిర్ వెళ్లడానికి గ్యాలరీలో పరికరాలు అమర్చారు. 500 మీటర్ల మేర స్పిల్వే, 10 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించారు. -
వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలి
కరీంనగర్: పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో జరిగిన యూనియన్ 11వ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, సంక్షేమ పథకాల అమలులో మొండి చేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూటి శ్రీనివాస్ మాట్లాడుతూ, పవర్లూమ్ కార్మిక సమస్యలు పరిష్కరించుకునేందుకు మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మారంపల్లి నాగభూషణం, ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి ఉప్పునూటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు ఎలిగేటి కృష్ణహరి, సామల శంకర్, కోశాధికారి దూడం గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వడ్నాల వెంకటేశం, దూస నరసింగం, చిట్యాల సత్యనారాయణ, గుండేటి మల్లేశం, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయికల్ శివాలయంలో చోరీరాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్
● ఆసియాలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు కోరుట్ల రూరల్: ఇంజినీరింగ్ పనితీరుకు అద్భుత కట్టడంగా నిలుస్తుంది కోరుట్ల మండలం నాగులపేట వద్దగల సైఫన్. ఇది ఆసియాలో అరుదైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పీఎస్.రామకృష్ణారాజు సైఫన్ నిర్మాణానికి డిజైనింగ్ చేశారు. నాగులపేట వద్ద కాకతీయ కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పుతో ప్రవహించే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. వాగుకు అడ్డంగా కాలువ నిర్మించడం కష్టం కావటంతో వాగుపై నుంచే 100 మీటర్ల సొరంగమార్గం తవ్వి.. ఎప్పటిలాగే వాగు ప్రవహించేలా డిజైన్ చేశారు. 100 మీటర్ల పొడవు.. సుమారు 30 ఫీట్ల లోతు.. 25 ఫీట్ల వెడల్పుతో సైఫన్ నిర్మాణం చేపట్టారు. సైఫన్ సొరంగమార్గం ద్వారా కాలువ నీరు.. వాగులో వరద ప్రవాహం.. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. -
కమిషనరేట్లో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ విజయవంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ గౌస్ ఆలం ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో మొత్తం 3,130 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితుల ఖాతాల్లో నిలిపివేసిన రూ.25,79,883 కోర్టు సమక్షంలో తిరిగి ఇప్పించడం జరిగిందన్నారు. లోక్ అదాలత్ నిర్వహణలో సహకరించిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. రజితరెడ్డి నియామకం రద్దు చేయాలికరీంనగర్కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలి నియామకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. ఆదివారం నగరంలోని డీసీసీ కా ర్యాలయం గేట్ ఎదుట ధర్నా చేశారు. మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా వెన్నం రజితరెడ్డి నియామకాన్ని రద్దు చేయాలని, సీనియర్లకు అ వకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. త మకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వారికి సభ్యత్వమే లేదు: రజితరెడ్డి తనకు పదవి రావడం పట్ల ఆందోళన చేస్తున్నవారికి మహిళా కాంగ్రెస్లో సభ్యత్వం కూడా లేదని మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజితరెడ్డి విమర్శించారు. వారంతా సిటీ కాంగ్రెస్కు చెందిన వారని, మహిళా కాంగ్రెస్లో సభ్యులు కారని పేర్కొన్నారు. తాను నగరంలో 219 సభ్యత్వాలు నమోదు చేస్తేనే మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, తనకు నగర అధ్యక్షురాలుగా అవకాశం కల్పించారని తెలిపారు. తన పదవిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. బందోబస్తు మధ్య యూరియా పంపిణీశంకరపట్నం(మానకొండూర్): మండలంలోని తాడికల్ సహకార సంఘంలో ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా పంపిణీ చేశారు. తాడికల్ సంఘానికి 660, మెట్పల్లి సంఘానికి 340 బస్తాల యూరియా వచ్చింది. దీంతో కేంద్రాల వద్దకు రైతులు తరలిరాగా పోలీసు పహారా మధ్య ఏఈవోలు కీర్తన, స్రవంతి టోకెన్లు జారీ చేశారు. సంఘాల సీఈవోలు సదయ్య, వీరస్వామి, వేణుమాధవ్, సిబ్బంది యూరియా పంపిణీ చేశారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. 11 కేవీ అల్కాపురి ఫీడర్ పరిధిలో అల్కాపురికాలనీ, వోక్స్ వేగన్ షోరూం లేన్, నాగుల ఎల్లమ్మ ఆలయం, శ్మశానవాటిక, వాటర్ ట్యాంక్, గిద్దె పెరుమాండ్ల ఆలయం ప్రాంతాలు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ రాంచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, కొత్త పీహెచ్సీ సెంటర్, సప్తగిరి హిల్స్ రోడ్ నంబర్ 3,4,5, జానకివీధి రోడ్నంబర్ 1,2,3, ఏఓస్కాలనీ రోడ్నంబర్ 1,2,3,4, రామచంద్రాపూర్ రోడ్ నంబర్ 10,13,16,18,20, బైపాస్ రోడ్ హెచ్పీ గ్యాస్ గోదాం, వెంకటాద్రికాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు
కరీంనగర్కార్పొరేషన్: నగరంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలకసంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పనులు చేపట్టేందుకు ఇప్పటికే రూ.1 కోటి 50 లక్షలతో టెండర్ పిలిచింది. నగరంతో పాటు,ఇటీవల విలీనమైన కొత్తపల్లి పట్టణం, మల్కాపూర్, లక్ష్మిపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాల్లోనూ బతుకమ్మ ఏర్పాట్ల కోసం పనులను టెండర్లో పొందుపరిచారు. రూ.1 కోటి 50 లక్షలతో 35 పనులకు టెండర్ పిలిచారు. 35 పనుల్లో 28 సివిల్ వర్క్స్ కాగా, ఏడు ఎలక్ట్రికల్ వర్క్స్. ఈ నెల 23న టెండర్ ఓపెన్ చేయనుండగా, సద్దుల బతుకమ్మ నాటి వరకు ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంది. నగరవ్యాప్తంగా బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో రోడ్లపై గుంతలను డస్ట్తో పూడ్చడం, రోడ్లను చదును చేయడంతో పాటు లైట్లు అమర్చాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనపాయింట్లైన ఎల్ఎండీ కట్ట, వేదభవన్, కేబుల్ బ్రిడ్జి, కిసాన్నగర్, రేకుర్తి, చింతకుంట, కొత్తపల్లి, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్శేడ్ తదితర ప్రాంతాల్లో చెట్లు, పొదలను తొలగించడం, చదును చేయడంతో పాటు లైట్లు ఏర్పాటు చేయనున్నారు. -
సాదా సీదాకు లైన్ క్లియర్
ఈ సారైనా రికార్డుకు చేరేనా..? దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందం గతంలో జరిగిన అర్జీల పరిశీలన అద్దం పట్టింది. జిల్లాలో కరీంనగర్ అర్బన్తో పాటు తిమ్మాపూర్, హుజూరాబాద్, చిగురుమామిడి తదితర మండలాల్లో సర్వేనంబర్ల వారీగా 87,084 దరఖాస్తులు రాగా 70వేలకు పైగా అర్జీలను తిరస్కరించారు. అయితే సాదాబైనామా దరఖాస్తులకు 1994 వరకు చట్టబద్ధత కల్పించారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేతిరాత కాగితాలకు గుర్తింపు లభించగా తిరిగి రెండున్నర దశాబ్దాల అనంతరం గత ప్రభుత్వం రెండుసార్లు సదావకాశాన్ని కల్పించింది. కాగా, అప్పటి నుంచి పంట రుణాలకు నోచుకోక.. కొనుగోలు చేసిన భూమిని అమ్ముకోలేక నానా ఇక్కట్లు పడుతున్న రైతులు యంత్రాంగం కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రైతులకు పట్టాలు పంపిణీ చేసి రుణాలిప్పించాల్సి ఉండగా పర్యవేక్షణ లేమితో నత్తనడకన సాగుతోంది. వచ్చిన అర్జీలపై మోకాపై విచారణతో పాటు చుట్టుపక్కల రైతులను విచారించి సదరు దరఖాస్తులకు విముక్తి కల్పించాలి. నిబంధనల సడలింపు.. పునఃపరిశీలన సాదాబైనామాల అర్జీలకు అవకాశమిచ్చిన తొలిసా రి వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఆర్డీవో లను బాధ్యులను చేసింది. ప్రతీ దరఖాస్తును సద రు అధికారి పరిశీలించిన తదుపరి పట్టా జారీ చే యాలని పేర్కొంది. గతంలో జరిగిన పరిశీలన ప్ర క్రియ వేగంగా లేకపోవడంతో ఆర్డీవోల నుంచి త ప్పించింది. వేల దరఖాస్తులను సదరు అధికారి పరి శీలించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వం తహసీల్దార్లకే పూర్తిస్థాయి బాధ్యతలప్పగించింది. రైతులు ఆన్లైన్లో ఫారం 10 ద్వారా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సాదాబైనామా విక్రయాన్ని క్రమబద్ధీకరించేందుకు తహసీల్దార్లు 13బీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1బీలో నమోదు చే సి రైతులకు పట్టాదారు పాసుపుస్తకం అందించాల్సి ఉంటుంది. విక్రయదారులకు నోటీసులు జారీ చేయడం, వాంగ్మూలం నమోదులో వీరి పాత్ర కీలకం. ఇందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండగా తమ వేలిముద్రలు వేసి రైతులకు హక్కు పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ పొరపాటు జరిగినా తహసీల్దార్లదే బాధ్యత. కరీంనగర్ అర్బన్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సాదాబైనామాపై భూములు కొనుగోలు చేసి పట్టా కోసం నిరీక్షిస్తున్న రైతులెందరో. ప్రభుత్వాలు మారినా పట్టాలు చేతికందకపోగా మోకాను కాపాడుకునేందుకు పడినపాట్లు ఎన్నెన్నో. కాగా రైతులైనా రైతుకాని రైతులుగా మిగిలిన వారికి ఇక రికార్డుపరంగా భద్రత లభించనుంది. సాదాబైనామా కాగితాలపై భూములు కొన్న రైతులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో భూ రికార్డుల నవీకరణ క్రమంలో అవకాశం కల్పించగా మరోసారి పచ్చజెండా ఊపింది. 2014 జూన్ 2లోపు కాగితంపై భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించారు.గతంలో జిల్లాలో వచ్చిన అర్జీలు 10,456కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో 5,694 హుజూరాబాద్ డివిజన్లో 4,762ఎవరికి వర్తింపు : 2014కు ముందు లావాదేవీలకు అర్హులు: చిన్న, సన్నకారు రైతులుజీపీవోలకే పరిశీలన బాధ్యతలు?తాజాగా గ్రామ పాలన అధికారుల (జీపీవో) వ్యవస్థ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాదాబైనామా దరఖాస్తులను వీరే పరిశీలించనున్నట్లు సమాచారం. గతంలో గిర్దావర్లే పరిశీలన బాధ్యతలు మోశారు. జిల్లాలోని 16 మండలాల్లో తహసీల్ కార్యాలయాల్లో ఒకరిద్దరు మాత్రమే ఉండగా వేల సంఖ్యలో వచ్చి న అర్జీలను పరిశీలించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. పలు అర్జీల్లో కాగితాలు సరైనవే అయినా భూ యజమానులు మరణించడం, వారి వారసులు అభ్యంతరం తెలుపడంతో ప్రక్రియకు విఘాతం కలిగింది. మరి ఈ సారైనా ఆటంకాలను అధిగమించి అర్హులకు పట్టాలు జారీ చేసేనా.. వేచిచూడాల్సిందే. -
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు
● తొలగించిన రెవెన్యూ సిబ్బంది చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి శివారులోని పాంబండ వద్ద సర్వే నంబర్ 840, 841లో కొందరు దళితులు ఆదివారం అక్రమంగా గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ రమేశ్ గుడిసెలు తొలగించాలని ఆదేశించినా, దళితులు వినకపోవడంతో రెవెన్యూ సిబ్బంది తొలగించారు. కాగా గతంలో గ్రామపంచాయతీ నుంచి తమకు పట్టాలు జారీ చేశారని తహసీల్దార్కు దళితులు విన్నవించగా, గ్రామపంచాయతీ వారు ఇచ్చిన పట్టాలు చెల్లవని తహసీల్దార్ పేర్కొన్నారు. కాగా కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతోనే జర్నలిస్టులకు చెందాల్సిన భూముల్లో గుడిసెలు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ స్థలంలో చిగురుమామిడి జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్, తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్కు లేఖ రాశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని తహసీల్దార్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా మంత్రి సిఫారసు చేసి ఐదు నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో జర్నలిస్టులకు చెందాల్సిన భూమి వివాదాస్పదంగా మారిందని పలువురు వాపోతున్నారు. -
ఇక ఠంఛన్గా..
