Karimnagar District Latest News
-
మ్యూల్ అకౌంట్లతో రూ.138 కోట్ల స్కాం
కరీంనగర్ క్రైం: అమాయకులకు డబ్బు ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాల ద్వారా విదేశాల్లోని సైబర్ నేరగాళతో లావాదేవీలు జరిపారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు మ్యూల్ అకౌంట్లకు మళ్లించారు. కరీంనగర్లోని కిసాన్నగర్లో ఉన్న రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్బీఎల్) కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆ కుంభంకోణం జరగగా.. కరంట్ అకౌంట్లు పొంది సైబర్నేరాల్లో పాల్పంచుకున్న 13మందిని కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం ఈ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన బండారి సాయిరాం(30) అమాయకులతో పాటు డబ్బు అవసరం ఉన్నవారితో నగరంలోని ఆర్బీఎల్ బ్యాంకులో కరంటు ఖాతాలు తీయించాడు. ఇతనికి బ్యాంకు మేనేజర్ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్(52), నగరానికి చెందిన చెందిన క్యాషియ ర్ ఆయేషా బేగం(30) సహకరించారు. బుగ్గారం మండలం గోపాల్పూర్కు చెందిన అనుమండ్ల రంజిత్(36), పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన అలిగెటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన బోగ రాకేశ్(35), రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన బండి ప్రణయ్(25), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన విభూది రాంకుమార్(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్కు చెందిన నాతర్ల శ్రీనివాస్(39), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేశ్(27), వరంగల్కు చెందిన కర్రె రాజు(35)లకు సంబంధించిన మ్యూల్ అకౌంట్ల ద్వారా రూ.138 కోట్ల లావాదేవీలు విదేశాల్లోని సైబర్ నేరగాళ్లతో జరిపినట్లు ఆపరేషన్ క్రాక్డౌన్ ద్వారా పోలీసులు గుర్తించారు. బండారి సాయిరాం కీలకంగా వ్యవహరిస్తూ.. సదరు ఖాతాదారులకు కమీషన్లు అందించినట్లు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో మొత్తం 24మంది ఉన్నట్లు గుర్తించి, పై 13మందిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు తిరుమల్, సృజన్రెడ్డి, రాంచందర్రావు, సరిలాల్ను సీపీ అభినందించారు. -
గురి తప్పని బాణం
కరీంనగర్స్పోర్ట్స్/ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత శుక్రవారం బ్యాంకాక్లో జరిగిన ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీ స్టేజ్–1లో బంగారు, రజత పతకాలు సాధించింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో గోల్డ్ మెడల్, మహిళల టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ అందుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో రజత్ చౌహాన్, తానిపర్తి చికిత జోడీ 158–156 పాయింట్ల తేడాతో మలేషియాపై విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. కాంపౌండ్ మహిళల టీం విభాగంలో తానిపర్తి చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన జట్టు ఫైనల్లో కజకిస్థాన్పై 227–229 తేడాతో తలపడి రజత పతకాన్ని సాధించారు. -
ఐస్క్రీం వాహనాలకు నో ఎంట్రీ
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం కోరుట్లరూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పెల్లి గ్రామానికి చెందిన కొండ్ర రాజేశ్ (36) 20 రోజుల క్రితం దుబాయ్లో మృతిచెందగా శుక్రవారం ఆయన మృతదేహాన్ని స్వ గ్రామానికి తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజేశ్ పదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. ఇక్కడే సోరియాసిస్ వ్యాధి సోకింది. వ్యాధి నివారణ కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు 3 నెలల క్రితం మళ్లీ దుబాయ్ వెళ్లాడు. అక్కడ వ్యాధి మరింత వ్యాప్తి చెంది శరీరంలోని అన్ని భాగాలకు విస్తరించగా దుబాయ్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై 20 రోజుల క్రితం మృతిచెందాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కొండగట్టుకు శునకం పాదయాత్ర
వారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన హనుమాన్ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు బయలుదేరారు. దారిలో ఓ శునకం ఎదురుపడగా దానికి ఓ బిస్కట్ ఇచ్చారు. దీంతో ఆ శునకం దీక్షాపరులతో పాటు కొండగట్టు వరకు పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేస్తున్న శునకానికి కాళ్లనొప్పులు రావడంతో సాక్స్లు సైతం తొడిగారు. ఐదురోజులుగా పాదయాత్ర చేస్తుందని, వెళ్లగొట్టినా పోవడం లేదని, సుమారు 130 కి.మీ దూరం తమతో నడిచి వచ్చిందని దీక్షాపరులు తెలిపారు. శుక్రవారం కొండగట్టుకు చేరుకున్నామని పేర్కొన్నారు. – జగిత్యాల -
కాశీకి వెళ్తూ... అనంత లోకాలకు..
మానకొండూర్: తన తల్లి అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు మానకొండూర్కు చెందిన రామోజు శ్రీనివాస్(55) కుటుంబ సభ్యులతో కలిసి రైలులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. శ్రీనివాస్ కుల వృతి(గోల్డ్ వర్క్) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన తల్లి మణెమ్మె 3 నెలల క్రితం చనిపోగా.. ఆమె అస్థికలు కాశీలోని గంగా నదిలో కలిపేందుకు గురువారం ఉదయం రైలులో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బయలు దేరారు. మార్గమధ్యలో మహారాష్ట్ర సేవాగ్రామ్ వద్ద శ్రీనివాస్ తాగునీరు కోసం గురువారం రాత్రి రైలు దిగాడు. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు ఢీకొనడంతో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ ప్రమాదం జరగడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అంజన్న మాలధారుల ఫోన్లు చోరీఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లోని పెద్దమ్మ ఆలయంలో నిద్రిస్తున్న హనుమాన్ మాలధారుల 9 ఫోన్లు, రూ.9వేల నగదు గురువారం రాత్రి చోరీకి గురయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. గ్రామంలోని పెద్ద మ్మ ఆలయంలో 12 మంది హనుమాన్ మాలధారులు నిద్రిస్తుండగా 9 మంది ఫోన్లు పోయినట్లు తెలిసింది. సెల్ఫోన్లు దొంగలించిన వ్యక్తి 12 మంది స్వాములలో ఒకరికి ఫోన్చేస్తూ బెజ్జంకిలో ఫలానా చోట మీ సెల్ఫోన్లు ఉన్నా యి తీసుకెళ్లండని ఫోన్చేయగా వెళ్లి 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మిగతా 5 ఫోన్లు అడిగితే రూ.20వేలు తన దగ్గర ఉన్న 5 ఫోన్లలో ఒకదానికి పంపించాలని దాని పిన్నంబర్ కూడా చెప్పాలని కండీషన్ పెడుతున్నాడు. ఈ విషయంపై ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ను వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేశారని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారా యణపూర్లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారి లడ్డూకు రూ.70వేల వేళం పాటపాడా రు. ఈ లడ్డూను గ్రామానికి చెందిన వంగల లింగారెడ్డి–శోభ దంపతులు దక్కించుకున్నారు. బచ్చు మోహన్ రూ.40వేలతో స్వామి వారి వ్రతానికి మెట్లు చేయించారు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణస్వామి రూ.50వేలతో అన్నదానం చేశారు. సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్ మోతె మధుసూదన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, వైస్చైర్మన్ గుండాడి రామ్రెడ్డి, డీటీ ఎలుసాని ప్రవీణ్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి ఎంపీ కృషి
రాయికల్(జగిత్యాల): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో సీతారాముల క ల్యాణ వేదికకు ఎంపీ నిధులు మంజూరు చే యగా నిర్మించిన కల్యాణ వేదికను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు ఆకుల మహేశ్, పట్టణ అధ్యక్షుడు కు ర్మ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు కోల శంకర్, నాయకులు బోయిని నరేందర్, ఎనుగంటి రాజు, ఆర్మూర్ నరేందర్, కనికారపు రాజేశ్, గంగారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
బాబోయ్.. ఇదేం పక్షి?
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణశివారులోని కేసీ క్యాంపు వద్ద ఉన్న ఓ తోటలో శుక్రవారం మనిషిని పోలిన తల ఉన్నట్లు ఉండే వింత పక్షి కనబడింది. కాకతీయ కెనాల్ బ్రిడ్జి పక్కన ఉన్న తోటలో ఈ పక్షిని అడే ఉన్న కోతులు తరమడంతో ముళ్లపొదల్లో చిక్కుకుంది. తీవ్రంగా గాయపడగా.. గమనించిన భాస్కర్ అనే వ్యక్తి, నలుబాల వేణుగోపాల్ రక్షించి, పశు వైద్యాధికారి రవీందర్రెడ్డి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అనంతరం కరీంనగర్లోని డీర్ పార్కుకు తరలించారు. – హుజూరాబాద్ -
మట్టికి మేలు తలపెట్టవోయ్
● ప్రతి రెవెన్యూ పరిధిలో 10 శాంపిళ్ల సేకరణ ● భూసార పరీక్షలతో భారీగా తగ్గనున్న పెట్టుబడి ● రైతన్నా మారాలి.. నూతన ఒరవడి కావాలికరీంనగర్ అర్బన్: ‘పుండొక చోటైతే మందొక చోట రాసినట్లు’ కాకుండా భూ‘సార’మెరిగి సాగడమే ఉత్తమం. భూసార పరీక్షలతో సాగు నేలలో ఏ ఏ లోపముందో స్పష్టమవనుండగా తదనుగుణ ఎరువులు వేసుకుంటే సరి. పెట్టుబడి గణనీయంగా తగ్గనుండగా దిగుబడి పెరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకుంటే సరి. జిల్లావ్యాప్తంగా ప్రతీ రెవెన్యూ గ్రామంలో 10 మట్టి నమూనాలను తీయనుండగా మే 10లోపు ఫలితాలను రైతులకు అందజేయనున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుండగా ప్రభుత్వం తదనుగుణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించింది. జిల్లాలో 3.34లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి. యాప్లో వివరాల నమోదు భూసార ప్రాధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రతి రైతు భూమికి సంబంధించి భూసారాన్ని పరీక్షించి ఫలితం వెల్లడించాలని యోచిస్తున్నాయి. ఒక్కో రెవెన్యూ గ్రామంలో పది నమూనాలు సేకరించాలని లక్ష్యం నిర్దేశించినా కనీసం ఐదు నమూనాలను అధికారులు తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సేకరించి న నమూనాలు, సర్వే నంబర్లు, గ్రామం, రైతు పేరు, పంటలతో ప్రత్యేకంగా రూపొందించిన యా ప్లో వివరాలు నమోదు చేయాలి. ఏ జిల్లాకు చెందిన మట్టి నమూనాలను అదే జిల్లాలోని ప్రయోగశాలల్లో పరీక్షించాలని సూచించింది. సేకరించిన మట్టి నమూనాలను ఏప్రిల్ 15 లోగా పరీక్షించి వా టి ఫలితాలను అంతర్జాలంలో నిక్షిప్తపరచాలి. మే 4 నుంచి 10లోగా భూసార పరీక్షల కార్డులు రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పంపిణీకి కార్డులు సిద్ధం ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పలు మండలాలను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం మండలంలో 6వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించారు. పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ మండలంలో 4వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో 4వేలు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి మండలంలో 6వేల మట్టి నమూనాలు సేకరించి పరీక్షించగా ఫలితాలు వచ్చాయి. కరీంనగర్ భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించగా ఫలితాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఏప్రిల్ 2న సదరు భూసార కార్డులను అందజేయనున్నారు. సూక్ష్మ ధాతువులే కీలకం పంట విత్తిన నుంచి అవి మొలకెత్తడం, పైరు ఎదుగుదల, కాత, నాణ్యతతో కూడిన దిగుబడి, సూక్ష్మ ధాతువులపైనే ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్షలో ఇవి తేలనున్నాయి. జింకు లోపిస్తే మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. మెగ్నీషియం తక్కువుంటే పత్రహరితం తయారవదు. అలాగే ఐరన్ లోపముంటే ఆకులు త్వరితగతిన ఎండిపోతుంటాయి. బోరాన్ లేకపోతే పంట ఏపుగా ఎదిగినా కాయలు పరిపక్వత లేక నిస్సారంగా ఉంటాయి. అపరాలు పండించాలనుకునే వారికి భూమిలో సల్ఫర్ అవసరం. సల్ఫర్ ఉంటేనే నూనె తయారయ్యే పరిస్థితి ఉంటుంది. 16 రకాల పోషకాలు అవసరం మొక్క ఎదగడానికి 16రకాల పోషకాలు అవసరం. జింకు, బోరాన్, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, నైట్రోజన్, కాల్షియం, కాపర్, సల్ఫర్, మెగ్నీషియం, మాలిబ్యూడినం, క్లోరిన్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అవసరం. సేంద్రియ విధానం నుంచి రసాయనిక ఎరువుల వినియోగం పెంచుతూ వస్తుండటంతో గత 15ఏళ్లలో గణనీయమైన ప్రతికూల మార్పులు సంభవించాయి. రైతులు అధిక దిగుబడులు ఆఽశించి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల నేల కాలుష్యం, నీటి కాలుష్యాలు పెరుగుతున్నాయి. కొంత కాలానికి నేల తన సహజ స్వభావాన్ని కోల్పొనుంది. తర్వాత ఆ నేలలు ఆమ్లయుతంగా లేదంటే క్షారయుతంగా తయారవుతాయి. ఎన్ని ఎరువులు వేసినా ఎంత పెట్టుబడి పెట్టిన పంటలు సరిగ్గా పండవు. ప్రభుత్వం నిర్వహించే భూసార పరీక్షలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మూస ధోరణిలో పంటలను సాగు చేయకుండా భూమిలో ఏ ఏ లోపాలున్నాయో తెలుసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఉత్తమం. దీంతో పెట్టుబడి తగ్గనుండగా నాణ్యమైన పంట చేతికొస్తుంది. – రణధీర్రెడ్డి, ఏడీఏ -
వలకు చిక్కిన డెవిల్ ఫిష్
శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం వాగులో మత్స్యకారుని వలలో ఓ రాకాసి చేప చిక్కింది. కేశవపట్నం వాగులో శుక్రవారం మత్స్యకారులు చేపలు పట్టారు. తాడవేని సమ్మయ్య వాగులో వల వేయగా వింత ఆకారంలో ఓ చేప చేపడింది. వలలోంచి బయటకు తీసి ఇది డెవిల్ ఫిష్గా గుర్తించారు. జలాశయాల్లోని చేపలను ఆది ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. సిటీలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం సాయంత్రం4.30 నుంచి 5.30 గంటల వరకు కట్టరాంపూర్ మెయిన్ రోడ్, తిరుమలనగర్, రెడ్డికాలనీ, శ్రేయం అపార్ట్మెంట్, మైనారిటీ స్కూల్, గిద్దె పెరుమాండ్ల ఆలయం, హనుమాన్నగర్, తిరుమల్నగర్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ, శ్రీనివాస్నగర్ కాలనీ, గణేశ్నగర్ బైపాస్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, గణేశ్నగర్, అల్కాపురి, ఐటీఐ కళాశాల, ఐటీహబ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. 30న జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల ప్రకారం ఈనెల 30న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ తెలి పారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ప్రోగ్రెస్ కార్డ్, రెండు ఫొటోలతో ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. -
వాళ్లు మనోళ్లే.. నో ట్యాక్స్!
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ట్యాక్స్లకు వాళ్లు అతీతులు. రూ.లక్షల్లో బకాయి పడ్డా వాళ్లపై కనీస చర్య ఉండదు. కొంతమంది ప్రభుత్వ ఉత్తర్వుల పేరిట, మరికొందరు తమకున్న పలుకుబడితో ఏళ్లుగా ట్యాక్స్ ఎగవేస్తూ వస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులో డిమాండ్కు తగిన వసూళ్లు రాబట్టలేక నోటీసులు ఇచ్చి అధికారులు మమ అనిపిస్తున్నా రు. షరామామూలుగానే మరో ఆర్థిక సంవత్సరాన్ని మొండి బకాయి వసూళ్లు లేకుండానే దాటేస్తున్నారు. రూ.లక్షల్లో బకాయిలు ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు రోజులే గడువు ఉంది. నగరపాలకసంస్థ అధికారులు పన్ను వసూళ్లను వేగవంతంచేశారు. మొండి బకాయిదారులపై దృష్టి సారించా రు. ఈ మొండి బకాయిదారుల్లో పెద్దలు అధికంగా ఉండడంతో రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే వి మర్శలున్నాయి. అందులోనూ ప్రభుత్వశాఖలకు సంబంధించిన బకాయిలే అధికంగా ఉండడం గమనార్హం. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ అసోసియేషన్ రూ.75 లక్షల బకాయిలకు గాను అధికారుల ఒత్తిడితో ఇటీవల రూ.5లక్షల చెక్కు ఇచ్చినట్లు సమాచారం. గతేడాది బకాయిలు చెల్లించకపోతే, నగరపాలక సంస్థ సిబ్బంది సముదాయంలోని దుకాణాలకు తాళం వేశారు. దీంతో కిరాయిదారులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కిరాయిదారుల నుంచి ప్రతి నెలా అద్దె వసూలు చేస్తున్నా, ఆస్తి పన్ను కట్టకపోవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. లక్షల రూపాయలు ఎవరి ఖాతాలోకి పోతున్నాయంటూ ఆరోపణలు వినవచ్చాయి. ఈ ఏడాది అదే పరిస్థితి ఏర్పడింది. రూ.70 లక్షలు చెల్లించకపోతే దుకాణాలకు తాళంవేసేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల్లోనూ లక్షల రూపాయల పన్నుల నుంచి అనధికారికంగా మినహాయింపు పొందుతున్న వాళ్లు పదుల సంఖ్యల్లో ఉన్నారు. కాపువాడకు చెందిన లక్ష్మి రూ.21,92,735, అలుగునూరుకు చెందిన సంతోష్ రూ.16,73,580, రాంనగర్కు చెందిన లలిత రూ.13,69,696, గాంధీరోడ్లోని పద్మ పేరిట రూ.13,30,955, వావిలాలపల్లిలోని విపంచి చిట్ఫండ్ సంస్థ రూ.10,31,866 బకాయి చెల్లించాల్సి ఉంది. టీఎన్జీవోకు మినహాయింపుపై పెండింగ్ నగరంలోని టీఎన్జీవో సముదాయం రూ.28,94,450 చెల్లించాల్సి ఉండగా.. సొసైటీ కావడంతో 1991లోనే ఇ లాంటి భవనాలకు ట్యాక్స్ మినహాయింపు ఉందని టీఎన్జీవో నేతలు జీవో చూపుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మున్సి పల్ చట్టంలో వచ్చిన మార్పులతో మినహాయింపు నుంచి సొసైటీలను తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై టీఎన్జీవో రాష్ట్ర నేతలు అప్పీల్ చేసుకోగా, ప్రస్తుతం సీఎంవోలో పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నా రు. పన్ను మినహా యింపు కొనసాగించాలని టీఎన్జీవో నేతల అర్జీని అంగీకరించినట్లు కాని తిరస్కరించినట్లు ప్రభుత్వం తేల్చకపోవడంతోనే పన్ను చెల్లించ డం లేదంటున్నారు. ఏదేమైనా వేల రూ పాయలు బకాయి పడ్డ సామాన్యుల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలకసంస్థ అధికారులు, రూ.లక్షలు బకాయి పడుతున్న పెద్దల జోలికి వెళ్లడంలేదనే అపవా దును మూట కట్టుకుంటున్నారు. -
రారండోయ్ వేడుక చూద్దాం
● నేడు శ్రీరామనవమి ● ముస్తాబైన ఆలయాలు కరీంనగర్ కల్చరల్/ఇల్లందకుంట: నేటి శ్రీరామనవమి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు సీతారాముల కల్యాణ వేడుక జరిపించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, కూలర్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి ప్రణవ్బాబు, ఆర్డీవో రమేశ్బాబు పరిశీలించారు. జమ్మికుంట రైస్మిల్లర్ల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించనున్నారు. నగరంలోని మహాశక్తి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పెళ్లి వేడుకకు హాజరయ్యే భక్తులకు వేద పండితుల ఆశీర్వచనంతోపాటు తలంబ్రాలను అందజేయనున్నారు. 25వేల మందికి అన్నదానం చేయనున్నారు. మహాశక్తి ఆలయంలో నిర్వహించే సీతారామచంద్రస్వామి వివాహ వేడుకలకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యం
కొత్తపల్లి(కరీంనగర్): వ్యాపారవేత్తగా ఎది గేందుకు ఆత్మవిశ్వాసం ముఖ్యమని అల్ఫో ర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ సూర్యనగర్లోని ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కరస్పాండెంట్ వి.రవీందర్ రెడ్డి అధ్యక్షతన ‘ఆవిష్కార్–2026’ పేరిట గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కామర్స్– మేనేజ్మెంట్ మీట్కు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువ త చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తగా రాణించేందుకు స్పష్టమైన ఆలోచనతో మార్కెట్ను పరిశోధించి ఫైనాన్షియల్ ప్లానింగ్తో తొలుత చిన్నగా ప్రారంభించాలన్నారు. స్కిల్క్ డెవలప్ చేసుకుంటూ నెట్వర్కింగ్ పెంచుకుంటూ మార్కెటింగ్పై ఫోకస్ చేయాలని, ఇందులో ఫెయిల్యూర్స్ను కూడా స్వీకరించాలని సూచించారు. వి.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి మీట్లు దోహదపడతాయన్నారు. రాష్ట్రస్థాయి కామర్స్–మేనేజ్మెంట్ మీట్లో యంగ్ మేనేజర్, యంగ్ కామర్స్ అవార్డ్, కార్పొరేట్ వాక్, స్ట్రెస్ ఇంటర్వ్యూ, నర్తనశాలతో పాటు 19 రకాల పోటీలు నిర్వహించామని, ఇందులో 15 కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించాని తెలిపారు. ఓవరాల్ చాంప్గా నిలిచిన హన్మకొండ వాగ్ధేవి డిగ్రీ కళాశాల విద్యార్థులకు శాతవాహన యునివర్సిటీ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ విభా గాధిపతి డా.హరికాంత్ బహుమతులు అందించారు. ● అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి -
రూ.50 కోట్ల టెండర్లు రద్దు!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లు రద్దయ్యాయి. ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్లతో చేపట్టనున్న 87 పనుల టెండర్పై పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నీలినీడలు కమ్ముకొన్నాయి. పనుల్లో అంచనాలు భారీగా పెంచారని, ప్రజలు కోరుకొన్నచోట కాకుండా అనవసర ప్రాంతాల్లో పెట్టారంటూ కొత్తగా ఎన్నికై న కార్పొరేటర్లు తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పాత టెండర్లు రద్దు కావడం రాజకీయంగా దుమారం రేపుతుండగా,అధికారులు మాత్రం టెండర్లురద్దుపై స్పష్టత ఇవ్వడం లేదు. ● టెండర్ రద్దు మున్సిపల్ ఎన్నికలకు ముందు యూఐడీఎఫ్ (అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ ఫండ్) కింద నగరంలో రూ.50 కోట్లు కేటాయించారు. రూ.50 కోట్ల తో 87 పనులు చేపట్టేం దుకు గతేడాది అక్టోబర్ 25వ తేదీన జీవో నంబర్ 715 ద్వారా సీడీఎంఏ పరిపాలనా మంజూరు ఇచ్చింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాటా రూ.40 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10 కోట్లు. 87 పనులకు సంబంధించి టెండర్ పిలిచారు . పనుల్లో 25 పనులకు ఎవరూ బిడ్ దాఖలు చేయ లేదు. 62 పనులకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లభించింది. ఇందులో 21 పనులకు టెండర్ ఓపెన్ చేశారు. మిగితా 41 బిడ్లను ఓపెన్ చేయాల్సి ఉండగా,నగరపాలకసంస్థ ఎన్నికలు రావడం, పాలకవర్గం ఏర్పడడంతో పునరాలోచన పడింది. ● 66 డివిజన్లకు కేటాయింపు! రూ. 50 కోట్ల టెండర్ రద్దు చేయగా, ఈ నిధులను 66 డివిజన్ లకు కేటాయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.ఒక్కో డివిజన్ కు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన పనులకు స్థానిక కార్పొరేటర్ల నుంచి ప్రతి పాదనలు తీసుకొంటున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే టెండర్ల రద్దు రాజకీయ దుమారానికి కారణమైంది. కాగా టెండర్ల రద్దుపై అధికారులు స్పందించడం లేదు. ● 31 న బల్దియా బడ్జెట్ సమావేశం నగర పాలక సంస్థ బడ్జెట్ ప్రత్యేక సమావేశం ఈ నెల 31 వ తేదీన నిర్వహించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగియనుండడంతో వార్షిక బడ్జెట్ సమావేశం అనివార్యమయింది. ఇప్పటికే ఎజెండా కాపీలు సభ్యులకు అందచేసినట్లు సమాచారం. 66 డివిజన్లకు కేటాయింపు? కమీషన్ల కోసమే రద్దు చేశారు కమీషన్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్ కలిసి నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లను రద్దుచేశాయని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. గురువారం నగరంలోని తారక హోటల్లో మాట్లాడుతూ ప్రత్యేకాధికా రి పాలనలో రూ.50 కోట్లతో 87 పనులు చేపట్టేందుకు టెండర్ పిలిచారన్నారు. విలీన ప్రాంతాలకు పనుల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ, పరిపాలనా మంజూరు ఇస్తూ సీడీఎంఏ జీఓ 715 జారీచేశారని తెలిపారు. పాలకవర్గం ఏర్పడ్డాక మరిన్ని నిధులు తీసుకురావాల్సింది పోయి, పాత రూ.50 కోట్ల టెండర్ను బుధవారం రాత్రికి రాత్రే రద్దు చేశారన్నారు. రూ.50 కోట్ల టెండర్లను ఎందుకు రద్దు చేశారో బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు. వారికి తెలియకపోతే మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఏ ప్రాతిపదికన టెండర్లురద్దు చేశారో, కలెక్టర్, కమిషనర్ చెప్పాలన్నారు. బీజేపీ నాయకుల బంధువులకు టెండర్ అప్పగించేందుకే పాత టెండర్ రద్దు చేశారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
ట్రినిటిలో క్యాంపస్ ప్లేస్మెంట్
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని ట్రినిటి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 94 మంది ఎంపికయ్యారు. ఎంపికై న వారిని ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ నాగేంద్రసింగ్, వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, డైరెక్టర్ రాజగోపాల్, ఏవో రాజశేఖర్రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి ప్రవీణ్కుమార్, హెచ్వోడీలు రజిత, శ్రీధర్, బలరాం పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): లోయర్ మానేరు డ్యాంలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టిన ప్రొక్లెయిన్, టిప్పర్లను కొత్తపల్లి పోలీసులు సీజ్ చేశారు. కొత్తపల్లి ఎస్హెచ్వో, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ వివరాల మేరకు ఎల్ఎండీ రిజర్వాయర్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని నీటి పారుదలశాఖ ఏఈఈ సీహెచ్ కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 23న కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా కిట్టండ్రు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన శివసత్య ఇంజినీరింగ్ కంపెనీ సూపర్వైజర్ గుర్రం రవి గత కొద్దిరోజులుగా ఎల్ఎండీలో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. రవిని అదుపులోకి తీసుకుని, రెండు టిప్పర్లు, ఒక ప్రొక్లెయిన్ను సీజ్ చేశారు. -
రూ.50 కోట్ల టెండర్లు రద్దు!
