breaking news
Karimnagar District Latest News
-
విద్యావ్యవస్థకు నిర్దేశం ‘చదువుల చిలకమ్మ’
కరీంనగర్ కల్చరల్: ‘చదువుల చిలకమ్మ’ నవల నేటి విద్యా వ్యవస్థకు ఎంతో అవసరమ ని, ఒక తరాన్ని మార్చగలిగే అక్షర రూపమని ప్రముఖ కవి సాదనాల వెంకటస్వామి నాయు డు అన్నారు. భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన సోమవారం కరీంనగర్ ఫిల్మ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కోట లక్ష్మణ్ రచించిన ‘చదువుల చిలకమ్మ’ నవలను ఆవిష్కరించారు. సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పుస్తకం పాఠశాల విద్యలో మార్పులకు దోహదపడుతుందన్నారు. ఉదయ సాహితీ అధ్యక్షు డు ఎర్రం రాజారెడ్డి ఒత్తిడి లేని విద్య, స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యసన ప్రాధాన్యాన్ని వివరించారు. స్తంభంకాడి గంగాధర్, నడిమెట్ల రామయ్య, అన్నమరాజు శ్రీధర్రావు, కాసం రాజమౌళి, వెల్ముల జయపాల్రెడ్డి, సీహెచ్.రమేశ్, సంగోజు శ్రీనివాస్, కనపర్తి రాజశేఖర్, రాము ఇటిక్యాల్, కోడూరి రవి, కసిరెడ్డి జలంధర్రెడ్డి, జనగాని యుగంధర్, బి.శ్రీనివాస్, ఎం.సాంబమూర్తి, మాసం సీమ, డి.శంకరయ్య, ఖాలీద్ పాల్గొన్నారు.నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేయాలిగంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్తో నష్టపోతున్న గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మైత్రీ గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని, 13మంది గ్రామస్తులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్ష సోమవారం రెండోరోజు కొనసాగింది. రవిశంకర్తో పాటు పలువురు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ముందు తాను గెలిచిన తరువాత నెలరోజుల్లో నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నా రు. కొన్ని ఇళ్లను ముంపు కింద తీసుకొని మిగితా వారికి అన్యాయం చేయొద్దన్నారు. రైల్వే గేటు వద్ద ఇరుక్కుపోయిన లారీగంగాధర: కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర మండలం మంగపేట రైల్వేస్టేషన్ సమీపంలోని టి 29 గేటు వద్ద సోమవారం ఉదయం భారీ లారీ ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ గేటు వద్ద తరచూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు పేర్కొంటున్నారు. గేటు మొరాయించడం, భారీ వాహనాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యలతో ట్రాఫిక్జామై అంబులెన్సు వచ్చినప్పు డు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని, బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. -
ముగిసింది సర్
కరీంనగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువు ముగిసింది. బూత్స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి పత్రాలు సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. సేకరించిన ఓటర్ల వివరాలను అర్ధరాత్రి వరకు బీఎల్వోలు ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 10,89, 090 మంది ఓటర్లు ఉండగా, అందులో వందశాతం ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఓటర్లకు పంపిణీ చేశారు. చివరిరోజు డిజిటలైజేషన్తో బిజీబిజీ ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్ ఫామ్స్ను అన్ని వివరాలతో పూర్తిచేసి బీఎల్వోలకు అందజేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో నివాసం ఉంటున్నవారు బోనాల పండుగ సందర్భంగా స్వస్థలాలకు రావడంతో తమఓటు వివరాలను నమోదు చేసుకున్నారు. చివరిరోజు కూడా బీఎల్వోలకు పెద్దసంఖ్యలో ఎన్యూమరేషన్ పత్రాలు అందాయి. ఒకవైపు ఫామ్స్ సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం సమీపిస్తుండడంతో చివరిరోజు రాత్రివరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించారు. 46 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తొలుత జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎ న్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈకాలంలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించి డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు సోమవారం తెరపడింది. ఈనెల 17న డ్రాఫ్ట్ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు తదుపరిదశపై దృష్టి సారించనున్నారు. ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఓటర్లు ఈ జాబితాలో తమపేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీచేసి అక్టోబర్ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తిచేసిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక ఓటర్లంతా డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యే రోజును దృష్టిలో పెట్టుకుని తమపేరు, వివరాలను మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాగా సోమవారం సెలవు రోజు కావడంతో వివరాల నమోదులో ఆలస్యమైందని.. మంగళవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
కేంద్రమంత్రిని కలిసిన సాయిని మల్లేశం
కరీంనగర్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను సోమవారం కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మల్లేశంను సంజయ్ అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాశ్, గాజ రమ శివరాం, కర్రె పద్మ అనిల్, నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, గుంజేటి శివ, గాదగోని రమేశ్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్.. ఫికర్
కరీంనగర్టౌన్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అందించిన ట్రాక్టర్ల నిర్వహ ణ పాలకులకు భారంగా మారింది. నిధుల కొరతతో పాలకులు సతమతమవుతుండగా.. ట్రాక్టర్ కిస్తీలు, డీజిల్, మరమ్మతులు, సిబ్బంది వేతనాలు అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లకు బీమా రెన్యూవల్ కాకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. నెలకు రూ.43 వేల భారం జిల్లాలోని 318 గ్రామపంచాయతీలున్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ, నర్సరీలకు నీటి సరఫరా, మొక్కలకు నీరు పట్టడం తదితర పనుల కోసం గత ప్రభుత్వం ట్రాక్టర్లు అందించింది. వాహన రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందేనని అప్పుటి సర్పంచ్లపై ఒత్తిడి చేయడంతో కొత్త మంది చేయించారు. మరికొందరు విముఖత చూపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన కొత్త సర్పంచ్లు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. నిర్వహణ ఖర్చులు పంచాయతీలపైనే పడుతున్నాయని సతమతవుతున్నారు. చిన్న పంచాయతీల్లో ఒక్క ట్రాక్టర్ నిర్వహణకు నెలకు సుమారు రూ.43 వేల వరకు ఖర్చవుతున్నట్లు చెబు తున్నారు. ట్రాక్టర్ కిస్తీకి రూ.16 వేలు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు రూ.17వేలు, మరమ్మతులకు రూ.2,500, డీజిల్కు రూ.8 వేల వరకు ఖర్చవుతోందని పేర్కొంటున్నారు. చిన్న పంచాయతీలకు వచ్చే నిధుల్లో సగానికిపైగా ట్రాక్టర్ నిర్వహణకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాల్లోనూ పరిస్థితి అదే విధంగా ఉంది.కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాలేదని, మరికొన్ని వాహనాలకు బీమా గడువు ముగిసినా రెన్యూవల్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల కొరత, పాలకవర్గాలు లేకపోవడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్, బీమా లేకుండా ట్రాక్టర్ నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు జిల్లాలోని అన్ని పంచాయతీల ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్, బీమా వివరాలను పరిశీలించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సర్పంచ్లు కోరుతున్నారు. పంచాయితీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు వాణిజ్య విభాగం కిందికి వస్తాయి. ప్రతి మూడు నెలలకోసారి ట్రాక్టర్ ఇంజిన్కు రూ 400(వాహన జీవీడబ్యూపై ఆధారపడి ధర మారుతోంది) ట్రాలీకి రూ 770, ట్యాంకర్కు రూ.770 చొప్పున పంచాయతీలు పన్నులు చెల్లించాలి. ఏడాది బీమా ప్రీమియం రూ.13 వేల నుంచి రూ.15వేల వరకు కట్టాలి. వ్యవసాయ ఆధారిత ట్రాక్టర్లయితే మూడు నెలల పన్నులు ఉండవు. బీమా ప్రిమియం ఏడాదికి రూ.11 వేల ఉంటుంది. ఇలాంటి నిబంధనలు ఏ గ్రామ పంచాయితీలోనూ అమలు కావడం లేదని తెలుస్తోంది. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం33.0/26.0మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 20267భీమన్నకు మొక్కులు వేములవాడ: భీమన్నను సోమవారం భారీగా భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.కొత్తపల్లి: 33/11 కేవీ బ్యాంక్కాలనీ సబ్స్టేషన్ పరిధి లో లైన్ పనులు చేపట్టనున్నందున నేడు మధ్యాహ్నం 12నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ–1 పి.శ్రీనివాస్ తెలిపారు. -