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులకు మంచిరోజులు రానున్నాయి. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్న మధ్యాహ్న భోజ న బిల్లులు, గౌరవ వేతనాలు ప్రతినెలా పదోతేదీలోపు నిర్వాహకుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10వ తేదీలోపు మధ్యాహ్న భోజనం బిల్లులతో పాటు కూరగాయల డబ్బులు గ్రీన్చానల్ ద్వారా చెల్లింపునకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. నూతన విధానంతో ట్రెజరీ నుంచి బిల్లులు అందించనున్నారు. ఇందు కోసం ఎండీఎం యాప్ను అభివృద్ధి చేశారు. నూతన విధానంతో ప్రతి నెలాఖరులో పాఠశాలల వారీగా బిల్లులు యాప్ ద్వారా చెల్లిస్తారు. వాటికి ప్రధానోపాధ్యాయుడు ఆమోదం తెలపగానే ఎంఈవో అంగీకరిస్తే ట్రెజరీ ద్వారా నేరుగా బదిలీ అవుతుంది. నెలవారీగా బిల్లులు చెల్లిస్తే జిల్లాలో వేలాది మంది వంట కార్మికుల సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో వంట కార్మికులు అప్పులు తీసుకొచ్చి కాలం వెళ్లదీస్తున్నారు. బిల్లులు ఇవ్వాలని సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్త విధానం లోటుపాట్లు లేకుండా పట్టాలెక్కితే ఈ కష్టాలకు అడ్డుకట్ట పడినట్లే.జిల్లాలో పాఠశాలలు 651విద్యార్థులు 49,754కుకింగ్ కం హెల్పర్లు 1,134 -
తారు పోయింది.. బురద మిగిలింది
చొప్పదండి: చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి రాగంపేట వెళ్లే రోడ్డు బురదమయమైంది. ఆర్నకొండ నుంచి రామడుగు మండలం గోపాల్రావుపేట వరకు గతంలో తారురోడ్డు వేశారు. రోడ్డుపై గుంతలు పడి తారు లేచిపోయింది. ప్రయాణికులు, రైతులకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేశ్ ఈ రోడ్డుపై ఎర్రమట్టి పోయించి గుంతలు పూడ్చారు. వర్షాకాలంలో మట్టికొట్టుకుపోయింది. రోడ్డంతా బురదమయమైంది. ఎస్సారెస్పీ ఉప కాలువల ద్వారా వచ్చే నీరు రోడ్డుపైకి చేరడంతో రోడ్డుపై కాలుమోపే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డువేసి, బురద బాధనుంచి గట్టెక్కించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆయుధాల ప్రదర్శన
ఆయుధాలను పరిశీలిస్తున్న ఎన్సీసీ కెడెట్లుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని 9వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం ఎన్సీసీ కెడెట్లకు పీటీసీ సహకారంతో ఆయుధాల ప్రదర్శన నిర్వహించినట్లు కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఏకే జయంత తెలిపారు. ఈ సందర్భంగా కెడెట్లకు 0.22 రైఫిల్, 7.62 ఎంఎం రైఫిల్, 303 రైఫిల్, ఏకే 47 పనిచేయు విధానం, వివిధ భాగాల గురించి క్లుప్తంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.పిచ్చయ్య, సీహెచ్ మల్లికార్జున్, ఎల్.మహేశ్, జె.శ్రీకాంత్, పీటీసీ స్టాఫ్, ఎన్సీసీ అధికారులు కెప్టెన్ రేల్ల సంజీవ్, త్రివేణి, ఉదయశ్రీ, శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
కరీంనగర్ ప్రజల అభిమానం మరువలేనిది
కరీంనగర్కల్చరల్: ఆధ్యాత్మిక కరీంనగర్లో ఏడుకొండల వాడి సినిమాలో నటించడం అదృష్టంగా ఉందని సినీ నటులు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇక్కడే సినిమా పేరును ‘ఎడుకొండల వాడ వెంకటరమణ.. గోవిందా గోవిందా’ అని ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు. కె.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో జిల్లా కేంద్రానికి చెందిన చందు నిర్మిస్తున్న చిత్రం నటులు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ‘సాక్షి’తో చిట్చాట్లో మాట్లాడారు.. శనివారం రాత్రి 3 గంటల వరకు జరిగిన షూటింగ్ చూసేందుకు అభిమానులు అక్కడే ఉండడం చూస్తుంటే కరీంనగర్ ప్రజలకు మాపై అభిమానం గొప్పదని అర్థమైంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సినారె, కాళోజీ లాంటి గొప్ప సాహితీవేత్తలు పుట్టిన గడ్డపై షూటింగ్ చేయడాన్ని జీవితంలో మర్చిపోలేము. ఇక్కడి మానేరుడ్యాం అందాలు, చల్లగా పలకరించే పైరగాలి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఇంతటి సాధారణ ప్రదేశాలు హైదరాబాద్లో దొరకవు. ప్రఖ్యాతిగాంచిన రామాలయం, వేంకటేశ్వర, శివాలయాలు ఆధ్యాత్మికతకు ఆనవాళ్లుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు కుటుంబసభ్యులతో వస్తుంటాం. మద్రాస్ తర్వాత షూటింగ్ అడ్డాగా హైదరాబాద్ మారినట్లు, కరీంనగర్లో జరిగిన అభివృద్ధి, సహజ ప్రకృతి వనరులతో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేస్తుంది. మరో ఐదురోజులు ఇక్కడ షూటింగ్ జరగనుండగా ప్రముఖ పాత్రలు పోషిస్తున్న అలీ, సునీల్లు ఇక్కడికి రావడంతో సందడి నెలకొననుంది. మా చిత్రం పూర్తయిన తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న లొకేషన్లు అందరికీ తెలిసి ఇక్కడ ఎక్కువ సినిమాల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను దీపావళి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. మంచి కథతో దర్శకులు వస్తే తెలంగాణ చరిత్రకారుల బయోగ్రఫీలో నటించేందుకు సిద్ధం. హైదరాబాద్లో షూటింగ్ లొకేషన్కు వెళ్లాలంటే 2 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో కరీంనగర్ వచ్చి షూటింగ్ చేయవచ్చు. హైదరాబాద్లో షూటింగ్ ప్రొడక్షన్ ఖర్చుతో పోలిస్తే కరీంనగర్లో తక్కువ. -
రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలి
కరీంనగర్: జనాభాలో సగభాగమున్న బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలని రిటైర్డు ఐఏఎస్ అధికారి చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ రాజ్యాధికార సభలో పాల్గొని మాట్లాడారు. గడపగడపకు బీసీల భావాజాలాన్ని తీసుకెళ్లి, 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపవద్దని సూచించారు. 75 ఏళ్లుగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, ఇకనైనా మేల్కొని హక్కులు సాధించుకునే వరకు రాజీలేని పోరుకు సిద్ధం కావాలన్నారు. బీసీలలో చైతన్యం నింపేందుకు ఇప్పటికే తాను పలు పుస్తకాలు, వ్యాసాలు రాసినట్లు చెప్పారు. ఈ చైతన్యాన్ని మరింత విస్తృతంగా గ్రామ గ్రామాన తీసుకెళ్లి బీసీల బలాన్ని కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. చొప్పదండి మాజీ జెడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సభలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఉరుమల్ల విశ్వం, ప్రసన్న హరికృష్ణ, చామకూర రాజు, అవ్వారి వేణుకుమార్, బైరి శేఖర్, పొన్నం దేవరాజుగౌడ్, సరోజ, సబ్బని వెంకట్, అయిలి వెంకన్న, కీర్తి లత, వాసాల రమేశ్, లింగం యాదవ్, కొమురయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హాజరుశాతం పెరిగింది
ఎఫ్ఎం రేడియో ప్రసారాలతో విద్యార్థుల హా జరుశాతం పెరిగింది. క్రమశిక్షణ మెరుగైంది. స్టేజీ ఫియర్ తగ్గింది. చిన్నారులు బాగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. సమయం వృథా కాకుండా ఎఫ్ఎం ప్రసారాలు చేస్తున్నాం. – రాజ్కుమార్, ప్రిన్సిపాల్ఎఫ్ఎం ఎంతో ఉపయోగపడుతోంది. మ ధ్యాహ్న భోజ న సమయంలో పాఠశాల అంతా చిందరవందరగా ఉండేది. ఎఫ్ఎంతో మంచి వాతావరణం ఏర్పడింది. వివిధ అంశాలపైనా అవగాహన వస్తోంది. – శ్రీనిధి, 9వ తరగతిరేడియో జాకీగా మారిన తర్వాత స్టేజీ ఫియర్ పోయి ంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా సార్లు చెప్పిన అంశాలను క్లియర్ చెబుతున్న. దీనిద్వారా తెలియని విషయాలు తెలుస్తున్నాయి. – జ్యోత్స్న, 9వ తరగతి -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గంగాధర(చొప్పదండి): మండల కేంద్రానికి చెందిన తాళ్ల కార్తీక్ (19) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. కార్తీక్ కొంతకాలంగా మద్యానికి బానిసై తరుచూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. గతంలో గొడవపడి ఒకసారి డిష్ వైర్తో ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించారు. శుక్రవారం కార్తీక్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్కట్ చేశాడు. తర్వాత అతిగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రాత్రి అందరూ ఇంట్లో నిద్రపోయారు. శనివారం వేకువజామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కార్తీక్ గదిలో విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..ధర్మపురి: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపెల్లి మండలం రుద్రాపూర్కు చెందిన దుర్గం జీవన్ (23) శనివారం రాత్రి రాయపట్నం రూట్లోని మోరోల్లవాగు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జీవన్ మూడురోజుల క్రితం ఇంట్లో గొడవ జరుగగా ధర్మపురికి వచ్చినట్లు అతడి బంధువుల ద్వారా తెలిసిందని ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. ఢీకొట్టిన వాహనం దొరకలేదని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. చికిత్సపొందుతూ ఒకరు.. శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని గ ద్దపాక గ్రామానికి చెందిన నిమ్మరాజు రాజు(55) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాలు.. రాజు ఈనెల 9న రాత్రి సమయంలో నిద్రమత్తులో నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు ఇంటిలోని ప్లోరింగ్పై పడడంతో తలకు తీవ్రగాయమైంది. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహిళా కాంగ్రెస్లో పదవుల పంచాయితీ
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలి నియామకం ఆ పార్టీలో పంచాయితీకి కారణమైంది. నగర అధ్యక్షురాలిగా వెన్నం రజితారెడ్డిని నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఈ నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. శనివారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సిటీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమవేశంలో నగర అధ్యక్షురాలు నియామకాన్ని బహిరంగంగా ప్రకటించగా, పలువురు మహిళానాయకురాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు పదవి ఎలా ఇస్తారంటూ సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్ను నిలదీశారు. సమావేశం ముగిసిన అనంతరం కూడా సుడా చైర్మన్ వాహనానికి అడ్డుగా బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు అది పార్టీ తీసుకున్న నిర్ణయమని సర్ది చెప్పి నరేందర్రెడ్డి వెళ్లిపోయారు. ‘వెలిచాల’ అభినందన మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలుగా నియామకమైన రజితరెడ్డిని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అభినందించారు. నగరంలోని ప్రజాకార్యాలయంలో రాజేందర్రావును రజిత మర్యాదపూర్వకంగా కలిశారు. రజితను ఆయన శాలువతో సత్కరించారు. నాయకులు ఆకుల నర్సయ్య, కోటగిరి భూమాగౌడ్, ఆకుల ఉదయ్, వేల్పుల వెంకటేష్పటేల్, బట్టు హరికృష్ణ పాల్గొన్నారు. -
నవోదయలో దరఖాస్తులకు ఆహ్వానం
చొప్పదండి: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ, పదకొండవ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరుగతి చదువుతున్న వారు తొమ్మిదో తరగతిలో మిగులు సీట్లకు, పదో తరగతి చదువుతున్న వారు 11వ తరగతిలో మిగులు సీట్లకు అర్హులని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 23 లోగా ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఎండీలో వింత చేపతిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్కు వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వైరెటీ చేప భారీ సైజులో కనిపించడంతో పైకి తీసి గమనించాడు. ఇప్పటివరకు ఎల్ఎండీ రిజర్వాయర్లో ఇలాంటి చేప పడలేదని మత్స్యకారులు తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. వైరెటీ చేపను చుట్టుపక్కల గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. సైబర్ వల నుంచి తప్పించుకున్న మహిళహుజూరాబాద్: సైబర్ నేరగాళ్ల వల నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. హుజూరాబాద్ పట్టణానికి చెందిన సుస్రత్ అనే మహిళలకు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ‘మీ కూతురు తీవ్రమైన కేసులో ఇరుక్కుంది, ఆమె ప్రస్తుతం పోలీస్ కస్టడిలో ఉంది’ అని నమ్మించారు. కేసు పరిష్కారం కోసం తక్షణం రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేసినా సుస్రత్ మానసికంగా కుంగిపోకుండా తన కూతురు క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె వెంటనే తన కూతురు చదువుతున్న కళాశాలకు వెళ్లగా, అక్కడ క్లాసులో క్షేమంగా, సంతోషంగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది. ఫోన్కాల్ మోసపూరితమని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తెలివితేటలతో వ్యవహరించిన మహిళను సీఐ కరుణాకర్ అభినందించారు. -
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కిడ్నీ సమస్యతో ఓ యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. ఆర్థికసాయం కోసం అతడి తల్లిదండ్రులు అర్జిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గూల్ల సమ్మక్క– సదయ్య దంపతుల ఏకై క కుమారుడు రాహుల్(26) కిడ్నీ వ్యాధితో ఆరునెలలుగా బాధపడుతున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులు ఉన్న ఎకరం అమ్మి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. బంధువుల వద్ద రూ.20 లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. పూర్తిగా నయం కావాలంటే మరో రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇకపై ఖర్చు పెట్టే స్థోమత లేదని వాపోతున్నారు. సహృదయులు తమ కుమారుడి చికిత్స కోసం ఆర్థికసాయం అందించి పుత్రభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేసే దాతలు 97041 87229 ఫోన్నంబర్కు పంపించాలని కోరారు. -
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన మె టా క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల సతీశ్ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేశ్, బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను సీసీఎస్ పోలీసులు అదే రోజు ఉదయం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే క్రిప్టోలో అధికలాభాలు అంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాల ఆశచూపి.. అధికలాభాల ఆశచూపగానే పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరిని గతేడాది పలుమార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు తీసుకెళ్లారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని, ఈ డబ్బుతో సూత్రధారుల్లో లోకేశ్ అనే వ్యక్తి ద్వా రా దుబాయ్ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారని బాధితులు ఆరోపించారు. ‘నష్టపోయాం మహాప్రభో.. మా డబ్బులు మాకివ్వాలని’ బాధితులు కోరినా.. ఎవరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించేందుకు లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. బెదిరింపులు... బ్లాక్మెయిల్ మెటా క్రిప్టోలో చేరిన వారిలో సాధారణ వ్యక్తులు నిలదీస్తే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేశారు. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. బాధితులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే బ్లాక్మెయిల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ...అది ఎక్కడా జరగలేదు. అంతేకాదు వారికి విదేశాల్లో అమ్మాయిలతో మసాజ్లు చేయించి వారి వీడియోలు దగ్గర పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే.. ‘నా మీద కేసులు పెడితే.. మీరు అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ చేసిన పనుల మీద ఎదురుకేసులు పెట్టాల్సి వస్తుందని’ బెదిరింపులకు దిగారు. ఏయే చట్టాల కింద కేసు పెట్టారంటే? మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ మాటలు నమ్మి నూనావత్ భాస్కర్ మరో 16మంది కలిసి దాదాపు రూ.1.20 కోట్లు డబ్బును మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ త్రీటౌన్లో గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ (5) కింద కట్ల సతీశ్పై కేసు నమోదు చేశారు. ఇది నాన్బెయిలబుల్. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ను పోలీసులు ప్రయోగిస్తారు. పోలీసుల అభియోగాలు రుజువైతే రూ.లక్ష జరిమానాతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారం దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన పెట్టుబడులతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి బాధితులకు అందజేసే వీలుంది. అదే సమయంలో ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 సెక్షన్ (3), (4) కూడా పెట్టడం గమనార్హం.క్రిప్టో నిందితులపై కఠిన చర్య తీసుకోవాలికరీంనగర్ కార్పొరేషన్: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచి పెట్టవద్దన్నారు. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు లేఖ రాసినట్లు తెలిపారు. సతీశ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే క్రిప్టో పేరిట డబ్బులు వసూలు చేశాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కఠిన చర్యలు తీసుకుంటే చాలామంది మోసపోకుండా ఉండేవారని అన్నారు. క్రిప్టో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
భార్యవెంటే భర్త..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లూ కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు మరణంలోనూ కలిసేపోయారు. ఒకేరోజు గంటల వ్యవధిలో మరణించడం.. ఒకే చేతిలో ఇద్దరి మృతదేహాలను పేర్చి.. ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన సత్రపు రాజనర్సు (85), సత్రపు లక్ష్మీ (80) భార్యాభర్తలు. వీరికి రమేశ్ కుమారుడు. రాజనర్సు 20 ఏళ్ల క్రితం వెదురుబొంగులు తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ అడవిపంది దాడిచేయడంతో బండపైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి వెన్నుపూస విరిగి అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యాడు. అతడి బాగోగులను భార్య లక్ష్మీ, కొడుకు రమేశ్ చూసుకుంటున్నారు. లక్ష్మీ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. విషయాన్ని కొడుకు రమేశ్ తండ్రికి చెప్పడంతో.. అతడు తీవ్రంగా రోదించాడు. కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందాడు. దంపతులిద్దరూ ఒకేరోజు మృతిచెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోధనలు మిన్నంటాయి. ఇద్దరికి వేర్వేరుగా పాడె కట్టి ఒకేచితిలో పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులు ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకేరోజు భార్యాభర్తల మృతి అనారోగ్యంతో భార్య, గుండెపోటుతో భర్త జగిత్యాల జిల్లా అనంతారంలో విషాదం -
