Karimnagar District Latest News
-
నగరంలో నేడు పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు కొత్త ఏబీస్విచ్లు ఏర్పాటు చేస్తున్నందున శనివారం ఉ.8 నుంచి 11 గంటల వరకు 11కేవీ టవర్,సర్కిల్, డీఎఫ్వో ఫీడర్ల పరిధి లోని రాజీవ్చౌక్, రూర ల్ పోలీస్స్టేషన్, భారత్ టాకీస్, టవర్సర్కిల్, బ్రా హ్మణవీధి, అమ్మద్పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్, సీఎంఆర్ రోడ్, డీఎఫ్వో జంక్షన్, వేంకటేశ్వర ఆలయం, జైలు పెట్రోల్బంక్, సవరన్ స్ట్రీట్, రాజా థియేటర్ ప్రాంతాలు, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11కేవీ.కమాన్ ఫీడర్ పరిధిలోని హుందాయ్, ఫోర్డ్ షోరూంలు, పోచమ్మ కమాన్, కోతి రాంపూర్, లక్ష్మీనగర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉదయం 9.30నుంచి 11.30 గంటల వరకు 32/11కేవీ.విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని సప్తగిరికాలనీ, స్కూల్, మాచర్ల గార్డెన్, బ్రిందావన్ అపార్టుమెంట్, అంజుమ్ కాంప్లెక్స్, అయోధ్య కాలనీ, వేంకటేశ్వరకాలనీ, కట్టరాంపూర్, వాసుదేవ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ లావణ్య తెలిపారు. కొత్తపల్లి, రూరల్ పరిధిలో.. విద్యుత్ సబ్స్టేషన్లలో నెలవారి విద్యుత్ మరమ్మతు పనుల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు 33/11 కేవీ బద్దిపల్లి సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలతో పాటు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్ సబ్స్టేషన్ పరిధిలోని శ్రీపురంకాలనీ, రజ్వీచమన్, ప్రియదర్శినికాలనీ, విజయనగర్కాలనీ, క్రిష్ణనగర్, ఆటోనగర్, బొమ్మకల్, చలిమెడ ఆసుపత్రి, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 33/11 కె.వీ.నగునూర్ సబ్స్టేషన్ పరిధిలోని నగునూర్, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ పేర్కొన్నారు. -
రైలు రగడ!
● తిరుపతి ప్రత్యేక రైలుపై రాజకీయ దుమారం ● వానాకాలంలో ఏసీ కోచ్లతో తిరుపతికి రైలు ● కానరాని జనరల్, స్లీపర్ కోచ్లు ● అధికస్టాపులు, ప్రయాణ సమయంపై ప్రయాణికుల పెదవి విరుపు ● వర్షాకాలంలో ఏసీ రైలుకు ఆదరణ ఉండేనా?ప్రయాణికుల అసంతృప్తి ఈ ప్రత్యేక వీక్లీ హంసఫర్ 02761/62 ఏసీ రైలుకు 16 స్టాపులు ఉన్నాయి. ఈ ప్రత్యేక రైలులో కేవలం 3వ శ్రేణి శీతల బోగీలే. స్లీపర్, జనరల్ బోగీలు లేవు. జూలైలో జోరుగా వానలు కురుస్తాయి. వర్షాకాలంలో థర్డ్ ఏసీ ప్రయాణానికి తక్కువగా మొగ్గు చూపుతారు. పైగా రిజర్వేషన్ చార్జీలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతికి నడుస్తోన్న రెగ్యులర్ బై వీక్లీ 12762/61 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం 12స్టాప్లే. ఇందులో 3వ శ్రేణి, 2 వ శ్రేణి ఏసీ బోగీలతో పాటు, సాధారణ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయి. బైవీక్లీ రైలు కన్నా హంసఫర్ రైలు ప్రయాణం దాదాపు 3 గంటలు అధికంగా ఉండటం గమనార్హం. 02762 ఏసీ ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1355. కరీంనగర్ నుంచి తిరుపతి రెగ్యులర్ బై వీక్లీ 12762 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తృతీయ శ్రేణి శీతల టిక్కెట్ ధర రూ.1100. రెండింటి మధ్య వ్యత్యాసం రూ.255. ఏదైనా రెగ్యులర్ రైలు వెనుక నుంచి వస్తుంది అంటే ప్రత్యేక రైళ్లను ఒక చోట ఆపి వాటిని పంపిస్తారు. ప్రత్యేక రైళ్లు సమయ పాలన పాటించడం అరుదనే చెప్పాలి. -
రైలు ప్రమాదంలో మహిళ..
రామగుండం: అంతర్గాం మండలం పెద్దంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్సు రైలు కిందనుంచి దాటే క్రమంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. పెద్దంపేట కు చెందిన కొలిపాక రాజమణి(57) ఉరఫ్ మణెమ్మ పెద్దంపేట రైల్వేస్టేషన్ అవతలి వైపు ఉన్న పత్తి చేనులో కూలీ పనులకు వెళ్లింది. పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో మైడో రైల్వేట్రాక్పై మూడురోజులుగా గూడ్సు రైలు ఆగి ఉంది. దాని కిందనుంచి దాటే క్రమంలో రైలు ఒక్కసారి కదిలింది. ఈ ఘటనలో ఆమె పై రైలు వెళ్లడంతో తల, మొండెం తెగిపో యాయి. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉ న్నారు. వారందరికీ వివాహాలయ్యాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు జీఆర్పీ ఔట్పోస్ట్ ఇన్చార్జి పేర్కొన్నారు. -
కనగర్తిలో దొంగతనం
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో శుక్రవారం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన వంగపెల్లి శంకర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను తెరిచి వస్తువులు చిందరవందర చేశారు. చిన్నారుల కిడ్డీ బ్యాంక్ డబ్బాను పగులగొట్టి అందులోని డబ్బులు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.10వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో క్లూస్టీం, డాగ్స్క్వాడ్ నిపుణులు ఆధారాలు సేకరించారు. కేటీఆర్పై ఫిర్యాదుమల్యాల(చొప్పదండి): సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ నాయకుడు సంత ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్రెడ్డిని చేతగానివాడు, రాష్ట్రాన్ని నడిపే సత్తాలేనివాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు కోరెపు వెంకటేశ్, తిపిరెడ్డి కిషన్రెడ్డి, కొత్తకొండ శ్రీనివాస్, ఏలేటి కిష్టరెడ్డి, మహేశ్రెడ్డి, కటుకం వినయ్ పాల్గొన్నారు. యువకుడి దారుణ హత్యగంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మెండె సతీశ్యాదవ్(30) శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారులో మల్లారెడ్డిపేటకు వెళ్లేదారిలో సతీశ్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృతుడు స్థానికంగా వ్యవసాయపనులు, గొర్రెల కాపరీ, మేసీ్త్ర పనులు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై ప్రేమానందం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జపాన్ సకురా సైన్స్ హైస్కూల్కు శుభశ్రీ
సప్తగిరికాలనీ(కరీంనగర్): పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏం లేదనడానికి నిదర్శనం కరీంనగర్కు చెందిన శుభశ్రీ సాహు. అగ్రికల్చర్ మిషన్ను తయారు చేసిన శుభశ్రీ ఇన్స్పైర్ మనక్ అవార్డు ప్రదర్శనలో భాగంగా ఈ నెల 15నుంచి 21వరకు జపాన్ దేశంలోని జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ నిర్వహించనున్న సకురా సైన్స్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలో పాల్గొననుంది. కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన శుభశ్రీ సాహు స్థానిక పారమిత పాఠశాలలో చదివింది. ప్రస్తుతం సీబీ ఎస్ఈ 12వ తరగతి చదువుతోంది. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఇన్స్పైర్ మనక్కు ఎంపికై ంది. జిల్లాస్థాయిలో తాను చేసిన ప్రదర్శన అంచెలంచెలుగా అందరి ప్రశంసలు పొంది నేడు జపాన్ సకూర స్కూల్కు ఎంపికై ంది. లలిత్మోహన్ సాహు శుభశ్రీకి తండ్రి, గై డ్ టీచర్. తల్లి సుగ్యని సాహు. ఇద్దరు పా రమిత పాఠశాల ఉపాధ్యాయులే. సొంతూరు ఒ డిశా రాష్ట్రం కాగా కరీంనగర్లో సుమారు 25ఏళ్లుగా నివాసముంటున్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు శుభశ్రీ పోర్టబుల్ వ్యవసాయ యంత్రాన్ని తయారు చేసింది. ధాన్యం మార్పిడి, వేరు చేయడం, గడ్డికోత, తూర్పార, సంచులను కుట్టడం వంటి నాలుగు వేర్వేరు ప్రక్రియలు ఈ యంత్రం చేస్తుంది. ఈ యంత్రాన్ని సౌరశక్తి ద్వారా నడిపించొచ్చు. 2022–23 విద్యాసంవత్సరంలో తొలిసారిగా జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో శుభశ్రీ సాహు పాల్గొంది. 2024లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో రాణించి జాతీయస్థాయికి ఎంపికై ంది. 2024 సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డు ప్రదర్శనలో పాల్గొని టాప్ 30లో నిలిచింది. 2025–26 సంవత్సరానికిగాను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూ ఢిల్లీ, జపాన్ దేశంలోని సకురా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్ కోసం దేశవ్యాప్తంగా 54మంది విద్యార్థులను శుక్రవారం ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ము గ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో శుభశ్రీ కూడా చోటు సంపాదించింది. జపాన్లో జూన్ 15నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు వీరు పర్యటిస్తారు. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలను సందర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా విద్యార్థి ఖర్చులను భారత ప్రభుత్వమే భరిస్తుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 15నుంచి 21వరకు పర్యటన -
మహిళల సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్: మహిళల సంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయమని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నా రు. కరీంనగర్లోని దుర్గమ్మగడ్డ అంగన్వాడీకేంద్రంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. మూడునుంచి ఆరేళ్లలోపు పిల్లల ను అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు 50రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీ వడ్డించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, సీడీపీవో సబిత పాల్గొన్నారు. జల్జీవన్పై కేంద్ర బృందం తనిఖీ కరీంనగర్ అర్బన్: జల్ జీవన్ మిషన్ పథకం అమలు పర్యవేక్షణలో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలోని కేంద్ర నోడల్ అధికారుల బృందం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇందిరమ్మ ప్రధాన వరద కాలువ, మధ్య మానేరు కాలువలు, ఉపకాల్వలను తనిఖీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సంయుక్త కార్యదర్శి సింతల్ రాజన్ చొక్కలింగం ఆధ్వర్యంలోని ఈ కేంద్ర అధికారుల బృందం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైంది. నీటిపారుదల పనులకు సంబంధించి గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులతో జిల్లాలో పూర్తిచేసిన పనుల గురించి తెలుసుకున్నారు. 92శాతం ఇందిరమ్మ వరద కాలువ పనులు పూర్తయ్యాయని ఇంజినీర్లు వివరించారు. భూ సేకరణలో ఇబ్బందుల వలన కొంతమేర పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇందుకు సుమారు రూ.300కోట్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి పూర్తి నివేదిక కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. కేంద్ర బందం సభ్యులు సుధీర్ కుమార్, ఈఈ ధీరజ్ సింఘాల్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సుమతీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగన్, ఎస్ఈ పెద్ది రమేశ్ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
భూ తగాదాలో అన్నను చంపిన తమ్ముడు
పెగడపల్లి(ధర్మపురి): భూతగాదాలో సొంత అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కూన నర్సయ్య (50), కూన రాములు అన్నదమ్ములు. మద్యానికి బానిసయ్యారు. ఇద్దరి బాధలు భరించలేక ఇరువురి భార్యలు వీరిని వదిలి దూరంగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న అన్నదమ్ముల మధ్య కొంతకాలం నుంచి భూవివాదం నెలకొంది. ఈక్రమంలో గ్రామంలో జరిగిన పెద్దమ్మ బోనాల పండుగ సందర్భంగా గు రువారం రాత్రి ఇద్దరూ అతిగా మద్యం తాగారు. తాగిన మైకంలో గతంలో జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన రాములు కర్రతో నర్స య్య తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు రాములుపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రవీందర్ పేర్కొన్నారు. మల్యాల సీఐ రవి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. -
దుబాయిలో బతికపల్లి వాసి ఆత్మహత్య
పెగడపల్లి(ధర్మపురి): ఉపాధి కోసం దుబాయి వెళ్లిన పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పూడూరి లచ్చన్న (46) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉపాధి లేక జీవనో పాధి నిమిత్తం మూడేళ్ల క్రితం లచ్చన్న దుబాయి వెళ్లాడు. అక్కడ సరైన పని లభించక కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన లచ్చన్న తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందింది. ఐదు నెలల క్రితం తండ్రి మరణిస్తే స్వగ్రామానికి వచ్చి తిరిగి దుబాయి వెళ్లిన లచ్చన్న ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు న్నారు. కాగా లచ్చన్న మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని మంత్రి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
గాడిన పెట్టాల్సిందే!
● బల్దియాలో అదుపు తప్పిన పాలన ● అధికారుల్లో కొరవడిన సమన్వయం ● ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారీతనం ● బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ప్రఫుల్దేశాయ్ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి ● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని నగరకపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేర్చడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ ప్రాధాన్యతలన్నారు. శుక్రవారం నగరపాలకసంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్గాఉన్న చాహత్ బాజ్పేయ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ వచ్చే 50 సంవత్సరాలకు అనువుగా మాస్టర్ప్లాన్ ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్మార్ట్సిటీతో పాటు ఇతర నిధులతో చేపట్టిన పనులు పెండింగ్లో ఉంటే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్కార్డులు అర్హులకు అందేలా చూస్తామన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, బర్త్, డెత్ సెక్షన్లలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అసెస్మెంట్, అండర్ అసెస్మెంట్లు, ఇంటి అనుమతులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విలీన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డంప్యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. నిబంధనలను పాటించి డీలిమిటేషన్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. గతేడాది ఆగస్టు 21వ తేదీన చాహత్ బాజ్పేయ్ నగరపాలకసంస్థ కమిషనర్గా బదిలీపై వచ్చారు. అప్పుడు ఇన్చార్జి కమిషనర్గా ఉన్న ప్రఫుల్దేశాయ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల నేపథ్యంలో కమిషనర్గా ప్రఫుల్దేశాయ్కి బాధ్యతలు అప్పగించి చాహత్ బాజ్పేయ్ వరంగల్ వెళ్లారు.కరీంనగర్ కార్పొరేషన్: అధికారుల్లో కొరవడిన సమన్వయం, ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారితనం, సిబ్బంది ఇష్టారా జ్యం, అన్ని విభాగాల్లోనూ అవినీతిదే ఆధిపత్యం.. వెరసి నగరపాలకసంస్థలో పరిపాలన గాడి తప్పింది. నగరపాలకసంస్థ విస్తరించినా పౌరసేవలకు మాత్రం నగర ప్రజలు నోచుకోవడం లేదు. ఏ పని కావాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా, చేతి చమురు వదిల్చుకోవాల్సిందే. పనుల కోసం వచ్చే ప్రజలతో అధికారులు ప్రవర్తించే తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. నగరం, నగరపాలకసంస్థ పరిపాలనపై పూర్తి అవగాహన ఉన్న ప్రఫుల్ దేశాయ్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో బల్దియా తీరుమారుతుందేమోననే ఆశతో నగరవాసులున్నారు. టౌన్ప్లానింగ్: మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది పట్టణ ప్రణాళిక విభాగమే(టౌన్ప్లానింగ్). ఒకరిద్దరు అధికారుల మూలంగా టౌన్ప్లానింగ్ అంటేనే అవినీతి కూపమనే భావన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో అన్ని పాత్రలు సదరు అధికారులే పోషిస్తున్నారు. ఎక్కడ నిర్మాణం జరిగినా రూ.లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక నిర్మాణాలు వివాదాస్పదమైతే వారి పంట పండినట్లే. రెవెన్యూ: ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వడం, కబ్జాలకు ఇంటి నంబర్లతో సాయం చేయడం, అసెస్మ్ంట్లలో చేతివాటం ప్రదర్శించడం లాంటి ఎన్నో ఘనతలు ఉన్న రెవెన్యూ విభాగంలో ప్రతిరోజు ఏదో ఒక వివాదం తప్పడం లేదు. రెండు ఆర్వో పోస్టులుంటే, డిప్యుటేషన్పై వచ్చిన ముగ్గురిని సర్దుబాటు చేసేందుకు ముగ్గురికి ఆర్వో పోస్టులు ఇవ్వడమే ఈ విభాగ పనితీరుకు నిదర్శనం. ఇంజినీరింగ్: నగర అభివద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఇంజినీరింగ్ విభాగంపై ఆజమాయిషీ లేకుండా పోయింది. కాంట్రాక్టర్లు మనోళ్లైతే చాలు, పనులకు ముందే బిల్లులు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. అభివద్ధి పనుల్లో నాణ్యత చూడాల్సిన కొంతమంది అధికారులు, పర్సంటేజీలు చూసి బిల్లులు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. అభివద్ధి పనుల టెండర్, నాణ్యతలపై ఫిర్యాదులున్నా, కాంట్రాక్టర్ చెబితే చాలు ఆగమేఘాలమీద రన్నింగ్ బిల్లుల పేరిట డబ్బులు చెల్లించడం ఇంజినీరింగ్ స్పెషల్. శానిటేషన్: నగరంలో పారిశుధ్యం (శానిటేషన్)పై ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రోడ్లు, వీధులు, డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనమిస్తోంది. చివరకు చెత్త డబ్బాల వద్ద కూడా రోడ్లపై చెత్తను రోజుల తరబడి తొలగించని పరిస్థితి నెలకొంది. ఇక మెడివేస్ట్, జంతు ఎముకలు లాంటి ప్రమాదకర వ్యర్థాలు కూడా పారిశుధ్య సిబ్బంది సహకారంతో డంప్యార్డ్కు చేరుతున్నాయి. శానిటేషన్ వాహనాలు, అందులో పోస్తున్న డీజిల్కు కాకిలెక్కలే ఆధారం.ప్రక్షాళన చేయాల్సిందే కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్దేశాయ్ గతంలో పలుమార్లు ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక చర్యలు అప్పట్లో సంచలనం సష్టించాయి. కలెక్షన్ ఏజెంట్లుగా మారిన ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల పీఠాలను సమూలంగా మార్చారు. బల్దియా చరిత్రలో మొదటి సారి, పనికి మించి బిల్లులు తీసుకున్న మాధవ కన్స్ట్రక్షన్ నుంచి డబ్బులు రికవరీ చేయించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో, నగరపాలకసంస్థను గాడినపెడతారనే విశ్వాసాన్ని నగరప్రజలు వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేటకు చెందిన వీరవేని భూమలింగం(50) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై ప్రేమానందం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. భూమలింగం గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఎంత వెదికినా ఆచూకీ లభించలేదు. భూమలింగం మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున జగదాంబతండాలో స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భూమలింగం ఇటీవల మద్యానికి బానిసైనట్లు, మద్యం మత్తులో కిందపడి మృతి చెంది ఉంటాడని బంధువులు పేర్కొన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● రూ.4.12లక్షల ఆభరణాలు, నగదు చోరీ ● ఐదుగురిపై కేసు, ఇద్దరి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీ చేసిన కేసులో ఇద్దరిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ గౌస్ఆలం నిందితుల వివరాలను వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్, గతంలో జైలులో పరిచయమైన ఇద్దరితో కలిసి బైకు దొంగిలించారు. ముగ్గురు కలిసి ఈ నెల8న కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లిలోని తాళం వేసిఉన్న ఉప్పుగండ్ల గంగారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని రూ.3.87లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దొంగలించారు. ఆ బంగారంలో కొంత కోనరావుపేటకు చెందిన కొమ్ము నవీన్, మానకొండూర్కు ఓ వ్యక్తికి విక్రయించారు. మరికొంత ప్రైవేట్ ఫైనాన్స్లో కుదవబెట్టి రూ.64వేలు తీసుకున్నారు. మిగితా పంచుకున్నారు. బాధితుడు గంగారెడ్డి ఫిర్యాదుతో గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో కరీంనగర్రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. చోరీ చేసిన ముగ్గురు, బంగారాన్ని కొన్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు హేమంత్ను గంగాధర క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి సమాచారంతో కొమ్ము నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20తులాల బంగారం, 25తులాల వెండి, ఒక బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు. ఏసీపీ శుభం ప్రకాశ్, చొప్పదండి సీఐ ప్రదీప్, క్లూస్టీం సీఐ రాజు, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, సీసీఎస్ ఎస్సై నాగరాజు సిబ్బందిని అభినందించారు. -
రక్తం పంచి.. ఆయువు పెంచి
● రక్తదానానికి ముందుకొస్తున్న యువత ● వాట్సాప్ వేదికగా స్పందిస్తున్న దాతలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సంకరీంనగర్టౌన్: రక్తదానం మహాదానం. ప్రాణా పాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ప్రాణ బఽంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. రోడ్డు ప్రమాదం, క్రిటికల్ డెలివరీ, రక్తహీనత, తలసేమియా, కేన్సర్, శస్త్రచికిత్స ఏదైతేనేం ఆపద సమయంలో రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారు. రక్తం అవసరం ఉందనే విషయం వాట్సాప్, వివిధ రకాల సోషల్మీడియా ద్వారా తెలుసుకుని జిల్లాలోని యువత, వివిధ సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా కథనం. మూడు నెలలకోసారి.. రోడ్డు ప్రమాదాలు, తలసేమిమయా, కేన్సర్, ప్రసవం, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అత్యవసరం. జిల్లాలో ఎక్కువగా రోడ్డుమార్గం ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. క్రిటికల్ డెలికవరీలు, తలసేమియా బాధితులు కూడా ఎక్కువే. ఆపదవేళ రక్తలభ్యత సవాలుగా మారుతోంది. 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులు మూడునెలలకోసారి రక్తదానం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవ్యక్తి జీవిత కాలంలో 168సార్లు రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. 15 రోజులకోసారి ప్లేట్లెట్లు ఇవ్వొచ్చని, రక్తదానం చేసినప్పుడు ఏర్పడిన నష్టం 4 నుంచి 8 రోజుల్లో భర్తీ అవుతుందని వెల్లడిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జిల్లాలో కొందరు సామాజిక బాధ్యతగా రక్తదానం చేస్తూ, చేయిస్తూ ముందుకు సాగుతున్నారు. సా మాజిక మాధ్యమాల ద్వారా బ్లడ్డొనేషన్ ఆర్గనైజేషన్లను నడుపుతున్నారు. నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందేవారు రక్తం అవసరమైతే ఆర్గనైజర్లను సంప్రదిస్తుండగా, వారు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రి బ్లడ్బ్యాంక్, రెడ్క్రాస్తో పాటు మరో 13 ప్రైవేటు బ్లడ్బ్యాంకుల వద్ద దాతల ఫోన్నంబర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఏసీబీ కోర్టు కరీంనగర్ ఇన్చార్జి పీపీగా ప్రసాద్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వేముల లక్ష్మీప్రసాద్ను కరీంనగర్ ఏసీబీ కోర్టు ఇన్చార్జి పీపీగా నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ప్రసాద్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్ మాట్లాడుతూ సాక్షులు భయపడకుండా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరారు. ఎవరైనా నిందితులు సాక్షులను భయపెడితే పోలీస్స్టేషన్లో దరాఖాస్తు ఇస్తే పోలీసులు వారిపై కేసు నమోదు చేస్తారన్నారు. సివిల్ సర్వీస్ లాంగ్టర్మ్కు ఉచిత శిక్షణ కరీంనగర్/పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 16వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఎంపికై న వారికి జూలై 25 నుంచి వచ్చే ఏడాది 30వ తేదీవరకు ఉచిత శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గలవారు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. వివరాలకు 040–24071178 ఫోన్ నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. దళారుల చేతుల్లోకి దేశ సంపద ● సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుజగిత్యాలటౌన్: ప్రజల మధ్య బీజేపీ మతం పేరుతో చిచ్చు పెడుతుందని, దేశ సంపదను పెత్తందార్లకు దోచిపెట్టేందుకు మోదీ దళారీల వ్యవహరిస్తున్నారని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా 4వ మహాసభలు జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్ అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు జగిత్యాల టవర్ సర్కిల్ నుంచి తహసీల్ చౌరస్తా మీదుగా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీజేపీ 11ఏళ్ల పాలనలో దేశంలో పేదరికం పోయిందనడం పచ్చి అబద్ధమన్నారు. పేదరికం పోతే ఇంకా రేషన్ కార్డులు ఎందుకని ప్రశ్నించారు. పేదల పక్షాన పోరాటం చేసే కమ్యునిస్టులంటే బూర్జువా పార్టీలకు ఎప్పటికీ నచ్చదన్నారు. ఎర్ర జెండా ఎప్పటికీ పేదలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దగాకోరు విధానాలతో దేశ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అనంతరం వెంకట్రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్ ముందుచూపుతో పేదల హక్కులు కాపాడేలా రాజ్యాంగాన్ని రచిస్తే మోదీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కమ్యునిస్టులందరూ ఐక్యమై మోదీని గద్దె దించేలా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నాయకులు సుతారి రాములు, ఎన్నం రాధ, ఇరుగురాళ్ల భూమేశ్వర్, ఎండీ అక్రం, వెన్న మహేశ్, మునుగూరి హన్మంతు పాల్గొన్నారు. -
దొంగస్వాముల ముఠా అరెస్టు
కొత్తపల్లి(కరీంనగర్): ఇంటి సమీపంలోని గుప్త నిధులు వెలికితీస్తే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఆరోగ్యంగా మెరుగుపడతారని నమ్మబలికి మోసానికి పాల్పడ్డ దొంగస్వాముల గుట్టురట్టయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దొంగ స్వాములను కటకటాలకు పంపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ వివరాల మేరకు కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఎలగందుల అనుబంధ శ్రీరాముపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ తండ్రి వేములవాడ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడగా కాలు విరిగింది. అతని తల్లి సైతం అనారోగ్యంతో బాధపడుతోంది. పదిరోజుల క్రితం ప్రవీణ్కు ఓ స్వామివేషంలో ఉన్న వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇంట్లో ఏంబాగా లేదని, ఇంటి పక్కన క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా మెరుగవుతారని, లేకపోతే నెలరోజుల్లోనే చనిపోతారని నమ్మపలికాడు. భయపడ్డ ప్రవీణ్ పూజలు చేసేందుకు అంగీకరించగా, విడతలవారీగా రూ.3 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు మొత్తంగా రూ.15.30లక్షలు ప్రవీణ్ వద్ద వసూలు చేశాడు. ఓ రోజు ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పూజలు చేసినట్లు నటించాడు. గొయ్యిలోంచి ఓ డబ్బా బయటకు తీసి అందులో కిలో బంగారం ఉంటుందని దేవుని గదిలో దాచిపెట్టాలని సూచించాడు. మరికొంత డబ్బు కావాలని లేకుంటే తండ్రిని చంపి ఇక్కడే పాతిపెడతామని ప్రవీణ్ను బెదిరించగా, కొంత డబ్బు అప్పు చేసి వారికి ఇచ్చాడు. తరువాత మోసపోయానని గ్రహించి కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరికి చెందిన ఈర్నాల రాజు, ఆగ్రహారంకు చెందిన మిరియాల చంద్రయ్య, చీర్లవంచకు చెందిన పెనుగొండ రాజు, చల్లా అజయ్, ఈర్నాల సతీశ్ ముఠాగా ఏర్పడి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.15.30 లక్షల నగదు, 7తులాల బంగారం, మూడు కార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, ఏఎస్సై లక్ష్మారెడ్డిని సీపీ గౌస్ఆలం, ఏసీపీ శుభం ప్రకాశ్ అభినందించారు. రూ.15,30 లక్షల నగదు, 7తులాల బంగారం, 3 కార్లు, 7సెల్ఫోన్లు స్వాధీనం -
మొబైల్ చూస్తున్నావని మందలించినందుకు..
రామగిరి(మంథని): నిత్యం మొబైల్ చూ స్తున్నావని తండ్రి మందలించినందుకు మనస్తాపం చెందిన లెక్కల శివశంకర్ (17) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం.. రత్నాపూర్ పంచాయతీ పరిధి లక్ష్మీనగర్ ఫ్లాట్లలో నివాసం ఉండే శివశంకర్.. మొబైల్ ఫోన్లో తరచూ చాటింగ్ చేస్తున్నాడు. అలా చేయొద్దని తండ్రి వెంకన్న మందలించాడు. దీంతో ఈనెల 4న శివశంకర్ పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందాడు. శుక్రవారం ఇంటికి తీసుకొని వస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. -
గేదె కోసం వెళ్తే ప్రాణం పోయింది
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి అల్లూరు గగ్గిరెద్దులవాడలో నివాసం ఉంటున్న ఆవుల కొమురయ్య(50) శుక్రవారం గ్రామశివారులోని చెరువులో మునిగి మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. రోజులాగా చెరవు సమీపానికి పశువులను మేతకోసం తరలించాడు. పశువులు చెరువులోకి వెళ్లడంతో బయటకు పంపించేందుకు అతడూ చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. మరోపశువుల కాపరి నర్సయ్య స్థానికుడు పోచంకు విషయం చెప్పాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు చేరుకుని గాలించారు. కొమురయ్యను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై హైమదుల్లా తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. చెరువులో మునిగి కాపరి మృతి -
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఇల్లంతకుంట(మానకొండూర్): కుటుంబ కలహాలతో గురువారం గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన పండుగ చక్రపాణి(43) కొంతకాలంగా తన భార్య, తల్లితో విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామపెద్దల సమక్షంలో అనేకసార్లు పంచాయితీలు జరిగాయి. దీంతో కలత చెందిన చక్రపాణి గురువారం గడ్డి మందు తాగాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని అన్న అశోక్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. -
మాబ్ ఆపరేషన్ డ్రిల్పై శిక్షణ
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధి లోని ఏఆర్, క్విక్ రియాక్షన్ టీం సిబ్బందికి సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో సీటీసీలో మాబ్ ఆపరేషన్పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అల్లరి మూకలను సమర్థవంతంగా చెదరగొట్టడానికి పోలీసులు నిర్వర్తించాల్సిన విధులను అభ్యాసం చేయడమే ఈ శిక్షణ ఉద్దేశం అన్నారు. లాఠీ డ్రిల్, గ్యాస్ గన్ పేల్చే విధానం, ఫైరింగ్, స్మోక్ గన్ ఫైరింగ్, వజ్ర వాహనం వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఆర్ఐలు రజనీకాంత్, జానీమియా, కుమారస్వామి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో వైద్య శిబిరాలు కరీంనగర్టౌన్: జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్, క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు, అధిక రక్తపోటు, షుగర్ స్క్రీనింగ్ చేసి మందులు అందజేశారు. సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, వైద్యాధికారులు ఉమాశ్రీ, సాజిదా, సనజవేరియా, విమల, అలేఖ్య, నవ్య, సాయిప్రసాద్, ప్రణీత పాల్గొన్నారు. విజయవంతం చేయండి కరీంనగర్: రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో జూలై 12,13 తేదీల్లో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకత్వం హాజరవుతుందని, ప్రొఫెసర్లు, మేధావులు వస్తున్నారన్నారు. చరణ్, దిరాజ్ వంశీ, విష్ణు,వేణు, రాహుల్, రాకేశ్, విజయ్, ప్రణయ్, సాయి, సిద్ధు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందిస్తాంతిమ్మాపూర్: మండలంలోని రామకృష్ణకాలనీ ప్రా థమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా జరిగింది. డీఈవో మొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాణ్యమై న విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎంఈవో శ్రీని వాస్ మాట్లాడుతూ.. ఉన్నతవిద్యను అందించడానికి తమవంతు సహకారం అందిస్తామన్నా రు. హెచ్ఎం ఎం.మహేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్, సింగిల్ విండో చైర్మన్ రవీందర్రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎంలు పి.శ్రీనివాస్, చైల్డ్ సంరక్షణ కోఆర్డినేటర్ సంపత్, జీసీడీవో కపారాణి, పాఠశాల చైర్మన్ పురంలక్ష్మి, పాల్గొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఆహ్వానం కరీంనగర్: తపాలశాఖ కరీంనగర్ డివిజన్ పరిధిలో, కమిషన్ బేసిస్తో తపాల జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18–50ఏళ్ల మధ్య ఉన్న కరీంనగర్ డివిజన్కు చెందినవారు అర్హులన్నారు. దరఖాస్తులను కరీంనగర్ డివిజన్ఆఫీస్లో ఈనెల 27లోపు అందజేయాలని, ఎంపికై న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ డిపాజిట్గా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,400 జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ శుక్రవారం పత్తి ధర గరిష్టంగా రూ.7,400 పలికింది. 31క్వింటాళ్ల పత్తిని రైతుల తెచ్చారు. శని, అదివారాలు మార్కెట్కు సెలవు ఉంటుందని కార్యదర్శి మల్లేశం తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 55 ఏళ్ల వయసుగల వ్యక్తి చనిపోయి ఉన్నాడన్న స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్కుమార్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ మధుసూదన్రెడ్డి, వినయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. ముత్యంపేట కారోబార్ రాజేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. భూ వివాదంలో రైతు ఆత్మహత్యాయత్నంకరీంనగర్రూరల్: భూ వివాదంలో ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం మేరకు.. ఆరెపల్లికి చెందిన రైతు వీణవంక రమేశ్కు కరీంనగర్ మండలం నగునూరులో వారసత్వంగా వచ్చిన 2.20 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. కొందరువ్యక్తులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకుని మోఖాపైకి వస్తే చంపుతామంటూ రమేశ్ను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈనెల 10న నగునూరులోని భూమి వద్దకు వెళ్లిన రమేశ్ సెల్ఫీవీడియో తీసుకుని తాను క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్టేటస్ పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రమేశ్ను చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రైతు ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. భార్య కిడ్నీ ఇచ్చినా దక్కని ప్రాణం● అమర్చిన మరుసటి రోజే భర్త మృతి కోరుట్ల రూరల్: కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన వంగ మల్లేశం (50) కిడ్నీ మార్చిన మరుసటి రోజే మృతి చెందాడు. మల్లేశంకు ఐదేళ్ల క్రితం రెండు కిడ్నీలు పాడయ్యాయి. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆయన భార్య లక్ష్మి కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించగా.. నెల రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మి ఓ కిడ్నీ తీసి మల్లేశంకు అమర్చారు. బుధవారం ఆసుపత్రిలోనే మృతి చెందాడు. భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు భార్య కిడ్నీ దానం చేసినప్పటికీ మృతి చెందడం కుటుంబంలో విషాదం నింపింది. మల్లేశం దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. -
జాతీయ ఒలింపియాడ్లో అల్ఫోర్స్ విద్యార్థులకు పతకాలు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి ఒలింపియాడ్ పోటీల్లో బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకం అందుకున్నారని సంస్థ చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. స్థానిక అల్ఫోర్స్ స్కూల్లో గురువారం పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంగ్లిష్ ఒలింపియాడ్లో రసగ్న (9వ తరగతి) బంగారు పతకం, కంప్యూటర్ ఒలింపియాడ్లో హేమంత్ జాదవ్ (10వతరగతి) బంగారు పతకం, హింలో ఎ.శ్రీ యాన్రెడ్డి (4వ తరగతి), యు.సాత్రివ్ (6వ తరగతి), ఇ.లిఖిత్ కుమార్ (8వ తరగతి), పి.నమన్వి త (10వ తరగతి) బంగారు పతకాలు, సోషల్ ఒలి ంపియాడ్లో హవీశ్రెడ్డి (6వ తరగతి), యం.శివేన్ రెడ్డి (8వ తరగతి) బంగారు పతకాలు, సోషల్ ఒలింపియాడ్లో ఎ.యశ్చంద్ర (9వ తరగతి)స్టేట్ టాపర్గా, నేషనల్ ఎస్సే ఒలింపియాడ్లో బి.తన్మయి (7వ తరగతి) స్టేట్ర్యాంక్, ఇంటర్నేషనల్ డ్రాయింగ్లో ముగ్గా హాసిని (10వ తరగతి) స్టేట్ ర్యాంక్, సోషల్లో ఎ.శ్రీయాన్ రెడ్డి (4వ తరగతి) స్టేట్ ర్యాంక్లు సాధించడం హర్షణీయమన్నారు. -
మిడ్మానేరు ప్రాజెక్టు పరిశీలన
● జిల్లాలో ముగిసిన కేంద్రబృందం పర్యటన బోయినపల్లి(చొప్పదండి): మిడ్ మానేర్ ప్రాజెక్టును కేంద్ర బృందం అధికారులు గురువారం పరిశీలించారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రటరీ సెంతల్ రాజన్ ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ సుధీర్ కుమార్, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజషన్ ఈఈ ధీరజ్ సింఘాల్ పరిశీలించారు. వరదకాలువ నిర్మాణంలో కేంద్ర నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు.. ప్రాజెక్టు నుంచి ఏయే ప్రాంతాలకు నీళ్లు తరలిస్తారనే విషయం తెలుసుకున్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఈఈ జగన్, డీఈలు రాజు, శ్రీనివాస్, ఏఈలు రాధిక, అనుపమ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. మూడు పంటలు పండుతున్నాయి – కేంద్ర బృందం అధికారులతో వరదకాల్వ రైతులు ఇల్లంతకుంట(మానకొండూర్): వరదకాల్వ పూర్తయిన తర్వాత మూడు పంటలు పండిస్తున్నామని మండలంలోని గాలిపల్లి రైతులు కేంద్ర బృందం అధికారులకు తెలిపారు. రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం అధికారులు గురువారం మండలంలోని పొత్తూరు మానేరువాగుపై నిర్మించిన మిడ్మానేరు కుడికాలువ దాని డిస్ట్రిబ్యూటరీ కాలువలను గురువారం పరిశీలించారు. గాలిపల్లిలో డిస్ట్రిబ్యూటరీ–4 వద్ద రైతుల నుంచి పంటల సాగు వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటన ముగిసిందని, సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ప్రాజెక్టు పరిశీలించనున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ ఈఈ ధీరజ్సింగాల్, గ్రౌండ్ వాటర్బోర్డ్ సైంటిస్ట్ ఎం.సుధీర్కుమార్, జిల్లా ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జగన్, డిప్యూటీ ఇంజినీర్లు శ్రీనివాస్, అంజయ్య, రాజు, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నాయకుడిపై దాడి
● కేసు నమోదు జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడిపై అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు దాడిచేశాడని టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లిలోని కసుబోజుల వెంకన్న ఇంటికి బుధవారం రాత్రి వెళ్లిన దేశిని కోటేశ్వర్(కోటి) రాబోయే ఎన్నికల్లో తనకు సపోర్టు చేయాలని బెదిరిస్తూ కర్రతో తలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అతని భార్యపై సైతం దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తిరుపతికి ప్రత్యేక రైలు● మంత్రి పొన్నం విజ్ఞప్తికి స్పందించిన రైల్వే కరీంనగర్ కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్: కరీంనగర్ నుంచి తిరుపతికి రైళ్ల సేవలను పెంచుతూ గురువారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించిన రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైలును జూలై 6 నుంచి నడిపించనున్నారు. ప్రతి ఆదివారం రాత్రి 7.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. సోమవారం సాయంత్రం 5.30కు కరీంనగర్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8.25కు తిరుపతి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రద్దీని బట్టి రెగ్యులర్గా నడిచే అవకాశముంది. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి బండి సంజయ్కి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలును ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి మూడేళ్ల జైలు జగిత్యాలజోన్: ఇంటర్ బాలికపై అత్యాచారా నికి యత్నించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.12,200 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి సి.రత్న పద్మావతి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంట ర్ చదువుతోంది. కరోనా సమయంలో లాక్డౌన్తో ఇంటి వద్ద ఆన్లైన్లో క్లాస్లు వింటోంది. బాలిక ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండగా.. అదే గ్రామానికి చెందిన రెడపాక శ్రీనివాస్ ఎప్పుడూ బాలిక ఇంటి వైపు చూ స్తుండేవాడు. 26 జనవరి 2021న బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. బా లిక ఇంట్లో బట్టలు మార్చుకుంటోంది. శ్రీని వాస్ ఇంట్లోకి వెళ్లి ఆమైపె అత్యాచారం చేయబోయాడు. బాలిక పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి తల్లితండ్రులకు ఫోన్ ద్వారా తెలి పింది. దీంతో వారు గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై బి.జీవన్ కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కిరణ్కుమార్, శ్రీధర్, రాజు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. పరిశీలించిన జడ్జి నిందితుడైన శ్రీనివాస్కు మూడేళ్ల జైలు, రూ.12,200 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. -
తరగతి గదుల్లోనే దేశభవిష్యత్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): దేశభవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజు గురువారం ఎమ్మెల్సీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు జాతీయతభావం, దేవభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ అలవర్చాలని, అందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశానని గుర్తుచేశారు. డీఈవో మాధవి, ఎంఈవో మహేశ్ కుమార్ మాట్లాడారు. ఉపాధ్యాయుల కృషితో బడిబాట ద్వారా మండలస్థాయిలో మొత్తం 250 మంది విద్యార్థులను ప్రవేశాలు కల్పించామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, స్కూల్ కాంగ్లెక్స్ హెచ్ఎం సునీత, పీఎస్ హెచ్ఎం రాజారాం, మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్రెడ్డి, నాయకులు కావేటి రాజగోపాల్, ఈర్ల శంకర్, చిలువేరు సదాశివ, రఫీ, గరిడె కిషన్, ముల్కోజు వెంకన్న, తిరుపతి, సీను తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మల్క కొమురయ్య -
మరికొందరు ఇంజినీర్లు!