● జిల్లాలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై కలెక్టర్ సమీక్ష
కరీంనగర్ అర్బన్: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రామిశ్రా కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. చొప్పదండి, కరీంనగర్, మానకొండూర్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్ల లొకేషన్లలో అవసరమైన మార్పులపై చర్చించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 1200 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నట్లయితే మరో పోలింగ్ స్టేషన్ పరిధిలో చేరుస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల పరిశీలన అనంతరం తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో జల కుమారి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో సుమారు 3.44లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని, ఇప్పటివరకు 2.86లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, 2.21 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని పేర్కొన్నారు. మిగతా సాగు భూముల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు వంటివి సాగు చేయాలన్నారు.ఏం చేద్దాం.. ఎలా చేద్దాం -
కల్తీ.. నిఘా గల్తీ
కరీంనగర్ అర్బన్: జిల్లా వ్యవసాయశాఖ రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సింది పోయి అక్రమార్కులకు కొమ్ముకాస్తుందనే విమర్శఽలు వస్తున్నాయి. కల్తీరాయుళ్లను అరికట్టాల్సిందిపోయి మామూళ్ల మత్తులో తూగుతుందనే విమర్శలొస్తున్నాయి. రూ.లక్షల్లో వ్యాపారం ప్రభుత్వపరంగా విత్తనాలు, ఎరువుల ఉత్పత్తి అంతంతమాత్రమే.ప్రయివేటు కంపనీలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఎరువులు నాణ్యమైనవా, కల్తీయా తేల్చే ఎరువుల నియంత్రణ కేంద్రం కొత్తపల్లిలో ఉంది. గతంలో ఆదృశ్య శక్తులు సదరు పరీక్ష కేంద్రానికి మోకాలడ్డగా సదరు వ్యక్తులే కల్తీ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్లలో దందా సాగుతుండగా వ్యవసాయ అధికారులు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. శాంపిళ్ల సేకరణ నామమాత్రమేనా.? సీజన్కు 500 వరకు శాంపిళ్లను సేకరించాల్సి ఉండగా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మాత్రమే పరీక్ష కేంద్రాలున్నాయి. గతంలో హైదరాబాద్, వరంగల్కు శాంపిళ్లను పంపేవారు. ఇప్పుడు జిల్లాలోనే కేంద్రం ఉన్నా నామమాత్రంగా శాంపిళ్లను సేకరిస్తున్నారు. సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు..? మొగ్ధుంపూర్లో వెలుగుచూసిన నకిలీ ఎరువుల బా గోతం నిశబ్దంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో లైసెన్స్ సస్పెండ్ అయిన వ్యక్తి ఈ తతంగాన్ని నడుపుతున్నారని వ్యవసాయశాఖ చెబుతుండగా సూత్రదారులెవరు, పాత్రదారులెవరో తేల్చాల్సిన యంత్రాంగం మొద్దునిద్ర నటించడం ఆశ్చర్యకర పరిణామం. రైతులు ఎక్కడ కొనుగోలు చేశారు, విక్రయించిన వ్యక్తి ఎక్కడ నుంచి ఎరువులను తెచ్చారు, అసలు నకిలీ ఎరువు ఎక్కడ తయారవుతుంది. ఎవరెవరి పాత్ర ఎంత, అధికారు ల ప్రమేయం ఏమైనా ఉందా, ఇన్నాళ్లు దందా సాగుతుందంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.. తదితర కోణాల్లో కూపీ లాగాల్సిందిపోయి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకోవడం గమనార్హం.గత నెల 9న మొగ్ధుంపూర్లో వ్యవసాయశాఖ అధికారి సత్యం తనిఖీలు చేసి కోరమాండల్ పేరిట ఉన్న నకిలీ 28.28.0 ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని శాంపిళ్లను సేకరించారు. నకిలీవని ఫర్టిలైజర్ కంట్రోల్ తేల్చడంతో కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెలరోజులైనా సదరు కేసు పురోగతి లేదు. ఫర్టిలైజర్ నిర్వాహకుడు తాను విక్రయించ లేదంటున్నాడని, కేసును పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. -
నగరాభివృద్ధిలో ఆధునిక సాంకేతికత
కరీంనగర్ కార్పొరేషన్: నగరాభివృద్ధికిఽ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు పనుల్లో వేగం, నాణ్యత కోసం అజాక్ష్ సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నగరపాలకసంస్థ 35వ డివిజన్లో అజాక్ష్ ఆధునిక యంత్రంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. యంత్రాన్ని స్వయంగా నడిపి పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమన్నారు. అజాక్ష్ యంత్రం ద్వారా కాంక్రీట్ తయారీ, మిశ్రమ నిష్పత్తుల నియంత్రణ, నిర్మాణ ప్రాంతంలోనే కాంక్రీట్ సిద్ధం చేయడం, వేగవంతమైన సరఫరా వంటి ప్రయోజనాలు లభిస్తాయన్నారు. కార్పొరేటర్ సుజాత, శ్రీనివాస్ ఉన్నారు. డివిజన్లలో వసతులకు కృషి ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరపాలకసంస్థ 21వ డివిజన్ కొత్తయాస్వాడలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి ప్రారంభించారు. లైట్ల ఏర్పాటుతో కొత్తయాస్వాడ ప్రాంతంలో రాత్రివేళల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పాయన్నారు. -
● ఆరెపల్లిలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ ● స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేత
కరీంనగర్రూరల్: కార్పోరేషన్ విలీన గ్రామాల్లో ప్రభుత్వస్థలాలను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. ఆరెపల్లిలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే షెడ్డు నిర్మాణం చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయగా కొందరు కార్పొరేటర్ భర్తను బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ఆరెపల్లిలోని సర్వేనంబరు120 లోని ప్రభుత్వస్థలంలో గత బీఆర్ఎస్ హ యాంలో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించారు. లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. మిగిలిన ప్రభుత్వస్థలంలో ఓ వ్యక్తి మూడు రోజుల నుంచి షెడ్డు నిర్మాణం చేపట్టాడు. వరుసగా వచ్చిన మూడు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుని, రాత్రివేళల్లో పనులు కొనసాగించా డు. ప్రశ్నించిన స్థానికులను ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిందని బెదిరింపులకు గురిచేయడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశా రు. సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ అధికారులు షెడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిందని సదరు వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు ప్రభుత్వస్థలంలో అక్రమ నిర్మాణంగా గుర్తించి జేసీబీతో షెడ్డుగోడలను కూల్చివేయించారు. ఈ వ్యవహారంలో కొందరు ఆక్రమణదారుడికి మద్దతుగా 1వ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ భర్త జితేందర్ను బెదిరింపులకు గురిచేశారు. విలీన గ్రామాల్లో విలువైన ప్రభుత్వస్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.రాత్రికి రాత్రే షెడ్డు నిర్మాణం -
పంద్రాగస్టుకూ పాత దుస్తులేనా?