లోక్ అదాలత్లో 3,194 కేసులు పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ కరీంనగర్క్రైం: లోక్ అదాలత్లో రాజీద్వారా కేసుల సత్వర పరిష్కారం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శివకుమార్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీ య లోక్అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన జడ్జి ఎస్.శివకుమార్ మాట్లాడు తూ.. రాజీ ద్వారా ఇరు పార్టీల వారు తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతో షంగా ఉంటారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 3,194 కేసులు పరిష్కరించబడ్డాయని సివిల్ కేసులు71, క్రిమినల్ కేసులు 3,123, బ్యాంక్, బీఎస్ఎన్ఎల్ కేసులు 109తో పాటు ట్రాఫిక్ చలాన్ కేసులు 74,651 పరిష్కరించినట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ న్యాయమూర్తులు, పోలీసు అధికారుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించబడుతున్నాయని తెలిపారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు. 20 ఎకరాలు.. రూ.60 కోట్లుసాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల దురాక్రమణపై మరోసారి ఉక్కుపాదం మోపారు. జిల్లాలో ల్యాండ్ మాఫియాపై కొరడా ఝుళిపించే క్రమంలో వేములవాడ మండలం నాంపల్లి శివారులో సుమారు రూ.60కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులోని సర్వేనంబర్లు 485, 486, 487లో సుమారు 20 ఎకరాల భూమి జిల్లా కేంద్రం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఆధీనంలో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదు అందుకున్న జిల్లా రెవెన్యూ అధికారులు సదరు స్థలం ప్రభుత్వానికి చెందిందని విచారణలో తేల్చారు. దీంతో రెవెన్యూ అధికారులు సదరు స్థలాలను ప్రభుత్వానికి స్వాధీనం పరిచారు. రూ.60కోట్ల విలువైన స్థలాలు తిరిగి ప్రభుత్వపరం కావడం రాజకీయంగా, స్థానికంగా చర్చనీయాంశమైంది. కరీంనగర్స్పోర్ట్స్: నల్గొండ జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న 12వ సీనియర్స్ యోగాసన చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్సింగ్ సూచించారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో యోగా క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, యోగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నకృష్ణ, కార్యదర్శి నాగిరెడ్డి సిధారెడ్డి, కోచ్లు కిష్టయ్య, రామకృష్ణ, మల్లేశ్వరి, ఆనందకిషోర్, తిరుపతి అభినందించారు. కరీంనగర్టౌన్: భారత విదేశాంగ మంత్రిత్వశాఖ రీజినల్ పాస్పోర్టు ఆఫీస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమాన్రోడ్డులోని ఫార్చూన్మాల్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఈనెల 15న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ కె.జె.శ్రీనివాస్, హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు ఆఫీసర్ జె.స్నేహజ తెలిపారు. ఇప్పటి వరకు రూరల్ పోలీస్స్టేషన్ సమీపంలోని మున్సిపల్ భవనంలో పాస్పోర్టు లఘుసేవా కేంద్రం కొనసాగగా, ఇక నుంచి నూతన భవనంలో పూర్తిస్థాయి సేవలు అందించనుందని వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, ఎల్.రమణ, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తిపై పీడీయాక్ట్
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జగిత్యాల పోలీస్స్టేషన్ పరిధిలోని విద్యానగర్కు చెందిన బండి అలియాస్ తరాల శ్రీకాంత్ తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో గతంలో రౌడీషీట్ ఓపెన్ చేసి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ, అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పీడియాక్ట్ నమోదు చేసి ఉత్తర్వుల కాపీని నిందితుడికి కరీంనగర్ జైల్లో అందజేయడంతో పాటు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందన్నారు. నిందితుడిపై గతంలో హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు, బెదిరింపులకు పాల్పడిన 20 కేసులు నమోదయ్యాయని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీయాక్ట్ తో పాటు, అవసరమైతే నగర బహిష్కరణ కూడా అమలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, పునరావృత నేరాలను అరికట్టేందుకు పోలీస్శాఖ కృషి చేస్తుందన్నారు. పీడీయాక్ట్ అమలుచేయడంలో కీలక పాత్ర పోషించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణసీఐ కరుణాకర్ను ఎస్పీ అభినందించారు. -
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎములాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) ఆధ్వర్యంలో ప్రధాన ఆలయ విస్తరణ, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. మూలవాగు నుంచి ప్రధాన ఆలయం వరకు బ్రిడ్జి, రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆగమ శాస్త్రానుసారంగా పనులు చేపడుతూ భక్తులకు అన్ని వసతులు కల్పంచనున్నారు. రోడ్డు విస్తరణకు మార్గం సుగమం వేములవాడలో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనున్నది. మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు ఇప్పుడున్న 40ఫీట్ల రోడ్డును 80ఫీట్లకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.47.86 కోట్లు మంజూరు చేసింది. వీటీడీఏ వైస్ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులు అందించి, కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. రూ.6.56 కోట్లతో బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. వంతెన పూర్తయితే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఆకర్షణీయంగా మహా మండపం, గోపురాలు మొదటి దశలోనే రూ.111 కోట్లతో మహా మండ పం, నిత్య కల్యాణ మండపం, ధర్మగుండం పునరుద్ధరణ, కొత్త రాజ గోపురాలు ఆకర్షణీయంగా నిర్మించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గుడి చెరువు ఘాట్ అభివృద్ధి, బండ్ సుందరీకరణ, మల్టీ లెవెల్ పార్కింగ్, వాహనాల కోసం విస్తృత స్థలాలు అభివృద్ధి కానున్నాయి. షాపింగ్ కాంప్లెక్సులు, హెల్ప్డెస్క్, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఆలయం వద్ద రూ.25కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రూ.35.25 కోట్లతో అన్నదాన సత్ర భవనం నిర్మా ణం జరుగుతోంది. ఒకేసారి వెయ్యి మంది భోజనం చేసే డైనింగ్ హాల్, 600మందికి వెయిటింగ్ హాల్, లడ్డూ తయారీ కేంద్రం, ఆధునిక వంటశాలలు ఏర్పాటు కానున్నాయి. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పాత కట్టడాల కూల్చివేత, కొత్త నిర్మాణాలకు స్థలం సిద్ధం చేస్తున్నారు. రూ.150 కోట్ల వ్యయంతో రహదారుల విస్తరణ, రూ.3.40 కోట్లతో భూసేకరణ, ప్రహరీ నిర్మించనున్నారు. భీమేశ్వర ఆలయంలో పనులు.. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు రూ.10కోట్ల నిధులతో సాగుతున్నాయి. రూ.12కోట్ల నిధులతో చేపట్టిన గుడి చెరువు పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాజన్న ప్రధాన ఆలయంలో స్వామి వారికి నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయి. భీమేశ్వర ఆలయంలో రూ.3.44 కోట్లతో కల్యాణ మండపం, హోమ, వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. రాజన్న కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి రాజన్న కోడెల సంరక్షణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గోశాలలో సీసీ ఫ్లోరింగ్, షెడ్లు నిర్మింపజేశారు. ఇతర పారిశుధ్య పనులు నిత్యం చేయిస్తున్నారు. సన్నకారు రైతులకు రెండు వేల కోడెలు అందించారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు వైద్యసిబ్బందిని నియమించారు. గోశాలలోని జీవాలకు అందించేందుకు 40ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చగడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటీడీఏ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నాం. ఆలయ విస్తరణ, రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సహకరిస్తున్న వేములవాడ ప్రజలకు ధన్యవాదాలు. – సందీప్ కుమార్ ఝా వీటీడీఏ వైస్ చైర్మన్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తోంది. శృంగేరి పీఠాధిపతులు, వాస్తు పండితులు, ప్రముఖుల సలహాలు, సూచనలు మేరకు ఆలయాన్ని విస్తరిస్తున్నాం. భక్తులకు సులభంగా.. వేగంగా దర్శనం కల్పిస్తాం. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. – ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే -
సారూ.. ఒక్కబస్తా ఇవ్వరూ
శంకరపట్నం/తిమ్మాపూర్: జిల్లాలో అన్నదాతలకు యూరియా గోస తప్పడం లేదు. తెల్లవారకముందే రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి సహకార సంఘం పరిధిలోని కొత్తగట్టు గోదాంకు లారీలో 450 బస్తాల యూరియా వచ్చింది. కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాలతో పాటు సైదాపూర్ మండలానికి చెందిన రైతులు శనివారం వేకువజామున్నే బారులు తీరారు. కౌలు రైతులు యజమాని పాసుపుస్తకం జిరాక్స్లు ఇచ్చారు. సంబంధిత వ్యక్తి వస్తేనే యూరియా ఇస్తామని ఏఈవోలు తిరుపతి, కీర్తన చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తిమ్మాపూర్ మండలం పోరండ్ల సొసైటీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి అమ్మకాల కేంద్రం వద్ద ఉదయాన్నే రైతులు బారులు తీరారు. సరిపడని బస్తాలు లేక వెనుదిరిగారు. నుస్తలాపూర్ సొసైటీ వద్ద రైతులు ఉదయం నుంచే క్యూ కట్టారు. -
మళ్లీ దంచికొట్టిన వాన
చిగురుమామిడి/సైదాపూర్/శంకరపట్నం: వాన మళ్లీ దంచి కొట్టింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి హుజూరాబాద్, చిగురుమామిడి, శంకరపట్నం, సైదాపూర్ మండలాలు అతలాకుతలమయ్యాయి. చిగురుమామిడి మండలంలోని మోయతుమ్మెద వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఇందుర్తి–కోహెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగోజిపేట చెరువు మత్తడి పారడంతో ఇందుర్తి–గాగిరెడ్డిపల్లి గ్రామాల రోడ్డు మూసివేశారు. ఇందుర్తి, సుందరగిరి ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో వర్షపు నీరుచేరాయి. చిన్న ముల్కనూర్, పీచుపల్లి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల మధ్య ఉన్న కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మోయతుమ్మేద వాగుపై నిర్మించిన చెక్డ్యాంపై నీరు భారీగా ప్రవహిస్తోంది. శుక్రవారం చిగురుమామిడి తహసీల్దార్ ఎం.రమేశ్, ఎంపీడీవో మధుసూధన్, ఇరిగేషన్శాఖ అధికారులు పర్యటించి వర్షం.. నష్టం.. ఇబ్బందుల వివరాలు సేకరించారు. శంకరపట్నం మండలం అంబలాపూర్, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల్లో పొలాలు నీటమునిగాయి. కేశవపట్నం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెర్లపల్లి–కేశవపట్నం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్ మండలం సోమారంలో ఆదర్శ పాఠశాల చుట్టూ వర్షపు నీరు నిలిచాయి. హాస్టల్ విద్యార్థులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. పోల్కమ్మ చెరువు మత్తడి దూకుతోంది. గర్రెపల్లిలో చేలలో నీరుచేరింది. న్యాల చెరువు మత్తడి పోస్తోంది. నేలకల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో 149.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులువెల్లడించారు. -
ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. తహసీల్దార్ అరెస్టు
జగిత్యాలక్రైం: ప్రభుత్వ మహిళా ఉ ద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసి న జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీ ల్దార్ రవీందర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ వివరాల ప్రకా రం.. పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అతనితో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సప్లో అసభ్యకరంగా సందేశాలు పంపాడు. ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని జగిత్యాలకు చెందిన ఓ తహసీల్దార్ మధ్యవర్తిత్వం వహించాడు. సదరు మహిళా ఉద్యోగి ఒప్పుకోకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి
పాఠశాలల క్రీడలకు పూర్వ వైభ వం వచ్చింది. కరో నా అనంతరం ఈ సంవత్సరం జరుగుతున్న పో టీలకు పెద్దసంఖ్యలో క్రీడాకా రులు హాజరవడం శుభపరిణా మం. ఆయా జిల్లాల ఎస్జీఎఫ్ కా ర్యదర్శులు ఉత్తమమైన, పటిష్టమైన ఉమ్మడి జిల్లా జట్టును ఎంపి క చేసి రాష్ట్ర పోటీలకు పంపించాలి. – నందెల్లి మహిపాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజేతగా నిలవాలి 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు విజేతగా నిలవాలి. ఎస్జీఎఫ్ క్రీడల్లో నంబర్వన్గా ఎదగాలి. జిల్లా, ఉమ్మడి జిల్లా పోటీలకు ఒలింపిక్ సంఘం సహాయ, సహకారాలందిస్తాం. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఘనంగా నిర్వహించాలి. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి మంచి స్పందన.. కరీంనగర్ జిల్లాలో పెద్దసంఖ్యలో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న. క్రీడలకు తలమానికంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో క్రీడలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మండలస్థాయి పోటీలకు మంచి స్పందన వచ్చింది. జిల్లాస్థాయి పోటీలను కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తాం. – బి.వేణుగోపాల్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, కరీంనగర్ ఘనంగా నిర్వహిస్తాం పెద్దపల్లి జిల్లాలో జరగనున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మండలస్థాయి, మండల జోన్స్థాయి పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లాస్థాయి పోటీలు కూడా త్వరలోనే నిర్వహిస్తాం. – కనుకుంట్ల లక్ష్మణ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, పెద్దపల్లి -
రాజన్నా శరణు..శరణు
సినీనటుడు చిన్నకు స్వామి వారి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులురాజన్నను దర్శించుకుంటున్న భక్తులు వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె పోశారు. స్వామి వారికి అత్యంత ప్రీతపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఈ–టికెట్ విధానం ప్రఽవేశపెట్టారు. దీంతో రోజుకో కలర్తో కూడిన ప్రింట్ అవుట్తో కోడె టికెట్లు అందజేస్తున్నారు. రూ.200 కోడె టికెట్కు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నారు. సినిమా నటుడు చిన్న స్వామి వారిని దర్శించుకున్నారు. -
4.098 కిలోల గంజాయి స్వాధీనం
● కారు, మొబైల్ఫోన్ స్వాధీనం ● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ వెల్లడి ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి గ్రామ శివారులో 4.098 కేజీల గంజాయి స్వాధీనం చేసు కున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పొత్కపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా ఓ కారు వచ్చిందన్నారు. అందులో తనిఖీ చేయగా.. కంసాని అరుణ్ వద్ద 4.098 కేజీల ఎండు గంజాయి లభిందని పేర్కొన్నారు. దాని విలువ సుమారు రూ.2.04 లక్షలు ఉంటుందని వివరించారు. కారుతోపాటు మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని వివరించారు. ఇదే కేసులో నిందితులు ఇల్లెందుకు చెందిన బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాశ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సైతోపాటు ఏఎస్సై రత్నాకర్, కానిస్టేబుళ్లు రాజుయాదవ్, హరీశ్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేశ్ను అభినందించారు. ఎన్టీపీసీ స్టేజ్–2కు పర్యావరణ అనుమతులు జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీలో చేపట్టిన 2,400 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండోదశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. సుమారు ఎనిమిది నెలల క్రితం ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పర్యావరణ క్లియరెన్స్ కోసం గత ఆగస్టు 26న ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికను సమగ్రంగా పరిశీలించిన అనంతరం పర్యావరణ అనుమతులను జారీ చేస్తూ భారత ప్రభుత్వ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విభాగం అనుమతి జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం –2014 ప్రకారం బొగ్గు ఆధారిత 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో ఇప్పటికే 1,600 మెగావాట్ల ఒకటో దశ ప్రాజెక్టు నిర్మించింది. రెండోదశలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లను నిర్మించనున్నారు. -
ఎస్జీఎఫ్ షెడ్యూల్ ఖరారు
15 నుంచి జిల్లాస్థాయిలో ప్రారంభం కానున్న పోటీలు కరీంనగర్స్పోర్ట్స్: పాఠశాలల క్రీడాసమాఖ్య క్రీడాసందడి మొదలైంది. మండల, జోన్స్థాయిలో పోటీలు అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా మైదానాలు విద్యార్థులు, క్రీడాకారులతో కిక్కిరిసిపోతున్నాయి. పలు మండలాల్లో నిర్వహించిన మండలస్థాయి పోటీలు జాతరలను సైతం మైమరపింపజేసేలా జరుగుతుండడం విశేషం. ఈనెల 14 వరకు అన్ని మండలాల్లో క్రీడాపోటీలు ముగియనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పాఠశాలల క్రీడాసమాఖ్యల కార్యదర్శులు క్రీడల నిర్వహణపై ఇటీవల సమావేశమయ్యారు. ఏ జిల్లాలో ఏఏ క్రీడల్లో పోటీలను నిర్వహించాలో, జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో నేరుగా పోటీలను నిర్వహించే క్రీడలపై ఓ కొలిక్కి వచ్చారు. ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడల్లో మొదటగా జిల్లాలో పోటీలను నిర్వహించి.. తదనంతరం ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. మిగిలిన క్రీడల్లో నేరుగా ఉమ్మడి జిల్లా పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగే క్రీడల జాబితాను ఎస్జీఎఫ్ కార్యదర్శులు వేణుగోపాల్(కరీంనగర్), లక్ష్మణ్(పెద్దపల్లి), శ్రీనివాస్(రాజన్న సిరిసిల్ల), చక్రాధర్(జగిత్యాల) ప్రకటించారు. అండర్–14, 17.. పాఠశాల స్థాయిలో అండర్–14, 17 బాలబాలికల విభాగాల్లో జరగనున్న ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు ఆగస్టు చివరి వారం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నేటికి కూడా పలు మండలాల్లో మండలస్థాయి పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించడానికి ఎస్జీఎఫ్ కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15న కరీంనగర్లో అండర్–17 వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం కానుండగా.. మిగిలిన జిల్లాల్లో కూడా జిల్లాస్థాయి పోటీలు పలు క్రీడల్లో జరగనున్నాయి. జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, కరాటే అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు ● కరీంనగర్ జిల్లాలో అథ్లెటిక్స్, అర్చరీ, బేస్బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కళారియపటు, కురాష్, మల్లాకంబ్, మోడరన్ పెంటాథ్ల్లాన్, నెట్బాల్, రగ్బీ, సెపక్ తక్రా, షూటింగ్, స్కేటింగ్, సాఫ్ట్బాల్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, యోగాసనా(అండర్–14, 17). ● పెద్దపల్లి జిల్లాలో స్విమ్మింగ్, టెన్నిస్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, కరాటే(అండర్–14, 17), క్రికెట్, కబడ్డీ, వాలీబాల్(అండర్–14). ● జగిత్యాల జిల్లాలో తైకై ్వండో, బాస్కెట్బాల్, చెస్, ఖోఖో(అండర్–14, 17). ● రాజన్న సిరిసిల్ల జిల్లాలో హ్యాండ్బాల్(అండర్–14, 17), వాలీబాల్, క్రికెట్, కబడ్డీ(అండర్–17).వర్షాలతో అంతరాయం జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో వర్షాలు భారీస్థాయిలో పడడంతో పోటీలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే మండలస్థాయి పోటీలు పూర్తి కావస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ మొదటివారంలో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తాం. ఉమ్మడి జిల్లా పోటీలకు కూడా సిద్ధంగా ఉన్నాం. – చక్రధర్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, జగిత్యాల -
రాజీయే.. రాజమార్గం
కరీంనగర్క్రైం: కోర్టుల్లో కేసులుంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడమని అందరికీ తెలిసిన విషయమే. వివిధ కేసుల్లో కక్షిదారులు సంవత్సరాలుగా తిరుగుతున్న వారు అనేకమంది ఉన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సామరస్యంగా కేసు పరిష్కరించేందుకు లోక్ అదాలత్లు వేదికలుగా మారుతున్నాయి. న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్లలో ఇరువర్గాల కక్షిదారుల సమ్మతితో రాజీ చేయదగిన కేసులను ముందస్తుగా గుర్తించారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ(డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయబడ్డాయి. శనివారం కోర్టుల్లో లోక్ అదాలత్ సందర్భంగా కేసులను పరిష్కరించనున్నారు. లోక్ అదాలత్లో రాజీ పడితే దీనిపై అప్పిల్కు వెళ్లరాదు. ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. 2,740 కేసులు.. లోక్ అదాలత్లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ సంబంధాలు, మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, చిట్ఫండ్, వినియోగదారుల ఫోరం కేసులతోపాటు వివిధ కేసులు పరిష్కరించనున్నారు. ఇందులో భాగంగా 2,525 క్రిమినల్ కేసులు, 215 సివిల్ కేసులు గుర్తించారు. ఆయా కేసుల్లో కక్షిదారులను గుర్తించి వారికి ఇప్పటికే నోటీసులు పంపించారు. న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజుల నుంచే పోలీసులు క్రిమినల్ కేసుల్లో రాజీ చేయదగిన వాటిని గుర్తించి వారికి సమాచారమందించి లోక్ అదాలత్ వేదికకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో వివిధ రాజీ చేయదగిన కేసులను గుర్తించాం. కోర్టులో కేసులు పెండింగ్లో ఉంటే కక్షిదారులకు మానసికంగా, ఆర్థికంగా నష్టం జరగడంతోపాటు సమయం వృథా అవుతుంది. రాజీ కుదర్చుకొని కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. కేసులు లోక్ అదాలత్లో రాజీ కుదర్చుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లే. – కె.వెంకటేశ్, న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి -
పేట్రేగిపోతున్న సైబర్మోసగాళ్లు
గోదావరిఖని: ప్రపంచం సెల్ఫోన్ గుప్పిట్లోకి వచ్చింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్షాపింగ్, ఆన్లైన్ టూరిజం, ఆన్లైన్ గేమింగ్.. ఇలా ఒక్కటేమిటి ప్రతీది సెల్ఫోన్ ద్వారానే జరుగుతోంది. సెల్ఫోన్ ఎంత సౌకర్యంగా ఉందో, అప్రమత్తంగా లేకుంటే అదేస్థాయిలో మోసపోయే ప్రమాదమూ ఉంది. రోజుకో తీరులో సైబర్మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సెల్ఫోన్ లేకుంటే క్షణం కూడా గడవని ఈరోజుల్లో.. ఇదే సెల్ఫోన్ ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేనివారు. డబ్బు అత్యవసరం ఉన్నవారిని టార్గెట్ చేసుకొంటున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాదు విద్యావంతులు సైతం సైబర్గాళ్ల వలలో చిక్కుతున్నారు. కొద్దిరోజులుగా బాధితులు పోలీస్కు ఫిర్యాదు చేయడం అధికంగా అవుతోంది. అపరిచిత కాల్స్కు స్పందిస్తే.. అపరిచిత కాల్స్కు స్పందించినా, గుర్తుతెలియని లింక్స్ క్లిక్ చేసినా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్లే. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి. ఒకరు ఫోన్చేసి ఆధార్ అప్డేట్ చేయాలి.. లింక్ పంపిస్తున్నామంటూ ఖజానా ఖాళీ చేస్తారు. మరొకరు వీడియోకాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడించి న్యూడ్గా రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసి మరీ డబ్బులు గుంజుతారు. ఇంకొకరు ఓటీపీ అడిగి ముంచుతారు. ఇలాంటి సైబర్ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలాంటి నేరాల్లో కొన్నింటిపైనే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొందరు పరువు పోతుందనో, ఇరుగుపొరుగువారిలో చులకన అవుతామనే ఉద్దేశంతో మోసపోయామని తెలిసినా ఎవరికీ చెప్పకుండా లోలోపల మదనపడుతున్నారు. ఏపీకే ఫైళ్లు పంపి ఇలా.. ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) పైళ్లను వాట్సప్ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్చేసి ఓకే అని క్లిక్ చేసేవారి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. ఈ విషయం తెలియనివారు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా సొమ్ము పంపితే వెంటనే సైబర్ నేరగాళ్లు పిన్ నంబర్ తెలుసుకొని నిమిషాల్లో బాధితుడి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్ చేసిన ఫోన్ డివైస్ డిస్ప్లే సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీంతో నేరగాళ్లు ఆ ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. దీంతో తమకు తెలిసిన వ్యక్తి నుంచే మేసేజ్ వచ్చిందని భావించిన ఇతరులు ఆఏపీకే ఫైళ్లలింక్ను ఓపెన్ చేయటంతో ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ రివార్డ్స్, పెళ్లికార్డులు, బర్త్డే ఇన్విటేషన్ తదితర లింక్ల పేరిట పంపుతూ బ్యాంకు ఖాతాల నుంచి నగదు లాగేస్తున్నారు. జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్.. జాబబ్ పేరుతో ఆన్లైన్లో డబ్బులు పంపించమని చాలామందిని మోసం చేస్తున్నారు. ఇలాగే స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆన్లైన్లో లాభాలు చూపిస్తూ పెద్దమొత్తంలో పెట్టిబడి పెట్టిన తర్వాత చేతులెత్తేస్తున్నారు. కొందరికి ఓటీపీ పంపి దాన్ని చెప్పమని ఆ తర్వాత ఖాతా ఖాళీ చేస్తున్నారు. మీ ఆధార్కార్డ్ ద్వారా ఫ్రాడ్ జరిగిందని వెంటనే డిటేల్స్ చెప్పాలని ఒత్తిడి చేసి ఆ తర్వాత సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త పంథాలో ఆన్లైన్ మోసాలు చలాన్ల పేరుతో గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ ఓపెన్చేస్తే ఖాతాలోంచి మాయమవుతున్న డబ్బు బలవుతున్న సామాన్యులు, అమాయకులు రెండేళ్లలో జరిగిన సైబర్ మోసాలు ఏడాది ఫిర్యాదులు నష్టం(రూ.లలో) రికవరీ(రూ.లలో) 2024 1,406 3,91,20,408 11,02,566 2025 1,206 2,75,00,542 22,35,689 అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తతతోనే ఆన్లైన్మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రధానంగా ఏపీకే ఫైల్స్ పంపి వాటిని ఓపెన్ చేస్తే ఉన్న సొమ్మంతా మాయం చేస్తున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని లింక్లు పంపించి ఆ తర్వాత సొమ్ము రాబట్టి మోసం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీలాభాలు ఇస్తామని, లాభాలను ఆన్లైన్లోనే చూపించి పెద్దమొత్తంలో నొక్కేస్తున్నారు. దీనిపై పోలీసుశాఖ అవగాహన కల్పిస్తోంది. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా సమీప పోలీస్స్టేషన్లో సంప్రదించాలి. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
130 మంది మందుబాబులకు జరిమానా
● డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడ్డ యువత వేములవాడ: వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ పరిధి లో 14 రోజులుగా నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 130 మంది మందుబాబు లను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో 70 మంది ద్విచక వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.2వేలు, 30 మంది ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, 30 మంది టూవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ వేములవాడ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఠాణా ఆవరణలో వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేపించారు. అదుపుతప్పి బోల్తాపడిన ఆటో శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపా రు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆరుగురు ఆటోలో తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బంధువుల సంవత్సరికానికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలోని నలుగురు మహిళలకు గాయాలు కాగా మరో ఆటోలో చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. -
అంగన్వాడీల్లో ఆటపాటలతో బోధన
కొత్తపల్లి/రామడుగు: చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన మంచి విద్యాబోధన అందిస్తున్నట్లు, తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలను పంపించాలని కలక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీలో ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రీ స్కూల్ మేళా, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, గంగాధర ఐసీడీఎస్ అధికారి నర్సింగరాణి, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరి, సూపర్వైజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సాయం చేసే స్థాయికి ఎదగాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పట్టుదలతో చదివి పది మందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం ఎలగందుల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్యారియాన్ లెదర్ హౌస్ యజమాని హుస్సేన్, సూపర్వైజర్ మేడి నగేశ్ సహకారంతో శుక్రవారం ఏర్పాటు చేసిన బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలకు పంపిణీ చేసిన గోడ గడియారాల్లో సూచించిన 12 అంశాలను తెలిపే విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఈవో ఆనందం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫీజు పోరు
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8,700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. నిరసనలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విగ్నేష్, నగర కార్యదర్శి చిప్ప యోగేశ్, భామండ్ల నందు, జోనల్ ఇన్చార్జీలు ఆకాష్, హరీష్, ప్రశాంత్, సుధీర్ సింగ్, అశ్విని, అభినయ్, పావని, అక్షయ, అక్షిత, విష్ణు, నాగరాజు, స్ఫూర్తి, గాయత్రి, వంశీ, చరణ్ పాల్గొన్నారు. – కరీంనగర్ -
రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్స
కరీంనగర్టౌన్: నగరంలోని రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్తో కలిసి ఆపరేషన్ వివరాలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అజయ్ అనే బాలుడికి పుట్టినప్పటి నుంచి గుండెకు రంద్రం ఉందని తెలిపారు. ఆయాసం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గుండెదడ, బరువైన పనులు చేయలేక బాధపడుతున్నాడని వివరించారు. రెనే ఆస్పత్రికి వచ్చిన తర్వాత అతడికి మల్టీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ(ఎంఐసీఎస్) చేసినట్లు తెలిపారు. ఛాతి భాగంలో పూర్తిగా చీరకుండ, పక్కటెముకల మధ్యలో చిన్న గాటు పెట్టి ప్రత్యేకమైన పరికరం ద్వారా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. మెట్రో సిటీలకే పరిమితమైన ఈ ఆపరేషన్ కరీంనగర్లోని రెనే ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలుమార్పిడి శస్త్రచికిత్స వైద్యసేవలు తమ ఆస్పత్రిలో అక్టోబరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్డియాలజీ డాక్టర్ దినకర్, చిన్నపిల్లల గుండె వైద్యుడు రాజావిజయేందర్రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రాచారి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడి ఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్షాపు యజ మాని బ్లాక్లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓదెల: తహసీల్దార్తో గోడు వెల్లబోసుకుంటున్న రైతులుసిరిసిల్లలో యూరియా కోసం వచ్చిన తల్లీకూతుళ్లు పడిగె మణెమ్మ, రమ్య సిరిసిల్లలో క్యూలైన్లో కుటుంబ సభ్యులు ఓదెలలో తహసీల్ ఆఫీస్ ముట్టడి -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటకు చెందిన మెట్టు శ్రీనివాస్(50)సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శరీరం కుళ్లిపోయి, దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతుని కుటుంబసభ్యులు హైదరాబాద్లో ఉంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మిస్తుండడంతో శ్రీనివాస్ స్వగ్రామం గంభీరావుపేటలో ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యబోయినపల్లి (చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ముకుంద అనిల్ (22 ) ఏడాదిగా ఒంటరిగా ఉంటూ కిరాణషాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం ఇంట్లో ఇనుప పైపుకి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. పోక్సో కేసులో పదేళ్ల జైలు పెద్దపల్లిరూరల్: ఓ బాలికపై అఘాయిత్యం చేసిన కేసులో మందల రవికి పదేళ్ల కఠిన కారగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శుక్రవారం తీర్పునిచ్చారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. 2017 జనవరి 21న పాల పాకెట్ తీసుకొచ్చేందుకు ఇంటినుంచి వెళ్లిన తన కూతురు చాలాసేపటి వరకు ఇంటికి రాలేదు. ఎదురుగా వెళ్లిన ఆమెను ఇంటివద్ద దిగబెడతానని నమ్మించి రవి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీస్స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్హెచ్వో శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. పూర్వాపరాలపై విచారణ జరిపి వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో రవికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అలాగే లీగల్ సర్వీసెస్ అధారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. ఉరేసుకుని యువకుడు మృతివెల్గటూర్: నాలుగేళ్ల క్రితమే తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, అదే అనారోగ్యం కొడుకునూ బాధించింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి కడుపు కోత మిగిల్చాడు. ఈ సంఘటన వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంగ శరత్కుమార్(23) గ్రామంలో హార్వెస్టర్ నడిపిస్తుంటాడు. కొంతకాలంగా ఛాతినొప్పితో బాధపడుతున్నారు. పలుమార్లు హాస్పిటల్కు వెళ్లినా సమస్య తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో తల్లి రాజేశ్వరి గుండెలవిసేలా రోదించింది. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గంజాయి విక్రేతల రిమాండ్వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డిపే ట సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలో ని గర్జనపల్లికి చెందిన భరత్, దినేశ్ వీర్నపల్లిలో గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై వేముల లక్ష్మణ్ అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు. -
విద్యాకేంద్రంగా మంథని
● ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారం ● మంత్రి శ్రీధర్బాబుమంథని: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంథనిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. అలాగే మంత్రి క్యాంపు కార్యాలయంలో 205 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. పార్చూన్ రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80 మంది పేద విద్యార్థులకు రూ.15 వేల విలువ చేసే పుస్తకాలు, ఇతర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన విద్య అందాలని టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి ఆస్కారం లేదని, లంచం ఇస్తే వారి ఇళ్లు రద్దు చేసి, తీసుకున్న వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో పిల్లలకు మొరుగైనన బోధన అందించేందుకు సహకరిస్తున్న సంస్థకు కలెక్టర్ కోయ శ్రీహర్శ అభినందనలు తెలిపారు. ప్రేవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే తమవంతు సాయం అందిస్తున్నట్లు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఫౌండర్ ప్రముఖ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 51 తరగతి గదుల్లో డిజిటల్ సౌకర్యాలు కల్పించామన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, డీఈవో మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, ఆర్డీవో సురేశ్ తదితరులు ఉన్నారు. -
ఒగ్గు కళాకారుడి మృతి
హుజూరాబాద్రూరల్: మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు చెవుల రాజు(40) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఇంటి వద్ద రాజుకు ఒకసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు 108అంబులెన్స్లో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. గత 15 ఏళ్లుగా రాజు ఒగ్గు కథలకు ప్రాణం పోశాడని, ఆయన కళా ప్రదర్శనలతో ఈ ప్రాంతంలో గొప్ప గుర్తింపు పొందారని పలువురు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం గోధూర్కు చెందిన బూరం దేవదాస్ (50) ఎలకల మందు తాగి చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. దేవదాస్ రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి వచ్చాడు. తిరిగి వెళ్తానని ఇంట్లో చెప్పగా.. పిల్లలకు పెళ్లికాలేదని, వారి పెళ్లి అయ్యాక వెళ్లాలని భార్య రాజమణి వారించింది. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన దేవదాస్ ఈనెల 9న ఎలుకల నివారణ మందు తాగాడు. కుటుంబసభ్యులు చికిత్సనిమిత్తం మెట్పల్లికి.. అక్కడి నుంచి నిజామాబాద్ తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన వంగ స్వరూప(47) ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. వంగ మల్లయ్య–స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం కాగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కూతుర్ల పెళ్లికి అప్పులు అయ్యాయి. ఆరునెలల క్రితం మల్లయ్య తాటిచెట్టు పై నుంచి ప్రమాదవశాస్తు కింద పడగా గాయాలు కావడంతో పని చేసే స్థితిలో లేడు. దీంతో స్వరూప అప్పులు ఎలా తీర్చాలని మానసికంగా కృంగిపోయేది. ఈ క్రమంలో ఈ నెల 8న పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొంతుదూ గురువారం మృతిచెందింది. మృతురాలి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మంచంపైనుంచి పడి వ్యక్తి..జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ దుకాణం వాచ్మన్గా పనిచేస్తున్న ఎండీ.సాహెబ్ హుస్సేన్ (69) ఈనెల 7న మంచంపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సాహెబ్ హుస్సేన్ వాచ్మన్గా పనిచేస్తున్నాడు. మంచంపై నుంచి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే షాపు యజమాని జగిత్యాల ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. హుస్సేన్ కుమారుడు మొయినోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
సాగు భిన్నం.. ఆదాయం ఘనం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయాధారిత జిల్లా. ఇక్కడి రైతులు ఆదాయం రాని పంటలను ఎప్పటికప్పుడు తొలగించి ఆదాయం సమకూర్చే పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మామిడి పెట్టింది పేరుగా ఉన్న జిల్లా రైతులు.. కొత్త పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. నాలుగైదేళ్లుగా మామిడిలో సరైన దిగుబడి రాకపోవడంతో మూడేళ్లలోనే ఆదాయం వచ్చే.. కాగితం తయారీకి ఉపయోగించే నీలగిరి, సుబాబుల్, సరుగుడు మొక్కలను పెంచుతున్నారు. కొందరు రైతులు ఏక పంటగా సాగు చేస్తుండగా.. మరికొందరు అంతరపంటగా పామాయిల్ సాగు చేస్తున్నారు. ● రైతులను ప్రోత్సహించాలని.. జిల్లాకు సమీపంలోనే సిర్పూర్కాగజ్నగర్లో పేపర్ మిల్లు ఉంది. ఆ మిల్లు నుంచి రోజుకు 400 టన్నుల పేపర్ బయటకు వస్తుంది. దీనికి రోజుకు వెయ్యి టన్నులు (దాదాపు 60 నుంచి 70 లారీలు) కర్ర అవసరం. పొరుగు రాష్ట్రాల నుండి 50లారీల వరకు కర్ర వస్తే.. రాష్ట్రం నుంచి కేవలం 10 నుంచి 15 లారీల కర్ర మాత్రమే వస్తోంది. పేపర్ మిల్లు రవాణా భారాన్ని తగ్గించుకోవడంతోపాటు గ్రామాల్లోనూ పేపర్ తయారీకి ఉపయోగించే కర్రను సాగు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఒక్కో మొక్క ఖరీదు రూ.11 ఉంటే రైతులకు సరుగుడు మొక్కను రూ.4, నీలగిరి రూ.4.50, సుబాబుల్ రూ.మూడు చొప్పున అందిస్తున్నారు. ● కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్న రైతులు నీలగిరి, సుబాబుల్, సరుగుడు మొక్కలను పెంచే రైతులు సిర్పూర్ కాగజ్నగర్లోని పేపర్ మిల్లుతో రేటు ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ.5వేలు (కంపెనీ కటింగ్ చేస్తే), రూ.7 వేలు(కటింగ్ చేసుకుని తీసుకెళ్తే) చెల్లిస్తున్నారు. మొక్క నాటిన మూడేళ్ల తర్వాత చెట్లను కట్ చేస్తామని, ఆ సమయంలో ధర ఎంతుంటే అంత చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. కంపెనీ రేటు నచ్చకపోతే ఇతరులకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. మూడేళ్ల పాటు సర్వీస్ ఇచ్చినందుకు.. సబ్సిడీపై మొక్కలు సరఫరా చేసినందుకు కొంత సర్వీస్ చార్జీ వసూలు చేస్తారు. ● జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు జిల్లాలో ఎక్కువగా సరుగుడు మొక్కలను సాగు చేస్తున్నారు. మేడిపల్లి మండలం కట్లకుంట, తొంబరావుపేట, పోరుమల్ల, సారంగాపూర్, బీర్పూర్, మల్లాపూర్ వంటి గోదావరి తీర ప్రాంత రైతులు ఎక్కువగా ముందుకొస్తున్నారు. ఒక్కోచెట్టు 20 నుంచి 30 ఫీట్లు పెరగడమే కాకుండా.. ఎకరాకు 50 నుంచి 60 టన్నుల కర్ర వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరుగుడు చెట్లను మూడేళ్ల తర్వాత కటింగ్ చేసుకుని ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. నీలగిరి, సుబాబుల్ ఒక్కసారి నాటితే 3 నుంచి 4 సార్లు కటింగ్ వస్తుంది. వీటికి ఎలాంటి ఎరువులూ వేయాల్సిన అవసరం లేదు. పైగా నీరు పెద్దగా అవసరం ఉండదు. జగిత్యాల జిల్లాలో నీలగిరి, సరుగుడు, సుబాబుల్ సాగు జిల్లాలో వెయ్యి ఎకరాల్లో .. పేపర్ మిల్లుతో ఒప్పందాలు -
కోతిని తప్పించబోయి..