కరీంనగర్ నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లు రద్దయ్యాయి. ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్లతో నిర్వహించ తలపెట్టిన 87 పనుల టెండర్పై పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నీలినీడలు కమ్ముకొన్నాయి. పనుల్లో అంచనాలు భారీగా పెంచారని, ప్రజలు కోరుకొన్న చోట కాకుండా అనవసర ప్రాంతాల్లో పెట్టారంటూ కొత్తగా ఎన్నికై న కార్పొరేటర్లు తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పాత టెండర్లు రద్దు కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. – కరీంనగర్ కార్పొరేషన్ – వివరాలు IIలోu -
విద్యుత్ భవన్ ఎదుట ఆర్టిజన్ల ధర్నా
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ సుమారు 19 వేల మంది ఆర్ట్జీన్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ సంస్థ తక్షణమే వివక్షను తొలగించాలని విజ్ఞప్తి చేసారు. పీస్రేట్ కార్మికులకు 11 జిఓ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సంస్థలో విలీనం చేయాలని ఆర్టిజన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు సమస్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. -
పొద్దు పొద్దున్నే ఘోరం
జగిత్యాలక్రైం/రాయికల్/రుద్రంగి: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీమేసీ్త్ర రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచ్చిన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్తీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో తాపీమేసీ్త్ర వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్ శ్రీరామనవమి సందర్భంగా వారివారి స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్లో బుధవారం సాయంత్రం 4.30గంటలకు బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. ఘటనలో దేవండ్ల రామయ్య కూడా మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టి డబ్బులు కట్టేందుకు.. నెల్లూరూ జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్ అయోధ్యలో పోలయ్య తాపీమేసీ్త్ర వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చీటీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేసీ్త్రగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే.. రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్ విలపిస్తూ చెప్పాడు. రామయ్య కుటుంబసభ్యుల్లో ఆందోళన కాలి బూడిదైన బస్సులో రుద్రంగికి వలస వచ్చిన తాపీమేసీ్త్ర దేవాండ్ల రాములు ఉండడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన రాములు నాలుగేళ్లుగా రుద్రంగిలో భవన నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ప్రమాదం జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేణుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సు దగ్ధమై మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో బూడిదవడంతో మృతి చెందాడా..? లేదా..? అన్నది డీఎన్ఏ ఆధారంగా నిర్ధారిస్తామని పోలీసులు తెలిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు
గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
ఆయుష్.. పనితీరు భేష్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల ఆయుష్లో యునాని, హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్యసేవలు మెరుగ్గా అందిస్తున్నారు. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా.. జిల్లా లోని పలు ఆస్పత్రుల నుంచి ఆయుర్వేదిక్ వైద్యం కోసం ముగ్గురు వైద్యులు, యునాని, హోమి యోపతి వైద్యం కోసం ఒక్కోవైద్యుడిని డిప్యూటేషన్పై నియమించారు. దీంతో పెద్దపల్లి ఆయుష్ ఆస్పత్రిలో వైద్య సేవలు నిరంతరం అందుతాయనే నమ్మకం పేషెంట్లలో పెరిగింది. ఫలితంగా జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో పెద్దపల్లికి వైద్యం కోసం వస్తున్నారు. రోజూ 200 మందికి సేవలు ఆయుష్ ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ యునాని, ఆయుర్వేదిక్, హోమియోపతి సేవల కోసం ప్రతీనిత్యం సుమారు 200 మంది వరకు వస్తున్నారు. తమ వ్యాధి (బీపీ, షుగర్, కీళ్లనొప్పులు, గుండె, కిడ్నీ తదితర వ్యాధులు) నయం చేసుకునేందుకు వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్యపరీక్షలను ఇదే ఆవరణలోని టీహబ్ ద్వారా ఉచితంగానే చేయిస్తున్నారు. జబ్బు ఎలాంటిదైనా సరే.. వైద్యం అందిస్తుండడంతో పేషెంట్లకు నమ్మకం పెరుగుతోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్ ఆస్పత్రులకు దాదాపు ఏడాదిగా మందుల సరఫరా అరకొరగానే ఉంది. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను అందించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ మారుతి.. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే ఆస్పత్రిని సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన మందులను కేంద్ర ప్రభుత్వమే తయారు చేసే ఉత్తరాఖండ్ నుంచి తెప్పించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో మందులు లేకున్నా.. పెద్దపల్లి ఆయుష్ కేంద్రంలో మందులను అందుబాటులో ఉంచుతూ మెరుగైన వైద్యం అందించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు డెప్యుటేషన్పై వైద్యుల నియమాకం ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్ శ్రీహర్ష -
కరీంనగర్లో సినీనటి మెహరిన్ సందడి
కరీంనగర్: కరీంనగర్లో ప్రముఖ సినీనటి మెహరిన్ బుధవారం సందడి చేశారు. సుభాష్నగర్లో నూతనంగా ఏర్పాటైన డాల్ఫిన్ హాస్పిటల్స్ను ప్రారంభించారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్ – చిల్డ్రెన్ సంస్థను కరీంనగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రెన్ ప్రారంభం -
బల్దియా లైన్మెన్కు విద్యుత్ షాక్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న బొమ్మకల్కు చెందిన లైన్మెన్ శివ విద్యుత్షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అలుగునూరులో స్ట్రీట్ లైట్ బిగిస్తున్న స మయంలో పక్కనే ఉన్న 11 కేవీ లైన్ తగలడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న మేయర్కొలగాని శ్రీనివా స్ వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకొని, శివ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మున్సి పల్ కార్మికులకు భద్రతా పరికరాలు అందించాలని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. విద్యుత్షాక్తో గాయపడిన శివను ఆసుపత్రిలో పరామర్శించారు. రూ.3.46 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తులువీర్నపల్లి(సిరిసిల్ల): ఆన్లైన్ మోసగాళ్ల ఉచ్చులో ప డి ఓ రైతు భారీగా నగదు కోల్పోయిన ఘటన వీర్నపల్లి మండలంలో అడవిపదిరలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన పొలగాని లచ్చయ్యకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. తాము ధని బ్యాంక్ ప్రతినిధులమని నమ్మించారు. భారీ మొత్తంలో లోన్ ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో పలు విడతల్లో రూ.3,46,799 కాజేశారు. నగదు పంపిన తర్వాత సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య పోలీసులను బుధవారం ఆశ్రయించారు. -
లక్కీ మిరానీ.. మిరాకిల్
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్కు చెందిన లక్కీ మిరానీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ గుర్తింపు పొందుతున్నాడు. బాల్యంలోనే చూపు కోల్పోయినప్పటికీ, సంకల్పం, క్రమశిక్షణతో చీకటిని జ్ఞాన వెలుగుగా మలచుకుంటూ తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించబడుతున్న దృష్టి లోపం గల యువకుడిగా లక్కీ మిరానీ రికార్డు సాధించాడు. మిరానీ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్లో 95.80శాతం మార్కులు సాధించాడు. యూజీసీ ఎంట్రెన్స్లో ఆలిండియా 1వ ర్యాంక్ సాధించి, తొలి ప్రయత్నంలోనే యూజీసీ నెట్ క్లియర్ చేశాడు. చదువుల్లోనే కాకుండా క్రీడల్లోనూ తన ప్రతిభ చాటాడు. గోల్బాల్ క్రీడలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. లక్కీ విజయాల వెనుక అతని తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీ నిలవడం విశేషం. ప్రస్తుతం పాలిటికల్ సైన్స్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్కీ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లో సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
మంచి మందులు ఇచ్చారు
కీళ్ల నొప్పులతో బాధ పడుతూ ఆయుష్ ఆస్పత్రికి వచ్చా. వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. రోగం నయమైంది. అవసరమైన అన్నిరకాల పరీక్షలను కూడా ఇక్కడి టీహబ్లోనే చేయించారు. ఆస్పత్రికి వస్తే అన్ని వసతులు ఉండడంతో పాటుమందులు కూడా అందిస్తున్నారు. – నిర్మల, సుల్తానాబాద్ సేవలందిస్తున్నాం జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. మందుల కొరతను అధిగమించేందుకు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవసరమైన అన్నిరకాల మందులను తెప్పించి అందుబాటులో ఉంచారు. పేషెంట్లకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మారుతి, ఆయుష్ ఆస్పత్రి ఇన్చార్జి -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
● రాచర్ల బొప్పాపూర్లో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కప్పుసాసర్ డివైడర్ను ఆటో ఢీన్న ఘటనలో చికిత్స పొందుతున్న రాచర్ల బొప్పాపూర్కు చెందిన బొమ్మనవేణి రాజు(39) బుధవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 23న ఉదయం కరీంనగర్ డెయిరీకి చెందిన పాల క్యాన్లతో ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా స్థానిక పాతబస్టాండ్లో ఆటో అదుపుతప్పి కప్పుసాసర్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో రాజు అపస్మారక స్థితికి వెళ్లాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం వేకువజామున మరణించాడు. మృతునికి భార్య ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. పాముకాటుతో వృద్ధురాలి మృతి ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధ ర్మారం మండలం పైడిచింతల పల్లి పంచాయతీ శివారులోని గురుపల్లికి చెందిన నాంపెల్లి ల స్మమ్మ(78) బుధవారం పాముకాటుతో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. తన ఇంటి ఎదుట చింతపండు ఆరబెట్టి అక్కడే నిద్రకు ఉపక్రమించింది. ఈ సమయంలోనే విషపాము కుడిచేతిపై కాటు వేసింది. మెలకువ వచ్చిన వృద్ధురాలు కేకలు వేసింది. స్థానికులు వెంటనే పెద్దపల్లి, అక్కడ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. మృతురాలి కూతురు నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
డ్రంకెన్ డ్రైవ్లో 84 మందికి జరిమానాలు
వేములవాడ: పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడ్డ 84 మందిని కోర్టులో హాజ రుపరిచినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 17 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 46 మంది కి రూ.2వేలు చొప్పున జరిమానా, 21 మందికి రూ.4వేలు చొప్పున జరిమానా విధిస్తు వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి బుధవారం తీర్పు వెల్లడించినట్లు వివరించారు. మందుబాబులకు ఎస్సైలు రామ్మోహన్, సముద్రాల రాజు కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ ● ప్రమాదానికి కారణమైన ఇద్దరికి జైలు పెద్దపల్లిరూరల్: మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వారికి జైలుశి క్ష, జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ ఇన్చార్జి జ డ్జి మంజుల బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫి క్ సీఐ అనిల్కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప ట్టుబడ్డ 39 మందిని కోర్టులో హాజరుపర్చామ న్నారు. వారిలో శాంతినగర్కు చెందిన నల్గొండ కోటేశ్వర్కు రెండు రోజులు, తమిళనాడు రాష్ట్రంలోని కరూర్కు చెందిన జగదీశ్కు మూ డురోజులపాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారని వివరించారు. మిగతా 37మందికి రూ.36,500 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ పేర్కొన్నారు. ఏప్రిల్లో సమ్మర్ స్పెషల్ రైలు రామగుండం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షి ణ మధ్య రైల్వే వచ్చే ఏప్రిల్లో హైదరాబాద్ – గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తోంది. హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–గోరఖ్పూర్ (07075) వైపు ఏప్రిల్ 3, 10, 17, 24వ తేదీల్లో, గోరఖ్పూర్ – హైదనాబా ద్(07076) వైపు ఏప్రిల్ 5, 12, 19, 26వ తే దీల్లో ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాలలో హాల్టింగ్ ఉంది. మరోవైపు.. ఓఖా – మధురై మధ్య గతంలో వారాంతపు పద్ధతిన రాకపోకలు సాగించిన మధురై( 19559/60) రైలును రెగ్యులర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఇది అకోలా, పూర్ణా, నాందేడ్, నిజామా బాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్ సిటీ, ద్రోణాచలం, గుత్తి, కడప, ఎర్రగుంట్ల మార్గంలో రాకపోకలు సాగించ నుంది. ఇదే రూట్లో రామేశ్వరం–ఓఖా రైలు ఉండడంతో మరో రూట్ నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం నుంచి నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెండిళ్లలో చోరీచొప్పదండి: రెవెళ్లిలోని రెండిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇరుగురాల సరీన్ కుమార్ నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో బంధువు చనిపోతే ఇంటికి తాళం వేసి కుటుంబంతో వెళ్లాడు. బుధవారం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. పోలీసుల విచారణలో సరీన్ ఇంటిలో అరతులం బంగారం పోయినట్లు గుర్తించారు. క్లూస్ టీంతో విచారణ జరుపుతున్నారు. కాగా సరీన్ ఇంటి సమీపంలో నివాసం ఉండే రేకుల లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. లక్ష్మారెడ్డి ఖమ్మం జిల్లాలో ఉండే తన చిన్న కూతురు దగ్గరకు వెళ్లడం, అక్కడే ఉండటంతో చోరీకి ఏ వస్తువులు గురయ్యాయో తెలియలేదు. సరీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
శభాష్ టీం కరీంనగర్
కరీంనగర్స్పోర్ట్స్: సీఎంకప్–2025 పోటీల్లో జిల్లా జట్టు రాష్ట్రంలో మూడోస్థానాన్ని కై వసం చేసుకోగా.. 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించిన క్రీడాకారులను కలెక్టర్ చిత్రామిశ్రా అభినందించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, కోచ్లు, ఒలింపిక్, క్రీడాసంఘాల బాధ్యులు బుధవారం కలెక్టర్ను కలిశారు. డీవైఎస్వో శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కోచ్లు ఉన్నారు. -
యూపీఐ లంచం!
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని విడిచిపెట్టేందుకు యూపీఐ ద్వారా రూ.15వేల లంచం తీసుకున్న కేసులో గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఎస్సైగా పనిచేసిన వెంకటేశ్వర్లును కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈనెల 24న అరెస్టు చేశారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సైగా ఉన్నారు.కాంట్రాక్టర్లు, ఉద్యోగుల వద్ద లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ను ఈనెల 16న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ బినామీ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.● జిల్లాలోని అవినీతి ఉద్యోగులపై ఏసీబీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. రెవెన్యూ, పోలీసు, ఎకై ్సజ్శాఖ, రిజిస్ట్రేషన్శాఖ, మున్సిపల్, రవాణాశాఖలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలపై దృష్టి సారించాయి. లంచగొండి అధికారులపై కన్నేశాయి. ● రెవెన్యూశాఖలో ప్రతి పనికో రేటు నిర్ణయించి కొందరు అధికారులు కిందిస్థాయి సిబ్బంది ద్వారా లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మీసేవా కేంద్రాలు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యక్తుల ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, వివిధ రకాల సర్టిఫికెట్ల వ్యవహారాల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● జిల్లాలోని పలువైన్స్లు, బార్ల నుంచి ఎకై ్సజ్శాఖ, పోలీసుశాఖ అధికారులకు మామూళ్లు అందుతున్నాయని చర్చ జరుగుతోంది. పలు వైన్స్లు, బార్ల నుంచి ఎవరు రెగ్యులర్గా మామూళ్లు వసూలు చేస్తున్నారు? ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఏఏ స్థాయి అధికారులకు ఎంత మొత్తంలో వెళ్తోంది, పలువురు అధికారులు వాడిన యూపీఐ లావాదేవీలపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. ● రిజిస్ట్రేషన్శాఖలో కొందరు అధికారులు ఓపెన్ప్లాట్కు కొంత, నివాసానికి కొంతమొత్తాన్ని నిర్ణయించి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచం తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. రిజిస్ట్రేషన్శాఖలో పనిచేసే ప్రైవేట్ సిబ్బంది ద్వారా జరుగుతున్న అవినీతి, యూపీఐ లావా దేవీలపై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. -
పెన్షనర్ల నిరసన
కరీంనగర్టౌన్: పెన్షనర్లకు ఆర్థిక నష్టం కల్గించేలా ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదురుగా జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు ఉస్మాన్పాషా, మహేందర్రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్న చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. పెన్షనర్ల సంఘం బాధ్యులు జీవీ.మనోహర్కుమార్గౌడ్, రామచంద్రం, నాగమోహన్, శంకరస్వామి, రాజిరెడ్డి ఉన్నారు. -
పోక్సో కేసులపై ఫోకస్
కరీంనగర్క్రైం: జిల్లాలో నమోదవుతున్న పోక్సో కేసులు, మహిళలకు సంబంధించిన నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2024వరకు పెండింగ్లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాలపై సమీక్షించారు. ఆస్తి సంబంధిత, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అనవసరంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటే ప్రమాదకరమని హెచ్చరించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వేణుగోపాల్, శ్రీనివాస్జి, విజయ్కుమార్, వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, సతీశ్ పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో యువత పాత్ర కీలకంకరీంనగర్ సిటీ: డిజిటలైజేషన్లో యువత ముందుండి వికసిత భారత్ నిర్మాణానికి పునా దులు వేయాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేష్కుమార్ సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘ట్రాన్స్ఫర్మేటివ్ రోల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది జర్నీ ఆఫ్ 2047‘ అనే అంశంపై రిజి స్ట్రార్ సతీశ్కుమార్ అధ్యక్షతన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో డిజిటల్ చెల్లింపులతో బ్యాంకింగ్ సేవల్లో ఆధునిక మార్పులొచ్చాయన్నారు. విద్యారంగంలోనూ 2047వరకు ఈ మార్పులు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆల్ ఇండియా కామ ర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జాస్తి రవికుమార్ మాట్లాడుతూ డిజిటలైజేషన్తో వాణిజ్య, ఉత్పత్తి రంగాల్లో 2020 నుంచి 2030 వరకు అభివృద్ధికరమైన వసతులు వస్తున్నా యన్నారు. సదస్సు డైరెక్టర్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ హరికాంత్ మాట్లాడుతూ ఈ సెమినార్లో 130 పరిశోధన పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు.నేడు బార్ అసోసియేషన్ ఎన్నికలుకరీంనగర్క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జిల్లాకోర్టులో జరగనున్నట్లు ఎన్నికల అధికారి మారోజు రామకృష్ణాచారి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. మొత్తం 1,080 మంది న్యాయవా దులు ఓటుహక్కు కలిగి ఉన్నారని వివరించా రు. ఫలితాలు రాత్రి వరకు వెల్లడించనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో అభ్యర్థులు మాత్ర మే ప్రచారం చేసుకోవాలని తెలిపారు. ప్రెసిడెంట్ స్థానానికి ముగ్గురు, వైస్ ప్రెసిడెంట్ జనరల్ స్థానానికి నలుగురు, మహిళా స్థానానికి ఇద్దరు, జనరల్ సెక్రటరీ స్థానానికి నలుగురు, జాయింట్ సెక్రటరీ జనరల్ స్థానానికి ఇద్దరు, ట్రెజరర్కు ఐదుగురు, లైబ్రరీ సెక్రెటరీకి ముగ్గు రు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు, సీనియర్ ఈసీ మెంబర్కు నలుగురు, సీనియర్ ఈసీ మహిళకు ఇద్దరు, జూనియర్ ఈసీ జనరల్లో ఎనిమిది మంది, జూనియర్ ఈసీ మహిళాస్థానంలో ఐదుగురు పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ మహిళాస్థానానికి ఎం.అనురాధ ఏకగ్రీవమయ్యారు. 29 లోగా లెక్కలు చెప్పాలికరీంనగర్ కార్పొరేషన్: ఇటీవల జరిగిన నగర పాలకసంస్థ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ఈ నెల 29వ తేదీ లోగా సమర్పించాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం 45 రోజుల్లో తమ వ్యయ లెక్కలను విధిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీలోగా సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులకు లెక్కలు అందజేయాలన్నారు. నగరంలోని 1వ డివిజన్ నుంచి 14వ డివిజన్ వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.కిరణ్కుమార్, 15 నుంచి 28 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.వి.శివనాగేందర్రెడ్డి, 29 నుంచి 42 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎ.అశోక్కుమార్, 43 నుంచి 54 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.స్వర్ణలత, 55 నుంచి 66 వరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.జమునారాణిలు ఎన్నికల వ్యయ సహాయ పరిశీలకులుగా ఉన్నారన్నారు. గడువులోగా ఆయా డివిజన్లకు చెందిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ లెక్కలు అప్పగించాలని సూచించారు. -
ఇంధనం.. బంధ్నం!
కరీంనగర్ అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కరీంనగర్ను తాకిందా..? బంకులే కృత్రి మ కొరత సృష్టించాయా..? అంటే అవునో కాదో అర్థం కాని దుస్థితి. ప్రభు త్వ యంత్రాంగం ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తుండగా, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బా రులు తీరగా పలు బంక్లు మూసివేశారు. మరికొన్నింట్లో పవర్ పెట్రోలే ఉందంటూ జిమ్మిక్కులు చేశారు. ఇంధన కొరత పుకార్లతో బుధవారం ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్ద బారులు తీరగా ని యంత్రించేందుకు సిబ్బంది పాట్లు పడ్డారు. జిల్లాలో 159, నగరంలో 39 పెట్రోల్ బంకులుండగా అంతటా ఇదే పరిస్థితి. కృత్రిమ కొరత పలు పెట్రోల్ బంకుల యజమానులు ఇంధన కృత్రిమ కొరత సృష్టించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భావించి నగరంలోని పలు బంకులు మూసివేశారు. ఇంకొందరు పవర్ పెట్రోలే ఉందని తమ విక్రయాలు పెరిగేలా జిమ్మిక్కులు చేశారు. పవర్ పెట్రోల్ పాత నిల్వ ఉండగా ఇటీవలే ధర పెరిగింది. దీంతో పాత నిల్వకు కొత్త ధరతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొత్త నిబంధనలే కారణమా? ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలు స్తోంది. గతంలో ఆయిల్ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేవి. మూడు నాలుగు రోజులు గా ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని ఆయి ల్ సంస్థలు స్పష్టం చేయడంతో పలు బంకులకు సరఫరా ఆగిపోయింది. పాతబకాయిలు జమచేయడంతో పాటు కొత్తగా స్టాక్కు డబ్బులు ముందే చెల్లించాలని చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాకు అయిపోతోంది. మళ్లీ స్టాకు వచ్చేవరకు ఆ బంకులు మూతపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే బంకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పెట్రోలు బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రేక్షక పాత్రలో సివిల్ సప్లయ్ కంపెనీలు, పెట్రోల్ బంకులు మధ్య ఏర్పడిన వివాదంతో బంకులు మూతపడుతు న్నా పౌరసరఫరాలశాఖ చోద్యం చూస్తోంది. పెట్రోల్, డీజిల్కు కొరత లేదని చేతులు దులిపేసుకుంటోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యం చేస్తే ఇంధనం లభించదనే ఆందోళనతో జనం బంకులకు పరుగులు తీస్తున్నా, నగరంలో బంకులు మూతపడినా పౌరసరఫరాలశాఖ స్పందించకపోవడం గమనార్హం. -
పెట్రోల్, డీజిల్ కొరత పుకార్లే
పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పుకార్లను పట్టించుకోవద్దని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి గట్టు నర్సింగరావు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సరఫరాలో జాప్యం వల్లే తప్పా ఇంధనం సమృద్ధిగా ఉందని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగదారుల ఇబ్బందుల క్రమంలో బుధవారం డీఎస్వో ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయా సమస్యలపై పరిస్థితులను వివరించారు. ఎవరైనా ఇంధన కృత్రిమ కొరత సృష్టిస్తే 9154249727 నంబర్కు ఫిర్యాదు చేయాలని, కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. –కరీంనగర్ అర్బన్ -
ఘనంగా ‘సాక్షి’ వార్షికోత్సవం
ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీకోదండ రామాలయంలో మంగళశారం సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘సాక్షి’ పాఠకులు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరణ పొంది ఉన్నతస్థాయిలో నిలిచిందన్నారు. అనంతరం స్థానిక రిపోర్టర్ రంగు తిరుపతిని సన్మానించారు. సాక్షి యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచులు మండిగ రాయనర్సయ్య, బాసంపల్లి కొండయ్య, బూర్ల వెంకటసత్యం, మాజీ ఎంపీటీసీ గొల్లే భూమేశ్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీశ్బాబు, అంబేడ్కర్ సంఘం నాయకుడు కవ్వంపల్లి చంద్రయ్య, వివిధ సంఘాల నాయకులు బుర్ర అజయ్, బుర్ర గణేశ్, మహేందర్, రాకేశ్, రాంరెడ్డితోపాటు ‘సాక్షి’ పాఠకులు, అభిమానులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో ప్రతిభ
రామగుండం: సికింద్రాబాద్ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో నిర్వహించే ‘ఆపరేషన్ యాత్రి సురక్షా’లో భాగంగా పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించడం పరిపాటి. ఈ సందర్భంగా అనుమానితులను గుర్తించి, చోరీకి గురైన సామగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రామగుండం రైల్వే భద్రత దళానికి చెందిన ఏఎస్ఐ మాసాని నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్కుమార్ నిర్వహించిన ఆపరేషన్ యాత్రి సురక్షాలో ఓ దొంగను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఈక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ల మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు 8 దొంగిలించినటు్ల్ ఆర్పీఎఫ్ సిబ్బంది వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.61వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐ నాగరాజు, హెచ్సీ ప్రదీప్కుమార్ను ఉత్తమ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రకుమార్వర్మ ప్రకటించారు. ఈవిషయాన్ని రామగుండం సీఐ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులను డివిజనల్ కమిషనర్ ఆలకుంట నవీన్కుమార్, రామగుండం ఆర్పీఎఫ్ ఎస్సై క్రాంతి తదితరులు అభినందించారు. ఈనెలలో రూ.61వేల విలువైన వస్తువుల రికవరీ ఉత్తమ సిబ్బందిగా గుర్తించిన రైల్వే అసిస్టెంట్ కమిషనర్ -
తండ్రి పేరిట ఉన్న నగదు దేశ రక్షణ నిధికి జమ
రామగుండం: ఓ రిటైర్డ్ హెచ్ఎం తండ్రి పేరిట ఉన్న నగదును దేశ రక్షణ నిధికి జమ చేసి దేశంపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడుకు చెందిన కోట వెంకటశివశాస్త్రి రామగుండం హైస్కూల్లో సుదీర్ఘకాలం హెచ్ఎంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. తన తండ్రి ప్రఖ్యాత హరికథా భాగవతార్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్చిదానందశాస్త్రి వయోభారంతో 2024 సెప్టెంబర్లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పేరిట ఉన్న రూ.లక్ష నగదును సోమవారం భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని నూజివీడు ఎస్బీఐ బ్యాంకులో దేశ రక్షణ నిధి అకౌంట్ నంబర్కు డిపాజిట్ చేశారు. ఈ విషయమై సదరు రిటైర్డ్ హెచ్ఎం తన పూర్వ విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. రిటైర్డ్ హెచ్ఎంకు పూర్వ విద్యార్థులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. రిటైర్డ్ హెచ్ఎం నిర్ణయంపై హర్షం -
భారతావనికి ఎన్టీపీసీ వెలుగులు
గోదావరిఖని/జ్యోతినగర్: దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ అందించడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు అగ్రభాగాన నిలిచిందని ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో మంగళవారం ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమావేశంలో ఈడీ మాట్లాడారు. ప్రాజెక్టులోని 200 మెగావాట్ల రెండో యూనిట్, 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్లు(4వ, 6వ) వార్షిక మరమ్మత్తులు పూర్తిచేసుకుని విద్యుత్లోకి వచ్చాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ స్టేజ్–2కు రానుందని, తెలంగాణ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని అన్నారు. ప్రజెక్టులో బొగ్గు , ఇంధన నిల్వలు.. థర్మల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఈడీ సామంత అన్నారు. 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిలో ఉండగా, ఈనెలలోనే 176 మెగావాట్ల (120 మెగావాట్లు గ్రౌండ్, 56 మెగావాట్లు ఫ్లోటింగ్) సోలార్ ప్రాజెక్టులు కమిషనింగ్కు సిద్ధమయ్యాయని తెలిపారు. గ్రిడ్ నుంచి ఫస్ట్ టైమ్ చార్జింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరంలో రామగుండం థర్మల్ ప్రాజెక్టు 13.4 బిలియన్ యూనిట్లు(86.3 శాతం), తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు 9.3 బిలియన్ మెగావాట్లు(91.4శాతం ) విద్యుత్ ఉత్పత్తి చేశాయని ప్రకటించారు. పారదర్శకత, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పర్యావరణ హిత చర్యలు పటిష్టం విద్యుత్ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ స్పష్టం చేశారు. తక్కువ కార్బన్ ఉద్గారాల దిశగా బ్యాటరీ స్టోరేజ్ యూనిట్, కార్బనేటెడ్ బ్రిక్స్ తయారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. పర్యావరణ నిబంధనల అమలులో భాగంగా ఎఫ్జీడీ వ్యవస్థ తెలంగాణ ప్రాజెక్టులో అమల్లో ఉండగా, రామగుండంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎఫ్జీడీ ద్వారా 1.35 టన్నుల జిప్సం సేకరించామని పేర్కొన్నారు. సంస్థ ప్రభావిత, పునరావాస గ్రామాల్లో విద్య, వైద్యం, వసతుల కల్పనకు సామాజిక సేవా బాధ్యతా పథకం నిధులు రూ.7 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, అభిజిత్ దత్తా, బినోయ్ జోస్, తెలంగాణ ప్రాజెక్టు హెచ్వోడీ డీఎస్ రావత్, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, సీఎస్సార్ ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్ సామర్థ్యాల పెంపు వేసవి డిమాండ్కు ముందస్తు ఏర్పాట్లు సమృద్ధిగా బొగ్గు, ఇందన నిల్వలు రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత -
‘పారాక్వాట్’ను నిషేధించాలి
కరీంనగర్: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో ని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ మా ట్లాడుతూ.. పారాక్వాట్కు కచ్చితమైన విరుగుడు లే కపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరి మాణంలో సేవించినా ప్రాణాపాయం తప్పదని, ఆసుపత్రికి చేరినా చికిత్స అందించడం కష్టమని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మందులను రైతులకు అందుబా టులోకి తేవాలని సూచించారు. బీఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డిమందు నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. డాక్టర్ పి.రంగారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో సులభత కోసం వాడుతున్న ఈ రసాయనం ప్రాణాంతకమైందని, రైతుల భద్రత దృష్ట్యా దీని వినియోగాన్ని నియంత్రించా లన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కటారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఈ మందు అందుబాటులో ఉండటం వల్ల క్షణికావేశంలో సేవించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నా రు. బీఎన్.రావు మాట్లాడుతూ ఈ మందు ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వం దీనిపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయాలని, సురక్షిత ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని వైద్యులు కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేశ్ బాబు, ట్రెజరర్ నీలిమా, అలీం, కాంగ్రెస్ డాక్టర్ వింగ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రీధర్, కిరణ్, రాంచందర్ పాల్గొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.కిషన్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మత్తు మందు చల్లి బంగారం చోరీజమ్మికుంట: మాటమాట కలిపి.. మత్తు మందు చల్లి రెండు తులాల బంగారం చోరీ చేసిన ఘటన జమ్మికుంట మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మడిపల్లి గ్రామానికి చెందిన కస్తూరి రమ పిండిగిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చి, పిండి పడుతారా అంటూ మాట కలిపి ముఖంపై మత్తుమందు స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోగానే మెడలోని రెండు తులాల పుస్తెలతాడు చోరీ చేసి పారిపోయాడు. రమ స్పృహలోకి వచ్చి లబోదిబోమంటూ బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు. కారు ఢీకొని ఒకరి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్– మోరపల్లి గ్రామాల మధ్య జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు గాడిపల్లి లక్ష్మణ్ (40) మృతిచెందాడు. రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై చల్గల్ నుంచి సింగరావుపేటకు వెళ్తున్నాడు. కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి లక్ష్మణ్ బైక్ను ఢీకొనడంతో కిందపడిపోయిన లక్ష్మణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రైతు..కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నల్లగుంటపల్లికి చెందిన రైతు వేల్పుల ఐలయ్య(65) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఐలయ్య తాను సాగు చేసిన కూరగాయాలను కరీంనగర్ మార్కెట్కు తరలించాడు. తిరిగి టీవీఎస్ ఎక్సెల్పై నల్లగుంటపల్లికి వెళ్తున్నాడు. దుర్శేడ్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జాగ్రత్తలు తప్పనిసరి