కరీంనగర్టౌన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా జిల్లాలో ఒక్క విద్యార్థికి కూడా కొత్త యూనిఫాం అందలేదు. పంద్రాగస్టు వేడుకలకు పాత దుస్తులతోనే హాజరు కావాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల ప్రణాళిక లోపం, వస్త్రం సరఫరాలో జాప్యం, కుట్టించే ప్రక్రియలో నిర్లక్ష్యంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. కలెక్టర్ ఆదేశించినా పంద్రాగస్టు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జెండా పండుగలోపు విద్యార్థులకు యూని ఫాం అందించాలని ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం పుంజుకోలేదు. మరో నాలుగు రోజుల్లో పంద్రాగస్టు వేడుకలు ఉండగా.. యూని ఫాం ఎప్పుడు కుడతారు..? ఎప్పుడు విద్యార్థులకు అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కొక్కరికి రెండు జతలు ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు, 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, బాలికలకు రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాల్సిన దుస్తులు రెండు నెలలు గడిచినా అందకపోవడంతో విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. 74 వేలకుపైగా దుస్తులు జిల్లాలో 616 ప్రభుత్వ పాఠశాలల్లో 37,227 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున 74,446 దుస్తులు అవసరం. ప్రభుత్వం వస్త్రాన్ని సరఫరా చేసి, మహిళా సంఘాలు, ఐకేపీ, ఎన్జీవోల ద్వారా కుట్టించే బాధ్యతను అప్పగించింది. పంద్రాగస్టు నాటికై నా కొత్త దుస్తులు అందుతాయా? లేక గతేడాది దుస్తులతోనే జెండా పండుగకు హాజరు కావాల్సి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
వెంకటేశంను యజమానే హతమార్చాడు
సిరిసిల్లటౌన్: యజమానే యముడయ్యాడు. తరుచూ పని మానేస్తుంటే తొలగిస్తామని చెప్తే మృతుడి భార్య వచ్చి గొడవ చేస్తుండడంంతో వర్కర్పై కక్షపెంచుకున్నాడు. హత్య చేస్తే కేసు మున్సిపల్ వైస్చైర్మన్పైకి పోతుందని భావించి మద్యంలో రసాయనం కలిపి అంతమొందించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిస్టరీగా ఉంటున్న వైపని కార్మికుడు వెంగల వెంకటేశం మృతిలో కీలక నిందితుడిని సిరిసిల్ల డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తారకరామానగర్కు చెందిన వెంగల వెంకటేశం(50) బి.వై.నగర్కు చెందిన కుసుమ గణేశ్ వద్ద వైపని కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వెంకటేశం తరచూ పనికి రాకుండా ఉండడం, పని మధ్యలో చెప్పకుండా వెళ్లిపోయేవాడు. ఇలాంటి సమయంలో పనిలోంచి తొలగిస్తానని గణేష్ హెచ్చరించినప్పుడల్లా వెంకటేశం భార్య వచ్చి గొడవకు దిగేది. ఈనేపథ్యంలో వెంకటేశంపై గణేశ్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల సిరిసిల్ల మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు రూ.లక్ష డిమాండ్ చేశారన్న ఆరోపణలు వెంకటేశం, అతని భార్య సులోచన చేయగా కేసు నమోదైంది. వెంకటేశంను హత్య చేస్తే, నేరం దార్ల సందీప్పైకి పోతుందని గణేష్ భావించాడు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో దార్ల సందీప్కు పోటీగా బరిలో నిలిచి ఓడిపోయిన మార్గం లక్ష్మణ్తో గణేశ్ స్నేహం ఉంది. సందీప్ పదవి కోల్పోతే లక్ష్మణ్కు ఎవరూ పోటీ ఉండరని, వెంకటేశంతో తనకున్న సమస్య తీరుతుందని భావించాడు. ఈనేపథ్యంలో ఈనెల 6న గణేశ్, వెంకటేశంను మద్యం తాగడానికి రగుడు సమీపంలోని గుట్టకు తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం కొని వెంకటేశం తాగే మద్యంసీసాలో నైట్రాప్(డైయింగ్ రసాయనం)కలిపి ఉంచాడు. దానిని వెంకటేశంతో తాగించి ఏమి ఎరుగనట్లు ఇంటికొచ్చేశాడు. పట్టిచ్చిన సూసైడ్నోట్ మృతుడి భార్య సులోచన ఫిర్యాదుతో ఈనెల 6న సిరిసిల్ల ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరీక్షించారు. మృతుడు, నిందితుడు ఇద్దరు కలిసి వెళ్లడాన్ని గమనించి విచారణ చేపట్టారు. గణేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంకటేశంను నైట్రాప్ తాగించి చంపినాక అతని జేబులో గణేశ్ సూసైడ్నోట్ను ఉంచాడు. అస్సలు రాయడం రాని వెంకటేశం సూసైడ్నోట్ ఎలా రాస్తాడని పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనలో అధికార పార్టీ నేత మార్గం లక్ష్మణ్, పోసు రమేశ్, పసునూరి సూర్యప్రకాశ్తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని హత్యకేసులో వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బి.రవి, ఎన్.శ్రీనివాస్లను అభినందించారు. మద్యంలో నైట్రాప్ తాగించిన గణేశ్ మరో నలుగురిపై సాగుతున్న దర్యాప్తు హత్య కేసులో నిందితుడు రిమాండ్ వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి -
రాజన్న గర్భగుడిని టచ్ చేస్తే ఊరుకోం
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి ఏం జరుగుతుందో.. ఎవరికి అనుమతి ఇవ్వడం లేదని.. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం గుడిని నిర్మిస్తున్నామంటూనే.. ఆగమాగం చేస్తున్నారన్నారు. వేములవాడలోని పద్మశాలీ భవనంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధి పేరుతో గర్భగుడిని టచ్చేస్తే శ్రావణమాసంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల సందర్భంగా ప్రవర్పాయింట్ ప్రజంటేషన్లో చెప్పింది వేరని.. ఇప్పుడు చేస్తుంది వేరన్నారు. అభివృద్ధికి తాము అడ్డుకాదని, మొదట్లో చెప్పిన ప్రకారం పనులు చేయాలని కోరారు. రాజన్న ఆలయ విస్తరణ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాపెల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, కుమ్మరి శంకర్, మైలారం శ్రీనివాస్, కొండ్లెపు ముత్యం, సంటి మహేశ్, రాహుల్, పిన్నింటి హన్మండ్లు, సగ్గు శేఖర్ తదితరులు ఉన్నారు. శ్రావణమాసంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ -
బీమా చెక్కు అందజేత