● అదుపు తప్పిన ద్విచక్రవాహనం ● అక్కడికక్కడే ఐకేపీ సీసీ దుర్మరణం పెగడపల్లి: కోతి అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడి ఐకేపీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన పెగడపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. పెగడపల్లి ఐకేపీ (సెర్ప్)లో మండలంలోని నామాపూర్కు చెందిన కొత్తూరి రవికుమార్(53) సీసీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా నందగిరి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కోతి అడ్డు రావడంతో బైక్ అదుపు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రవికుమార్కు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన గుండేటి మల్లేశం (43) గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాలు.. మల్లేశం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇంటి వద్ద ఉన్న పాడిపశువు కోసం పచ్చిగడ్డి కోసేందుకు గ్రామ శివారులోని బత్తుల రాజమల్లయ్య పొలం వద్దకు వెళ్లాడు. పొలం గెట్లపై గడ్డి కోస్తుండగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పచ్చిగడ్డి ఎక్కువగా కనిపించడంతో మల్లేశం బావి ఒడ్డున గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రామగుండం: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 6న గోదావరిఖని వంతెనపై విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు రామగుండం అక్బర్నగర్కు చెందిన నారకట్ల రాజేశ్(25) నదిలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, యువకుడి మృతదేహాన్ని బుధవారం రాత్రి చెన్నూర్ సమీపంలోని సోమనపల్లి గోదావరినది ఒడ్డున పోలీసులు గుర్తించారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడంతో కొన్ని ఆనవాళ్ల ఆధారంగా గుర్తించారు. గురువారం కుటుంబసభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ సమయంలో మృతుడి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ‘కొడుకా నీవు మాకు చెప్పకుండానే గంగమ్మ ఒడికి చేరినవా.. మేమిద్దరం ఎవరి కోసం బతకాలిరా’ అంటూ గుండెలు బాధుకుంటూ రోదించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
రామడుగు: రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసిరాకపోవడంతో అప్పుల పాలై కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన బత్తిని తిరుపతిగౌడ్ (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మోతె గ్రామానికి చెందిన బత్తిని తిరుపతిగౌడ్ భార్య మనోజాతో కలిసి కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి అప్పులపాలయ్యాడు. అప్పు ఎలా తీర్చాలని మదనపడుతుండేవాడు. గురువారం మోతెలోని ఇంటికి వెళ్లి వస్తానని భార్యతో చెప్పి వెళ్లాడు. కాసేపటికి మనోజా ఫోన్చేస్తే స్పందించలేదు. ఇంటి పక్కనుండే మెరుగు శంకరయ్యకు ఫోన్ చేసి వెళ్లి చూడమని కోరింది. అతను వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాడు. పగులగొట్టి చూడగా.. పురుగుల మందుతాగి, ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. మనోజా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రాజు తెలిపారు.చైన్స్నాచింగ్ దొంగల కోసం గాలింపుజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన గొల్లపల్లి వెంకమ్మ మెడలోంచి బుధవారం గుర్తుతెలియని దొంగలు బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెల్సిందే. నిందితుల చిత్రాలు సీసీపుటేజీల్లో రికార్డు కావడంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. -
కరెంట్ కనెక్షన్ పేరిట నిలువు దోపిడీ
● మూడేళ్లుగా రైతుల నుంచి డబ్బులు వసూలు ● కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకం ● విచారణ చేపట్టిన అధికారులు వెల్గటూర్: వ్యవసాయ మోటార్లకు కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తానని చెప్పి వెల్గటూర్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి రూ.లక్షల్లో దోచుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జగదేవుపేటకు చెందిన నరేశ్ కాంట్రాక్టు పద్ధతిన అన్మ్యాన్డ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గ్రామంలోని రైతుల వ్యవసాయానికి కనెక్షన్ కోసం డీడీలు అవసరమైన సమయంలో వారిని ఏమార్చి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. దీనిపై ఇటీవల కొందరు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు పంచాయితీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకోవడంలేదని, మండల స్థాయి అధికారుల అండతోనే ఈ అక్రమాలు చేశాడని రైతులు ఆరోపించారు. ఏఎల్ఎం, జేఎల్ఎం, లైన్మన్ అన్నీతానై రైతులను బెదిరిస్తున్నాడని, రైతులెవరైనా ఫిర్యాదు చేస్తే వారి కనెక్షన్ కట్ చేసేవాడని రైతులు అధికారులకు వివరించారు. ఈ విషయమై వెల్గటూర్ ఏఈని వివరణ కోరగా.. తమ గ్రామస్తుడే కావడంతో రైతులు ఆయనకే డబ్బులు ఇచ్చారని, తాను రైతులకు అవగాహన కల్పించినా వినలేదని, డబ్బుల విషయాన్ని ఎప్పుడూ తన దృష్టికి తీసుకురాలేదని అన్నారు. ఇంత పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని తెలిసి తానూ ఆశ్చర్యపోయానని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని, నరేశ్పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
ఉపాధి కూలీలకు కేవైసీ
● యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియ ● పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక కరీంనగర్రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూలీలు తమ ఆధార్కార్డులను జాబ్కార్డులతో కేవైసీ చేసుకుంటేనే అక్టోబరు 1నుంచి ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం నుంచి గ్రామాల్లో కూలీల కేవైసీ ప్రక్రియను ఉపాధిహామీ అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2,59,795 ఉపాధిహామీ జాబ్కార్డులుండగా పనిచేసే కూలీలు 1,25,710 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్ఆర్ఈజీఏస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను ప్రవేశపెట్టింది. ఉపాధికూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను నమోదు చేసి కూలీ ముఖగుర్తింపు ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో కూలీలు తమ ఆధార్, జాబ్కార్డులతో ఉపాధిహామీ సిబ్బందిని కలిస్తే ఈకేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్కార్డును కూలీలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని కూలీలకు పనికల్పించడం ఇకనుంచి వీలుకాదు. కూలీలకు ఈకేవైసీ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కేవైసీ తప్పనిసరి ఉపాధిహామీ కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. – శ్రీధర్, డీఆర్డీవో, కరీంనగర్ -
దోస్త్..లాస్ట్ చాన్స్
సప్తగిరికాలనీ(కరీంనగర్): డిగ్రీలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించింది. చివరి విడతగా గురువారం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటివరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. స్పాట్లో అన్ని కళాశాలలకు అవకాశం కల్పించారు. దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను ఆయా కళాశాలలు నేడు నోటీస్ బోర్డులో ఉంచనున్నారు. ఏయే కోర్సుల్లో ఖాళీలున్నాయో పొందుపర్చనున్నారు. దోస్ట్ పోర్టల్లో కూడా ఖాళీలు పొందపర్చనున్నట్లు సమాచారం. 15, 16న అడ్మిషన్స్ దోస్త్ చివరి అవకాశంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్ట్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వచ్చిన రిజిస్ట్రేషన్ ఫాంను కళాశాలలో చూపించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ లోకల్ విద్యార్థులకు ఈనెల 15, 16తేదీల్లో జరుగనుంది. అదే విధంగా స్పాట్ అడ్మిషన్లో భర్తీ కానీ సీట్లకు ఈనెల 18, 19 తేదీల్లో వన్ టైం స్పెషల్ స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందొచ్చు. ఇదే తేదీల్లో నాన్ లోకల్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అవకాశం ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందించాల్సిన సర్టిఫికెట్లు.. ఒరిజినల్ ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, టీసీ, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, నివాసం, బ్రిడ్జి కోర్సు సర్టిఫికెట్ (వర్తించు విద్యార్థులకు) సర్టిఫికెట్లతో దోస్త్ పోర్టల్లో చేసుకున్న రిజిస్ట్రేషన్తో పాటు జిరాక్స్ కాపీలను కళాశాలలో అందించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో దోస్త్ అధికారులు కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సుల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. నో రీయిబర్స్మెంట్.. స్పాట్ అడ్మిషన్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఫీజు రీయిబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఏటా కళాశాల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ ప్రవేశాల కోసం చివరి విడతగా షెడ్యూల్ విడుదల 15, 16న అడ్మిషన్లు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు చివరి అవకాశం. అడ్మిషన్ తీసుకోని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. – డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ -
రెండెకరాల్లో సరుగుడు
నేను రెండెకరాల్లో సరుగుడు మొక్కలు నాటాను. మా ఊరిలో 30ఎకరాల వరకు ఈ మొక్కలే నాటారు. పేపర్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇతర పంటలతో పోల్చితే ఎలాంటి కష్టమూ లేకుండా సరుగుడుతో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – సురకంటి సతీశ్, తొంబరావుపేట, మేడిపల్లి(మం) ఇతర పంటలను సాగుచేస్తే ఖర్చు ఎక్కువ. ఆదాయం కూడా తక్కువగా వస్తుంది. నేను మూడు ఎకరాల్లో సరుగుడు సాగు చేస్తున్నాను. కొద్దిరోజుల్లో కటింగ్కు రానుంది. ఈ పంటకు కూలీల బెడద లేదు. కోతుల ఇబ్బంది లేదు. ఆదాయం మిగులే. – బోడ మల్లారెడ్డి, పోరుమల్ల, మేడిపల్లి(మం) పేపర్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా ఉన్న రైతులకు ప్రోత్సాహకాలతో పాటు ఏ రేటు చెల్లిస్తామనేది ముందే రైతులకు చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నాం. జిల్లా రైతులు ఏక పంటగా, అంతరపంటగా సాగు చేస్తున్నారు. – సతీశ్, పీల్డ్ ఆఫీసర్ -
స్మృతివనం ఏర్పాటు చేయాలి
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కరీంనగర్: తెలంగా ణ రైతాంగ సాయు ధ పోరాటంలో అ సువులు బాసిన అ మరవీరుల కోసం హైదరాబాద్లో స్మృతివనం ఏర్పా టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశాడు. ఈనెల 11 నుంచి 17వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. కోతిరాంపూర్ బైపాస్లోని బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. బైక్ర్యాలీతో మార్కెట్ రోడ్డులో ఉన్న అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేశారు. బీజేపీ నేతలు తెలంగాణ విమోచన దినమంటూ, కాంగ్రెస్ వాళ్లు సమైఖ్యత దినోత్సవమంటూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అది ముమ్మాటికీ తెలంగాణ విలీన దినోత్సవమేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవా లను జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పోనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్య డ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య తదితరు లు పాల్గొన్నారు. -
దాబా క్లోజ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలో వివాదాస్పదంగా మారిన మల్టీపర్పస్ పార్క్లోని దాబా ఎట్టకేలకు మూతపడింది. మూడ్రోజులుగా జరుగుతున్న నాటకీయపరిణామాల నడుమ నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. ‘గలీజు దందా’ పేరిట ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో మల్టీపర్పస్పార్క్లో లీజు ఒప్పంద ఉల్లంఘనలపై ఎస్ఈ రాజ్కుమార్ నేతత్వంలోని కమిటీ విచారణ పూర్తి చేసి గురువారం కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి రిపోర్ట్ అందించారు. లీజు ఒప్పందాన్ని మీరి టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచడం, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం, వాకింగ్ ట్రాక్ను దుర్వినియోగం చేయడంతో పాటు అనుమతి లేకుండా దాబాను ప్రారంభించడం లాంటి ఉల్లంఘనలు జరిగాయని కమిటీ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నివేదిక ఆధారంగా నిర్వాహకులకు బల్దియా నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరోసారి లీజు ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే లీజు ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు నిర్వాహకులకు సంకేతాలు పంపించారు. లీజు ఒప్పందం మేరకు క్యాంటిన్ను నడిపించుకోవడానికి అంగీకరించిన అధికారులు, దాబా జోలికి వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆగని అమృత్ భారత్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దేశంలోని వలస కూలీలను మాతృభూమికి చేర్చేందుకు ప్రవేశపెట్టిన రైలు అమత్ భారత్ ఎక్స్ప్రెస్. దేశంలో నలుమూలలా పనిచేస్తున్న కూలీలను తక్కువ ఖర్చుతో స్వస్థలాకు చేరుస్తుంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా నడిపించే ఈరోడ్– జోగ్భనీ 16601/02 అమృత్ భారత్ రైలుకు స్థానికంగా ఎక్కడా స్టాప్ దక్కలేదు. ముందున్న వరంగల్, పొరుగున ఉన్న మంచిర్యాలలో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం గమనార్హం. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరాధి కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది. త్వరలో సేవలు ప్రారంభం ప్రస్తుతం బిహార్లో ఎన్నికల దష్ట్యా ఆ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇప్పటి వరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్రైళ్లను ప్రవేశ పెట్టింది. అందులో అతి త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా బిహార్లోని జోగ్భనీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వరకు 16601/02 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం మీదుగా ప్రవేశ పెట్టబోయే తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇదే. ఇటీవల వెలువడిన రైలు షెడ్యూల్లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడం స్థానిక, వలస కార్మికులను ఎంతో నిరాశ పరిచింది. హాల్టింగ్ ఇవ్వాలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్లోనే హాల్టింగ్ ఇచ్చారు. జోగ్భని నుంచి నేపాల్ సరిహద్దు కేవలం 10 కిలోమీటర్ల దూరమే. ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు నెలల్లో పెద్దపల్లి జంక్షన్ మీదుగా ప్రారంభించిన మూడు రైళ్లకు స్టాప్ కల్పించలేదు. – ఫణి, నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం -
యూరియా కొరతకు కేంద్రమే కారణం
సైదాపూర్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. యూరియా తయారీ, రాష్ట్రాలకు పంపిణీ చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే అన్నారు. గురువారం జిల్లాలోని సైదాపూర్ మండలంలో పర్యటించారు. నల్లరామయ్యపల్లి, ఎగ్లాస్పూర్లో గ్రామ పంచాయతీ భవనం, ఆకునూర్, వెంకటేశ్వర్లపల్లి, బూడిదపల్లిలో ఓపెన్జిమ్లను ప్రారంభించారు. ఆకునూర్ కేజీబీవీ పాఠశాలలో డార్మెంటరీ హాల్, డ్రైనేజీ, బూడిదపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నల్లరామయ్యపల్లి, ఆకునూర్, బూడిదపల్లిలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రాని చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండికూడా తెలంగాణకు యూరియా కొరత లేకుండా చూడడం లేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యూరియా కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది లంచం ఇవ్వందే ఏ పని చేయడంలేదని, ఆర్ఐ సతీశ్ డబ్బులు ఇవ్వకుంటే ఏ పని చేయడం లేదని బొమ్మకల్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్వింటాల్ పత్తి రూ. 7,450
క్వింటాల్ పత్తి రూ. 7,450జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.క్యూలో చెప్పులు.. అవే తిప్పలుగన్నేరువరం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇన్నాళ్లు సొసైటీల ద్వారా యూరియా పంపిణీ చేసిన అధికారులు గురువారం రైతు వేదికల నుంచి అందించారు. అయినా అవస్థలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టారు. కాసింపేట రైతు వేదికలో కాసింపేట, పారువెల్ల మైలారం సాంబయ్యపల్లి రైతులకు 230 బస్తాలు, మాదా పూర్ రైతువేదికలో మాదాపూర్, హన్మాజిపల్లి, గోపాల్పూర్ రైతులకు 230 బస్తాల చొప్పున అందించారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేపట్టారు. కాగా.. కాసింపేటకు చెందిన బండి శ్రీనివాస్ గౌడ్, బండి ఎల్లవ్వకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు శివారులో వ్యవసా య భూమి ఉంది. ఆధార్ కార్డు కాసింపేటలో ఉంది. ఆధార్ కార్డు ఇక్కడ, భూమి అక్కడ ఉండడంతో యూరియా ఇవ్వడం లేదని అన్నారు.ఇన్చార్జి డీఈవోగా శ్రీరాం మొండయ్యకరీంనగర్: ఇన్చార్జి డీఈ వోగా డైట్ ప్రిన్సి పాల్ శ్రీరాం మొండయ్యను నియమిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో చైతన్యజైనీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఎల్ఎండీ కాలనీలోని డైట్ ప్రిన్సిపాల్ శ్రీరాం మొండయ్యను ఇన్చార్జిగా నియమించారు.ఉద్యోగ సంఘాల గుర్తింపు రాష్ట్ర జేఏసీ విజయంకరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 185 ద్వారా సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పునఃసంస్థాపించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక టీఎన్జీవో భవన్లో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తూ, సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఈ విజయం సాధించడంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్, ముజీబ్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. నాయకులు మడిపల్లి కాళీచరణ్, అరవింద్ రెడ్డి, సంగెం లక్ష్మణరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి హర్షం వ్యక్తం చేశారు. -
రిలీవింగ్ ఆర్డర్ కోసం నిరీక్షణ
కరీంనగర్ అర్బన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉంది జీపీవోల పరిస్థితి. ఈ నెల 5న గ్రామ పాలన అధికారు(జీపీవో)లను ని యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియామకపత్రాలిచ్చిన విషయం విదితమే. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాల్సిన జీపీవోలు మునుపటిశాఖలు(మునిసిపల్, మిషన్ భగీరథ) రిలీవింగ్ అర్డర్ ఇవ్వకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తవగా పోస్టింగ్ ఇచ్చారు. రిలీవింగ్ అర్డర్ అందకపోవడంతో నాలుగు రోజులైనా విధుల్లో చేరలేదు. ఇతర నియోజకవర్గాల్లో నియామకం జిల్లాలో 187మంది జీపీవోలను నియమించారు. 210 రెవెన్యూ గ్రామాలుండగా 255 క్లస్టర్లు అవసరమని అధికారులు నివేదించారు. ఈ నెల 8న కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కౌన్సెలింగ్ నిర్వహించగా నిబంధనల క్రమంలో పోస్టింగ్ కల్పించారు. దివ్యాంగులు, వితంతువులు, స్పౌజ్ కేసులకు మొదటి ప్రాధాన్యతనివ్వగా తదుపరి ర్యాంకు వారీగా ఆప్షన్లు తీసుకోగా సొంత మండలం, నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గంలో పోస్టింగ్ కల్పించారు. 145 వాస్తవ క్లస్టర్లు కాగా 255 క్లస్టర్లు రికై ్వర్మెంట్గా చూపారు. అయిదేళ్ల నిరీక్షణకు తెర 2020 సెప్టెంబర్లో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో సదరు ఉద్యోగులను జిల్లాలో సర్దుబాటు చేయగా మిగిలిన వారికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్ కల్పించారు. 18మంది సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబానికి దూరమై భూపాలపల్లి, హన్మకొండ, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా సొంత జిల్లాకు రావడం అందని ద్రాక్షగా మారింది. ఈ క్రమంలో జీపీవోల నియామకం వారిలో సంతోషాన్ని నింపింది. రిలీవింగ్ అర్డర్ త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జిల్లాలో మొత్తం గ్రామాలు: 318 రెవెన్యూ డివిజన్లు: 02(కరీంనగర్, హుజురాబాద్) రెవెన్యూ క్లస్టర్లు: 255, రెవెన్యూ గ్రామాలు: 210, జీపీవోలు: 187 -