ఒంటిపూట బడి..పెద్దపల్లి: ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను ఈనెల 16 నుంచి ఒక్కపూటే నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత బడిలేకపోవడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నారు. ఇలా అనేకమంది ఆటాపాటల్లో మునిగితేలుతున్నారు. ఇలాంటి ఆనంద సమయాల్లో విషాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులను గ్రహించాలి. పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి ఒంటిపూట బడిసమయంలోనూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలలో స్వచ్ఛమైన తాగునీటి వసతితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తిరిగేటట్లు శ్రద్ధ వహించాలి. మధ్యాహ్న భోజనం నీడ కింద కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలి. ఎండలో ఆటలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా.. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ఉపాధిహామీలో మట్టి తీసిన గుంతల్లో ప్రస్తుతం నీరు నిల్వఉంది. విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి. బావుల్లో సరదా కోసం ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లలు మునిగిపోయిన విషాద ఘటనలు ఏటా పదుల సంఖ్యలో ఉంటున్నాయి. డ్రైవింగ్ మోజులో.. ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై మోజుతో కొందరు విద్యార్థులు ఇళ్లలో చెప్పకుండా రోడ్డెక్కితే ప్రమాదాల బారిన పడే ఆస్కారం అధికంగా ఉంది. బడి వదలగానే కొందరు పిల్లలు సమయం దొరికిందని ఎండలో ఆడతారు. దీంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇంట్లో ఖాళీగా వీడియో గేమ్స్, టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దృష్టిలోపాలతో పాటు మానసిక బలహీనులుగా మారే అవకాశం ఉంది. వీటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు సరదాగా సమయం కేటాయించి వారితో ఉంటూ ఆటలు ఆడిపించాలి. జాగ్రత్తలు అవసరం ఉదయాన్నే కచ్చితంగా అల్పాహారం పెట్టి పాఠశాలలకు పంపించాలి. నీళ్లసీసా వెంట ఉంచాలి. ఉదయం 7.30 గంటల్లోపు బడికి పంపించేందుకు శ్రద్ధ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం 12.30 గంటలకు వడ్డిస్తారు. దూరప్రాంతాల విద్యార్థులు ఎండలో నడిచి వెళ్లకుండా ఆటోలు తదితర వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎండలు ఎక్కువైన కొద్దీ పిల్లలు ఆహారం తీసుకునేందుకు మారాం చేసే అవకాశముంది. వీరికి ఇష్టమైన ద్రవ పదార్థాలు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకునేలా చొరవ తీసుకోవాలి. – డాక్టర్ ఉదయ్ కుమార్, పీహెచ్సీ, గర్రెపల్లి పిల్లలను కంట కనిపెట్టాల్సిందే.. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఆటలపై దృష్టి సారించేలా చూస్తే బెటర్ -
విద్యుత్ షాక్తో మేకల కాపరి మృతి
సైదాపూర్: విద్యుత్ షాక్తో మేకల కాపరి, రెండు మేకలు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారంగా సర్వాయిపేటకు చెందిన బొల్లి సమ్మయ్య(49) ఆకునూర్ శివారులో మేకలు మేపుతున్నాడు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్కు చెందిన ఓ రైతు కోతుల బెడద తప్పించుకునేందుకు వరి చేను చుట్టూ కరెంట్ షాక్ పెట్టాడు. మేకలు మేపుతూ అటువైపుగా వెళ్లిన బొల్లి సమ్మయ్యకు రెండు మేకలకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, సైదాపూర్ ఎస్సై స్వాతి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య సరవ్వ, కుమారుడు ఉన్నారు. సీఎంకప్లో తృతీయ స్థానంకరీంనగర్: సీఎం కప్–2025లో రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా తృతీయస్థానం సాధించింది. హైదరా బాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు వేడుకల్లో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి, షట్లర్ సైనా నెహ్వల్ చేతుల మీదుగా డీవైఎస్వో శ్రీనివాస్ ట్రోఫీ అందుకున్నారు. ఆదిలాబాద్ ప్రథమ, రంగారెడ్డి ద్వితీయ స్థానంలో నిలవగా కరీంనగర్ 79.4పాయింట్లతో తృతీయ స్థానం సాధించింది. కలెక్టర్ చిత్రామిశ్రా, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఎస్సైపై వేటు?మెట్పల్లి: పేకాట ఆడుతూ పట్టుబడిన మెట్పల్లి ఏఎస్సై సత్యనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. పట్టణంలోని రాంనగర్లో శనివారం రాత్రి ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి దాడి చేశారు. అందులో పట్టుబడిన పలువురిలో ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ చేసే సత్యనారాయణ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
పెద్దపల్లి: అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. ముత్యంరావు మాట్లాడుతూ, 35 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు జ్యోతి, ర్గవి, సుజాత, మేఘమాల, స్వప్న, హేమలత, రాజేశ్వరి ఓదేశ్వరి, చంద్రకళ, స్వప్న, సుమలత, స్వరూప, సునీత, రమ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
పెద్దపల్లి: విద్యుత్ సంస్థలోని 23,667మంది ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ తూళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016కు ముందు అన్నిఅర్హతలు ఉన్న వారందరినీ, ఆన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. అన్నివిభాగాల వారికి జీవో నంబర్11 ప్రకారం కనీస వేతన చట్టం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 26, 30వ తేదీల్లో డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు చేస్తామని, ఏప్రిల్ 7న వరంగల్ డీసీఎల్ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని, అయినా స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. పాలకుర్తి మండలం బసంత్నగర్ధిలో పనిచేస్తున్న అర్టిజన్ గడ్డం జయదేవ్ను వేధిస్తున్న ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఖలీమొద్దీన్, ఎం.కృష్ణారెడ్డి, ఎం.ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా జేఏసీ నేత నాగరాజు -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కండి
కరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో 2,73,550ఎకరాల్లో వరి సాగైందని, 6,46,320 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని వివరించారు. 3,67,776 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశముందని, జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకా ద్వారా 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాలు, కో–ఆపరేటివ్, డీఆర్డీవో, మార్కెటింగ్ తదితరశాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం.రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజాచార్య, డీఎంవో షాబోద్దీన్ పాల్గొన్నారు. పారదర్శకమైన ఓటరు జాబితాకే ఎస్ఐఆర్ ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఎన్నికల సంఘం చేపట్టిందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇందుకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో డూిప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్లవి తొలగిస్తారని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఓటు హక్కు రానివారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు. గ్యాస్ గోదాం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. నగరంలోని సీతారాంపూర్లో గల నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రులకు సరఫరా అవుతున్న సిలిండర్లు, వాణిజ్యపరమైన, గృహ అవసరాల సిలిండర్ల సరఫరా వివరాలు పరిశీలించారు. స్టాక్, బుకింగ్ సంఖ్య తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి తెలియజేయాలని డీలర్లకు సూచించారు. -
139మంది హజ్ యాత్రికులకు టీకాలు
కరీంనగర్: నగరంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హజ్ కమిటీ ట్రైనింగ్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్ను డీఎంహెచ్వో వెంకటరమణ, పీవో ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా మంగళవారం సందర్శించారు. హజ్ యాత్రకు వెళ్లనున్న 139మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ చేశారు. 60 సంవత్సరాల పైబడిన వారికి ఎస్ఐవీ, మొనోకోకల్ మెనింజైటిస్ (క్యూఎంఎంవీ) టీకాలు ఇచ్చారు. 60ఏళ్లలోపు వారికి ఒక్కటే టీకా ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిద్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజగోపాల్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి, హజ్ కమిటీ సభ్యులు అజహార్, రియాజ్ అలీ, ఇర్ఫాన్ పాల్గొన్నారు. నార్మల్ డెలివరీలపై దృష్టి జిల్లాలోని పీహెచ్సీల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పనితీరును సమీక్షిస్తూ, మొదటి కాన్పులకు గర్భిణులను సాధారణ ప్రసవాల వైపు ప్రోత్సహించాలని తెలిపారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను, తక్కువ బరువు పిల్లలను గుర్తించి, పోషకాహార పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆర్బీఎస్కే, 102 వాహనాలను వినియోగించాలన్నారు. -
పరిశోధనలతో సమస్యలు పరిష్కారం
కరీంనగర్సిటీ: పరిశోధనలే సమస్యల పరిష్కారానికి మూలమని శాతవాహన యూనివర్సిటీ కామర్స్, మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డి.హరికాంత్ అన్నారు. ఎస్సారార్ కళాశాలలో కామర్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ సౌజన్యంతో విద్యార్థులకు పరిశోధన పద్ధతులు, ప్రాజెక్టు రిపోర్ట్ తయారీపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ప్రొఫెసర్ వై.రామకృష్ణ, ఏ.రాకేశ్ ఫణీంద్ర పరిశోధన అంశం ఎంపిక, రూపకల్పన, డేటా సేకరణ, విశ్లేషణ, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ గురించి వివరించారు. హరికాంత్ మాట్లాడుతూ... విద్యార్థులు వ్యాపార వాణిజ్య రంగాల్లోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాలనే ఉద్దేశంతోనే ఈ పరిశోధన ప్రాజెక్టు రిపోర్టు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, కామర్స్ విభాగాధిపతి రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారు సురేందర్ రెడ్డి, బుర్ల నరేశ్ పాల్గొన్నారు. -
మహిళా పోలీసులు కీలకం
కరీంనగర్క్రైం: మహిళా పోలీసుల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ పోలీసు కమిషనరేట్లోని అస్త్ర కన్వెన్షన్లో ‘షీలీడ్స్–2026’ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ సమాజ రక్షణలో మహిళా పోలీ సులు కీలకమన్నారు. బాధితులు, నిందితులు, ఆందోళనకారుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై హుజూరాబాద్ ఏసీపీ వి.మాధవి అవగాహన కల్పించారు. అనంతరం ఉచి త వైద్య శిబిరం నిర్వహించారు. అదనపు డీసీ పీ వెంకటరమణ, సీటీసీ ఏసీపీ వేణుగోపాల్, ఆర్ఐలు రజినీకాంత్, కిరణ్ పాల్గొన్నారు. కరీంనగర్సిటీ: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ప్రముఖ సంస్థలైన క్వెస్ కార్ప్, ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఆదర్శ నెక్సా ఆటోమొబైల్స్, వరుణ్ మోటార్స్, ధ్రువంత్ సొల్యూషన్స్, డీ మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, హెటిరో ఫార్మా, ఫ్యూజన్ ఫినాన్స్, రాన్స్టాండ్ పాల్గొన్నాయి. 400 మందికి పైగా హాజరుకాగా 230మంది షార్ట్లిస్ట్ అ య్యారు. వారిని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి, టీఎస్కేసీ కోఆర్డినేటర్ డి.శ్రీనివా స్, ఎఫ్టీఎం రాజశేఖర్ అభినందించారు. 28న జాతీయ లోక్ అదాలత్కరీంనగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే.రాణి తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ కేసులు , మోటారు ప్రమాద, చెక్బౌన్స్, ఫ్యామిలీ, ఇన్సూరెన్స్, బ్యాంకు కేసులు ఇరు పార్టీల రాజీ ద్వారా పరిష్కరించునున్నట్లు తెలిపారు. కేసులు పరిష్కరించుకోవాలనుకునే వారు న్యాయ సేవాధికార సంస్థ, పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
కొత్తగా ఐదు
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకుంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందనే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసివస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ప్రయోజనాలు ఏమిటి? మున్సిపల్, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్తో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ కోటా నిర్ణయించనున్నారు. పాతవాటితోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీస్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహిళలకు కేటాయించేవి ఏమిటి, మహిళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారే అంశాలపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఏమిటో? ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించిఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్ మున్సిపల్, రూరల్తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్ ప్రాంతంతో కరీంనగర్ రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాలతో జగిత్యాల రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అన్ని రంగాల్లో నగర అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని 44వ డివిజన్ సప్తగిరికాలనీ కస్తూరి బా గాంధీ పాఠశాలలో నాబార్డ్ నిధులు రూ.38 లక్షలతో చేపట్టనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. 49వ డివిజన్ సంతోష్నగర్లో కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాశ్తో కలిసి సంతోషిమాత ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. భాగ్యనగర్కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 లక్షలతో చేపట్టనున్న తాగునీటి నీటి సరఫరా పైప్లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సప్తగిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఓపెన్జిమ్ ఏర్పాటు చేశామన్నారు. భాగ్యనగర్లో తాగునీటి పైప్లైన్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కర్రె పద్మ అనిల్, గాజ రమ శివరాం, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం కల్పించండినగరపాలకసంస్థ ఆస్తిపన్నుకు సంబంధించి వన్టైం సెటిల్మెంట్ పథకానికి అవకాశం కల్పించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్యమంత్రి, మున్సిపల్శాఖ మంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. 2024–25 సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిల వడ్డీ, పెనాల్టీపై 90 శాతం రాయితీ ఇస్తూ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి వడ్డీ,పెనాల్టీలతో సహా మొత్తం బకాయిలను చెల్లించిన ఇంటి యజమానులకు, వారు చెల్లించిన వడ్డీ మొత్తంలో 90 శాతాన్ని భవిష్యత్తు ఆస్తి పన్ను చెల్లింపుల్లో సర్దుబాటు చేసుకోవడానికి అనుమతించాలన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ చెల్లించే ఇంటి యజమానులకు 5నుంచి 10 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. -
వాగేశ్వరి కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
తిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు లభించినట్లు కళాశాల జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్రెడ్డి సోమవారం తెలిపారు. జనవరిలో అధికారుల బృందం కళాశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారని, అధికారుల నివేదిక ఆధారంగా కళాశాలలో బీటెక్ సీఎస్సీ, ఈసీఈ, ఈఈఈ కోర్సులకు మూడేళ్ల పరిమితితో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహకరించిన అధ్యాపకులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. జాయింట్ సెక్రెటరీ దావు శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు వినోద్, ప్రకాష్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీ కళాశాలకు అటానమస్ మండలంలోని వాగేశ్వరి ఫార్మసీ కళాశాలకు అటానమస్ గుర్తింపు వచ్చినట్లు కళాశాల జనరల్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉత్తర తెలంగాణాలోనే మొట్టమొదటిసారిగా వాగేశ్వరీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు జేఎన్టీయూ అటానమస్ గుర్తింపు ఇచ్చిందన్నారు. మొదట నాక్ ఏ ప్లస్ వచ్చిందని, సోమవారం తమ కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందన్నారు. తమ కళాశాలకు అటానమస్ రావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్బీఏ వచ్చేలా తాము, ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీ కృషి చేస్తామని పేర్కొన్నారు. -
వైభవంగా ‘రామకోటి యజ్ఞం’
హుజూరాబాద్: పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో సోమవారం రామకోటి యజ్ఞం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం చేపట్టిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా, రామనామ స్మరణతో హాల్ మారుమోగింది. ఈ యజ్ఞంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శ్వేత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 650 మంది మహిళలను ఏకం చేసి, ఈ ఆధ్యాత్మిక క్రతువు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. గందె శ్రీనివాస్, సుద్దాల హరిశంకర్, గర్రెపల్లి శ్రీనివాస్, పుల్లూరి శ్రీకాంత్, బల్లు పున్నం, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య నాయకులు నార్ల రాజేందర్, ఎస్ఆర్పీ శివనాథుని వేణుగోపాల్, కటుకం మారుతి, శివనాథుని శ్రీనివాస్, కటుకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ కుట్టుపై శిక్షణ జూలపల్లి: మహిళలను అర్థికంగా బలోపేతం చేసేందుకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపై అవగాహన కల్పించారు. స్థానిక వెలుగు సమాఖ్య కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహించగా.. సమాఖ్య అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజరు సుధాకర్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 13 పంచాయతీల నుంచి 45 మంది మహిళలు శిక్షణకు హాజరయ్యారు. ట్రెయినర్లు మసూద, సీసీలు ఆనంద్, అనిత, అకౌంటెంట్ అనిత తదితరులు పాల్గొన్నారు. వైల్డ్లైఫ్ బయోలజిస్ట్కు ప్రశంసాపత్రం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కొత్తపల్లికి చెందిన జోగు ఎల్లం కవ్వాల్ టైగర్ రిజర్వ్లో వైల్డ్లైఫ్ బయోలజిస్టు(పులులు ఇతర వన్యప్రాణి నిపుణులు)గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉన్న అటవీ అధికారులు వన్యప్రాణులను సాంకేతికంగా గణన చేయడం, టైగర్ మానిటరింగ్లో శిక్షణ ఇస్తున్నందుకు ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ప్రశంసాపత్రం అందుకున్నారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ సంరక్షణాధికారి సువర్ణ చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్లో ప్రశంసాపత్రం అందుకున్నారు. -
యుద్ధాన్ని ఆపేందుకు చర్చించండి
కరీంనగర్టౌన్: ఒక దేశంపై మరో దేశం దాడులు చేయకుండా జరగాలంటే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని.. ఇందుకు ఐక్యరాజ్యసమితి, దేశ ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకోవాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డిభవన్లో సోమవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు చేస్తున్న యుద్ధంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుందన్నారు. ఈక్రమంలోనే వంటగ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలించి కొరత సృష్టిస్తున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ సంప్రదింపులు చేయాలని కోరారు. పార్లమెంటు సమావేశాల్లో అత్యధిక రోజులు పాల్గొన్నానని గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ దేశప్రజల ప్రయోజనాల కోసం ఏం చేశౠరో చెప్పాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, కార్పొరేట్ సంస్థలు బాగుపడ్డాయని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏప్రిల్లో ఇంటింటికీ సీపీఐ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి, బత్తుల బాబు, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య న్యాలపట్ల రాజు పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాగట్లపల్లి శివారులో సోమవారం రాత్రి రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన దంపతులు సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేట వైపునకు బైక్పై వస్తున్నారు. మండలంలోని అక్కపల్లికి చెందిన చిట్టిబాబు తన బైక్పై సిరిసిల్లకు వెళ్తున్నాడు. ఈక్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దంపతులతోపాటు చిట్టిబాబు గాయపడ్డారు. చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఒకరు మృతి చెందారు. వరుస ప్రమాదాలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. డివైడర్ను ఢీకొన్న ఆటో ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద సోమవారం వేకువజామున కప్ సాసర్ డివైడర్ను ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్ బొమ్మనవేణి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. రాచర్లబొప్పాపూర్కు చెందిన బొమ్మనవేణి రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నిత్యం ఉదయం కరీంనగర్ డెయిరీకి సంబంధించిన పదిర, పోతిరెడ్డిపల్లి, హరిదాస్నగర్ పాల కేంద్రాల నుంచి పాలు సేకరించి ఎల్లారెడ్డిపేటలోని డెయిరీలో డెలివరీ చేస్తుంటాడు. రోజు మాదిరిగానే పదిర నుంచి పాలు తీసుకొస్తుండగా మండల కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద గల కప్పుసాసర్ డివైడర్ను ఢీకొని ఆటో ఫల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న రాజును స్థానిక బీజేపీ నాయకులు గమనించి మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం రాజు కోమాలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
కరీంనగర్టౌన్: సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. రెండున్నరేళ్లుగా తమ వినతులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామంటూ ఇటీవల హైదరాబాద్లో ఎండీ వై.నాగిరెడ్డికి సమ్మె నోటీస్ అందజేయడంతో చాలా రోజుల తర్వాత ఆర్టీసీలో జంగ్ సైరన్ మోగనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడంతో కరీంనగర్ రీజినల్ పరిధిలోని 11 డిపోలలో ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 11 డిపోలు, 972 బస్సులు ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రీజినల్ పరిధిలో కరీంనగర్– 1, కరీంనగర్ 2, హుస్నాబాద్, హుజురాబాద్, మంథని, గోదావరిఖని, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల డిపోలలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు ఇతర సిబ్బంది మొత్తం 3,236 మంది సమ్మెలోకి వెళ్లనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అవసరమైతే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టి తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరిస్తేనే రవాణా సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని, లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనానికి నోటీసు ఈనెల 26 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధం ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో ఎండీకి నోటీస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 2017 నుంచి అలవెన్స్, బెనిఫిట్స్, వేతన సవరణ బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయడం, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్ చేయడం. 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతినెలా కోత విధించకుండా రూ.400కోట్లు ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు చెల్లించాలి. అన్ని కేటగిరిల్లో ఖాళీలు భర్తీచేసి అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రతీ కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలి. ఉద్యోగి కుటుంబానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సౌకర్యం కల్పించాలి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. రిటైర్డ్ కాబోతున్న ఉద్యోగులకు ఆదేరోజు సెటిల్మెంట్ మొత్తం చెల్లించాలి. -
గ్రామస్తులు ఇబ్బంది పడకుండా చర్యలు
● కలెక్టర్ చిత్రా మిశ్రా మానకొండూర్: నేషనల్ హైవే– 563 నిర్మాణంలో ఈదులగట్టెపల్లి గ్రామస్తులు దారి విషయంలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొన్నారు. మండలంలోని ఈదులగట్టెపల్లికి సర్వీస్రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు రోడ్డు పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కలెక్టర్ సర్వీస్ రోడ్డు స్థలాన్ని పరిశీలించారు. సర్వీస్ రోడ్డు నిర్మించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన ఇల్లందకుంట: మండలకేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్వినితాకాజీ వాకాడే పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసి, జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, ఏసీపీ మాధవి, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సహకారంతో సుందరీకరణ
జ్యోతినగర్: రామగుండం నగర ప్రజల సహకారంతో సుందరీకరణ పనులు చేపడతామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల రోడ్డు, ఎఫ్సీఐ క్రాస్రోడ్డు, రాజీవ్ రహదారి సర్వీసు రోడ్డులో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, స్వప్నప్రియ, ఎన్టీపీసీ ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్తో కలిసి సోమవారం పర్యటించారు. స్వామి మాట్లాడు తూ, ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టుకు నిర్మించిన ప్రహరీ ప్రమాదకరంగా ఉందన్నారు. ఓపెన్ డ్రైనేజీలో చెత్త పేరుకుపోయిందని, దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో కూల్చివేసిన సులభ్కాంప్లెక్స్ శిథిలాలను వెంటనే తొలగించి బస్షెల్టర్ను ప్రయాణికులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీకుకురావావాలని అన్నారు. త్వరలోనే ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు సెంటర్ను విస్తరించి, సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్, అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీస్సార్ ప్రత్యేక నిధులు కేటాయించాలి రామగుండం మేయర్ మహంకాళి స్వామి -
కులం పేరుతో దూషించిన వారిపై కేసు
చందుర్తి(వేములవాడ): సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో తలెత్తిన వివాదంలో కులం పేరుతో సర్పంచ్, ఉపసర్పంచ్తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్సై జిల్లెల రమేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ పదవి విషయంలో అదే గ్రామానికి చెందిన తర్రె శేఖర్కు సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, మరో వ్యక్తి సుంకి వేణులకు శనివారం రాత్రి వివాదం తలెత్తింది. ఈ వివాదంతో తర్రె శేఖర్ను సర్పంచ్ నరేశ్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, సుంకి వేణు కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు లింగంపేట ఆలయ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా.. ఈ వివాదాన్ని ప్రోత్సహించిన డప్పుల అశోక్పై కేసు నమోదు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాలను పాత ఆలయ కమిటీ పర్యవేక్షణలో చేసుకోవాలని, అల్లర్లు సృష్టించి, గొడవలకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లింగంపేటలో విచారించిన డీఎస్పీ శ్రీనివాసులు -
అమరవీరుల త్యాగాలతోనే స్వేచ్ఛ
● నగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్: అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం భగత్నగర్ చౌరస్తాలోని భగత్సింగ్ విగ్రహానికి పలువురు కార్పొరేటర్లతో కలిసి పూలమాల వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత అమరవీరుల స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. కార్పొరేటర్లు మాసం గణేశ్, భారీ అపర్ణ, పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్, నాంపల్లి రేణుక శ్రీనివాస్, కొమురయ్య, పొన్నం లక్ష్మి మొండయ్య పాల్గొన్నారు. సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఈ నెల 27న నగరంలోని నాలయాల్లో నగరపాలకసంస్థ తరఫున ఏర్పాట్లు చేయాలని మేయర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆలయాల వద్ద వాటర్ ట్యాంకర్లతో తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. సహాయ కమిషనర్ దిలీప్కుమార్, ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్కుమార్, ఎంహెచ్వో సుమన్, డీఈలు దేవేందర్, అరుణ్కుమార్, ఓంప్రకాష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పేషెంట్లతో జీజీహెచ్ కిటకిట
● ఒక్కరోజే 1,406 మంది పేషెంట్లకు వైద్యం కోల్సిటీ(రామగుండం): వరుసగా రెండురోజులపాటు సెలవులు రావడంతో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) సోమవారం పేషెంట్లతో రద్దీగా కనిపించింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఆస్పత్రికి సుమారు 1,406 మంది తరలివచ్చారు. వీరిలో మహిళలు 814 మంది, పురుషులు 476 మంది ఉండగా, మిగిలిన వారు పిల్లలు, ఇతర విభాగాలకు చెందినవారు ఉన్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్ల వద్ద బారులు తీరారు. వైద్యులు, సిబ్బంది వారికి సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. సెలవులతో ముందుగా చికిత్స పొందలేకపోయిన వారు ఒకేసారి రావడంతో రద్దీ నెలకొందని తెలుస్తోంది. పేషెంట్ల రద్దీ ఉన్నా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతీపేషెంట్కు ఓపిగ్గా వైద్య సేవలు అందించినట్లు ఆర్ఎంవో రాజు తెలిపారు. -
స్కాలర్షిప్ విద్యార్థుల హక్కు
కరీంనగర్టౌన్: స్కాలర్షిప్ విద్యార్థులకు భిక్ష కాదని, హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. పెండింగ్లో ఉన్న రూ.9,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బొమ్మకల్ బైపాస్ రోడ్లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇంజినీరింగ్, ఫార్మా కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ నందు, మురళి, యోగేశ్, శివ, ఆకాష్, అజయ్, యశ్వంత్, కాఫీ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.ఖైదీలకు వైద్య పరీక్షలుకరీంనగర్క్రైం: వందరోజుల హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా బీపీ, షుగర్, హెచ్ఐవీ, సిఫిలిస్, హైపటైటిస్ బి, సీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధా రాజేంద్ర, జైలు సూపరింటెండెంట్ జి.విజయదేని, డాక్టర్ కె.వేణుగోపాల్, జిల్లా ఎయిడ్స్ ప్రొగ్రాం మేనేజర్ సురేందర్రెడ్డి, కన్వీనర్ మహిపాల్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవేందర్ పాల్గొన్నారు. -
రైలులో ప్రయాణికుడి హఠాన్మరణం
రామగుండం: కర్ణాటక రాష్ట్రంలోని యెలహంక నుంచి మధ్యప్రదేశ్లోని గ్వా లియర్కు వెళ్తు న్న ప్రయాణికుడు ధర్మేంద్రసింగ్ రాథోర్(42) సోమవారం అస్వస్థతతో హఠాన్మరణం చెందాడు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి కథనం ప్రకారం.. బెంగళూరులో టైల్స్ వర్క్ చేసే ధర్మేంద్రసింగ్రాథోర్ రైలు నంబరు 11085లో ఆదివారం సాయంత్రం గ్వాలియర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తున్నాడు. బోగినంబరరు ఎస్–4లో పడుకున్న ప్రయాణికుడిని సోమవారం ఉదయం టికెట్ పర్యవేక్షకుడు నిద్రలేపారు. ఎంతకీ లేకపోవడంతో సెంట్రల్కు మెసేజ్ ఇచ్చాడు. అప్పటికే రైలు కాజీపేట దాటింది. బల్హార్షా వరకు హాల్టింగ్లేదు. అత్యవసరంగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిపి రైల్వే డాక్టర్తో పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ ధ్రువీకరించడంతో మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆధార్కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. బాలుడిని కాటేసిన కరెంట్ ● మెట్లకింద ఆడుకుంటుండగా విద్యుదాఘాతం ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు బొజ్జ అభిరాం(6) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభిరాం.. సమీపంలోని బల్ల కుమార్ ఇంటి వద్ద అడుకుంటూ ఉన్నాడు. ఈక్రమంలో మెట్ల కిందికి వెళ్లగా అక్కడఉన్న కరెంట్ ఎర్త్వైర్కు ప్రమాదవశాత్తు తగిలాడు. దానితో కరెంట్ షాక్కు గురై అక్కడకక్కడే మరణించినట్లు మృతి తండ్రి సంపత్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదఘటన చూసి.. భయంతో సొమ్మసిల్లి● మృతి చెందిన మహిళ రఘునాథపల్లి: హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెంకటాయపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రమాద ఘటనను చూసిన ఓ మహిళ తీవ్ర భయాందోళన చెంది మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల పుష్పలత (45) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. వెంకటాయపాలెం వద్ద టాయ్లెట్ కోసం కారు నిలిపి పుష్పలత కిందకు దిగగా, అదే సమయంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఘటనను చూసిన పుష్పలత సొమ్మసిల్లి పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. త్వరలో క్యాథ్ల్యాబ్ సేవలు గోదావరిఖని: సింగరేణిలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ పనులపై ఆ సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్రాజ్కుమార్ సోమవారం సమావేశమయ్యారు. రెనే హాస్పిటల్, హాస్పిటల్ వెండర్స్ మధ్య సమావేశం నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేసి త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. డాక్టర్లు బాలకోటయ్య, అంబికా, రాజేశ్వర్రావు, రమేశ్, రెనే హాస్పిటల్ చైర్మన్ బంగారి స్వామి, డాక్టర్లు పాల్గొన్నారు. -
కరీంనగర్
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20267సిటీలో పవర్కట్కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ ల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవా రం ఉదయం 10 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నగరంలో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈలు తెలిపారు. క్వింటాల్ పత్తి రూ. 7,550జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయవిక్రయాలను చైర్ పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తరు గాలులు వీస్తాయి. -
చికెన్ కుతకుత!