విద్యానగర్(కరీంనగర్)/కోరుట్ల: : కోరుట్ల డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.మదార్ గతేడాది జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స సమయంలో ఒకకాలును తొలగించారు. అతడికి యూనియన్ బ్యాంక్లో సూపర్ సాలరీ అకౌంట్ ఉన్నందున ఆర్టీసీ యాజయాన్యం బ్యాంక్ ద్వారా రూ.50 లక్షల బీమా చెక్కు మంజూరు చేసింది. సోమవారం ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి హైదరాబాద్ బస్ భవన్లో చెక్కు అందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) సీహెచ్. వెంకన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ) కె. రాజశేఖర్, ఫైనాన్సియల్ అడ్వైజర్ విజయ పుష్ప, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు, కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్, బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సత్యనారాయణ బాబ్లీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రంజన్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాలకు చెందిన గెరిగంటి శ్రీహరి(45)ఒమన్లో పది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా అతని మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. పదేళ్లుగా ఒమన్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. కంపెనీ జీతాల విషయంలో ఇబ్బందులు పెట్టడంతో అత్యవసర సెలవుపై స్వదేశానికి వచ్చి మూడు నెలల క్రితం ఒమన్కు వెళ్లాడు. గతంలో పనిచేసిన కంపెనీకి సమాచారం ఇవ్వకుండా మరో కంపెనీలో పనిచేశాడు. ఈక్రమంలో గత నెల 29న గుండెపోటుతో మృతిచెందాడు. చట్టవిరుద్ధంగా వేరే కంపెనీలో పనిచేయడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు పాలాజీ శ్రీనివాస్, దేవరాజులకు తెలపడంతో వారు భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. శ్రీహరి మృతదేహం ఇంటికి వచ్చే చర్యలు తీసుకున్నారు. ఆస్తి కోసం వేధింపులు.. మహిళ బలవన్మరణం మెట్పల్లి: ఆస్తికోసం వేధించడంతో భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్పల్లిలో జరిగింది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. కా మారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన వీరమణి(40)కి భర్త, కుమారుడు ఉండగా.. వారు కొంతకాలం క్రితం మృతిచెందారు. ఒంటరి గా ఉంటున్న ఆమెను తన సోదరి అయిన మెట్పల్లి లోని గాజులపేటలో నివాసముంటున్న జక్కం గంగమణి–రాజు దంపతులు చేరదీశారు. అనంతరం వీరమణికి ఆస్తి ఉండడంతో దానిని తామే దక్కించుకోవాలన్న ఉద్దేశంతో రాజు ఆమెను నమ్మించి వివా హం చేసుకున్నాడు. తర్వాత రాజు, గంగమణి కలి సి ఆస్తిని తమకు రాసివ్వాలని వేధిస్తూ వస్తున్నారు. 8న గొడవ కాగా.. వీరమణి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఆమె అచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం శివారులోని జక్కం రాజుకు చెందిన వ్యవసాయ బావిలో మహిళ శవం కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. వారు అక్కడకు మృతదేహాన్ని పరిశీలించి వీరమణిగా గుర్తించారు. మృతురాలి సోదరుడు బాలరాజు ఫిర్యాదు మేరకు మృతికి కారుకులైన రాజు, గంగమణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వ్యవసాయ మార్కెట్ వ్యాపారి మృతి
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో అడ్తి, ఖరీదు దారుగా వ్యవహరిస్తున్న వ్యాపారి పాపునుక భిక్షపతి (70) సోమవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మృతిపై మార్కెట్ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, అడ్తి, ఖరీదుదారుల సంఘం అధ్యక్షుడు చిక్కుల భూమయ్య సంతాపం తెలిపారు. ఈ మేరకు మంగళవారం మార్కెట్యార్డులో క్రయవిక్రయాలు నిలిపివేసి, సెలవుగా ప్రకటిస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్యకరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన గొర్రె మధు(35) కడుపునొప్పి భరించలేక సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మధు కొంతకాలంగా మద్యానికి బానిస కాగా కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్నాడు. సోదరుడు మనోహర్తో కలిసి కూలీపనులకు వెళ్లిన మధు కడుపునొప్పి ఉందంటూ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో సీలింగ్ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా సోదరుడితో కలిసి ఉంటున్నాడని, మృతుడికి ఇంకా వివాహం కాలేదని తెలిపారు. మనోహర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. అరటిపండ్ల వ్యాపారి..కరీంనగర్ క్రైం: దీర్ఘకాలంగా నరాల వ్యాధితో బాధపడుతూ, మనస్తాపానికి గురైన అరటిపండ్ల వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనగర్కాలనీకి చెందిన గాజ యాదయ్య(57) అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. లపు ఆస్పత్రులు తిరిగినా వ్యాధి నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యంగంగాధర: మండలంలోని గర్శకుర్తి గ్రామానికి చెందిన శ్రీపతి లక్ష్మి (65) అదృశ్యమైంది. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు కేసు నమోదు చేసారు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. లక్ష్మి కేన్సర్తో బాధపడుతోంది. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తెల్లవారినా రాలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతకగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఓ ఆసుపత్రిలో రాజలక్ష్మి ఒకే కాన్సులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. వివరాలు.. మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి, నరేందర్ దంపతులు. తొలిసారి గర్భం దాల్చిన రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో సోమవారం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయగా, ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువుల బరువు తక్కువగా ఉండడంతో పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు జన్మించడంతో రాజలక్ష్మి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాద కారకులు వీరే..