మెటా నిందితుల అరెస్టు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్ యాప్ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్గడ్డకు చెందిన పుప్పాల శ్రీకర్ తనను మెటా ఫండ్ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్, దాసరి రాజుపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్, సతీశ్ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్ థాయ్లాండ్లో తలదాచుకుంటుండగా, సతీశ్ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం.దుబాయ్లో ఆస్తులుమెటా ఫండ్ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ జాహిద్ రోడ్లో ఈ ఏడాది జనవరిలో పబ్ ప్రారంభించారు. వీరి బినామీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా పరి స్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువురి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు.మెటాలో మరో కేసుమెటా వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సూత్రదారుల్లో ఒకరిగా భావిస్తున్న సతీశ్ పై గురువారం కేసు నమోదు అయ్యింది. అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి తమను రూ.11 లక్షల వరకు మోసం చేసాడని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సదరు వ్యక్తిని రెండు రోజుల్లో అరెస్టు చేస్తారని సమాచారం.సీపీకి లీగల్ నోటీసులు, సీఐలకు దమ్కీలుమెటా నిర్వాహకుల్లో కొందరు పాత నేరస్తులు కావడంతో పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. భారీగా లంచాలు ఎరవేసి ఇంతకాలం తమపై కేసులు కాకుండా జాగ్రత్త పడ్డారు. పైగా ఫిర్యాదుదారులనే పోలీసుల చేత బెదిరింపులకు గురిచేయించారు. కరీంనగర్ సీపీకి సైతం లీగల్ నోటీసులు పంపారు. తమపై ఫిర్యాదు చేసిన వారిపై కోర్టులో ప్రైవేటు కేసు నడిపిస్తున్నారు. వీరు అంతటితో ఆగలేదు. తమ యాప్లో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐలు డబ్బులు అడుగుతుంటే దమ్కీలు ఇస్తుండటం గమనార్హం. విదేశీ యాత్ర సమయంలో మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని, విదేశాల్లో మీరు రహస్యంగా దేశ విద్రోహ శక్తులతో సమావేశం అయ్యారని, వ్యభిచారం చేసి డిపార్ట్మెంట్ రహస్యాలు అమ్ముకున్నారని, కోర్టుల్లో ప్రైవేటు కేసు వేసి ఉద్యోగాలు పోగొడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.కోట్లాది డబ్బు విదేశాలకు తరలిపోయిన నేపథ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేస్తేనే వీరి ఆస్తుల చిట్టాలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. -
పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి
గోదావరిఖని: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయ డం అన్యాయం. ఎవరో అన్నది రాస్తే.. దాన్ని పత్రికకు ఆపాదించి ఎడిటర్పై కేసు పెట్టడం సరికాదు.ఏపీలో మీడియాను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ఏపీలో పత్రికా స్వేచ్ఛపై దాడిచేసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. సాక్షి ఎడిటర్ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం. పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏదైన తప్పు ఉంటే వివరణ కోరాలే తప్ప ఇలా అక్రమ కేసులు పెట్టి బెదిరించడం సరికాదు. – కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి నిరంకుశత్వమే..సాక్షి పత్రికలో వచ్చిన వార్తల విషయంలో ఎడిటర్పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. రాజకీయ నాయకుల విమర్శలను ప్రచురిస్తే కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సుడా చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపేఅన్ని పత్రికలమాదిరిగానే సాక్షిలో అమరావతి పేరిట పొన్నూరును ముంచేశారనే వార్త వచ్చింది. దీనిపై పోలీసులు సాక్షి ఎడిటర్పై కేసు పెట్టడం ఏంటి?కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రచురించిన వార్తలపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వాలు ఖండించడం, రిజాయిండర్లు జారీ చేసే వీలుంది. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్ప్రజాస్వామ్యానికి మచ్చసాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం వ్యతిరేఖ వార్తలు రాసారన్న కారణంతో ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే పత్రికల గొంతు నొక్కడం అన్యాయం. ప్రెస్ మీట్ వార్త ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటు. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయా రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ప్రతికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
పార్క్పై బల్దియా విచారణ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలో వివాదాస్పదంగా మారిన మల్ట్టీపర్పస్ పార్క్ గలీజు దందాపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ వేణు, ఏఈ సతీష్, టీపీబీవో నవీన్ల బృందం బుధవారం పార్క్ను సందర్శించింది. నగరపాలక సంస్థతో కుదుర్చుకున్న లీజు ఒప్పంద ఉల్లంఘనపై అధికారులు దృష్టిపెట్టారు. పార్క్లో టికెట్ ధరలు, వాకింగ్ ట్రాక్ దుర్వినియోగం, దాబాను ప్రారంభించడం లాంటి అంశాలు పరిశీలించారు. కాగా.. లీజు ఒప్పందం మేరకు పార్క్లోకి ప్రవేశ రుసుం రూ.20 ఉండగా, నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వీకెండ్స్లో రూ.50 వసూలు చేస్తుండడం తెలి సిందే. అయితే రూ.50 టికెట్లకు సంబంధించిన బుక్లు ఎక్కడా అధికారులకు దొరకకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం. కాగా... పార్క్లో వి చారణ చేపట్టిన అధికారుల బృందం గురువారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి నివేదిక అందించనుంది. ఆ నివేదిక ఆధారంగా కమిషనర్ చర్యలు తీసుకోనున్నారు. దాబా...కంటిన్యూ మల్ట్టీపర్పస్ పార్క్లో లీజు ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకుల తీరుపై సర్వత్రా విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. వారి తీరులో మాత్రం ఇసుమంత మార్పుకూడా కనిపించడం లేదు. అధికారులు నోటీసులు ఇస్తున్నా.. విచారణచేపడుతున్నా...మరో వైపు మాత్రం నిర్వాహకులు దాబాను కొనసాగించడం వారి లెక్కలేనితనాన్ని తెలియజేస్తోంది. విచారణ, నోటీసులతో అయ్యేదేమీ లేదని, షరామామూలుగానే దాబా నడిపించడమేననే ధీమా వారిలో ఉంది. మరి నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు ఏంచేస్తారో వేచి చూడాలి.గలీజ్ దందా పార్ట్– 3 -
కవి సామ్రాట్ విశ్వనాథ సాహిత్యం విలక్షణమైంది
కరీంనగర్కల్చరల్/సప్తగిరికాలనీ: తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సాహిత్యం విలక్షణమైందని సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణరావు అన్నారు. బుధవారం ఎస్సారార్ కళాశాల, కరీంనగర్ పద్య కవితా సదస్సు ఆధ్వర్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సభలో మాట్లాడారు. ఏకవీర లాంటి ఎన్నో నవలలు, నర్తనశాల వంటి ఎన్నో నాటకాలు, విమర్శ గ్రంథాలను విశ్వనాథ సత్యనారాయణ రాశారని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో రామక విఠల్శర్మ, గాజుల రవీందర్, బూర్ల చంద్ర శేఖర్, నీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
కరీంనగర్: ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలతో పాటు కస్తూరిబాగాంధీ విద్యాలయాలు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు కంపోజిట్ స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంట్ మంజూరు చేశారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, స్వచ్ఛత, ఇతరత్రా పనులకు నిధులు వినియోగించుకునేందుకు అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లో త్వరలో జమకానున్నాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానంతో ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నిధులను సద్వినియోగం చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ)లను సమర్పించాలి. నిధుల వినియోగంపై ఆడిట్ ఉంటుంది. ఇలా ఖర్చు పెట్టాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు సంయుక్తంగా వారి పేరున ఉన్న జాయింట్ ఖాతాలో నిధులు జమవుతాయి. కమిటీ తీర్మానం మేరకు చాక్పీస్లు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు తదితర స్టేషనరీ సామగ్రి, పరీక్షల నిర్వహణ, జాతీయ పండగల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, కేయాన్, టీవీ మరమ్మతులు, కొనుగోలు, కేబుల్, ఇంటర్నెట్ చార్జీలు, డిజిటల్ తరగతుల నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాలల పరికరాల కొనుగోలు, పాఠశాల భవనాల చిన్నచిన్న మరమ్మతులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల్లో 10 శాతం పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమానికి విధిగా ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ నిమిత్తం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ఈ నిధులు విడుదల చేస్తారు. గతంలో ఎన్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ నిధులు వేర్వేరుగా వచ్చేవి. ఈ రెండింటినీ కలిపి సమగ్రశిక్షగా మార్చి విలీనం చేశారు. సమగ్ర శిక్ష నుంచే నిధులు కేటాయిస్తున్నారు. 1–30 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 31–100 మందికి రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మందికి రూ.75 వేలు, వెయ్యికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష నిధులు మంజూరు చేశారు. వీటిలో తొలివిడతగా 50 శాతం నిధులు విడుదల చేస్తూ అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. కాగా, కొన్ని నెలలుగా పాఠశాలల ఆవరణ శుభ్రం చేయించడం, శానిటైజేషన్, ఇతర వాటికి గతంలో ఇచ్చిన నిధులు సరిపోక కొందరు ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేశారు. ఎట్టకేలకు స్కూల్ గ్రాంట్ నిర్వహణ నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కనీస వసతుల కల్పన, స్వచ్ఛతపై దృష్టి అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానాలతో వినియోగం ఉమ్మడి జిల్లాకు రూ.5.32 కోట్లు జిల్లాల వారీగా విడుదలైన నిధులు జిల్లా పాఠశాలలు నిధులు కరీంనగర్ 542 1,25,95,000 జగిత్యాల 677 1,81,75,000 పెద్దపల్లి 450 1,03,01000 రాజన్నసిరిసిల్ల 446 1,22,02000 మొత్తం 2,115 5,32,73,000 -
బతుకమ్మ చీరలొస్తున్నాయ్
కరీంనగర్ అర్బన్: బతుకమ్మ పండుగకు చీరలొస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయగా.. ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపట్టగా.. గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తా జాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అతి వలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కనుల విందే. ఉదయం వేళలో పూలు తేవడం.. బొడ్డెమ్మలను పేర్చడం.. సాయంత్రం వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాలోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే.. బతుకమ్మకు అత్యంత ప్రా ధాన్యమిస్తూ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది.వివిధ రకాల డిజైన్లుగతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.500కు పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జోడించారు. బంగారు, వెండి జరి అంచు చీరలు, చెక్స్ డిజైన్లు ఈసారి ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు. అయితే చీరల పంపిణీ ఎపుడన్నది ఇంకా సందిగ్ధమే. ఈనెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కానుండగా.. వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈనెల మూడో వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా.. ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉంది.నేడో, రేపో రానున్న చీరలుగతంలో రెవెన్యూ డివిజన్లవారీగా చీరలను వేరు చేసి మండలాలవారీగా సరఫరా చేయగా.. అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారివారి జాబితా ప్రకారం చీరలను తీసుకొని పంపిణీ చేశారు. 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేశాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రత కార్డులో పేరుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు గతంలో చీరలను పంపిణీ చే యగా.. జిల్లాలో 2.72లక్షల కార్డుదారులకు అందజేశారు. గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపి ణీ జరగగా.. తాజాగా జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. నేడో, రేపో కలెక్టరేట్కు చీరలు రా నుండగా.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు చేరనున్నాయి. వచ్చేవారం గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంఘాల్లో ఉన్న సభ్యులకు రెండేసి చొప్పున పంపిణీ చేస్తారా.. రెండో విడతలో మరికొన్ని తెప్పిస్తారా అన్నది స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పంపిణీ జరుగుతుందని డీఆర్డీవో విభాగ అధికారులు వివరించారు.జిల్లాలో మొత్తం సంఘాలు: 13,748సభ్యులు: 1,47,723వీవో సంఘాలు: 527మండల సమాఖ్యలు: 16జిల్లా సమాఖ్య: 1రేషన్ దుకాణాలు: 566ఆహార భద్రత కార్డులు: 2,78,199మొత్తం యూనిట్లు: 8.98,21218 ఏళ్లు నిండిన మహిళలు: 2.52లక్షలు -
గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయండి
ధర్మపురి: రానున్న గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరిలోగల పుష్కరఘాట్లను బుధవారం దేవాదాయశాఖ కమిషనర్ శైలజారామయ్యర్తో కలిసి పరిశీలించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు రానున్నందున సరిపడా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై ప్రణాళిక సిద్ధం చేసి త్వరగా పంపించాలని అన్నారు. గోదావరిలో గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లతో పాటు మరికొని ఘాట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలన చేసి ముందుకుసాగాలన్నారు. మంగళిగడ్డ, సంతోషిమాత, సోమవిహార్ పుష్కర్ఘాట్లతోపాటు గడ్డ హన్మాండ్ల ఆలయం వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావ్ తదితరులున్నారు. కిడ్నాపర్ల అరెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని మైత్రీ హోటల్ సమీపంలో కిడ్నాపర్లను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నిష్ఠూరి యశ్వంత్(ఛత్తీస్గఢ్)కు రెండేళ్ల క్రితం నల్లపాటి నరేశ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గ్రానైట్కు సంబంధించిన వ్యాపారం చేసేందుకు ఒరిస్సాకు చెందిన వ్యక్తిని యశ్వంత్ పరిచయం చేశాడు. దీంతో రూ.3లక్షలు ఒరిస్సాకు చెందిన వ్యక్తికి మధు ఇచ్చాడు. అతడు ఆ డబ్బులు ఎంతకు తిరిగి ఇవ్వకపోగా.. మధ్యవర్తిగా ఉన్న నువ్వే ఇవ్వాలని యశ్వంత్పై ఒత్తిడి తెచ్చాడు. కరీంనగర్కు వస్తున్నానని అక్కడ మాట్లాడుకుందామని చెప్పాడు. అనుకున్నట్లే ఈనెల 7న కరీంనగర్కు వచ్చిన యశ్వంత్ను భోజనం చేసుకుంటూ మాట్లాడుకుందాం రమ్మని కొత్తపల్లికి నరేశ్ పిలిచాడు. దీంతో యశ్వంత్, ముద్దుల మధు(భద్రాచలం) కొత్తపల్లికి రాగా.. వారిని నల్లపాటి నరేశ్తోపాటు మరో నలుగురు గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మధు, ఖమ్మం వెళ్లే క్రమంలో యశ్వంత్ తప్పించుకున్నారు. కిడ్నాప్తో భయపడ్డ యశ్వంత్, మధు కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని యశ్వంత్ అల్లుడు కొత్తపల్లి పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిడ్నాప్కు పాల్పడ్డ నల్లపాటి నరేశ్, గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ అనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్న మరికొంతమందిని కూడా పట్టుకుంటామని సీఐ కోటేశ్వర్ పేర్కొన్నారు. 48 గంటల్లో కేసును ఛేదించి నేరస్తులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్సైలు సాంబమూర్తి, సంజీవ్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
తిమ్మాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఎల్ఎండీ కాలనీలోని స్వాతంత్ర సమర యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిద్దిపేట శాఖ నేత్ర వైద్య శిబిరం బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను ఉన్నతం చేయడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. దివ్యాంగుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు వెచ్చించినట్టు మంత్రి వెల్లడించారు. తాను మంత్రి అయిన తర్వాత కరీంనగర్లోని మానసిక వికలాంగుల పాఠశాలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు గుర్తు చేశారు. పాఠశాల సిబ్బంది జీతభత్యాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషి ఉందన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, దివ్యాంగులను ప్రేమతో ఆదరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. మానసిక వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ, దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా దివ్యాంగులు ఉన్నారని, బాలభరోసా కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు దివ్యాంగ పిల్లలను గుర్తించి,చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. -
ఆస్తిపన్ను లక్ష్యం పూర్తి చేయండి
కరీంనగర్కార్పొరేషన్: ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. బుధవారం కళాభారతిలో ఆర్వోలు, ఆర్ఐలు, వార్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్ల వారీగా వార్డు అధికారులకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆస్తి పన్ను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను, నగరపాలక దుకాణ సముదాయాల అద్దె బకాయిలు వసూలు చేయాలని సూచించారు. ఒప్పందం పూర్తయిన దుకాణాలకు మళ్లీ బహిరంగ వేలం నిర్వహించేందుకు సిద్ధం చేయాలని, ఆ వివరాలు అందించాలన్నారు. రెవెన్యూ బ్లాక్ల వారీగా కమర్షియల్ భవనాల్లో, రెసిడెన్షియల్ టాక్స్ ఉంటే కమర్షియల్ టాక్స్కు మార్చాలని ఆదేశించారు. నగరవ్యాప్తంగా దాదాపు 32 వేల కమర్షియల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయని, వాటిని కమర్షియల్ టాక్స్కు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విలీన గ్రామాలకు సంబంధించిన అన్ని ఇంటినంబర్ల అసెస్మెంట్లను ఆన్లైన్ చేయాలని, నగరంలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఉన్నవాటిని గుర్తించి తొలగించాలని చెప్పారు. అలాగే నివాసగృహాలను కూల్చి పన్ను చెల్లించకుంటే ఆ అసెస్మెంట్ నంబర్లను కూడా తొలగించాలన్నారు. పారిశుధ్య పనులు పర్యవేక్షించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 54వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం మెయిన్ రెస్క్యూస్టేషన్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 6 పురుషులు, 2 మహిళా జట్లు హాజరయ్యాయి. సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీఎంఎస్ ఉమేశ్ సావర్కర్ పోటీలు ప్రారంభించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతినిధులను నాగ్పూర్ జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్పొరేట్ సేఫ్టీ జీఎం శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, ఆర్జీ –1, 3 జీఎంలు లలిత్కుమార్, సుధాకర్రావు, డీడీఎంఎస్లు పాల్గొన్నారు. -
వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకవ్వ అనే వృద్ధురాలి మెడలోంచి గుర్తుతెలియని దొంగలు రెండుంపావు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. వెంకవ్వ బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు ప్లేట్ కడుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను మాటల్లో దింపి మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కుని పారిపోయారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీపుటేజీలో రికార్డు అయింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బోయినపల్లి కేజీబీవీలో ఏసీబీ తనిఖీలు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి కేజీవీబీలో బుధవారం ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. లీగల్ మెట్రాలజీ, శానిటరీ, ఫుడ్, ఆడిటర్ అధికారులు అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీలో ఆహార నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ రికార్డులు తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, పాఠశాల క్యాష్ బుక్ ఎంట్రీలను అప్డేట్ చేయలేదని గుర్తించారు. కొన్ని అనవసర కొనుగోళ్లు చేయడంతో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కాగా బోయినపల్లి కేజీబీలో అవకతవకలు జరుగుతున్నాయని, అమ్మ ఆదర్శ కమిటీ నిధులు గోల్మాల్ చేశారని ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. పలు టెండర్లను కేజీబీవీలో పనిచేసే ఉద్యోగుల బంధువులకే ఇచ్చారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటనలో తెలిపారు. -
నరేందర్రెడ్డికి అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): ముప్పై ఐదేళ్లుగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న అల్ఫోర్ప్ విద్యా సంస్థల చైర్మన్ డా.నరేందర్రెడ్డికి ప్రతిష్టాత్మక ‘అవుట్స్టాండింగ్ ఎడ్యూకేషన్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డు వరించింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ స్కూల్ అవార్డ్స్, వరల్డ్ ట్రేడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా అవార్డు ప్రకటించాయి. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తరుఫున అల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రతినిధి అవార్డును అందుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో నరేందర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా అవార్డు బాధ్యత పెంచిందని, రానున్న రోజుల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్ర విద్యారంగానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచేలా కృషి చేస్తానని నరేందర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పశువుల పాక నివాసమై..