కరీంనగర్అర్బన్: చికెన్ ధర ఎన్నడూ లేనివిధంగా ఎగబాకింది. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా రి కార్డుస్థాయికి చేరగా వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ధర ఎక్కువగా ఉండటం సహజం. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా కో ళ్లను కాపాడుకోవడమే సవాల్. డిమాండ్కు సరి పడా ఉత్పత్తి లేక ధర పెరుగుతోంది. కాగా, సా ధారణ పరిస్థితుల్లో అసాధారణ ధర ఉండడం ఆందోళనకర పరిణామం. మరో పక్షం రోజులు గడిస్తే రూ.450 చేరడం లాంఛనమే. ప్రస్తుతం కి లో కోడి ధర రూ.185 కాగా, కిలో స్కిన్లెస్ చికెన్ రూ.350 ఉండగా రిటైల్ వద్ద మరింత ఎక్కువే. తినేవారికి తప్ప అందరికీ లాభాలే బాయిలర్ కోళ్ల పరిశ్రమ నాలుగునెలలుగా లాభాల బాట పడుతోంది. పౌల్ట్రీ రంగంలోకి కార్పొరేట్ శక్తులు రావడమే కాకుండా హెచ్చు కోళ్ల ఫారాలు వాళ్ల చేతికే చేరాయి. ఫారం యజమానులు ధరల హెచ్చుతగ్గుదలతో కంపెనీకే అప్పగిస్తున్నారు. యజమానులు నిర్వహిస్తున్నవి చాలా తక్కువే. కాగా ధరల నిర్ణయం సదరు కంపెనీలే నిర్ణయిస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఏ మాత్రం ఉండదు. కోళ్ల ఫారం నిర్వహణలో యువత అమితాసక్తి చూపుతుండగా లాభాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోడి పిల్లలు ఉత్పత్తి చేసేవారు, దాణా విక్రేతలు, ఫారాల నుంచి కోళ్లు వేసే ట్రేడర్లు, చికెన్ సెంటర్లకు లాభాలే తప్ప నష్టం చాలా తక్కువ. ఫారం యజమానులకే లక్కీ లాటరీల ఉండేది. కానీ.. మూడునెలలుగా అందరికీ లాభాలే. 6 నెలల క్రితం వరకు 2 వేల కోళ్లను యజమాని పెంచితే రూ.20–30వేల లాభం రాగా తాజాగా రూ.లక్షల నుంచి రూ.1.50 లక్షల లాభం వస్తోందని తెలుస్తోంది. కార్పొరేట్ శక్తుల రాకతో.. పౌల్ట్రీ పరిశ్రమలో కార్పొరేట్ శక్తుల రాకతో పౌల్ట్రీ రైతులు వెట్టిచాకిరికే పరిమితమవుతున్నారు. లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టలేని స్థితిలో రైతులు కార్పొరేట్ శక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్పొరేట్ శక్తులు కోడి పిల్లల నుంచి దాణా వరకు అంతా వారే సరఫరా చేస్తారు. అయితే రైతులు షెడ్తో పాటు విద్యుత్, కోళ్లను చూసుకోవాలి. 45 రోజుల పాటు కష్టపడాల్సి వస్తోందని, అయితే మార్కెట్లో ధర వచ్చాక కూడా తక్కువ ధరే ఇస్తున్నారని, గిట్టుబాటుకావడం లేదని రైతులు వాపోతున్నారు. పౌల్ట్రీ రైతులకు ఏదీ చేయూత పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ ప్రొత్సాహం కరువైంది. పౌల్ట్రీని ఏర్పాటు చేసుకునే రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని చెబుతున్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. పావలా వడ్డే కదా..ని చాలా మంది యువ రైతులు కరీంనగర్, హుజూ రాబాద్, చొప్పదండి, తదితర ప్రాంతాల్లో పోటీపడి బాయిలర్ కోళ్ల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకు రుణం ఇచ్చే సమయంలో పావలా వడ్డీ అని చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి తమకు ఏమి రాలేదని, రూ.1.10 చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 20లక్షల బాయిలర్, 5లక్షల లేయర్ కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు అంచనా. ధరలపై నియంత్రణ ఉంటేనే ప్రయోజనం ఇష్టారీతిగా చికెన్ ధరలు పెరుగుతుండగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికే గ్యాస్ కొరత, పప్పులు, నూనె ధర పెరగడంతో అదనపు భారం పడుతోంది. తాజాగా చికెన్ ధరలు పెరగడం మరింత భారమే. ప్రభుత్వ నియంత్రణలో వినియోగదారులు, కోళ్ల ఫారం నిర్వాహకులకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిలో రూ.350 -
పన్ను చెల్లించని కోచింగ్ సెంటర్కు తాళం
కరీంనగర్కార్పొరేషన్: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను బల్దియా అధికారులు వేగవంతం చేశారు. మొండి బకాయిదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం నగరంలోని 51వ డివిజన్ పరిధి కోర్టు సమీపంలోని 3–1–777, 3–1–3777/1, 3–1–3778, 3–1–778/1 ఇంటి నంబర్లలో ఉన్న కోచింగ్ సెంటర్ను డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్ తనిఖీ చేశారు. ఆస్తి పన్ను బకాయి చెల్లించక పోవడంతో సంబంధిత కోచింగ్ సెంటర్కు తాళం వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్తి పన్ను బకాయిదారులు సకాలంలో పన్నులు చెల్లించాలన్నారు. పన్ను చెల్లించనివారి షాప్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆదర్శంతో కూడుకున్న వృత్తి జర్నలిజంకరీంనగర్సిటీ: జర్నలిజం ఆదర్శంతో కూడుకున్న వృత్తి అని, సామాజిక బాధ్యత ఎంతో ఉంటుందని ఎస్సారార్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ పి.నితిన్పాఠక్, టి.రాజయ్య అన్నారు. సోమవారం కళాశాలలో 27వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్స్, తెలుగు విభాగం అధ్యక్షుడు, కోర్స్ కో ఆర్డినేటర్ డా.బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ ద్వారా విద్యార్థులకు భాష, రచనా నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. విలేకరి రాసే ప్రతి అక్షరం సమాజాన్ని జాగృతం చేసేలా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఎం.శ్రీనివాస్రెడ్డి, తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వెంకటేశ్వర్లు, డి.ప్రకాష్, ఆర్.శ్రీనివాస్, మెట్టు వెంకటేశ్వర్లు, పాత అశోక్. పి.చైతన్య, టి.భోజన్న, పి.శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
దాతలు స్పందించినా దక్కని ప్రాణం
జ్యోతినగర్: ‘అమ్మా.. బతకాలని ఉంది’ శీర్షికన ‘సాక్షి’ 2024లో కథనం ప్రచురించిన విషయం తెలిసింది. ఈ కథనానికి దాతలు స్పందించారు. చదువులతల్లి సిరి వైద్యానికి అండగా నిలిచారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని అనేకమంది ఆర్థికసాయం అందించారు. అయినా సిరి ప్రాణాలు దక్కలేదు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఆస్పత్రిలో కూనారపు సిరి(19) కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ కృష్ణానగర్లో నివాసముంటున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె సిరి చదువులో చాలాముందుండేది. అనారోగ్యంతో ఉన్న క్రమంలో ఆమె చికిత్సకు దాతలు సాయం అందించారు. తండ్రి కూడా తన తాహతుకు మించి వైద్యానికి ఖర్చు చేశారు. రెండు సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతూ సిరి తుదిశ్వాస విడిచింది. సిరి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చదువులతల్లి సిరి కన్నుమూత కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి -
షెడ్యూల్ వచ్చాక..
అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఎన్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఐదు మండలాల్లోని పీహెచ్సీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. షెడ్యూల్ రాగానే వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం. రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున మహిళా సంఘాల సభ్యుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తాం. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే దశల వారీగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో -
కీడు సోకిందని ఊరు ఖాళీ
జమ్మికుంట: జమ్మికుంట మండలం గండ్రపల్లిలో తరచూ ఏవరో ఒకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకిందని ఆదివారం వేకువజామున గ్రామస్తులందరూ ఊరును ఖాళీ చేశారు. ఊరి బయటకు వెళ్లి వంట చేసుకున్నారు. గ్రామంలో రెండు నెలలుగా ఒకరి దినకర్మ పూర్తి కాకుండా, మరొకరు చనిపోతున్నారని, గ్రామానికి కీడు సోకడమే ఇందుకు కారణమని గ్రామస్తులు భయాందోళన చెందారు. పండితుల సలహా మేరకు గ్రామ పెద్దల అలోచనలతో ఆదివారం సూర్యోదయనికి ముందుగా ఊరును ఖాళీ చేశారు. మానేరు పరివాహక, పొలాలు, చెరువు కట్టలపైకి వెళ్లి వంటలు చేసుకుని, అక్కడే భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: ఢిల్లీలో ఈ నెల 21నుంచి జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ వాలీబాల్ పోటీలకు శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్కుమార్ ఎంపికై నట్లు డీవైఎస్వో శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి, జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాజ్కుమార్ ఎంపికపై ఎస్జీ్ఎఫ్ కార్యదర్శి వేణుపాల్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, పెటా అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, పీడీలు, పీఈటీలు సీహెచ్ సంపత్ రావు, కొమురోజు కృష్ణ జిట్టవేణి శ్రీనివాస్, అనూప్రెడ్డి, వీర్పాల్రెడ్డి, సంతోష్, మహేశ్ హర్షం వ్యక్తం చేశారు. -
ఇన్చార్జీల విద్యాశాఖ
కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖలో ఇన్చార్జీల పాలన సాగుతోంది. జిల్లా విద్యాశాఖాధికారిగా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈవో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో మండలాల పరిధిలోని సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. దీంతో పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందోననే సందేహం నెలకొంది. అదనపు బాధ్యతలతో ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవోలు లేకపోవడంతో విద్యావ్యవస్థ పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన అమలు, సర్వశిక్షా అభియాన్ చేపట్టే విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంఈఓల పాత్ర కీలకం. ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న వీరి స్థానాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఇన్చార్జీలుగా నియమిస్తున్నారు. ఉపవిద్యాధికారులు ఇన్చార్జీలే జిల్లాలో విద్యావ్యవస్థపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పాఠశాలల నిర్వహణ, పనితీరు మధ్యాహ్న భోజనం అమలు, ఎస్ఎస్ఏ చేపట్టే ఇతర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి జిల్లా విద్యాధికారికి నివేదిక ఇవ్వాల్సిన ఉపవిద్యాధికారులు సైతం అందరూ ఇన్చార్జీలే. హుజూరాబాద్, కరీంనగర్, ఆర్ఎంఎస్ఏ పీవో, జిల్లా పరిషత్ డిప్యూటీ ఈవోలుగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇన్చార్జీల పాలనే కోనసాగుతోంది. పరీక్షల నిర్వహణ ఎలా మార్చి 14 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్టుమెంటల్ అధికారుల నియామకం మాత్రమే పూర్తయింది. ఇంటర్నల్ మార్కుల జాబితా బోర్డుకు పంపి ఆమోదం పొందాలి. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్స్క్యాడ్, సిట్టింగ్ స్క్యాడ్, రూల్ ఆఫీసర్ల నియమాకం చేపట్టాలి. ఇదంతా చేయడం కత్తిమీద సాములాంటిదే. ఈ విధులు నిర్వహించడం సీనియార్టీతో ముడుపడి ఉంటుంది. ఏ ఒక్కరి నియమాకంలో తేడా వచ్చిన పరీక్షల సమయంలో ఇబ్బందలు తప్పవు. ఇవన్నింటిని తట్టుకోవాలంటే రెగ్యులర్ డీఈవో తప్పనిసరి. పనులపై పర్యవేక్షణ ఎలా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో విద్యాశాఖ వ్యవస్థ గాడి తప్పుతోంది. జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణతో పాటు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలతో పాటు టైప్రైటింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడర్, డ్రాయింగ్, బీఎడ్, డీఎడ్ ప్రవేశ పరీక్షలు డీఈవో నిర్వహించాల్సి ఉంటుంది. డిప్యూటి ఈవో లేకపోవంతో ఈ బాధ్యతలను కూడా డీఈవోనే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వీటితో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఇన్చార్జీగా విధులు నిర్వహించేవారు శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పరిపాలన పరమైన ఇబ్బందులు తప్పవని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. డీఈవోతో పాటు 16 మండలాలకు ఎంఈవోలు ఇన్చార్జీలే హెచ్ఎంలకు అదనపు బాధ్యతలతో సతమతం -
లక్ష్యం.. ఆమె ఆరోగ్యం
కరీంనగర్: మహిళల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్హెచ్జీ) సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఐదు పీహెచ్సీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో చిగురుమామిడి, చొప్పదండి, ఇల్లందకుంట, గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని పీహెచ్సీల పరిధిలో మహిళలకు వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 13 వేలకు పై చిలుకు మహిళా స్వయం సహాయక (ఎస్హెచ్జీ) సంఘాలుండగా, వాటిలో 1.04 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా సెర్ప్, డీఆర్డీవో శాఖల ఆధ్వర్యంలో సీ్త్ర నిధితో పాటు పావలా వడ్డీ.. తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపిక చేయబడిన పీహెచ్సీల్లో రక్త నమూనా సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తారు. ఏవైన వ్యాధులు ఉన్నట్లు తేలితే వారికి వెంటనే చికిత్స అందిస్తారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. కుటుంబ ఆరోగ్యానికి మహిళల ఆరోగ్యం కీలకమనే భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన పీహెచ్సీల్లో మహిళల నుంచి రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తారు. ఇందులో భాగంగానే ఎస్హెచ్జీ సభ్యులకు అవసరమైన 32 రకాల వైద్య పరీక్షలు చేయించేందుకు సర్కారు సిద్ధమైంది. పరీక్షల్లో ఏవైనా వ్యాధులు బయటపడితే వెంటనే చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీ ణ ప్రాంత మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడమే కాకుండా, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. -
సుప్మా అధ్యక్షుడిగా జగన్గౌడ్
సిరిసిల్లటౌన్/సిరిసిల్ల ఎడ్యుకేషన్/కరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (సుప్మా) నూతన అధ్యక్షుడిగా రాజన్న జిల్లాకు చెందిన గుగ్గిళ్ళ జగన్గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఆదివారం సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన గోవిందవరం కృష్ణ, కోశాధికారి ధర్మపురికి చెందిన సంగోజు అంజయ్యను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో శాతవాహన పరిధిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్మా పూర్వ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శ్రీపాద నరేశ్, కొలనూరు శేఖర్రెడ్డి నూతన ప్రతినిధులను సత్కరించారు. -
రిమాండ్ ఖైదీకి అస్వస్థత
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిన కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు జగిత్యాల స్పెషల్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఎస్కార్ట్ మధ్య జగిత్యాల ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. తల, మెడనొప్పితో బాధపడుతున్న హరిబాబుకు వైద్యులు చికిత్స అందించారు. మధ్యాహ్నం తిరిగి సబ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సబ్ జైలర్ మొగిలేష్ తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతిఇబ్రహీంపట్నం: మండలంలోని భర్ధీపూర్ గ్రామానికి చెందిన చెట్టి వెంకటేశ్ (25) గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి అందులోనే పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 21న చేపలు పట్టేందుకు వెళ్లిన వెంకటేశ్ తిరిగి రాకపోవడంతో గోదావరి ప్రాంతంలో వెదికారు. నీటిలో శవమై కనిపించాడు. వెంకటేశ్ తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఒకరు..జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్డులోగల వాసవి కల్యాణ మండపం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని గాయపడిన వొద్ది హరీశ్(54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణంలోని గుట్టరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంతంలో నివాసముండే హరీశ్ శనివారం సాయంత్రం మిత్రులతో కలిసి కరీంనగర్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. పార్కింగ్ చేసిన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. పట్టణానికి చెందిన సయ్యద్ సాహిల్ తన ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా నడుపుతూ హరీశ్ను ఢీ కొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అతని మిత్రులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హరీశ్ కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..మెట్పల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన నీరటి రాజేశం(47), మగ్గిడి హరీశ్ శనివారం ద్విచక్రవాహనంపై వేంపేట నుంచి మెట్పల్లికి పనినిమిత్తం బయల్దేరారు. గెదే అడ్డుగా రావడంతో బైక్పై ఉన్న రాజేశం కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజేశంను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఏఎంసీ డైరెక్టర్ దంపతుల ఆత్మహత్యాయత్నం
ధర్మపురి/వెల్గటూర్: వెల్గటూ ర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ధర్మపురి మండలం రాయపట్నం వంతెనపైకి చేరుకుని గోదావరిలో దూకారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్థంభంపల్లికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మరోసారి గొడవ జరిగింది. రాత్రిపూట దంపతులిద్దరూ బైక్పై రాయపట్నం వంతెన వద్దకు చేరుకుని చెప్పులు, బండి, ఫోన్ వంతెనపై వదిలేసి భార్యాభర్తలిద్దరూ గోదావరిలో దూకారు. లింగయ్యకు ఈత రావడంతో చివరి క్షణంలో మనసు మార్చుకుని మునిగిపోతున్న తన భార్యను వంతెన పిల్లర్ వద్ద ఇనుప కొక్కానికి చీరతో కట్టి తాను కూడా ఇనుప కొక్కెం పట్టుకొని సహాయం కోసం కేకలు వేశాడు. అదే సమయంలో వ్యక్తిగత పని నిమిత్తం అటుగా వచ్చిన మంచిర్యాల జిల్లా గుళ్లకోట గ్రామానికి చెందిన యువకులు వారి అరుపులు విని సమీపంలో ఉన్న జాలర్లకు విషయం తెలపడంతో వారు డైరెక్టర్ దంపతులను కాపాడి తెప్పలపై బయటకు తెచ్చారు. అప్పటికే నీటమునిగి లింగవ్వ అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దంపతులిద్దరినీ అంబులెన్స్లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నట్లు తెల్సింది. అర్ధరాత్రి గోదావరిలో దూకిన వైనం సమయానికి రక్షించిన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కుటుంబ కలహాలే కారణమా..? -
గోదావరిలో క్రికెట్ ఆడి నిరసన
గోదావరిఖని: నిండు గోదావరి నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ఎండి పోయిందని పేర్కొంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి పిండప్రదానంన చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలోని ఇసుక తెన్నెలపై తొలుత క్రికెట్, అష్టాచెమ్మా ఆడి నిరసన తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం నిండు గోదావరి ప్రస్తుతం ఎండు గోదారిలా మారిందని పేర్కొన్నారు. గతేడాది గోదావరి నుంచి కేసీఆర్ ఫామ్హౌస్ ఎర్రవెల్లి వరకు పాదయాత్ర నిర్వహించిన విషయం విదితమే. కాగా, వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు సరిచేసి నీటిని నిల్వచేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా నిండి కుండాల ఉండే గోదావరిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడారిగా మార్చిందిని ఆరోపించారు. ఇన్నిరోజులు గడిచినా ఎందుకు రిపేర్లు చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి,ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు. బీఆర్ఎస్ నేతల వినూత్న కార్యక్రమం సీఎంకు పిండప్రదానం చేసిన నాయకులు -
అన్నదాతలకు డబుల్ ధమాకా
కరీంనగర్ అర్బన్: ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఏకకాలంలో చేరడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఎకరాకు రూ.2వేల సాయం అందించింది. ఆదివారం నుంచి రైతు భరోసా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో 2,14,311 మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.197.10కోట్ల నగదు నేటి నుంచి జమకానుంది. జిల్లాలో ఎక్కువమంది రైతులు వరితో పాటు ఇతర పంటలు సాగుచేస్తుంటారు. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేశారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు వ్యవసాయ డివిజన్లుండగా ఏఈవోలు అప్డేట్ చేసిన వివరాల ప్రకారం నేరుగా ఖాతాలకు జమ చేస్తున్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుండగా తదుపరి పెద్ద రైతులకు చేరుతాయని అధికారులు వెల్లడించారు. భూభారతి పోర్టల్ వివరాలు, ఖాతా వివరాలిచ్చిన రైతుల ప్రకారం వ్యవసాయ విస్తరణ అధికారులు లాగిన్లో క్రోడీకరించారు. సదరు వివరాల క్రమంలో పెట్టుబడి సాయం పడుతుందని వివరించారు. కొత్తగా 10వేల మంది పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ధరణి పోర్టల్లో నమోదైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 25 వరకు అవకాశముండగా భూములు కొన్న, కుటుంబాల్లో భూ పంపకాలతో కొత్తగా పేర్లు నమోదైన వారి పేర్లను ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. రైతుభరోసా పథకంలో యాసంగి సీజన్కు కొత్తగా 10వేల మంది రైతులు అర్హత పొందారు. హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో కొత్తగా నమోదైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కిసాన్ సమ్మాన్ రూ.21.92కోట్లు జిల్లా రైతులకు ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం వచ్చింది. 1,09,598 మంది రైతులకు రూ.21.92కోట్లు ఖాతాకు చేరాయి. ఇప్పటివరకు ఆరు విడతల్లో నగదు పంపిణీ కాగా ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో 72,939 మంది రైతులు రూ.14.58కోట్లు లబ్ధి పొందారు. రెండో విడతలో 93,763 మందికి రూ.18.75కోట్లు చేరాయి. మూడో విడతలో 96,558 మందికి రూ.19.31కోట్లు, నాలుగో విడతలో 1,03,024 మంది రైతులకు రూ.20.60కోట్లు, ఐదో విడతలో 1,06,558 మంది రైతులకు రూ.21.31కోట్లు వచ్చాయి. ఆరవ విడతలో 1,09,598 మంది లబ్ధి పొందారు.జిల్లా వివరాలు రెవెన్యూ గ్రామాలు: 206పోర్టల్లో పట్టాదారులు: 214311విడుదల కావాల్సిన నగదు: రూ.197.10కోట్లు -
శృంగేరి పీఠాదీశ్వర జయంతిలో కేంద్రమంత్రి సంజయ్
కరీంనగర్: కర్ణాటకలోని శ్రీశ్రీశ్రీ శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి అనంత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 76వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పాల్గొన్నారు. శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ నిర్వహించిన పలు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శృంగేరి శారదాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. శృంగేరి పీఠ తెలంగాణ బాధ్యులు వ్యాసోజల రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు. జల సంరక్షణకు పాటుపడాలి కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్/విద్యానగర్/కరీంనగర్స్పోర్ట్స్: జలసంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మేయర్ కొలగాని శ్రీని వాస్ అన్నారు. ఆదివారం ప్రపంచ జల దినో త్సవం సందర్భంగా వైశ్యభవన్లో మానేరు పర్యావరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాకాలంలో వాననీరు ఒడిసిపట్టుకోవాలనే ఆలోచన చేయకపోవడంతోనే ఇలాంటి పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. శాతవా హనరోడ్డులోని వాకర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నా రు. మానేరు పర్యావరణ సమితి అధ్యక్షుడు తోట లక్ష్మణరావు, 66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్, సర్వోదయ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ, స్వరాజ్యబాబు, నారా యణ, వెంకటేశం, సత్యనారాయణ పాల్గొన్నారు. పుస్తక పఠనంతోనే జ్ఞాన సముపార్జన కరీంనగర్టౌన్: వ్యక్తి విజయం జ్ఞానంతోనే సాధ్యమవుతుందని, జ్ఞానం నిరంతరం పుస్తకాలు చదవడం వల్ల వస్తుందని, అందరూ పుస్తకాలు చదవాలని స్వేరోస్ ఫౌండర్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివార కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో స్వేరోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుక్ రీడథాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలోకి వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిందన్నారు. ఆ టెక్నాలజీ పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన జ్ఞానంతోనే సాధ్యమైందని మరిచిపోవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరి చేత విక్టర్ ఈ ఫ్రాంకిల్ రచించిన అర్థం కోసం అన్వేషణ అనే పుస్తకాన్ని చదివించారు. స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మనోజ్, బాబు నాయక్, జిల్లా అధ్యక్షుడు అనిల్, ఆకినపల్లి శిరీష, అజయ్ పాల్గొన్నారు. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పెటా సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్గౌడ్ కోరారు. ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన పెటా సంఘం సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1,803 ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. 4,703 ఉన్నత పాఠశాలలకు 2,900 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. వ్యాయామ విద్యను మూల్యాంక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని, ప్రాథమికస్థాయి నుంచి ఉన్నత విద్య వరకు తప్పకుండా వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు ఉండాలన్నారు. పెటా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, కోశాధికారి డి.వీరపాల్రెడ్డి, రాష్ట్ర అసోసియేటెడ్ ప్రెసిడెంట్ గిన్నె లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లతో రైతులకు లాభం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో రైతులకు లాభం జరుగుతుంది. వ్యాపారులు క్వింటాల్కు రూ.1800కు మించి కొనడం లేదు. మార్క్ఫెడ్ కొంటే క్వింటాల్కు రూ.2400 ధర రానుంది. రైతులకు రూ.600 వరకు లాభం జరుగనుంది. – నల్ల రాజిరెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి(మం) మొక్కజొన్న కొనుగోలుకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొనుగోలుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొంటాం. ప్రభుత్వం నుంచి ఒక్కటి రెండు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశముంది. – ఎండీ.హబీబ్, మార్క్ఫెడ్ అధికారి, జగిత్యాల -
మాస్టర్ చాంపియన్ మనోహర్రావు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన తూముల మనోహర్రావు థాయ్లాండ్ దేశంలో జరిగిన ఏసియన్ రీజియన్ మీట్లో పాల్గొని హ్యామర్త్రో మాస్టర్ చాంపియన్స్ పోటీల్లో పతకం దక్కించుకున్నారు. ఇటీవల ఆ దేశంలో జరిగిన పోటీల్లో మూడోస్థానంలో నిలిచిన మనోహర్రావును ఆదివారం జిల్లాలోని క్రీడాసంఘాల నాయకులు, రిటైర్డ్ పీడీ, పీఈటీలు తదితరులు ఘనంగా సత్కరించారు. 70ఏళ్లకుపైబడి వయసు ఉన్న మనోహర్రావు ఇప్పటికీ అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలను సాధించి పెద్దపల్లి పేరును ఖండంతరాలు దాటించారని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్.రాజయ్య ప్రశంసించారు. భావిక్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని క్రీడా సంఘాల నాయకులు లక్ష్మీరాజం, తోట శంకర్, దేవసాని ధర్మయ్య అన్నారు. మనోహర్రావును సత్కరించుకోవడం సంతోషకరమన్నారు. ఇంజినీరింగ్ సీటు కోసమని.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు సాధించాలంటే క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలని, దీంతోనే సీటు సాధించే అవకాశం ఉంటుందని తెలియడంతో ఆటల వైపు దృష్టి సారించానని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ చైర్మన్, హ్యామర్త్రో పతక గ్రహీత తూముల మనోహర్రావు అన్నారు. అప్పట్నుంచి క్రీడలంటే ఇష్టంగా మారి ఇప్పుడు అనేక దేశాల్లో జరిగే పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో షపీ, కలీం, మాతంగి శ్రీఽనివాస్, శ్రీధర్, తూముల శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీధర్, రాజేశం, అక్కపాక నరేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. థాయ్లాండ్ పోటీల్లో ప్రతిభ ఖండాంతరాలు దాటించిన పెద్దపల్లి ఖ్యాతి -
మార్క్ఫెడ్ సిద్ధం
మక్కల కొనుగోలుకు జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. మొన్నటి వరకు క్వింటాల్కు రూ.3వేలు పలికిన ధర.. రైతుల చేతికి రాగానే క్వింటాల్కు రూ.1800కు పడిపోయింది. దీంతో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర రూ.2400 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వంపై రైతులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ అదేశాలు అందిన మరుసటి రోజు నుండే కేంద్రాలను ప్రారంభించాలని అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్రాలకు 9 నుంచి 10లక్షల క్వింటాళ్ల మక్కలు జిల్లాలో వరి తర్వాత మక్కనే 35వేల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారుల అంచనా. యాసంగిలో అనుకూల పరిస్థితులు నెలకొనడంతో ఎకరాకు సగటున 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు సగటున 40వేల నుంచి 80వేల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గన్నీసంచులు, ట్రాన్స్పోర్టు వ్యవస్థ సిద్ధం కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను ప్రధానంగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి గోదాంల్లో నిల్వ చేయనున్నారు. ఇందుకోసం లారీ యజమానులతో మాట్లాడి ట్రాన్స్పోర్టు వ్యవస్థను సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 నుంచి 4లక్షల గన్నీ సంచులను తెప్పిస్తున్నారు. మార్కెట్యార్డులు, సింగిల్ విండో కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలుతో వ్యాపారులు దారికి.. ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి మక్కలు వస్తున్నాయంటూ దళారులు ఓపెన్మార్కెట్లో రేటు తగ్గిస్తున్నారు. ప్రభుత్వ ధర.. వ్యాపారులు పెట్టే రేటుకు క్వింటాల్కు కనీసం రూ.600 నుంచి రూ.700 నష్టపోతున్నారు. ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగితే, కనీసం వ్యాపారులు ఆ రేటుకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయం జగిత్యాలలో 13 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికజగిత్యాల జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్న ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి, రాయికల్, బీర్పూర్, భీమారం, మేడిపల్లి మండలకేంద్రాల్లో 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తీర్ణం, రైతుల డిమాండ్ను బట్టి పెంచే అవకాశం ఉంది. మార్కెట్ కమిటీలు, డీసీఎం, సింగిల్ విండో కేంద్రాల్లో ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. -
సబ్సిడీ గ్యాస్.. తుస్!