జ్యోతినగర్: రోడ్డు ప్రమాదానికి కారణం కావడంతోపాటు ఒకరు మృతి చెందిన ఘటనకు సంబంధించిన వ్యక్తులను గుర్తుపట్టాలని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు ఒక ఫొటో విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన కోండ్ర లింగమూర్తి(42) మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదనికి కారణమైన వ్యక్తులు టీవీఎస్ రైడర్ రెడ్ కలర్ ద్విచక్ర వాహనంపై పరారయ్యారని, వీరిని గుర్తిసే తగిన బహుమతి ఉంటుందని, సమాచారం అందించిన వారివివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. గుర్తించినవారు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ : 871265 6526, 87125 38620 నంబరులో సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కనిపిస్తే సమాచారం అందించండి ఫొటో విడుదల చేసిన పోలీసులు -
పొలంలోనే పోయిన ప్రాణం
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రైతు కొండ రాజయ్యగౌడ్(65) సోమవారం తన పొలం పనులు చేస్తుండగానే హఠాత్తుగా కుప్పకూలాడు. అక్కడే పనిచేస్తున్న రైతులు, కూలీలు వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. మృతుడికి భార్య మల్లమ్మ, కుమారుడు వెంకటస్వామి, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరూ వివాహితులే. వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు, ముదిరాజ్ సంఘం నా యకుడు పిట్ల ముత్యం(56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. తన పొలంలో ఆదివారం పొద్దా ంత పొలం పనులు చేసి వచ్చాడు. సోమవారం ఉదయం సైతం వరినాట్లు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపే ప్రా ణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య దేవలక్ష్మి, ఇద్దరు కుమారులు ప్రశాంత్, ప్రేమ్చంద్ ఉన్నారు. వేములవాడ: పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన రిటైర్డ్ ఏఎస్సై సగ్గు భిక్షపతి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఐదు నెలల క్రితం ఏఎస్సైగా ఉద్యోగ విరమణ పొందారు. సోమవారం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భిక్షపతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
బెదిరింపులకు పాల్పడితే కేసులు
వేములవాడ: అక్రమ వసూళ్లు, బెదిరింపులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తామని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే వెంటనే 112కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సోమవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. స్టోన్ క్రషర్ నిర్వాహకుడు నీలం గురువయ్య, రైస్మిల్ నిర్వాహకుడు బండ మల్లేశంయాదవ్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిని సోమవారం రిమాండ్కు తరలించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్కు చెందిన దండు వినోద్కుమార్, నాంపల్లికి చెందిన పెద్దిగారి అమరగొండ అజయ్ కలిసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా అగ్రహారం శివారులో స్టోన్క్రషర్ నిర్వహిస్తున్న నీలం గురువయ్యకు ఈనెల 9న ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. గురువయ్యను అగ్రహారం గుట్టల వద్దకు తీసుకెళ్లారు. వ్యాపారానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేయకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయాందోళన చెందిన గురువయ్య ఏటీఎం నుంచి రూ.50వేలు డ్రా చేసి వారికి ఇచ్చాడు. అనంతరం వీరిద్దరు వేములవాడరూరల్ మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బండ మల్లేశంను రైస్మిల్కు సంబంధించిన విషయంలో రూ.10లక్షలు డిమాండ్ చేశారు. వెంటనే మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులని ఆదివారం రాత్రి సాయినగర్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేలు నగదు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎవరైనా డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్స్టేషన్లో సంప్రదించాలని, లేదా 112లో సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. డబ్బు వసూలుకు దిగిన ఇద్దరి అరెస్టు ఎస్పీ మహేశ్ బీ గీతే -
వెంకటేశం మృతిపై వీడని మిస్టరీ
సిరిసిల్లటౌన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు. ఆ కుటుంబపెద్ద వెంగళ వెంకటేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో.. భార్య, కూతురు రోడ్డున పడ్డారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో విరాళాలు సేకరించారు. గురువారం మిస్సయిన ఇంటి పెద్ద కోసం భార్య, కూతురు ఏడ్చి..ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. శనివారం మృతిచెంది కనిపించడంతో వారి రోదనకు అంతులేకుండా పోయింది. వారి దీనస్థితిని చూసి స్థానికులు చలించిపోతున్నారు. సిరిసిల్ల పట్టణంలో వైపని కార్మికుడు వెంకటేశం మృతితో భార్య సులోచన, కూతురు ప్రసన్న ఒంటరిగువ్వలయ్యారు. ఆవేదన వారి మాటల్లోనే.. బిడ్డ లేకుండా ఏ గుడికీ పోడు ఐదు రోజుల కింద మా ఆయన పనిచేసే కుసుమ గణేష్తో పోయిండు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. అదేరోజు మా బిడ్డ ఫోన్ చేసి అడిగితే చెప్పలేదు. గుడికి కొబ్బరికాయలు కొట్టపోయిండని చెబుతుండు. వారం కిందే మా బిడ్డతో కలిసి ముగ్గురం పోయి అదే గుడిలో కొబ్బరికాయలు కొట్టి వచ్చినం. మళ్లీ అదే గుడికి గణేష్తో ఎందుకు పోయిండు..? ఆ విషయం ఆయన ఎందుకు దాసిపెట్టిండు..? మాకు అనుమానంగానే ఉంది. మున్సిపల్ వైస్చైర్మన్ సందీప్తో గొడవైనప్పటి నుంచి గణేశ్ పని ఇచ్చుడు బంద్ చేసిండు. మా ఆయన కనిపించకుండా పోయినసంది ఇంటి చుట్టూ కొత్త మనుషులు తిరుగుతుండ్రు. ఆయన చనిపోయిన చోట డబ్బాలున్నాయి. శరీరంపై గాయాలున్నాయి. ఆయనను చిత్రహింసలు పెట్టి సంపిండ్రు. రాత్రి వేళ అంత్యక్రియలు వెంకటేశం కుటుంబాన్ని శనివారం రాత్రి కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ ఆడెపు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, అధికార ప్రతినిధి వైద్య శివప్రసాద్ పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీల ముఖ్య నేతల నుంచి స్పందన సరిగ్గా లేదన్న విషయం కూడా రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు యెల్లె లక్ష్మీనారాయణ, చొప్పదండి ప్రకాశ్, మార్గం లక్ష్మణ్, బీజేపీ నాయకుడు దుమాల శ్రీకాంత్ రూ.5వేలు చొప్పున సాయం అందించారు. న్యాయం జరగాలన్న డిమాండ్తో వివిధ పార్టీల నేతలు ఆందోళనకు ప్రయత్నించగా ఆర్డీవో శ్రీధర్బాబు, టౌన్ సీఐ శ్రీనివాస్ వారించి పంపించారు. పొద్దంతా రాజకీయ నాయకుల పరామర్శలతో రద్దీగా మారిన వెంకటేశం ఇల్లు.. అంత్యక్రియల సమయంలో ఎవరూ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాత్రి 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించగా.. తండ్రి చితికి కూతురు ప్రసన్న నిప్పుపెట్టారు. పోలీసుల విచారణ వెంకటేశం మృతి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వెంకటేశం హత్యపై సామాజిక మాధ్యమాల్లో రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టుతో వెంకటేశం మరణంపై స్పష్టత వస్తుంది. కుటుంబ పెద్ద మృతితో అంతులేని విషాదం రాత్రికి రాత్రే అంత్యక్రియలు రోడ్డునపడిన తల్లీకూతురు -
ఉన్నట్లా.. లేనట్లా?