ఏసీబీ రాడార్లోసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేసిన ఇరిగేషన్ అధికారి నూనె శ్రీధర్ కాళేశ్వరంలో భాగమైన అదనపు టీఎంసీ పనుల్లో ఇరిగేషన్ క్యాడ్ డివిజన్– 8 ఈఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై దాడులు జరిగాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ దాడులు ఒక్కరితో ఆగేలా లేవు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరింత మంది ఇంజినీర్లపై ఏసీబీ దాడులు జరపనుంది. ఈ డివిజన్లో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ డివిజన్లో మొత్తం నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో సబ్ డివిజన్కు ఒక డీఈఈ, అతనికి సహాయకంగా ఐదుగురు జేఈ ఈలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఆదాయానికి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీంతో కొన్ని రోజులుగా ఏసీబీ వీరి ప్రతీ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టింది. డివిజన్లో పనిచేస్తున్న ప్రతీ సిబ్బంది ఆస్తి పాస్తులు, వారు ప్రాజెక్టులో చేరినప్పటి నుంచి ఇప్పుటివరకు ఆస్తులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించినట్లు సమాచారం. ఇందులో కొందరు ఆస్తుల్లో గణనీయమైన ఎదుగుదల ఉన్నట్లు తెలిసింది. ఈ డివిజన్లో పనిచేస్తున్న కొందరు అధికారులు హైదరాబాద్, బెంగళూరుల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. కొన్నిచోట్ల విల్లాలు, రెస్టారెంట్లు, ఖరీదైన కార్లు కొన్నట్లు గుర్తించింది. కొంతకాలంగా వీరి ఇళ్లల్లో జరిగిన వివాహ, ఇతర వేడుకలకు భారీగా వెచ్చించడాన్ని కూడా ఏసీబీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం ఏసీబీ అధికారులు పలు రెస్టారెంట్లలో సోదాలు చేయడమే ఈ డివిజన్లో పనిచేసే సిబ్బందికి ఆయా రెస్టారెంట్లలో వాటాలు ఉన్నాయన్న ఖచ్చితమైన సమాచారానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో త్వరలోనే మరింత మంది అధికారులపై ఏసీబీ దాడులు చేయనున్నట్లు సమాచారం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి డివిజన్లో పనిచేస్తున్న చాలామంది అధికారులకు స్థానచలనం కలగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లోనూ రాష్ట్రమంతటా ట్రాన్స్ఫర్లు జరిగినా.. వీరికి ప్రత్యేక మినహాయింపు రావడం వెనక భారీ లాబీయింగ్ జరిగిందని ప్రచారం సాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టులో ఇటీవల విచారణ కమిషన్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ ఇంజినీర్లు కూడా గతంలో ఇదే అదనపు టీఎంసీ ప్రాజెక్టులో పనిచేసిన వారే కావడం గమనార్హం. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ ప్రాజెక్టు ఇంజినీర్ నివాసాల్లో సోదాలు భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని ఏసీబీకి వరుస ఫిర్యాదులు రెస్టారెంట్లు, విల్లాలు, ఖరీదైన కార్లు కొన్నట్లు గుర్తించిన ఏసీబీ -
రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం
కరీంనగర్ అర్బన్: రైతులు పండించిన విత్తన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి అన్నారు. నూతన విత్తన చట్టం ముసాయిదాను రూపొందించడంలో భాగంగా గురువారం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక కేడీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్లో విత్తన కంపనీ, విత్తన ఆర్గనైజర్లు, విత్తన డీలర్లు, రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. ప్రభుత్వం విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోకుండా ముసాయిదా విత్తన చట్టం రూపొందిస్తోందని వివరించారు. ప్రస్తుత చట్టంలోని శిక్షలను పెంచుతూ ఉత్పత్తిదారులు, ఆర్గనైజర్లకు వర్తింపజేయాలని రైతులు అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులు డి.నర్సింహరెడ్డి, కమిషనరేట్ ప్రతినిధి పుష్పరాణి, వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఉషారాణి, శ్రావణి, విజయభాస్కర్, మధుకర్, కేవీకే శాస్త్రవేత్త విజయ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఏలు, ఏవోలు, రైతులు, ఉత్పత్తిదారులు, ఆర్గనైజర్లు, డీలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేశ్రెడ్డి -
సంతానం కోసం వెళ్తే ప్రాణమే పోయింది
జగిత్యాలక్రైం: ఆమెకు సుమారు 18 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. సంతానం లేకపోవడంతో పూజలు చేసింది. దేవుళ్లకు మొక్కింది. పలు ఆస్పత్రుల్లోనూ చూపించుకుంది. అయినా పిల్లలు కలగలేదు. చివరి ప్రయత్నంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించగా.. వారు ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుడుతారని చెప్పడంతో అమ్మతనం కోసం అంగీకరించింది. అయితే ఆ అమ్మతనం పొందకుండానే సదరు ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సమయంలో మృతిచెందింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత గంగాధర్కు అదే గ్రామానికి చెందిన రాజవ్వతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కాకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలికి చూపించుకుంది. వైద్యురాలు గర్భసంచి ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేస్తుండానే మృతిచెందింది. ఆమె మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై గీత ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. పోచంపేటలో విషాదం రాజవ్వ మృతిచెందడంతో ఆమె గ్రామంలో విషా దం చోటుచేసుకుంది. భర్త గంగాధర్ వ్యవసాయం చేస్తుండగా.. రాజవ్వ బీడీలు చుడుతోంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా నిండు ప్రాణం పోవడంతో గ్రామంలో విషాదం నిండింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన -
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
శంకరపట్నం: మండలంలోని కాచాపూర్శివారులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహ నం ఢీకొని తాటికొండ పుష్పలీల(65), రామస్వామి (68) దంపతులు చనిపోయారని ఎస్సై రవి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రామస్వామి, పుష్పలీల ద్విచక్రవాహనంపై హుజూరాబాద్ వెళ్తున్నవారు. మార్గమధ్యలో మండలంలోని కాచాపూర్ శివారులో వీరి వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పుష్పలీల అక్కడికక్కడే మరణించింది. రామస్వామికి తీవ్రగాయాలు కాగా 108 లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మలేసియాలో గుండెపోటుతో మల్లాపూర్ వాసి.. మల్లాపూర్: ఉపాధి కోసం మలేసియా వెళ్లిన మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన నారి తుక్కారాం (35) పదిరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందినట్లు గురువారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. స్థానికుల కథనం ప్రకారం.. తుక్కారాం ఉపాధి కోసం కొంతకాలంగా మలేసియాకు వెళ్లివస్తున్నాడు. ఈనెల 3న అక్కడే గుండెపోటు రావడంతో మరణించాడు. అక్కడి భారతీయుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తుక్కారాం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులను కోరారు. పరుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య తిమ్మాపూర్: పైళ్లెన నెల రోజుల్లోపే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు గ్రామానికి చెందిన పెసర శ్రీకాంత్(30)కు మే 16న వివాహమైంది. వారం క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. శ్రీకాంత్ బుధవారం అత్తగారింటికి వెళ్లి వచ్చిన తర్వాత పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఉరేసుకొని యువకుడు..యైటింక్లయిన్కాలనీ(రామగుండం): గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి యైటింక్లయిన్కాలనీ షిర్కెక్వార్టర్స్ ఏరియాలో నివాసం ఉంటున్న గోషిక రోహిత్(29) గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్.. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లడంతో అతను నిద్రపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. సాయంత్రం వరకూ కుమారుడు బయటకు రాకపోవడంతో గదిలోకి వెళ్లి చూడగా అప్పుడికే ఉరేసుకొని కనిపించాడు. తమ కుమారుడిని కొందరు ఆర్థికపరమైన లావాదేవిల కోసం కొంతకాలంగా వేధిస్తున్నారని మృతుని తండ్రి అశోక్ పోలీసులకు తెలిపాడు. ఈవిషయంపై తమకు ఫిర్యాదు అందలేదని గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్రావు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపూ విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వరకట్న వేధింపులకు వివాహిత.. తిమ్మాపూర్: వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్కు చెందిన స్వప్నకు అదే గ్రామానికి చెందిన గూళ్ల వెంకటేశ్తో పదేళ్ల క్రితం వివాహమైంది. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేదిస్తుండగా బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. -
బర్త్, డెత్ సర్టిఫికెట్లు రావట్లే
● బొమ్మకల్, కొత్తపల్లిలో వింత పరిస్థితి ● ఆన్లైన్లో లభ్యం కాని వివరాలు ● ఆయా ప్రాంతాల్లో నిలిచిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ● సీడీఎంఏ ఆదేశించినా, పరిష్కరించని మీసేవ డిపార్ట్మెంట్ ● పొరపాటుపై బల్దియా, సీడీఎంఏ పరస్పర ఆరోపణలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇటీవల కరీంనగర్ బల్దియాలో విలీనమైన గ్రామాలు బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయి. నేటికీ పలు విభాగాల వివరాలు కరీంనగర్ కార్పొరేషన్కు అనుసంధానం కాకపోవడంతో విలీన గ్రా మాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ కాక బొమ్మకల్తో పాటు కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనవరిలో విలీనం ఈ ఏడాది జనవరిలో నగరపాలక సంస్థలో చింతకుంట, మల్కాపూర్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేశారు. బల్దియా అధికారులు ఆయా గ్రామ పంచాయతీల రికార్డులు, జనన మరణాల రిజిష్టర్లు స్వాధీనం చేసుకున్నారు. జనన, మరణ మీసేవ ఆన్లైన్ డేటా.. ఫిబ్రవరి వరకు నగరపాలక సంస్థ మీసేవ పోర్టల్లో విలీనం కావాలి. కానీ పాత డేటా విలీనం కాకపోవడంతో ఆన్లైన్లో వివరాలు కనిపించక మీసేవలో దరఖాస్తు చేసుకోవడంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీడీఎంఏ, బల్దియా తప్పు మీదంటే.. మీదంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. కనిపించని వివరాలు బల్దియాలో ఏప్రిల్ తరువాత దరఖాస్తు చేసుకున్నవారికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. ఫిబ్రవరి కన్నా ముందు చోటు చేసుకున్న జనన, మరణ సర్టిఫికెట్లు ఆన్లైన్లో చూపించడం లేదు. ఈ విషయమై పలువురు నగరపౌరులు సీడీఎంకేకు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని సీడీఎంఏ మీసేవ విభాగాన్ని ఆదేశించింది. చింతకుంట, మల్కాపూర్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలకు సంబంధించి నాలుగు అదనపు లిస్టులను కరీంనగర్ నగరపాలక సంస్థ– మీసేవ లాగిన్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. బొమ్మకల్, కొత్తపల్లి జనన మరణ రికార్డులు ఇంకా కరీంనగర్ నగరపాలక సంస్థ జనన మరణ రికార్డుల విభాగా నికి జత కాలేదు. దీంతో బొమ్మకల్, కొత్తపల్లి పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు జరిగిన జన న, మరణాల సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారు. మీసేవాలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ డేటా కరీంనగర్ బల్దియాతో అనుసంధానం కాకపోవడం వల్ల ప్రాసెస్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా బొమ్మకల్, పరిధిలో ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో రోజూ పదుల సంఖ్యలో జనన, మరణాలు జరుగుతుంటాయి. ఈ ఆసుపత్రికి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి ప్రజలు ప్రసూతి సేవల కోసం వస్తుంటారు. దీంతో వీరంతా సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు.సీడీఎంఏ, బల్దియా పరస్పర ఆరోపణలు ఈ విషయమై ‘సాక్షి’ సీడీఎంఏ అధికారి చక్రధర్ని సంప్రదించగా... తాము ఇదివరకే పా త డేటా ఎలా అనుసంధానం చేయాలో వివరిస్తూ ప్రొసీజర్ పంపామని బదులిచ్చారు. వారు దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. బల్దియా అధికారులు సీడీఎంఏ వద్దే సమస్య ఉందని కుండబద్దలు కొడుతున్నారు. ప్రజలకు అత్యవసరమైతే మాన్యువల్గా సర్టిఫికెట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. -
‘సీఎమ్మార్’లో వేగం
● రికార్డుస్థాయిలో బియ్యం డెలివరీ ● వానాకాలం సీజన్లో పెరిగిన వేగం ● ముందంజలో పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు ● జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో నత్తనడకనే సాగిన వైనంసాక్షి, పెద్దపల్లి: రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ (సీఎమ్మార్– మర ఆడించి) చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చిన రైస్ మిల్లర్లు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దిగొస్తున్నారు. సీఎమ్మార్పై ప్రత్యే కంగా దృష్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్యారంటీ బాండ్లు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయింపులు చేస్తుండడంతో మిల్లర్లు దారికొస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఇటీవల సన్నబియాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుండడంతో రీసైక్లింగ్ దందాకు చెక్పెట్టినట్లయ్యింది. దీంతో పెద్దపల్లి జిల్లా 90శా తంతో రాష్ట్రంలో రెండోస్థానంలో ఉండగా, కరీంనగర్ నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే, జగి త్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సీఎమ్మార్ డెలివరీ చేయడంలో వెనకబడ్డాయి. బ్యాంక్ గ్యారంటీ షరతు కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభు త్వం మిల్లర్లకు ఇస్తోంది. మిల్లర్లు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్రైస్, 67 కిలోల రారైస్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అవసరమైన రేషన్బియ్యం కోటా తీసు కొని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి అప్ప గించాలి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ఇప్పటిదాకా తమ ఆర్థికాభివృద్ధికి వినియోగించుకునేవారు. బియ్యం అప్పగించకుండానే ధాన్యాన్ని విక్రయించి ఆ డబ్బతో వ్యాపారాలు నిర్వహించేవారు. రూ.కోట్ల విలువైన ధాన్యం రైస్మిల్లర్లుకు వరంగా మారినా అధికారులు పటిచుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతోనే మిల్లర్లు సీఎమ్మార్ ఇవ్వడంలో జాప్యం చేసేవారు. ప్రస్తుతం టాస్క్ఫోర్స్, రెవెన్యూ, సివిల్ సప్లయీస్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం, కేసులు నమో దు చేయడంతోపాటు ఆస్తుల జప్తుకూ వెనుకాడడం లేదు. దీంతోపాటు, సీమ్మార్ డిఫాల్ట్ను నివారించడానికి బాండ్లు ఇచ్చినవారికే ధాన్యం కేటాయింపులు చేశారు. సర్కారు ధాన్యాన్ని ఇప్పటికే విక్రయించి న మిల్లర్లు ఇప్పుడు బయట వడ్లు సేకరించి మరీ మిల్లింగ్ చేసి సర్కారుకు బియ్యం ఇస్తున్నారు. దీంతో సీఎమ్మార్ డెలివరీ వేగవంతమైంది. రికార్డు నమోదు రైస్మిల్లర్లకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం సీఎమ్మార్ను త్వరగా పూర్తిచేయాలి. గత వానాకాలం మిల్లింగ్ను త్వరగా పూర్తిచేసేలా తీసుకున్న చర్యలతో సీఎమ్మార్ను వేగంగా సేకరించగలిగాం. రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా రెండోస్థానంలో ఉంది. – శ్రీకాంత్రెడ్డి, డీఎం, పెద్దపల్లి పౌర సరఫరాలు2024–25 వానాకాలం సీజన్ సీఎమ్మార్(మెట్రిక్ టన్నుల్లో) జిల్లా ఇచ్చిన ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం ఇచ్చింది శాతం పెద్దపల్లి 2,97,379 1,99,750 1,80,487 90 కరీంనగర్ 2,60,679 1,75,589 1,43,946 82 జగిత్యాల 3,08,271 2,08,277 1,19,642 57 సిరిసిల్ల 2,11,572 1,42,327 61,364 43 -
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి
కరీంనగర్క్రైం: విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ సూచించారు. ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(గంజ్)లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. తప్పు చేసినా.. నిజాయితీగా ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి చట్ట పరమైన సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మోదీ పాలన భారత్ను విశ్వవేదికపై నిలబెట్టింది కరీంనగర్టౌన్: 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం, 11ఏళ్లలో దేశ దిశాదశను మార్చిందని, భారత వైభవాన్ని విశ్వవేదికపై నిలబెట్టిందని పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి పేర్కొన్నారు. అధిష్టానం పిలుపుమేరకు 11ఏళ్ల మోదీ ప్రభుత్వం– సంకల్ప సాకారం పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్తో దేశానికి, ప్రపంచానికి ప్రధాని మోదీ నాయకత్వాన్ని చూపెట్టారన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందన్నారు. అంతకుముందు 11ఏళ్ల మోదీ ప్రభుత్వ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గీతామూర్తి, మాజీ మేయర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. బస్పాస్ల చార్జీలు తగ్గించాలి కరీంనగర్: ఆర్టీసీ బస్పాస్ చార్జీలు 20శాతం నుంచి 50శాతం పెంచడం అన్యాయమని, వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్పాస్ ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్కాలర్షిప్లు రాక విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం పడుతోందన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సు చార్జీలు పెంచుతున్నట్లు బహిరంగ ప్రకటన చేయకుండానే, దొడ్డి దారిన రేషనలైజేషన్ పేరిట చార్జీలు పెంచి ప్రయాణికులపై భారాన్ని మోపుతున్నారని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు ఎడ్ల రమేశ్, జిల్లా నాయకులు జి.తిరుపతినాయక్, పుల్లెల మల్లయ్య, వినయ్సాగర్ పాల్గొన్నారు. 14న జాతీయ లోక్ అదాలత్● సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారని సీపీ గౌస్ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, బ్యాంక్, చెక్బౌన్స్, మోటార్ ప్రమాద కేసులతోపాటు కోర్టుకు రాని మొదలగు కేసులు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తమ కేసులు రాజీ చేసుకోవాలంటే కక్షిదారులు సంబంధిత పోలీసులను కాని, న్యాయసేవ అధికార సంస్థను కాని సంప్రదించి రాజీ చేసుకోవచ్చని సూచించారు. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘తుమ్మల’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా తుమ్మ ల నాగేశ్వరరావు నియమి తులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ల ఇన్చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ మంత్రిగా శ్రీధర్బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్ను కొనసాగించారు. అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు.బల్దియా కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా అశ్విని● వరంగల్కు చాహత్ బాజ్పేయ్ బదిలీకరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ నియామకం అయ్యారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా ఉన్న ప్రఫుల్ దేశాయ్ని కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొనసాగిన చాహత్ బాజ్పేయ్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న అశ్విని కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు. -
బడీడు పిల్లలను పనికి పంపొద్దు
కరీంనగర్: బడీడు పిల్లలను పనికి పంపొద్దని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి సూచించారు. బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ.. బడికి పంపాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కౌమార దశ కార్మిక నిషేధ నియంత్రణ చట్టం–2016 ఉల్లంఘిస్తే రూ.25వేల జరిమానా, జైలు శిక్ష ఉంటుందన్నారు. జిల్లాలో బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా 94908 81098కు సమాచారం ఇవ్వాలన్నారు. -
ఎక్కడి సమస్యలు అక్కడే!
● జిల్లాలో పర్యవేక్షణ అధికారుల కరువు ● అక్కడక్కడ వసతుల లేమి ● రూ.కోట్లు వెచ్చిస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ● డీఈవో సైతం ఇన్చార్జియే ● నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కరీంనగర్: వేసవి సెలవులు ముగిశాయి.. విద్యార్థులు ఆటపాటలకు టాటా చెప్పి.. బడిబాట పట్టే సమయం రానేవచ్చింది.. ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా సర్కారు స్కూళ్లు కొద్దిపాటి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పర్యవేక్షణాధికారుల లేమి, అక్కడక్కడ మౌలిక వసతులలేమి, తదితర సమస్యలతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రైవేట్ పాఠశాలలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ ఏడాది కూడా పాత సమస్యలతోనే స్వాగతం పలుకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని 16 మండలాలకు గాను 16 మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే కొనసాగుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీరాం మొండయ్య సైతం ఇన్చార్జిగానే కొనసాగుతున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఇద్దరు ఉప విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జీల పాలన సాగుతోంది. దీంతో ప్రాథమిక పాఠశాలల విద్యవ్యవస్థ మెరుగుకై కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వ విద్య పేదల దరి చేరడంలేదు. వీటికి తోడు పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనేతర సిబ్బంది కొరత, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తూ చదువులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు చదువు అంతంత మాత్రమే అందుతోంది. సర్కారు పాఠశాలల్లో సమస్యల కారణంగా ప్రతీ సంవత్సరం వందలాది మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైౖవేటుకు వెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 651, కేజీబీవీలు 12, ఆదర్శ పాఠశాలలు 11 ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,60,377 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోయి పిల్లలను ప్రైౖవేట్ పాఠశాలల్లో చేర్చడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల సంఖ్యకు మించి పోవడం జరుగుతోంది. ఈ పరిణామం అటు విద్యాశాఖను ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. పరిస్థితి ఇలానే ఉంటే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఏ మేరకు మిగులుతాయో వేచి చూడాలి. ఇద్దరు ఉప విద్యాధికారులు ఇన్చార్జిలే.. ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే ఉప విద్యాధికారుల పోస్టులు కరీంనగర్, హుజూరాబాద్తో పాటు జిల్లా పరిషత్ డెప్యూటీ ఈవోలంతా ఇన్చార్జిలే. సబ్జెక్టు టీచర్ల కొరత అక్కడక్కడ ఉండడంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు విషయ పరిజ్ఞానం దెబ్బతింటోంది. టాయిలెట్లు.. ప్రహరీ లేవు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో మూత్రశాలలు.. ప్రహరీ లేకపోవడం కీలకం. మల, మూత్ర విసర్జన వసతుల లేక ముఖ్యంగా విద్యార్థినీలు అవస్థలు పడుతున్నారు.మన ఊరు–మన బడి, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా దండిగా నిధులు రావడంతో మెజార్టీ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. కొన్ని పాఠశాలల్లో ప్రహరీ లేకపోవడం, మరుగదొడ్ల పరిస్థితి అలానే ఉంది. దీంతో బహిర్భూమి కోసం విద్యార్ధినీలు ఇంటికి వెళ్తున్నారు. కనీసం వసతి కూడా లేకపోవడంతో.. పిల్లల్ని సర్కారు స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకురావడం లేదు. స్కూళ్లలో విద్యార్ధినీల ఎన్రోల్మెంట్ తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. ఇదిలావుంటే.. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం ఆరంభం వరకు ప్రతీ పాశాలలో టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.అయిన ఇప్పటి వరకు మరుగుదోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. విద్యాశాఖ మాత్రం పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం.72 స్కూళ్లలో ప్రహరీ గోడ నిర్మాణం లేదు. దీంతో.. విద్యార్థినీ, విద్యార్థులకు పిచ్చికుక్కలు.. పందులతో పాటు ఆకతాయిల నుంచి ప్రమాదం పొంచి ఉంది. స్థానికత ఏది? ప్రభుత్వ పాఠశాలలు : 651 ఉపవిద్యాధికారుల ఖాళీ : 02 మండల విద్యాధికారుల ఖాళీ : 16 సర్వశిక్షాభియాన్ అధికారి : డీఈవో ఇన్చార్జి శిథిలావస్థలో ఉన్న గదులు : 104 మధ్యాహ్న భోజన షెడ్లు అవసరం : 62 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 2,278 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. సమయపాలన లేమి కారణంగా ప్రభుత్వ పాఠశాలలపై గ్రామాల్లో నమ్మకాలు సన్నగిల్లి ప్రైవేట్ పాఠశాలలౖవైపు పిల్లలను పంపేందుకు గ్రామాల్లో ఉత్సాహకత చూపుతున్నారు. పనిచేస్తున్న ఉపాధ్యాయులు పని చేసే చోటే స్థానికంగా ఉంటోన్న వాళ్లు వెయ్యి లోపే. మిగతావాళ్లు రోజు జిల్లా, పట్టణ, మండల కేంద్రం నుంచి స్కూలుకు రోజు వచ్చి వెళ్తున్నారు. మారుమూల ప్రాంతాల బస్సులు మిస్ అయితే.. విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. కొందరు మాత్రమే ఎలాగో అలా స్కూలుకు వెళ్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు స్కూళ్లో ప్రార్ధనలో హాజరుకావాలనే ఆదేశాలున్నాయి. అయినా.. చాలా చోట్ల ప్రార్థన తర్వాత కొందరొస్తే.. ఇంకొందరు ఓ పీరియడ్ పూర్తయిన తర్వాత వస్తున్నారు. -
సాంకేతిక శిక్షణ.. భవితకు నిచ్చెన
● ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు ● టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్లలో 42 రోజులపాటు తర్ఫీదు ● పూర్తి చేసిన 89 మంది పురుషులు, 680 మంది మహిళలు నప్తగిరికాలనీ(కరీంనగర్): తమ చిన్ననాటి కలలను ఇప్పుడు సాకారం చేసుకుంటున్నాముని కొందరు.. నేర్చుకుంటున్న కళను ఇంకా మెరుగుపర్చుకుందామని మరికొందరు.. స్కూల్లో పిల్ల లకు పెట్టే టాస్క్లో మేము సైతం సాయం చేద్దామని ఇంకొందరు.. ఉపాధి కోసమని.. ఉద్యోగం సాధించాలని.. పది మందికి ఉపాధి కల్పించాలని ఇలా ఎవరికి వారు తమ ఆశయాలు, లక్ష్యం సార్థకం చేసుకునేందుకు సిద్ధమయ్యారు నారీమణులు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ కళలకు వయస్సుతో సంబంధం లేదని కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్వాడీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సాంకేతిక ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(టీటీసీసీ)లో ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. 42 రోజులపాటు సాగిన కోర్సు బుధవారంతో పూర్తయింది. ఈక్రమంలో శిక్షణ పొందిన మహిళల అనుభవాలు, భవిష్యత్ కార్యాచరణపై సాక్షి ప్రత్యేక కథనం. 42 రోజుల శిక్షణ ధన్గర్వాడీ పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సులో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, మంచిర్యాల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల నుంచి 89 మంది పురుషులు, 680 మంది మహిళలు మొత్తం 769 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. మే 1న కోర్సు ప్రారంభించగా.. జూన్ 11తో ముగిసింది. టైలరింగ్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్లలో 42 రోజులపాటు శిక్షణ పొందారు. 469 మంది డ్రాయింగ్లో, 360 మంది టైలరింగ్, క్రాఫ్ట్లలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోర్సు డైరెక్టర్ బొట్ల రామస్వామి పర్యవేక్షణలో టీటీసీసీ శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా పూర్తయ్యాయి. -
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో బుధవారం పిచ్చికుక్కల దాడిలో బొట్కు మహేశ యాదవ్కు చెందిన 20 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈసంఘటనలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటినట్లు బాధితుడు మహేశ్ బావురుమన్నాడు. గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని కుక్కల బెడద తప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. మడేలేశ్వరస్వామి ఆలయంలో చోరీ● 15 గ్రాముల బంగారం చోరీ జగిత్యాలక్రైం: జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్దగల మడేలేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పూజ అనంతరం అర్చకులు ఆలయానికి తాళం వేసి వెళ్లారు. గుర్తుతెలియని దొంగలు చొరబడి 15 గ్రాముల బంగారం, హుండీలో కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం అర్చకులు వెళ్లి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై మన్మథరావు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతితంగళ్లపల్లి: ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లెల్లకు చెందిన కోడూరి దశరథం గౌడ్ (55) మంగళవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రామచంద్రాపూర్కు చెందిన గంధం పర్శరాములు బైక్పై వెనుకనుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. దశరథంను కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటవ్వ, కొడుకులు అరవింద్, అరుణ్ ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. -
ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తా
● 50 పడకల ఆసుపత్రి, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మిస్తా ● విద్యార్థినుల ఉన్నత విద్యకు సదుపాయాలు ● ధర్మపురి పుణ్యక్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ ● ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: తనకు రాజకీయ జన్మనిచ్చిన ధర్మపురిని నియోకవర్గాన్ని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పునర్జన్మనిచ్చిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి రుణాన్ని తాను ఏనాడూ తీర్చుకోలేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నియోజకవర్గపరంగా మీ ప్రాధాన్యాలేంటి? అడ్లూరి: ధర్మపురి ప్రజలను, లక్ష్మీ నరసింహ స్వామిని జీవితంలో మర్చిపోను. ప్రజలు ఎమ్మెల్యేగా జన్మనిస్తే.. రోడ్డు ప్రమాదంలో స్వామి నన్ను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడినా నా అనుచరులు నా కోసమే పనిచేశారు. వారిరుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. మంత్రిగా నియోజకవర్గంలో సాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తా. విద్య, వైద్యం, సదుపాయాలకు పెద్దపీట వేస్తా. ఇక్కడి విద్యార్థినులు డిగ్రీ, పీజీ కళాశాలలు లేక జగిత్యాల, కరీంనగర్ వెళ్తున్నారు. ధర్మపురిలో డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తా. చారిత్రక ధర్మపురి పుణ్యక్షేత్రానికి చీకటిపడితే రవాణా సౌకర్యం లేదు. ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. 50పడకల ఆసుపత్రి నిర్మిస్తా. ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా మారుస్తా. మంత్రిగా భవిష్యత్ ప్రణాళికలు? అడ్లూరి: తొలిసారి ఎమ్మెల్యే, ఆపై విప్.. ఇప్పుడు మంత్రి పదవి. పార్టీలో సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందనడానికి నాకు దక్కిన పదవులే నిదర్శనం. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగింది. నాకు ప్రభుత్వం కేటాయించిన శాఖకు 100 శాతం న్యాయం చేస్తా. ప్రజా ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ప్రతీ 30రోజులకు నా శాఖలోని పనులపై సమీక్ష చేపడతా. మీరు మంత్రి కావడంలో కుటుంబ పాత్ర? అడ్లూరి: నా భార్య కాంతకుమారి ప్రభుత్వ లెక్చరర్. నా రాజకీయ జీవితంలో ఆమె పాత్ర చాలా కీలకం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థికంగా ఇబ్బందులున్నా.. తన ఉద్యోగాన్ని, కెరీర్ను త్యాగం చేసి నాకు అండగా నిలిచింది. 2018లో ఓడిన సమయంలో నాలో ధైర్యం నింపింది. నా పిల్లలు కూడా వెంట నిలిచారు. వారి సహకారం మాటల్లో వర్ణించలేనిది. -
ఆర్ట్లో నైపుణ్యం సాధించా
ఎంటెక్ పూర్తి చేశా. ప్రస్తుతం జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నా. ఆర్ట్, డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కోర్సులో భాగంగా చాలా రకాల వాటిని తయారు చేశా. కలెక్టర్ కూడా ఇంప్రెస్ అయ్యారు. – హెచ్.రోజా, కరీంనగర్ క్రాఫ్ట్ వర్క్ నేర్చుకున్నా కరీంనగర్లో జరిగిన టీటీసీసీ లో ప్రతిరోజు క్లాసులకు హాజ రయ్యా. క్రాఫ్ట్ వర్క్ బాగా నే ర్చుకున్నా. పూల బుట్టి, ఆకులతో పలు రకాల వస్తువులు తయారు చేశా. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశా. ఇలాంటి కోర్సులు మాకు ఉపాధినిచ్చే విధంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు కోర్సు చేయాలి. – ఎల్.లక్ష్మి, ఇందారం, మంచిర్యాల టైలరింగ్లో శిక్షణ బీకామ్ డిగ్రీ చేశా. గతంలో శిశు గృహ తదితర సంస్థల్లో పని చేశా. కోర్సు పూర్తి చేసి స్కూళ్లలో చిన్నారులకు నేర్పించాలనుకుంటున్నా. టైలరింగ్లో అల్లికలు తదితర వాటిని బాగా నేర్చుకున్నా. ట్రైనర్స్ బాగా చెప్పారు. ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే శిక్షణ ఇది. – ఇ.సంధ్య, గాలిపెల్లి, సిరిసిల్ల -
గొర్రెలకాపరులకు పరిహారం అందిస్తాం
ధర్మారం(ధర్మపురి): విద్యుత్ షాక్తో మరణించిన గొర్రెలకు పరిహారం అందిస్తామని, బాధితులు ఆందోళన చెందవద్దని మంత్రి లక్ష్మణ్కుమార్ భరోసా ఇచ్చారు. చామనపల్లిలో విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మరణించగా మంత్రి లక్ష్మణ్కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి గొర్రెలకాపరులను పరామర్శించారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో ప్రమాదవశాత్తు లారీపై నుంచి కిందపడి మరణించిన హమాలీ మెడవేని రాజేశం భార్య రాజేశ్వరికి రూ.5లక్షల సాయం చెక్కు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన మాటప్రకారం సింగిల్విండో ద్వారా రూ.3 లక్షలు, కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా రూ.2లక్షలను బాధిత కుటుంబానికి అందించామన్నారు. చామనపల్లిలో మృత్యువాతపడ్డ ఒక్కో గొర్రెకు రూ.7వేల చొప్పున విద్యుత్ శాఖ ద్వారా పరిహారం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మారం, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్పర్సన్లు రూప్లానాయక్, ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్, డీసీవో శ్రీమాల, డీఎంవో ప్రమీణ్రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్చైర్మన్ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అశోద అజయ్, నాయకులు ఓరం చిరంజీవి, ఎండీ అష్ష్యు, ఎల్లయ్య, ఈదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ గొర్రెల కాపరుల కుటుంబాలకు పరామర్శ -
భూ వివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం
మెట్పల్లిరూరల్: తాను కొనుగోలు చేసిన భూమిని ఇతరులకు విక్రయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్పల్లి మండలం చౌలమద్దిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన వనతడుపుల నాగేశ్వరవరప్రసాద్ కొన్నేళ్ల క్రితం చౌలమద్ది శివారులోగల భూమి కొన్నాడు. డబ్బులు చెల్లించినా.. ఆ భూమిని ఓ కుల సంఘం పెద్దమనుషులు తనకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన నాగేశ్వరవరప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఓ నోట్ లభ్యమైంది. మెట్పల్లి సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్ బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
అడగండి... అడుగేయండి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆచితూచీ అడుగేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్ ఎలాంటిది? గతంలో స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫీజుల వివరాలు, తల్లిదండ్రులతో యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? అనే వివరాలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేది పాఠశాలే కాబట్టి.. ఆలోచించి అడుగేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. జిల్లాలో 120 గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునర్ప్రారంభం కానుండడంతో ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. హంగు ఆర్భాటాలతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపిస్తూ పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా.. ప్రైవేటు పాఠశాల తమ వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని ఉంటుంది. వారికి నిర్ధిష్ట సంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీన్ని పరిశీలించాకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1–7, 8–10 తరగతుల వరకు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోటీస్ బోర్డుపై ఇవి ఉన్నాయా.. మీరు చేర్పించబోయే ప్రైవేటు పాఠశాలలోని బోధన సిబ్బంది అర్హతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారా? అనేది ఆరా తీయాలి. బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు గల వారితో విద్యాబోధన చేస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలను ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగా ప్రైవేటు పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించారో.. లేదో చూడాలి. ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి? ఫీజుల్లో పారదర్శకత ఉందా.. అడిగి తెలుసుకోవాలి. వసతులపై దృష్టి పెట్టండి మెరుగైన ఫలితాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించే ఎలాంటి అంశాలు అమలు చేస్తున్నారో అడగాలి. స్కూల్లో లైబ్రరీ, ప్లేగ్రౌండ్, టాయిలెట్స్.. తాగునీటి వసతుల గురించి తెలుసుకోవాలి. ఇన్నోవేటీవ్ అంశాలపై.. పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా.. కొత్త విషయాలను విద్యార్థులకు తెలిసేలా తరగతులు నిర్వహిస్తున్నారా.. తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు.. ఇన్స్పైర్ మానక్, సైన్స్మేళాల్లో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రతిభ చాటే వారిని ఎలా ప్రోత్సాహం ఎలా ఉందో ఆరా తీయాలి. అలాంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. -