కరీంనగర్ అర్బన్: మహిళలకు వంటింట చేయూతగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యతనివ్వగా 6నెలల పాటు రూ.500 మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లకు అందజేసింది. గ్యాస్ బుక్ చేసుకుని డోర్డెలివరీ అయిన తదుపరి మహిళల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. క్రమేణా ఖాతాలకు జమకాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆరా తీయడం, నిరాశగా వెనుదిరుగుతున్నారు. రూ.500 ఎవరి ఖాతాకు చేరుతున్నట్లు మహిళలకు గ్యాస్ కోసం ఇస్తామన్న రూ.500 ఎవరి ఖాతాకు చేరుతున్నాయన్నది స్పష్టత లేదు. మీమీ ఏజెన్సీ పరిధిలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని ఆరా తీస్తే గ్యాస్ ఏజెన్సీల వద్ద స్పష్టమైన సమాచారం లేదు. తమ వద్ద సమాచారం లేదని చెప్పడం పౌరసరఫరాలశాఖ అధికారులకే చెల్లు. జిల్లాలో 3.50లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 2.10లక్షల వరకు మహిళల పేరున గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని సమాచారం. ఈ లెక్కన ఒక్కసారి బుక్ చేస్తే రూ.10కోట్లు ఖాతాలకు చేరాల్సి ఉండగా ఏడాదికి 8 సిలిండర్లు లెక్కేసినా రూ.84కోట్లు జమ కావాల్సి ఉంది. నగరంలోని గణేశ్నగర్కు చెందిన సావిత్రికి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీలో కనెక్షన్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ దరఖాస్తు చేసింది. రెండు, మూడు సార్లు రూ.500 జమకాగా ఏడాదిన్నరగా జమ కావడం లేదు.జమ్మికుంట మండలం రామన్నపల్లికి చెందిన మర్రి సునీతకు ఇండెన్ గ్యాస్ కనెక్షన్ ఉంది. మూడుసార్లు రూ.500 ఖాతాలో జమవగా రెండేళ్లుగా జమవడం లేదు. రూ. 500కే గ్యాస్ అన్నరు.. అంతలోనే అటకెక్కించారని సునీత వాపోతోంది. ఇది వీరిద్దరి సమస్యే కాదు జిల్లావ్యాప్తంగా వేలమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. ఇండెన్ గ్యాసే కాదు భారత్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీల్లోనూ ఇదే దుస్థితి.సబ్సిడీ పడాల్సింది ఇలా ప్రస్తుతం వంట గ్యాస్ ధర: రూ.985వినియోగదారు చెల్లించాల్సింది: రూ.985సబ్సిడీ జమ కావాల్సింది: రూ.500పడుతున్న భారం: రూ.485ఏడాదికి వినియోగించే సిలిండర్లు: 8ఈ లెక్కన మహిళలకు నష్టం: రూ.4వేలుఅధికారులు ఏం చెబుతున్నారంటే రూ.500కే గ్యాస్ లబ్ధిదారులుగా ఉండాలంటే ఆధార్, బ్యాంకు, గ్యాస్ కనెక్షన్ లింక్ ఉండాలని, ఈ మూడు ఒకే పేరుతో లింక్ లేకపోతే డబ్బులు జమకావని చెబుతున్నారు. ఈకేవైసీ చేయకపోవడం అంటే రేషన్ కార్డు లేదా గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంకు వివరాల్లో తప్పులున్నా, డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్ అంటే ఒక కుటుంబానికి ఒక సబ్సిడీ మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్ చేయకపోతే సబ్సిడీ రాదని అధికారులు చెబుతుండగా మొదట్లో సబ్సిడీ పడి తదుపరి పడకపోవడంపై సమాధానం కరువైంది.జిల్లా వివరాలు జిల్లా జనాభా: 10,05,711 నివాసాలు: 2,58,485డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు: 3,50,000కమర్షియల్ కనెక్షన్లు: 80,000 -
ఖాతా ఇచ్చారో ఖతమే!
కరీంనగర్క్రైం: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? దాన్ని రెగ్యులర్గా వాడుతున్నారా..? ఎవరైనా ఖాతా నంబరు, పాస్ బుక్ అడిగితే ఇచ్చారా..? మీ అకౌంట్కు డబ్బులు పంపిస్తామని చెబితే నమ్మి సరే అన్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. వాళ్లు కాజేసిన డబ్బుతో లావాదేవీలు కొనసాగించేందుకు ఇతరుల బ్యాంకు ఖాతాలు వినియోగిస్తున్నారు. వీటినే మనీ మ్యూల్ ఖాతాలు అంటారు. ఈ అకౌంట్ల మోసాలు ఇప్పుడు జిల్లాలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలో పలువురు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు అందిస్తూ ఇటీవల పోలీసులకు చిక్కారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దారిని ఎంచుకోగా నేరం చేసిన వారందరూ 22 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. సైబర్ నేరాలు కొత్త పుంతలు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ద్దీ సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును వారి ఖాతాల్లో ఉంచకుండా ఇతరుల ఖాతాలను మళ్లిస్తుంటారు. ఇందుకు కీలక ఆయుధం ‘మ్యూల్ బ్యాంక్ ఖాతా లు’. కొందరు మధ్యవర్తులు కమీషన్కు ఆశపడి అమాయక వ్యక్తుల పేర్లతో లేదా స్వయంగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్ ఖాతాలు తెరిచి, వాటికి సంబంధించిన పాస్బుక్కులు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు దేశ, విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. సైబర్ మోసాల్లో బాధితుల నుంచి డబ్బు ముందుగా ఈ ఖాతాల్లోకి జమవుతుంది. తరువాత వేరే ఖాతాలకు బదిలీ చేయడం లేదా నగదుగా ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ఆ ఖాతాదారులకు, అప్పగించిన వారికి కమీషన్ ఇస్తుంటారు. ఉచ్చులో యువత ఈజీమనీ ఆశతో యువత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. కొందరికి ఖాతా ఇవ్వడానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు కమీషన్ ఇస్తున్నా రు. తాజాగా కరీంనగర్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్’లో అరెస్టయిన 12 మంది 22ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య వయసు కలిగిన యువకులే. ఈజీ మనీ సంపాదనకు అలవాటు పడి సైబర్ నేరగాళ్లకు సహకరించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సైబర్ నేరస్తులకు అప్పగించేవారు. కరీంనగర్లో నమోదైన ఓ సైబర్ మోసం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డబ్బు వెళ్లిన బ్యాంక్ ఖాతాలు ట్రాక్ చేశారు. లోతైన విచారణ జరిపి, 12మందిని అరెస్టు చేసి, బ్యాంక్ పత్రాలు, ఖాతాలు, సిమ్ కార్డులు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసుతోనే ఇంత మంది భయటపడ్డారంటే లోతైన దర్యాప్తు జరిగితే మ్యూల్ అకౌంట్ల ముఠాలో ఇంకా ఎంతమంది ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. మ్యూల్ అకౌంట్లలో ముందుగా బలయ్యేది ఖాతాదారులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నారు. ఈజీ మనీకి యువత బానిస కొవొద్దని, సైబర్ నేరగాళ్లకు సహకరించి, బంగారు భవితను నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు.తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు ఇవ్వడం చట్ట రీత్యా నేరం. డబ్బుల కో సం ఆశపడి వివరాలు ఇవ్వకూడదు. వాటితో నేరాలు జరిగితే నిందితులుగా కేసులు నమోదు చేస్తాం. సైబర్ నేరాలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత ఈజీ మనీ కోసం ఇలాంటి నేరాల్లో పడితే భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలియని వ్యక్తుల సూచనలతో బ్యాంక్ ఖాతాలు తెరవడం, సిమ్ కార్డులు ఇ వ్వడం, ఆన్లైన్ లావాదేవీల్లో పాల్గొనడం వంటి చర్యల నుంచి దూరంగా ఉండాలి. – గౌస్ ఆలం, కరీంనగర్ సీపీ -
పోటీ చేసి.. పెత్తనం చూపి
కరీంనగర్ కార్పొరేషన్: ‘మీరు కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారా..? జస్ట్ ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీలో ఉంటే చాలు కోరుకున్న పదవి చేతికొస్తుంది. ఇదేంటి..? పోటీలో ఉండాలి, ప్రజల ఆదరణ పొందాలి. రూ.లక్షల్లో ఖర్చు చేయాలి. ప్రత్యర్థిపై గెలవాలి. ఇవన్నీ లేకుండానే పోటీచేస్తే చాలు పదవి వస్తుందని ఎలా అంటున్నారని విసుక్కోకండి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ విడ్డూరం ఇదే. ఎన్నికల్లో గెలవడం అనేది ఇక్కడ అనవసరం. జస్ట్ పోటీచేస్తే చాలు పదవి వచ్చినట్లే. ఆ పదవి పేరే ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’. ఫ్లెక్సీలు, కార్లకు బోర్డులు వివిధ రాజకీయ పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే వారిని అప్పటి మట్టుకే అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అందరిని అభ్యర్థులనే అంటారు. గెలిచిన వారిని కార్పొరేటర్ అంటారు. ఓడిపోయిన వాళ్లకు పోటీచేసిన చరిత్ర మాత్రమే ఉంటుంది. కాని ఈ పద్ధతిని తిరగరాస్తున్న జిల్లాలో, ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో కొంతమంది నాయకులు, ఓడిపోయినా ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’ అనే పదవిని తమకు తామే సృష్టించుకుంటున్నారు. ఏకంగా వారి పేరిట ‘కంటెస్టెడ్ కార్పొరేటర్’, ‘కంటెస్టెడ్ ఎమ్మెల్యే’ అంటూ విజిటింగ్కార్డ్స్, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. కార్లకు బోర్డులు తగిలించుకుంటున్నారు. లేని ‘అధికారం’తో పెత్తనం పదవుల్లో లేని వాళ్లు, కేవలం పోటీచేశామనే సాకుతో సొంతంగా పదవులు సృష్టించుకుని అధికారులపై పెత్తనం సాగిస్తున్నారు. ‘కంటెస్టెడ్’ను పదవిగా మలుచుకొని పైరవీలు చేయడం, తమపై గెలిచిన వాళ్లకు సమాంతరంగా అధికారాన్ని చెలాయించాలనుకొనే కొత్త సాంప్రదాయం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఓటమిని విజయానికి మెట్టుగా మలచుకొని మరోసారి ప్రజాతీర్పుతో పదవులు సంపాదించుకోవాలి తప్ప ‘కంటెస్టెడ్’ పదవులను సృష్టించుకుని తమకు తాము పలుచన కావద్దంటూ రాజకీయ సీనియర్లు హితవు పలుకుతున్నారు.‘ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజా న్ తోఫా కిట్లు ఇచ్చింది. అధికార పార్టీగా కాంగ్రెస్ నేతలు నగరంలోని ముస్లిం కుటుంబాలకు అందించారు. రంజాన్ తోఫా కిట్లను తనకు కూడా ‘వాటా’ ప్రకారం కేటాయించాలంటూ ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’ ఒకరు, నగరానికి సంబంధించిన ఓ అధికారికి ఫోన్చేశారు. తనకు వెంటనే కిట్లు పంపించాలంటూ హుకూం జారీ చేశారు. ఇంతకు మీరెవరు అని సదరు అధికారి ప్రశ్నిస్తే, తాను ఫలానా పదవికి సంబంధించిన ‘కంటెస్టెడ్ క్యాండిడేట్’నంటూ సెలవివ్వడంతో ఆ అధికారి అవాక్కయ్యాడు.’ ‘నగరంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఓ యువకుడు బైక్పై వేగంగా వచ్చి ఆగాడు. పోలీసులు బ్రీత్ఎనలైజర్ పరీక్ష చేస్తుండగా సదరు యువకుడు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాలంటూ పోలీసులకు ఇచ్చాడు. ‘ఆ పిలగాడు మనోడే వదిలేయండి..’ అని అవతలి నుంచి ఆర్డర్ వచ్చింది. ఇంతకు మీరెవరంటూ పోలీసులు ప్రశ్నిస్తే ‘నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే’ను అంటూ సమాధానం ఇవ్వడంతో ఖంగు తినడం ఖాకీల వంతైంది.’ -
గొర్రెల మందపై దూసుకెళ్లిన కారు
● కాపరికి తీవ్రగాయాలు.. 6 గొర్రెల మృత్యువాత సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం గొర్రెలమందపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాపరికి తీవ్రగాయాలు కాగా ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. గొర్రెలను తప్పించే క్రమంలో అదుపుతప్పి వాటిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పట్టణంలో శాసీ్త్రనగర్కు చెందిన కాపరి మేకల రాజుకు తీవ్రగాయాలు కాగా ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరోనాలుగు తీవ్రంగా గాయపడ్డాయి. కారు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కాపరి రాజును వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
‘పాడి’పై తిరుగుబాటు!
జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేతలు తిరుగుబాటుకు దిగడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై మొదటి నుంచి పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పలుమార్లు అధిష్టానం వద్దకు పంచాయితీ వెళ్లినా మార్పు రావడం లేదని శుక్రవారం రాత్రి మరోసారి రహస్య సమావేశం అయ్యారు. ఇందుకు జమ్మి కుంట పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు వెంచర్ వేదిక కాగా.. నియోజకవర్గస్థాయి నాయకులు హాజరై తమ అసంతృప్తిని వెల్లగక్కినట్లు సమాచారం. పార్టీ అధిష్టానా న్ని కలిసి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే దూకూడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారని పేరుంది. ఇతర పార్టీలతో పాటు తమ పార్టీ నాయకులపైనా విరుచుకపడతారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సి పల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఒంటెద్దుపోకడగా వ్యవహరించార ని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై పార్టీ సీనియర్ నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శుక్రవారం రాత్రి జమ్మికుంటలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు రహస్యంగా సమావేశమయ్యారు. తీరుమారకుంటే ఉద్యమ పార్టీకి గుడ్బై చెప్పి అధికార పార్టీలో చేరే అంశంపై చర్చ జరిగిందని తెలిసింది. ఈ పంచాయితీని త్వరలోనే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అధిష్టానం కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
లక్ష మందికి ఉపాధి లక్ష్యం
2030 నాటికి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించి లక్ష మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నాను. ప్రముఖ కంపెనీల కొలాబ్రేషన్తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను. ‘అల్ఫా సర్కిల్’ను ప్రపంచ వ్యాప్తం చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలగా అనుకున్నది సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను. మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తా. – పుల్లూరి శ్రీకాంత్, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు -
పీఎస్కే.. బ్రాండ్ సెట్టర్
● కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి.. ● వ్యాపారవేత్తగా రాణిస్తున్న సిరిసిల్ల యువకుడు ● వంద మందికి పైగా ఉపాధి ● నేటి యువతకు స్ఫూర్తి పుల్లూరి శ్రీకాంత్సిరిసిల్ల: ఏం చదివామనేది ముఖ్యం కాదు.. చివరికి ఏ స్థాయిలో ఉన్నామనేదే ప్రధానం. నలుగురు నడిచిన దారిలో వెళ్లడం సాధారణం.. మనమే ఓ దారిని వేసుకెళ్లడం వినూత్నం. ఈ కోవలోకే వస్తారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్. తన పేరుతోనే ఓ కంపెనీని మొదలుపెట్టి ఓ బ్రాండ్గా మలచడంలో సక్సెస్ అయ్యారు. వ్యాపార కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ చదివారు. సాఫ్ట్వేర్ చదివి హార్డ్వేర్ వ్యాపారంలోకి దిగారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో హైదరాబాద్లో కంపెనీని ఏర్పాటు చేసి హోల్సేల్గా భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇంజినీరింగ్ చదువు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన శ్రీకాంత్.. ప్రస్తుతం వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీఎస్కే కంపెనీ వ్యవస్థాపకులు పుల్లూరి శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ. – వివరాలు 8లో.. -
అంజన్నకు కేంద్రమంత్రి బండి పూజలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ శనివారం పూజలు చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, వైస్ మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లతో కలిసి ఆలయానికి చేరుకోగా.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆలయ ఈఓ అంజారెడ్డి, సర్పంచులు సంకూర్తి తిరుపతి, వకుళాభరణం మౌర్య, బీజేపీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, ఉప సర్పంచ్ మల్లేశ్ యాదవ్, నాయకులు బొట్ల ప్రసాద్, కొల్లూరి గంగాధర్, బొబ్బిలి వెంకటస్వామి, కెల్లెటి రమేశ్, గుండేటి గంగారాం, ఆలయ సిబ్బంది హరిహరనాథ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిరాయికల్: రాయికల్ మండలం ధర్మాజీపేటకు చెందిన గిరిజన నాయకుడు గుగ్లావత్ చిరంజీవి (40) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుగ్లావత్ చిరంజీవి గ్రామంలోని కుంటలో చేపలు పట్టడానికి శనివారం వెళ్లాడు. పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న వైరు నీటిలో ఉండటంతో గమనించకుండా కుంటలోకి దిగాడు. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. చిరంజీవికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిరంజీవి అఖిల భారత బంజార గిరిజన సేవ సంఘ్ మండల అధ్యక్షుడిగా గిరిజనులకు సుపరిచితులు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, గిరిజన నాయకులు సంతాపం ప్రకటించారు. అనుమానాస్పద స్థితిలో లస్కర్..చిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ కెనాల్ దగ్గర లస్కర్గా పనిచేస్తున్న చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన తడిగొప్పుల మల్లయ్య (55) శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్గౌడ్ తెలిపారు. శుక్రవారం రాత్రి మల్ల య్య, అనిల్ కెనాల్పై డ్యూటీ చేశారు. రాత్రి కెనాల్ వద్దే నిద్రించారు. శనివారం ఉదయం అనిల్ నిద్రలేచి చూడగా మల్లయ్య కనిపించలేదు. కొద్దిదూరంలో ఉన్న గూడ తిరుపతి పొలం వద్ద అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎండుతున్న పంటలు
చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలు పశువుల పాలు అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం వృథా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నవాబుపేట్, కొండాపూర్, ఉల్లంపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి, చిగురుమామిడి, లంబాడిపల్లి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఈ గ్రామాలకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు రావల్సి ఉండగా పనులు సాగడం లేదు. దీంతో బావులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పొలాల్లో పశువులను మేపుతున్నారు. -
పరిశ్రమలు
ఉద్యమ్ పోర్టల్ ద్వారా 2025 డిసెంబర్ 22వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నమోదు చేసుకున్న వారిలో కరీంనగర్ టాప్లో నిలిచింది. ఆ తర్వాత జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కువ యూనిట్లు తయారీ రంగంలో కన్నా సేవారంగంలో నమోదై ఉన్నాయి.51,875కరీంనగర్జగిత్యాలసిరిసిల్లపెద్దపల్లి -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
● దుబాయ్ వెళ్లినా తీరని కష్టాలు ● అసంపూర్తిగా ఇందిరమ్మ ఇల్లు ● వీర్నపల్లి మండలం శాంతినగర్లో విషాదం వీర్నపల్లి(సిరిసిల్ల): అప్పులు కుప్పలుగా మారి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ అన్నదాత ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్కు చెందిన గుగులోత్ గోపాల్(40) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించకపోవడంతో ఇటీవల స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు తోడై గుదిబండలా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇంటి పనులు మొదలుపెట్టాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నుంచి బిల్లులు సరిగ్గా రాకపోవడంతో ఆ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఒకవైపు అప్పుల ఒత్తిడి, మరోవైపు గూడు లేని వేదనతో గోపాల్ శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోడ్డున పడ్డ కుటుంబం గోపాల్ మరణంతో అతని భార్య నిర్మలతోపాటు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె సరస్వతి ఇంటర్ సెకండియర్, రెండో కుమార్తె శిరీష పదో తరగతి, కుమారుడు జగ్గు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. లారీ ఢీకొని చిన్నారి మృతిశంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో శనివారం రాత్రి లారీ ఢీకొని నిత్య(3) మృతి చెందింది. కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు పక్కన కత్తులు, కొడవళ్లు, తయారు చేసే శ్రావణ్–పంచబూలకు నలుగురు కూతుళ్లు. మూడో కూతురు నిత్య రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నిత్య అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదాణానికి కారణమైన లారీని డ్రైవర్ ఆపకుండా పరారయ్యారు. కేశవపట్నం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
కొడిమ్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడిమ్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ వివరాల ప్రకారం.. నాచుపల్లికి చెందిన గుగ్గిళ్ల పవన్ (27) ఏడేళ్ల క్రితం డెయిరీఫాం ప్రారంభించాడు. నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. బ్యాంకు లోన్ భారంతో మనస్తాపానికి గురై ఈనెల 13న ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పవన్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్మపురిలో వివాహిత.. ధర్మపురి: భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పటించగా చికిత్స పొందుతూ వివాహిత శనివారం మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ధర్మపురిలోని ఎస్సీ కాలనీకి చెందిన బడగు నవీన్, మండలంలోని తుమ్మెనాలకు చెందిన రమ్య నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో రమ్య పుట్టింటికి వెల్లింది. రమ్యపై కోపం పెంచుకున్న నవీన్ ఈనెల 16న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గాయపడిన రమ్యను వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. -
తక్కువ ధరకే మెడిసిన్
● కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్: రాష్ట్రంలో మందుల కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. మెడిసిన్ కొనుగోలుకు పేదలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు తెరిచి చౌక ధరకే మెడిసిన్ అందిసున్నారన్నారు. మేయర్ శ్రీనివాస్ ఉన్నారు. ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్లను మంత్రి పొన్నంప్రభాకర్ శనివా రం ఆవిష్కరించారు. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు మంత్రిని శాలువాతో సత్కరించారు. ఇన్చార్జి ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేశ్, నారాయణరెడ్డి, రాజేందర్, మల్లేశ్, రామ్రెడ్డి, నగేశ్ పాల్గొన్నారు. వెండి ఆభరణాలు అందజేత శ్రీస్వామివారికి హుజూరాబాద్కు చెందిన కోరె ం నరసింహరెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీదే వి, కుటుంబసభ్యులు హరీశ్, ప్రతాప్ రెడ్డి, హిరెన్ రూ.21 లక్షల విలువైన 7.64 కిలోల వెండి ఆభరణాలు ఆలయానికి అందజేశారు. నూనె గింజల సాగుపై దృష్టి పెట్టాలిచిగురుమామిడి: రైతులు వరి కన్నా నూనె గింజలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల పంటలపై దృష్టిసారించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కరీంనగర్ హెడ్ ప్రొఫెసర్ హరికృష్ణ కోరారు. శనివారం చిగురుమామిడి మండలం ముదిమానిక్యం గ్రామంలో ఎరువుల వినియోగం– నూనె గింజల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక మోతాదులో ఎరువులు వాడి నేలను కలుషితం చేయవద్దని సూచించారు. పంట మార్పిడి ద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. సర్పంచ్ బోయిని రమేశ్ మాట్లాడుతూ రైతులు పంట వైవిద్యీకరణ, నేల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. ఏవో పున్నం చందర్, ఏఈవో ఆకుల ప్రణయ్, ఉపసర్పంచ్ పూదరి పర్శరాములు పాల్గొన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించాలికరీంనగర్ టౌన్: రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు శనివారం బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యుడు సందేశ్, మానస, సన్నీ, నరేశ్, నగేశ్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, సహాయ కార్యదర్శులు అశోక్, అరవింద్ పాల్గొన్నారు. -
దివ్యా.. నీ వెంటే నేను
ఇల్లందకుంట: అతనో ఎస్సై.. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితం. ఈ నెల 17న కడుపునొప్పి బాధ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేని ఎస్సై సైతం నీవెంటే నేనంటూ.. శనివారం అత్తగారింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలు కాగా.. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన దేసు చంద్రశేఖర్(36) ప్రస్తుతం కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య(30)తో 2016లో వివాహమైంది. నగరంలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శుభమన్యు(4) అశ్వద్ధామ(7) ఉన్నారు. దివ్య ఆత్మహత్యతో... అన్యోన్యంగా సాగుతున్న వారి జీవన ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దివ్య కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 17వ తేదీన గన్నేరుపువ్వు, ఆకు పసరు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివ్య పుట్టినిల్లు అయిన ఇల్లదంకుంట మండలం సీతంపేటకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల సమయంలో దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించారు. దివ్య తండ్రి చంద్రశేఖర్ను ఓ గదిలో ఉంచి తాళం వేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు. బట్టలు మార్చుకుంటానని వెళ్లి.. భార్య మృతితో చంద్రశేఖర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడో రోజు కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. శనివా రం ఐదవ రోజు కార్యక్రమం జరిగింది. శ్మశాన వాటిక వద్ద కార్యక్రమం పూర్తిచేసుకుని అంతా ఇంటికొచ్చారు. బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ గడియపెట్టుకుని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకున్నాడు. గదిలోంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో చంద్రశేఖర్ తల్లిదండ్రులు, తమ్ముడూ అక్కడే ఉన్నారు. అనాథలైన పిల్లలు భార్య, ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు కమ్ముకోవడంతో చంద్రశేఖర్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్య మృతి చెందడంతో మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని మరవక ముందే ఐదు రోజుల వ్యవధిలో తండ్రి కూడా దూరమవడంతో పదేళ్లలోపు పిల్లలిద్దరూ ‘మమ్మీ,డాడీ’ అంటూ రోదించడం అక్కడివారిని కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్ తమ్ముడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మాధవి వివరించారు. భార్య మృతిని తట్టుకోలేక కరీంనగర్ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్న భార్య దివ్య ఐదు రోజుల వ్యవధిలో దంపతుల మృతి అనాథలైన ఇద్దరు చిన్నారులు సీతంపేటలో విషాదంఅదే నా చివరి కోరిక అంటూ..చంద్రశేఖర్ చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ.. ‘నేను ఒకవేళ చనిపోతే.. నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి’ అంటూ చెప్పాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సీతంపేటకు తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించి, దివ్య అంత్యక్రియలు చేసిన చోటే చంద్రశేఖర్ మృతదేహాన్ని ఖననం చేశారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
సాలెహ్నగర్లో సందేశం వినిపిస్తున్న ముస్లిం మతపెద్దకరీంనగర్ కల్చరల్: రంజాన్ పండుగను శనివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల ప్రసంగాలు విన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దానధర్మాలు ఆచరించారు. బంధు, మిత్రులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద ముప్తీ ఘియాస్ మొహిముద్దీన్ దైవ సందేశం ఇచ్చారు. సీపీ గౌస్ ఆలం ప్రార్థనల్లో పాల్గొన్నారు. వన్టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్న పురానీ (ఖదీమ్షాహి) ఈద్గా, చింతకుంట ఈద్గా, ఆయా గ్రామాల్లోని మసీదుల వద్ద ప్రార్థనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు పర్యవేక్షించారు.రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న చిన్నారులు -
సమయం తక్కువ.. ఖర్చు ఆదా
గాల్లో చెక్కర్లు కొడుతూ దూసుకుపోతోంది డ్రోన్. ఒకప్పుడు పెళ్లి వేడుకలనే చిత్రీకరించిన డ్రోన్.. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ దూసుకెళ్తోంది. ఎరువులు, పురుగుమందులను పంటలపై పిచికారీ చేయడంలో తాను సైతం అంటోంది. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా తక్కువ నీటితో, ఖర్చు ఆదా చేస్తూ పురుగుమందులు, ఇతర మందులు పిచికారీ చేస్తోంది. పెద్దపల్లి శివారు నిట్టూరులోని వరి పొలాల్లో డ్రోన్తో పిచికారీ చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు కొందరు రైతులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
రూ.1.50లక్షల విరాళం
మల్యాల: హైదరాబాద్కు చెందిన పార్కంపేట వెంకటేశ్ దంపతులు శుక్రవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఉచిత నిత్యాన్నదానం కోసం తమవంతుగా రూ.1.50లక్షలు అందజేశారు. ఈవో అంజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు యువకుల అరెస్ట్మానకొండూర్: మానకొండూర్ మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన అనిల్రెడ్డి, లింగాపూర్ గ్రామానికి చెందిన భరత్ గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ శ్రీలత శుక్రవారం తెలిపారు. మానకొండూర్ రైస్మిల్లుల వద్ద గంజాయి సేవిస్తుండగా పట్టుకుని రిమాండ్కు పంపినట్లు వివరించారు. -
ఇలాగైతే ఆడేదెలా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మానసిక, శారీరక వికాసం సాధించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల స్థాయిలో క్రీడలపై శ్రద్ధ చూపుతున్న విద్యాశాఖ కళాశాల స్థాయిలో పట్టింపు కరువైంది. విద్యార్థులు స్కూల్ లెవల్లో వివిధ పోటీల్లో పాల్గొన్న వారు ఇంటర్కు వచ్చేసరికి శిక్షకులు లేక నైపుణ్యం కరువైంది. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సైతం శిక్షణకు దూరమై వివిధ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండు డిగ్రీ, పది ఇంటర్ ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో మినహా ఎక్కడ కూడా పీడీ(ఫిజికల్ డైరెక్టర్)లు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. లెక్చరర్లతోనే శిక్షణ ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఒక్కో కాలేజీకి రూ.10వేలు కేటాయించింది. ఈ నిధులతో క్రీడా సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. కానీ విద్యార్థులకు ఆటలపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చే పీడీలు లేరు. దీంతో కాలేజీలోని వివిధ సబ్జెక్టుల అధ్యాపకులే ప్రతీ శనివారం సాయంత్రం శిక్షణ ఇస్తున్నారు. వీరి శిక్షణలో విద్యార్థులు పెద్దగా ఆటలపై పట్టు సాధించడం లేదు. దీంతో వీరు ఏ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్న పతకాలు రావడం లేదు. ఇదే సమయంలో గురుకులాల్లో ప్రత్యేక శిక్షకులు ఉండడంతో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు నిత్యం సాధన చేస్తూ వివిధ క్రీడావిభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. వారికి ఉన్నత విద్యలో స్పోర్ట్స్ విభాగంలో రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. క్రీడాకోటాలో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సైతం సాధించారు. గురుకుల విద్యార్థులకు క్రీడలతో లబ్ధి జరుగుతుండగా ప్రభు త్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మాత్రం ఆ ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో పీడీలు కరువు విద్యార్థులకు అందని క్రీడాశిక్షణ క్రీడాసామగ్రికి నిధులు.. శిక్షకులు కరువు జిల్లాలో 10 జూనియర్, రెండు డిగ్రీ కళాశాలలు ఆటలకు దూరంగా విద్యార్థులు -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
మెట్పల్లి (కోరుట్ల): పట్టణంలోని ఆర్టీసీ బస్స్టేషన్ ఇన్ గేట్ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శాంతినగర్కు చెందిన దుర్గయ్య(65) ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్గేట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, అదే సమయంలో వేగంగా లోపలికి వస్తున్న బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. రాజన్న గుడి వద్ద నాగుపామువేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజేశ్వరపురం వద్ద నిర్మాణం పనుల ప్రాంతంలో శుక్రవారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చేరుకుని నాగుపామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. సివిల్ సప్లయ్ అధికారుల తనిఖీలు మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలోని పలు హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఆరింటిని సీజ్ చేశారు. 6 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. డీసీఎస్ రవీందర్రెడ్డి, సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్ వెంకటరాజిరెడ్డి, ఆర్ఐ అనిల్రెడ్డి పాల్గొన్నారు. పిడుగుపడి ఎద్దు మృతి ఇల్లంతకుంట(మానకొండూర్): పిడుగుపడి శుక్రవారం తెల్లవారుజామున ఎద్దు మరణించింది. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో కేశవేణి ఎల్లయ్యకు చెందిన పశువుల కొట్టం వద్ద రెండు ఎడ్లను కట్టివేశాడు. శుక్రవారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగు పడడంతో ఒక ఎద్దు చనిపోయింది. గతేడాది హఠాత్తుగా ఒక ఎద్దు చనిపోయిందని, ఇప్పుడు మరో ఎద్దు చనిపోవడంతో అప్పులపాలైనట్లు రైతు రోదించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
తాపీమేసీ్త్ర ఆత్మహత్య