కరీంనగర్టౌన్: నియోజకవర్గ అభివృద్ధి ఫండ్(సీడీఎఫ్) ఉన్నట్లా.. లేనట్లా.. అనే సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకిచ్చిన హమీలు అమలు చేయలేకపోతున్నారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. చొప్పదండి, మానకొండూర్ నుంచి మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.5కోట్ల చొప్పున మంజూరు చేయగా.. రెండేళ్లుగా ఎలాంటి నిధులు రాకపోవడంతో మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్చార్జి మంత్రుల ద్వారా ఇతర నిధులు పొందుతూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీల పేరిట ఇతర నిధులు విడుదల చేస్తుండటంతో వివాదాస్పదం అవుతోంది. ఏటా పెరుగుతున్న సీడీఎఫ్ నిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ (సీడీఎఫ్) ఏటా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. సీడీఎఫ్ నిధులు మంజూరు 2010 నుంచి ప్రారంభమైంది. మొదట్లో రూ.కోటి ఉండగా తర్వాత రూ.3 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.10 కోట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. మరిన్ని నిధులు మంజూరైతే ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వచ్చే అర్జీలు పరిష్కారమయ్యే అవకాశం ఉండేది. సకాలంలో నిధులు వస్తేనే ఊరట నియోజకవర్గ అభివృద్ధి నిధులు సకాలంలో మంజూరైతేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఊరట కలుగనుంది. గ్రామాలు, పట్టణాల్లో బోర్లు వేయించడం, స్కూళ్లలో అదనపు తరగతి గది, టాయిలెట్ల నిర్మాణం, సీసీ రోడ్ల పనులు చేపట్టవచ్చు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎలక్ట్రిక్ దహనవాటిక, ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల ఏర్పాటు, ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, చెక్డ్యామ్లు, కాలువలు, కమ్యూనిటి హాళ్లు, బస్లాండ్ల నిర్మాణం వంటి 98 రకాల అభివృద్ధి పనులకు ఖర్చు చేయవచ్చు.ఈ నిధుల ఖర్చుకు సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కలెక్టర్ ఆమోదంతో నిధుల మంజూరు జరిగేది. ఈసారి కలెక్టర్తో పాటు ఇన్చార్జీ మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. -
దర్యాప్తు పెరిగింది.. కేసులు తగ్గాయి
కరీంనగర్క్రైౖం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026 జనవరి నుంచి జూన్ వరకు నమోదైన నేరాల గణాంకాలు ఆసక్తికర చిత్రాన్ని ఆవిష్కరించాయి. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు పెరగగా.. పెండింగ్ కేసులు తగ్గడం పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. 2025 తొలి ఆరు నెలల్లో కమిషనరేట్ వ్యాప్తంగా 3,654 కేసులు నమోదు కాగా, 2026లో అదే కాలంలో 3,806కేసులు నమోదయ్యాయి. అంటే 152 కేసులు ఎక్కువ నమోదు కాగా.. దర్యాప్తులో ఉన్న కేసులు 3,186 నుంచి 3,102కు తగ్గి 84 కేసుల తగ్గుదల నమోదు కావడం గమనార్హం. దర్యాప్తులో రూరల్ డివిజన్ టాప్ కేసులో దర్యాప్తులో కరీంనగర్ రూరల్ డివిజన్ టాప్లో నిలిచింది. 2025లో జూన్ వరకు 1,626 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,725 ఫిర్యాదులు వచ్చాయి. గతేడాది పెండింగ్ కేసులు ఉండగా.. 1,541.. ఈ సారి 1,325కు తగ్గాయి. మొత్తంగా 216 కేసుల తగ్గుదల నమోదైంది. కరీంనగర్ టౌన్ డివిజన్లో గతేడాది జూన్ వరకు 1,091 కేసులు నమోదు కాగా.. ఈఏడాది 1,103కి పెరిగాయి. దర్యాప్తు పెండింగ్ కేసులు గతేడాది 1,077 ఉండగా.. ఈ ఏడాది 1,091కి పెరిగాయి. ఇందుకు కారణం నగరంలో నేరాల ఒత్తిడి, విచారణ భారంగా పోలీసులు భావిస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్లో రిపోర్టింగ్ కేసులు 937 నుంచి 978కు పెరిగాయి. దర్యాప్తులో ఉన్న కేసుల సంఖ్య 568 నుంచి 686కు పెరిగి ఏకంగా 118 కేసుల పెరుగుదల నమోదైంది. పోలీసు స్టేషన్ వారీగా.. గతేడాది మొదటి ఆరు నెలలు, ఈ ఏడాది జూన్ వరకు దర్యాప్తులో ఉన్న కేసులు, అత్యధికంగా తగ్గిన స్టేషన్లను పరిశీలిస్తే.. కరీంనగర్ వన్టౌన్ 117, కరీంనగర్ రూరల్ 101, మాననకొండూరు 84, చొప్పదండి 60, ఎల్ఎండీకాలనీ 26 కేసులు తగ్గాయి. ఈ స్టేషన్లలో పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దర్యాప్తులో ఉన్న కేసులు భారీగా పెరిగిన స్టేషన్లు పరిశీలించగా.. కొత్తపల్లి 80, ఉమెన్ పోలీస్స్టేషన్ 58, కరీంనగర్ 3 టౌన్ 41, జమ్మికుంట 41, కరీంనగర్ 2 టౌన్ 32, సైదాపూర్ 31, హుజూరాబాద్ టౌన్ 28, ఇల్లందకుంటలో 24 కేసులు పెరిగాయి. ఈ ఆరు మాసాల్లో కరీంనగర్ 1టౌన్లో 403, కొత్తపల్లి 405, కరీంనగర్ 2టౌన్ 373, జమ్మికుంట 264, మనకొండూరు 244 కేసులు పెరిగాయి. హుజూరాబాద్ డివిజన్, కొత్తపల్లి, ఉమెన్ పోలీస్స్టేషన్, 2 టౌన్, 3 టౌన్, జమ్మికుంట వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న దర్యాప్తు పెండింగ్ కేసులు భవిష్యత్తులో ప్రత్యేక కార్యాచరణ అవసరాన్ని సూచిస్తున్నాయి. -
పెద్దాస్పత్రిలో మెనో!