దొంగను పోలీసులకు పట్టించిన రైతులు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని మోతె బైపాస్ రోడ్డులో వ్యవసాయ మోటార్లు, విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్తున్న దొంగను రైతులు పట్టుకుని రూరల్ పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన యువకులు ఆదాబ్, సయ్యద్, సాహెబ్ కొద్దికాలంగా మోతె శివారులోని మోటార్లు, విద్యుత్ వైర్లు, స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద సలాకలు, మోటార్ వైర్లు దొంగలించి తీసుకెళ్తుండగా రైతులు వెంటపడ్డారు. ఇద్దరు దొంగలు పారిపోయారు. ఒక దొంగను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. ఏడాదికాలంగా దాదాపు 30 నుంచి 40 విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు దొంగలు ఎత్తుకెళ్లారని, గతంలో కూడా దొంగలను పోలీసులకు పట్టిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా
రామడుగు: రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ గౌస్ ఆలం సిబ్బందికి సూచించారు. రామడుగు పోలీస్స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు స్టేషన్లో అన్ని విధులు సక్రమంగా నేర్చుకోవాలని, రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై సీనియర్ల ద్వారా నేర్చుకోవాలన్నారు. సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ– సమన్ల జారీ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, రామడుగు ఎస్సై రాజు పాల్గొన్నారు. చెత్త తరలింపుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి అభ్యంతరంమానకొండూర్: కరీంనగర్లోని చెత్తను మానకొండూర్ పరిధిలోని ముంజంపల్లి శివారులో ఉన్న తమిళకాలనీ సమీపంలోని గుట్టవద్ద డంప్ చేయడంపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశా రు. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాయ్పేయ్తో కలిసి బుధవారం తమిళకాలనీ వద్ద ఉన్న చెత్తడంప్ను పరిశీలించారు. కరీంనగర్ నుంచి వెలువడే చెత్తను మానకొండూర్కు తరలిస్తే ఏర్పడే ఇబ్బందులపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తను ఇక్కడకు తరలించవద్దని సూచించారు. సదాశి వపల్లి స్టేజీ వద్ద ప్రమాదాలు జరుగకుండా చేప ట్టాల్సిన రోడ్డు డైవర్షన్ గురించి చర్చించారు. అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, పర్యావరణ ఇంజినీర్లు స్వామి, రమేశ్ పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడి కరీంనగర్రూరల్: పంట మార్పిడి విధానంతో రైతులు అధిక దిగుబడులు సాధించే అవకాశముందని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధానశాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు తెలిపారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో చేపట్టిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాహెర్కొండాపూర్, చామనపల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, సువర్ణ, వేణుగోపాల్ పంటల సాగులో ఆధునిక పద్ధతులు, వరి వంగడాలు, ఆయిల్పామ్లో అంతరపంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఏవో బి.సత్యం పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు లైన్ల సర్దుబాటు పనుల నేపథ్యంలో గురువారం నగరంలోని పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయ నున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని శివనగర్, ప్రగతినగర్, టెలిఫోన్ క్వార్టర్స్, లారెల్ స్కూల్, బతుకమ్మకాలనీ, సప్తగిరికాలనీ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.అల్కాపురి ఫీడర్ పరిధి లోని అల్కాపురి, శ్మశానవాటిక ప్రాంతాల్లో వి ద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీ ఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.విద్యానగర్ ఫీడర్ పరిధి లోని హిందూపురికాలనీ, ఆర్టీసీ వర్క్షాపు, వర్క్షాపు ముందు, సువిద్య స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రేపు నీటి సరఫరాకు అంతరాయం కరీంనగర్కార్పొరేషన్: నగరంలోని హైలెవెల్ జోన్ అంబేడ్కర్ రిజర్వాయర్ పరిధిలో ఈ నెల 13వ తేదీన తాగునీటి సరఫరాకు అంతరా యం ఏర్పడుతుందని ఈఈ సంజీవ్ తెలిపా రు. రిజర్వాయర్ పరిధిలోని బండ పోచన్న షాప్ నుంచి గాంధీరోడ్ వరకు ఉన్న పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలి పారు. ఫలితంగా 2, 3, 4, 5, 24,25,26,27, 28,42,44 డివిజన్లకు నీటి సరఫరా ఉండదని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. -
పోదాం పదా బడికి
ఇవి కీలకం పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు, రబ్బర్లు.. చూడటానికి చిన్నవే అన్నట్లు కనిపిస్తా యి. కానీ, వీటి అవసరం మాత్రం పెద్ద ది. వీటిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టి బ్యాగులో ఉంచాలి. సెలవులు దొరికాక చాలా మంది పిల్లలు ఆటపాటలకే పరి మితయ్యారు. ఉన్నత తరగతికి వెళ్తున్నా రు కదా అని సరిపెట్టుకోకుండా పాత పుస్తకాల్లోని అంశాలను పిల్లల చేత ఒకసారి పునశ్చరణ చేయించండి. పాత పుస్తకాలైనా పర్వాలేదు ప్రభుత్వ స్కూళ్లకు సరఫరా చేసే పాఠ్య పుస్తకాలన్నింటినీ మండల విద్యావనరుల కేంద్రానికి మరో వారం రోజుల్లో చేరవేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చెబు తున్నారు. ఇక ప్రైవేట్ విద్యార్థులు మార్కెట్లో అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆలోచించకండి. మీ ఇంటి పరి సరాల్లోని పిల్లల నుంచి పాత పుస్తకాలు సమకూర్చుకోండి. అవసరమైతే కొత్తవి దొరికినప్పుడు కావా లంటే మళ్లీ కొనుగోలు చేయొచ్చు.● ముగిసిన వేసవి సెలవులు ● నేటి నుంచి మోగనున్న బడిగంట ● పిల్లలూ.. సిద్ధంకండి ఇలా.. ● తల్లిదండ్రులపై ‘గురు’తర బాధ్యతకరీంనగర్: వేసవి సెలవులు ముగిశాయి. గురువారం బడిగంట మోగనుంది. పిల్లల్ని బడిబాట పట్టించేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే మానసికంగా సంసిద్ధులయ్యారు. ఈనేపథ్యంలో పిల్లలకు అవసరమైన వస్తువులు అన్ని ఉన్నాయా? లేదా ? అని ఎవరూ చూడరు. పిల్లలను బడికి సిద్ధం చేయడంలో తల్లిదండ్రులపై ఉన్న గురుతర బాధ్యతపై కథనం.దుస్తులు సరిచేసుకోండి.. ఒకప్పుడు ఏకరూప దుస్తులంటే ప్రైవేట్ స్కూళ్లకే అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలు ఉచిత దుస్తులు ధరిస్తున్నారు. వేకువ జామునే దుస్తులు సర్దుకోండి.. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయండి. లేకుంటే మొదటి రోజు బడికి వెళ్లడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. షూస్ సిద్ధ్దం చేసుకోండి.. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బూట్లు, సాక్సులు వేకువజామునే బయటకు తీయండి. వేసవి సెలవుల నాటి నుంచి బూట్లలోనే సాక్స్ ఉండి ఉంటే వాటిలోకి పురుగులు చేరే అవకాశం ఉంది. మరీ పాతవి అయితే ఈ పాటికే చిరిగిపోయి ఉంటాయి. ముందుగానే వీటిని బయటకు తీస్తే పరిస్థితి అర్థమవుతుంది. వాటితోనే సర్దుబాటు చేసుకోవచ్చా అనే విషయం తెలుస్తుంది.ప్రణాళికతో ముందుకు.. బడికి వెళ్లాలంటే పిల్లల చదువులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు ఇతర వస్తువులు సమకూర్చాలి. కొందరు ఉన్నవాటితోనే సర్దుకుపోతారు. మరికొంత మంది అన్నీ కొత్తవి కావాలనే దృక్పథం కలిగి ఉంటారు. మరోవైపు ప్రైవేట్ చదువులంటే యాజమాన్యాలు అడిగినంత ఇవ్వడానికి అప్పులు తప్పేలా లేవు. అయితే తల్లిదండ్రుల ఆలోచన దృక్పథం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ముందు చూపుతో వేసిన చిట్టీలను ఇప్పుడు వాడుకుంటున్నారు. ఇంకొందరు స్నేహితులు, బంధువుల వద్ద రుణం తీసుకుంటున్నారు. పొద్దున్నే సర్దుకోండి.. ప్రొగ్రెస్ రిపోర్టు తీసుకున్నాక ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోకుండా వేసవి సెలవుల సంబరాల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పుస్తకాలు, బ్యాగులు మూలన పడేశారు. తల్లిదండ్రులు ఈ రోజు బడి అనగానే కొన్ని గంటల ముందు పిల్లల బ్యాగులను బయటకు తీసే పనిలో నిమగ్నమవుతారు. కొన్ని ఇళ్లలోనైతే సెలవులకు ముందు ఒక మూలకు పడేసిన బ్యాగులు కనిపించడం లేదని హైరానా కనిపిస్తోంది. ఇది సరైన విధానం కాదు. ఏదైనా కారణం చేత అలసత్వం ప్రదర్శించి ఉంటే వేకువ జామునే లేచి బయటకు తీయాలి. విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ ఓల్డ్ హైస్కూల్.. నిజాం నవాబు కాలంలో పురుడుపోసుకుంది. ఎందరికో ఓనమాలు దిద్దించి, ప్రస్తుతం మల్టీపర్పస్ హైస్కూల్గా కొనసాగుతోంది. 83 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పాఠశాల ఒడిలో చదువుకున్న వారు మేధావులుగా పేరుగాంచారు. దేశాన్ని పాలించిన నేతల నుంచి, విద్యావేత్తలు. రాజకీయ ఉద్దండులు, కవులు, కళాకారులుగా పేరుగాంచారు. దక్షిణ భారతదేశం నుంచి తొలి తెలుగు ప్రధాని అయిన పీవీ నర్సింహరావు, జాతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, పద్మభూషణ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉప కులపతిగా వ్యవహరించిన చెన్నమనేని హన్మంతరావు, స్వాతంత్య్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు, విద్యావేత్త వెలిచాల కొండల్రావు, బొమ్మ సత్యనారాయణ, మాజీ వైస్చాన్స్లర్లు జె.రాంరెడ్డి, నవనీతరావు, బాపురెడ్డి, ఐఏఎస్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, మాజీ మంత్రులు సి.ఆనంద్రావు, టి.జీవన్రెడ్డి, వెలిచాల జగపతిరావు, మాజీ ఎమ్మెల్యేలు సాన మారుతి, ముద్దసాని దామెదర్రెడ్డి, బొమ్మ వెంకన్నలాంటి ఎందరో మేధావులు ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దినవారే.పెద్దపీట వేయాలి విద్యా చట్టానికి ప్రాముఖ్యం ఇస్తూ.. విద్యారంగానికి పెద్దపీట వేయాలి. కరీంనగర్ ఓల్డ్ హైస్కూల్ ప్రాముఖ్యం అంతా ఇంతాకాదు. నేను కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రభుత్వ విద్యపై విశ్వాసం కల్పించాల్సి న బాధ్యత అందరిపై ఉంది. – బూరుగుపల్లి రవీందర్, రిటైర్డ్ టీచర్, కరీంనగర్కరీంనగర్లోని ఓల్డ్ హైస్కూల్అడగండి.. అడుగేయండిపాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకున్న పాఠశాల మంచిదేనా..? అనుమతి ఉందా..? సౌకర్యాలు బాగున్నాయా..? ఉపాధ్యాయు ల పరిస్థితిపై ఆరా తీయండి.. ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. 8లోu అమ్మతో కలిసి పోయేది మా అమ్మానాన్న కోయ నాగేశ్వరరావు, సులోచన ప్రభుత్వ ఉపాధ్యాయులు. వేసవి సెలవులు పూర్తయ్యాక అందిరిలాగే అమ్మ పనిచేసే ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల సర్కారు బడికి తొలిరోజు నుంచే పోయేవాడిని. అక్కడే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివా. మొదటిరోజు ఫ్రెండ్స్తో ఆటాపాలతో గడిచిపోయింది. జీవితంలో పైకిరావడానికి బుడిబుడిఅడుగులు అక్కడే పడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య దొరుకుతుందని అనుకోవడం పొరపాటు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంకంటే మౌలిక వసతులు పెరిగాయి. అన్నింటిపై పట్టుసాధించేందుకు అవకాశం ఉంటుంది. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లిసంచులే బ్యాగ్లు నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తయ్యింది. నాన్నస్కూల్లో జాయిన్ చేస్తే.. నాకంటే ఒక్క క్లాస్ పెద్దయిన మా బ్రదర్తో కలిసి నడుచుకుంటూ పోయేవాడిని. ఎనిమిదో తరగతి వరకు ఉప్పల్, తొమ్మిదో తరగతి హుజూరాబాద్, పదో వతరగతి మళ్లీ ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. బియ్యపు సంచులను బ్యాగ్లుగా తయారుచేసి కుట్టిస్తే, వాటిని భుజానికి వేసుకోని స్కూల్కు పోయేవాళ్లం. తొలిరోజు స్కూల్కి పోయినప్పుడు వర్షం పడేది. అప్పుడు పుస్తకాలు తడవకుండా షర్ట్ జేబులో దాచుకునేవాడిని. చిన్నారులను సర్కారు బడికే పంపించాలి. వారిపై ఖర్చుచేసే డబ్బు ఆదా చేస్తే భవిష్యత్లో ఎంతోఉపయోగపడుతుంది. – కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి -
చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించండి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: పిల్లల మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని కార్ఖానాగడ్డ అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మూడేళ్లనుంచి ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అన్నారు. ఈ నెల 17వరకు అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది చేరేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. చిన్నారులకు స్వయంగా ఎగ్ బిర్యానీ వడ్డించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీవో సబిత తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా కరీంనగర్ అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మైనింగ్, రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ప్రతీ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాతో టోకెన్ల జారీ విధానంపై ప్రణాళిక రూపొందించాలన్నారు. లబ్ధిదారుని గృహ నిర్మాణ అవసరాన్ని బట్టి టోకెన్లు జారీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఏఈలు ఇసుక టోకెన్ల జారీని చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి, హౌసింగ్ పీడీ గంగాధర్ పాల్గొన్నారు. -
లెక్క తప్పిందా!
● ఓట్లలో కుదరని పొంతన ● అన్ని డివిజన్లలోనూ అదే పరిస్థితి ● పునర్విభజన అభ్యంతరాలు 234కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డివిజన్ల డీలిమిటేషనన్కు ప్రామాణికంగా తీసుకున్న ఇంటినంబర్లు, ఓట్ల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. 66 డివిజన్లను పునర్విభజించి, ఆ డివిజన్లో ఉన్న ఇళ్లు, ఓట్ల సంఖ్యతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. ఆయా డివిజన్ల వారీగా నగరపాలకసంస్థ పేర్కొన్న ఓట్లకు, వాస్తవ ఓట్ల సంఖ్యకు తేడా కనిపిస్తుండగా, మొత్తం 66 డివిజన్లలోనూ అదే పరిస్థితి నెలకొనడం కలకలం రేపుతోంది. ఇంటినంబర్లతోనే పునర్విభజన ఇంటినంబర్ల వారీగా డివిజన్లను విభజించడమే ప్రస్తుతం సమస్యగా మారింది. నగరంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఇంటి నంబర్లు వరుస క్రమంలో ఉండకపోగా, పక్కపక్కనే వేర్వేరు సిరీస్లు ఉన్న డివిజన్లు ఎన్నో ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇంటి నంబర్లవారీగా డివిజన్ల హద్దులు నిర్ణయించడంతో శాసీ్త్రయత లోపించిందనే ఆరోపణలున్నాయి. 66 డివిజన్లలో ఇంటినంబర్ల వారీగా ఓట్ల సంఖ్యను నిర్ణయించారు. ఆ ఓట్ల సంఖ్యకు జనవరి 6వ తేదీన పబ్లిష్ చేసిన ఓటర్ల జాబితాలో ఆయా ఇంటి నంబర్లవారీగా ఉన్న ఓట్ల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. సరిచేసేదెలా? డీలిమిటేషన్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 66 డివిజన్లలోనూ ఇంటినంబర్ల వారీగా తీసుకొన్న ఓట్ల సంఖ్య తప్పుగా ఉందని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఏ ఒక్క డివిజనోకాకుండా 66 డివిజన్లలోనూ రీ వెరిఫికేషన్ చేస్తేనే సమస్య పరిష్కారమవుతాయంటున్నాయి. అభ్యంతరాలు రాకున్నా, అన్ని డివిజన్లను శాసీ్త్రయంగా మళ్లీ పునర్విభజించాలని డిమాండ్ చేస్తున్నాయి. పునర్విభజన అభ్యంతరాలు 234 డివిజన్ల పునర్విభజనపై నగరవ్యాప్తంగా 234 అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరించగా, బుధవారంతో గడువు ముగిసింది. చివరిరోజు కావడంతో బుధవారం అత్యధికంగా 95 అభ్యంతరాలు వచ్చాయి. వారం రోజులో మొత్తంగా పునర్విభజనకు సంబంధించి 234 సవరణ ప్రతిపాదనలు అధికారులకు అందాయి.డివిజన్ల డీలిమిటేషన్పై వచ్చిన అభ్యంతరాలు5వ తేదీ 16 6వ తేదీ 32 7వ తేదీ 04 8వ తేదీ 04 9వ తేదీ 44 10వ తేదీ 39 11వ తేదీ 95 మొత్తం 234ప్రలోభాలకు లొంగొద్దుడివిజన్ల పునర్విభజనలో ప్రలోభాలకు లొంగొద్దని, ఎవరైనా పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అధికారులను హెచ్చరించారు. నిజాయితీతో, నిబద్ధతతో పునర్విభజన పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో డివిజన్ల పునర్విభజన, వీధిదీపాల నిర్వహణ, అసెస్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. పాత బిల్ కలెక్టర్ల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తరువాతనే నిబంధనల ప్రకారం అభ్యంతరా లు పరిష్కరించాలన్నారు. బొమ్మకల్, చింతకుంటలో కొనసాగుతున్న రెవెన్యూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 800 లైట్లను కొత్తగా కొనుగోలు చేయడం జరిగిందని, లైట్లులేనిచోట వాటిని ఇన్స్టాల్ చేయాలన్నారు. ఈఈ యాదగిరి, ఏసీపీలు బషీర్, శ్రీధర్, వేణు, టీపీఎస్లు రాజ్కుమార్, సంధ్య, తేజస్విని, ఆర్వో భూమానందం పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో మంగళవారం రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జరిగింది. రాష్ట్ర స్థాయిలో 2025–26 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ సరూర్నగర్ వాలీబాల్ అకాడమీలో ఖాళీగా ఉన్న క్రీడాకారుల జట్లను ఎంపిక చేశారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఆజ్మీరా రాందాస్, సరూర్నగర్ డీవైఎస్వో వెంకటేశ్వర్రావు, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణప్రసాద్, అకాడమీ కోచ్లు రమాదేవి, వీరారెడ్డి పర్యవేక్షణలో ఎంపిక జరిగింది. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అకాడమీ కోచ్ సంపత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రెటరీ గిన్నె లక్ష్మణ్, రాజన్న సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెన్నమనేని శ్రీకుమార్, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికలు 115 మంది పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రం తరుఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని, వారికి అవసమైన శిక్షణ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పాల్గొన్న 115 మంది క్రీడాకారులు -
గుర్తు తెలియని మహిళ మృతి
గోదావరిఖని: స్థానిక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మంగళవారం మృతి చెందినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఆరురోజుల క్రితం గోదావరినది ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ ఆరోగ్యం క్షీణించి చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చినట్లు వివరించారు. ఫొటోలో ఉన్న మహిళను గుర్తిస్తే 87126 56516 నంబర్కు సమాచారం అందించాలని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కోరారు. డాక్టర్ భూంరెడ్డి మృతికి సంతాపంకొత్తపల్లి(కరీంనగర్): రాజా బహద్దూర్ వెంకటరామరెడ్డి విజ్ఞాన పరిషత్ (రెడ్డి సంక్షేమ సంఘం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు వి.భూంరెడ్డి మృతికి సీతారాంపూర్లోని ఆర్బీవీఆర్ఆర్లో మంగళవారం సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శి బండ గోపాల్రెడ్డి, కోశాధికారి కాసర్ల మధూకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు గన్ను మహేశ్వర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి దాసరి రామ్రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఏనుగు చుక్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు ఫెర్టిలైజర్సిటీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోదావరిఖని నుంచి పోతనకాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పలువు రు గాయాలతో బయటపడ్డారు. గోదావరిఖని పోతనకాలనీ ప్రధాన రహదారిపై గడిచిన నాలుగు నెలల్లో రాత్రివేళల్లోనే కార్లు విద్యుత్ స్తంభాలను ఢీకొన్న ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రైనీ ఎస్ఐపై అట్రాసిటీ కేసు సైదాపూర్: ట్రైనీ ఎస్ఐ అగస్త్య భార్గవ్పై సైదాపూర్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేశారు. ఇటీవల భార్గవ్ మండలంలోని సోమారం శివారులో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. గొల్లగూడెంకు చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేసి కులం పేరుతో దూషించాడు, అంతేకాకుండా అకారణంగా చితకబాధాడు. దీంతో మహేందర్ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. మహేందర్ను చితకబాధిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ట్రైనీ ఎస్ఐ భార్గవ్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ కేస్ నమోదు చేశారు. -
గురుకులంలో ఫోన్మిత్ర
● విద్యార్థులకు ఫోన్ సదుపాయం ● తల్లిదండ్రులతో మాట్లాడుకునే వెసులుబాటు ● ఏఐ సౌకర్యం గల ఫోన్ల ఏర్పాటుగంభీరావుపేట(సిరిసిల్ల): గురుకుల విద్యార్థులకు ఇన్నాళ్లు వారు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు. కనీసం తల్లిదండ్రులతో మాట్లాడుదామన్నా అవకాశం లేకుండేది. కానీ ప్రభుత్వం ‘ప్రాజెక్టు మిత్ర’ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురుకులాల్లో ఏఐ సౌకర్యం గల టెలిఫోన్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలు కల్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 7 నుంచి 10 టెలిఫోన్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో చిన్నబోనాల, నర్మాల, బోయినపల్లి, వేములవాడ, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బద్దెనపల్లి గ్రామాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నలుగురికో స్మార్ట్ కార్డు ఫోన్మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతీ నలుగురు విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్కార్డును జారీ చేయనున్నారు. స్మార్ట్కార్డుతో రోజులో 25 నిమిషాలపాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడే వెసులుబాటు కల్పించనున్నారు. స్మార్టుకార్డు కేటాయించే సమయంలో మొదట తల్లిదండ్రులు ఏదైనా సెల్ఫోన్ నంబర్ను పాఠశాల సిబ్బంది వద్ద నమోదు చేయించుకోవాలి. కేవలం ఆ నంబ ర్కు మాత్రమే స్మార్ట్కార్డు ద్వారా ఫోన్చేసే వీలుంటుంది. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి గురుకుల సొసైటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. లక్ష్యాలు ఇవీ.. ● గురుకుల విద్యార్థుల కుటుంబ అనుబంధాల ను బలోపేతం చేసి భావోద్వేగాల ఉద్దీపనా లను సమర్థవంతమైన మద్దతు కల్పించడం. ● మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల వంటి విషాదాల నివారణకు మానసిక నేపథ్యాన్ని అందించడం.విద్యార్థులకు ఉపయుక్తం విద్యార్థులు కొందరు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై తమ జీవితాలను అకారణంగా ముగించుకుంటున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్లో మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఫోన్మిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. మా పాఠశాలలో ఫోన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు వచ్చిన తర్వాత వారు ఇచ్చే నంబర్లను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ నంబర్లకు మాత్రమే కాల్చేసి మాట్లాడే వీలుంటుంది. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – సృజన, ప్రిన్సిపాల్, నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల -
ప్రాణాలు తీసిన కలహం
కోరుట్ల: రెండ్రోజుల క్రితం ముంబయిలోని వర్లిలో కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో కోరుట్ల మండలం అయిలాపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం దంపతుల అంత్యక్రియలు అయిలాపూర్లో ఒకే చితిపై నిర్వహించారు. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన నాంపల్లి రాజమనోహార్(62), లత(51) దంపతులు కొన్నేళ్లుగా కొడుకు– కోడలుతో కలిసి ముంబయిలోని వర్లిలో నివాసముంటున్నారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు నెలకొనడంతో ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో రాజమోహన్(62) తన వద్ద ఉన్న కంట్రీమేడ్ రివాల్వర్తో భార్య లతను కాల్చిచంపాడు. అనంతరం రాజమోహన్ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వర్లి పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, పోస్టుమార్టం అనంతరం దంపతులు రాజమోహన్–లత మృతదేహాలు మంగళవారం స్వగ్రామం అయిలాపూర్కు తీసుకువచ్చారు. దంపతుల మృతదేహాలను ఒకే చోట చితిపై ఉంచి అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం స్థానికులను కంటతడి పెట్టించింది. ఒకే చితిపై దంపతుల ఖననం అయిలాపూర్ గ్రామంలో విషాదం -
డాక్టర్ భూంరెడ్డికి నివాళి
కరీంనగర్కార్పొరేషన్/కరీంనగర్: ప్రముఖ వైద్యుడు డాక్టర్ భూంరెడ్డికి మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డిలు వేర్వేరుగా నివాళి అర్పించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యుడు భూంరెడ్డి మరణం బాధాకరమని అన్నారు. భూంరెడ్డి ఎంఎస్ చదువుతున్న రోజుల్లోనే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఢిల్లీలో గోల్డ్మెడల్ తీసుకున్నాడని గుర్తు చేశారు. -
ప్రజల రుణం తీర్చుకుంటా
ధర్మపురి/ధర్మారం: రాజకీయంలో ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యనే ఉన్నానని, చివరకు వారే తనకు పట్టం కట్టారని, ఇప్పుడు వారి రుణం తీర్చుకుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రి పదవి వచ్చిన అనంతరం మొదటిసారి ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఆయనకు వివిధ మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినరసింహ స్వామి ఏసీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు కల్పించిన అవకాశం.. నృసింహుడి కృపతో ఇంత వాడినయ్యానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నియోజకవర్గంలోని రైతాంగానికి చుక్కనీరు కూడా అందించలేదని, ఇప్పుడా సమస్య తీరుతుందని తెలిపారు. ముందుగా మంత్రికి నృసింహస్వామి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రం ప్రసాదాలు అందించారు. మాజీమంత్రి జీవన్రెడ్డి, ఈవో శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, కటారి చంద్రశేఖర్రావు, శాభారాణి తదితరులున్నారు. కాంగ్రెస్ నాయకుల ఘన స్వాగతం ధర్మారం మండల ప్రజలు జెడ్పీటీసీగా తనకు రాజకీయ జన్మనిస్తే.. ధర్మపురి ఎమ్మెల్యేగా ఎన్నికై న తనను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి మంత్రివర్గంలో స్థానం కల్పించిందని మంత్రి అడ్లూరి అన్నారు. ధర్మారం మండలం పత్తిపాక క్రాస్రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఆయనకు ఘన స్వా గతం పలికారు. కటికెనపల్లి వద్ద గజమాలతో లక్ష్మణ్కుమార్తోపాటు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీని వాస్రావును సన్మానించారు. నియోజకవర్గ ప్రజల కు అందుబాటులో ఉంటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస్ రావు, నాయకులు చంద్రశేఖర్రావు, కొడారి అంజన్న, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్త నర్సింహం, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, వీరేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ జన్మనిచ్చిన ధర్మారం సన్మాన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పత్తిపాక క్రాస్రోడ్డు వద్ద పార్టీ శ్రేణుల ఘన స్వాగతం -
ఐదెకరాలు అమ్మైనా నిన్ను హత్య చేస్తా!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): భూవివాదం కాస్త ముదిరి ‘హత్య చేస్తా’.. అని బెదింరింపులకు దిగే వరకు వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం నెలకొంది. కాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడికి దిగారు. అతడిపై పిడి గుద్దులు గుద్దుతూ దాడిచేయగా ఇద్దరు మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆగకుండా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ‘ఐదు ఎకరాలు అమ్మి అయినా సరే నిన్ను చంపేస్తా’ అంటూ ఒక వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఇదంతా ఫోన్లో మరొకరు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ను వివరణ కోరగా, దాడికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, భూ సంబంధిత అంశం కావడంతో ఇరువురిని పోలీస్స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. ఓ వ్యక్తిపై దాడి చేసి బెదిరింపులు భూ వివాదంలో ఘర్షణ వీడియో వైరల్ -
నకిలీ కట్టడికి కసరత్తు
● శాంపిళ్ల సేకరణకు ప్రభుత్వం ఆదేశం ● కరీంనగర్ పరీక్ష కేంద్రం యాక్టివ్ అయ్యేనా ● పక్కాగా సాగితేనే ప్రయోజనం కరీంనగర్ అర్బన్: నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యత లేని విత్తనాలను కొని అన్నదాతలు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల క్రమంలో జిల్లాలోని విత్తన, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. పత్తి, వరి, ఇతర విత్తనాల శాంపిళ్లను సేకరించాలని నిర్ణయించారు. వానాకాలం సీజన్ ముందు నుంచి 2026 ఫిబ్రవరి వరకు అన్ని సీడ్, ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తన నమూనాలు సేకరించాలని సర్కారు నిర్దేశించింది. ఈ క్రమంలో డీఏవో, ఏడీఏ, ఏవో, ఏఈవోలు తమ తమ పరిధిలో తనిఖీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పక్షం రోజుల్లో ఫలితాలు గతంలో నకిలీ విత్తనాలు లభించటంతో జిల్లాలోని కొందరు డీలర్లపై కేసులు నమోదు చేశారు. తాజాగా నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా పెంచారు. పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో తనిఖీ బృందాలను నియమించారు. పంటల సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో విత్తనాల పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా సేకరించిన విత్తన నమూనాలను హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపించనున్నారు. 15 రోజుల తర్వాత ల్యాబ్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా విత్తనాలు సాగుకు అనుకూలం కాకపోతే సదరు దుకాణాల్లో విక్రయాలను నిలిపేస్తారు. వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. శాంపిళ్లు హైదరాబాద్కేనా ఉమ్మడి రాష్ట్రంలో భూసారం, విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రమున్న ప్రాంతాలు 5 మాత్రమే. ఆంద్రప్రదేఽశ్లో తాడెపల్లిగూడెం, అనంతపురం, బాపట్లలో పరీక్ష కేంద్రాలుండగా తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో ఉన్నాయి. ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో విత్తన, ఎరువుల నమూనాలు సేకరించడం వాటిని పరీక్షల నిమిత్తం వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, కంది సాగు ఎక్కువగా ఉండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకేంద్రంగా కొత్తపల్లి సీడ్ఫాంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాన్ని నిర్మించారు. విత్తన, ఎరువులకు సంబంధించిన నమూనాలను సేకరించేలా ప్రతి ఏటా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటారు. ఆయా కంపనీల పత్తి, మొక్కజొన్న, వరి, కంది, ఇతర విత్తనాలను సేకరించి పరీక్షలకు పంపడం,. ఫలితాల తదుపరి చర్యలు తీసుకోవడం జరిగే ప్రక్రియ. ఈసారి ఖరీఫ్కు గానూ జిల్లాకు 530 ఎరువులు, 120 పత్తి విత్తనాలు, వరి 220, ఇతర విత్తనాలు 111 నమూనాలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. గత ఐదేళ్లలో ఎరువులు, విత్తనాల్లో నాణ్యత లేదని 20 వరకు నమూనాల్లో తేలింది. ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తుండగా నమూనా ఫలితాలు రావడం మాత్రం ఆలస్యమవుతోంది. సేకరించిన విత్తన, ఎరువుల నమూనాలను హైదరాబాద్లోని రాజేంద్రనగర్కు పంపిస్తున్నారు. విత్తన పరీక్షలో రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తుంటారు. సర్వీస్ టెస్ట్, ఆక్టివ్ టెస్ట్లు ఉండగా సర్వీస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. యాక్టివ్ టెస్ట్కు సంబంధించి ప్రతిపాదనల దశలో ఉండగా నామమాత్రంగా మిగిలింది. యాక్టివ్ టెస్ట్ జరిగితేనే శాంపిళ్లను ఇక్కడికిక్కడే ఫలితాలను తేల్చొచ్చు..తక్షణమే చర్యలు చేపట్టొచ్చు. రైతులు జాగ్రత్తా లైసెన్స్ దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి. విత్తన ప్యాకెట్, బస్తాలపై లాట్ నంబర్, కంపెనీ పేరు, ప్యాకింగ్ తేదీ వంటి వివరాలు ఉన్నాయో లేదా చూసుకోవాలి. విత్తనాల కొనుగోలుకు సంబంధించిన రసీదును భద్రపరచుకోవాలి. అనుమతులు లేకుండా విడిగా విక్రయించే గింజలను కొనొద్దు. దళారుల మాటలు నమ్మొద్దు. విత్తన నాణ్యతపై సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని గుర్తిస్తే వ్యవసాయాధికారులు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సీజన్ మొత్తం తనిఖీలు.. వ్యవసాయ సీజన్ జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. విత్తన, ఎరువుల విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించేలా వ్యవసాయా దికారులకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో ఏఓలు నమూనాలు సేకరించి ఉన్నతాధికారుల ఆదేశాలతో ల్యాబ్కు తరలించనున్నారు. నెలవారీ లక్ష్యాల ప్రకారం నమూనాలు సేకరించటంతో డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయించే ఆస్కారం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఏదైనా దుకాణంపై అనుమానమొచ్చినా, ఫిర్యాదులందినా రెండు, మూడుసార్లు నమూనాలు సేకరిస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
‘సాక్షి’పై దాడి అప్రజాస్వామికం
● కొమ్మినేని అరెస్టు గర్హనీయం ● జర్నలిస్టు సంఘాల నిరసనకరీంనగర్: ఏపీలో ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానళ్ల కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్దమని టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి భాషబోయిన అనిల్కుమార్ పేర్కొన్నారు. ఏపీలో ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఉమ్మడి జిల్లాకు చెందిన జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలను ఖండించారు. ఇటీవల ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయ్ రెడ్డి మీద కేసులు బనాయించడం, తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్న ఏపీ ప్రభుత్వ చర్యలను దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఏపీ సర్కారు పత్రికా కార్యాలయాలపై, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగిస్తే అదేస్థాయిలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకులు ఎలగందుల రవీందర్, బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్రెడ్డి, ఏలేటి శైలేందర్రెడ్డి, జీఎస్ ఆనంద్తో పాటు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. -
నేడే అభ్యంతరాలకు ఆఖరు
● పునర్విభజన సవరణలపై మొదలైన పరిశీలన ● డివిజన్లవారీగా బల్దియా అధికారుల పర్యటనకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 60 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తూ నగరపాలకసంస్థ జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్కు సంబంధించిన అభ్యంతరాల గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 4వ తేదీన 66 డివిజన్లతో కూడిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేయగా, 5వ తేదీ నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుండడం తెలిసిందే. ఇందుకోసం నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మంగళవారం 39 అభ్యంతరాలు రాగా, ఇప్పటివరకు మొత్తంగా 139 అభ్యంతరాలు వచ్చాయి. నేటితో ముగియనున్న గడువు డివిజన్ల పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ నగరపాలకసంస్థ వారం రోజుల పాటు సమయం ఇచ్చింది. 5వ తేదీ నుంచి మొదలైన అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ బుధవారంతో ముగియనుంది. 66 కొత్త డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు 139 అభ్యంతరాలు రాగా, బుధవారం ఎక్కువస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. గత పునర్విభజనతో పోల్చితే ఈ సారి అభ్యంతరాలు తక్కువగా రావడం గమనార్హం. అభ్యంతరాల్లోనూ ఎక్కువగా డివిజన్లలో ఓట్లసంఖ్య ఆధారంగా సవరణ చేయడం, భౌగోళిక ఆధారంగా ఇళ్లను ఆయా డివిజన్లలోకి మార్చడంపైనే వచ్చాయి. పాత 49వ డివిజన్ను అశాసీ్త్రయంగా విభజించి కొత్త 56వ డివిజన్ను చేశారంటూ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు జాగిరి సాగర్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బోయవాడలోని 1–6–1 నుంచి 1–6–216 వరకు ఉన్న ఇళ్లను కలిపి ఒక డివిజన్గా మార్చాలని వినతిపత్రం ఇచ్చారు. భౌగోళికంగా వేర్వేరుగా ఉన్న గోపాల్పూర్, దుర్శేడ్ను కలిపి చేసిన 3వ డివిజన్ను మార్చాలని గోపాల్పూర్ మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.గోపాల్పూర్ పరిసరాలను కలిపి స్వంతంత్ర డివిజన్గా మార్చాలన్నారు. అభ్యంతరాల పరిశీలన మొదలు డివిజన్ల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాల వారిగా అధికారులు ఇప్పటికే పరిశీలన మొదలు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన చేయాలి. హడావుడికి తావివ్వకుండా ఉండేందుకు అంతకుముందుగానే అభ్యంతరాలపై ఆయా డివిజన్లలో పట్టణ ప్రణాళిక అధికారులు పరిశీలన చేపట్టారు. రోజువారీగా వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సంబంధిత డివిజన్లకు వెళ్లి, ఓట్లు, ఇళ్లు, హద్దుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అభ్యంతరాలు వాస్తవమని తేలితే వాటిని సవరించనున్నారు. -
ఫిట్నెస్పై నిర్లక్ష్యం!