ఇల్లందకుంట(హుజూరాబాద్): కని పెంచిన తల్లి కొడుకులకు భారమైంది. కనికరం లేని కొడుకులు తల్లిని ఎడ్లపాకలో నివాసం ఉంచారు. దీంతో ఆ తల్లి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో రమేశ్బాబు, అధికారులు స్పందించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, సఖి కౌన్సిలర్ పద్మావతి భోగంపాడులో ఎడ్లపాకలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కళ్లెం అమృతమ్మను కలిసి వివరాలు సేకరించారు. అమృతమ్మ భర్త పదేళ్ల క్రితం మృతిచెందగా, అప్పటినుంచి కొడుకుల ఆదరణ కరువైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలి కుమారులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, అమృతమ్మకు తగిన సాయం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఐ నాగరాజు తెలిపారు. -
కాళేశ్వరం దోపిడీ రూ.లక్షా 15 వేల కోట్లు
కరీంనగర్కార్పొరేషన్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.లక్షా 15 వేల కోట్లు దోచుకుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.35 వేల కోట్లతో పూర్తయితే, రూ.1లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ చెబుతున్నారన్నారు. హరీశ్రావు, సంతోష్రావు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత చెప్పారని, అవినీతి వాస్తవాలు సొంత కుటుంబం నుంచే వస్తుంటే, కేటీఆర్ సీఎంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సచివాలయం నిర్మిస్తున్న సమయంలో దొరికిన నిజాంకు చెందిన బంగారం, వజ్రాలు, హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ బినామీ పేరిట ఉన్న 30 వేల ఎకరాల భూములు, ఆస్తుల పంపకాల్లో కేటీఆర్తో సమానంగా తనకు వాటా కావాలనే కవిత పంచాయితీ మొదలైందని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.3 లక్షల కోట్లు దండుకుందని మండిపడ్డారు. గతంలో ఇళ్లు కూడా సరిగాలేని కేసీఆర్ కుటుంబానికి అమెరికా, దుబాయి, లండన్, సింగాపూర్లో రూ.వేలకోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఎక్కడివని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, గోష్కి శంకర్ పాల్గొన్నారు. సంఘటితంగా ముందుకెళ్లాలికరీంనగర్: అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాజ్యాంగ ఫలాలను పునికి పుచ్చుకునేందుకు సంఘటిత శక్తితో ముందుకు సాగాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా అంబేద్కర్ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. రాజకీయ పార్టీల్లో ఉన్న దళిత వర్గాలు దళిత శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని, పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. నాయకులు గజ్జల ఆనంద్రావు, సుద్దాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం -
ఆ ఒక్కడే.. అధిపతి
● కోరుట్ల నుంచి ఐదుగురు కీలక మావో నేతలు ● చివరికి మిగిలింది తిప్పిరి తిరుపతే ● దక్కిన దళపతి పీఠం నిజాముద్దీన్ (ఫైల్) పసుల రాంరెడ్డి(ఫైల్) బెజ్జారపు కిషన్(ఫైల్) కోరుట్ల: పీపుల్స్వార్ నుంచి మావోయిస్టులుగా రూపు మార్చుకున్న నక్సల్ ఉద్యమ పంథాతో కోరుట్లకు 50 ఏళ్ల విడదీయరాని అనుబంధం ఉంది. 1980–85 మధ్యకాలం కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా భారతీయ విద్యార్థి పరిషత్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లు విద్యార్థి వర్గాల్లో తమ ఊపును కొనసాగించాయి. ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య పరస్పర వైరుధ్యాలు, గొడవలు, కొట్లాటలు, ఓ దశలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ఐదుగురు ఆర్ఎస్యూ నాయకులు పీపుల్స్వార్ వైపు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ ఐదుగురు కీలక నేతలుగా ఎదగగా.. వారిలో ఇద్దరి ఆచూకీ లేదు. మరో ఇద్దరు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇక మిగిలింది..తిప్పిరి తిరుపతి. ఆ ఒక్కనికే మావోయిస్టు దళపతి పీఠం దక్కింది. ఐదుగురు కీలక నేతలే.. 1980–90 దశకంలో కోరుట్లకు చెందిన ఆర్ఎస్యూ నేతలు తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, నిజాముద్దీన్, బెజ్జారపు కిషన్, పసుల రాంరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యే సమయంలో వీరిపై పోలీసు నిర్భంధం పెరగడంతో సిద్ధాంతపరమైన భావజాలంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్లో కీలక నేతలుగా ఎదిగారు. ముక్కా వెంకటేశం నల్గొండ జిల్లా పీపుల్స్వార్ కార్యదర్శిగా పనిచేస్తూ 1996 అక్టోబర్లో యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్తున్న సమయంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పసుల రాంరెడ్డి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో 2001లో సిరిసిల్ల జిల్లా మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజాముద్దీన్ మావోయిస్టు డెన్ కీపర్గా చాలారోజులు వ్యవహరించినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో నిజాముద్దీన్ ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. అసలు ఉద్యమంలో ఉన్నాడా..? లేడా..? అనే వివరాలు లేవు. బెజ్జారపు కిషన్ 1980–85లో బుల్లెట్ మోటార్సైకిల్ మెకానిక్గా కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో గుర్తింపు పొందారు. పీపుల్స్వార్లో చేరిన ఈయన మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ విభాగం కార్యకలాపాలను పర్యవేక్షించారని పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆచూకీ లేదు. ఇక మిగిలిన తిప్పిరి తిరుపతి మహారాష్ట్ర, ఒడిశాల్లో దేవ్జీగా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి, దంతెవాడ సమీపంలో పోలీసులను హతమార్చిన సంఘటనలకు వ్యూహాకర్తగా తిరుపతి పేరు పలుమార్లు వినవచ్చింది. కోరుట్లలో తమ్ముడు వెంకటి చనిపోయిన సమయంలోనూ తిరుపతి ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో ఒడిశా పరిసరాల్లోని ఆదివాసీబిడ్డ, ఉద్యమ సహచరి సృజనను ఆయన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లు సమాచారం. 2019–20లో కరోనా సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. అట్టడుగు స్థాయి నుంచి అఽధిపతి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మావో సిద్ధాంతలక్ష్యాలను వీడని తిరుపతికి మావోయిస్టు దళపతి పీఠం దక్కడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
కరీంనగర్: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి సుడా చైర్మన్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శక్తికి ఐలమ్మ ఒక నిదర్శమని పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాశ్, రజక సంక్షేమ సంఘాల నాయకులు కొత్తకొండ రాజయ్య, రాచకొండ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీఉమేశ్కుమార్ అన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఇటీవల అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్ఆర్ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలను సందర్శించి రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘సేవాపక్షం’ విజయవంతం చేయాలి తిమ్మాపూర్/కరీంనగర్ టౌన్: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి చేపట్టనున్న సేవా పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సేవా పక్షం రాష్ట్ర కన్వీనర్ మల్క కొమురయ్య పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సేవా పక్షం జిల్లా కన్వీనర్ ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బాస సత్యనారాయణ, వై.సునీల్రావు, డి.శంకర్, గుగ్గిల రమేశ్, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణచట్టం అమలు చేయాలి కరీంనగర్క్రైం: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లాయర్లు డిమాండ్ చేశారు. ఇటీవల మేడ్చల్, ఖమ్మం, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ల సభ్యులు సురేశ్బాబు, ఎండీ జహీర్ అలీ, ఇజ్జగిరి మనోజ్పై జరిగిన దాడులను నిరసిస్తూ బుధవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లింగంపల్లి నాగరాజు, కందుల అరుణ్కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందన్నారు. అనంతరం జిల్లా కోర్టు నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. సీనియర్ న్యాయవాదులు కుసుంబ కృష్ణారావు, కొరివి వేణుగోపాల్, బి.రాంరెడ్డి, పి.బాపురావు, వినయ్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఓటర్లు 5,07,531
కరీంనగర్: జిల్లాలోని 15 మండలాల్లో 170 ఎంపీటీసీ స్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్ల తుదిజాబితాను బుధవారం రాత్రి జెడ్పీ సీఈవో శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శించారు. జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రదర్శించింది. జిల్లా యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 5,07,531 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 2,60, 388 కాగా పురుష ఓటర్లు 2,47, 131, ఇతరులు 12 మంది ఉన్నారు. 934 పోలీసు స్టేషన్ల వారీగా జాబితాను వెల్లడించారు. ఇందులో 500లోపు జనాభా ఉన్న గ్రామాల్లో 343 పోలింగ్ కేంద్రాలు, 501 నుంచి 700 వరకు జనాభా ఉన్న గ్రామాల్లో 591 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈనెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను మండల పరిషత్లో ప్రదర్శించారు. ఈనెల 8న జిల్లాస్థాయి, మండలస్థాయిల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. 8,9 వ తేదీల్లో అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరించి సమస్యలు పరిష్కరించి బుధవారం రాత్రి తుది జాబితా ప్రకటించారు. -
అన్నం పెట్టని కొడుకు
జగిత్యాలక్రైం: కొడుకు అన్నం పెట్టడంలేదని, అడిగినా పట్టించుకోవడంలేదని జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బొల్లె భూమయ్య, కొమురవ్వ దంపతులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. భూమయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గతంలో మరణించాడు. పెద్ద కుమారుడు రెండు నెలలుగా అన్నం పెట్టకపోవడంతో దంపతులిద్దరూ బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో కాలం వెళ్లదీశారు. తమకు అన్నం పెట్టడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ రూరల్ ఎస్సై సదాకర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వారి పెద్ద కొడుకు, చిన్న కొడుకు కుటుంబ సభ్యులను పిలిచించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వృద్ధుల పోషణభారం చూసుకోవాలని, మరోసారి విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దుబాయ్ వెళ్లేందుకు మరొకరు సిద్ధం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జనవరి నుంచి పలు కేసుల్లో.. జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరిట కరీంనగర్ కేంద్రంగా ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసిన రూ.95 కోట్ల స్కాంలో నిందితుడు రమేశ్గౌడ్ దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ వసూలు చేసిన డబ్బులతో దుబాయ్లో ప్లాటు కొని, పదేళ్ల వీసా సంపాదించాడు. ఇంతలో రమేశ్గౌడ్ కరీంనగర్ సీఐడీ డీఎస్పీ కుమ్మక్కయ్యారని, బాధితులు సీఐడీ చీఫ్కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. అప్పటి కరీంనగర్ సీఐడీ డీఎస్పీని అదే రోజు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వెంటనే రమేశ్గౌడ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ నుంచీ లీక్.. ఆగస్టు చివరి వారంలో బల్దియాలో ఓ అవినీతి తిమింగళంలా పేరొందిన అధికారిని వేటాడేందుకు ఏసీబీ వలపన్నింది. అయితే, స్థానికంగా ఉన్న కొందరు అధికారులు ముందే ఈ సమాచారాన్ని సదరు అధికారికి లీక్ చేశారు. దీంతో సదరు అధికారి ఆ రోజు ఏసీబీకి చిక్కకుండా ఊరొదిలి పారిపోయాడు. అమెరికాకు పరారై .. వాట్సాప్ స్టేటస్ పెట్టి.. తాజాగా ఈనెల 3న వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ మహిళపై దాడి కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మహిళపై మరో మహిళ, నలుగురు పురుషులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ దంతాలు రాలిపోయి, చేతివేళ్లు విరిగాయి. కంటికి, ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో ఇద్దరు పురుషులు ఎన్నారైలు. వారిద్దరూ దేశం వదిలి పారిపోతారని చెప్పినా.. కనీసం ఎఫ్ఐఆర్లో వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఫలితంగా 9న అర్ధరాత్రి నిందితులిద్దరూ అమెరికాకు పారిపోయి, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కాలనీ మొత్తం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీపీ గౌస్ ఆలం సీరియస్ అయ్యారు. టౌన్ ఏసీపీని పిలిపించి వివరణ కోరారు. అమెరికా పారిపోయిన వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. థాయ్లాండ్ ట్రాఫికింగ్ విషయంలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన థాయ్లాండ్ కేంద్రంగా వెలుగుచూసిన సైబర్ కేఫ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు సరైన కాలంలో లుక్అవుట్ నోటీసు సర్క్యులర్ జారీ చేయలేకపోయారు. దీంతో నిందితుడిని ఢిల్లీలోని ఏపీ హౌజ్లో గుజరాత్ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోక్యంతో నిందితుడిని కరీంనగర్కు తీసుకువచ్చారు. మెటా ఫండ్ పేరిట కరీంనగర్ కేంద్రంగా మరో క్రిప్టో స్కాం వెలుగుచూసింది. రోజూ లాభాలు వస్తాయని ఆశపెట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని ప్రచారం జరగుతోంది. ఈ కేసులో టూటౌన్, రూరల్, కొత్తపల్లిలో బాధితులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు తాత్సారం చేశారు. పైగా నిందితులతో సెటిల్ చేసుకోవాలని బాధితులకు ఉచిత సలహా ఇచ్చి పంపారు. ఎట్టకేలకు జూలైలో దాసరి రమేశ్, దాసరి రాజుపై కేసు నమోదైంది. పోలీసుల నిర్లక్ష్యం అదునుగా చేసుకుని నిందితులు విజయవాడకు పరారై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన లోకేశ్ థాయ్లాండ్ పారిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇంకో నిందితుడు సతీశ్ దుబాయ్లో ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టి దేశం వదిలిపారిపోయేందుకు సిద్ధంగా ఉండటం కొసమెరుపు. -
ఇంటి నంబర్ల దందాపై బల్దియా నజర్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధి లో ఇంటినంబర్ల దందాపై అధికారులు దృష్టి సారించారు. ఏళ్లకాలంగా ఇంటినంబర్లతో ఖాళీ స్థలాలను కబ్జాచేస్తున్న వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రేకుర్తిలో ఎలాంటి నిర్మాణాలు లేని స్థలాలకు ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయగా, ఇటీవల బొమ్మకల్లోనూ ఇలాంటి ఇంటినంబర్లను రద్దు చేశారు. నగరంలోని డివిజన్ల వారీగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లను గుర్తించేందుకు విచారణ చేపట్టా రు. నివేదిక వచ్చాక చర్యలు చేపట్టనున్నారు. ఇంటి నంబర్లతో ఆక్రమణ నగరంలో ఇంటి నంబర్లతో భూముల కబ్జాలకు పాల్పడే దందా ఏళ్లుగా సాగుతోంది. కొంతమంది నగరపాలకసంస్థ రెవెన్యూ అధికారుల కుమ్మక్కుతో కబ్జారాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ భూములు, వివా దాస్పద భూములే లక్ష్యంగా ఇంటి నంబర్లను ప్రయోగిస్తున్నారు. ఎంచుకున్న ఖాళీ స్థలంలో నిర్మాణాలు లేకున్నా, ఇంటి నంబర్ను జారీ చేస్తున్నారు. ఈ ఇంటి నంబర్ ఆధారంగా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆక్రమించుకొంటున్నారు. ఇలా ఇంటి నంబర్లతో భూముల ఆక్రమణపై అనేక ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఉన్నతాధికారులు నియంత్రణపై దృష్టి సారించారు. రేకుర్తి, బొమ్మకల్లో రద్దు వివాదాస్పద భూములకు అడ్డాగా ఉన్న రేకుర్తి, బొమ్మకల్లో పలు ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు గతంలో విచారణచేపట్టారు. రేకుర్తిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీ స్థలాలకు ఇచ్చిన 1002 ఇంటి నంబర్లను రద్దు చేశారు. బొమ్మకల్లోనూ విచారణ చేపట్టిన అనంతరం ఇప్పటివరకు దాదాపు 18 ఇంటి నంబర్లను రద్దు చేశారు. డివిజన్లవారీగా సేకరణ రేకుర్తి, బొమ్మకల్తో పాటు నగరంలోని అన్ని డివిజన్లలోనూ ఇలాంటి ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ అయిన వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాలతో వార్డు అధికారులు, నిర్మాణాలు లేని స్థలాలకు జారీ అయిన ఇంటినంబర్ల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల వారిగా జాబితా సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో విచారణ నివేదిక వచ్చిన తరువాత ఆ ఇంటినంబర్లను రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకొనే అవకాశముంది. -