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందని ద్రాక్షగా మారుతోంది. నాసిరకమైన ఆహారం వడ్డిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎంసీహెచ్, జీజీహెచ్, క్రిటికల్ కేర్లో కలుపుకొని సుమారు 550 పడకలున్నాయి. ఇన్ పేషెంట్లకు ప్రతిరోజు భోజనం పెట్టాల్సిన డైట్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేషెంట్లు, గర్భిణులు, బాలింతలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. రుచి పచీ లేని భోజనం తినలేక ఇంటినుండే టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ప్రోటీన్లకు కత్తెర.. లాభాలే లక్ష్యం శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలకు, పాలు ఇవ్వాల్సిన బాలింతలకు హైప్రోటీన్ ఆహారం అత్యంత అవసరం. ప్రభుత్వం ప్రతీ పూట ఇద్దరు వ్యక్తులకు సరిపడా బలాన్నిచ్చే తిండితో పాటు రెండు గుడ్లు, పల్లిపట్టీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా, సగానికి కోత పెడుతున్నారు. వార్డుకో న్యాయం, మనిషికో తీరుగా వ్యవహరిస్తూ గుడ్డును పక్కదారి పట్టిస్తున్నారు. పాలు నీళ్లకన్నా పలుచగా, పప్పు నీళ్ల రసంగా మారిపోయాయి. ఇక టిఫిన్ అంటే రోజు ఉప్మా తప్ప వేరే కనబడదు. నాణ్యత లేని ముతక బియ్యం వండటంతో ఆ అన్నం మింగలేక, గొంతు దిగక ఆకలితో అల్లలాడుతున్నారు. ఆసుపత్రి భోజనం ఇలాగేనా క్యాంటీన్ నిర్వాహకులు శుభ్రతను మర్చిపోయారు. రుచి లేని వంటకాలతో కనీస పోషకాలు దక్కక రోగుల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతోంది. ఆసుపత్రి బయట దాతలు చేసే అన్నదానంలో ఉన్న శుచి కూడా ఈ సర్కారు బువ్వలో కనిపించడం లేదని రోగుల బంధువులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పర్యవేక్షణ కరువు పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నా యి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏ రోజు ఏం పెడతారో తెలిపే ‘మెనూ బోర్డు’ కూడా ప్రదర్శించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారు లు స్పందించి ప్రతిరోజూ ఆహార నాణ్యతను తనిఖీ చేసి, నాసిరకం వంటలు వడ్డిస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సౌకర్యాలెన్నీ.. లేనివెన్ని!
కరీంనగర్ అర్బన్: గ్రామ, పట్టణాల వివరాలను సమగ్ర సమాచారంతో డీసీహెచ్బీ(డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్) రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర గణాంకశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. విలేజ్, టౌన్ డైరెక్టరీలను వేర్వేరుగా రూపొందించనుండగా నేటి నుంచి సర్వే ప్రారంభమై వచ్చే నెల 10వరకు కొనసాగనుంది. గ్రామాల్లో రెవెన్యూ గ్రామం వారీగా, పట్టణాల్లో వార్డు వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రధానంగా 8అంశాలపై సమగ్ర సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వగా మున్సిపల్, మండలాల వారీగా డిస్ట్రిక్ట్ ఆడిషనల్ సెన్సెస్ ఆఫీసర్ వెల్ది కిషన్రావు ఆధ్వర్యంలో నె ల రోజుల పాటు జరిగే సర్వేలో గ్రామ, పట్టణస్థా యి అధికారులు కీలక భూమిక పోషించనున్నారు. మండలాలకు తహసీల్దార్.. మున్సిపల్కు కమిషనర్ సర్వేను పర్యవేక్షణ చేసేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ గ్రామ పంచాయతీ కేంద్రంగా జీపీవో లేదా కార్యదర్శి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించనున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, మున్సిపల్లో మున్సిపల్ కమిషనర్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా ఆడిషనల్ సెన్సెస్ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో, ఎస్వో వ్యవహరించనున్నారు. నెల రోజుల పాటు జరిగే ప్రక్రియలో ర్యాండమ్ వెరిఫికేషన్ చేయనున్నారు. గ్రామాలకు విలేజ్ రిజిష్టర్, పట్టణాలకు టౌన్ రిజిష్టర్లో వివరాలను నమోదు చేయనున్నారు. అభివృద్ధి ప్రణాళికలకు దోహదం ప్రతి జనగణన సందర్భంగా ఈ ప్రక్రియ చేపడుతుంటారు. 2011లో జనగణన జరగగా అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ తేడా స్పష్టమవనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న కనీస సౌకర్యాలు, సదుపాయాలు, విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయ, వృత్తి పనులు, టెక్నాలజీ, తదితర వివరాల సేకరణలో ఇది ఎంతో కీలకం. ఈ డిజిటల్ నమోదు ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామం, పట్టణంలో వార్డు వారీగా సమస్త సమాచారం అందుబాటులో ఉండనుంది. వివరాల నమోదు పూర్తయిన తరువాత సకల సమాచారంతో డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్ విడుదల కానుంది.జిల్లా జనాభా: 10,49,140గ్రామ పంచాయతీలు: 318రెవెన్యూ గ్రామాలు: 195నగరపాలక సంస్థ: 01(కరీంనగర్) మున్సిపాలిటీలు: 3(హుజూరాబాద్, జమ్మికుంట,చొప్పదండి) సాగుదారులు: 78,516వ్యవసాయ కూలీలు: 1,86,363కుటీర పరిశ్రమలు: 61,869ఇతర రంగాలు: 1,80,347 -
పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు
కరీంనగర్టౌన్: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తూ విడతల వారీగా వసతుల కల్పనకు రూ.కోటి వరకు నిధులు వెచ్చించనున్నారు. పాఠశాలల అభివద్ధికి ఈ పథకాన్ని 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ కింద 60 పాఠశాలలను ఎంపిక చేశారు. తాజాగా ఉన్నత తరగతుల విద్యార్థులుకు ప్రయోగాత్మక బోధన చేపట్టి సైన్స్, గణితం పాఠ్యంశాలపై పట్టు సాధించి సామర్థాన్ని పెంచేందుకు సైన్స్ కిట్లు అందజేసేందుకు ఉమ్మడి జిల్లాకు రూ.24లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పాఠశాలలలో గణిత, సైన్స్ టీచర్లు, సీనియర్ ఉఫాధ్యాయులు, పాఠశాల కమిటీ ప్రతినిధితో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా పాఠశాలస్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యమే లక్ష్యంగా పీఎంశ్రీ పాఠశాలలు.. పీఎంశ్రీ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతారు. విద్యార్థులకు కార్పొరేట్స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక వనరులు సమకూర్చుతారు. విద్యార్థులకు మానసిక స్వేచ్ఛను కల్పించి వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇస్తారు. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు మూల్యాంకన చేసి విద్యార్థుల స్థాయిని పరిశీలిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం సులభతరమవుతుంది. ఉమ్మడి జిల్లాలో 60 స్కూళ్లకు రూ.24 లక్షలు విడుదల నిధుల విడుదల ఇలా.. జిల్లా పాఠశాలలు నిధులు(రూ.లల్లో) కరీంనగర్ 20 8,00,000 పెద్దపల్లి 13 5,20,000 రాజన్నసిరిసిల్ల 11 4,40,000 జగిత్యాల 16 6,40,000 మొత్తం 60 24,00,000 -