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి గ్రామానికి చెందిన మట్ట రాజయ్య(48)ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజయ్యమేసీ్త్ర పనిచేస్తున్నాడు. కొందరి వద్ద డబ్బులు తీసుని ఇళ్లు నిర్మిస్తూ ఇచ్చేవాడు. ఈక్రమంలో అప్పుల పాలయ్యాడు. కొందరు యజమానులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో వారు ఇళ్లు ఎప్పుడు కట్టిస్తావని తరచూ అడిగారు. మనస్తాపం చెందిన రాజయ్య రత్నాపూర్లో స్లాబ్వర్క్ ఉందని చెప్పి శుక్రవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లలేదు. భార్య ఓదేమ్మ ఫోన్చేసినా లిఫ్ట్ చేయలేదు. తన తమ్ముడు రాజాపూర్లోని కలవేన సంపత్కు ఆమె ఫోన్చేసి విషయం చెప్పింది. అతడు రాజాపూర్లోని ఓ కొత్త ఇంటికి వెళ్లి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తన భర్త మరణంపై అనుమానాలు లేవని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి అక్కడే ఫిర్యాదు స్వీకరించి అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. రుద్రంగిలో చిరుత కలకలంరుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన నాగారం బొర్రయ్య రైతు పొలం వద్ద ఉన్న కాపాల కుక్కపై చిరుత దాడి చేసి చంపేసింది. రోజు మాదిరిగానే గురువారం రాత్రి ఆవులు, గేదెలను పాకలో కట్టేసి, రెండు కుక్కలను కాపలాగా కట్టేశాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా ఒక కుక్కను చిరుత చంపివేసింది. కుక్కను రూ.8 వేలకు కొన్నట్లు రైతు బొర్రయ్య తెలిపాడు. గతంలోనూ ఇదే ఏరియాలో లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఫారెస్టు ఆఫీనర్ రవీందర్ను వివరణ కోరగా చిరుత ఆనవాళ్లు కనిసించలేదన్నారు. కుక్కపై దాడి చేసిందని హైనా కావచ్చని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తూ కుక్కను చంపిన ప్రదేశాన్ని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మోతీరాం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పూజలు చేస్తామని నమ్మించి ఆభరణాలు చోరీ
కాల్వశ్రీరాంపూర్: పూజలు చేస్తామని నమ్మించి మత్తుమందు చల్లి బంగారు నగలు, నగదుతో ఉడాయించిన దొంగబాబా ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోనె లక్ష్మి– రాజారాం దంపతులు, దామెర మొగిలి, బందెల కలమ్మ మల్లయ్య ఇంటికి సోమవారం వెళ్లిన దొంగ బాబా.. మీపై ఇతరుల దృష్టి పడిందని, పూజలు చేస్తే దోషం తొలగిపోతుందని నమ్మించాడు. ఇందుకోసం ఆభరణాలు, నగదు అవసరమని చెప్పా రు. ఈక్రమంలో వారు అవి అప్పగించగా వాటిని పట్టుకుని వెళ్లాడు. సుమారు రూ.లక్ష నగదు, తులంన్నర బంగారు ఆభరాణాలు పట్టుకుని పోయాడు. మళ్లీ బుధవారం తీసుకు వస్తానని చెప్పి వెళ్లిన బాబా తిరిగి రాక పోయే సరికి తాము మోసపోయామని గమనించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిమ్మపల్లిలో మూడిళ్లలో దొంగతనానికి యత్నం కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో శుక్రవారం దొంగతనానికి యత్నించారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. నిమ్మపల్లికి చెందిన ఇద్దగిరి మల్లేశం గల్ఫ్కు వెళ్లగా భార్య సుజాత బంధువుల ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఇంటికి తిరిగి రాగా తాళం పగులగొట్టి ఉంది. అయితే ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. అదే గ్రామానికి చెందిన ఇద్దగిరి మల్లయ్య(తండ్రి చిన్నమల్లయ్య), ఇద్దగిరి మల్లయ్య( తండ్రి రాజయ్య) ఇళ్లల్లోనూ చోరీకి యత్నించారు. కోనరావుపేట పోలీసులు విచారణ చేపడుతున్నారు. పుస్తెలు దొంగిలించిన ఇద్దరి రిమాండ్ సిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రంలోని సాయినగర్లో మహిళ మెడలోని బంగారు పుస్తెలు దొంగిలించిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాశినగర్కు చెందిన సయ్యద్ మౌలానా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన మంగూరు ప్రకాశ్యాదవ్ను శుక్రవారం రిమాండ్కు తరలించారు. వారి నుంచి బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. ఈనెల 17న రాత్రి సాయినగర్ ఏరియాలో మేర్గు లత ఇంటి గేటు బయటకు రాగా, ఇద్దరు వ్యక్తులు అడ్రస్ అడిగినట్లు నటించి ఆమె మెడలోని బంగారు పుస్తెలను లాక్కొని, బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సయ్యద్ మౌలానా, మంగూరు ప్రకాశ్యాదవ్ను రగుడు చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.4 గ్రాముల బంగారు పుస్తెలు, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎగువమానేరులో యువకుడి మృతదేహం● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన దుంపటి వినయ్కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతునికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం -
ప్లాస్టిక్ కవర్ల కొరత
మంథని: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం ఉన్నా విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు. తక్కువ పరిమాణంగల ప్లాస్టిక్ కవర్లు మార్కెట్లో అందుబాటులో ఉండడంతో అనేకమంది వాటినే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలితిన్ కవర్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు. ఫలితంగా ప్రజలు తప్పనిసరి బట్ట సంచులు, బుట్టలతో మార్కెట్కు వస్తున్నారు. చేతి సంచులతో సందడి పాలితిన్ కవర్ల కొరతతో పట్టణంలోని కూరగాయల మార్కెట్తోపాటు కిరాణాల్లో నిత్యావసరాలు తీసుకెళ్లే ప్రజలు చేతిసంచులు, బుట్టలతో సందడి చేస్తున్నారు. గతంలో చేతిసంచులు, బుట్టలతోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకెళ్లే జనం.. ఇప్పుడు పాతరోజులను గుర్తుచేసుకుంటున్నారు. చేతి సంచులు, బుట్టలతో వచ్చే కస్టమర్లను ఆకర్శించడానికి వ్యాపారులు కొత్తిమీరకట్ట, ఆకుకూర కట్టలను ఉచితంగా అందిస్తున్నారు. ఇలా కొనసాగితే.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అధికారులు ఎన్నిమార్లు విన్నవించినా.. కొన్ని మున్సిపాలిటీల్లో జరిమానాలు విధిస్తు న్నా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. కానీ, యుద్ధం నేపథ్యంలో పాలితిన్ కవర్ల దిగుమ తికి ఆటంకం ఏర్పడింది. వాటి కొరతతో ప్రజలు పాతరోజుల్లో మాదిరిగా బుట్ట, బట్ట సంచులను వినియోగిస్తున్నారు. ఇదే పద్ధతిని జనం అలవాటు చేసుకుంటే అనేక అనర్థాల నుంచి దూరం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ట సంచిలో కూరగాయలు తీసుకెళ్తున్న స్థానికులు బట్ట సంచులకు డిమాండ్ మార్కెట్లపై యుద్ధ ప్రభావం -
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో మరణించడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మనోధైర్యం కల్పించారు. మృతుడు రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాజిరెడ్డి మృతి అనంతరం మంత్రి రెండోసారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజిరెడ్డి బతికున్న కాలంలో పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. మంత్రి ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన మంత్రి -
ఈత సరదా.. విషాదం కావొద్దు
ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో కొందరు విద్యార్థులు ఈత నేర్చుకునేందుకు మధ్యాహ్నం వేళ చెరువులు, కుంటలు, కాలువల్లోకి వెళ్లి సరదాగా ఈత కొడుతున్నారు. ఈత సరదా ఎవరి ఇంట్లోనూ విషాదం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. పెద్దపల్లి శివారులోని నిట్టూరు మార్గంలో ఎస్సారెస్పీ ఉపకాలువలో ఈదుతూ, కేరింతలు కొడుతూ సందడి చేస్తున్న చిన్నారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలాకనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్,పెద్దపల్లి -
ప్రజలను మోసం చేశారు
హుజూరాబాద్: రాష్ట్ర బడ్జెట్ అంకెలా గారడీలా ఉంది. సామాన్యులకు లబ్ధి ఏం లేదు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సరైన నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. విద్యార్థుల భవిష్యత్ను ప్రభుత్వం పణంగా పెడుతోంది. రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి ఆశాజనకమైన కేటాయింపులు లేవు. అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం విస్మరించింది. సామాన్యుడికి మిగిలేది శూన్యం. – కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే -
సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి
కొత్తపల్లి(కరీంనగర్): సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. కొత్తపల్లి రైతు వేదికలో శుక్రవారం ఆత్మ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు సమగ్ర శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయ పద్ధతులను వివరిచారు. నూతన వరి రకాల లక్షణాలు, అధిక దిగుబడులు సాధించే విధానాలు, పంటల ఎంపికపై వివరించారు. పంటల నిర్వహణ, సమతుల్య ఎరువుల విని యోగం, సేంద్రియ ఎరువుల ఉపయోగం, జీవ ఎరువులు (బయో ఫర్టిలైజర్స్);వ్యాధి నివారణ పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు మధుకర్, రజినీకాంత్ అవగాహన కల్పించా రు. ఏవో కె.సంతోష్ కుమార్, డీసీఎస్ వలంటీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హెచ్పీవీ టీకా పక్కాగా అమలు చేయాలికరీంనగర్: జిల్లాలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకా కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ చాంబర్లో టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, అమలు విధానం, లక్ష్య వయసు గల బాలికలకు టీకా అందించే చర్యలపై చర్చించారు. 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేసి, సర్వైకల్ కేన్సర్ నివారణలో ముందడుగు వేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. జాతరకు లక్షకు పైగా భక్తులు వస్తారని, రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. భక్తులకు తాగునీటి సరఫరా, శానిటేషన్, మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షకు కలెక్టర్, సీపీ రాకపోవడం బాధాకరమన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ మాట్లాడుతూ.. గతేడాది కన్నా ఈసారి మెరుగ్గా బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్డీవో రమేశ్బాబు, ఆర్అండ్బీ డీఈ రాజశేఖర్రెడ్డి, ఇరిగేషన్ ఏఈ రాంకుమార్, డీఎం రవీందర్రెడ్డి, ఆర్టీవో వేణు, ఏసీపీ మాధవి, దేవాదాయ అదనపు కమిషనర్ సుప్రియ, డీపీవో జగదీశ్వర్, జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ప్రశాంత్ కుమార్, సర్పంచ్ దార సురేశ్, అడిషనల్ సీపీ వెంకటరమణ, చైర్మన్ రామారావు, ఇన్చార్జి ఈవో సుధాకర్ పాల్గొన్నారు. పీహెచ్సీల సందర్శనకరీంనగర్: జిల్లాలోని చెల్పూరు, వావిలాల, ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్వో వెంకటరమణ శుక్రవారం సందర్శించారు. హాజరు, అవుట్ పేషెంట్ రిజిస్టరు, ఎన్సీడీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్, టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించారు. అవుట్ పేషెంట్లతో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీల్లో డెలివరీలు పెంచాలన్నారు. ఆరోగ్య మహిళ హెల్త్క్యాంపుల్లో స్క్రీనింగ్ చేసిన వారికి రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు. వైద్యాధికారులు తులసిదాస్, వరుణ, మధుకర్ పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలు పెద్ద బోగస్
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 1000 రోజులు కావస్తున్నా.. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలు, కాంగ్రెస్ హామీల వైఫల్యాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టి, అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 1000 రోజులు గడిచినా ఇచ్చిన హామీ నిలుపుకోలేన్నారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నాయకులు సంగప్ప, వై.సునీల్ రావు, గుగ్గిలపు రమేశ్, ఈ.నాగేశ్వర్రెడ్డి, వాసాల రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. -
నేడు రంజాన్
కరీంనగర్ కల్చరల్: శుక్రవారం నెలవంక దర్శనం ఇచ్చింది. శనివారం రంజాన్ పండగు జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధం అయ్యారు. నెలరోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన వారు నెలవంక దర్శనంతో పండుగ జరుపుకోనున్నారు. రంజాన్ ప్రార్థనలకు నగరంలోని పలు ఈద్గా మైదానాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. సామియాలు, టెంట్లు వేశారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద శనివారం ఉదయం 9:30 నిమిషాలకు ఈద్ ఉల్ ఫితర్ నమాజు ఆచరించనున్నారు. వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద గల పురానీ(ఖదీమ్షాహి)ఈద్గా, చింతకుంట ఈద్గా, బైపాస్ రోడ్డులోని ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఉమ్మడి జిల్లాలో అల్పాహారం పథకం వివరాలు
స్కూళ్లుసిరిసిల్ల1,8202111జగిత్యాలపెద్దపల్లి8,7001215,000కరీంనగర్ 651పెద్దపల్లి 527కరీంనగర్సిరిసిల్ల 403387108,300కళాశాలలు -
ఉత్సాహంగా ‘చేటీ చంద్’
కరీంనగర్: సింధీ సమాజం ప్రాచీనమైన చరిత్ర కలిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సింధీల నూతన సంవత్సర వేడుకలు, ‘చేటీ చంద్’ ర్యాలీలో పాల్గొన్నారు. వైశ్య భవన్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సింధీ యువత, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేయగా, బండి సంజయ్ పాల్గొన్నారు. తెలుగు వారికి ఉగాది ఎంత ముఖ్యమో, సింధీ సమాజానికి ఘూలేలాల్ జయంతి అంతటి ప్రాధాన్యత కలిగిందన్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో సింధీలు ముందంజలో ఉండి దేశ ప్రతిష్టను పెంచుతున్నారని సంజయ్ తెలిపారు. -
గేటు పడింది.. అంబులెన్స్ ఆగింది
గంగాధర: ఎంతటి ట్రాఫిక్ ఉన్నా, సిగ్నల్ పడినా ఆగకుండా రోగులను తరలించే అంబులెన్స్లు ఇక్కడ ఆగక తప్పదు. బాధితులు ఎంత సీరియస్గా ఉన్నా ముందుకెళ్లే అవకాశం ఉండదు. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా సమీపంలోని రైల్వే గేటు పడితే చాలు ఏ వాహనమైనా ఇరువై నిమిషాల పాటు ఆగాల్సిందే. శుక్రవారం జగిత్యాల వైపు నుంచి కరీంనగర్కు పేషెంట్ను తీసుకెళ్తున్న అంబులెన్స్ రైల్వేగేట్ పడటంతో ట్రాఫిక్లో చిక్కుకు పోయింది. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ అమలుకు నోచుకోవడం లేదు. -
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి
కరీంనగర్టౌన్: కరీంనగర్ మంకమ్మతోటలోని పొన్నం ప్రభాకర్ ఇంటిని ఆశా కార్యకర్తలు శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. మంత్రి కార్యాలయం ముట్టడి విజయవంతమైందని, ప్రభుత్వం ఇకనైనా మేల్కొని సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఆశా వర్కర్స్కు అన్యాయం చేసిందని విమర్శించారు. సీఐటీయూ నాయకులు ఎడ్ల రమేశ్, పున్నం రవి, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా అధ్యక్షురాలు కాల్వ సారిక, జిల్లా ఉపాధ్యక్షురాలు నాగెల్లి పద్మ, సుమలత, ప్రియాంక, సత్యలక్మి, శ్యామల, లత పాల్గొన్నారు. -
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
ఫ్లడ్ ఫ్లో కెనాల్ రూ.249.85 కోట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూ.449.66 కోట్లు బొక్కలవాగు రూ.34 లక్షలు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు (మొత్తం రాష్ట్రానికి) శాతవాహన యూనివర్సిటీ రూ.25 కోట్లు టీఎస్ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ అండ్ కరీంనగర్ రూ.42.80 కోట్లు కరీంనగర్ స్మార్ట్ సిటీ రూ.250 కోట్లు ప్రజా వంచనకరీంనగర్: రాష్ట్ర బడ్జెట్ ప్రజా వంచనగా ఉంది. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా, లక్ష కోట్ల రూపాయల అప్పు భారాన్ని మోపేందుకు సిద్ధపడ్డారు. రైతు భరోసా ఎగ్గొట్టారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఎలాంటి సాయం అందలేదు. మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు, వృద్ధులకు పెన్షన్ పెంపు అంశాన్ని విస్మరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. మైనారిటీలకు అధిక కేటాయించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సాధికారతను కేంద్రబిందువుగా చేసుకుని సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూపొందించిన 2026–27 బడ్జెట్ సమగ్రాభివద్ధికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యాలను ప్రతిబింబించే బడ్జెట్. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు బుట్ట దాఖలు అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు లేవు. అంకెల గారడి నీటి మూటలు దగాకోరు బడ్జెట్ ఇది. ప్రభుత్వ పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. – గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యేప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రస్తుతం 41 లక్షల కుటుంబాలు (2011 ప్రకారం.. 37 లక్షలు) ఇందిరమ్మ బీమా పొందే కుటుంబాలు: 8,00,000ఉమ్మడి జిల్లాకు కనీస అంచనా రూ.400 కోట్లు -
బీమా..
కరీంనగర్శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026అల్పాహారం!Iపశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. కూరగాయలు, నిత్యావసరాలకు వాడే పాలిథిన్ కవర్లు మార్కెట్లో అందుబాటులో లేవు. ప్రజలు బట్ట సంచులతో వస్తున్నారు. – IIలోu తెలంగాణలో ప్రభుత్వ డైట్, ప్రైవేట్ కళాశాలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా, ప్రీ– స్కూల్ ఎడ్యుకేషన్ డిప్లొమాలో 2026–27లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్కు నోటిఫికేషన్న్ విడుదల అయ్యింది. – IIలోu సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం విద్యార్థులు, పేదలకు పెద్దపీట వేసింది. అల్పాహారం, కుటుంబ బీమాలతో ఉమ్మడి జిల్లాలో లక్షలాదిమంది లబ్ధిదారులుగా మారనున్నారు. అల్పాహారం పథకంతో 2.01లక్షల మంది పాఠశాల విద్యార్థులు, 33 వేల మందికిపైగా ఇంటర్ విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. పథకం సమర్థంగా అమలు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువకు రూ.249 కోట్లు, ఎల్లంపల్లికి రూ.449 కోట్లు చొప్పున కేటాయించింది. ఉమ్మడి జిల్లా నీటిపారుదలకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది. శాతవాహన వర్సిటీకి ఏకంగా రూ.25 కోట్లు, ఏడాది జరగనున్న పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని ఽగోదావరి తీరాన ఉన్న ధర్మపురి, కోటిలింగాల, గోదావరిఖని, మంథని ఘాట్లలో సదుపాయాలు కల్పనకు త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.హైదరాబాద్– కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు ఎంత నిధులు ఇచ్చారన్నది స్పష్టం చేయలేదు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కు నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
వైష్ణవి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం మాదాపూర్లో మూడురోజుల క్రితం హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి ఘటనలో నిందితులైన హరిబాబు తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి అశోక్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారిరని రిమాండ్కు తరలించినట్టు మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం.. వైష్ణవిని భర్త హరిబాబు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు మూడురోజుల క్రితం హత్యకు పాల్ప డ్డాడు. ఆయనకు తల్లి, సోదరులు సహకరించారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఎస్సై చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని ఉరితీయాలి.. వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధువులు గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కు దిగారు. ఫ్లకార్డులతో మాదాపూర్ నుంచి తరలివచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు న్యా యం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ధర్నా ప్రదేశానికి చేరుకుని నిందితులపై కేసులు నమోదు చేశామని, కోర్టులో ఉన్నందున ఓపిక పట్టాలని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ధర్నా చేస్తున్న వైష్ణవి బంధువులురిమాండ్ చూపుతున్న డీఎస్పీ రాములు -
పంటలకు నీరందించాలి
నక్కవాగు పరివాహక భూముల్లోని బోరుబావులు ఎత్తిపోయి, పంటలు ఎండిపోయాయి. నక్కవాగులోకి మల్లన్నసాగర్ జలాలను వదిలితే ఆరు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి యాసంగికి సాగు నీరు అందుతుంది. బోర్లు రీచార్జీ అవుతాయి. – కట్ట బాపురావు, రైతు, బట్టోనితాళ్లు చెరువుల్లో నీరు అడుగంటుతోంది వేసవి ఎండలతో చెరువుల్లో నీరు అడుగంటుతోంది. బోర్లు పెద్దసంఖ్యలో ఉండగా నిరాటంకంగా నడుస్తున్నాయి. దీంతో చెరువులు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నీటిని పొదుపుగా వాడాలని రైతులను కోరుతున్నాం. మల్లన్నసాగర్ నీటి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – రవికుమార్, డీఈఈ, ముస్తాబాద్ -
రైతు భరోసాకు మరో అవకాశం
కరీంనగర్అర్బన్: యాసంగి రైతు భరోసా సాయానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అర్హులైన అన్నదాతల వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. క్రయవిక్రయాల క్రమంలో రోజురోజుకు పట్టా దారులు మారుతుండగా మళ్లీ మళ్లీ అవకాశమిస్తోంది. యాసంగి పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త పట్టాదారుల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి అన్నదాతకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ క్రమంలో అలాంటి వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ చేసి సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 28 వరకు పాసుపుస్తకం.. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేయొచ్చు. చాలా మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికి ప్రభుత్వం విధించిన గడువులోగా సంబంధిత బ్యాంకు పాసుపుస్తకంతో ఇతర జిరాక్స్ ప్రతులు ఇవ్వకపోవడం వల్ల ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఫలితంగా పెట్టుబడి సాయం అందుకోలేకపోయారు. కొంతమంది గ్రామాలలో అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు కాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వమిచ్చిన అవకాశం వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. సమీప రైతు వేదికల్లో నమోదు చేసుకోవాలని సూచిస్తోంది. బ్యాంకు ఖాతాలు, ఇతరత్రా వివరాల్లో మార్పులు, చేర్పులుంటే ఏఈవోల వద్ద సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25వరకు గడువు కాగా రైతు భరోసాకు నోచుకోని రైతులంతా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. తదుపరి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాకు చేరనున్నట్లు సమాచారం. ఆ భూములకు రైతు భరోసా రాదు గతంలో సాగు భూములు కాకున్నా చాలామంది తమ భూములను వ్యవసాయ భూములుగా చూపగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన క్షేత్రస్థాయి సాగు భూముల సర్వేలో సాగుకు యోగ్యం కాని భూములను తేల్చారు. జిల్లాలో 76 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈవో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా సర్వే చేపట్టగా జిల్లాలో 5,608 ఎకరాల భూమి అసలు సాగుకే పనికిరాదని, కొన్ని స్థలాల్లో నాన్అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్, క్వారీలు తదితర ఉన్నాయని పేర్కొన్నారు. ఇటుక బట్టీలు, ఫంక్షన్ హాళ్లు, మిల్లులు, రియల్ఎస్టేట్ వెంచర్లు, కోళ్ల ఫారాలు, రహదారులు, గోదాములు తదితరాలున్నట్లు గుర్తించారు. రహదారులకు వదిలిన భూమి సదరు రైతు పేరిటనే ఉండడం గమనార్హం. ప్రధాన రహదారులు, కాలువలకు వెళ్లిన భూములు, సర్వేనంబర్లవారీగా రాళ్లూరప్పలున్న భూములు కూడా రైతుల పేరిటే ఉన్నాయి. కాగా పలు ప్రాంతాల్లో భూస్వాములు గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, ఇతరత్రా వాటికి భూములను దానంగా, ఇనాంగా ఇచ్చారు. కాలక్రమంలో వాటిని మ్యుటేషన్ చేయకపోవడంతో గత ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలున్నా ఆన్లైన్లో మాత్రం ఆ భూములిచ్చిన వారి పేరే నమోదైంది. సర్వేలో గుర్తించిన సాగుకు యోగ్యం కాని భూములకు చెందిన సర్వేనంబర్లతో పాటు విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా పోర్టల్లో ఫ్రీజింగ్ చేశారు. మొత్తం గ్రామాలు: 313 ఏఈవో క్లస్టర్లు: 76 సాగు భూమి: 3,39,050 ఎకరాలు తాజాగా రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులు: 2,00,075 దరఖాస్తు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పట్టాదారు పాసుపుస్తకం నకలు మొబైల్ నంబర్ -
బాసర ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులు
కరీంనగర్టౌన్: రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)పరిధి బాసర ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా సంవత్సరం(1,500 మంది) ప్రవేశాలకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో విడుదలకానున్న పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు. ప్రవేశాల షెడ్యూల్ ● ఈనెల 18 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 25 వరకు వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, గ్లోబల్ కేటగిరికి చెందినవారికి, మే 30 విద్యార్థుల ఎంపిక జాబితా, జూన్ 5న తొలి విడత కౌన్సెలింగ్(ధ్రువపత్రాల పరిశీలన). ప్రవేశ అర్హతలు ● విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2026–ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు ● పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4డిప్రెవేషన్ స్కోర్ను అదనంగా కలుపుతారు. బాసర ట్రిపుల్ ఐటీలో 85శాతం సీట్లు స్థానికంగా, 15 శాతం మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రిజర్వేషన్లు ● ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీబీ 10, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఈలకు 4 శాతం. ● ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్సీసీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. ● రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కాాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. ఫీజు వివరాలు రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబంధించి రూ.3,500 ఇతరులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,000 చెల్లించాలి. క్యాషన్(దీనిని తిరిగి ఇస్తారు)డిపాజిట్ కింద ఎ కేటగిరి అభ్యర్థులైనా రూ.2,000 చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్దేశాల్లో పని చేసేవారి పిల్లలు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. మార్కులు సమానమైతే.. ట్రిపుల్ ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరి విద్యార్థుల మార్కులు ఒక్కటే అయితే వరుసగా గణితం, జనరల్సైన్స్, ఇంగ్లిష్, సోషల్లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువవీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. వసతులు విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండుజతల యూనిఫాం, షూలు, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. దరఖాస్తు ఇలా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ–సేవా, మీ–సేవా, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.450, వేరే రాష్ట్రం వారు రూ.1,500 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. మే 10 వరకు గడువు సెలెక్షన్ లిస్టు మే 30.. కౌన్సెలింగ్ జూన్ 5న పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు సువర్ణావకాశం -
శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభం
వేములవాడ: హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీసీతారామచంద్రస్వామి వారి నవరాత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో ఏకాంతంగా శ్రీరామనవమి ఉత్సవాలను అర్చకులు నిర్వహించారు. శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు రామాయణ పురాణ పారాయణం, ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు కొనసాగనున్నాయి. భీమన్న ఆలయంలో శ్రీరామ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని భీమేశ్వరాలయం పక్కన ఉన్న శంకరమఠంలో నిత్యం సాయంత్రం 4 గంటలకు రామాయణ ప్రవచనం ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27న రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికపై శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరపనున్నారు. శివపార్వతులు రాజన్నను కల్యాణం చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. వేలాదిగా శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని చేశారు. 27న శివార్చన వేదికపై శ్రీసీతారాముల కల్యాణం -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన ఆటో డ్రైవర్ జెట్టి లచ్చయ్య(65) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. జెట్టి ల చ్చయ్య ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అ ప్పులు చేసి కొత్త ఆటో కొనుగోలు చేశాడు. గిరాకీలు సరిగా లేక ప్రతీ నెల వాయిదాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీనికితోడు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో గురువారం తెల్లవారుజామున ఇంటి ఎదుట పందిరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కనకవ్వ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఉగాది పండుగ రోజున లచ్చయ్య ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాపీమేసీ్త్ర అదృశ్యంకథలాపూర్(వేములవాడ): మండలంలోని బొమ్మెనలో తాపీమేసీ్త్ర పనిచేసుకుంటూ జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యంపార్వతీపురం జిల్లా కురుపం గ్రామానికి చెందిన మండంగి మహేశ్(35) అదృశ్యమయ్యాడని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికిరణ్ గురువారం తెలిపారు. 11 రోజుల క్రితం బొమ్మెన నుంచి వెళ్లిన మహేశ్ తిరిగి రాకపోవడంతో బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో వాకబు చేశారు. ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యమైనట్లు ఆయన భార్య సుమతి గురువారం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. -
నలుగురు దొంగల అరెస్ట్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులో విద్యుత్ సామగ్రి చోరీకి పాల్పడిన నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ నెల 15న సిల్వర్స్ప్రింగ్ విల్లాస్లోని స్టోర్రూమ్లో సుమారు రూ.60వేల విలువైన విద్యుత్ వైరు బెండల్స్ను దొంగలు ఎత్తుకెళ్లగా, యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం తీగలగుట్టపల్లి–ఆరెపల్లి దారిలో ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న నలుగురు వ్యక్తులు, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. విచారణ చేయగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజి, నవీన్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కొన్నేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉపాధినిమిత్తం వచ్చిన ఈ నలుగురు వ్యక్తులు కుటుంబాలతో వావిలాలపల్లి, హనుమాన్నగర్లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారని వివరించారు. మద్యానికి బానిసై సులువుగా డబ్బు సంపాదించాలని గతంలో విల్లాస్లకు కూలీపనులకు వెళ్లినపుడు విద్యుత్ సామగ్రి ఉండడంతో దొంగతనం చేసినట్లు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలుమల్యాల: పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన మల్యాలలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి ఆగంతపు లక్ష్మీ తన ఇంటి వద్ద ఉండగా.. పిచ్చికుక్క దాడి చేసింది. కుడిచేతిపై తీవ్ర గాయాలు కాగా వైద్యం కోసం జగిత్యాలకు తరలించారు. సూర్యనగర్లో దొంగతనంకొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ నగరపాలక సంస్థ 23వ డివిజన్ సూర్యనగర్ రోడ్నంబర్– 5లో బుధవారం రాత్రి కళ్లెం వినయ్కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. స్థానికులు, కొత్తపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. ఉగాది పండగ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం వినయ్కుమార్ తన సొంతూరైన కల్లెంరెడ్డిపల్లెకి వెళ్లాడు. తాళం వేసి ఉన్నట్లు గమనించిన దొంగలు రాత్రి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రూ.15 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కొటేశ్వర్ తెలిపారు. కాగా భవనాన్ని అందంగా నిర్మించుకొని కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫోరెన్సిక్ సిబ్బంది వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇసుక లారీ పట్టివేతకథలాపూర్: మండలంలోని గంభీర్పూర్ శివారు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా లారీని పట్టుకుని యజమాని అయిన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లికి చెందిన అల్లెపు రవిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
భట్టి బడ్జెట్పై ఆశలు..!