● ముందుకు రాని విద్యాసంస్థల యాజమాన్యాలు ● రేపటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం ● జిల్లాలో 608 బస్సులు.. ఇంకా ఫిట్నెస్ కానివి 183తిమ్మాపూర్: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. గతంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు, స్కూల్ యాజమాన్యాలు చేసిన పొరపాట్లతో ప్ర మాదాలు జరిగి.. విద్యార్థులు మరణించిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల బస్సుల నిర్వహణ విషయంలో రవాణాశాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తోంది. ఏటా పాఠశాలల పునఃప్రారంభం నాటికి బస్సుల ఫిట్నెస్ పరీక్షలు, డ్రైవర్ల అర్హత, లైసెన్సులు, అనుభవాన్ని పరీక్షిస్తోంది. వాహనాలకు ఉండాల్సిన నియమాలు పరిశీలించిన తర్వాతే బస్సులు రోడ్డెక్కేందుకు అనుమతి ఇస్తున్నారు. తప్పించుకునే ప్రయత్నం? నిబంధనల ప్రకారం పాఠశాలల పునఃప్రారంభం నాటికి బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేయించి సిద్ధంగా ఉంచాల్సిన విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిబంధనల్లో విఫలమైనా, ఏదైనా లోపం ఉన్నా ఆర్థికంగా భారం పడుతుంద ని ఫిట్నెస్ పరీక్షకు దూరంగా ఉంటున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో తనిఖీలు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో యాజమాన్యాలు త్వరగా ఫిట్నెస్ చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, యాజమాన్యాలపై బాధ్యత పిల్లల సౌకర్యం నిమిత్తం వారి తల్లిదండ్రులు బడి బస్సును ఆశ్రయిస్తారు. వారిని సురక్షితంగా తీసుకెళ్లి, తీసుకురావడం యాజమాన్యం బాధ్యత. పిల్లల చదువుకు ఉత్తమ బడి ఏదో విశ్లేషించుకునే తల్లిదండ్రులు రవాణా సదుపాయాల పరిశీలనకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. బస్సులకు అనుమతి ఉందా? సీట్లు సామర్థ్యం, ఇంజిన్, టైర్లు, ఇతర అంశాలను సరిచూసుకోవాలి లేదంటే సొంత సురక్షిత రవాణా సాధనం ఎంచుకోవాలి. పాటించాల్సిన ప్రమాణాలు బస్సుపై విద్యాసంస్థ పేరు. చిరునామా, ఫోన్ నంబర్ ఎడమవైపు, వెనక భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. సీటింగ్ సామర్థ్యానికి అనుగుణంగా కూర్చోబెట్టాలి. పిల్లలు ఎక్కడానికి, దిగడానికి సహాయకుడిని నియమించాలి. డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించరాదు. ఐదేళ్ల అనుభవం ఉండాలి. రక్తపోటు, మధుమేహం, కంటిచూపు వంటి పరీక్షలు మూడు నెలకోసారి వేయించాలి. ఫిర్యాదుల బాక్సు ప్రతీ బస్సులో ఏర్పాటు చేయాలి. నమోదైన వాటిని యాజమాన్యం పరిష్కరించాలి. అత్యవసర ద్వారం ఉంచాలి. రిజిస్ట్రేషన్, కాలుష్య, బీమా పత్రాలు బస్సులో ఉంచాలి. విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం కనిపించేలా అన్ని కోణాల్లో అద్దాలు ఉండాలి. డోర్కు సురక్షిత లాకింగ్ ఉండాలి.జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు: 508 విద్యార్థులను తరలించే బస్సులు: 608 ఇప్పటి వరకు ఫిట్నెస్ అయినవి: 425 ఇంకా ఫిట్నెస్కు రానివి: 183ఫిట్నెస్ తప్పనిసరి పిల్లలు ప్రయాణించే బస్సు నిర్ణీత నిబంధనలకు లోబడి ఉండాలి. అందుకు విరుద్ధంగా ఉంటే వాహనాలు జప్తు చేస్తాం. బడులు పునఃప్రారంభమైన రోజు నుంచే తనిఖీలు మొదలవుతాయి. బస్సులు నిర్వహించే ప్రతి యాజమాన్యం నిబంధనలు పాటించాలి. – శ్రీకాంత్ చక్రవర్తి, కరీంనగర్ -
చదువుతో పాటు నైపుణ్యం తప్పనిసరి
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: చదువుతోపాటు నైపుణ్యం తప్పనిసరి అని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజులుగా నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ ముగింపు కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (ధన్గర్వాడీ) పాఠశాలలో మంగళవారం జరిగింది. టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో శిక్షణ పొందిన 769 మంది సిద్ధం చేసిన పలు రకాల ఆర్ట్ క్రాఫ్ట్, డ్రెస్ మెటీరియల్, పెయింటింగ్స్తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తిలకించిన కలెక్టర్ వారి సృజనాత్మకతను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో కరీంనగర్ జిల్లా ఉందని, 769మంది శిక్షణకు హాజరయ్యారని తెలి పారు. అంగన్వాడీ, బాలసదన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావలసిన డ్రెస్ మెటీరియల్ కుట్టి ఇవ్వడం ద్వారా టైలరింగ్లో నైపుణ్యం సాధించడంతో పాటు విద్యార్థులకు సాయం చేసినవారు అవుతారని తెలిపారు. నేటి రోజుల్లో చదువు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యం తప్పనిసరిగా మారిందని అన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినివారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇన్చార్జి డీఈవో ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, సూపరింటెండెంట్ నరసింహస్వామి పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి రామడుగు: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలోని కస్తూరిబా గాంధీ, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల వసతి గృహాల్లో వంటచేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలంలోని వెదిర కస్తూరిబాలో మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి, పలు రకాల వంటకాలను రుచి చూశారు. తహసీల్దార్ రాజేశ్వరీ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కస్తూరిబా ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. -
వ్యాపారాలు ప్రారంభించాలి
కరీంనగర్ కార్పొరేషన్: పద్మనగర్ మార్కెట్లో స్టాళ్లు, షెట్టర్లు పొందిన వ్యాపారులు తమ వ్యాపారాలు ప్రారంభించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. మంగళవారం పద్మనగర్ సమీకృత మార్కెట్ను సందర్శించారు. వ్యాపారాలు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఇప్పటికే స్టాళ్లు, షెట్టర్లు పొంది, నగరపాలకసంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకొన్న వ్యాపారులు తమ వ్యాపారాలను ప్రారంభించాలన్నారు. మిగతావారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మకాలు జరపాలన్నారు. డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. సాగులో సలహాలు పాటించాలి కరీంనగర్రూరల్: వానాకాలం పంటల సాగులో రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించి అధిగ దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి కోరారు. దుర్శేడ్ రైతువేదికలో మంగళవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు, వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు యూరియా తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు పంటల సాగు విధానం, యాజ మాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు ఉషారాణి, విజయభాస్కర్, వేణుగోపాల్, జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీనివాస్ రావు, వెటర్నరీ డాక్టర్ రామకృష్ణ, ఏవో సత్యం, ఏఈవో పైడితల్లి, మౌనిక, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి పాల్గొన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి కరీంనగర్: కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లు, కేంద్ర సహాయ మంత్రిగా ఏడాదికాలంగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. మీసేవ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. ఈజీఎస్, అమృత్ లాంటి అన్గోయింగ్ పథకాల పనులను చూపెట్టి, లెక్కలు వేస్తూ అభివృద్ధి చేశామని సంబరాలు నిర్వహించుకోవడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. జిల్లాకు సైనిక్స్కూల్, నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను ప్రసాద్ స్కీంలో చేర్పించించాలని, కరీంనగర్– తిరుపతి రైలు ప్రతీరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేయించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, నాయకులు గడ్డం ప్రశాంత్రెడ్డి, చందు పాల్గొన్నారు. ‘ఆరోగ్య మహిళ’ను సద్వినియోగం చేసుకోవాలి జమ్మికుంట: మహిళలు ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో చందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతీ మంగళవారం, శుక్రవారం ఆరోగ్య మహిళ శిబిరం నిర్వహిస్తామని, వైద్యుల సూచనల మేరకు 56రకాల పరీక్షలు చేస్తారన్నారు. ప్రతీ మహిళ మూడు నెలలకు ఒక్కసారి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రం–1ను తనిఖీ చేశారు. డాక్టర్లు సనా జవేరియా, చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
అమృత్ పథకంతో ఇంటింటా నీరు
● కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్చొప్పదండి: ఇంటింటికి నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అమృత్ 1, అమృత్ 2.0 పథకాల ద్వారా తెలంగాణలో రూ.6వేల కోట్ల పైచిలుకు నిధులతో, దేశంలో రూ 2.99లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. చొప్పదండి పట్టణంలో రూ.36.3కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీంకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ వాటాతో ఖర్చు చేస్తున్నాయన్నారు. అమృత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి34లక్షల నీటి కనెక్షన్లను అందించగలిగామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.852కోట్లు కేటాయించగా.. కేంద్రం వాటా రూ.481కోట్లు ఉందన్నారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. అతి త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామన్నారు. ఈఈ సంపత్కుమార్, నాగరాజు, నవీన్కుమార్, నాయకులు కొత్తూరి మహేశ్, గుర్రం నీరజ, శ్రీనివాస్రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, చందు, ముద్దం తిరుపతిగౌడ్, చేపూరి సత్యనారాయణ, చిల్ల శ్రవణ్ పాల్గొన్నారు. -
ఆధునిక సాగుపై అవగాహన పెంచుకోవాలి
● డీఏవో భాగ్యలక్ష్మి కరీంనగర్రూరల్: ఆధునిక సాగు పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి సూచించారు. సోమవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా నగునూరు, మొగ్ధుంపూర్ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. డీఏవో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి ఈనెల 12 వరకు జిల్లాలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు శ్రీధర్, విజయ్, ప్రశాంతి, ఏవో సత్యం, ఏఈవో జాఫరుల్లా, పంచాయతీ కార్యదర్శులు లచ్చయ్య, శ్రావణి, మాజీ ఎంపీటీసీ వినయ్సాగర్, దుర్శేడ్ సింగిల్విండో డైరెక్టర్ కందుల రమేశ్గౌడ్, తొగరు మల్లారెడ్డి, రాఘవేందర్రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి● జేడీ, ప్రత్యేకాధికారి బోనగిరి శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పురపాలక శాఖ జాయింట్ డైరెక్టర్, వంద రోజుల ప్రణాళిక కార్యక్రమ ప్రత్యేకాధికారి బోనగిరి శ్రీనివాస్ అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం నగరంలో పర్యటించారు. పద్మనగర్లో వంద రోజుల కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటిన స్థలాన్ని సందర్శించి మొక్కలు నాటిన పద్ధతిని పరిశీలించారు. సప్తగిరికాలనీలోని పార్క్ను సందర్శించి, గ్రీనరీని పెంచాలని ఆదేశించారు. హౌసింగ్బోర్డుకాలనీ, ఎస్ఆర్ఆర్ సమీపంలోని డీఆర్సీ సెంటర్లను తనిఖీ చేశారు. టవర్సర్కిల్, మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల మేళాలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో అన్ని విభాగాల అధికారులు భాగస్వాములు కావాలన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా సమాఖ్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వంద రోజుల కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఆర్ఆర్ డ్రై వేస్ట్ సెంటర్లో ప్రతిరోజు 10 నుంచి 15 మెట్రిక్ టన్నుల డ్రై వేస్ట్ను సెక్రిగేషన్ చేస్తుండడం అభినందనీయమని అన్నారు. నల్లాలు లేని నివాస గృహాలను గుర్తించి కనెక్షన్ ఇవ్వాలన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, డీఈ వెంకటేశ్వర్లు, పర్యావరణ ఇంజినీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అంబేడ్కర్ స్టేడియం, కట్టరాంపూర్, భగత్నగర్, గౌతమినగర్, ఎల్ఐసీ కార్యాలయం, కొత్త శ్రీనగర్కాలనీ, తిరుమల థియేటర్, కిశోర్ ఆటోస్టోర్, ఒడిశా స్కూల్, కమాన్ ప్రధాన రహదారి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ సుభాష్నగర్ ఫీడర్ పరిధిలోని అంబేడ్కర్నగర్, వాటర్ట్యాంక్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. -
వ్యవసాయ పండుగ
● హలాలు పట్టి.. పొలాలు దున్ని ● సాగుకు సిద్ధమైన అన్నదాతలు రేపు ఏరువాక పున్నమివిద్యానగర్(కరీంనగర్): తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. రుతుపవనాల ఆగమనంతో పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. దుక్కి దున్నడం, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఏరువాకతోనే మొదలౌతుంది. ఈనెల 11న ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్పెషల్ స్టోరీ. దేశమంతటా.. ఏరువాకను జ్యోతిష్య శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జేష్ట మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడి పంటలు, పొలం పనులకు ఆటంకాలు ఎదురవ్వొద్దని ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లల్లో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగానూ భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే.. ఈరోజే ఒడిశాలోని పూరీ జగన్నాథునికి స్నానోత్సవం నిర్వహిస్తారు. రైతుకు అండగా ప్రభుత్వాలు రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో రైతు పట్టాలన్నింటికి పక్కాగా లెక్క తేల్చి కొత్త పాసు పుస్తకాలతో రైతును రాజును చేశారు. వ్యవసాయం కోసం బ్యాంకు రుణాలు పొంది వాటిని తీర్చలేక రుణగ్రస్తులైనవారిని రుణ విముక్తులను చేయడానికి విడతలవారీగా రుణమాఫీ చేస్తున్నారు. పంట బీమా సౌకర్యం కల్పించారు. రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. రైతు బీమా పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల లోపు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి తక్షణం రూ.5లక్షలు పరిహారంగా అందిస్తున్నారు. ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశు వైద్యశాలలను నిర్వహిస్తున్నారు. 24 గంటల కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి బాసటగా నిలుస్తోంది.దుక్కి దున్నుతున్న రైతన్నఅతి ప్రాచీనం.. ఏరువాక పండుగ అతి ప్రాచీనమైనది. శ్రీకష్ణ దేవరాయలు ఈరోజున రైతుల కృషిని అభినందించి తగిన రీతిలో వారిని ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శుద్దోదన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని రైతులకు అందించినట్లు కథలున్నాయి. ఏరువాకతో వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం.ఏరువాక అంటే.. అన్నదాతలు వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ప్రతి ఏటా జ్యేష్ట శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడమని అర్థం. పండుగ రోజు రైతులు కాడెద్దులను కడిగి కొమ్ములకు రంగులు వేసి గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టే కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. భూమిని దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య వ్యవసాయ పనులు మొదలుపెడతారు.నాణ్యమైన విత్తనాలు అందజేయాలి ప్రభుత్వం నేరుగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి. నాణ్యత లేని విత్తనాలతో పంట నష్టమే కాకుండా కాలం కూడా నష్టపోతాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని రైతులకు నేరుగా విత్తనాలు అందించాలి. ప్రతీ గ్రామంలో శాశ్వతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధాన్యం ఆరపోసేందుకు, నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతు పంట నష్టపోకుండా ఉంటాడు. – రవీందర్రెడ్డి, ఆర్గానిక్ పద్ధతిలో సేద్యం చేస్తున్న వ్యవసాయదారుడు, కరీంనగర్దిగుబడి పెరిగితేనే లాభం గతంలో కంటే రాష్ట్రం వచ్చిన తరువాత రైతు కష్టాలు కొద్దికొద్దిగా తీరుతున్నాయి. పంట పెట్టుబడి ఇవ్వడం, ప్రభుత్వమే ధాన్యం కొనడం, రైతు, పంట బీమా అమలు చేయడంతో రైతుకు మేలు జరుగుతోంది. వాతావరణం కూడా అనుకూలించి దిగుబడి పెరిగితే వ్యవసాయం లాభాసాటిగానే ఉంటుంది. – బొప్పు శ్రీహరి, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, మానకొండూర్ -
అమ్మా.. ఆలకించరూ!
కరీంనగర్ అర్బన్: అవే సమస్యలు.. అవే వినతులు.. తమ సమస్యలకు విముక్తి కల్పించాలని వేడుకున్నారు బాధితులు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కరువైందని, ప్రజావాణితోనైనా బాసట లభిస్తుందనుకుంటే ఇక్కడ అదే పరిస్థితని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లావ్యాప్తంగా 304 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కాగా వచ్చిన వారే మళ్లీమళ్లీ రావడం కనిపించింది. ప్రధానంగా భూసమస్యలు, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు రాగా.. కలెక్టర్ పమేలా సత్పతి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎండబ్ల్యూవో పవన్కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురిని సాక్షి పలకరించగా.. వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే. ప్రజావాణికి 304 దరఖాస్తులు సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు మొత్తం అర్జీలు: 304 మున్సిపల్ కార్పొరేషన్: 63 వారధి సొసైటీ: 16 తహసీల్దార్ మానకొండూర్: 15 తహసీల్దార్ కరీంనగర్ రూరల్: 15 ఆర్డీవో కరీంనగర్: 12 డీపీవో: 09, సీపీ ఆఫీస్: 07 -
మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ, టాయిలెట్లు, కిచెన్ షెడ్, వివిధ ప్రభుత్వ భవనాల మరమ్మతు, కొత్త భవనాల నిర్మాణాలకు పనులు మంజూరు చేశామని తెలిపారు. సదరు పనులకు సంబంధించిన గ్రౌండింగ్ 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఏఈలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఇదివరకే మొదలైన పనులను వేగవంతం చేసి రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్లోకి తరలించాలన్నారు. అక్కడ అవసరమైన మరమ్మతు చేయిస్తామని, టాయిలెట్లు నిర్మిస్తామని, నీటి వసతి కల్పిస్తామని అన్నారు. ఎంపీడీవోలు, సీడీపీవోలు సమన్వయంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నందున మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. వర్షం కారణంగా నీరు నిలవకుండా చూడాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను తనిఖీ చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎండబ్ల్యూవో పవన్కుమార్ తదితరులున్నారు. -
బోనమో నమః
మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో బోనాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా జరిగింది. అన్నారం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, కమరాతి, అక్క మహంకాళి అమ్మవార్ల కల్యాణం, పట్నాల ఉత్సవాలు మొదలయ్యాయి. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బయలుదేరారు. మేకను గావు పట్టడం, బండారి చల్లుకోవడం, కత్తులతో నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గొల్ల, కురుమ సంఘం నాయకులు కత్తర్ల లక్ష్మయ్య, స్వామి, లక్ష్మణ్, అట్ల గట్టయ్య, అట్ల కొండయ్య, సంబు శ్రీనివాస్, దాడి ఐలయ్య, అట్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. – మానకొండూర్ -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
ముస్తాబాద్: మండలంలోని సేవాలాల్తండాలో సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలతో ఆలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ సర్పంచులు మంగ్యానాయక్, శ్రీనివాస్ నాయక్, వైద్యాధికారి చందర్నాయక్, బంజార సంఘం మండల అధ్యక్షుడు లకావత్ నర్సింలు, మున్యా, ముడావత్ నాగరాజు, పంతులు నాయక్, రమేశ్, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు. మంగళ హారతులు, బోనాలతో సంప్రదాయ దుస్తుల్లో గిరిజన మహిళలు -
‘సాక్షి’పై దాడులు అమానుషం
కరీంనగర్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్, ఆంధ్రప్రదేశ్లోని ‘సాక్షి’ కార్యాలయాలపై దుండగుల దాడిని ఖండిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని సాక్షి యూనిట్ ఆఫీస్ వద్ద జర్నలిస్టులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాలరాస్తూ అణచివేయాలని చూడడం దారుణమన్నారు. నిరసనలో కరీంనగర్ యూనిట్ మేనేజర్ వైద శ్రీనివాస్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జీలు ముజఫర్, గుర్రాల మహేశ్, డెస్క్ జర్నలిస్టులు బొగ్గుల సంతోష్కుమార్, ములుకుంట్ల కనకేశ్వర్, మామిండ్ల బాలనర్సయ్య, డి.రాజశేఖర్, పోలు సంపత్, దూట వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీజన్లను కన్వర్షన్ చేయకుంటే ఉద్యమం
పెద్దపల్లిరూరల్: విద్యుత్ ఆర్టీజన్లను తక్షణమే కన్వర్షన్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు, కన్వీనర్ వజీర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో సోమవారం జిల్లా జేఏసీ కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్టిజన్ కార్మికుల సన్నాహక సమావేవంలో వారు మాట్లాడారు. ఈనెల 18న టీవీఏసీ జేఏసీ సమ్మె నోటీసు అందించి హైదరాబాద్లో బహిరంగసభ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలోని 20 వేల మంది ఆర్టిజన్లు భార్యాపిల్లలు సభకు హాజరు కావాలని వారు కోరారు. జేఏసీ ఉద్యమంపై కుట్రలు చేస్తున్న కొందరు యూనియన్ నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. కన్వర్షన్ అమలు చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజినీర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారుల సంఖ్య లక్షల్లో పెరిగిందని తెలిపారు. డీటీఆర్, పీటీఆర్ సంఖ్య వేల్లలో పెరిగాయని, ట్రాన్స్కో, డిస్కంలో వేల కిలోమీటర్ల దూరం లైన్స్ పెరిగాయని, ఉద్యోగుల సంఖ్య పెరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి 20 వేల ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, రఘునాథ్రెడ్డి, రవీందర్రెడ్డి, సీఐటీయూ నాయకుడు నాయక్, జిల్లా జేఏసీ కన్వీనర్ మట్ట రాజు, నాయకులు ఎస్.రవి, సందీప్, ప్రభాకర్, రవి, స్వప్న, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 18న భార్యాపిల్లలతో బహిరంగ సభ టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు -
సాగునీటి సరఫరాపై వీడిన ఉత్కంఠ
రామగుండం: మృగశిర కార్తె ఆరంభం నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతోపాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలు హైదరాబాద్ మెట్రో పాలిటిన్ వాటర్ సప్లయ్, సీవరేజీ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్) అధికారులకు టెన్షన్ లేకుండా చేశాయి. అప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో హైదరాబాద్కు తాగునీటి సరఫరా చేసే నిర్దేశిత నిల్వలకు 1.5 టీఎంసీలు ఎక్కువగానే ఉండడం అధికారులకు ఊరటనిచ్చింది. గతేడాది నీటి పంపిణీ వ్యవస్థలో నీటి పారుదలశాఖ అధికారుల అంచనాలు తారుమారవడంతో హెచ్ఎండబ్ల్యూఎస్కు తిప్పలు తప్పలేదు. గతేడాది పరిస్థితిని ముందే గుర్తించి అధికార యంత్రాంగం.. ఇప్పుడు అన్ని విధాలుగా సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ ఆదివారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పు రావడం, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లోతో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుండడం ఆశాజనకంగా ఉంది. నీటిమట్టం 138.3 మీటర్లకు పడిపోతేనే తిప్పలు.. ఆరు విద్యుత్ మోటార్లతో ప్రతీరోజు 56 క్యూసెక్కులు (0.03 టీఎంసీ) నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు పంపింగ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా 138.3 మీటర్లకు పడిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్ పంపుహౌస్ మోటార్లకు నీరందకపోవడంతో పంపింగ్ నిలిచిపోతుంది. నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం తెలిపిన ఎల్లంపల్లి నీటి మట్టం వివరాలను పరిశీలిస్తే.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 143.47 మీటర్లు, 8.68 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదేరోజు 139.68 మీటర్ల నీటిమట్టం ఉండగా, 4.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో పెరుగుతున్న నీటి మట్టం -
ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం ఎన్నికలు
కరీంనగర్ టౌన్: ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. సోమవారం మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలపై కరీంనగర్లో అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను కలిసి మున్నూరుకాపు రాష్ట్ర ఎన్నికల విధివిధానాలపై సమీక్షించారు. దేవయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా సంఘాలు 12వేల గ్రామాల్లో మున్నూరుకాపు సంఘాలున్నాయని, ఈనెల చివరి వారంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయని బండి సంజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపులు రాజకీయాలకతీతంగా ఐక్యంగా ముందుకు సాగి మున్నూరుకాపు కులాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్నారు. మున్నూరుకాపు సంఘం యువజన నాయకులు సత్తినేని శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దాడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్లో చోరీ రాయికల్: పట్టణానికి చెందిన చింత ప్రకాశ్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి నాలుగు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ప్రకాశ్ కంటి ఆపరేషన్ నిమిత్తం నెల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. దీంతో దండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా, డ్రెస్సింగ్ టేబుల్లోని విలువైన వస్తువులను చోరీ చేశారు. నాలుగు తులాల పుస్తెలతాడు, ఉంగరాలు చోరీకి గురైనట్లు పెద్దకూతురు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. క్లూస్టీం సభ్యులు ఫింగర్ఫ్రింట్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగతనంపై కేసు ఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ర మాకాంత్ తెలిపిన వివరాలు.. మండలకేంద్రానికి చెందిన మద్దుల శ్రీపాల్రెడ్డి ఇంట్లో కొంతకాలంగా లక్ష్మణాచారి కుటుంబం అద్దెకు ఉంటున్నారు. పని నిమిత్తం వారు ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లక్ష్మణా చారికి శ్రీపాల్రెడ్డి సమాచారం ఇవ్వగా వారు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరి పిన పోలీసులు మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యాయత్నంకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో సోమవారం కూర శ్రీనివాస్రెడ్డి(40) అనే రైతు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. శ్రీనివాస్రెడ్డి వ్యవసాయంతోపాటు హార్వెస్టర్ నడిపిస్తాడు. నెలరోజుల క్రితం ఆకస్మాత్తుగా కిందపడటంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆపరేషన్ చేసేందుకు రూ.2లక్షలు అవసరం కాగా భూమిని విక్రయించేందుకు సిద్ధపడగా వీలుకా లేదు. ఈ క్రమంలో సోమవారం గడ్డిమందు తాగిన శ్రీనివాస్రెడ్డిని కుటుంబసభ్యులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
పాత కక్షలతోనే ప్రాణం తీశారు
● యువకుడి హత్య కేసులో 8 మంది అరెస్టు ● నిందితుల్లో ఇద్దరు మైనర్లు ● 9 మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం ● హతుడిపై పీడీ యాక్ట్, 27 కేసులు మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో సంచలనం సృష్టించిన ఉప్పు రమణా రెడ్డి (29) హత్య పాత కక్షలతోనే జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈనెల రెండో తేదీనే హత్య జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. హత్యలో ప్రమేయమున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. సంఘటన వివరాలను మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో డీఎస్పీ రఘుచందర్ సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్తో కలిసి సోమవారం విలేకరులకు వివరించారు. దిగువ కొండగట్టుకు చెందిన ఉప్పు రమణారెడ్డి అందరిని తరచూ బెదిరిస్తూ.. గొడవలకు దిగేవాడు. కొండగట్టుకు చెందిన బండి సిద్దుతోనూ గతంలో ఘర్షణ పడ్డాడు. ఈనెల 2న సిద్దుకు హల్దీ ఫంక్షన్ ఉండగా.. రమణారెడ్డి అతడి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. సిద్దుతోపాటు అతని స్నేహితులు చింతలకోటి వినయ్, పస్తం ఈశ్వర్, దాసరి ఆకాశ్, మంచినీళ్ల అజయ్, పంజాల మధు, మరో ఇద్దరు మైనర్లను చంపుతానని బెదిరించాడు. దీంతో సిద్దు, వినయ్, ఈశ్వర్ రమణారెడ్డినే చంపాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు రాత్రి సిద్దు, వినయ్ బస్టాండ్ వద్ద ఉన్నారు. అదే సమయంలో రమణారెడ్డి అక్కడికి వెళ్లగా.. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ విషయాన్ని పంజాల మధు తన స్నేహితుడైన ఈశ్వర్కు ఫోన్లో చెప్పడంతో ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నాడు. మాట్లాడుకుందామని చెప్పి రమణారెడ్డిని బండిపై కూర్చొబెట్టుకొని కొండగట్టు మెట్లదారి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిద్దు, వినయ్, ఈశ్వర్ రమణారెడ్డిని తీవ్రంగా కొట్టారు. తలపై బండరాయితో మోదారు. అనంతరం ఈశ్వర్ దాసరి అకాశ్, పంజాల మధుకు ఫోన్ చేశాడు. ఆకాశ్ మంచినీళ్ల అజయ్తోపాటు మరో ఇద్దరు మైనర్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి రమణారెడ్డి శవాన్ని ఉపాధి పథకం కింద తీసిన గుంతలో పడేసి పూడ్చివేశారు. వెలుగు చూసిందిలా.. రమణారెడ్డి సోదరుడు నిరంజన్ తన తమ్ముడిని ఈనెల 2న కొంతమంది కొట్టి.. చంపి.. పూడ్చివేశారంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనుమానితుల కోసం గాలిస్తుండగా దిగువ కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం వద్ద సిద్దు అనుమానాస్పదంగా కనిపించాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈశ్వర్, వినయ్ని రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో మిగిలిన వారి వివరాలు వెలుగుచూశాయని డీఎస్పీ వివరించారు. రమణారెడ్డి తరచూ కొండగట్టుకు వచ్చి అందరిని బెదిరిస్తూ, దాడి చేసేవాడని, భరించలేకే కొట్టి చంపారని నిందితులు విచారణలో చెప్పినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు ఉన్నారని, అందరినీ రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై నరేశ్కుమార్, కొడిమ్యాల ఎస్సై సందీప్, ట్రైనీ ఎస్సై రవీందర్ కుమార్, హెడ్కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు జనార్ధన్, సురేశ్, వినయ్కుమార్ పాల్గొన్నారు. రమణారెడ్డిపై 27 కేసులు హత్యకు గురైన ఉప్పు రమణారెడ్డిపై గతంలో 27 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీస్స్టేషన్లో పీడీ యాక్టు నమోదై.. ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు. అతడిపై సస్పిషియస్ షీట్ నమోదైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
డీఎస్ఆర్ యాప్పై నిరసన
● పారిశుధ్య సమాచారం అప్లోడ్ చేయని వైనం ● పంచాయతీ కార్యదర్శుల సహాయ నిరాకరణ కొత్త యాప్ నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ విషయ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. పాతయాప్కు కొన్ని సవరణలు చేశారు. ఆ ప్రకారం హాజరు, శానిటేషన్ నివేదికలను అప్లోడ్ చేయాలి. విధుల్లో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. – వీరబుచ్చయ్య, డీపీవో రామగిరి(మంథని): గ్రామ పంచాయతీల్లో చేపట్టే పారిశుధ్య నిర్వహణ నివేదికను డెయిలీ శానిటేషన్ రిపోర్ట్(డీఎస్ఆర్) యాప్లో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాలనే ప్రభుత్వ మార్గదర్శకాలపై పంచా యతీ కార్యదర్శులు నిరసన తెలుపుతున్నారు. ఆన్లైన్ ద్వారా నివేదిక అందజేయడం తమకు భారంగా మారుతోందని వారు అంటున్నారు. 15రోజులుగా యాప్లో నివేదిక నమోదు చేయడం లేదు. జిల్లాలో 260 మంది.. జిల్లాలో 266 గ్రామ పంచాయతీలు ఉంగా, మొత్తం 260 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. నిధులు విడుదల కావడంలేదు. పల్లెల్లో చిన్న సమస్య పరిష్కారానికై నా కార్యదర్శులే సొంతంగా నిధులు వెచ్చిస్తున్నారు. దీనికితోడు డీఎస్ఆర్ యాప్లో పారిశుధ్య నివేదికను నమోదు చేయాలని గతనెల 24న ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న తమకు ఈ నివేదిక తలనొప్పిగా మారిందని కార్యదర్శులు నిరసన తెలుపుతున్నారు. ఎందుకు వద్దంటున్నారంటే.. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు చెత్త సేకరణ ప్రక్రియనూ పర్యవేక్షించాలనడంతో రోజువారీ పనులు పడకేస్తాయని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వచ్ఛభారత్ మిషన్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఆహారభద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. తాజాగా డీఎస్ఆర్ యాప్ నిర్వహణ తలకు మించిన భారమవుతోందని చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో ఉండడంలేదు. ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు యాప్ అందుబాటులో ఉంటుందని, ఈలోగా ఇంటింటికీ వెళ్లి పారిశుధ్యం వివరాలు నమోదు చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ఆందోళన చెందుతున్నారు. డీఎస్ఆర్ యాప్లో ఇలా.. పంచాయతీ కార్యదర్శుల ఆధార్, వేలిముద్ర, ఫేస్ ద్వారా యాప్లోకి లాగిన్ కావాలి. ఆ సమాచారం మొత్తం సర్వర్కు వెళ్తుంది. దీనికితోడు పంచాయతీలోని నివాసాలు, ఆరోజు తడి, పొడి చెత్త సేకరించిన ఇళ్లు, సేకరించిన మొత్తం చెత్త, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, నర్సరీల ఫొటోలు తీసి యాప్లో ఆప్లోడ్ చేయాలి. ఇప్పటికే సుమారు 10 యాప్ల్లో సమాచారం నమోదు చేస్తున్న కార్యదర్శులు.. మరోయాప్లో మరింత సమాచారం అప్లోడ్ చేయడం కష్టమంటున్నారు. కష్టాలు గుర్తించడం లేదు పద్దెనిమిది నెలలుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. నిధులు మంజూరు కావడంలేదు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు, సమస్యల పరిష్కారానికి అప్పు లు చేస్తున్నాం. సంక్షేమ పథకాల అమలులోనూ పాలుపంచుకుంటున్నాం. అయినా, మా కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. తాజాగా డీఎస్ఆర్ యాప్ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎంతపని చేసినా పనికి తగిన గుర్తింపు లభించడం లేదు. ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి మా సమస్యలను పరిష్కారించాలి. – ఎడిపల్లి సంతోష్, జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ కార్యదర్శుల సంఘం -
అరటి సాగు వైపు అన్నదాతల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అరటి సాగుకు రైతులు ఆసక్తి చూపుతుండగా, ఆ మేరకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అరటి సాగు చేసే రైతులకు భారీగా సబ్సిడీలు ఇచ్చి, వరి, మొక్కజొన్న, పసుపు సాగు చేసే రైతుల దృష్టి మరల్చాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాకుండా అరటి ఉత్పత్తులకు ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉండటంతో అక్కడి వ్యాపారులు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెండురోజుల క్రితం ఉత్తర భారత వ్యాపారులు, అరటి రైతులు, ఉద్యానశాఖ అధికారులతో సమావేశమై, పంట స్థితిగతులు, మార్కెటింగ్పై సమీక్షించారు. అనుకూలమైన వాతావరణం జిల్లాలో ఏడాది పొడవునా అరటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీనికి తోడు ఎర్రటి, నల్ల రేగడి నేలలు సాగుకు అనుకూలం. వ్యవసాయ బావులు ఎక్కువగా ఉండటంతో నీటికి ఢోకా ఉండదు. జిల్లాలోని జగిత్యాల రూరల్, కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి మండలాలు అరటికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు నివేదికలు తయారుచేసి, రాష్ట్ర ఉన్నతాధికారులకు అందించారు. స్థానికంగా కొనకపోవడంతో.. గతంలో జిల్లాలో 1,000 ఎకరాలకు పైగా అరటి సాగు చేసేవారు. అయితే, ఎకరాకు 25–30 మె.ట వరకు దిగుబడులు వచ్చినా లోకల్ వ్యాపారులు కొనేందుకు ససేమిరా అన్నారు. జిల్లాలో అరటి కాయలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా తాడిపత్రి, మహారాష్ట్రలోని నాగ్పూర్, నాందేడ్ నుంచి కాయలు తెప్పించారు. దీంతో రైతులు పంటను తీసేశారు. ప్రస్తుతం కేవలం 10 మంది రైతులు 21 ఎకరాల్లో మాత్రమే అరటిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగును వీలైనంత తగ్గించి, ఉద్యానపంటల వైపు రైతులను మళ్లించాలని చూస్తున్నారు. అరటి ఏడాది పంట కాబట్టి వేరుశనగ, పెసర వంటి పంటలు సాగు చేయవచ్చని, దీంతో మరింత ఆదాయం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఉత్తరాది వ్యాపారులు కొనుగోలు చేసేలా.. మన జిల్లాలో పండించిన అరటికాయ నాణ్యతగా ఉండి మెరుస్తూ ఉంటుంది. కాయ సైజు పెద్దగా ఉంటుంది. ఈ కాయను ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఇష్ట పడుతుంటారు. అక్కడి వ్యాపారులు ఇక్కడి అరటికాయను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రోజుకు 5–10 టన్నుల కాయను తరలించాల్సి ఉంటుంది. కాయ సైజును బట్టి కిలోకు రూ.8–15 వరకు పెట్టేందుకు కూడా సిద్ధమైనారు. జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో అరటి సాగు చేసేలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. అరటి సాగుకు మళ్లీ పురుడు అరటికి డిమాండ్ ఉండడంతో జిల్లాలో మళ్లీ సాగును ప్రోత్సహించాలని, అంతర్గాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మాకునూరి జితేందర్రావు రాష్ట్ర ఉద్యానశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఉద్యానశాఖ అధికారులు జిల్లాలో అరటి స్థితిగతులపై నివేదిక తయారు చేసారు. తాజాగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉత్తర భారతదేశ వ్యాపారులు, ఆదర్శ రైతులు సమావేశమై అరటి సాగు, మార్కెటింగ్పై చర్చించారు. సాగుకు ముందుకు వచ్చే రైతులకు రాష్ట్ర ఉద్యానశాఖ మిషన్ ద్వారా మొక్కలు, డ్రిప్, అంతరపంటల సాగుకు భారీగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రతిపాదించారు. కాగా, నాలుగైదు రోజుల్లో అరటి సాగు చేసే రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యానశాఖ భావిస్తుంది. పంట విస్తీర్ణం పెంచేందుకు అధికారుల ప్రణాళికలు సబ్సిడీలు ఇచ్చేలా రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు మంచి ఆదాయం అరటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో నాలుగైదు ఎకరాల్లో సాగు చేశా. దిగుబడులు బాగానే వచ్చాయి కానీ వ్యాపారులు సరైన ధరకు కొనక ఆసక్తి తగ్గిపోయింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల వారు కొంటామనడంతో చాలా మంది రైతులు అరటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. – జితేందర్రావు, అభ్యుదయ రైతు, అంతర్గాం అనుకూల వాతావరణం అరటికి అనువైన వాతావరణం, ఎర్ర, నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులతో సంప్రదింపులు చేసి జిల్లాలో సాగు చేసిన అరటిని కొనుగోలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సాగు చేసేవారికి సబ్సిడీలు ఇవ్వాలని సూచిస్తున్నాం. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
జూన్ ఫీవర్
సాగు ఖర్చూ తడిసి మోపెడు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 6,10,102 మంది రైతులు దాదాపు 12,82,207 ఎకరాల్లో వానాకాలం పంటలు పండిస్తారని అధికారులు అంచనా వేశారు. తొలకరితో పెట్టుబడి సమయం అసన్నమైంది. భూములను చదునుచేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెరిగిన యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల కొరత రైతులను ఏటా వేధిస్తూనే ఉన్నాయి. దీనికితోడు అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి తగ్గి అన్నదాతలు అప్పుల్లో ఊబీలో చిక్కుకుంటున్నారు. సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు విత్తనాలు సొంతగా తయారు చేసుకోవడం, ఆధునిక సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయినా, పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు, సీజనల్ వ్యాధులతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. సాక్షి, పెద్దపల్లి: వేసవి సెలవుల్లో ఆటాపాలతో ఆనందంగా గడిపిన విద్యార్థులు.. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.. ఇదేసమయంలో తొలకరితో ఎరువులు, విత్తనాల కొనుగోలు తదితర ఖర్చులతో సామాన్యులు ‘వామ్మో.. జూన్’ అని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు వానలతో మారుతున్న వాతావరణ పరిస్థితులతో సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశం.. ఇలా అన్ని రకాల ఖర్చులు ఈనెలలో రానుండటంతో ఎలా గడపాలో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. జూన్ నెల పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వణుకు పుట్టిస్తోంది. పెన్సిల్ నుంచి పుస్తకాల వరకూ మోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 938 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా అందులో సుమారు 2,26,829 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం అంటేనే ఫీజులు, పుస్తకాలు, నోట్బుక్సులతోపాటు, వాటిని భద్రపరుచుకునేందుకు బ్యాగులు, లంచ్ బాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, టైబెల్టులు, యూనిఫామ్స్.. ఇలా ఒక్కటేమిటి.. రకరకాల వస్తువులు ఆయా పాఠశాల్లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో యాజమాన్యాలు చెప్పిన ధర చెల్లించలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంటర్ కళాశాలల్లో సైతం ఏసీ క్యాంపస్లు, నాణ్యమైన విద్యాబోధన పేరిట రూ.లక్షల్లో ఫీజు వసూలు చేస్తుండడంతో ఆర్థికభారమైనా.. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం అప్పు లు తెచ్చిమరీ చెల్లిస్తున్నారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పేరిట నర్సరీ చదువులకే రూ.30వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నా.. పర్యవేక్షణ, నియంత్రణ మచ్చుకై నా కనిపించడం లేదు. భయపెడుతున్న వైరల్ ఫీవర్ ఒకసీజన్ నుంచి మరోసీజన్లోకి ప్రవేశించేటప్పుడు వాతావారణం చల్లబడి వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరాల తీవ్రత ఉంటుంది. దోమల బెడత పెరిగి ప్రతీ పదిమందిలో నలుగురికి జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో వైద్యం కోసం తరచూ ఆస్పత్రులకు వెళ్లేపరిస్థితి నెలకొని ఉంటోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో ఏటా జూన్, జూలైలో జ్వరాలతో ఆస్పత్రుల పాలై జేబులు గుల్లచేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఓపీ, టెస్టుల పేరిట ఆస్పత్రుల యాజమాన్యాలు పిండిపిప్పి చేస్తుండటంతో ఈవానాకాల అంటేనే జనాలు భయపడుతున్నారు. వ్యాధుల బారిన పడిన తర్వాత వైద్యఖర్చులకు భయపడడం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో డబ్బు ఆదాతోపాటు టెన్షన్ ఉండదని నిపుణులు అంటున్నారు. చదువుల ఫీజులు.. సాగు పెట్టుబడులు.. సీజనల్ వ్యాధులు అన్ని ఖర్చులూ ఒకే నెలలో రావడంతో సర్వత్రా ఆందోళన ఆర్థికభారంతో హడలెత్తిపోతున్న సామాన్య ప్రజలు పెట్టుబడులు పెరిగాయ్ వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతంది. పెరిగిన ఖర్చులతో సాగు చేయడం కష్టంగా మారింది. ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల రేట్లు పెరుగుదలలో పోటీపడుతున్నాయి. సాగు సీజన్ వచ్చిందంటే హడలెత్తిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – మహేశ్గౌడ్, రైతు జూన్ అంటేనే భయం నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యూకేజీ, మరొకరు సెకండ్ క్లాస్. జూన్ వచ్చిందంటే అడ్మిషన్లు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఫీజులు పెంచుతూ మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి. – రాదాసు శైలజ, గృహిణి -
రద్దు చేసుకున్నా.. రావాయే!
● స్లాట్ రద్దయినా.. డబ్బుల కోసం ఏళ్లుగా పడిగాపులు ● ధరణి పోయి భూభారతి వచ్చినా అంతేనా? ● జిల్లాలో వేయి మందికి పైగా నిరీక్షణవీణవంకకు చెందిన రాజిరెడ్డి 2022 మే నెలలో అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి వద్ద 2.15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేశాడు. స్లాట్కు రూ.1.02 లక్షలు చెల్లించగా లక్ష్మి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చిన డబ్బులను లక్ష్మి తిరిగి ఇవ్వగా ప్రభుత్వానికి చెల్లించిన స్లాట్ డబ్బులు ఏళ్లు గడిచినా రావడం లేదు. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం. ఇది ఒక రాజిరెడ్డి పరిస్థితనుకుంటే పొరపాటే. జిల్లావ్యాప్తంగా స్లాట్ రద్దయిన వారందరిదీ ఇదే దుస్థితి.కరీంనగర్ అర్బన్: జిల్లాలో వ్యవసాయ భూము ల రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దు చేసుకున్న యజమానులు డబ్బుల కోసం అయిదేళ్లుగా పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఏకకాలంలో పూర్తిచేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపొందించగా తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఏకకాలంలో రికార్డుల మార్పు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునే రైతులు తొ లుత స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. బుకింగ్కు ఆయా ప్రాంతాల్లో భూముల మార్కె ట్ విలువను అనుసరించి స్లాట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి బుకింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ తేదీని నిర్ణయించి స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తికి సమాచారం అందుతుంది. ఆ రోజు తహసీల్ కార్యాలయానికి వెళ్తే అన్ని పత్రాలను పరిశీలించి నిబంధనలు అనుసరించి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు. అయిదేళ్లుగా పడిగాపులు భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నాక భూమి కొనవద్దనుకునో.. ఆ భూమిపై ఏదైనా వివాదం ఉందనో.. అప్పుడు కాక మరో సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనో నిర్ణయించుకొని స్లాట్ రద్దు చేసుకున్న యజమానులకు వారు చెల్లించిన డబ్బును తిరిగి ప్రభుత్వం చెల్లించాలి. జిల్లాలో వేయి మందికి పైగా స్లాట్ రద్దు చేసుకొని తమకు రావాల్సిన డబ్బుల కోసం తహసీల్, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో స్లాట్ రద్దు చేసుకున్నవారికి దాదాపు రూ.2.50 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి పోయి భూ భారతి వచ్చినా.. రాష్ట్రంలో ఆర్వోఆర్–2020తో పాటు ధరణి పోర్టల్ కూడా రద్దయింది. ఆ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్–2025(భూ భారతి చట్టం) అమల్లోకి తెచ్చింది. అయినప్పటికీ రద్దు చేసుకున్న లావాదేవీలకు సంబంధించి సొమ్ము మా త్రం పాత పద్ధతిలోనే నిలిచిపోతోంది. తిరుగు చెల్లింపులు రావడం లేదు. స్లాట్ ఫీజు ప్రభుత్వ ఖజానాలో జమవుతుందని, తిరిగి డబ్బు అక్కడి నుంచి స్లాట్ రద్దు చేసుకున్నవారికి చేరుతుందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మొదట్లో ప్రయత్నాలు జరిగినా... 2020 నవంబర్కు ముందు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. లావాదేవీలు రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్మును ఖజానా విభాగం ద్వారా తిరిగి చెల్లించేవారు. ఆ తర్వాత వాటిని ధరణికి, తాజాగా భూ భారతి పోర్టల్కు బదలాయించినా.. రద్దయిన లావాదేవీల సొమ్ము తిరిగి చెల్లిండం లేదు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చాక తిరుగు చెల్లింపులు చేసేందుకు మొదట్లో ప్రయత్నాలు జరిగినా దీనిపై దృష్టి సారించే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందన్న వాదనలు ఉన్నాయి.జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాలు: 15 (కరీంనగర్ అర్బన్ మినహా) రద్దు చేసుకున్న స్లాట్లు: 1,034 రావాల్సిన నగదు: సుమారు రూ.2.50కోట్లు -
అడ్లూరి లక్ష్మణ్ అనే నేను..
● ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ● అడ్లూరి లక్ష్మణ్ను వరించిన అవకాశం ● విధేయతకు దక్కిన ప్రాధాన్యం ● మూడుకు చేరిన మంత్రుల సంఖ్య ● పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ● కవ్వంపల్లికి విప్ ఇచ్చే అవకాశంధర్మపురికి అచ్చొచ్చిన మంత్రి పదవి తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. 2014లో గెలిచిన కొప్పుల చీఫ్విప్గా కేబినెట్ హోదా అందుకోగా, 2018లో సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో గెలిచిన అడ్లూరి మొదట ప్రభుత్వ విప్గా, తాజాగా మంత్రిపదవి చేపట్టారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిపదవుల్లో పెద్దపీట దక్కింది. ఎన్న డూ లేని విధంగా ముగ్గురు మంత్రి పదవులను దక్కించుకోగా, గడ్డం వివేక్ సైతం ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నవారే. దీంతో మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో జిల్లావాసులకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయగా, దానికి తగ్గట్టుగా మంత్రి పదవులు దక్కాయనే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా కొనసాగుతుండగా, తాజాగా ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్ అదివారం రాజ్భవన్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురికి మంత్రి పదవులు దక్కటంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కాంగ్రెస అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలిమంత్రివర్గ విస్తరణలో బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్బాబు, బీసీగౌడ్ నుంచి పొన్నం ప్రభాకర్కు మంత్రి పదవులు దక్కాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి, ము న్నూరు కాపు అయిన ఆది శ్రీనివాస్లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు. ఆదివారం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అడ్లూరికి మంత్రిపదవి లభించింది. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో కేబినెట్లో చోటు దక్కకపోయినా.. ప్రభుత్వ విప్ ఇచ్చే అవకా శాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే.. కేబినెట్లోకి సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మంత్రి పదవిరావడం విధేయతకు పట్టం కట్టినట్లయింది. కార్మిక క్షేత్రమైన గోదావరిఖని నుంచి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన అడ్లూరి ఎన్ఎస్యూలో స్టూడెంట్ లీడర్గా, యూత్ కాంగ్రెస్లో, జెడ్పీటీసీ, జెడ్పీచైర్మన్, కార్పొరేషన్ చైర్మన్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా వివిధ హాదాల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రభుత్వ విప్గా కొనసాగగా, తాజాగా కేబినెట్లో చోటు సంపాదించారు. అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం 1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 94 వరకు ఎన్ఎస్యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010–12 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా పని చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013–14వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ కల్పించింది. -
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
కరీంనగర్రూరల్: గ్రామాల్లో బీజేపీ బలోపేతా నికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఎంపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకుడు, కరీంనగర్ సింగిల్విండో డైరెక్టర్ సాయిల్ల మహేందర్, మల్లేశం, తిరుమల్, శ్రీకాంత్ తదితరులు బీజేపీలో చేరగా సంజయ్ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బండి సంజయ్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీలో చేరినట్లు సింగిల్విండో డైరెక్టర్ మహేందర్ తెలిపారు. బీజేపీ నాయకులు ఎం.సంతోష్కుమార్, టి.శ్రీనివాస్, డి.రమణారెడ్డి, దీపక్, హరికృష్ణ, మోహన్రెడ్డి, రాజు పాల్గొన్నారు. ఘనంగా ‘సందల్ షరీఫ్’జమ్మికుంట: మండలంలోని బిజిగిరిషరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సందల్ షరీఫ్(గ్రంథలేపనం) ఉత్సవాన్ని ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్గా సమీపంలోని మొల్లపల్లి, పెద్ద బిజిగిరిషరీఫ్ గ్రామాల నుంచి సందల్ షరీఫ్(గ్రంథలేపన), చాదర్లను భక్తిశ్రద్ధలతో ఆదివారం వేకువజామున దర్గాకు తీసుకొచ్చారు. దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అక్బర్షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావలి రహమతుల్లాఅలై సమాధులకు సందల్ అలంకరింపజేసి ,చాదర్లు సమర్పించారు. మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్, సంయుక్త కార్యదర్శి నయీమొద్దీన్ పాల్గొన్నారు. బాక్సింగ్ జట్టు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: నిజామాబాద్ జిల్లాలో ఈనెల 10,11వ తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లాజట్టు ఎంపిక పోటీలను ఆదివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాకారులు హాజరుకాగా.. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. జి.హరిహర, కె.నరేశ్, పి.సుకుమార్, జి.సాకేత్, సిమ్రితరెడ్డి, శ్రీకర్, పి.సాకేత్, సీహెచ్.వరుణ్, వి.హేమహాసిని, పవిత్ర ఎంపికయ్యారు. డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, సంపత్ పాల్గొన్నారు. -
రేషన్.. నో స్టాక్
కరీంనగర్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడునెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయడం డీలర్లకు కత్తిమీద సాములా మారింది. సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్దసంఖ్యలో దుకాణాలకు తరలివస్తున్నారు. డీలర్లు దుకాణం తెరువకముందే బారులు తీరుతున్నారు. ఒక్కో లబ్ధిదారుడు మూడు నెలల బియ్యం పొందాలంటే ఆరు పర్యాయాలు ఈపాస్ మిషన్లో వేలిముద్ర వేయాల్సి రావడంతో బియ్యం పంపిణీలో జాప్యం ఏర్పడుతోంది. ఈనెల 1 నుంచి డీలర్లు బియ్యం పంపిణీ చేపట్టగా శని, ఆదివారాల్లో పలు రేషన్దుకాణాల్లో స్టాక్ లేకపోవడంతో మూసివేశారు. సగం కోటానే కేటాయింపు జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్థంగా మారింది. జిల్లాలో 566 రేషన్ దుకాణాల పరిధిలో మొత్తం 2,90,402 కార్డులుండగా మూడునెలలకు 16,748.667 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరైంది. మండలస్థాయి గోదాముల్లో బియ్యం స్టాక్ లేకపోవడంతో మొదటి విడతలో డీలర్లకు సగం కోటా నే పంపిణీ చేశారు. సన్నబియ్యం కావడంతో పలువురు లబ్ధిదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో ఐదారు రోజుల్లోనే స్టాక్ ఖాళీ అయింది. బియ్యం లేకపోవడంతో కరీంనగర్ సిటీతో పాటు మండలంలోని దుర్శేడ్, బొమ్మకల్, గోపాల్పూర్, మొగ్ధుంపూర్, తీగలగుట్టపల్లి తదితర గ్రామాల్లోని రేషన్ దుకాణాలను డీలర్లు మూసివేశారు. శనివారం బక్రీద్ పండుగ కావడంతో మండల స్టాక్ పాయింట్ నుంచి డీలర్లకు బియ్యం కేటాయించలేదు. ఆదివారం కొంతమంది డీలర్లకు బియ్యం కేటాయించగా మిగితావారిని సోమవారం రమ్మని అధికారులు సూచించారు. మూడు నెలల బియ్యం కోటాను త్వరగా కేటాయిస్తే పంపిణీకి వీలవుతుందని డీలర్లు పేర్కొంటున్నారు. బియ్యం కేటాయింపులో జాప్యం గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలను మూసివేసిన డీలర్లు ఆందోళనలో లబ్ధిదారులుసప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుతం ఏ రేషన్ షాప్ చూసినా బియ్యం కోసం వచ్చినవారితో కిక్కిరిస్తున్నాయి. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఒకేసారి ఇస్తామని చెప్పేసరికే బియ్యం తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట రేషన్ దుకాణం వద్ద క్యూలో నిల్చోనేందుకు ఓపిక లేని కొందరు ఇలా సంచులు లైన్లో పెట్టి బియ్యం కోసం ఎదురుచూశారు. వారి వరుస వచ్చాక బియ్యం తీసుకుని వెళ్లారు. -
ఆన్లైన్ పేకాటతో అప్పులు
జగిత్యాలక్రైం: ఓ యువకుడు ఆన్లైన్లో పేకాట ఆడి అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ భరించలేక గతనెల 28న పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్వాడ సమీపంలో బీరయ్యగుడి వెనుక ప్రాంతానికి చెందిన వరద సాయికుమార్ (28) తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో చిన్ననాటి నుంచి గారాబంగా పెంచారు. దీంతో సాయికుమార్ ఆన్లైన్ పేకాటకు బానిసై బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. సాయికుమార్ది నిరుపేద కుటుంబం కావడంతో అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చారు. కానీ, అతడు అప్పులు చెల్లించకుండా మళ్లీ ఆన్లైన్ పేకాట ఆడడంతో అప్పు ఇచ్చిన వారంతా తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో గతనెల 28న ఇంట్లో గడ్డిమందు తాగగా, కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల– కరీంనగర్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా కోలుకోకపోవడంతో మూడురోజుల క్రితం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు. ఒత్తిడితో పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి -
‘రాజన్న కోడెల మృతికి కారణం దేవాదాయశాఖ మంత్రి’
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న కోడెల మృతికి కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. ఆదివారం వేములవాడ రాజన్న గోశాలను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలు 33 మృతి చెందాయన్నారు. తప్పంతా వారే చేసి ఎదుటివారిపై బురదజల్లినట్లుగా మంత్రి తీరు ఉందన్నారు. తన సిఫారసు లేఖ ద్వారా గీసుకొండకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అక్రమ పద్ధతిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా అని అన్నారు. గీసుకొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదై రాంబాబు జైలుకు వెళ్లిన విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. భక్తుల విశ్వాసం, నమ్మకానికి ప్రతీకై న కోడెల మృత్యువాతలో మొదటి ముద్దాయి మంత్రి సురేఖ అన్నారు. కోడెల పంపిణీ నిలిచిపోయి గోశాలలో 500 ఉండాల్సిన చోట 1,300 పరిమితికి మించి పోయాయన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, మ్యాకల రవి, గోస్కుల రవి, పోలాస నరేందర్ తదితరులు ఉన్నారు. గోశాలలో మరో కోడె మృతి తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో ఆదివారం అనారోగ్యంతో ఒక కోడె మృతిచెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం మొత్తం 11 కోడెలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
సర్కార్ కాలేజీలోనే చేరాలి
ప్రైవేట్ కళాశాలలతో పోల్చినపుడు ఏ విషయంలోనైనా ప్రభుత్వ కళాశాలలే ముందు వరుసలో ఉంటున్నాయి. ఫలితాల విషయంలోనూ రాజీ పడడం లేదు. పోటీ పరీక్షలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నవారిలో ప్రభుత్వ కాలేజీల పిల్లలే ఉంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. సర్కార్ కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి. లక్షల విలువైన బీటెక్ లాంటి సాంకేతిక కోర్సులు ఉచితంగా చదివే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. – వి.శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్పొరేట్కు దీటుగా.. లక్షల్లో ఫీజులు తీసుకునే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల కన్నా మా కాలేజీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేందుకు ఎక్కువగా కష్టపడుతున్నాం. పరీక్షల సమయంలో ఉదయం పూట నిద్ర మేల్కొల్పడం నుంచి పరీక్షలన్నింటిలో విజయం సాధించే వరకు అందరం కృషి చేస్తున్నాం. ఎప్సెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిస్తున్నాం. అపార బోధనానుభవం, ఉన్నత విద్యార్హతలున్న లెక్చరర్లు ఉంటారు కాబట్టి ప్రతిసారి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. – కనకశ్రీ విజయ రఘునందన్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థిని వృద్ధిలోకి తెచ్చేందుకు అన్ని విధాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. మూడు నెలలకోసారి పేరెంట్స్తో చర్చిస్తున్నాం. వీక్లీ, మంత్లీ టెస్టులతో పాటు పాఠ్యాంశాలపై క్విజ్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులను బృందాలుగా విభజించి లెక్చరర్లను కేర్ టేకర్లుగా నియమిస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలకు భద్రత, భవిష్యత్తుకు గర్ల్స్ కాలేజ్ బెస్ట్ అని నిరూపిస్తున్నాం. – జి.వనజాకుమారి, ప్రిన్సిపాల్, సెస్ బాలికల జూనియర్ కళాశాల -
వారసులకే వర్తింపు
రామగుండం: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కటాఫ్ తేదీని పెంచలేదు. దీంతో లబ్ధిదారుల మరణానంతరం వారసులకే పథకం వర్తిస్తోంది. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వందలాది మంది రైతులు ఈ పథకానికి నోచుకోవడంలేదు. ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అర్హతలు కలిగిన రైతు కుటుంబాలకు సాగు దశలో ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఈ పథకం రూపొందించింది. ఇందులో భాగంగా రూ.ఆరువేల నగదును ఏడాదిలో మూడు విడతలుగా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తూ వస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 19 విడతలుగా అర్హులైన రైతులకు పరిహారం అందజేసింది. 2019 లోపు రిజిష్ట్రేషన్ ఉన్న రైతులకు వర్తింపు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఆరంభం నుంచి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందుతోంది. 2019 తర్వాత భూ క్రయవిక్రయాలు జరిపిన వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఫలితంగా రైతులు రాష్ట్రప్రభుత్వం అందించే రైతు భరోసాపైనే ఆధారపడుతున్నారు. పీఎం కిసాన్ పథకంలో గతంలో ఉన్న లబ్ధిదారు మృతి చెందితే వారసులకే ఆర్థిక సాయం అందుతోంది. కొత్త రైతులు చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 2025 మేలో కొత్త రైతుల వివరాల నమోదుపై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అదనంగా 7వేల మందికే.. జిల్లాలోని 61,747 మంది రైతులకే పథకం ఆరంభంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందింది. లబ్ధిదారులు మృతి చెందాక వారసులు ఆ భూములు పంచుకొని తమ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇలాంటి వారికి సైతం ఈ పథకం వర్తించింది. వీరు జిల్లావ్యాప్తంగా సుమారు 7,340 మంది ఉన్నట్లు గుర్తించగా.. అదనంగా వీరే ప్రయోజనం చేకూరుతోంది. 2019 తర్వాత భూక్రయ విక్రయాలు చేసిన వారికి పైసా సాయం అందడంలేదు. కటాఫ్ తేదీ పెంచకపోవడంతో వర్తించని పీఎం కిసాన్ పథకం కేంద్ర పథకానికి నోచుకోలేక పోతున్న వందలాది రైతులు -
బైక్ను ఢీకొన్న కారు.. ఒకరికి గాయాలు
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కేశవపట్నం శివారులో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో రాజాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ మాతంగి ప్రభాకర్కు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రభాకర్ బైక్పై ఇంటికి వెళ్తుండగా కేశవపట్నం శివారులో స్పీడ్ బ్రేకర్ వద్ద వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ కాలు విరిగిపోగా, ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని 108వాహనంలో హుజురాబాద్ ఆస్పత్రికి తరలించారు. ధర్మపురిలో.. ధర్మపురి: బైక్ను కారు వెనక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సబ్బు సత్తయ్య ఆదివారం పనులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలు కాగా, 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆటో బోల్తా.. ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన నాగుల తిరుపతి ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట–గొల్లపల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి ఆటో బోల్తా పడడంతో తీవ్ర గాయాలైన తిరుపతిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్విండో చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు సుభాష్, పర్షరాములు, కార్తీక్గౌడ్, ప్రదీప్, సంతోష్ పరామర్శించారు. ట్రిమ్మర్కు చార్జింగ్ పెడుతూ.. విద్యుదాఘాతంతో..పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధి ముంజంపల్లి గ్రామంలో ఆదివారం విద్యుత్షాక్తో బొమ్మగాని తిరుపతి(32)మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉపాధిహామీ మేట్గా విధులు నిర్వహించే తిరుపతి తన కుమారుడికి ట్రిమ్మర్తో కటింగ్ చేసేందుకు ఇంటి బాత్రూం వద్ద ట్రిమ్మర్కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి కింద పడిపోయాడు. అతడి భార్య రేణుక గమనించి కుటుంబసభ్యుల సాయంతో ధర్మారంలోని ప్రైవేటు ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు బసంత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కోనేరులో పడి ఒకరు..వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి గుట్టపై కోనేరులో ప్రమాదవశాత్తు పడి సాదం రాజు(32) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్నగర్ పందికుంటకు చెందిన సాదం రాజు ఈనెల 5న తిరుపతి, వేములవాడ దర్శనానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు రాజు బంధువు జక్కుల మహేందర్ వేములవాడకు వచ్చాడు. రాజుకు ఫోన్చేయగా లిఫ్ట్ చేయలేదు. రాజు శనివారం రాత్రి తన బంధువులకు ఫోన్ చేసి నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటానని చెప్పడంతో బంధువులు గుట్టపై గాలించారు. కోనేరు వద్ద రాజుకు సంబంధించిన బ్యాగు, చెప్పులు, పర్సు లభించాయి. దీంతో కోనేరులో వెతకగా మృతదేహం లభించింది. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేశారు. -
కృత్రిమ మేధస్సుపై అవగాహన ఉండాలి
కొత్తపల్లి(కరీంనగర్): నేటి విద్యా విధానంలో కృత్రిమ మేధస్సుకు ప్రత్యేక స్థానం ఉందని, ఉపాధ్యాయులు కృత్రిమ మేధస్సుపై అవగాహన కలిగి ఉండాలని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్రెడ్డి అన్నారు. తరగతి గదిలో కృత్రిమ మేధస్సు వాడకంపై ఆదివారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సును సీబీఎస్ఈ నిపుణులు బి.రవికిరణ్, చారు దింగ్రాతో కలిసి ప్రారంభించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉండడానికి పైచేయి సాధించాలంటే కృత్రిమ మేధస్సు అవసరమన్నారు. అగ్ర దేశాలైన స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, బ్రిటన్లో కృత్రిమ మేధస్సుపై విశ్లేషణ జరగడంతో పాటు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అలాగే అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో కృత్రిమ మేధస్సు అమలుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అవగాహన సదస్సులో భాగంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన పలు చిత్రమాలికలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనాథకు అంత్యక్రియలు
రామడుగు(చొప్పదండి): మండలంలోని వెలిచాల గ్రామ శివారులోని స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకుల ఆధ్వర్యంలో అనాథ సిద్దం రాములు మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దపల్లి సమీపంలో చెట్లకింద నివాసం ఉంటున్న వృద్ధుడు రాములు అనారోగ్యంతో ఉన్నాడని సమాచారం రావడంతో స్పందన ఆశ్రమ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్ అతన్ని తీసుకవచ్చి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తుండగా, ఆదివారం వేకువజామున మృతిచెందాడు. మృతదేహానికి వెలిచాల శివారులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు కల్యాణ్, రాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
మంథని: ఓ యువకుడు మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాతో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలు.. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్గౌడ్ మంథనిలోని క్రీడా మైదానం సమీపంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఈక్రమంలో కారు, రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి సంతోష్ తలపై బీరుసీసాతో దాడి చేశారు. అంతేగాకుండా ఇటుకతో బాది, కాళ్లు, చేతులతో దాడిచేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంతోష్గౌడ్కు స్థానిక సామాజిక వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి గోదావరిఖనికి తరలించారు. కాగా సంతోష్ ఆయా పార్టీలు, అధికారులపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతుంటాడు. అవినీతి, అక్రమాలపై సైతం పోస్టింగ్లు పెడుతుంటాడు. అయితే అతడిపై ఎవరు దాడి చేశారనేది తెలియరాలేదు. పోలీస్స్టేషన్కు సమీపంలోనే దాడి చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
సర్కార్ కాలేజీలో ఇంటర్.. బీటెక్ ఫ్రీ
సిరిసిల్లకల్చరల్: హైదరాబాద్లో పేరున్న పెద్ద ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చదవాలంటే ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు ఫీజు చెల్లించాలి. ఎప్సెట్ కౌన్సెలింగ్ ద్వారా సీటు సాధిస్తే మాత్రం రూ.35వేలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మిగిలిన ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ విద్యార్థి భరించాల్సి ఉంటుంది. ర్యాంకు రాక, మేనేజ్మెంట్లో సీటు కొనుక్కోవాలంటే ఎంచుకునే బ్రాంచ్ ఆధారంగా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షలవుతుంది. హాస్టల్, స్టేషనరీ ఇతర ఖర్చులు అదనం. గతంలో ఎంసెట్ పరీక్షలో పది వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ఉచితంగా లభించేది. పదివేలకు మించి ర్యాంకు వచ్చిన విద్యార్థులు పెద్ద కాలేజీల్లో చదవాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. సర్కార్ కాలేజీలో ఇంటర్ చదివితే మాత్రం.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకు ఎప్సెట్లో ర్యాంకు ఆధారంగా పెద్ద కళాశాలల్లో సీటు వస్తే లక్షల్లో ఉన్న ట్యూషన్ ఫీజు కూడా భరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్సెట్లో పదివేలకు పైగా ర్యాంకు వచ్చినా సరే పూర్తి ట్యూషన్ ఫీజును సర్కారే చెల్లిస్తుందన్నమాట. మూడేళ్లుగా ఈ విధానాన్ని అనుసరిస్తూ నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేస్తోంది. మారిన ఈ నిబంధన వల్ల కార్మిక క్షేత్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ అడ్మిషన్లు పెరగడానికి కారణమవుతోంది. పదివేల పైన ర్యాంకు వచ్చిన బీసీ విద్యార్థులకు ఏటా రూ.35వేలు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ఉన్న ఫీజులోంచి ఈ రూ.35వేలు మినహాయించుకుని మిగిలిన ఫీజు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. మారిన నిబంధన ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ర్యాంకుతో పనిలేదు.. పూర్తి ఫీజు ప్రభుత్వమే భరిస్తుంది ఎప్సెట్లో పదివేల ర్యాంకు దాటినా సరే.. ఇంజినీరింగ్ విద్య ఫ్రీ సర్కార్ కాలేజీల్లో పెరుగుతున్న ప్రవేశాలు -
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో
చొప్పదండి: ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేందుకు పిల్లలను చేర్పించాలని డీఈ వో శ్రీరామ్ మొండయ్య తల్లిదండ్రులను కోరా రు. చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎస్జీటీ యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారరథాన్ని డీఈవో మొండయ్య, ఎంఈవో పి.మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీని వాస్రెడ్డి, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు వూ కంటి విజేందర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరా రు. సాంబయ్యపల్లి, గుమ్లాపూర్, చొప్పదండి, భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో ప్రచా రం నిర్వహించారు. జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి, రుక్మాపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, కట్టెకోల తారలక్ష్మణ్, శ్రీనివాస్, రాములు, శాంతికిరణ్ పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలికరీంనగర్: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, దేశంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని, మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని తెలంగాణచౌక్లో నల్లజెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సా గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముందుకు వచ్చి వ్యతిరేకించాలని కోరారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని, లేకుంటే వామపక్షా ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, గిట్ల ముకుందరెడ్డి, సీపీఐ, సీ పీఎం జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు మల్లయ్య, రాజు, బుచ్చన్నయాదవ్, రమేశ్, నాగమణి, రమేశ్, యుగంధర్, అంజలి పాల్గొన్నారు. లీకేజీకి అడ్డుకట్టకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని కట్టరాంపూర్ నాగన్న చౌరస్తా వద్ద నెలకొన్న లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేశారు. పైప్లు, జాయింట్లలో లీకేజీతో ఇరవై రోజులకు పైగా భారీగా రోడ్డుపై వరద పారుతుండడం తెలిసిందే. దీనిపై ‘సిటీలో లీకేజీ వరద’ పేరిట ఈ నెల 4వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. 32, 12, తదితర డివిజన్లకు నీళ్లు అందించే ప్రధాన పైప్లైన్ కావడంతో, లీకేజీతో భారీగా నీళ్లు వృధాగా పోయాయి. ఫలితంగా నిత్యం కట్టరాంపూర్ నుంచి డ్యాం వైపు వెళ్లే మెయిన్ రోడ్డు వరదమయంగా మారింది. శనివారం పైప్లైన్ ను సరిచేసి, వరదతో దెబ్బతిన్న టైల్స్పై మట్టి వేసి చదును చేశారు. సమస్య మళ్లీ తిరగబెట్టకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: కొత్త డీటీఆర్ ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీసీసీ ఫీడర్ పరిధిలోని ముకరంపుర, బస్టాండ్, వన్టౌన్ పోలీస్స్టేషన్, కలెక్టర్ ఆఫీసు కార్యాలయాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 11కేవీ ఎల్ల మ్మ ఫీడర్లో ఆటోనగర్, బీఎస్ఎన్ఎల్ టవర్ ఏరియా, మల్లికార్జునకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. -
‘విద్యావాహిని’తో ప్రచార బాట
ప్రచార రథంతో ప్రచారం నిర్వహిస్తున్న ఎంఈవో ప్రభాకర్రావు, ఉపాధ్యాయులు కరీంనగర్: ‘మా బడిలో మంచి తరగతి గదులున్నాయి. ప్రయోగాలు చేసేందుకు సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి పౌష్టికాహారం అందిస్తున్నాం. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ఎంఈవో ప్రభాకర్రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. బడిబాటకు ముందు సొంతంగా విద్యావాహిని పేరిట ప్రచారం రథం ఏర్పాటు చేసి, ఆ వాహనానికి బడిలో కల్పిస్తున్న వసతుల ఫొటోలు అంటించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను వెంటేసుకుని రోజుకో గ్రామం తిరుగుతూ బడిబాటను కొనసాగిస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రభాకర్రావు తెలిపారు. కలెక్టర్పమేలా సత్పతి స్ఫూర్తితో సొంత ఖర్చులతో వాహనం సమకూర్చి బడిబాటలో భాగంగా ప్రచార జాత నిర్వహిస్తున్నారు. ప్రభాకర్రావు గతంలోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. ప్రత్యేక ప్రచార జాత నిర్వహిన్న ఎంఈవోను ఇటీవలే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు సత్కరించారు. ప్రభాకర్రావును స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు. -
పాటల రూపంలో వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ..
రామగుండం: విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో వివిధ అంశాలపై పాటల రూపంలో రీల్స్ తీసి పేరెంట్స్, విద్యార్థుల గుండెల్లో స్థానం పదిల పర్చుకున్నారు రామగుండం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం అజ్మీరా శారద. బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి పాట రాసి రీల్స్ షూట్ చేయడం నెట్టింటా వైరల్గా మారింది. దీనిని వందేమాతరం ఫౌండేషన్ గుర్తించి బహుమతి ప్రకటించారు. నైతిక విలువలతో కూడిన బోధన, విద్య గొప్పదనం ప్రతిబింబించేలా పాట రాసి ఆలపించడం ఆకట్టుకుంది. ‘బడి బయట ఏముందిరా చిన్నా.. బడిలోనే ఆటుందిరా చిన్నా’.. అంటూ చేసిన రీల్స్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఇలా సందర్భాన్ని బట్టి ఇప్పటి వరకు 15 పాటలు రాసినట్లు హెచ్ఎం తెలిపారు. ప్రత్యేక వాహనంతో..మానకొండూర్: బడిబాటలో ఎంఈవో మధుసూదనాచారి ప్రత్యేక వాహనం, మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 5 నుంచి ప్రచార రథంతో ఆయా గ్రామాల్లో తిరుగుతూ పాటల ద్వారా బడిబాట ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రచార రథం వెంట, ఇంటింటా ప్రచారం నిర్వహించి పిల్లలు ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేస్తున్నారు. -
ఫలితాలే ప్రామాణికంగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గత విద్యాసంవత్సరంలో వచ్చిన ర్యాంకులు, ఉత్తీర్ణతశాతంపై ఎంఈవో కృష్ణహరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కరపత్రాలు, బ్యానర్లు, ప్లకార్డులు, వాల్ పోస్టర్లు తయారు చేయించి గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ.. పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించాలని కోరుతున్నారు. తమపై నమ్మకంతో చేర్పిస్తే వారిని నిష్ణాతులుగా తయారు చేస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. దీంతో మండలవ్యాప్తంగా 105 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరడానికి అంగీకార పత్రాలు రాసిచ్చారు. ఎంఈవో ముందుచూపుతో.. గత విద్యా సంవత్సరం పది ఫలితాలే ప్రామాణికంగా ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని దుమాల ఉన్నత పాఠశాలకు చెందిన రామిండ్ల అర్పిత 574 మార్కులతో జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రాచర్లగొల్లపల్లి జెడ్పీహెచ్కు చెందిన పి.ప్రణవి 564 రెండోస్థానంలో నిలవగా, రాచర్లబొప్పాపూర్ స్కూల్కు చెందిన రిషిక, శ్రీవర్షిని 562, రాచర్లతిమ్మాపూర్కు చెందిన నాగవర్షిణి 559, వెంకటాపూర్కు చెందిన సురేఖ 559 మార్కులు సాధించారు. ఇలా మండలవ్యాప్తంగా 450మంది పదో తరగతి పరీక్షలు రాయగా, వారిలో 120 మంది 500లకు పైగా మార్కులు సాధించడం విశేషం. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫలితాల కరపత్రాల ద్వారా ఇంటింటా ప్రచారం చేయడం కలిసివస్తోంది. ఎంఈవో ముందుచూపుతో వినూత్న ఫలితాలను చూసి సర్కార్ బడిలో చేరాలని చేసిన ప్రయత్నం ఫలించింది. ఇప్పటికే 105 మంది ప్రవేశాలకు అంగీకరించారు. వేసవి సెలవులు కలిసొచ్చాయి వేసవి సెలవులు కలిసొచ్చాయి. సెలవుల్లో నాతో పాటు ఉపాధ్యాయులు ఇంటికి పరిమితం కాకుండా కరపత్రాలు, వాల్పోస్టర్లు, ప్లకార్డులు, బ్యానర్లు ముద్రించి ఇంటింటా ప్రచారం చేయడంతో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాల ఏర్పాటు కూడా కొత్త విద్యార్థుల చేరికకు కారణమైంది. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలే లక్ష్యంగా పని చేస్తాం. – కృష్ణహరి, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట -
చెట్లపసరు తాగి మహిళ మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి లలిత(50) చెట్లపసరు తాగి అస్వస్థతకు గురై శుక్రవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి కుమారుడు నేవూరి కళ్యాణ్ ఫిర్యాదుతో పోలీసులు శనివారం కేసు నమోదు నమోదు చేశారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. లలిత కొంతకాలంగా బీపీ, షుగర్తో బాధపడుతోంది. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గుర్తుతెలియని వ్యక్తి వద్ద చెట్లపసరు తాగించారు. దీంతో అస్వస్థతకు గురైన లలితను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త అశోక్రెడ్డి, కుమారుడు కళ్యాణ్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మేసీ్త్ర ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలు భరించలేక ఓ మేసీ్త్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండల కేంద్రానికి పెరుమాండ్ల కృష్ణ(50) నాలుగేళ్ల క్రితం కూతురు పెళ్లి కోసం రూ.4లక్షలు అప్పు చేశారు. మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. పనులు సరిగా లేవు. ఈక్రమంలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరిగింది. అప్పులు తీరే మార్గం కనిపించక గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం వేకువజామున ఇంట్లో నుంచి వెళ్లిన కృష్ణ.. తెర్లుమద్దిచౌరస్తా వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండగట్టులో యువకుడి హత్య?● వివాహ వేడుకల్లో వివాదం ● హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు ప్రచారం ● విచారణ చేపట్టిన పోలీసులు? మల్యాల: మల్యాల మండలంలోని ముత్యంపేట (దిగువ కొండగట్టు)కు చెందిన ఓ యువకుడిని స్థానిక యువకులు హత్య చేసినట్లు సమాచారం. ఈనెల 2న ఓ వివాహ వేడుకల్లో జరిగిన వివాదంతో సుమారు 40కి పైగా దొంగతనాల కేసుల్లో నిందితుడైన యువకుడిని దాదాపు 10మంది యువకులు కలిసి హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో శనివారం రాత్రి మల్యాల పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెల్సింది. వారిచ్చిన సమాచారం మేరకు సదరు యువకుడిని పూడ్చిపెట్టినట్లు భావిస్తున్న స్థలాన్ని ఎస్సై నరేశ్కుమార్, సీఐ నీలం రవి పరిశీలించారు. పూర్తి వివరాలను ఆదివారం వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘అగ్రికల్చర్ పాలిటెక్నిక్’ నోటిఫికేషన్
జగిత్యాలఅగ్రికల్చర్: పదో తరగతి పూర్తయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు వరంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో ఇటీవల డిమాండ్ పెరిగింది. ఈ కోర్సులు చేసిన తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే ఎంసెట్తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్) కోర్సులో చేరవచ్చు. డిప్లొమా చేసినవారికి బీఎస్సీ అగ్రికల్చర్లో 15 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. అయితే, వీరు డిప్లొమా తర్వాత అగ్రిసెట్ పరీక్ష రాయాలి. సీట్ల వివరాలు దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సెలింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. రెండేళ్ల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు.. 9 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో 240, మూడు ప్రైవేట్ కాలేజీల్లో 210 సీట్లు ఉన్నాయి. అలాగే, మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లోమో కళాశాలలు.. ఒక ప్రభుత్వ కళాశాలలో 20, ఒక ప్రైవేట్ కాలేజీలో 30 సీట్లు ఉన్నాయి. అలాగే, నాలుగేళ్ల క్రితం నూతనంగా ప్రవేశపెట్టిన రెండేళ్ల ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా కళాశాల ఒకటి ఉండగా, అందులో 60 సీట్లున్నాయి. ఈ కళాశాల వికారాబాద్ జిల్లా గింగుర్తిలో ఉండగా, ఏకలవ్య ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిర్వహిస్తుంది. ఈ కోర్సులన్నీ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, ఒకటి జగిత్యాల జిల్లా పొలాస, రెండోది కరీంనగర్ జిల్లా జమ్మికుంట(బాలురు)లో ఉన్నాయి. ప్రతీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 20 సీట్లు మాత్రమే ఉండగా, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కలిపి మొత్తం 560 సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు ఈ ఏడాదికి గాను అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ కోర్సులు చదివేందుకు పదో తరగతి చదివి, పాలిసెట్–2025 అగ్రికల్చర్ విభాగంలో పరీక్ష రాసినవారు అర్హులు. మున్సిపల్ ఏరియాలో కాకుండా గ్రామీణ ప్రాంతాలు లేదా ప్రభుత్వ పాఠశాలలు లేదా గురుకులాల్లో నాలుగేళ్ల పాటు చదివిన విద్యార్థులకు 60 శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఈసారి పట్టణ ప్రాంతాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 15–22 ఏళ్ల మధ్య జన్మించిన వారు అర్హులు. పాలిసెట్–2025 (అగ్రికల్చర్ విభాగం)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కౌన్సిలింగ్ పద్ధతిలో కేటాయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులకు.. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.600, ఇతర అభ్యర్థులు రూ.1,200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఫేమెంట్ రిజిస్ట్రేషన్కు ఈనెల 28, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు 29 చివరి తేదీ. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వస్తే మొదటి సెమిస్టర్కు రూ.19,645, ప్రైవేట్ కాలేజీల్లో వస్తే రూ.24 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్శిటీ వెబ్సైట్ పీజేటీయూ.ఈడీయూ.ఇన్లో సంప్రదించవచ్చు. పాలిసెట్–2025 (అగ్రికల్చర్) ర్యాంకుల ద్వారా సీట్ల భర్తీ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 29 -
రారండోయ్.. సర్కారు బడికి
ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ఒక్కో ఊరిలో ఒక్కో విధమైన వినూత్న ప్రచారంతో ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడి ప్రత్యేకతలను, అందులో చదివితే వచ్చే లాభాలను గురించి తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరిస్తున్నారు. నర్సరీ చదువుల నుంచే రూ.లక్షలు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల కన్నా.. ఉచిత విద్య, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించే ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచిస్తున్నారు. ఆడియో, వీడియో, రీల్స్, ప్రచార రథాలు, పరీక్షల ఫలితాల కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బడిబాట కార్యక్రమం జోరందుకుంది. ఈసందర్భంగా సర్కార్ బడుల బలోపేతానికి పాటుపడుతున్న పలువురు ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై కథనం. ఏఐతో ప్రచారంఇల్లంతకుంట(మానకొండూర్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తూ బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేలా చేస్తున్నాడు మండలంలోని వల్లంపట్ల హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు పత్తి వంశీధర్రెడ్డి. పాఠశాలలో జరిగిన అభివృద్ధి, విద్యార్థుల ఉత్తీర్ణత, సదుపాయాలు, ఉపాధ్యాయుల వివరాలు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఏఐ పరికరం యాంకరింగ్ చేస్తుంది. దీనిని వాట్సప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నట్లు ఉపాధ్యాయుడు తెలిపారు. దీనిని స్కూల్ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. బ్యాండ్మేళంతో ఆహ్వానంశంకరపట్నం(మానకొండూర్): సర్కార్ బడిలో పిల్ల లను చేర్పించాలని శంకరపట్నం మండలం వెంకటేశ్వర్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కోటేశ్వర్రావు బ్యాండ్ మేళంతో ప్రచారం చేస్తారు. హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యార్థులకు యోగా, దేశభక్తి, సత్ప్రవర్తన గురించి వివరిస్తూ నవోయద ప్రవేశం కోసం శిక్షణ ఇస్తున్నారు. సర్కార్ బడిలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రైవేట్ వద్దు– సర్కార్ బడి ముద్దు నినాదంతో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. బడిబాటలో తల్లిదండ్రులతో పాటు అవ్వతాతలను భాగస్వామ్యులను చేసేందుకు బ్యాండ్మేళంతో ఆహ్వానిస్తూ గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఇటీవల విస్తరి ఆకుల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు వాటిలో భోజనం వడ్డించడంతో హెచ్ఎంను కలెక్టర్ పమేలాసత్పతి ప్రశంసించారు. విద్యార్థులకు క్రీడాదుస్తులు, స్కూల్ బ్యాగులు అందించేలా గ్రామంలో ఆర్థికంగా ఉన్నవారిని ప్రోత్సహించడంతో గతేడాది ఇద్దరు దాతలు ముందుకొచ్చారు. మెట్పల్లి అనుబంధ గ్రామం వెంకటేశ్వర్లపల్లి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు హెచ్ఎం వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
మెడికల్ కళాశాలకు పార్థివదేహం అందజేత
సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందినపెగడ లక్ష్మీనారాయణ శుక్రవారం రాత్రి అనారో గ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఆశ యం మేరకు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క రీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి లక్ష్మీనారాయణ పార్థివదేహాన్ని శనివారం దానంచేశారు. ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మేరుగు భీష్మాచారి సహకారంతో మృదేహాన్ని కాలేజీకి అప్పగించారు. పార్థిదేహాన్ని దానం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు పెగడ రాజమౌళి, రమేశ్, అయిలయ్య, పరుశరాములు, చందు, శ్రీనివాస్, ఆంజనేయులు, కిషన్, సూర్యానికి ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమీ హెడ్, వైస్ ప్రిన్సిపాల్ కిషన్రెడ్డి, ప్రచార కార్యదర్శి వాసు, ముత్యాల నర్సయ్య అభినందించారు. -
రూ.31కోట్లతో రోడ్ల నిర్మాణం
● రాష్ట్రం ప్రతిపాదిస్తే ఎన్హెచ్ నిధులతో రాజీవ్ రహదారి విస్తరణ ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కొత్తపల్లి(కరీంనగర్): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.31కోట్ల 12 లక్షలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.14 లక్షలతో నిర్మించిన రోడ్డును శనివారం ప్రారంభించారు. కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్లో రూ.9.50 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న మార్కెట్షెడ్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తపల్లి మండలంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.74 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. ఖాజీపూర్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.14లక్షలతో రోడ్డు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర రహదారుల సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద రూ.291 కోట్లు ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామని తెలిపారు. నేషనల్ హైవే నిధులతో రాజీవ్ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేశామని, కరీంనగర్ నుంచి వరంగల్, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే కరీంనగర్– జగిత్యాల రోడ్డు పనులు ప్రారంభించబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులుపాల్గొన్నారు. -
రారండోయ్.. సర్కారు బడికి
● ఊరూరా జయశంకర్ బడిబాట ● ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఇంటింటా ప్రచారం ● వినూత్న ప్రచారం.. ఆకర్షించే కార్యక్రమాలు ● పిల్లలు సర్కారు బడిలో చేరాలని పిలుపుఇంగ్లిష్ మీడియం చదువులు.. ఉచితంగా ఏకరూప దుస్తులు.. షూలు.. చదువుకునేందుకు పాఠ్యపుస్తకాలు.. ఆకలేస్తే మధ్యాహ్నం రుచికరమైన పౌష్టికాహారం.. విశాలమైన డిజిటల్ తరగతి గదులు.. క్రీడా మైదానాలు.. సకల సౌకర్యాలు.. అన్నింటికీ మించి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇంకెందుకు ఆలస్యం.. రారండోయ్ సర్కారు బడికి అంటూ.. ఊరూరా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రూ.లక్షలు పోసి ప్రైవేటులో చదివించే కన్నా.. అన్నీ ఉచితంగా అందిస్తున్న సర్కారు బడిలో చేరాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై సండే స్పెషల్..ఇదే మా ఓపెన్ చాలెంజ్..● మా పిల్లల కన్నా ‘ప్రైవేటు’ వాళ్లు బాగా చదివితే రూ.500 నజరానా ● పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి స్కూల్ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం ధర్మారం: ‘ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మా పిల్లల కన్నా బాగా చదవగలరా..? అలా ఒక్క విద్యార్థి చదివినా రూ.500 నజరానా ఇస్తాం’.. అంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నారు. బడిబాటలో భాగంగా ఇంటింటా తిరుగుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహనాచార్యులు, ఉపాధ్యాయులు కలిసి ఫిబ్రవరి 21నుంచే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు బడికి పంపించాలని కోరుతున్నారు. తమ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల కన్నా ప్రైవేటులో చదివేవారు ప్రతిభ కనబరిస్తే.. రూ.500నగదు బహుమతి అందిస్తాని చాలెంజ్ చేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ.. ఇంటింటా కరపత్రాలు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో 36 మంది విద్యార్థులుండగా.. బడిబాటలో భాగంగా 14మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం తెలిపారు. గ్రామంలోని ప్రతీ విద్యార్థి సర్కారు బడికి వచ్చేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు.– వివరాలు 10లోu -
ప్లాస్టిక్ సామగ్రి నిల్వ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలోని వాగు సమీపంలో పనికిరాని ప్లాస్టిక్ సామగ్రి నిల్వ చేసే దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.70 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలు.. ధరూర్లోని కొలగాని సత్యనారాయణరావుకు చెందిన రేకులషెడ్డులో ముంబయ్కి చెందిన సల్మాన్ పనికిరాని ప్లాస్టిక్, పాత ఇనుప సామగ్రి సేకరించి, దానిని మిషనరిల ద్వారా స్క్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు. శనివారం ప్లాస్టిక్ సామగ్రి సేకరించే సమయంలో దుకాణం పక్కనే ఓ వ్యక్తి దహన సంస్కారాలు నిర్వహించగా అక్కడి నుంచి నిప్పులు అకస్మాత్తుగా వచ్చి ప్లాస్టిక్ సామగ్రి ఉన్న చోట పడడంతో మంటలు భారీగా వ్యాపించాయి. అప్రమత్తమైన రెవెన్యూ, అగ్నిమాపక శాఖలు అక్కడకు చేరుకుని జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, మెట్పల్లి నుంచి ఫైరింజన్లను రప్పించారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈప్రమాదంలో రూ.30 లక్షల రేకులషెడ్డుతో పాటు రూ.40 లక్షల విలువ గల సామగ్రి, మిషన్లు కాలిపోయాయి. మంటలు ఆర్పేయడంలో జగిత్యాల అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. సిబ్బంది మధు కాలుకు స్వల్పగాయాలు కాగా, జగిత్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ శ్రీనివాస్ ఘటన స్థలంలో ఉండి పర్యవేక్షించారు. కాగా, ఈ ప్రమాదంతో మొదట దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత -
ముందస్తు బడిబాట
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మే చివరి వారంలో పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమం చేపట్టారు. కందికట్కూర్, ఓబులాపూర్, ఇల్లంతకుంట, సిరికొండ, జంగారెడ్డి పల్లె, బోటిమీదిపల్లె తదితర గ్రామాల్లో మండల విద్యాధికారి శ్రీనివాస్, ఎస్జీటీ యూనియన్ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఊరూరా తిరుగుతూ.. విద్యార్థులు సర్కార్ బడుల్లోనే చేర్పించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు. బడీడు పిల్లలను నమోదు చేయించాలని అంగన్వాడీ టీచర్లను కోరారు. ఇంటింటా తిరిగా.. గ్రామాల్లోని విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ బడుల్లో చేరేలా ఏప్రిల్ చివరలో సిరికొండ గ్రామంలో ఇంటింటా తిరిగా. ప్రైవేటు విద్యార్థుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులతో పాఠశాలలో సమావేశం నిర్వహించా. ఎంఈఓ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తిరుపతి హాజరయ్యారు. పిల్లలకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యనందిస్తామని తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా, ప్రభుత్వ బడికి పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. – తంగళ్లపల్లి శ్రీనివాస్, ఎస్జీటీ యూనియన్ మండల అధ్యక్షుడు -
అర్థవంతమైన ‘పాట’.. బడికి బాట
సిరిసిల్ల: ‘సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది.. రారమ్మన్నదీ.. ఇంగ్లిష్ చదువు కూడా చెప్పుచున్నది.. ఎంతో నేర్పుతున్నది.. పద పదా పోదాం సర్కారూ బడికి.. పైసన్నది ఖర్చులేని అమ్మ ఒడికి’.. అంటూ సాగే అర్థవంతమైన పాట, చక్కటి సంగీతం, పాఠశాల ఫొటోలతో.. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలతో రూపొందించి సోషల్ మీడియా వేదికగా బడిబాట పాటను ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేందంల్రోని వెంకంపేట మండల పరిషత్ ప్రాథమి పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంపై నెల రోజుల ముందే చక్కటి ఆడియో, వీడియో పాటను చిత్రీకరించి వేసవి సెలవుల్లో ప్రజాబాహుళ్యంలోకి పంపించారు. ఇప్పుడు ఆ పాట.. బడి బాటకు పల్లవిగా మారి మారుమోగుతోంది. అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా.. వెంకంపేట ఎంపీపీఎస్ స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. ఇక్కడ ప్రస్తుతం వంద మంది విద్యార్థులు ఉండగా, మరో 50 మందికి అడ్మిషన్లు ఇచ్చే లక్ష్యంతో హెచ్ఎం మోర దామోదర్, ఉపాధ్యాయులు సీహెచ్ రాణి, కె.పద్మ, సౌభాగ్యల బృందం ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. వెంకంపేట ప్రాంతంలో ఉండే ప్రతీ ఇంటికి వెళ్లి.. ‘మీ పిల్లలను మా బడికి పంపించండి.. ఉచితంగానే ఇంగ్లిష్లో బోధిస్తాం’ అని చెబుతూ పిల్లలను బడిలో చేర్పించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ముందే రూపొందించిన బడి పాటను ఇంటి యజమానుల వాట్సప్ గ్రూపుల్లోకి డౌన్లోడ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. బడిలో ఉన్న వసతులు, పక్కా భవనం, ఆటస్థలం, డెస్క్ బేంచీలు, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిపామ్స్ ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని వివరిస్తున్నారు. అందరి సహకారంతో.. బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టాం. నెల రోజుల ముందే పాటను రూపొందించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాం. అందరి సహకారంతో పాఠశాలలో వసతులు కల్పించాం. బడిలో అడ్మిషన్లు పెంచే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుంది. – మోర దామోదర్, హెచ్ఎం, వెంకంపేట స్కూల్ -
కేబినెట్లోకి ఎవరో?
● ఉమ్మడి జిల్లా నుంచి ఒకరికి అవకాశం ● కవ్వంపల్లి, ఆది, అడ్లూరిలో ఒకరికి చోటు? ● ఉత్కంఠలో ఆశావహులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ విస్తరణ ఆదివారం జరుగనుంది. కేబినెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే సమాచారం ఉంది. ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచన చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టే భాగంగా అధిష్టానం ఉమ్మడి జిల్లాలో ఒకరికి మంత్రి పదవీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు సామాజికవర్గం కోటాలో మంత్రివర్గంలో బెర్తు ఖాయమనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కేబినెట్లో చోటు ఖాయమని వారి అనుచరులు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లు వ్యవహరిస్తుండగా ప్రస్తుత మంత్రివర్గంలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలలో ఒకరిని తీసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా పార్టీ అధిష్టానం సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు కొత్తగా ఎన్నికై న నేతలు, సీనియర్ నేతలను సామాజిక వర్గం అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ నుంచి కేబినెట్లో ఒకరిని మంత్రిగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే కేబినెట్ విస్తరణలో జిల్లా నుంచి ఈ ముగ్గురిలో ఒకరికి చోటు దక్కి ఉత్కంఠకు తెరపడనుంది. -
విత్తనానికి తొందర పడొద్దు
వీణవంక(హుజూరాబాద్)/కరీంనగర్రూరల్: ముందస్తు రుతుపవనాల రాకతో సంబరపడిన రైతన్నకు నిరాశే మిగిలింది. వానాకా లం సీజన్ ఆరంభంలో రోహిణికార్తె ప్రవేశించిన తొలిరోజునుంచి నాలుగైదు రోజులపాటు కురిసిన తొలకరి వర్షాలకు రైతులు సంబురపడ్డారు. జిల్లాలోని పలుచోట్ల దుక్కులు దున్ని పత్తి విత్తనాలు సైతం వేశారు. అయితే కొద్దిరోజులకే చినుకు కినుకు వహిస్తోంది. వారం రోజుల నుంచి వర్షం జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలతో వేసిన విత్తనం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు వేసేందుకు ఎదురుచూస్తున్న రైతులకు చినుకుజాడ లేకపోవడంతో అదను దాటిపోతోందని ఆవేదన చెందుతున్నారు. నేటినుంచి మృగశిర కార్తె ప్రవేశిస్తుండగా.. ఈ కార్తెలోనైనా వరణుడు కరుణిస్తాడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. మృగశిరపైనే ఆశలు వానాకాలం పంటల సాగును మృగశిర కార్తె నుంచి రైతులు ప్రారంభిస్తారు. ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో కొందరు రోహిణికార్తెలోనే పత్తి, మొక్కజొన్న విత్తనా లు వేశారు. పదిరోజుల నుంచి ఎండలు దంచికొడుతుండగా ఒక్క వర్షం పడలేదు. ఆదివారం నుంచి ప్రవేశిస్తున్న మృగశిర కార్తెలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ రాబోయే నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయనే సూచనతో విత్తనాలు మొ లకెత్తుతాయనే భరోసా కల్పించింది. వర్షాలు కురిసిన అనంతరమే విత్తనాలు వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. 3,43,240 ఎకరాల సాగు అంచనా జిల్లాలో ఈ వానాకాలంలో 3,43,240 ఎకరాలలో వివిధ పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. వరి 2,76,500 ఎకరాలు, పత్తి 48వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. రోహిణి కార్తెలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 28వేల ఎకరాల్లో పత్తి విత్తినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా ఎండలు దంచి కొడుతుండడంతో విత్తనాలు మాడిపోయే అవకాశముంది. భారీ వర్షాలు పడితే కానీ.. విత్తనాలు విత్తుకోవడం, నార్లు పోయడం చేయొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కనీస వర్షపాతం నమోదయ్యాకే వరినాట్లు వేసుకోవాలని చెబుతున్నారు. కొందరు పోసిన నార్లు ఎండలతో దెబ్బతింటున్నాయి. మృగశిరలో మంచి వర్షాలు పడితే తప్పా వ్యవసాయంలో ముందుకు సాగొద్దని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలో వానాకాలం సాగు అంచనా(ఎకరాల్లో)వరి 2,76,500 పత్తి 48,000 మొక్కజొన్న 4,000 మిర్చి 1,000 కూరగాయలు, హర్టికల్చర్ 13,045 ఇతర పంటలు 695 ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు ఊరించి.. ఉసూరు మనింపించిన రోహిణికార్తె నేటినుంచి మృగశిర ప్రారంభం మండుతున్న ఎండలు.. మొలకెత్తని పత్తి విత్తనాలు భారీ వర్షాలు పడితేనే విత్తనాలు వేయాలని సూచన -
పునర్విభజనపై రగడ
● అన్ని రాజకీయ పార్టీలకు అభ్యంతరమే ● ఓటర్ల సంఖ్యపై బల్దియా కసరత్తు ● రెండో రోజు 32 అభ్యంతరాలుకరీంనగర్ కార్పొరేషన్: డివిజన్ల పునర్విభజనపై రాజకీయ రగడ మొదలైంది. నగరాన్ని 66 డివిజన్లుగా విభజిస్తూ నగరపాలకసంస్థ ప్రకటించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. పునర్విభజనపై అన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎక్కువగా ఆయా డివిజన్లలో పేర్కొన్న ఓట్ల సంఖ్య ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఇంటినంబర్లతో లెక్కకట్టిన ఓట్లు సరిగా లేవని, ఒక డివిజన్లో ఎక్కువగా, మరో డివిజన్లో తక్కువగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బల్దియా కూడా ఆయా డివిజన్లలోని ఇంటినంబర్ల వారీగా మరో సారి ఓట్ల సంఖ్యను లెక్కించే పనిలో పడింది. అన్ని పార్టీలకు అభ్యంతరమే నగరంలో 66 డివిజన్ల పునర్విభజనపై అన్ని పార్టీ లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అధికార కాంగ్రెస్తో పాటు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు డివిజన్ల పునర్విభజన సరిగా లేదంటూ ఫిర్యాదు చేస్తున్నాయి. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ల విభజన సరిచేయాలంటూ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు వరుసగా అభ్యంతరాలు ఇస్తున్నారు. ఓట్ల సంఖ్యలో తేడా, ఆర్అండ్బీ రోడ్డుకు రెండు వైపుల ఉన్న ప్రాంతాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకే డివిజన్లో చేర్చడంపై బీఆర్ఎస్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఎంఐఎం, కాంగ్రెస్లకు అనుకూలంగా విభజించారని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీకి అనుకూలంగా విడగొట్టారని ఎంఐఎం ఎదురుదాడి చేస్తోంది. రాజకీయపార్టీల అభ్యంతరాల్లో ఎక్కువగా ఓట్ల సంఖ్యలో తేడా, ఇంటి నంబర్ల గందరగోళం, ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఒకే డివిజన్ అంశాలే ఉన్నాయి. ఇంటినంబర్ల వారీ గా లెక్కించిన ఓట్ల సంఖ్య ఒక డివిజన్లో ఎనిమిది వేలు, మరో డివిజన్లో రెండు,మూడు వేలు మాత్ర మే ఓట్లున్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. అన్ని డివిజన్లను ఐదు వేల ఓట్లుగా చూపిస్తున్నా, వాస్తవ ఓట్ల సంఖ్యకు పొంతన ఉండడం లేదంటున్నాయి. ఓటర్ల సంఖ్యపై బల్దియా కసరత్తు డివిజన్లలో పేర్కొన్న ఓట్లకు, వాస్తవ ఓట్లకు పొంతన లేదంటూ వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో నగరపాలకసంస్థ ఓట్లసంఖ్యపై దృష్టి సారించింది. అభ్యంతరాల అనంతరం పరిశీలనకు సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ఆయా డివిజన్లలో ఉన్న ఇళ్లు, ఓట్ల సంఖ్యపై మరోసారి కసరత్తు మొదలు పెట్టింది. డ్రాఫ్ట్లో పేర్కొన్న ఓట్లకు వాస్తవ ఓట్లకు తేడా ఉంటే, ఆ డివిజన్ల సరిహద్దులు మార్చేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. రెండో రోజు 32అభ్యంతరాలు పునర్విభజనపై రెండవ రోజు శుక్రవారం 32మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఓట్లను సరిచేయాలని, ఆర్అండ్బీ రోడ్డు నిబంధన పాటించాలని బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విజ్ఞప్తి చేశారు. పాత 9వ డివిజన్, కొత్త 29వ డివిజన్ను అశాసీ్త్రయంగా విజభించారని మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య ఫిర్యాదు చేశారు. కొత్త 9వ డివిజన్లో ఇంటినంబర్లను సరిచేయాలని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మద కోరారు. అంబేడ్కర్నగర్లో మధ్యలో ఉన్న ఇళ్లను పక్క డివిజన్లో వేశారని, వీటిని సరిచేయాలని సామాజిక కార్యకర్త మహమ్మద్ అమేర్ కోరారు.డివిజన్ల పునర్విభజనపై కలెక్టర్కు వినతి కరీంనగర్: శాసీ్త్రయబద్ధంగా విభజన ప్రక్రియ కొనసాగించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. నగరపాలక సంస్థ ప్రకటించిన 66 డివిజన్లలో తెలిపిన ఇంటి నంబర్లకు సంబంధించిన ఓటర్ల సంఖ్య అసంబద్ధంగా ఉందన్నారు. డీలిమిటేషన్పై వెంటనే విచారణ జరిపించి, తప్పుడు సమాచారంతో కరీంనగర్లో ప్రజలను, నాయకులను ఆందోళనకు గురిచేసిన అధికారులపై చర్య తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ, దిండిగాల మహేశ్, కుర్ర తిరుపతి, సంపత్రావు పాల్గొన్నారు. -
మావోలతో శాంతిచర్చలు జరపాలి
పెద్దపల్లిరూరల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై సాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేసి వారితో శాంతిచర్చలు జరపాలని ప్రజాసంఘాలు, వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి ప్రజాసంఘాల నేతలు చేస్తున్న వినతులను పెడచెవిన పెడుతూ ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ డెడ్లైన్లు విధించడం పాలకుల రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మావోలకు మద్దతుగా ఉంటున్నారంటూ అమాయక ఆదివాసీల ప్రాణాలను బలిగొంటున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు ముందుకొచ్చి వ్యతిరేకించాలని కోరారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు ముత్యంరావు, సదానందం, అశోక్, జ్యోతి, ప్రశాంత్, కనకరాజు, మల్లయ్య, సూర్య, చంద్రయ్య, మల్లేశ్, లచ్చన్న, భీమన్న, కొమురయ్య, రాజన్న, శ్రావణ్, మానస్కుమార్, లెనిన్, నవీన్, రవికుమార్ పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్లో కరీంనగర్ జట్టుకు గోల్డ్మెడల్
కరీంనగర్స్పోర్ట్స్: ఈనెల 4 నుంచి 6వ తేదీ వర కు నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన జూ యర్స్ బాయ్స్– గర్ల్స్ హ్యాండ్బాల్ టోర్నీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు వరంగల్ జట్టుపై ఫైనల్లో 20–13స్కోర్తో విజయం సాధించి, గోల్డ్ మెడల్ దక్కించుకుంది. జట్టుకు కోచ్గా మూల వెంకటేశ్, మేనేజర్గా శ్రీకాంత్ వ్యవహరించారని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర రావు, బాసరవేణి లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్ఎంఎంఎస్లో మనోళ్ల సత్తా
● జిల్లా నుంచి 74మంది విద్యార్థుల ఎంపికకరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాల (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) ఎంపికలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఏటా ప్రతిభా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలను గురువారం ప్రకటించారు. జిల్లా నుంచి మొత్తం 74మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.12వేలు ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా, గతేడాది నవంబరు 1న నిర్వహించిన ప్రతిభా పరీక్షలో 74 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి ప్రతినెల రూ.1000 చొప్పున ఏటా రూ.12 వేల నగదు అందించనున్నారు. 9,10, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఇలా నాలుగేళ్ల పాటు రూ.48 వేలు కేంద్ర ప్రభుత్వం అందించనుంది. జిల్లా పరిధిలో ఎంపికై న 74 మందికి నాలుగేళ్లలో రూ.35.52 లక్షలు ఉపకార వేతనాల రూపంలో అందనున్నాయి. సంతోషంగా ఉంది సాధారణ తరగతులతో పాటు ఉపాధ్యాయులు ప్రతిరోజు నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో మెంటల్ ఎబిలిటీ, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు ప్రధానంగా సన్నద్ధమయ్యాను. నాలుగేళ్ల పాటు వచ్చే ఉపకార వేతనం నా ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. దీంతో మా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఇదే స్ఫూర్తితో ఇతర పోటీ పరీక్షల్లోను ప్రతిభా చూపేందుకు కృషి చేస్తా. – వరికోలు విజ్ఞత, జెడ్పీహెచ్ఎస్ జూబ్లీనగర్ పాఠశాల -
ఆర్చరీ క్వార్టర్ ఫైనల్స్కు చికిత
పెద్దపల్లిరూరల్: ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లోభారతజట్టులో స్థానం సంపాదించుకున్న తానిపర్తి చికిత స్టేజీ–3 టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో రాణించి క్వార్టర్ ఫైనల్స్ పోటీలకు అర్హత సాధించారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్ శుక్రవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికితకు ఆర్చరీపై ఉన్న ఆసక్తిని గుర్తించి అప్పటి కలెక్టర్ సంగీత సత్యనారాయణ.. క్రీడా పరికరాన్ని అందించారని ఆయన గుర్తుచేశారు. హరియాణా రాష్ట్రంలోని సోనిపట్లో పొందే శిక్షణకు కలెక్టర్ చొరవతో ఎన్టీపీసీ యజమాన్యం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న చికిత.. ప్రతిభను కనబర్చి పలు పతకాలను దక్కించుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించిన జట్టు ప్రపంచకప్ సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
స్పోర్ట్స్ స్కూల్ పిలుస్తోంది
● 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో క్రీడా పాఠశాలలు ● 11 క్రీడలు, 60మంది బాలురు, 60మంది బాలికలకు అవకాశం ● 16 నుంచి మండల, 23 నుంచి జిల్లా, జూలై 1నుంచి రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలుకరీంనగర్ స్పోర్ట్స్: చదువుతో పాటు క్రీడల్లో ఒకేసారి రాణించాలనుకునేవారికి సువర్ణావకాశం. 4వ తరగతి నుంచి క్రీడారంగంలో తర్పీదు పొందేందుకు క్రీడాశాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఉన్న మూడు స్పోర్ట్స్ స్కూళ్లలో 2025–26 ఏడాదిలో 4వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ స్కూల్లో చోటు దక్కితే క్రీడల్లో అంతర్జాతీయస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశాలు.. దరఖాస్తులు.. ఎంపిక ప్రక్రియపై కథనం. జూన్ 16 నుంచి ప్రవేశ పోటీలు రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను క్రీడాశాఖ అధికారులు ప్రకటించారు. జూన్ 16 నుంచి 19లోపు మండలస్థాయిలో, 23 నుంచి 26వరకు జిల్లాస్థాయిలో, జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో ఎంపికపోటీలు జరుగుతాయి. సికింద్రాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి, ఎంపికచేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపినవారికి 4వ తరగతిలో ప్రవేశం దక్కుతుంది. మొత్తంగా 60మంది బాలురు, 60 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో 20మంది బాలురు, 20మంది బాలికల చొప్పున అవకాశం కల్పిస్తారు. దొడ్డికాళ్లు, ఫ్లాట్ఫీట్, వెన్నుముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు, బౌ లెగ్స్ ఉన్న వారు, ఎముకలు విరిగినవారు అనర్హులు. ఎంపికై న వారికి అథ్లెటిక్స్, అర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, వాలీబాల్, జూడో, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణించిన వారికి భవిష్యత్లో రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, పోలీస్, బ్యాంక్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పీఈటీ, పీడీ, కోచ్లు, కార్పొరేట్ సెక్టార్లలో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిర్వహించే ఫిజికల్ టెస్ట్లు మండల, జిల్లాస్థాయిలో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6.10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్త్రో(కిలో బరువు), వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎత్తు బరువు, 30 మీటర్ల ఫ్లైయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్జంప్, 6.10 మీటర్ల షటిల్రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసన్ బాల్ త్రో(కేజీ), 800 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. కావాల్సిన ధ్రువపత్రాలు.. అర్హతలు ● ఒరిజినల్ ఆధార్కార్డు ● 4వ తరగతి చదువుతున్నట్లు సర్టిఫికెట్ ● వయసు ధ్రువీకరణ పత్రం ● 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు ● కమ్యూనిటీ సర్టిఫికెట్ ● ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు ● విద్యార్థులు 8 నుంచి 9ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి ● 01– 09– 2016 నుంచి 31–08– 2017 మధ్య పుట్టిన వారు అర్హులు. -
‘బడిబాట’ను విజయవంతం చేయాలి
● పాఠశాల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు, ఉచిత దుస్తులు ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 12వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకా రం ప్రతిరోజు బడిబాట కార్యక్రమంలోని అంశాలను పాటించాలన్నారు. బాల బాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో, ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించేలా చూడాలన్నారు. అంగన్వాడీల్లో కొత్త సిలబస్ ప్రకారం శిక్షణ పొందిన టీచర్ల ఆధ్వర్యంలో ప్లేస్కూల్ మెటీరియల్, యూనిఫామ్, పోషకాహారం అందజేస్తున్నామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాలల్లోని సౌకర్యాల గురించి ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్ ప్రదర్శన, కరపత్రాల పంపిణీ ద్వారా డోర్టుడోర్ అవగాహన కల్పించాలన్నారు. ఈ సంవత్సరం యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, వర్క్బుక్స్ పాఠశాల ప్రారంభం రోజు ప్రతీ విద్యార్థికి అందించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్రెడ్డి ఆంజనేయులు పాల్గొన్నారు. ‘శుక్రవారం సభ’ భేష్ జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ అభినందనీయం అని, కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై హైదరాబాద్లో ఈనెల 4,5న ‘మేధో మథన సదస్స్ఙు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న ‘శుక్రవారం సభ’ గురించి జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వివరించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ కార్యక్రమాన్ని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ని సత్కరించారు. -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్లు సహా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. పదవులు భర్తీ చేయలేకపోతే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచా రాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును, దాని వైఫల్యాలను, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మైత్రిని ఎండగట్టాలన్నారు. ఇక తా ము ఎన్నికల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగా లు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే. మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవన్రెడ్డి, సీనియర్ నేత కటకం మృత్యుంజయం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ -
అంగన్వాడీబాటకు సిద్ధం కావాలి
కరీంనగర్: ఈనెల 12 నుంచి 17 వరకు నిర్వహించనున్న అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు సిద్ధం కావాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో శుక్రవారం సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 4,5 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన మేధో మథన సదస్సులో మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ సేవలను మరింత విస్తృతం చేసేందుకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మహిళలు, పిల్లల కోసం సాక్ష్యం అంగన్వాడీ, మిషన్శక్తి, మిషన్ వాత్సల్య లక్ష్యాలు వివరించారని అన్నారు. సీడీపీవోలు సబిత, నర్సింగారాణి, శ్రీమతి, సుగుణ, పాల్గొన్నారు.స్కూళ్లలో వసతులకు నిధులుకరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వ పాఠశాలల బ లోపేతానికి సుడా ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్న ట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలి పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సుడా కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తమవంతు బాధ్యతగా సుడా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ 11 రోజు ల పాటు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రచారరథం, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, టేబుళ్లు, బెంచీలు, వసతుల కల్పనకు సుడా నిధులు వెచ్చిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలికరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో అధికసంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని డీఈవో శ్రీరాం మొండయ్య సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో ప్రారంభించామని వెల్లడించారు. ఉపాధ్యాయులు గ్రామాల్లోని స్వచ్ఛంద సంస్థలు, మాజీ ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థులు వచ్చేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, బడీడు పిల్లల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని 16 మండలాల్లో కార్యక్రమం మొదటి రోజు విజయవంతమైందని వెల్లడించారు. క్వింటాల్ పత్తి రూ.7,400 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మా ర్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. శుక్రవారం మార్కెట్కు నాలుగు వాహనాల్లో 30 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,150, కని ష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొ నుగోలు చేశారు. శనివారం బక్రీద్, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. ‘పది’లో 14మంది గైర్హాజరుకరీంనగర్: పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ గణితం పరీక్షకు శుక్రవారం 132 మందికి 118మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 14మంది గైర్హాజరయ్యారని డీఈవో శ్రీరాం మొండయ్య తెలిపారు. ప్రత్యేక తనిఖీ బృందం రెండు పరీక్ష కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారని పేర్కొన్నారు. -
పారిశుధ్యం.. పచ్చదనం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామపంచాయతీ పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై మొదటి బహుమతి సాధించింది. గతేడాదికాలంగా గ్రామంలో పారిశు ధ్య నిర్వహణకు పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా సేకరించిన తడి,పొడి చెత్తను పంచాయతీ సిబ్బంది వేరు చేసి కంపోస్టుషెడ్లోని ప్రత్యేక అరల్లో భద్రపరుస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం చేస్తున్నారు. కంపోస్టుషెడ్, రింగ్కంపోస్టులో చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి నర్సరీలోని మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నారు. నర్సరీలో ప్రత్యేకంగా విటవిన్గార్డెన్ను ఏర్పాటు చేసి గంగావళి, పాలకూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలతో పచ్చదనం పరుచుకుంది. ప్రతి ప్రధాన వీధి చివరలో మురికినీరు ఇంకిపోయేలా కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నిర్మించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీలతో చెత్తచెదారం లేకపోవడంతో ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇటీవల రాజస్థాన్ ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సభ్యలు చామనపల్లిని సందర్శించారు. స్వచ్ఛదనం– పచ్చదనంతోపాటు పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా మల్లంపల్లి, ఖమ్మం జిల్లా మేడేపల్లి, కరీంనగర్ మండలం చామనపల్లి ఎంపిక కాగా చామనపల్లికి మొదటి బహుమతి లభించింది. రాష్ట్రస్థాయి బహుమతి సాధించేందుకు కృషి చేసిన పంచాయతీ కార్యదర్శి మహేందర్రావును పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ రవీందర్, డిప్యూటీ కమిషనర్ జాన్వెస్లీ, ఎస్బీఎం స్టేట్ డైరెక్టర్ సురేశ్బాబు, కరీంనగర్ ఎంపీవో జగన్మోహన్రెడ్డి, మాజీ సర్పంచ్ బోగొండ లక్ష్మిఐలయ్య అభినందించారు.● రాష్ట్ర ఉత్తమ గ్రామపంచాయతీగా చామనపల్లి.. గ్రామస్తుల హర్షం -
యశోదలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం
కరీంనగర్ టౌన్: సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ యశోద మెడిక ల్ సెంటర్లో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించా రు. నెఫ్రాలజిస్ట్ అరుణ్ కుమార్ పొన్న సుమారు 100 మంది పేషంట్లకు కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్, కి డ్నీ సమస్యలు, డయాలసిస్ అవసరం ఉన్నవారికి ఉచిత వైద్యం అందించారు. కరీంనగర్ సెంటర్ ఇన్చార్జ్ సురభి రాజేందర్రావు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం కారు, బైక్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంకు చెందిన చల్ల గిరిధర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసముంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ దైవదర్శానానికి కారులో వెళ్లి తిరిగి వస్తున్నారు. మండలంలోని రాచర్లతిమ్మాపూర్ వద్ద కామారెడ్డి వైపు నుంచి బైక్పై వస్తున్న దుమాలకు చెందిన పాముల సతీశ్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గిరిధర్, సంగీత, రాధ, సాత్విక, సాహిత్య, మనోజ్ఞ తీవ్రంగా గాయపడ్డారు. గిరిధర్ ఫిర్యాదుతో సతీశ్పై కేసు నమోదు చేసి, క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. దాడి కేసులో నలుగురికి నాలుగేళ్ల జైలువేములవాడ: దాడి ఘటనలో నలుగురికి నాలుగేళ్లు జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ వేములవాడ జడ్జి ప్రవీణ్ శుక్రవారం తీర్పునిచ్చినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలి పారు. వేములవాడఅర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన గంగు లక్ష్మిరాజం, అతని భార్య బాలవ్వను పాతకక్షలతో 2017లో అదే గ్రామానికి చెందిన ఎర్రం ప్రవీణ్, ఎర్రం అంజయ్య, ఎర్రం ముత్తయ్య, ఎర్రం ప్రసాద్, ఎర్రం శశి దాడిచేసి గాయపరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి ఈమేరకు తీర్పు వెలువరించారు. కోడెలు తరలిస్తున్న వ్యక్తిపై కేసుజగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా మూడు కోడెలు తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన ఎండీ నజార్ ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం ఉదయం మూడు కోడెలను జగిత్యాలకు తీసుకొస్తుండగా గొల్లపల్లి రోడ్లో పట్టుకొని గోశాలకు తరలించి నాజర్పై కేసు నమోదు చేశామన్నారు. రోడ్డుప్రమాదంలో మహిళా హోంగార్డుకు గాయాలువీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలో మహిళా హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాలు. వీర్నపల్లి ఠాణాలో హోంగార్డుగా జ్యోతి విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకొని ఇంటికి లిఫ్ట్ అడిగి బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు జ్యోతిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో రెండు కోడెలు మృతి● జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి వేములవాడఅర్బన్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో శుక్రవారం అనారోగ్యంతో రెండు కోడెలు మృతి చెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం మొత్తం 11 కోడెలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయన్నారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రారంభం
కరీంనగర్: కీర్తి మెడికల్స్ 25వ బ్రాంచ్ను కరీంనగర్లో శుక్రవారం ప్రారంభించారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎనమల నరేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి వారికి సత్కరించారు. కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ 24గంటలు సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. 30వేల రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. బెల్లంపానకం ధ్వంసం.. రూ.లక్ష జరిమానా ముత్తారం(మంథని): అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి అటవీ ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాలపై శుక్రవారం దాడులు చేశామని మంథని ఎకై ్సజ్ సీఐ రాకేశ్ కుమార్ తెలిపారు. సిబ్బంది రాజేందర్, శ్రీను, రఘురాం, రవి ఆధ్వర్యంలో దాడులు చేసి 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశామన్నారు. అలాగే ఓడెడ్– అమ్రబాద్ ప్రాంతంలో నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరికి రూ.లక్ష జరిమానా విధించడంతోపాటు తహసీల్దార్ మధూసూదన్రెడ్డి ఎదుట నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ వివరించారు. వివాహితపై లైంగికదాడికి యత్నం ● నిందితుడిపై కేసు రామగుండం: అంతర్గాం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు లైంగికదాడికి యత్నించిన ఘటనపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. ఓ వివాహిత మంచిర్యాలలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి అక్కడకు రోజూవెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా అదేప్రాంతానికి చెందిన పూదరి సత్తయ్యగౌడ్ ఆమెకు తరచూ ఫోన్చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు.. ఈనెల ఒకటో తేదీన ఎవరూ లేనిసమయంలో ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి తన కోరిక తీర్చాలని వేధించాడు. దీంతో బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు పారిపోతూ.. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని వివాహితను బెదిరించాడు. ఎలాగోలా ధైర్యం చేసిన బాధితరాలు పోలీసులకు ఫిర్యాదు చేసిశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. -
అర్హులకే రేషన్ కార్డులు
● కొత్త కార్డుల జారీకి కసరత్తు ● అనర్హుల కార్డుల రద్దుకు కొనసాగుతున్న ప్రక్రియ ● రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల డబుల్ రోల్కరీంనగర్ అర్బన్: రేషన్కార్డులపై డబుల్ రోల్ సాగుతోంది. అనర్హుల కార్డుల ఏరివేత ప్రక్రియ సాగుతుండగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. ఏకకాలంలో రెండు ప్రక్రియలు సాగుతుండగా రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ సదరు పనిలో నిమగ్నమైంది. గతంలో పలువురు అధికారులు ఇబ్బడిముబ్బడిగా కార్డులు జారీ చేయగా మామూళ్లు పైచేయిగా మారాయి. దీంతో కార్డుల సంఖ్య కుటుంబాలకు మించి ఉండటం అప్పట్లో తీవ్రచర్చకు దారి తీసింది. క్రమేణా అనర్హుల ఏరివేత సాగుతుండగా ఈ సారి పక్కాగా వ్యవహరిస్తున్నారు. అదేస్థాయిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పరిశీలిస్తూ కార్డులను జారీ చేస్తున్నారు. గడిచిన ఆరునెలలుగా బియ్యం తీసుకోని కార్డుదారుల వివరాలను గుర్తించిన ప్రభుత్వం జాబితాను జిల్లాకు చేరవేసింది. ఇంతకీ ఆ కార్డుదారులు ఉన్నారా? లేదా? అన్నది తేల్చేందుకు క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. సంబంధీకుల వివరాలతో అనర్హులను తొలగించే ప్రక్రియ మొదలైంది. సాంకేతికతతో గుర్తింపు పౌరసరఫరాలశాఖ అధికారులు చౌక దుకాణాల కు సరుకులు కేటాయిస్తుంటారు. ఈ–పోస్ యంత్రంపై వేలిముద్ర వేయడం, లేదంటే ఐరిస్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతికతను వినియోగించి కొందరు అనర్హులుగా ఉన్నట్లుగా గుర్తించింది. అందుబాటులో కి వచ్చిన సాంకేతికతతో ఒకే ఽఆధార్ నంబర్ కలి గిన లబ్ధిదారులు రెండుచోట్ల సరకులు తీసుకుంటున్నట్లుగా తేల్చారు. ఆరు నెలలుగా వేలమంది కార్డుదారులు బియ్యం తీసుకోనివారు ఉన్నట్లు వివరాలను సేకరించింది. ఇందులో వందేళ్లుదా టిన వారు, 18 ఏళ్లలోపు ఉన్నవారితో పాటు చని పోయినవారు ఉన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లోనూ కార్డులు కలిగి ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,90,402 రేషన్కార్డులు ఉండగా.. సన్నబియ్యం పంపిణీ మొదలైనా.. ఏప్రిల్, మే నెలలో సుమా రు 13వేల మంది కార్డుదారులు దుకాణాలకు రావడం లేదంటే వారు అర్హులా? కాదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. జనవరిలో 14,343 మంది, ఫిబ్రవరిలో 16,050, మార్చిలో 17,218 మంది కార్డుదారులు దూరంగా ఉన్నారని లెక్క తేలింది. ఏప్రిల్లో సన్నబియ్యం అందించడం షురూ కాగా, మార్చితో పోలిస్తే 2వేల మంది అదనంగా బియ్యం తీసుకున్నారు. 10వేలకు పైగా కార్డుల జారీ కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నవారు జిల్లాలో 30వేల మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. దరఖాస్తు వచ్చిన తదుపరి గిర్దావర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదించడం, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ పౌరసరఫరాలశాఖకు జాబితాను పంపడం డీఎస్వో అప్రూవ్ చేయడం కార్డు రావడం జరిగే ప్రక్రియ. సదరు విధానం త్వరత్వరగా జరిగేలా కలెక్టర్ పమేలా సత్పతి చర్యలు చేపట్టారు. కొత్త కార్డులు 10వేలకు పైగా జారీ కాగా 15వేలకు పైగా కార్డుల్లో పేర్లను చేర్చడం వంటి ప్రక్రియ చేపట్టారు. కార్డుల తొలగింపు, కొత్త కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు వివరించారు.జిల్లాలో గ్రామాలు: 318 మునిసిపాలిటీలు: 4 రేషన్ దుకాణాలు: 566 రేషన్ కార్డులు: 2,90,402 ప్రతినెలా బియ్యం పంపిణీ: 5582 మెట్రిక్ టన్నులు రేషన్ తీసుకోనివారు: 13,400 -
విత్తన లెక్క.. ఇక పక్కా
● విత్తన శుద్ధి కేంద్రాలపై ధ్రువీకరణ సంస్థకు పర్యవేక్షణ బాధ్యత ● రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం కరీంనగర్ అర్బన్: ఆరుగాలం కష్టపడే అన్నదాతకు నకిలీ విత్తనాల బెడద తప్పనుంది. అక్రమంగా విత్తనాలు తయారుచేసి విక్రయించేవారిపై ప్రభుత్వం ఇక ఉక్కుపాదం మోపనుంది. వరి, పత్తి, కంది, పెసలు, కూరగాయలు ఇతర పంటలకు విత్తన కంపనీలపై ఆధారపడటం జరిగే ప్రక్రియ. దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు అక్రమార్గంలో లక్షలు గడించాలనే దురాశతో ఏటా నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. తీరా సస్యరక్షణ చర్యలు చేపట్టాకా కాత దశకు వచ్చే క్రమంలో నకిలీదని తేలడంతో ఆర్థికంగా జరగాల్సిన నష్టం జరుగుతుండగా అండగా నిలవాల్సిన యంత్రాంగం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాలు పక్కాగా జరిగితేనే అన్నదాతలకు అభయం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం విత్తన శుద్ధి కేంద్రాలపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసింది. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే నకిలీలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త విత్తన చట్టం అమలు కోసం ఇప్పటికే కసరత్తు చేస్తుండగా విత్తనశుద్ధి మిల్లులు ఎన్నో లెక్క తేల్చడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖకు ఉత్తర్వులు జారీచేసింది. విత్తనశుద్ధి మిల్లులు నిర్వహిస్తున్న యజమానులు ఇక నుంచి తప్పనిసరిగా ప్రభుత్వ వ్యవసాయశాఖ వద్ద విత్తన ధ్రువీకరణ సంస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న మిల్లులకు మాత్రమే రైతుల నుంచి విత్తనాలు సేకరించి, వాటిని విత్తనశుద్ధి చేశాక తిరిగి విత్తన కంపనీలకు అందించే హక్కు ఉంటుంది. ఇలా చేయకుండా ఎలాంటి అనుమతుల్లేకుండా విత్తనశుద్ధి కోసం మిల్లులు నిర్వహిస్తే కొత్త విత్తన చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు విత్తనశుద్ధి మిల్లులను సీజ్చేసే అధికారం కూడా ప్రభుత్వం విత్తన ధ్రువీకరణ సంస్థకు కట్టబెట్టింది. 50కి పైగా విత్తన శుద్ధి కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో విత్తన పత్తితో పాటు వరి, కందులు, పెసలు, వేరుశెనగ, కూరగాయల విత్తనాలు తిరుగు ఒప్పందం ద్వారా రైతులతో సాగు చేయించి వారి నుంచి వాటిని తిరిగి కొనుగోలు చేసి విత్తనాలను శుద్ధిచేసి మధ్యవర్తులుగా ఉండి కంపెనీల విత్తన అవసరాలు తీర్చే విత్తన శుద్ధి మిల్లులు 50కి పైగా ఉన్నాయి. ఉన్న మిల్లులు మొత్తం చాలావరకు విత్తన అవగాహన ఒప్పందం ప్రకారం నెలకొల్పినవి మాత్రమే. వీటికి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఇప్పటివరకు లేదు. కొన్ని విత్తనశుద్ధి మిల్లులకు కనీసం స్థానికంగా ఉండే అధికారుల అనుమతి కూడా లేని దుస్థితి. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తిని రైతులు విరివిగా సాగుచేస్తున్న కారణంగా ఆరేళ్లకాలంలో 20కి పైగా విత్తనశుద్ధి మిల్లులు వెలిశాయి. అన్ని విత్తన అవగాహన ఒప్పందం ప్రకారం వెలిసినవే. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీటి లెక్క ఇక నుంచి పక్కా కానుంది. కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో పాటు ప్రభుత్వ కోడ్ కూడా ఉంటుంది. అదే కోడ్తో విత్తనశుద్ధి మిల్లుల నుంచి కంపెనీలకు కానీ రైతులకు కానీ.. విత్తనాలు చేరవేయాల్సి ఉంటుంది. గతంలో విత్తనశుద్ధి మిల్లులపై విత్తన ధ్రువీకరణ సంస్థకు కానీ వ్యవసాయ శాఖకు కానీ పెద్దగా పర్యవేక్షణ అధికారాలు లేకపోవడంతో మిల్లులో నకిలీ విత్తనాలు శుద్ధి చేస్తున్నారా? నాణ్యత గల విత్తనాలు శుద్ధి చేస్తున్నారా? అన్నది తెలియని పరిస్థితి. ఇక నుంచి వాటిని పర్యవేక్షించే అధికారాలు విత్తన ఽధ్రువీకరణ సంస్థ అధికారులకు కట్టబెట్టడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే వ్యవస్థ కొంత మెరగయ్యే అవకాశముంది. రూ.వెయ్యి కోట్ల విత్తన వ్యాపారం ఉమ్మడి జిల్లాలో రైతులకు తిరుగు ఒప్పందం ద్వారా ఫౌండేషన్ విత్తనాలు ఇచ్చి వాటిని తిరిగి కొనుగోలు చేసి విత్తనశుద్ధి మిల్లుల ద్వారా శుద్ధి చేసి కంపెనీలకు అందిస్తే వారు తమ సొంత విత్తన ఽధ్రువీకరణ ట్యాగ్పై సర్టిఫైడ్ విత్తనాలుగా రైతులకు అమ్ముతున్నారు. ఏటా ఉమ్మడి జిల్లాలో విత్తనశుద్ధి మిల్లుల ద్వారా రైతుల నుంచి కొనుగోలు, అమ్మకాల వ్యాపారం ఏటా రూ.800కోట్ల వరకు నడుస్తోంది. ఇంత వ్యాపారం జరుగుతున్నా విత్తన కంపెనీలు వ్యవసాయ చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు మొత్తం ఎగనామం పెడుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో ఏటా రూ.500 కోట్ల వరకు విత్తన వ్యాపారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అసలు ఉత్పత్తి అయిన చోట నుంచి అమ్మకం జరిగే దాకా లెక్కలను విత్తనశుద్ధి మిల్లుల నిర్వాహకులు, విత్తన కంపెనీలు ప్రభుత్వానికి పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. -
‘లక్కీ’ లాటరీ మోసాలపై స్పందించండి
● నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: లక్కీలాటరీ మోసాలపై ఎట్టకేలకు మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. కరీంనగర్ వేదికగా పలుకంపెనీలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలోని మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని లక్కీ లాటరీలు నడిపి ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 2022 అక్టోబరులో ‘లక్కీ లాటరీ మోసాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఉచిత బహుమతులు, నగదు బహుమతులు ఇస్తామంటూ పేదలకు ఆశచూపించి వారి నుంచి రూ.కోట్లు కాజేసి పరారయ్యారు. ఈ విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కరీంనగర్కు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాడు. దీంతో జరిగిన ఘటనపై ఈనెల 24వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కరీంనగర్ సీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. రాజన్న గోశాలలో మరో రెండు కోడెలు మృతివేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని గోశాలలో గురువారం అనారోగ్యంతో మరో రెండు కోడెలు మృతిచెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. అకాలవర్షాలు, అనారోగ్య పరిస్థితులతో గోశాలలో ఇప్పటి వరకు 28 కోడెలు మృతి చెందినట్లు వివరించారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం 12 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. వీటికి వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాణాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి కిందపడిన యువకుడుఓదెల(పెద్దపల్లి): సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలునుంచి కిందపడిన యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. గురువారం గోదావరిఖనికి చెందిన కంకణాల సంతోష్ రామగుండం వచ్చేందుకు కాజీపేట్లో దాణాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి డోర్ వద్ద కూర్చున్నాడు. పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. బ్లూకోల్ట్ పోలీసులు శంకర్, శివశంకర్ వెంటనే స్పందించి పట్టాల మధ్య ఉన్న సంతోష్ను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్లో సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
రాయికల్: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య(65)ను కన్న కొడుకే గొడ్డలితో దారుణంగా హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో తొట్ల ఎర్రయ్య కొడుకు మల్లేశ్తో కలిసి జీవిస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోగా.. మల్లేశ్ మానసిక పరిస్థితి సరిగా లేదు. కొడుకు ఆలన పాలన తండ్రి ఎర్రయ్య చూసుకుంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేని మల్లేశ్ బుధవారం అర్ధరాత్రి తన తండ్రిపై గొడ్డలితో తీవ్రంగా దాడిచేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి సందర్శించారు. సంఘ నాయకుడు నాగుల గంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
లారీలు ఢీ.. ఒకరు మృతి
హుజూరాబాద్: ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్న తుమ్మన్నపల్లి గ్రామం మీదుగా వెళ్తున్న వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరగగా.. ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన దాచేపల్లి కృష్ణకిషోర్(44) లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. కృష్ణకిశోర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టమ్మీద క్షతగాత్రుడికి బయటికి తీసి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతిచెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. లారీ క్లీనర్ మస్తాన్, మరో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు లారీలు బ్రిడ్జిపై ఢీకొనగా.. అటు వరంగల్, ఇటు కరీంనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సీఐ కరుణాకర్నడిగి తెలుసుకున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువరైతు..
మల్లాపూర్: వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలి ప్రవీణ్(30)కు భార్య రమ్య, ఇద్దరు కొడుకులున్నారు. గ్రామశివారులోని తన వ్యవసాయ భూమిని చదును చేసేందుకు పెద్ద కుమారుడు శ్రీహాన్తో కలిసి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శ్రీహాన్ను స్థానికులు మెట్పల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
రాష్ట్ర ఉత్తమ పంచాయతీగా చామనపల్లి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చామనపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్రస్ధాయిలో ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్బోర్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శి కోరుకంటి మహేందర్రావు ఉత్తమ పంచాయతీ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. రాష్ట్రస్ధాయిలో ఈ అవార్డు కోసం మూడు గ్రామపంచాయతీలు ఎంపిక చేయగా చామనపల్లి పంచాయతీకి మొదటి స్థానం లభించింది. సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, స్వచ్ఛత, పర్యావరణం, పచ్చదనం. సెగ్రేషన్షెడ్, కంపోస్టు ఎరువుల తయారీ, విటమిన్ గార్డెన్, ప్లాంటేషన్, కమ్యూనిటీ సోక్ పిట్స్ తదితర అంశాల్లో చామనపల్లి పంచాయతీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి మొదటిస్ధానంలో నిలిచింది. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో సీహెచ్.జగన్మోహన్రెడ్డి, కార్యదర్శి మహేందర్రావు, పంచాయతీ సిబ్బందిని మంత్రి సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, టీఎస్ పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి వెళ్తూ.. మృత్యు ఒడికి
సాక్షి పెద్దపల్లి: పెళ్లి ఇంటికి చేరుకోవాల్సిన దంపతులను లారీ రూపంలో వచ్చిన మత్యువు కబళించింది. జీవితంలోనే కాదు... మరణంలోనూ తమ బంధం విడదీయరానిదంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధురాలిని తప్పించబోయి, దంపతుల బైక్ను లారీ ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. ప్రమాదంలో దంపతులు మతిచెందగా, మూడేళ్లు కూతురు తీవ్రగాయల పాలైంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై శ్రావణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మండలానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న గుంటిపల్లి రాము(30) భార్య అనూష(27), కూతురు సహాస్ర(03)లు కలిసి హూజూరాబాద్లోని బంధువుల పెళ్లికి వెళ్లాడానికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో సుగ్లాంపల్లి వద్దకు రాగానే పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీకి వృద్ధురాలు అడ్డుగా రావడంతో లారీ డ్రైవర్ ఆమెను తప్పించబోయాడు. దీంతో లారీ డివైడర్ ఎక్కి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్య అనూష అక్కడిక్కడే మృతిచెందగా, భర్త సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.. కూతురుకు తీవ్రగాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐలు సుబ్బారెడ్డి, అనిల్లు అసుపత్రికి వచ్చి వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. బసంత్నగర్లో విషాదం పాలకుర్తి: మరో రెండు రోజుల్లో బావమరిది వివాహం. ఎంతో సంబరంగా బయలుదేరిన భార్యాభర్తలు మార్గమధ్యంలో మృత్యువు కబలించడంతో బసంత్నగర్లో విషాదం నెలకొంది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సహస్ర చావుబతుకులమధ్య వరంగల్ ఎంజీఎంలో పోరాడుతోంది. బసంత్నగర్లోని రాంనగర్కు చెందిన గుంటుపల్లి రాము స్థానికంగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి కుమారస్వామి చనిపోగా, తల్లి పద్మ కాయాకష్టం చేసి కొడుకు రాము, బిడ్డ రమ్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు, కోడలు చనిపోయిన వార్త విన్న తల్లి పద్మ రోదనలు అక్కడున్నవారిని కంటతడిపెట్టించాయి. ● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి ● వృద్ధురాలిని తప్పించబోయి దంపతులపైకి దూసుకెళ్లిన లారీ ● తీవ్ర గాయాలతో బయటపడిన మూడేళ్ల చిన్నారి -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని జగదాంబ వైన్స్ వద్ద బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అందె బాలఎల్లయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి భార్య అంజవ్వ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. బాల ఎల్లయ్య దినసరి కూలీగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. బుధవారం సాయంత్రం బయటకు వెళ్లిన బాల ఎల్లయ్య రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వైన్స్ వద్ద అచేతన స్థితిలో పడి ఉన్నాడని తెలుసుకున్న భార్య అంజవ్వ అంబులెన్స్లో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని అంజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యమల్యాల: అప్పుల బాధ భరించలేక ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. మల్యాల ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసముంటున్న నాగరాజు (39) రూ.4లక్షల అప్పు కావడంతో, తీర్చే మార్గం కానరాక, బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గురువారం రాత్రి మల్యాల గ్రామ శివారులోని వ్యవసాయబావిలో శవమై తేలాడు. అప్పుల వాళ్లు ఎవరూ బాధ పెట్టవద్దని సూసైడ్ నోట్ రాసి, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీమెట్పల్లి: పట్టణంలోని దుబ్బవాడలో బెజ్జారపు తార ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్ఐ కిరణ్కుమార్ కథనం ప్రకారం.. తార బుధవారం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. తిరిగి గురువారం రాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా..ఇంట్లో దాచి ఉంచిన తులం బంగారు పుస్తెల తాడు, మూడు గ్రాముల బంగారు విగ్రహాం చోరికి గురైనట్లు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఎస్సెస్సీ బోర్డు తప్పిదం.. విద్యార్థినికి అన్యాయం
రామగిరి(మంథని): ఎస్సెస్సీ బోర్డు అధికారుల తప్పిదంతో విద్యార్థినికి అన్యాయం జరిగింది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన సిరిపురం వర్షిత సెంటినరికాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో 567 మార్కులు సాధించింది. చదువులో మొదటి స్థానంలో ఉండే వర్షిత తనకు వచ్చిన మార్కుల పట్ల సంతృప్తి చెందక బోర్డు అధికారులకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. బోర్డు ఆదేశాలతో మరోసారి పరిశీలించగా అసలు తప్పిదం బయటపడింది. పార్ట్–బీ పేపర్ కౌంట్ చేయలేదని గుర్తించి ఇప్పుడు 20 మార్కులు కలిపి మొత్తం 587 మార్కులుగా బోర్డు నుంచి మార్కుల మెమో అందజేశారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కుల పెంపుతో వర్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. అధికారుల తప్పిదం వల్ల తమ బిడ్డకు తీవ్ర అన్యాయం జరిగిందని వెంటనే బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రీ వెరిఫికేషన్లో 20 మార్కులు పెంపు -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు..
మెట్పల్లి: పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీకొని బండలింగాపూర్కు చెందిన గుగ్గిళ్ల రవి మృతి చెందాడు. రవి ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి వచ్చి తిరిగి బండలింగాపూర్కు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో పట్టణ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. -
ఉద్యమనేతల మాటముచ్చట
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటాల నేపథ్యం వారిది. ఒకరు పాటతో చైతన్యం కలిగిస్తే.. మరొకరు బోధనలతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారు. బడుగు, బలహీనవర్గాల తరఫున నేనున్నానంటూ పిడికిలి ఎత్తిన నేత మరొకరు.. వీరందరూ గురువారం ఒక్కచోట చేరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కుమారుడు అభిలాశ్–శివాని వివాహం జరిగింది. ఈ పెళ్లికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, నెల్లికంటి సత్యం, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జనశక్తి అగ్రనేత అమర్, విమలక్క, మాజీ ఎమ్మెల్యే చలపతిరావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు పెళ్లి మండపంలో కలుసుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకుంటూ గడిపారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలను అరికడదాం
కరీంనగర్ టౌన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ వ్యర్థాలను అరికడదాం.. పర్యావరణం కాపాడుదాం అనే శక్తివంతమైన నినాదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్, గైనకాలజికల్ సొసై టీ సంయుక్తంగా వేడుకలు నిర్వహించా యి. ఐ ఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ ఎనమల్ల, కార్యదర్శి డాక్టర్ సిరిపురం నవీన్కుమార్, కోశాధికారి డాక్టర్ చల్లా విజయ్కుమార్, గైనకాలజీ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.ఎల్.స్రవంతి, కోశాధికారి డాక్టర్ స్వప్న నాయకత్వంలో హరితహారం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. సీనియర్ డాక్టర్లు బి.ఎన్.రావు, మోహన్రెడ్డి, కిషన్, అలీమ్, లక్ష్మణ్, అరుణ్ కాటారి పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నిషేధించాలికరీంనగర్: ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ను నిషేధించాలని డీఈవో శ్రీరామ్ మొండయ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కశ్మీర్గడ్డ రైతు బజార్ వద్ద పర్యావరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. వినియోగదారులకు ‘ప్లాస్టిక్ బ్యాగులను ఉపయోగించకండి– బట్ట సంచులను వాడండి’ అనే సందేశంతో బట్ట సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కలగవచ్చని హెచ్చరిస్తూ, మార్పు మీ నుండే మొదలవుతుందన్నారు. సీడీ రామస్వామి, మానసిక నిపుణులు కేఎస్.అనంతాచార్య ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీ నిర్వహించారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ జయపాల్రెడ్డి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మిలుకూరి శ్రీనివాస్, అశోక్రెడ్డి, అంజనేయులు, సైన్స్ ఫోరమ్ ప్రతినిధులు దామోదర్, అంజనేయులు పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ భగత్నగర్ ఫీడర్ పరిధిలోని భగత్నగర్, ఎర్రగుట్ట, వేంకటేశ్వర, విఘ్నేశ్వర, వాసుదేవ, న్యూశ్రీనగర్కాలనీల్లో, కట్టరాంపూర్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ గౌతమినగర్ ఫీడర్ పరిధిలోని మహాలక్ష్మినగర్, శ్రీనివాసనగర్, జయశంకర్కాలనీ, శాతవాహన ఫార్మా మెడికల్ కళాశాల, చర్చి, తిరుమల్నగర్, కట్టరాంపూర్, బ్లూబెల్స్ స్కూల్ ప్రాంతాలు, కొత్త డీటీఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీరాంనర్ రోడ్ నెంబర్ 5,6,7, శ్రీరాంనగర్, ఆదిత్యనగర్, సాలంపుర, కొత్తయాస్వాడ, విద్యానగర్, శాతవాహన యూనివర్సిటీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు పనులు, నూతన డీటీఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని డీమార్ట్, వరలక్ష్మి గార్డెన్, తులసీనగర్, హెచ్పీ గ్యాస్ గోదాం, రెడ్డి ఫంక్షన్హాల్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కొత్తపల్లిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు మధ్యస్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొత్తపల్లి(హెచ్), రాణిపూర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 15మంది గైర్హాజరు కరీంనగర్: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మూడో రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో 52 మంది విద్యార్థులకు 37 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరామ్ మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలను ప్రత్యేక తనిఖీ బృందంతో పాటు డీఈవో, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్లు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. -
మత్తుగా ప్రాణం తీస్తోంది!
గంజాయితో నష్టాలు ● గంజాయి మానవ శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ● తరచూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ● పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తుంటారు. తెలియని ఆతృత, భయం కలిగి ఉంటారు. ఇంద్రియాలు ఆధీనంలో ఉండవు. ● అతిగా తీసుకోవడంతో కళ్లు ఎర్రగా కనిపిస్తాయి. దృష్టి లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. ● హృదయ స్పందన రేటు, రక్త పోటు పెరుగుతుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. ● ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.● గంజాయితో జీవితాలు చిత్తు ● ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా దిగుమతి ● గ్రానైట్ కార్మికుల్లో చాలా మంది సేవనం ● పట్టుబడి జైలుకు వెళ్లిన వారిలో కార్మికులు, యువకులే ఎక్కువ‘నేను గంజాయిని.. మీ చుట్టూ తిరుగుతున్న మహమ్మారిని.. ఒకప్పుడు మహానగరాలు.. పట్టణ ప్రాంతాల్లోనే నా ఉనికి ఉండేది. ఇప్పుడు అన్నిగ్రామాలు చుట్టివస్తున్నాను. పిల్లలు, యువకులే కాదు.. అమ్మాయిలూ నాకు దాసోహం అవుతున్నారు. ‘మత్తు’లో ముంచి.. విలువైన జీవితాలను చిత్తు చేస్తున్నాను. నా ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? మిమ్మల్ని మైకంలో ముంచి.. విచక్షణ కోల్పోయేలా చేస్తాను. నాకు యాష్ ఆయిల్, చాక్లెట్ల రూపాన్ని తీసుకొచ్చారు. భిన్నరూపాలు, మార్గాలు ఉండటంతో పోలీసులూ ఏం చేయలేకపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మీ వద్దకు వస్తున్నా. మరి నన్ను ఆదరిస్తారా? తరమికొడతారా ? ఆలోచించుకోండి’.కరీంనగర్క్రైం: ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్కు గంజాయి దిగుమతి అవుతోంది. బిహార్, ఛత్తీస్గఢ్, భద్రాద్రి కొత్తగూడెం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అరకు, భీమునిపట్నం వద్ద గల ఎజెన్సీ ఏరియాల నుంచి కరీంనగర్కు గంజాయి రవాణా చేస్తున్న యువకులు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. గంజాయి సేవించడంతో పాటు జల్సాల ఖర్చుల కోసం దానిని వ్యాపారంగా మార్చుకొని చాలా మంది యువకులకు అలవాటు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్, క్రషర్లు, ఇతర ఫ్యాక్టరీల్లో పని చేసే గంజాయి అలవాటు ఉన్న కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లినప్పుడు దానిని వెంట తెచ్చుకోవడంతో దందా మొదలవుతుంది. ధర తక్కువ.. మత్తు ఎక్కువ కరీంనగర్లోని కొత్తపల్లి మండలం బావుపేట, ఎలగందల్ ప్రాంతాల్లో సుమారు 300 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 10 వేల వరకు బిహార్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తుంటారు. వీరంతా బావుపేట, ఎలగందల్తో పాటు కొత్తపల్లి మండలంలోనే ఎక్కువగా ఉంటారు. మద్యం తాగాలంటే రోజుకు కనీసం రూ.200 నుంచి రూ.500 వరకు కావాల్సి ఉంటుంది. కానీ, గంజాయి అయితే రోజుకు రూ.100 లోపే ఉండడంతో డబ్బులు మిగులుతాయని దీనికి అలవాటుపడుతున్నారు. కాగా, అమావాస్య రోజు గ్రానైట్ కార్మికులకు సెలవు కావడంతో ఆ రోజంతా గంజాయి సేవనం విచ్చలవిడిగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కూలీ పనికి వచ్చి గంజాయి దందా ఇతర రాష్ట్రాల నుంచి కరీంనగర్లోని గ్రానైట్, క్రషర్, ఇటుకబట్టీలకు వేల సంఖ్యలో కార్మికులు వస్తుంటారు. బిహార్ నుంచి కూలీ పని కోసం వచ్చిన ఓ వ్యక్తి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత గంజాయి సరఫరా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి అక్కడి నుంచి కరీంనగర్కు గంజాయి దిగుమతి చేయసాగాడు. ఇటీవల అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసుల్లో పట్టుబడినవారిలో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి దిగుమతి చేసుకుంటున్న కూలీలు ఇతర కూలీలను టార్గెట్ చేసుకొని సిగిరెట్ల రూపంలో రూ.100 నుంచి రూ.200 వరకు అమ్మకాలు చేస్తున్నారు. గంజాయి నియంత్రణకు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు చర్యలు చేపడుతున్నా దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రహదారులు గురువారం రక్తమోడాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. జగిత్యాల జిల్లా మల్యాల పరిధిలోని ముత్యంపేట వద్ద పెళ్లికారును డీసీఎం ఢీకొనడంతో చిన్నారి మృతి చెందగా.. పెళ్లి కుమారుడు సహా.. ఆరుగురు గాయపడ్డారు. ఇదే జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట శివారులో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి మృతి చెందగా.. కొడుకు గాయపడ్డాడు. మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి వద్ద లారీ ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. చిన్నారి గాయపడింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలోని తుమ్మనపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ఒక డ్రైవర్ మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. –వివరాలు 10లో.. రక్తమోడిన రహదారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు ఇతర రాష్ట్రాల నుంచి.. గంజాయి కేసుల్లో నిందితులుగా ఎక్కువ శాతం కార్మికులు, యువకులే ఉంటున్నారు. గ్రానైట్ కంపెనీల్లో ఎక్కువ శాతం బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుంటారు. వీరిలో కొందరు గంజాయి దిగుమతి చేసి ఇతర కార్మికులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. గంజాయి సేవించినా, సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. – నిరంజన్రెడ్డి, కరీంనగర్ రూరల్ సీఐ ‘బిహార్ నుంచి గంజాయి దిగుమతి చేసిన రాంపర్వేష్ సాయి(46)ని ఇటీవల కరీంనగర్ రూరల్సర్కిల్లోని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 1.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. ‘బిహార్ రాష్ట్రంలోని నూర్జాపూర్ నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న యువకుడిని ఇటీవల కరీంనగర్లోని అశోక్నగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.’కరీంనగర్ కమిషనరేట్లో గంజాయి కేసుల వివరాలు సంవత్సరం కేసులు అరెస్టయిన పట్టుబడిన వారు గంజాయి (కిలోలు) 2023 22 54 27.604 2024 39 86 128.179 2025(ఇప్పటివరకు) 09 17 5.386 -
పంచాయతీ కార్యదర్శులపై పారిశుధ్య భారం
● కొత్త డీఎస్ఆర్ యాప్పై నిరసన ● నమోదు కాని హాజరుకరీంనగర్రూరల్: పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఓవైపు పంచాయతీ పాలకవర్గాలు లేక మరోవైపు నిధులు విడుదలకాక అప్పులు చేసి కార్యదర్శులు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల పారిశుధ్య నిర్వహణపై జారీచేసిన గైడ్లైన్స్ భారంగా మారాయంటూ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతనెల 24 నుంచి ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం డైలీ శానిటేషన్ రిపోర్టు యాప్ అమలు చేస్తోంది. దీని ప్రకారం పంచాయతీ కార్యదర్శులు రోజూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఫొటోలు, వివరాలను యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త విధానంతో తమపై అదనపు పనిభారం పడుతుందంటూ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యదర్శులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. జిల్లాలో మొత్తం 318 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా కరీంనగర్ మండలంలో 14మంది కార్యదర్శులున్నారు. డీఎస్ఆర్ యాప్లో ఏముంది.? ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన డైలీ శానిటేషన్ రిపోర్టు యాప్ పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారింది. పంచాయతీ పరిధిలో ఎన్ని నివాస గృహాలు ఉన్నాయి, రోజు ఎన్ని గృహాలనుంచి చెత్తను సేకరిస్తున్నారో యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తడి చెత్త, పొడి చెత్త ఎన్ని కిలోల చొప్పున సేకరించారు, మొత్తం ఎన్ని ఇళ్లనుంచి నుంచి రోజులో ఎంత పరిమాణంలో సేకరించారో పూర్తి వివరాలు నమోదు చేయాలి. డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల వద్ద అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతోపాటు చెత్త సేకరణ బాధ్యతను అప్పగించడంతో రోజువారీ పనులు పడకేస్తాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యతో యాప్లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం కలుగుతుందని తెలుపుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సర్వే, రేషన్కార్డుల విచారణ, ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాల కారణంగా సుమారు 10 యాప్లలో వివరాలను అప్లోడ్ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొత్త డీఎస్ఆర్ యాప్తో అదనపు పనిభారం పడుతుందనే కారణంతో యాప్లో వివరాలను నమోదు చేయడం లేదని పలువురు కార్యదర్శులు తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్యదర్శులు కొత్త యాప్లో వివరాలను నమోదు చేయాలని పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు. -
చిన్నారుల ఆత్మీయ నేస్తం బాలభవన్
చిన్నారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణనిస్తూ.. బాలభవన్ ఆత్మీయ నేస్తంగా మారిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆడిటోరియంలో విద్యాశాఖ, బాలభవన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. 45 రోజుల శిక్షణ శిబిరంలో సంగీతం, జానపద నత్యం, శాసీ్త్రయ నృత్యం, మృదంగం, కర్రసాము, అబాకస్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, యోగా అంశాల్లో నిపుణులు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా విద్యా నియంత్రణ అధికారి అశోక్ రెడ్డి, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులా దేవి, బాలభవన్ శిక్షకులు సంగెం రాధకృష్ట, శ్రీధర్, కృష్టకుమార్, సూర్యశ్రీ, అనూప్, రాధిక, మల్లిక, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్కల్చరల్ నృత్యం చేస్తున్న చిన్నారులు -
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
మానకొండూర్: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజలను కోరారు. లలితాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పర్యావరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. గ్రామస్తులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. అధికారులు గ్రామాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవో కిరణ్, ఏపీవో శ్రీనివాస్, యునిసెఫ్ ప్రతినిధి కిషన్స్వామి పాల్గొన్నారు. కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చాలి కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలను పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు. గురువారం పద్మానగర్లోని మానేరు పరివాహక సమీపంలో నగరపాలక సంస్థ, మెప్మా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, సహాయ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్, డీఈలు శ్రీనివాస్రావు, లచ్చిరెడ్డి, పర్యావరణ ఇంజినీర్ స్వామి, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ మానస, సీవోలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
పరిషత్ సమరానికి సిద్ధం!
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్మ్యాప్లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్కు పంపారు. జోరుగా ఏర్పాట్లు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాపింగ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలుజిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు స్థానాలు కరీంనగర్ 170 15 జగిత్యాల 216 20 పెద్దపల్లి 140 13 రాజన్నసిరిసిల్ల 123 12 మొత్తం 649 60 -
మానవతా దృక్పథంతో సేవలందించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి హుజూరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, వార్డులు, ఓపీ విభాగం, నవజాత శిశువుల వార్డును పరిశీలించి శిశువుల సమస్యల గురించి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవం ప్రాధాన్యం వివరించారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో అన్ని రకాల సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెప్మా, ఐకేపీ సిబ్బంది ద్వారా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షల పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ క్యాంప్ ద్వారా సుమారు రూ.50 వేలు ఖరీదు చేసే 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు ఆస్పత్రి ఆవరణలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మొక్కలు నాటారు. సూపరింటెండెంట్ నారా యణరెడ్డి, ఆర్ఎంవో రమేశ్ పాలొన్నారు. ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తులు విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని టేకుర్తి, కొత్తపల్లి మండలంలోని ఎలగందల్, వీణవంక మండలంలోని గన్ముక్ల మోడల్ స్కూల్ గల్స్ హాస్టల్లోఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన మహిళా అభ్యర్థుల నుంచి ఈనెల 6వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి శ్రీరాంమొండయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రభుత్వ ఆమోదం పొందిన ఇనిస్టిట్యూషన్స్లో ఏఎన్ఎం శిక్షణ పొందిన కరీంనగర్ జిల్లావాసులు అర్హులన్నారు. ఆయా మండలాల వారికి తొలిప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గలవారు కరీంనగర్లోని జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో బయోడేటాను సమర్పించాలని ఆయన సూచించారు. పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ పనుల్లో భాగంగా గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ రామచంద్రాపూర్ ఫీడర్లో ఏవోఎస్ కాలనీ, సప్తగిరికాలనీ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొత్తపల్లి (హెచ్), రాణిపూర్ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ జి.రాజు వివరించారు. -
హత్యా.. ప్రమాదమా?
● అనుమానాస్పద స్థితిలో సింగరేణి కార్మికుడు మృతి గోదావరిఖని: అనుమానాస్పద స్థితి లో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. స్థానిక గంగానగర్లో ఉంటూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7లో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గాదెం సాగర్(30) మంగళవారం అర్ధరాత్రి స్థానిక బస్టాండ్ సమీప సమాదుల సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని కడుపు, తలపై గాయాలుండటంతో ఎవరైనా దాడి చేసి చంపారా? లేక కిందపడి గాయాలపాలై మృతి చెందాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నీతో మాట్లాడాల్సి ఉందని కొందరు ఫోన్చేసి అతిగా మద్యం తాగించి దాడిచేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ పంచాయితీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తనపై దాడిచేసిన సమయ ంలో కాపాడాలంటూ అతని మిత్రులకు కూడా మెసేజ్ లు చేసినట్లుగా పంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చేఅవకాశం ఉంది. సాగర్ బీఆర్ఎస్లో చురుకై న కా ర్యకర్తగా పనిచేశారు. సాగర్ మృతిని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై భూమేశ్ తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
ఇష్టారీతిన పునర్విభజన
నగరంలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన ఇష్టారీతిన చేపట్టారు. ఐఏఎస్లను సైతం తప్పుదోవ పట్టించారు. జాబితాలో పేర్కొన్న ఇండ్లకు, ఓటర్లకు ఎక్కడా పొంతన లేదు. ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా ఒకే డివిజన్ ఉండరాదని నిబంధన ఉన్నా... పట్టించుకోకుండా రోడ్డుకు రెండు వైపులా ఉన్న ప్రాంతాలను కలిపి ఒకే డివిజన్ చేశారు. ఆర్ అండ్ బీ రోడ్లను ఎక్కడా హద్దులుగా తీసుకోలేదు. అసలు నగరపాలకసంస్థ పరిధిలో చూపించిన ఓట్లు కూడా సరైనవి కావు. క్షేత్రస్థాయిలో కాకుండా...హైదరాబాద్లో కంప్యూటర్లో డివిజన్లను పునర్విభజించారు. వెంటనే మళ్లీ డీలిమిటేషన్ను చేపట్టాలి. – చల్ల హరిశంకర్, నగర అధ్యక్షుడు, బీఆర్ఎస్ -
లాభాలు బాగు
సకాలంలో సాగు..● పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెంపు ● అందరికీ కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడి సాయం ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మికరీంనగర్ అర్బన్: సకాలంలో సాగుతో అన్నదాతలు ఆదాయం గడించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) భాగ్యలక్ష్మి అన్నారు. నూతన సాంకేతిక విధానాలను పాటిస్తూ సాగుచేస్తే మంచి ఫలితాలుంటాయని వివరించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయంతో పర్యావరణానికి మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు. సీజన్కు ముందే పచ్చిరొట్ట ఎరువులు వాడటంతో భూసారం పెరుగుతుందని, అవసరమైన మేరకు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగ సమస్యలు.. ప్రభుత్వపర సాయంపై మంగళవారం ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహించగా అనూహ్య స్పందన లభించింది. రైతులు తమ సందేహాలను వివరించగా డీఏవో భాగ్యలక్ష్మి నివృత్తి చేశారు. -
పునర్విభజన గజిబిజి
కరీంనగర్ కార్పొరేషన్: ‘కొత్తగా ఏర్పడిన 5వ డివిజన్లో 5–7–1 నుంచి 5–7–ముగింపు వరకు ఇండ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే ఆ సీరీస్లో ఉన్న ఇంటి నంబర్లన్ని (5–7–1 నుంచి 5–7–1163 వరకు) 5వ డివిజన్లోనే ఉండాలి. కానీ.. మళ్లీ 23వ డివిజన్లో 5–7–501 నుంచి 5–7–600 వరకు ఇండ్లను చేర్చినట్లు పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డుకాలనీలోని 5–7– సీరిస్ మొత్తం 5వ డివిజన్లో ఉన్నట్లు పేర్కొని, మళ్లీ అదే సిరీస్లోని 5–7–501 నుంచి 5–7–600 వరకు ఇండ్లను 23వ డివిజన్లో చేర్చడంతో ఇందులో ఏది సరైందో అధికారులు వెల్లడించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.’ ‘61,62,63 డివిజన్లకు సంబంధించి పేర్కొన్న ఓట్లకు వాస్తవ ఓట్లకు తేడా ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 61వ డివిజన్లో జ్యోతినగర్, చైతన్యపురి, భాగ్యనగర్లలోని 1–10–837 నుంచి 2–10–1831 ఇండ్లకు చెందిన 5,320 ఓటున్నట్లుగా పేర్కొన్నారు. కానీ.. ఈ సీరిస్లో అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉన్నాయని, ఓట్లు కూడా ఇంతకన్నా అధికంగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. అలాగే 63వ డివిజన్లో 2–10–1832 నుంచి 2–10– 2142/ఏ ఇండ్లకు చెందిన 5,305 ఉన్నట్లు పేర్కొనగా, ఓట్లు అంతకన్నా తక్కువగా ఉన్నాయనే ప్రచారం ఉంది.’ నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన గందరగోళంగా మారింది. 1 నుంచి 66 డివిజన్ల వరకు ఏ డివిజన్లో ఏ ఇండ్లున్నాయి, ఓట్లు ఎన్ని ఉన్నాయనే వివరాలతో బుధవారం డ్రాఫ్ట్ నోటీసు జారీ చేశారు. కాని శాసీ్త్రయంగా కాకుండా, ఇష్టారీతిన,అవగాహన లేకుండా పునర్విభజనచేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాగా... రెవెన్యూ బ్లాక్లు, భౌగోళిక హద్దులు(రెగ్యులర్షేప్), ఈ ఏడాది జనవరి 6వ తేదీన పబ్లిష్ చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా డివిజన్లను పునర్విభజన చేసినట్లు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి అలా జరగలేదని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇంటి నంబర్లతో గందరగోళం నేటి నుంచి అభ్యంతరాలు స్వీకరణ -
చిట్ఫండ్ ఎదుట బాధితుల ఆందోళన
కరీంనగర్క్రైం: నగరంలోని ఒక ప్రైవేట్ చిట్ఫండ్ మేనేజర్ తాను వేసిన చిట్టీ ఎత్తుకొని ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు పెట్టించుకొని కిస్తీలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తను పనిచేసే చిట్ఫండ్ ఎదుట బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కె.రవికుమార్ ఒక చిట్ఫండ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న గసికంటి మహేందర్, ఇరుగురాల నర్సయ్య అనే ప్రభుత్వ ఉద్యోగులతో పూచీకత్తు పెట్టించుకొని తాను వేసిన చిట్టీని తీసుకున్నాడు. చిట్టీ ఎత్తుకొని కట్టాల్సిన డబ్బులు కట్టకపోవడంతో పూచీకత్తు పెట్టిన వారికి కంపెనీ నుంచి నోటీసులు వచ్చాయి. దీనితో అతను ప్రస్తుతం పనిచేసే కోర్టు సమీపంలోని ప్రైవేట్ చిట్ఫండ్ కార్యాలయం వద్ద బాధితులు నిరసన తెలుపుతూ యాసిడ్ బాటిల్ పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులను, రవికుమార్ను అక్కడి నుంచి పంపించివేశారు. -
బీఆర్ఎస్ తప్పులే కాంగ్రెస్ కొనసాగించింది
గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల పునర్విభజన కొనసాగించింది. కాంగ్రెస్, ఎంఐఎం మెజార్టీ స్థానాలు దక్కించుకొనేలా డీలిమిటేషన్ను అశాసీ్త్రయంగా చేపట్టారు. డివిజన్లలో పేర్కొన్న ఇండ్లు, అందులో ఓట్లకు సంబంధం లేకుండా పోయాయి. క్షేత్రస్థాయిలో మ్యాప్ పరంగా, నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన డీలిమిటేషన్ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. నిబంధనల ప్రకారం శాసీ్త్రయంగా డీలిమిటేషన్ను తిరిగి చేపట్టాలి. – గుగ్గిళ్లపు రమేశ్, మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత -
రేపటి నుంచి బడిబాట
● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై దృష్టి ● విద్యాశాఖ సమాయత్తంజిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 425 ప్రాథమికోన్నత పాఠశాలలు 75 ఉన్నత పాఠశాలలు 150 మొత్తం పాఠశాలలు 650 మొత్తం విద్యార్థులు 42,322కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ఈనెల 6నుంచి 19వ తేదీ వరకు ‘బడిబాట’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేసినట్లు డీఈవో శ్రీరామ్ మొండయ్య వెల్లడించారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఇది వరకే కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం సన్నద్ధం కలెక్టర్ నేతృత్వంలో డీఈవో, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జిల్లాస్థాయిలో కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై, కెపాసిటీ బిల్డింగ్ పేరిట జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం లోపు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవాసంస్థలు, ఎన్జీవోలు తదితర వర్గాలను సమన్వయపరిచి బడిబాటను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. మండలస్థాయిలో మండల పరిషత్ అధికారులు, ఎస్సైలు, ఇతర వర్గాల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏం చేయాలనే కార్యాచరణను ఎంఈవో రూపొందిస్తారు. గ్రామస్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యంతో బడిబాటలో గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. షెడ్యూల్ ఇదీ.. ● జూన్ 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ ● 07న ఉపాధ్యాయుల ఇంటింటి సందర్శన, బడీడు పిల్లలను గుర్తించడం ● 08,09,10న కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన. బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం. ప్రత్యేకావసరాల పిల్లలను భవితకేంద్రాల్లో చేర్పించడం ● 11న నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం. పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాల పంపిణీ, ఉచిత దుస్తుల అందజేత ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ ● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్స వం. తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యసనా సామర్థ్యాల గోడప్రతుల ప్రదర్శన. పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ. చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్ పోటీలు ● 17న సమీకృత విద్య, బాలికా విద్యా దినోత్సవం నిర్వహణ. బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ ● 18న తల్లిదండ్రులు, పోషకులు, గ్రామస్తులు, వార్డు సభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించడం ● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు విజయవంతం చేస్తాం కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నిశాఖలు, అన్నివర్గాల ప్రజల సమ న్వయంతో బడిబాటను విజ యవంతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రణాళికను పాటిస్తూ, ఎక్కువ మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పనిచేస్తాం. బడిబాటను విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో -
అధికారులకే స్వేచ్ఛ ఇచ్చాం
డివిజన్ల పునర్విభజన ఎక్కడా జోక్యం చేసుకోలేదు. అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి, ఇష్టారీతిన డీలిమిటేషన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాని మేం అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వలేదు. అధికారులపై ఎలాంటి ఒత్తిడి తేలేదు. ఒకవేళ ఏ డివిజన్లోనైనా పొరపాట్లు దొర్లితే, ఆధారాలతో అభ్యంతరాలు ఇస్తే అధికారులు వాటిని సరిచేస్తారు. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు -
లారీడ్రైవర్ నిర్లక్ష్యం.. యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ఐనవోలు(వరంగల్): మసకచీకటిలో.. నడిరోడ్డుపై ఇండికేటర్స్ వేయకుండా ఆగిఉన్న లారీని.. వెనుకనుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వరంగల్–ఖమ్మం రహదారి పంథిని గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంనుంచి వరంగల్ వైపు సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీని పంథిని గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నడిరోడ్డుపై ఆపిన డ్రైవర్ ఇండికేటర్స్ వేయకుండానే లారీ దిగి వెళ్లాడు. అదే సమయంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చింతకింది శివసాయి(29) తన పనుల నిమిత్తం సొంత కారులో ఖమ్మంనుంచి వరంగల్ వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పంథిని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ ఫోకస్కు దారి కనిపించకపోవడంతో ఇండికేటర్స్ వేయకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో శివసాయి తల, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. మృతుడికి ఇద్దరు అక్కలు, అమ్మ, నాన్న ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇండికేటర్లు వేయకుండానే నడిరోడ్డుపై నిలిపిన లారీ వెనుకనుంచి ఢీకొట్టిన కారు.. మృతుడిది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని -
ఆగ్రహించిన గ్రామస్తులు.. మట్టి లారీల అడ్డగింత
కాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్/ఓదెల మండలాల్లో చెరువు మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు బుధవారం అడ్డున్నారు. కాల్వశ్రీరాంపూర్లో ఓవర్లోడ్ లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయన్నారు. దుమ్ము, ధూళితో ఊపిరి ఆడటం లేదని తెలిపారు. దుమ్ము, ధూళి లేవకుండా నీటిని చల్లించాలని, లేకుంటే అడ్డుకుంటామని లారీ డ్రైవర్లను హెచ్చరించి వదిలిపెట్టారు. కాగా, పెగడపల్లిలో ఓ లారీ అతివేగంగా వెళ్లి టీవీఎస్ మోపైడ్ను ఢీకొట్టడంతో అదే గ్రామానికి చెందిన పత్తి రాజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు కాల్వశ్రీరాంపూర్లో లారీని ఆపి డ్రైవరుకు దేహశుద్ధి చేశారు. అదేవిధంగా ఓదెల మండలం పొత్కపల్లిలో మట్టి లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందుర్తి చెరువు నుంచి సుల్తానాబాద్కు మట్టి తరలిస్తున్న లారీలతో దుమ్ము, ధూళి లేచి ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆరోపించారు. దుమ్ము లేవకుండా రోడ్లపై ట్రాక్టర్తో నీళ్లు చల్లిస్తామని బాధ్యులు చెప్పడంతో ఆందోళనను విరమించారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్, గ్రామస్తులు ఆనందం, కిషన్షేట్, ఇరుకుల్ల శ్రీనివాస్, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు. పెగడపల్లిలో వ్యక్తిని ఢీకొన్న లారీ డ్రైవర్కు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ఓదెల మండలం పొత్కపల్లిలోనూ నిరసనలు -
కిడ్నాప్ కలకలం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన వివాదం ఒకరి కిడ్నాప్నకు దారితీసింది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. సంచలనం సృష్టించిన కిడ్నాప్ సంఘటన వివరాలు ఎస్సై గణేశ్, బాధితుల కథనం ప్రకారం. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన జంపెల్లి పర్శరాములు రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ కోనరావుపేట మండలానికి చెందిన వ్యక్తితో జరిగిన ఆర్థిక లావాదేవీలలో వివాదం ఏర్పడింది. ఈక్రమంలోనే ఏడాది క్రితం పర్శరాములు స్వగ్రామం గూడూరుకు వచ్చాడు. తిరిగి ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. అయితే పర్శరాములుకు తమకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఆ డబ్బులు ఇవ్వాలంటూ కొందరు ఏడాది క్రితం తమను బెదిరించారని పర్శరాములు తల్లి మల్లవ్వ తెలిపింది. గత సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి బెదిరించారని పేర్కొంది. ఈనేపథ్యంలోనే మంగళవారం ఉదయం తన భర్త మల్లయ్య కనిపించకుండా పోయాడని తెలిపింది. మల్లయ్య కోసం గాలించిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేశ్ సోమవారం అర్ధరాత్రి గూడూరుకు వచ్చిన వ్యక్తులపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో కిడ్నాపర్లు కోరుట్లలోని ఓ ఇంట్లో ఉన్నట్లు బుధవారం మధ్యాహ్నం కనిపెట్టారు. కిడ్నాపర్లు ఉన్న ఇంటిపై దాడి చేయగా.. ప్రధాన సూత్రధారులైన ఇద్దరు పరారైనట్లు సమాచారం. మల్లయ్యతోపాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మల్లయ్య క్షేమంగా ఉన్నాడని, వైద్యపరీక్షలు చేయిస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. కాగా కిడ్నాపర్ల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పర్శరాములు తల్లి మల్లవ్వ, భార్య గీత ఆరోపించారు. డబ్బు విషయంలో ఏర్పడిన వివాదం తమకు తెలియదన్నారు. పర్శరాములు తండ్రి మల్లయ్యను కిడ్నాప్ చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దుబాయ్లో ఏం జరిగింది.. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు. గల్ఫ్లో ఆర్థిక లావాదేవీల్లో వివాదం గూడూరులో కుటుంబ పెద్ద కిడ్నాప్ కోరుట్లలో పట్టివేత పోలీసుల అదుపులో ఇద్దరు కిడ్నాపర్లు ఆలస్యంగా వెలుగుచూసిన వ్యవహారం -
నాడు వైభవం.. నేడు కళావిహీనం
● కళ తప్పిన కాలనీలు.. శిథిలావస్థలో క్వార్టర్లు ● అస్తిత్వం కోల్పోయిన రామగుండం బీ థర్మల్ ● మూతపడి ఏడాది.. అనుబంధం విస్మరించని ప్రజలు రామగుండం: పట్టణంలోని బి–థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడి ఏడాది పూర్తయింది. దానితో అనుబంధం కలిగి ఉన్న ప్రజలు ఆ భావోద్వేగాల నుంచి బయటపడడం లేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే సుమారు 300 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 70 మందిని యాదాద్రికి బదిలీ అయ్యారు. మరో రెండురోజుల్లో ఇంకో 50 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఉద్యోగులు.. ప్లాంట్ కూల్చివేత వరకూ ఇక్కడే ఉంటారని సమాచారం. 50ఏళ్ల క్రితమే.. సుమారు 50 ఏళ్ల క్రితమే ఏ–పవర్ ప్లాంట్ ప్రారంభించి.. అనతికాలంలోనే మూతపడగా అప్పటికే కొంత జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతతో రామగుండం అస్తి త్వం పూర్తిగా కోల్పోయినట్లయ్యింది. దీనిప్రభావం ప్రత్యక్షంగా బ్యాంకు, కార్మికులు, కాంట్రాక్టర్లపై ప డగా, పరోక్షంగా స్కూళ్లు, చిరు వ్యాపారులపై పడి ంది. ఉద్యోగులు తమ క్వార్టర్లను ఖాళీ చేసి వెళ్లిపోతుండడంతో అప్పటికే శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు, అపరిశుభ్రంగా, చిత్తడిగా తయారయ్యాయి. ● విద్యుత్ ప్లాంట్లో ఇరవై ఏళ్లపాటు షట్డౌన్ తదితర ఓవర్హాలింగ్ పనులు చేసేవాడిని. సాంకేతిక పరిజ్ఞానం, సమస్యల సాధన పరిష్కారంపై పట్టు పెరగడంతో నామినేషన్ పద్ధతిపై చిన్నకాంట్రాక్టు పనులు తీసుకున్నా. ఇలా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడిని. ఇప్పుడు ప్లాంట్ మూతపడడంతో భరోసా కోల్పోయినట్లయ్యిందని సిరికొండ కోటి ఆవేదన చెందాడు. ● నేను ఇక్కడే పుట్టి ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే పదవీ విరమణ చేశా. ఐదు దశాబ్దాలపాటు పనిచేసే వారు, రిటైర్డ్ అయినవారితో బంధుత్వం ఏర్పడింది. ఆలయాలు, ఇళ్లలో జరిగే వేడుకలు, పర్వదినాల సందర్భంగా అందరం కలుసుకోవడం బాగుండేది. యాద్రాద్రికి బదిలీ అయినవారు కొందరు, ఉపాధి కోల్పోయి మరోచోటకు వెళ్లేవారు మరికొందరు.. బరువైన గుండెలతో వెళ్తుండడం చాలాబాధగా ఉందని రిటైర్డ్ ఉద్యోగి ఇరికిళ్ల రాజనర్సయ్య ఆవేదన చెందాడు. -
‘రియల్’ వ్యాపారంలో నష్టాలు
● వ్యాపారి ఆత్మహత్య జూలపల్లి(పెద్దపల్లి): రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా సాగక నష్టాలు చవిచూసిన తెలుకుంట చెందిన రియల్టర్ కోడూరి సతీశ్కుమార్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. బతుకు దెరువు నిమిత్తం కరీంనగర్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా నష్టాలు రావడంతో చొప్పదండిలో ఫాస్ట్పుడ్ సెంటర్ ప్రారంభించాడు. అదికూడా కలిసి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై సనత్ కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన కాట్నపల్లి శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూకట్ల రమేశ్(40) పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై ఎలిగేడు మండలం శిపల్లికి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాట్నపల్లి – శివపల్లి మధ్య అదుపు తప్పి బోల్తాపడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిచారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి దుర్మరణంపెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట గ్రామంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని మ్యాన రాజవ్వ(75) మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన మ్యాన రాజవ్వ రెండ్రోజుల క్రితం తన తమ్ముడు అడెపు భూమయ్య ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మల్యాల వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చి బస్సు కోసం వేచి చూస్తోంది. కరీంనగర్ నుంచి పెగడపల్లి వెళ్లే బస్సు వచ్చి ఆగింది. రాజవ్వ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గమనించని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో రాజవ్వ బస్సు టైర్ల కింద పడి చనిపోయింది. బస్సు డ్రైవర్ కనుకయ్య నిర్లక్ష్యంతో తన తల్లి మృతి చెందిందని రాజవ్వ కొడుకు గంగాధర్ ఫిర్యాదుతో ఎస్హెచ్వో రవీందర్ కేసు నమోదు చేశారు. డాక్టర్పై సస్పెన్షన్ వేటు మంథని: పట్టణంలోని సామాజిక ఆస్పత్రిలో మత్తుమందు ప్రత్యేక వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన్రావు.. ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం పేషెంట్ వద్ద లంచం డిమాండ్ చేసినందుకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రచ్చపల్లి గ్రామానికి చెందిన పేషంట్ కొడాలి భాగ్య నుంచి ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం డాక్టర్ రూ.5వేలు లంచం డిమాండ్ చేస్తూ దొరికిపోయారని, ఆ డాక్టర్పై ఇప్పటికే పలు ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చాయ్తో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుక
● రోజంతా అమృతతుల్యా ఉచితంగా చాయ్ అందజేత మల్యాల: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, విరాట్ కోహ్లీ వీరాభిమాని ఉచితంగా చాయ్ పంపిణీ చేసి సంబురాలు చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన జంగం రఘు మల్యాల అడ్డరోడ్డుపై అమృతతుల్య చాయ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 400 చాయ్లు ఉచితంగా అందజేసి, సంబురాలు చేసుకున్నాడు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వారి వెంట ఉన్న బీఆర్ఎస్ నాయకులకు ఉచితచాయ్ని ఆస్వాదించారు. నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలివేములవాడ: వేములవాడ మూలవాగు బ్రిడ్రి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్ల విస్తరణలో 243 మంది నిర్వాసితులతో అధికారులు సమావేశం నిర్వహించిన తర్వాతనే పనులు చేపట్టాలనని అమర్ కోరారు. వేములవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అమర్ మాట్లాడారు. హైకోర్టు స్టే ఉన్నా అధికారులు, వ్యాపారులను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూసేకరణలో భాగంగా వాల్యువేషన్ సక్రమంగా చేయడం లేదన్నారు. గతంలోనే రెండు బైపాస్రోడ్డులకు స్థానిక వ్యాపారులు తమ భూములను ఇచ్చారన్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి రోడ్డు విస్తరణ అవసరం లేదని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ నిర్వాసితులతో సమావేశం నిర్వహించాలని కోరారు. ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలుకరీంనగర్క్రైం: సైదాపూర్ శివారులో గత నెల 8న వాహన తనిఖీ నిర్వహిస్తుండగా జరిగిన ఘటనపై ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నట్లు క రీంనగర్ సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 8న సైదాపూర్ పోలీస్ స్టేషన్ ప్రొబెషనరీ ఎస్సై అగస్త్య భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాశ్, అ జయ్ రోజువారీ విధుల్లో భాగంగా సైదాపూర్ శివా రులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే స మయంలో హుస్నాబాద్కు చెందిన బత్తుల మహేందర్ అనే వాహనదారుడిని ఆపి తనిఖీ చేయగా.. మ హేందర్, పోలీసులకు గొడవ జరిగి ఈ ఘటనపై కే సు నమోదు చేశారు. ఈ విషయంపై వాహనదా రుడు మహేందర్ సీపీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఆరో జు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఆకాశ్, అజయ్పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారికి చార్జ్ మెమో జారీ చేసి పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పిస్తూ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ట్రైనీ ఎస్సై అగస్త్య భార్గవ్పై క్రమశిక్షణా చర్యల నిమిత్తం మల్టీ జోన్ ఐజీకి నివేదిక పంపించినట్లు సీపీ తెలిపారు. -
మంత్రిగా బండికి ఏడాది
● జూన్ 9న ప్రమాణస్వీకారం చేసిన సంజయ్ ● సంబరాలకు సిద్ధమవుతున్న కమలనాథులు ● ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసిన ఎంపీ ఆఫీస్సాక్షిప్రతినిధి,కరీంనగర్: కేంద్ర సహాయమంత్రిగా బండి సంజయ్ ఏడాది పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదికాలంలో బండి సంజయ్ చేసిన పనులు, చూపిన చొరవను వివరిస్తూ పార్టీ జిల్లా నాయకులు ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశా రు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించారు. జూన్ 9న ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్లో కేంద్ర సహా యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఏడాది పూర్తికానుండడంతో అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి జాతీయ ఉపాధిహామీ పథకం కింద ప్రతీ మండలానికి రూ.2కోట్లు ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లు నిర్మించారు. సగటున ఒక్కో గ్రామానికి రూ.5లక్షలు అంతర్గత రోడ్లకు వెచ్చించారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.33కోట్లకుపైగా ఖర్చు చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు రూ.2వేల కోట్లతో మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ ఇటీవల కరీంనగర్ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటితోపాటు కరీంనగర్, జమ్మికుంట ఆర్వోబీ నిర్మాణంలో జాప్యమవుతున్న విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశమై వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి జమ్మికుంట ఆర్వోబీ పనులు పూర్తికాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కరీంనగర్–తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి.. పనుల వేగవంతం చేయించడంలో సఫలీకృతులయ్యారు. వారానికోసారి నడిచే కరీంనగర్–తిరుపతి రైలును వారానికి రెండుసార్లు నడిచేలా కృషి చేశారు. అదే రైలును ఇకపై వారానికి 4 సార్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. మరిన్ని పనులివే.. ● సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బండి సంజయ్ వినతికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ● సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల మంజూరులో చొరవచూపారు. ● వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను టూరిజం సర్క్యూట్గా మార్చాలన్న ప్రతిపాదలపై త్వరలోనే కేంద్రం ప్రకటన చేయనుంది. ● శాతవాహన వర్సిటీ పరిధిలో లా కళాశాల మంజూరుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి మంజూరు చేయించారు. ● అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉంటున్న కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు బండి సంజయ్ కృషి మరువలేనిది. ● కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రూ.5కోట్ల సీఎస్సార్ నిధులను రాబట్టారు. వాటితో వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు. ● ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని త్వరలోనే విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. ● ఈ ఏడాది మార్చిలో థాయిలాండ్ లో సైబర్ కేఫ్ లో చిక్కుకున్న 540 మంది భారతీయులను సాక్షి కథనాలతో స్పందించిన బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని కాపాడారు. రెండు ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తరలించారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
హుజూరాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులో కరీంనగర్ – వరంగల్ రహదారిపై మంగళవారం ఆయిల్ ట్యాంకర్ ట్రాలీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ట్రాలీ బోల్తాపడడంతో రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురగా పడిపోయాయి. కాగా కొన్ని సిలిండర్ల నుంచి గ్యాస్ లీకై ంది. అయినా అవి పేలకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కాగా ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు ప్రత్యేక బస్సుహుజూరాబాద్: అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈ నెల 9 నుంచి ఉంటుదని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ మంగళవారం తెలిపారు. ఈనెల 9న మధ్యాహ్నం 2గంటలకు స్థానిక బస్స్టేషన్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం, మరుసటి రోజు 10న రాత్రి వరకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. 11న అరుణాచల గిరి ప్రదక్షిణ అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు అరుణాచలంలో బయలుదేరి 12న హుజూరాబాద్కి బస్ చేరుకుంటుందని డీఎం రవీంద్రనాథ్ వివరించారు. సూపర్ లగ్జరీ బస్ చార్జి పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,800 ఉంటుందని, అడ్వాన్స్ బుకింగ్ కోసం 99592 25924, 97048 33971, 92471 59535, 94414 04841 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కాలగర్భంలో రామగుండం బీ–థర్మల్
రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యంగల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీఎస్–బీ) కాలగర్భంలో కలిసి పోయి బుధవరాం నాటికి ఏడాది పూర్తవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలివిద్యుత్ కేంద్రంగా పేరు గాంచిన ఆర్టీపీఎస్.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు పంచింది. ఈక్రమంలోనే విద్యుత్ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది. స్థానికంగా బొగ్గు, నీరు, రవాణా వ్యవస్థకు అనువైన పరిస్థితులు ఉండడంతో రామగుండం ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయంగా మారింది. దీంతో దేశంలోనే ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీ పడుతూ, అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేసిన ఘనత బి–థర్మల్ కేంద్రానికే దక్కింది. రూ.14.8 కోట్ల వ్యయంతో 1965 జూలై 19న విద్యుత్ కేంద్రం స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 10, 2007 నుంచి నిరాటకంగా 159 రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దానిని తిరగరాస్తూ 20 ఫిబ్రవరి 2017 తర్వాత ఒకరోజు ఎక్కువగా 160 రోజులు సాధించి రికార్డులు బద్ధలు కొట్టింది. 159 రోజుల్లో 92.64 పీఎల్ఎఫ్తో 221.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సైతం ఆధునిక విద్యుత్ కేంద్రాలతో పోటీపడుతూ ఉత్పత్తి, పీఎల్ఎఫ్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించింది. విద్యుత్ కేంద్రం మూతపడి నేటితో ఏడాది