కాళోజీకి ఘన నివాళి
కరీంనగర్ కల్చరల్/కరీంనగర్క్రైం: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ గౌస్ ఆలం కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఆర్ఐలు రజినీకాంత్(అడ్మిన్), శ్రీధర్రెడ్డి(వెల్ఫేర్) పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు
కరీంనగర్క్రైం: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరోంచ పరిధిలో ఉన్న లక్ష్మీదేవిపేటకు చెందిన పెద్ది దక్షిణ్ ఊరాఫ్ దక్షిణామూర్తి (23) కరీంనగర్ వచ్చి రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేశాడు. మద్యం సేవించి విధులకు హాజరుకావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. కొంతకాలం స్వగ్రామంలో ఉండి తిరిగి కరీంనగర్ వచ్చాడు. ఆదర్శనగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో కంపౌండర్గా చేరాడు. మద్యం తాగడంతో పాటు అశ్లీలచిత్రాలు చూసే అలవాటు ఉన్న దక్షిణామూర్తి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై ఈనెల 6న వేకువజామున మత్తుమందిచ్చి లైంగికదాడి చేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మంగళవారం నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఘటనపై కలెక్టర్కు నివేదిక ఇచ్చామని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలపై త్వరలోనే ఆసుపత్రి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు(చైల్డ్ ఫోర్నోగ్రఫీ) చూస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 30మందిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. సమావేశంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్ సీఐ జాన్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళపై కత్తితో దాడికి యత్నం
● కేసు నమోదు చేసినా మారని తీరు ● భయాందోళనలో మహిళ కుటుంబ సభ్యులు జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన కవిత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన రాజు అలియాస్ మల్లేశ్ సోమవారం మధ్యాహ్నం కత్తి, బీరుసీసాతో దాడికి యత్నించాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా ఆమె డ్యాన్స్ చేస్తుండగా మల్లేశ్ అడ్డుకున్నాడు. దీంతో కవిత భర్త మల్లేశ్ను మందలించాడు. ఈ క్రమంలో కవితపై కక్షపెంచుకున్న మల్లేశ్ కత్తితో దాడికి యత్నిస్తుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. మల్లేశ్ కత్తి, బీరుసీసాతో కాసేపు హంగామా సృష్టించాడు. ఎవరైనా అడ్డువచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైందని తెలుసుకున్న మల్లేశ్.. మంగళవారం సదరు మహిళ భర్తను చంపేస్తానంటూ మళ్లీ హంగామా సృష్టించాడు. కవిత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వేంపేట మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు మారంపెల్లి శ్రీనివాస్(53) గుండెపోటుతో మృతి చెందారు. తిరుమలతిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి సోమవారం వెళ్లాడు. తిరుపతిలోనే మంగళవారం గుండెపోటుకు గురై మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. పారిశుధ్య కార్మికుడు..పెగడపల్లి: మండలంలోని కీచులాటపల్లిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు కొత్తపల్లి సత్తయ్య (50) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన సత్తయ్య మృతిపై గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో అచ్చ గంగారాం (56) ద్విచక్ర వాహనం ఢీకొని మృతిచెందాడు. గంగారాం సోమవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని సైకిల్పై ఇంటికి బయల్దేరాడు. మోరపల్లి బైపాస్రోడ్ వద్ద జగిత్యాలకు చెందిన మహేశ్ ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి గంగారాంను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గంగారాంను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. గంగారాం కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. మెట్పల్లి: పట్టణ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మగ్గిడి నర్సయ్య(59) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపేటకు చెందిన నర్సయ్య ద్విచక్ర వాహనాంపై పని నిమిత్తం మెట్పల్లికి వస్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కౌలు రైతు ప్రాణం తీసిన ఫైనాన్స్ వేధింపులు● ట్రాక్టర్ లాక్కెళ్లిన ఫైనాన్స్ ప్రతినిధులు ● కిస్తీలు చెల్లించాలని ఒత్తిడి ● మనస్తాపంతో ఆత్మహత్య తిమ్మాపూర్: ఆర్థిక పరిస్థితి బాగాలేక ఫైనాన్స్లో అప్పు చేసిన ఓ కౌలు రైతు సదరు ఏజెంట్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్గౌడ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపగోని బాబు (43) భార్య పద్మతో కలిసి గ్రామంలో కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంతానం. గతంలో ట్రాక్టర్ కొన్న బాబు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు సక్రమంగానే కిస్తీలు చెల్లించాడు. తర్వాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండు కిస్తీలు చెల్లించలేకపోయాడు. దీంతో సదరు ఫైనాన్స్ ఉద్యోగి ఒకరు ట్రాక్టర్ను తీసుకెళ్లాడు. మరోసారి ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇటీవలే తన ఇంటిపై మరో ఫైనాన్స్ సంస్థలో రుణం పొందాడు. బయట రూ.4లక్షలు అప్పు ఉండడం.. రెండు ఫైనాన్స్ల్లో వడ్డీతో కలిపి రూ.8 లక్షలకు చేరడంతో కిస్తీలు చెల్లించడం గగనంగా మారింది. మరోవైపు ఫైనాన్స్ సిబ్బంది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాబు ఈనెల6న ఉదయం పొలం వద్దకని చెప్పి వెళ్లి గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున మృతిచెందాడు. బాబు భార్య పద్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్కు చెందిన ఈరవేణి రమ్య(30) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్రెడ్డి కథనం ప్రకారం.. రమ్య మంగళవారం ఉదయం తన ముగ్గురు పిల్లలను స్కూల్కు పంపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ‘అమ్మ తలుపు తీయూ’ అంటూ పిలిచినా పలక లేదు. దీంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రమ్య ఉరేసుకుని నిర్జీవంగా ఉండడంతో పిల్లలు లాస్య, ప్రవీన్, సుశాంత్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే రమ్య భర్త కృష్ణహరి బతుకుదెరువు కోసం 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. భర్త దుబాయ్లోనే ఉండగా, భార్య కడసారి చూపు కోసం బయల్దేరాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల దేవయ్య (55)కు గతంలో మూడుసార్లు రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగాయి. ఆపరేషన్ల కారణంగా కాళ్ల నొప్పులు విపరీతమయ్యాయి. పలుసార్లు ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో కొంతకాలంగా మనస్తానపానికి గురవుతున్నాడు. సోమవారం సాయంత్రం పొలం వద్దకని ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి పొలం శివార్లలో వెతకగా దేవయ్య చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మంగళవారం ఎస్సై ప్రశాంత్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య లచ్చవ్వ, కూతురు సౌజన్య, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒక రు..కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన పల్లికొండ లక్ష్మీనారాయణ(54) మంగళవారం గ్రామశివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ కోరుట్ల ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తూ.. ఏడాది క్రితం సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబపోషణ, ఇతర అవసరాలకు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనారాయణ కుమారుడు వికాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసై ఒకరు..తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్ శివారులో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం దాచారంలో నివాసం ఉంటున్న వాడెపు జంగయ్య (45) లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి తరుచూ గొడవలు పడుతున్నాడు. మంగళవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల గ్రామానికి చెందిన లకావత్ లలిత– పరంగి దంపతుల కూతురు మధుమతి(16) గడ్డి మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మధుమతి సరిగ్గా స్కూల్కు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుమతి ఈ నెల 1న గడ్డి మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. మహిళ మృతిబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్కు చెందిన సమ్మవ్వ (45) చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు.. సమ్మవ్వ భర్త సమ్మయ్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె మద్యానికి బానిసైంది. పదిరోజుల క్రితం సమ్మవ్వ అల్లుడు బోసు ప్రభాకర్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరి మృతితో డిప్రెషన్కు లోనైంది. మానసిక వేదనతో ఈ నెల 8న మద్యం సేవించిన సమ్మవ్వ తన భర్త సమాధి వద్ద విలపించింది. అనంతరం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యసైదాపూర్: మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణస్వామి(42) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సైదాపూర్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారంగా బోయిని సత్యనారాయణస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మణిసాయి, భార్య రేణుక హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద సత్యనారాయణ, చిన్న కుమారుడు సాయితేజ ఉన్నారు. సాయితేజ కిరాణం షాపునకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ స్వామి ఇంట్లో ఉరేసుకొని మృతి చచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నిబంధనలకు విరుద్ధంగా దందా సాగిస్తున్న మల్టీపర్పస్ పార్క్ కాంట్రాక్ట్ ఏజెన్సీపై చర్యకు బల్దియా కసరత్తు చేస్తోంది. మల్టీపర్పస్ పార్క్ కాస్తా మల్టీ పార్టీస్ పార్క్గా మారడంతో షరామామూలుగానే అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. పార్క్లో లీజు పేరిట కాంట్రాక్ట్ ఏజెన్సీ సాగిస్తున్న దందాలపై ‘ఇదేం గలీజు దందా’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించడం తెలిసిందే. లీజు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను మీరి చేపడుతున్న దందాలపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా, చర్యలు తీసుకోకపోవడంతో అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రద్దా.. కొనసాగింపా? నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ పార్క్ కొంతమంది వ్యాపారాలకు కేంద్రంగా మారింది. రెండేళ్ల నిర్వహణ పేరిట టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం సమస్యగా మారింది. లీజు ఒప్పందానికి విరుద్ధంగా ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.50కి పెంచడం, వాహనాల పార్కింగ్కు డబ్బులు వసూలు చేయడం, వాకింగ్ ట్రాక్ను దుర్వినియోగం చేయడం, మ్యూజికల్ ఫౌంటెయిన్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడడంతో పాటు ఇప్పుడు ఏకంగా దాబా హోటల్ను ప్రారంభించారు. ఐదు వేల మొక్కలు నాటారట పార్క్లో నిబంధనలు ఉల్లంఘిస్తుండడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ నిర్వాహకులు ఐదు వేల మొక్కలు నాటామంటూ కొత్త రాగం ఎంచుకొన్నారు. స్మార్ట్సిటీలో భాగంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్క్లో తాము ఐదు వేల మొక్కలు నాటామంటూ నమ్మబలుకుతున్నారు. అసలు ఐదు వేల మొక్కలు నాటే స్థలం ఆ పార్క్లో ఎక్కడుందో అని నిత్యం వాకింగ్కు వచ్చే వాకర్స్ వెతికే పనిలోపడ్డారు. పైగా మొక్కలు నాటేందుకు, ఇతరత్రా రూ.50 లక్షలు ఖర్చు చేశామని బల్దియాకు రాసిన లేఖనే వాళ్ల మెడకు ఇప్పుడు చుట్టుకొనే పరిస్థితి ఏర్పడింది. రూ.25 వేలు జరిమానా అనుమతి లేకుండా దాబా హోటల్ను ప్రారంభించిన రాక్ ఏజెన్సీకి బల్దియా నోటీసు జారీ చేస్తూ, రూ.25 వేలు జరిమానా విధించింది. పార్క్లో లీజు ఒప్పందం ఉల్లంఘనలపై డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నివేదికలో ఉల్లంఘనలు నిజమే అని తేలితే మొత్తం లీజు ఒప్పందాన్ని రద్దు చేయనుంది. బుధవారం తుది నోటీసు జారీ చేసే అవకాశముంది.గ‘లీజ్’ దందా పార్ట్–2నిబంధనలు పక్కనపెట్టి, పార్క్ గోడను తొలగించి దాబా ప్రారంభించిన ఏజెన్సీ నిర్వాహకులు సరికొత్త వాదనను తెరమీదికి తీసుకొచ్చారు. దాబా ప్రారంభంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తమకు క్యాంటీన్కు అనుమతి ఉందని, అందుకే దాబా ప్రారంభించామంటున్నారు. క్యాంటీన్కు, దాబాకు తేడా లేదని వాదనకు దిగుతున్నారు. క్యాంటీన్ అంటే కేవలం ప్యాకేజ్డ్ ఆహారపదార్థాలు మాత్రమే ఉంటాయి. దాబా హోటల్కు ప్రత్యేకంగా బట్టిని ఏర్పాటు చేయడంతో పాటు, వంటకాలు ఇక్కడే చేస్తారు. తద్వారా నిర్వాహకులు చెప్పుకొంటున్నట్లుగా ‘ఆక్సీజన్ జోన్’ పార్క్ కాస్తా ‘పొల్యూషన్ పాయింట్’గా మారుతోంది.చర్యలు తీసుకోవాల్సిందే: వెలిచాలమల్టీపర్పస్ పార్క్లో లీజు ఒప్పంద నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా దాబాను ప్రారంభించడంపై ఆయన నగరపాలకసంస్థ అధికారులకు ఫోన్ చేశారు. చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోతే తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. -
యూరియా అడిగితే అరెస్టులా?
కరీంనగర్: రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడానికి వెళ్తున్న సీపీఐ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తారా? అని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీని వాస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు సరిపడా యూరియా తేవాలని సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. యూరియా తీసుకురావడంలో బండి సంజయ్, ఇతర బీజేపీ ఎంపీలు విఫలం అయ్యారన్నారు. సరిపడా యూరియా తెప్పించాలని, లేకుంటే ఎంపీని తిరగనివ్వమని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గూడెం లక్ష్మీ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేశ్, బామండ్ల పెల్లి యుగేందర్, బీర్ల పద్మ పాల్గొన్నారు. -
తియ్యనైనది తెలుగు భాష
కొత్తపల్లి(కరీంనగర్): తెలుగు భాష తియ్యనైనదని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే అన్నారు. తెలంగాణ భాష దినోత్సవాన్ని పురష్కరించుకొని కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోని తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా క్వాలిటీ కో– ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రముఖ కవి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అల్ఫోర్స్లో తెలుగు ఉపాధ్యాయులకు ఘన సన్మానం