● హుజూరాబాద్ నియోజకవర్గం రైతుల చిరకాలవాంఛ అయిన కల్వల ప్రాజెక్టు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి ఇటీవల డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ బడ్జెట్లో ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి ప్రకటన ఉంటుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాసనసభలో నేడు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న పలు ప్రధాన ప్రాజెక్టులకు ఈసారైనా మోక్షం లభించేనా..? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ – కరీంనగర్ను అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేలైన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాజన్న ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ప్లాన్ కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి నిధులు, పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్టాత్మక పత్తిపాక రిజర్వాయర్పై ప్రకటన, కల్వల ప్రాజెక్టు నిర్మాణాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.● వేములవాడ ఆలయ పునరుద్ధరణ, మాస్టర్ ప్లాన్ అమలు కోసం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఇప్పటి వరకు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసింది. మాస్టర్ప్లాన్ సమగ్ర అమలు, ఆలయ నిర్మాణం పూర్తవాలంటే.. మరో రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.● మనోహరాబాద్ నుంచి కొ త్తపల్లి వరకు రూ.2,780 కోట్లతో రైల్వేప్రాజెక్టు లైన్ పనులు నడుస్తున్నాయి. సిరిసిల్ల వరకు లైన్ పూర్తవగా.. సిద్ధిపేట – సికింద్రాబాద్ వరకు రైలు అందుబాటులోకి వచ్చింది. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు ఇటీవల మొదలయ్యాయి. ఇక వేములవాడ, వెదిర, కొత్తపల్లి వరకు పనులు సాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు, భూసేకరణ వంటి సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఈ రైల్వేలైన్ పూర్తయితే.. ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఉమ్మడి జిల్లాకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.● జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట దక్క న్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్ర భుత్వం నుంచి ప్రకటన కోసం స్థానిక రైతులు ఎదురుచూస్తున్నారు. 2015లో మూ తబడిన ఈ పరిశ్రమను తిరిగి తెరిపిస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ రూ.172 కోట్ల బ కాయిలు చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసింది. 2025లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నేటి బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.● పెద్దపల్లితోపాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన శ్రీలక్ష్మీనరసింహ పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల విడుదలపై ఉమ్మడి జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు నుంచి ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ పూర్తయితే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాల్లోని 2.40 లక్షల ఎకరాలతోపాటు కొత్తగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు.● రామగుండం బీ థర్మల్ పవర్ ప్లాంట్ మూసివేత అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రివర్గంలో మంత్రుల బృందం ఎన్టీపీసీ, జెన్కో సంస్థల్లో ఏది తక్కువ వ్యయంతో ప్లాంట్ నిర్మించి, తక్కువ రేట్కు కరెంట్ ఇచ్చే సంస్థకు నిర్మించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, నిధులు కేటాయిస్తేనే ఈ ప్రాంతవాసుల కోరికై నా ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ప్రస్తుతం పాత బీ థర్మల్ ప్లాంట్ మిషనరినీ తుక్కు కింద విక్రయించేందుకు వివిధ విభాగాల అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు.● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతో దాని నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈఎస్ఐ ఆస్పత్రి పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో పనిచేసే సుమారు 60వేల మంది కార్మికులకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం రూ.150 కోట్లు నిధులు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో భూ కేటాయింపులు, తదితర పనుల జాప్యంతో ముందుకు సాగడం లేదు. -
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట
చొప్పదండి: ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్లో స్వశక్తి సంఘాల నూతన భవనాల నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేశ్, వడ్లూరి శ్రీనివాస్, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, కర్రె ప్రేమలత, నిజానపురం చందు, పురం రాజేశం, తదితరులు పాల్గొన్నారు. -
కొండగట్టు ఆలయ ఈవోగా అంజారెడ్డి
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఈవోగా అంజారెడ్డిని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవి నుంచి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది ఈవో అంజారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భీమన్న ఆలయంలో పూజలు వేములవాడఅర్బన్: భీమేశ్వర స్వామివారిని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవో ఎస్.అంజారెడ్డి గురువారం దర్శించుకున్నారు. స్వామివారి మండపంలో లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో రమాదేవి అందజేశారు. -
● మంత్రి పొన్నం ప్రభాకర్
గాడ్సే వారసులు.. గాంధీ వారసులనంటారా?కరీంనగర్కార్పొరేషన్: గాడ్సే వారసులే.. గాంధీ వారసులను గాడ్సే వారసులంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఉగాది సందర్భంగా గురువారం కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ 30 ఏళ్లు స్వాతంత్య్రం కోసం పోరాడితే ఆంగ్లేయిలు ఒక్క దెబ్బ కొట్టలేదని, స్వాతంత్య్రం వచ్చాకే గాడ్సే తుపాకీతో కాల్చిచంపాడని, అదే గాడ్సే వారసులు గాంధీ స్మృతి వనం పెడుతామంటే విమర్శిస్తూ, ఆటంకాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని, శాసనసభలో జరిగిన అంశం కాబట్టి బండి సంజయ్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. 12 ఏళ్లుగా మోదీ మాటల గారడి తప్ప, దేశానికి నిర్మాణాత్మకంగా చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారని, బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదన్నారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే సుందరీకరణ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. సబర్మతి నిర్మిస్తే లేని తప్పు మూసీని సుందరీకరిస్తే ఎందుకు వచ్చిందన్నారు. ఎవరు పార్టీని వీడిపోవాలని అనుకోరని, జీవన్రెడ్డిపై పార్టీ మాట్లాడుతుందన్నారు. సీఎం సీనియర్లను తొక్కుకుంటూ వచ్చారని సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఒక్కొక్కరి భాష ఒక్కోరకంగా ఉంటుందన్నారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉండి సీఎం అయ్యారన్నారు. బీజేపీలో ఎంతమంది సీనియర్లను సంజయ్ తొక్కుకొంటూ వచ్చారో చెప్పాలని, చాలామందికి రాని అవకాశం ఆయనకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొడూరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, నాయకులు వుట్కూరి నరేందర్రెడ్డి, రాచకొండ చక్రధర్రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026పరాభవ వైభవం7ఎస్సీ యువత ఉపాధికి భరోసాషెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం 2025–26వ ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి పథకాల యూనిట్లు మంజూరు చేసింది. బాసర ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులుబాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. కరీంనగర్కల్చరల్: జిల్లాలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మిన్నంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పండితులతో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ పురస్కరించుకుని కొత్తకుండలో షడ్రచుల మేళవింపు(ఉప్పు, కారం, వగరు, చేదు, పులుపు, తీపి)తో తయారు చేసిన ఉగాది పచ్చడిని సేవించారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో అభిషేకం, ఉగాది పచ్చడి వితరణ, పంచాంగ పఠనం జరిగింది. హంపీ పిఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ పంచాంగ శ్రవణం వినిపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొని ఉగాది పచ్చడి స్వీకరించారు. పొన్నం కాంప్లెక్స్లో జరిగిన పంచాంగ శ్రవణంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశం, కాంగ్రెస్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్రెడ్డి, అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.పంచాంగ శ్రవణం వింటున్న భక్తులుమార్కెట్ రోడ్లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో..విద్యారణ్య భారతిస్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న కేంద్ర మంత్రి సంజయ్ -
చెరువులో అస్థికలు లభ్యం
మూడు నెలల క్రితం అదృశ్యం.. కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జిలుకర లింగయ్య(87) మూడు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. మంగళవారం టేకుమట్ల మండలం బోర్నపల్లి శివారులోని చెరువులో అస్థికలు లభ్యం అయ్యాయి. లింగయ్య మతిస్థిమితం కోల్పోయాడు. మూడునెలల క్రితం ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పొరుగున ఉన్న టేకుమట్ల, చిట్యాల, ఓదెల, జమ్మికుంట, ముత్తారం మండలాల్లో లింగయ్య ఫొటోతో వాల్పోస్టర్లు వేశారు. లింగయ్య అస్థికలు, దుస్తులతో కూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అవి.. తమ తండ్రివేనని కుమారుడు రమేశ్ గుర్తించాడు. అంతేకాదు.. బోర్నపల్లికి వెళ్లి అవి తన తండ్రి లింగయ్య వేనని నిర్ధారణ చేశాడు. దీంతో అక్కడి పోలీసులు వరంగల్ ఎంజీఎం ఫోరెనిక్స్ పంపించారు. మృతుడి అస్థికలను స్వగ్రామమైన మొట్లపల్లిలో రాత్రి ఖననం చేశారు. మృతుడికి కుమారుడు రమేశ్, కూతురు లక్ష్మి ఉన్నారు. మొట్లపల్లి సర్పంచ్ తులా మనోహర్రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
పార్టీ మారొద్దు..!
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీతో సుధీర్ఘ అనుబంధం కలిగిన జీవన్రెడ్డి పార్టీ వీడాలనుకోవడం బాధాకరమని, చివరి నిమిషంలో అద్భుతం జరిగి ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఏఐసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి అన్నారు. అవమానాలు భరించలేక కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించిన జీవన్రెడ్డిని బుజ్జగించేందుకు బుధవారం జగిత్యాలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్లోనే కొనసాగాలని కోరారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీ అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ జీవన్రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడం పార్టీకి ఆశనిపాతం అవుతుందన్నారు. జీవన్రెడ్డి పార్టీలో కొనసాగాలని రాహుల్గాంధీ కోరుకుంటున్నారని తెలిపారు. ఆయనను ఒప్పించి పార్టీలో కొనసాగాలని కోరేందుకే పార్టీ దూతగా తాను వచ్చినట్లు తెలిపారు. ఆయన ఎంతో ఆవేదన చెందితే తప్ప పార్టీతో ఉన్న సుధీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవాలని కోరుకోరని, పార్టీ కూడా అలాంటి నాయకుడిని వదులుకునేందుకు సిద్ధంగా లేదని వివరించారు. జీవన్రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ఏదైనా అద్బుతం జరిగే అవకాశం లేకపోలేదన్నారు. ● మాజీమంత్రి జీవన్కు బుజ్జగింపులు ● ఆఖరి నిమిషంలో అద్భుతం జరగొచ్చు ● ఏఐసీసీ పరిశీలకుడు కత్తి వెంకటస్వామి -
10 సిలిండర్లు పట్టివేత
కరీంనగర్ అర్బన్: వంటగ్యాస్ అక్రమ వినియోగంపై సివి ల్ సప్లయ్ అధికా రులు ఆకస్మిక దా డులు నిర్వహించా రు. నగరంలోని హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ వాడుతుండటంపై కన్నెర్ర చేశారు. సివిల్ సప్లయ్ డీటీ సురేందర్, ఎఫ్ఐ శ్రీనివాస్రెడ్డి జ్యోతినగర్, మల్కాపూర్ రోడ్డు ప్రాంతాల్లోని హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను తనిఖీ చేసి 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వంటగ్యాస్ వాడితే కేసులు నమోదు చేస్తామని వివరించారు. జగిత్యాలలో 17 సీజ్జగిత్యాలక్రైం:జిల్లా కేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆ శాఖ అధికారులు బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 17 సిలిండర్లను పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశామని డీఎస్వో జితేందర్రెడ్డి తెలిపారు. ఎస్యూ వీసీకి సత్కారంకరీంనగర్ సిటీ: మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికి పీహెచ్డీ అందుబాటులోకి తీసుకుని వచ్చిన శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్కుమార్కు శాతవాహన జేఏసీ చైర్మన్ చైతన్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు విభాగంలో పీహెచ్డీలు అందుబాటులోకి రావడంతో బుధవారం వీసీని ఘనంగా సత్కరించారు. చైతన్య, పలువురు పీహెచ్డీ స్కాలర్స్ మాట్లాడుతూ వీసీ ఉమేశ్కుమార్ ప్రత్యేక చొరవతో తెలుగు విభాగంలో పీహెచ్డీలు చేయడానికి అవకాశం వచ్చిందన్నారు. వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలకు చిక్కిన పెద్దపులికొడిమ్యాల: మండలంలోని సూరంపేట, దమ్మాయిపేట శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి ఇక్కడే ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గ్రా మస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రైతు నరహరికి చెందిన ఆవును.. సో మవారం తేజావత్ గోరికి చెందిన చూడి ఆవును చంపిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో పులి మొదట చంపిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చింది. ఈ దృశ్యం సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యింది. పులి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండడంతో ఆవాసం ఏర్పరచుకుందని సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు అలాంటిదేం లేదంటున్నారు. -
రంజాన్ ప్రార్థన స్థలాలు పరిశీలన
కరీంనగర్క్రైం: రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ గౌస్ ఆలం బుధవారం పరిశీలించారు. సాలెహ్ నగర్, సప్తగిరికాలనీ, కరీంనగర్ వన్టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న ఈద్గాలతోపాటు పలు ప్రార్థనా మందరాలను సందర్శించారు. ప్రార్థనలు జరిగే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈద్గాల వైపు వచ్చే రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చేడాలన్నారు. అవసరమైన చోట దారి మళ్లింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నగరంలోని పలు పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య
కరీంనగర్క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్టౌన్ సీఐ రాంచందర్రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటూ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్కు వెళ్లిన చంద్రశేఖర్కు ఫోన్చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఉరేసుకుని యువకుడు..జమ్మికుంట: ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల కిషన్(30) ప్రైవేటు సీడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి పాతకాల రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త అరెస్ట్
కోరుట్లరూరల్: అదనపు కట్నం కోసం గర్భవతి అయిన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి, గొంతు నులిమి అతి దారుణంగా చంపిన ఆమె భర్త చిత్తరి హరిబాబును కోరుట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డీఎస్పీ అడ్లూరి రాములు వివరాలు వెల్లడించారు. మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కూతురు వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత హరిబాబుకు కట్నం కింద రూ.ఐదు లక్షల నగదు, మాదాపూర్లో రెండు గుంటల భూమి ఇచ్చారు. అదనంగా మరో రూ.5 లక్షలు కట్నం కావాలని హరిబాబు తల్లి లక్ష్మీ, సోదరులు ఆనంద్, అశోక్ ప్రోద్బలంతో కొంతకాలంగా హరిబాబు వైష్ణవిని వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి వైష్ణవి, హరిబాబు గొడవపడ్డారు. వైష్టవి నిద్రించిన తర్వాత హరిబాబు ఆమె మెడపై కత్తితో పొడిచి, గొంతు నులిపి చంపేసి పారిపోయాడు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా.. కోరుట్ల శివారు కోనరావుపేట రోడ్లోగల డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఉపయోగించిన ద్విచక్రవాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, పోలీసులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాములు నిందితుడిని రిమాండ్కు తరలింపు -
వేసవి కార్యాచరణ పూర్తి చేయండి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ వేసవి కార్యాచరణ పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ ఆదేశించారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో బుధవారం నిర్వహించిన జిల్లా సమీక్షలో మాట్లాడుతూ.. పోల్ నంబరును ఆన్లైన్లో జీఐఎస్ కో–ఆర్డినేటర్స్తో డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సర్వీసు మంజూరు చేయాలన్నారు. గృహ వినియోగదారుల మీటర్లు బిగించాలన్నారు. లైన్ పనులు, ట్రాన్స్ఫార్మర్ చార్జ్ అయిన వెంటనే వర్క్ ఆర్డర్ క్లోజ్ చేయాలన్నారు. ఆన్లైన్లో ఎల్సీ తీసుకోవడంతో పాటు భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజాబాట కార్యక్రమాన్ని తమ సెక్షన్ల పరిధిలో మంగళ, గురు, శనివారాల్లో నిర్వహించాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతే విద్యుత్శాఖ వాహనంలోనే రవాణా చేయాలన్నారు. వాట్సప్ చాట్బాట్ 7901628348 నంబరు, 1912 టోల్ఫ్రీ ద్వారా విద్యుత్ సమస్యలు తెలియజేయాలన్నారు. డీఈలు కే.ఉపేందర్, జె.రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి, చంద్రమౌళి, రమణారెడ్డి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఎస్ఈ రాపెల్లి రవీందర్ -
విరుగుడు లేని విషం
కరీంనగర్: పంట పొలాలు, ఇంటి పరిసరాల్లో పెరిగిన కలుపును నాశనం చేసేందుకు వాడే పారాక్వాట్ క్రిమిసంహారక మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. గ్రామాల్లోని రైతుల ఇళ్లల్లో, పొలాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ మందు, ఇప్పుడు పట్టణాల్లోని వారికి సైతం ఫెర్టిలైజర్స్ షాపుల్లో లభ్యమవుతోంది. దీంతో క్షణికావేశంలో దీన్ని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాసిడ్ కన్నా పదుల రెట్ల గాఢత కలిగిన ఈ ద్రావణాన్ని తాగిన వారు 99 శాతం మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఏఈవో ప్రిస్కిప్షన్లో రాసిస్తేనే గడ్డిమందు ఇవ్వాలని ఇటీవల వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాయిజన్ కేసుల్లో పారాక్వాటే ఎక్కువ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే పాయిజన్ కేసుల్లో అధిక శాతం పారాక్వాట్ క్రిమిసంహారక రసాయన మందు తాగినట్లు నమోదవుతోంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి ఈ మందును ఎక్కువగా వాడుతుంటారు. వందల లీటర్ల నీటిలో రెండు, మూడు మూతల ద్రావణాన్ని కలిపి ఎకరాల కొద్ది పొలాల్లో పిచికారీ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే కలుపు మొక్కలు మాడిపోతాయి. అలాంటిది నేరుగా ద్రావణాన్ని తాగితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. గుక్కెడు తాగగానే తట్టుకోలేక పారేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ద్రావణం వేగంగా శరీరంలోని జీవకణాలను, అంతర్భాగాల్లోని పైపొరలను దెబ్బతీస్తూ వెళ్లి ప్రాణాలు తీస్తుంది. నిషేధం కోసం పెరుగుతున్న డిమాండ్ పారాక్వాట్ రసాయనాన్ని అభివృద్ది చెందిన దేశాల్లో, మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కానీ ఇక్కడ పప్పు, బెల్లాల్లా దుకాణాల్లో లభ్యమవుతోంది. పారాక్వాట్ నిషేధించాలని కోరుతూ జిల్లాలో పలువురు వైద్యులు ఇటీవల కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. కొంత మంది వైద్యులు ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర మంత్రులకు సైతం వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇక.. వ్యవసాయాధికారులు ధ్రువీకరిస్తేనే రైతులకు పారాక్వాట్ డైక్లోరైడ్ కావాలంటే వ్యవసాయాధికారులను కలవాలి. వారు క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారు. దీని ఆధారంగానే ఆ పంటకు పొలానికి ఏయే మందులను కొనుగోలు చేయాలనే విషయాలను ప్రిస్కిప్షన్ ఇస్తారు. ఆ చీటీని తీసుకుని పురుగుల మందుల షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సిఉంటుంది. కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రికి ఈ మందు తాగి ఏడాది కాలంలో 80 మందికి పైగా చికిత్స కోసం వచ్చారు. ఈ ఆసుపత్రితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు ఏటా వందల మంది చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 99 శాతం మంది మరణిస్తుండగా తక్కువ మోతాదులో తాగిన వారు మాత్రమే బతికిపోతున్నారు. ప్రాణాలు తీస్తున్న పారాక్వాట్ క్షణికావేశంలో తాగుతూ.. ఏటా వందల మంది మృతి పలు రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధం జిల్లాలోనూ పెరుగుతున్న డిమాండ్ పారాక్వాట్ విష రసాయన పదార్థానికి విరుగుడు లేదు. దీని ప్రభా వానికి గురైన వారి లక్షణాలను బట్టి వైద్యం చేస్తాం. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషం తీసుకున్న వారిలో 99 శాతం మంది మరణిస్తున్నారు. పారాక్వాట్ మింగినా, తాకినా చివరకు పీల్చినా విషప్రభావానికి గురైనట్లే. కేవలం ఒక టీ స్పూన్ పారాక్వాట్ తీసుకోవడం వల్ల మరణం సంభవించవచ్చు. ఈ రసాయనం దుస్తులు, కళ్లు, చర్మాన్ని తాకినా తీవ్ర అనారోగ్యం లేదా మరణానికి కారణం కావచ్చు. – డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
అవినీతి కేసులో ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం/జగిత్యాలక్రైం: అవినీతి కేసులో ఎకై ్సజ్ సీఐతో పాటు సహకరించిన ఉపాధ్యాయుడిని ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో మామూళ్లు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా దర్యాప్తు చేశారు. రాము ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.20 లక్షలు లభ్యమైంది. ఈ విషయంపై ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. ఎకై ్సజ్ సీఐ ఇంట్లో సోదాలు ఏసీబీ అధికారులకు పట్టుబడిన కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ రాములుకు చెందిన జగిత్యాలలోని భవానీనగర్లోని ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. రాములుది జగిత్యాల జిల్లా భీమారం మండలకేంద్రం. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బినామీ పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. -
శ్రీపరాభవ నామం.. షడ్రుచుల మేళం
నేడు ఉగాది పర్వదినంకరీంనగర్కల్చరల్: వనాలన్నీ చిగురించే వేళ, పూల పరిమళాలు వెదజల్లే సమయాన.. లేలేత చిగుళ్లు వేసి... కోయిలమ్మల కుహు కుహూ రాగాలు.. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వచ్చేది వసంతం.. ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం. తెలుగు సంవత్సర ఉగాదిని ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం అనవాయితీ. నేటి నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆరంభం కానుంది. ‘పరాభవ నామ సంవత్సరం’ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సామాజిక, జీవన మార్గదర్శక భావనలను అందిస్తుంది. ‘పరాభవ’ అనే పదానికి సాధారణంగా ‘పరాజయం’ అనే అర్థం ఉన్నప్పటికీ, ఇది మన లోపాలను గుర్తించి, వాటిని జయించి, విజయానికి పునాది వేయాలని సూచిస్తుంది. నేడు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరపనున్నారు. పండుగను ఘనంగా జరపుకోనున్నారు. -
అసెంబ్లీలో పాడి వేడి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. ఇంతకాలం జిల్లాకు పరిమితమైన ఈ గొడవకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మారింది. సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి ఆరోపణల డోసు పెంచారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో సీపీ ఆయన మిత్రులతో కలిసి ఫైరింగ్ సాధన చేయడంతోనే బోనాలపల్లెలో అమృతమ్మ అనే వృద్ధురాలికి తూటా గాయమైందని ఆరోపించారు. కరీంనగర్ కమిషనరేట్కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు, వాహనాలను హైదరాబాద్లో సీపీ ఇతర పనులకు మోహరిస్తున్నారని సభలో పేర్కొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించాలని మంత్రి శ్రీధర్బాబుతోపాటు, మంత్రులు పొన్నం, అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. పాడి ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్బాబు ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. దొంగ ఆఫీసర్లు.. డ్రగ్స్ తీసుకున్నారా? అంటూ.. సభ అనంతరం పాడి కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిగిన సమయంలో సీపీ గౌస్ ఆలం లీవ్లో ఉన్నట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు. అదంతా డీటీపీ చేశారంటూ కొట్టిపారేశారు. ముందే రాసుకున్న లీవ్ లెటర్పై పెన్నుతో డేటు వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగ పోలీసాఫీసర్లకు మద్దతుగా నిలవడమేంటని ఐపీఎస్ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ, హుజురాబాద్ ఏసీపీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఆరోపణలపై విచారణ జరిపించి తప్పు మాట్లాడితే.. ముక్కు భూమికి రాస్తానంటూ పునరుద్ఘాటించారు. కరీంనగర్ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ఆలంకు వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్లే తనకు సీపీ గురించిన సమాచారం అంతా అందుతోందని వెల్లడించారు. తన మీద సీఐడీ కేసులు పెట్టడం కాదని, చేతనైతే సీపీ మీద విచారణకు సిట్ వేయాలని కోరారు. ఈనెల 30వ తేదీ వరకే డెడ్లైన్ సీపీ పవిత్ర రంజాన్మాసంలో జల్సాలు చేసుకున్నారని, ఆ పార్టీలో పోలీసులు ఎగిరిన తీరు చూస్తుంటే.. పీకల్లోతు మందు తాగారా, డ్రగ్స్, గంజాయి ఉన్నాయా అని ప్రశ్నించారు. కరీంనగర్ యువతకు పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు అని నిలదీశారు. వెంటనే డీజీపీ, మంత్రి శ్రీధర్బాబు చర్యలు తీసుకోవాలని, 30వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రెస్మీట్లో సీపీకి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని చెప్పిన పాడి అన్నంత పనిచేశారు. 30వ తేదీలోగా సీపీపై చర్యలు లేకపోతే మరిన్ని విషయాలు వెల్లడిస్తానని చెబుతుండటంతో.. పాడి ఆరోపణలపై ఇటు డిపార్ట్మెంట్, అటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. -
కల్వర్టును ఢీకొన్న కారు
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ బస్టాండ్ సమీపంలో ఫోర్లైన్ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో దంపతులు ఎడ్ల శ్రీనివాస్(44), రజిత(40) దుర్మరణం చెందారు. బసంత్నగర్ ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ తన భార్య రజితతో కలిసి ఈనెల 15న హైదరాబాద్లోని తమ బంధువుల గృహ ప్రవేశ వేడుకకు కారులో వెళ్లారు. ఈనెల 16న సాయంత్రం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని కరీంనగర్లో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుచున్న తన కూతురు రిషిత వద్దకు వెళ్లారు. ఆమెతో కాసేపు సరదాగా గడిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తమ కారులో మంచిర్యాలకు బయలుదేరారు. బసంత్నగర్ బస్టాండ్ దాటిన తర్వాత ఫోర్లేన్ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డుపక్కన కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు హెచ్కేఆర్ టోల్ప్లాజా అంబులెన్స్ సిబ్బంది, ఎస్సై శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కూతురు రిషిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా మృతులకు రిషిత ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులను కోల్పోయిన రిషిత రోదనలు మిన్నంటాయి. దంపతుల దుర్మరణం -
ఆన్లైన్లో ‘ఎల్సీ’
వీణవంక: విద్యుత్ సమస్యలు పరిష్కరించే క్రమంలో సమన్వయ లోపంతో చాలా మంది సిబ్బంది కరెంటు స్తంభంపైనే ప్రాణాలు వదిలారు. సిబ్బంది రక్షణ, విద్యుత్ ప్రమాదాల నివారణ, గంటల తరబడి అంతరాయం కలగకుండా ఉండేందుకు టీజీఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తితే విద్యుత్ సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్కు ఫోన్చేసి ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకొని మరమ్మతు చేసేవారు. దీంతో గంటల తరబడి అంతరాయం ఏర్పడేది. ఆపరేటర్, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది మధ్య సమస్వయ లోపంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని టీజీ ఎన్పీడీసీఎల్ ఆన్లైన్ ఎల్సీకీ శ్రీకారం చుట్టింది. ఎల్సీ తీసుకోవాలంటే ఆన్లైన్ అనుమతి తప్పనిసరి చేశారు. విద్యుత్ వైర్లు, ఫీడర్, ఫీజు సరి చేయాలంటే లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్స్థాయి అధికారి ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేస్తే ఏఈ పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడే సంబంధిత విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ ఇస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారికి సమాచారం ఇస్తారు. తద్వారా క్షేత్రస్థాయిలో ప్రమాదాలను తగ్గించడంతో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని గ్రామాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఆన్లైన్ ఎల్సీ ఇలా.. జిల్లావ్యాప్తంగా 318 గ్రామపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 200కు పైగా విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. గతంలో గ్రామాల్లో విద్యుత్ పోలు, వైర్లు, ఫీడర్లు, ఫీజులు తదితర సమస్యలు తలెత్తితే సంబంధిత సబ్స్టేషన్ ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్సీ తీసుకునేవారు. ఆపరేటర్కు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి మాత్రమే ఈ సమచారం ఉండేది. ఫై స్థాయి అధికారులకు సమాచారం లేకపోవడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు ప్రతి సబ్స్టేషన్లో డేటా సిస్టం ఏర్పాటు చేసి కిందిస్థాయి సిబ్బంది నుంచి సీఎండీ వరకు ఎల్సీ సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. ఏదైన సమస్య తలెత్తితే ఆన్లైన్లో సమస్య ఫొటో అప్లోడ్ చేయాలి. ఏఈ పరిశీలించి ఆపరేటర్కు అనుమతి ఇస్తాడు. అప్పుడు సబ్స్టేషన్లో సరఫరా నిలిపివేస్తూ, ఆ ఫొటోను ఆపరేటర్ ఆప్లోడ్ చేస్తాడు. మరమ్మతు పూర్తయిన తర్వాత మళ్లీ సిబ్బంది ఫొటో తీసి ఆన్లైన్లో పెడతారు. వెంటనే ఆపరేటర్ సరఫరా పునరుద్ధరిస్తారు. దీంతో ఎన్నిసార్లు ఎల్సీ తీసుకున్నారో పైస్థాయి అధికారులకు తెలిసిపోతుంది. మరమ్మత్తు 2గంటల లోపు ఉంటే ఏఈ, 2గంటల పైన అవసరముంటే డీఈఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన విద్యుత్ ఉద్యోగి ఏడాది క్రితం విద్యుత్ వైర్లు సరి చేసేందుకు సబ్స్టేషన్లో ఉన్న ఆపరేటర్కు ఫోన్ చేసి ఎల్సీ తీసుకున్నాడు. మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగింది. షాక్ తగిలి విద్యుత్ పోలు నుంచి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకారం చుట్టిన టీజీఎన్పీడీసీఎల్ క్షేత్రస్థాయిలో మరమ్మతుకు ఆన్లైన్ ఆనుమతి తప్పనిసరి విద్యుత్ ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు ఏజేఎల్ఎం నుంచి సీఎండీ వరకు యా్ప్లో పరిశీలించే అవకాశం -
స్పాట్లోనే ఎఫ్ఐఆర్
● పోలీసుల ప్రత్యేక దృష్టి ● ఏడు అంశాలపై ప్రాథమిక నివేదిక ● నెల రోజుల్లో 41 కేసులు నమోదు గోదావరిఖని: నేరాల నమోదు, దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి పోలీస్ వ్యవస్థలో కీలకమార్పులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు అండగా ఉంటూ నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు ఆధునిక పద్ధతులు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ‘స్పాట్ ఎఫ్ఐఆర్’ ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తాజా పద్ధతి ప్రధాన లక్ష్యం. డీజీపీ ప్రత్యేక దృష్టితో రాష్ట్రంలో స్పాట్ ఎఫ్ఐఆర్ అమలుపై డీజీపీ ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్పాట్ ఎఫ్ఐఆర్పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కేసుల తీవ్రత, పోలీసుస్టేషన్కు వెళ్లడం కష్టంగా ఉండే వారికోసం ప్రాధాన్యం కల్పిస్తోంది. పోలీసు కమిషనరేట్లో గతనెలరోజుల్లో 41 స్పాట్ ఎఫ్ఐఆర్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. బాధితులకు ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉండి కూడా ఫిర్యాదు చేసి అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఎలా పనిచేస్తుంది? పోలీస్ సిబ్బంది వద్ద టాబ్లెట్/మొబైల్ యాప్ ఉంటుంది. బాధితుడు లేదా సాక్షి ఇచ్చిన వివరాలు అక్కడికక్కడే నమోదు చేసి, డిజిటల్ సంతకం తీసుకోవడం ద్వారా వెంటనే సెంట్రల్ సర్వర్కు డేటా పంపించడం ఎఫ్ఐఆర్ నంబర్ తక్షణమే జనరేట్ అవుతుంది. స్పాట్ ఎఫ్ఐఆర్ అంటే ? స్పాట్ ఎఫ్ఐఆర్ ఇలా.. కొత్త విధానం ప్రకారం నేరం గురించి సమాచారం అందిన వెంటనే అధికార పరిధిలోని పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ విషయంలో అధికారి వెంటనే బాధితుడి ఇల్లు లేదా నేరం జరిగిన ప్రదేశం, ఆస్పత్రి, ఫిర్యాదుదారు ఎంచుకున్న ప్రాంతానికి వెళ్తారు. ఫిర్యాదును స్థానికంగా నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపుతారు. దాని కాపీని బాధితుడికి తమ ప్రాంతంలోనే అందిస్తారు. అవసరమైన చోట, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత నిబంధనల కింద స్టేట్మెంట్లను కూడా అదేస్థలంలో నమోదు చేస్తారు. అదేసమయంలో నేరం జరిగిన ప్రదేశం, ఆధారాలను భద్రపరుస్తారు. బాధితుడు గాయపడి చికిత్స పొందుతున్నట్లయితే.. పోలీసు సిబ్బంది బాధితుడి నివాసానికి, ఆస్పత్రికి వెళ్లి వివరాలను నమోదు చేస్తారు. ఆపై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ను బాధితుడికి ఇ–మెయిల్, వాట్సాప్ ద్వారా తెలియజేస్తారు. అవసరమైతే హార్డ్కాపీ అందిస్తారు. ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలోనే పోలీస్లు మొబైల్ పరికరాలతో వివరాలు నమోదు చేసి.. ఆ వెంటనే ఎఫ్ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) రాయడాన్ని స్పాట్ ఎఫ్ఐఆర్ అంటారు. ఇది సంప్రదాయ విధానానికి భిన్నంగా ఉండి, పోలీస్స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు నమోదు చేసే విధానం. -
కౌలు రైతు ఆత్మహత్య
రామడుగు/కొత్తపల్లి: వ్యవసాయంలో అప్పులు, అనారోగ్యంతో కొత్తపల్లికి చెందిన కౌలు రైతు చెక్కల అంజయ్య(65) క్రిమిసంహారక మందుతాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై కె.రాజు వివరాల మేరకు కొత్తపల్లి చెందిన కౌలు రైతు అంజయ్య పంటనష్టం, అప్పులు, అనారోగ్యంతో రామడుగు మండలం దేశ్రాజ్పల్లి శివారులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య మణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య ధర్మారం: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్(37) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంకటేశ్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల స్వగ్రామం వచ్చినా మద్యం తాగడం ఆపలేదు. ఇందుకోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారిలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్నాడు. గ్రామశివారులో పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే మంగళవారం మరణించాడు. ఈమేరకు మృతుడి భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దొంగతనం కేసులో ఒకరి అరెస్టు మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్ పరిధిలోని ఒకఇంట్లో దొంగతనం చేసిన తిరునాహరి రాజును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రమేశ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి 9.30 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కానిస్టేబుళ్లు అనిల్, శివకుమార్, నితిన్, రామకృష్ణ, వంశీ పాల్గొన్నారు. హత్యాయత్నం చేసిన భర్త రిమాండ్ ధర్మపురి: క్షణికావేశంలో భార్యపై పెట్రోలు పోసి నిప్పటించిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ధర్మపురిలోని ఎస్సీకాలనీకి చెందిన బడగు నవీన్కు మండలంలోని తుమ్మెనాలకు చెందిన మసీదు రమ్యతో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివా హం జరిగింది. కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడి రమ్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రమ్యపై భర్త కోపం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి నవీన్, రమ్య వద్దకు వెళ్లి ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. వెంటనే స్థానికులు 108లో జగిత్యాల, పరిస్థితి విషమించడంతో వరంగల్కు తరలించారు. బాధితురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి నవీన్ను రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. -
తెలుగులో 99 మార్కులు.. తిరుమల తీసుకెళ్లిన అధ్యాపకుడు
మానకొండూర్: తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ఓ అధ్యాపకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఇంటర్లో తెలుగు సబ్జెక్టులో 99 మార్కులు తెచ్చుకున్న వారిని తిరుమల వెంకన్న దర్శనానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఎనిమిది మంది 99 మార్కులు తెచ్చుకోగా ఇచ్చిన మాట ప్రకారం వెంకన్న దర్శనం చేయించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన బోళ్ల ప్రవీణ్కుమార్ కామారెడ్డి మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. తాను బోధించే విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుపై మక్కువ పెంచేలా వినూత్నంగా ఆలోచన చేశాడు. తెలుగులో 99 మార్కులు తెచ్చుకుంటే తిరుమల తీసుకెళ్తానని విద్యార్థులతో చెప్పాడు. గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన 40 మందిలో 8మంది 99 మార్కులు తెచ్చుకున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో తిరుమల తీసుకెళ్లడం వీలుకాకపోవడంతో సదరు విద్యార్థులను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన మరునాడు తిరుమల తీసుకెళ్లాడు. శనివారం వెంకన్న దర్శనానికి వెళ్లిన విద్యార్థులు మంగళవారం కామారెడ్డికి చేరుకున్నారు. వీరితో అధ్యాపకులు బాలమల్లు శ్రీకర్, రవి ఉన్నారు. -
అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు
కరీంనగర్టౌన్: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్నగర్లో ఉమ్మడి జిల్లా రైతు గర్జన సమరభేరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28న ఓసీ ఐకాస, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో లక్షమందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు పెండ్యాల కేశవ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, అయిత నాగరాజు, బండ గోపాల్ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, చాడ రవీందర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, కొత్తకొండ రవీందర్ రావు, గౌతమ్ శర్మ, చందుపట్ల జనార్ధన్, స్వామి పాల్గొన్నారు. రైతు మహా గర్జన సమరభేరి సభకు వేలాదిగా తరలి రావాలి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పొలాడి రామారావు ఓసీ ఐకాస జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి -
ఎల్ఎండీ శ్రీవేంకటేశ్వరాలయంలో చోరీ
తిమ్మాపూర్: మండలంలోని ఎల్ఎండీ కాలనీ అండాల్ పద్మావతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఇటీవలే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లకు అర్చకులు ఆభరణాలు అలకంరించారు. ఈ విషయం గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం గుడికి తాళం వేసి అర్చకులు ఇంటికి వెళ్లారు. మంగళవారం వేకువజామున శుభ్రపరచడానికి వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టబడి ఉండటం గమనించారు. వెంటనే అర్చకులకు సమాచారం అందించారు. అర్చకులు వచ్చి చూడగా స్వామి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించలేదు. ఆలయంలో గునపం, వాటర్ బాటిల్... చోరీకి వచ్చిన దొంగలు వెంట గునపం, వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు. గునపంతో తాళం పగలగొట్టి లోకిని ప్రవేశించి ఆభరణాలు అన్నీ మూటగట్టుకుని వెళ్లారు. చోరీ అయిన సొత్తు విలువ దాదాపు రూ.10 లక్షల పైగా ఉంటుందని అర్చకులు తెలిపారు. ఎల్ఎండీ పోలీసులు స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్, క్లూ టీమ్లకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
మైనర్ల మధ్య ఘర్షణ.. కత్తిపోటు ఘటన
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్లో సోమవారం రాత్రి మైనర్ల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోటు ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జన్మదిన వేడుకల సందర్భంగా ఒకేచోట చేరిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా కొందరు కత్తులతో దాడికి దిగినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం కేసులో సంబంధిత మైనర్లతో పాటు ఘటన సమయంలో అక్కడ ఉన్న వారందరినీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపినట్లు టౌన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. 26 నుంచి ఆర్టిజన్ల ఉద్యమంరామగుండం/పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్(టీవీఏఈ జేఏసీ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ తూళ్ల నాగరాజు కోరారు. ఈమేరకు విద్యుత్ సంస్థల సీఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్, టీజీట్రాన్స్కో, టీజీఎస్పీడీసీఎల్, టీసీఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లకు సమ్మె నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 26న డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నా, 30న రెండోసారి ధర్నా, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట ధర్నా, వంటావార్పు, ఏప్రిల్ 4న కేటీపీఎస్–పాల్వంచ జెన్కో విద్యుత్ కేంద్రం ఎదుట ధర్నా, ఏప్రిల్ 7న ‘చలో వరంగల్’తో టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అయినా, యాజమాన్యా లు, ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 8న నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. -
సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి
కొడిమ్యాల : మండలంలో గతనెల రోజులుగా అడవిలో తిరుగుతూ పశువులపై దాడి చేసిన పులి సోమవారం రాత్రి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆవును చంపిన పులికొంత భాగం తిని వదిలేసింది. మిగిలిన మాంసం కోసం మళ్లీ వచ్చే అవకాశం ఉన్నందున అటవీ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సోమవారం అర్ధరాత్రి తిరిగి మరోసారి ఆవు మాంసాన్ని తింది. పులి వయసు నాలుగున్నరేళ్లు ఉంటుందని తెలిపారు. పులిని ట్రాక్ చేసేందకు మూడు బృందాలను నియమించామని, పశువుల కాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి రవి ప్రసాద్ తెలిపారు. పులి ఆకలి తీర్చుకునేందుకు మరోసారి చనిపోయిన ఆవు వద్దకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎఫ్ఆర్ఓ గులాం మొయినద్దీన్, డీఎఫ్ఆర్వో ముషీర్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. -
బాలల హక్కులపై అవగాహన కల్పించాలి
కరీంనగర్టౌన్: బాలల హక్కుల పరిరక్షణపై గ్రామసభల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ సూచన మేరకు కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్కు హాజరై మాట్లాడారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లో బాలల హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కులు ఉల్లంఘిస్తే ఏ విధంగా శిక్షార్హులవుతారో వివరించాలన్నారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి పర్వీన్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖి కేంద్రం అడ్మిన్ లక్ష్మి పాల్గొన్నారు. ఆశ్రమంలో ఆకస్మిక తనిఖీ కిసాన్నగర్లోని ప్రభుత్వ వృద్ధులు, దివ్యాంగుల ఆశ్రమాన్ని కలెక్టర్ చిత్రామిశ్రా మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వృద్ధుల నివాస గదులు, వంటగది, తాగునీటి వసతి, టాయిలెట్లను పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులతో ముచ్చటించారు. భోజనం, వసతిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారికి ట్రై సైకిల్ మరమ్మతులు చేయించాలని, చేతి కర్రలు అందజేయాలని దివ్యాంగులశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సూపరింటెండెంట్ నర్మద, వార్డెన్ రాధిక ఉన్నారు. -
కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార బ్యాంకు(కేడీసీసీబీ) మరో ఖ్యాతి గడించింది. దేఽశంలోనే ఫస్ట్ బెస్ట్ ఫర్ఫిమింగ్ డీసీసీబీ ఇన్ ఇండియా(2024–25) అవార్డును అందుకుంది. మంగళవారం సిక్కింలో ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి అరుణ్ ఉప్రేటీ చేతుల మీదుగా బ్యాంకు సీఈవో నందెల్లి సత్యనారాయణరావు స్వీకరించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ డా.సతీశ్ మటాథే, నాఫ్క్సాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎండీ భీమాసుబ్రహ్మణ్యం బ్యాంకు విజయాన్ని ప్రశంసించారు. జనరల్ మేనేజర్లు బి.శ్రీధర్, ఎం.డి.రియాజోద్దీన్, డీజీఎం బ్రహ్మనందరావు పాల్గొన్నారు. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అత్యుత్తమ సంఘంగా అవార్డు పొందగా, కా ర్యదర్శి బద్దం రాజేందర్ అవార్డును స్వీకరించారు. పతనం నుంచి అగ్రస్థానానికి 2005– 06 సంవత్సరంలో రూ.57.92కోట్ల నష్టాలతో ఉన్న కేడీసీసీబీ కొండూరు రవీందర్రావు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన నుంచి అనేక సంస్కరణలు చేపట్టారు. గతంలో రూ.402కోట్లుగా ఉన్న బ్యాంకు వ్యాపారం నేడు రూ.8వేల కోట్లకు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ వినూత్న పథకాలతో వాణిజ్య బ్యాంకులకు గట్టి పోటీనిస్తోంది. సుదీర్ఘ కాలం ఛైర్మన్గా సేవలందించిన కొండూరు రవీందర్రావు సూచనలు, సలహాలతో బ్యాంకు ఎంతగానో అభివృద్ధి సాధించిందని బ్యాంక్ సీఈవో సత్యనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. -
జనగణన శిక్షణ షురూ
కరీంనగర్ అర్బన్: జనగణన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు హైదరాబాద్లో శిక్షణనివ్వగా జిల్లాకేంద్రంలో సంబంధిత అధి కారులకు శిక్షణనిస్తున్నారు. మూడు దశల్లో శిక్షణలు జరగనుండగా తొలి దశగా జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, చార్జి ఆఫీసర్లకు శిక్షణనిస్తున్నారు. మూడు రోజుల ప్రక్రియలో భాగంగా మంగళవారంతో ముగిసింది. సంబంధిత జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు, డీటీలు, ఎంపీడీవోలు పాల్గొనగా జనగణనలో పాటించాల్సిన మెలకువలను నేర్చుకున్నారు. రెండో దశలో టెక్నికల్ అసిస్టెంట్, చార్జి క్లర్క్లకు ఈ నెల 24నుంచి 26వరకు మూడు రోజులు శిక్షణనివ్వనుండగా, మూడో దశలో ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులు ఏప్రిల్ 1 నుంచి 3వరకు శిక్షణనివ్వనున్నారు. శిక్షణ కలెక్టరేట్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇక కార్పొరేషన్కు సంబంధించి రాష్ట్ర కమిషనర్ స్థాయిలో పర్యవేక్షణనుండగా హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు ఇతర మండలా లన్నింటికి కలెక్టర్ చిత్రా మిశ్రా పర్యవేక్షణ ఉండనుంది. మే 11 నుంచి హౌస్ లిస్టింగ్ జనగణనలో నివాసాల సంఖ్యను బట్టి ఎన్యుమరేటర్ బ్లాక్ను నిర్ణయిస్తారు. 120– 150 నివాసాలను ఒక బ్లాక్గా విభజించగా సదరు బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ను నియమిస్తారు. ఈ క్రమంలో బ్లాకుల సంఖ్య మునిసిపాలిటీల్లో పెరగగా పలు మండలాల్లో సంఖ్య తగ్గింది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేయగా రూరల్ మండలాల్లో గ్రామాల సంఖ్య తగ్గింది. అత్యధికంగా కరీంనగర్లో బ్లాక్ల సంఖ్య ఉంది. గత జనగణనలో 388 బ్లాకులుగా లెక్కించగా ఈ సారి 808కి చేరింది. అంటే 420 బ్లాక్లు పెరిగాయన్న మాట. జమ్మికుంటలో గతంలో 139 బ్లాక్ల్లో గణన జరగగా ఈ సారి 83కు పరిమితమైంది. హుజూరాబాద్ రూరల్లో 124 బ్లాక్లు కాగా 79కు చేరింది. మే 11 నుంచి జూన్ 9వరకు హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టనుండగా బ్లాక్ల సంఖ్య మరింత పెరగనుంది. ఎన్యుమరేటర్లుగా టీచర్లు ఉండనుండగా ప్రస్తుత జాబితా అంచనా మాత్రమే హౌజ్ లిస్టింగ్తో బ్లాక్ల సంఖ్యపై స్పష్టత రానుంది. 2027 ఫిబ్రవరిలో హౌజ్ సెన్సెస్ ప్రారంభం కా నుండగా ఏప్రిల్ వరకు ప్రక్రియ పూర్తయి మే లేదా జూన్లో పక్కా గణాంకాలు వెల్లడించనున్నారు. జనగణనపై అవగాహనతో సాగండి జనగణన– 2027 కోసం ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. మంగళవారం నాటి జనగణన శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన కోసం సూచించిన యాప్ రిజిస్ట్రేషన్, పనితీరు తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వస్తుంటాయని, ఉన్నతాధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకొని పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అన్నారు. ఆర్డీవో మహేశ్వర్, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్, సీపీవో రామ్ దత్తారెడ్డి ఉన్నారు. -
పీఎంశ్రీ విద్యార్థులకు స్పెల్బీ
కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పురాతన పాఠశాలలో జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు మంగళవారం జిల్లాస్థా యి మాడల్ యునైటెడ్ నేషన్స్ స్పెల్బీ పరీక్ష నిర్వహించారు. 22 పాఠశాలల నుంచి 40మంది విద్యార్థులు హాజరయ్యారు. 11మందిని రా ష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రెండో విడత కార్యక్రమానికి 36మంది హాజరు కాగా పది మంది ని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. మోడల్ యునైటెడ్ నేషన్స్ న్యాయ నిర్ణేతలుగా బి.తిరుపతి, ఏ.కుమారస్వామి. ఆర్.పవన్ కుమార్, స్పెల్బీ నిర్వహణకు వినయధర్ రాజు, శివకుమార్, మంజుర్ అలీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, జిల్లా సైన్స్ అధికారి జయపాల్రెడ్డి ఉన్నారు. కరీంనగర్రూరల్: సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పంట దిగుబడులు పెరుగుతాయని జిల్లా వ్యవసాయాధికారి జె.భాగ్యలక్ష్మి అన్నా రు. మంగళవారం కరీంనగర్ మండలం మొ గ్ధుంపూర్ రైతువేదికలో వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో ప్రధాన వరి రకాలు,సహజ వ్యవసాయం, నూనెగింజలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఏవో మాట్లాడుతూ రసాయన రహిత వ్యవసాయంతో నేల ఆరోగ్యంగా ఉంటుందని, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే అవకాశముందన్నారు. సర్పంచు మా దాసు సీనమ్మ, ఉపసర్పంచు కూకట్ల రమేశ్, ఏడీఏ రణధీర్కుమార్, ఏవో సత్యం, ఏఈవో లు స్వర్ణలత, ఉదయ్, సాయికిరణ్ ఉన్నారు. చిగురుమామిడి: రైతులు తమ పశువులకు గా లికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాల ని జిల్లా పశుసంవర్థశాఖ జాయింట్ డైరెక్టర్ లింగారెడ్డి సూచించారు. మంగళవారం రేకొండలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 92,500 పశువులకు ఇప్పటి వరకు 14,468 పశువులకు టీకాలు వేశామన్నారు. పశువులను మండు వేసవిలో జాగ్రత్తగా కాపాడాలన్నారు. మండల పశువైద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, వెట ర్నరీ అసిస్టెంట్లు సత్యం, శ్రీనివాస్ ఉన్నారు. కరీంనగర్టౌన్: రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావల్సిన బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి డిమాండ్ చేశారు. స్థానిక పెన్షనర్ భవన్లో మంగళవారం మాట్లాడుతూ 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినవారికి రావల్సిన బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. బకాయిల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా చలనం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతినెలా రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ రిటైర్మెంట్ అయిన వాళ్లకు అందడం లేదన్నారు. సంఘం బాధ్యులు కనపర్తి దివాకర్, జి.రవీందర్రావు, ప్రభాకర్, కిషన్, సుధాకర్, రవీందర్, శంకర్, సత్తయ్య, ఆనందం పాల్గొన్నారు. -
ఆశాల వంటావార్పు
కరీంనగర్టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు తలపెట్టిన 48 గంటల దీక్ష, ధర్నా, వంటావార్పు మంగళవారంతో విజయవంతమైంది. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు పుల్లెల మల్లయ్య దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 ఇవ్వాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారెళ్ల శ్రీలత, కాల్వ సారిక, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ, రజిత, సరిత, లత, జిల్లా సహాయ కార్యదర్శులు సుమలత, శ్యామల, సరోజన ఉన్నారు. -
అడ్డదారిలో.. అడ్డగోలుగా
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు: 23హెచ్పీసీఎల్: 09, ఐవోసీఎల్: 06బీపీసీఎల్: 08ఇటీవల హోటల్లో పట్టుకున్న డొమెస్టిక్ సిలిండర్లుకరీంనగర్ అర్బన్: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ పంపిణీలో మొన్నటి వరకు ప్రభుత్వం విధించిన నిబంధనలతో జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేత దిశకు చేరకున్నాయి. 20శాతం ఇబ్బంది ఉండగా... 80శాతం ఫుడ్ బిజినెస్ నిరాటంకంగా సాగుతోంది. ఇందుకు కారణంపై అధికారులు లెక్కలు వేయగా.. జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 2,717 ఉండగా.. ఐదువేలకు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో వాడేది డొమెస్టిక్ గ్యాసేనని స్పష్టమవుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, ప్రైవేట్ హాస్టళ్లు ఇలా అన్నీ కలిపితే జిల్లాలో 7వేల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్ని కమర్షియల్ కనెక్షన్లు ఉండాలి.? హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టళ్లలో వాడుతున్న గ్యాస్ కమర్షియలేనా.? అలాగైతే లెక్క ఏదనే అనుమానం వ్యక్తమవుతోంది. అంతటా డొమెస్టిక్ గ్యాసే నిబంధనల ప్రకారం వ్యాపారం చేసే వారెవరైనా కమర్షియల్ కనెక్షన్ ఉండాలి. కరీంనగరంతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, శంకరపట్నం, కొత్తపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్, రామడుగు, చిగురుమామిడి, సైదాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వ్యాపార కేంద్రాలు కోకొల్లలు. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరని ప్రభుత్వ నిబంధనలు చెబుతుండగా యంత్రాంగ పర్యవేక్షణ కొరవడిందని స్పష్టమవుతోంది. ఒకవేళ ట్రేడ్ లైసెన్స్లు వేలల్లో ఉంటే కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 2,717 మాత్రమే ఉంటాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న కుటుంబాల కన్నా 1.70లక్షల కనెక్షన్లు ఎక్కువగా ఉండటం అధికారుల డొల్లతనాన్ని, కంపెనీల సేల్స్ ఆఫీసర్ల లోపాయికారి ఒప్పందాన్ని చాటుతోంది. ప్రక్షాళన జరిగేనా? కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ను సబ్సిడీతో తక్కువ ధరకు ఇస్తోంది. డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.984 కాగా కమర్షియల్ సిలిండర్ ధర రూ.2145. దీంతో పలు ఏజెన్సీలు దొడ్డిదారిన కనెక్షన్లు జారీ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుండగా సగానికి పైగా కనెక్షన్లకు ఈకేవైసీ కాలేదని సమాచారం. సదరు ప్రక్రియలో ఏజెన్సీలు కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా మెతక వైఖరి ప్రదర్శించడం అనుమానాలకు తావిస్తోంది.కంపెనీస్ యాక్ట్ 2013 ఇండియా సీఎస్ఆర్ ప్రొవిజన్ ప్రకారం పెద్ద కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సీఎస్ఆర్ కోసం ఖర్చు చేయా లి. లాభం సంపాదించడం కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది కంపెనీస్ సోషల్ రెస్సొసిబిలిటీ(సీఎస్ఆర్) ఉద్దేశం. ఈ విభాగంలో జిల్లాలో 27,454 గ్యాస్ కనెక్షన్లున్నాయని ఏజెన్సీలు చూపుతున్నాయి. మరి సదరు కనెక్షన్లు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ప్రయోజనం అందిస్తున్నాయో తేల్చాల్సిన అవసరం అత్యవసరం. కలెక్టర్ చొరవ చూపి డొమెస్టిక్ గ్యాస్ సద్వినియోగం జరిగేలా చర్యలతో పాటు దుర్వినియోగంపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
శాప్ ఇన్నోవేషన్లో జ్యోతిష్మతి విద్యార్థుల ప్రతిభ
తిమ్మాపూర్: హైదరాబాద్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈనెల 13న ఎడునెట్ ఫౌండేషన్, టాస్క్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శాప్కోడ్ ఉన్నతి ఇన్నోవేషన్ మారథాన్ 2025–26 లో జ్యోతిష్మతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విద్యాసంస్థల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగింది. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మారథాన్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తె లంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విద్యాసంస్థల నుంచి మొత్తం 560 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..109 టీంలు క్వార్టర్ ఫైనల్కు ఎంపికయ్యాయి. వాటిలో 64 టీంలు సెమీఫైనల్కు చేరుకున్నాయి. చివరగా 29 టీంలు ఫైనల్ రౌండ్కు ఎంపికయ్యాయి. తుది ఫలితాలలో జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు షేక్ జోహైబ్ ఉర్ రహ్మాన్, పనుగంటి వర్షిణి విజేతలుగా నిలిచారు. ప్రాజెక్ట్ వినూత్నత , ఆచరణాత్మక ఉపయోగం కారణంగా ప్రత్యేకంగా నిలి చింది. ఈ సందర్భంగా జ్యోతిష్మతి చైర్మన్ జువ్వాడి సాగర్ రావు , సెక్రటరీ, కరస్పాండెంట్ జె. సుమిత్సాయి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ టి. అనిల్ కుమార్, డీన్ (అకాడెమిక్స్) పీకే వైశాలీ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
గ్రైండర్ యాప్ ద్వారా బుక్ చేసుకుని..
కరీంనగర్రూరల్: హోమో సెక్స్ కోసం ఓ యువకుడిని కరీంనగర్కు పిలిపించి దాడికి పాల్పడి డబ్బులు దోచుకున్న ముగ్గురిని కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్ సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేటకు చెందిన రమిల్లా కృష్ణమూర్తిని గ్రౌండర్ డేటింగ్ యాప్ ద్వారా కరీంనగర్కు చెందిన జుమైర్ బుక్ చేసుకున్నాడు. హోమోసెక్స్, మసాజ్ చేయాలని, డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో ఈ నెల 14న బెల్లంపల్లిలో రైలెక్కి కరీంనగర్ రైల్వేస్టేషన్కు వచ్చాడు. కృష్ణమూర్తిని బైక్పై ఎక్కించుకున్న జుమైర్ బొమ్మకల్ బైపాస్లోని ఓ ఫంక్షన్హాల్ వెనుకభాగం తీసుకెళ్లాడు. కృష్ణమూర్తిని హోమోసెక్స్ చేయాలని బలవంతం చేస్తున్న క్రమంలో రేకుర్తికి చెందిన సయ్యద్ అబ్బాస్ అలియాస్ అర్బస్, కిసాన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ఖాన్ అక్కడికి వచ్చారు. హోమో సెక్స్ చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నావంటూ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. తన దగ్గర ఉన్న డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. భయపడిన కృష్ణమూర్తి రూ.1,500 నగదుతోపాటు సెల్ఫోన్ అప్పగించాడు. అనంతరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం తీగలగుట్టపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సీఐ నిరంజన్రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ను సీపీ గౌస్ అలం, ఏసీపీ అభినందించారు. హోమో సెక్స్కు పిలిచి దాడి ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు