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బందెల రమేశ్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్ నర్సింగాపూర్లోని గంగారెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యజమాని నుంచి రమేశ్కు రూ.500 రావాల్సి ఉంది. ఈ క్రమంలో రమేశ్ తమను బూతులు తిడుతూ మెసేజ్లు పోస్ట్ చేస్తున్నాడంటూ యజమానితోపాటు మరోవ్యక్తి వచ్చి రమేశ్పై దాడికి దిగారు. రమేశ్కు చికిత్స అందించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. రమేశ్ ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. రమేశ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని గంగారెడ్డితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డివైడర్ను ఢీకొని వ్యక్తి దుర్మరణంజగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్రోడ్డులో డివైడర్ను ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాకేంద్రంలోని అశోక్నగర్కు చెందిన కాశిపాక గంగాధర్ స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం గంగాధర్ ఆయన తాత దీకొండ పోశయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్త బస్టాండ్కు వెళ్లి.. బైపాస్ రోడ్డు మీదుగా వస్తున్నారు. ద్విచక్రవాహ నం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో గంగాధర్, పోశయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇద్దరినీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంగాధర్ మృతిచెందాడు. పోచయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గంగాధర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం దత్తోజీపల్లి శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మయ్య(70) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకుల లక్ష్మయ్య ఆదివారం సాయంత్రం రామడుగు నుంచి గుమ్లాపూర్కు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. దత్తోజీపల్లి శివారులో వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తల బండరాయికి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ముంపు గ్రామంగా ప్రకటించాలిగంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ను రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామంలోని 13మందిపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ కేసులు ఎత్తి వేయాలని ఆదివారం మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. రిజర్వాయర్ పనులు పూర్తి కాక ముందే చెరువు నిండితే ఊరుమొత్తం జాలు వారుతుందన్నారు. ఇప్పటికే ఇళ్లలోకి నీటితో పా టు, పాములు, తేళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు కట్ట తెగి ఊళ్లోకి నీరు చేరిందన్నారు. సమస్య పరిష్కారానికి ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఏళ్లకాలంగా విన్నవిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మొదట్లో 11ఇళ్లు, ఇప్పు డు దాదాపు ముప్పై ఇళ్లను ముంపుకింద తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. -
కొడుకును హత్య చేయబోయిన తండ్రి రిమాండ్
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో శనివారం కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. కోనరావుపేట పోలీస్స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మల్కపేటలో గుడిపేట రాఘవులు తన కొడుకు రాజేందర్పై గొడ్డలితో దాడి చేసి హత్యకు ప్రయత్నించాడు. రాజేందర్ ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రాఘవులును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి, కానిస్టేబుళ్లు జగన్, విశాల్రాజు, మనోజ్ తదితరులు ఉన్నారు. -
మళ్లీ మొరాయించిన అంబులెన్స్
● నడిరోడ్డుపై ఆగిపోయిన 108 వాహనం ● అధ్వానంగా నిర్వహణ ● రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో 108 వాహనాల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో వరుసగా జరిగిన ఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్తండాకు చెందిన ఓ మహిళా పేషెంట్ను శుక్రవారం 108 అంబులెన్స్లో తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొరాయించగా.. వీర్నపల్లి నుంచి మరో వాహనాన్ని తెప్పించి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఆదివారం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన దస్తగిరిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలిస్తుండగా సముద్రలింగాపూర్ నుంచి మొరాయిస్తూ వ చ్చిన అంబులెన్స్ ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారుకు చేరుకోగానే నిలిచిపోయింది. దీంతో మరో వాహనాన్ని తెప్పించి నడిరోడ్డుపైనే ఆ వాహనంలోకి పేషెంట్ను మార్చాల్సి వచ్చింది. -
మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
కరీంనగర్ కల్చరల్: మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని మేయ ర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన యువ కవి సమ్మేళనం‘యుద్ధం మొదలైంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను కవితల ద్వారా యువ కవులు ఎత్తిచూపడం అభినందనీయమన్నారు. ఎస్యూ రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ మాట్లాడుతూ యువ సాహిత్యం కొత్త ఆలోచనలకు వారధిగా నిలుస్తోందన్నారు. ప లువురు యువ కవులు మాదకద్రవ్యాల వ్యతి రేక సందేశంతో కూడిన కవితలు వినిపించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు కొత్త అనిల్కుమార్, కవులు దొమ్మటి శంకర్, కాండూరి వెంకటేశ్వర్లు, బీవీఎన్ స్వామి, కేఎస్.అనంతాచార్య, మాధవ్, నీలగిరి అనిత, సాయి చరణ్, శ్రీకర్, అనిల్, సుగుణ, అనుష, బొమ్మకంటి కిషన్, ఉపేంద్ర పాల్గొన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి కరీంనగర్: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపుని చ్చారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం నగరంలో సమావేశం అయ్యా రు. సోమవారం నుంచి ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివా స్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బాస సత్యనారాయణ రావు, కన్నబోయిన ఓదెలు, నాగేశ్వర్రెడ్డి, ప్రవీణ్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వం గాడి తప్పకుండా సీఎం జాగ్రత్తగా ఉండాలి చిగురుమామిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాడితప్పకుండా సీఎం రేవంత్రెడ్డి జాగ్రత్త పడాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి సూచించారు. చిగురుమామిడి మండలం రేకొండ, చిగురుమామిడి, పీచుపల్లి, చిన్నముల్కనూర్, సీతారాంపూర్, లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్, రామంచ, ముదిమానిక్యం గ్రామాల్లో ఆదివారం సీపీఐ ప్రచార జాత నిర్వహించారు. చాడ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తాత్సారం చేస్తోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగిరి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం విద్యానగర్(కరీంనగర్): దేశాన్ని పట్టి పీడిస్తు న్న కులమనే అతిపెద్ద జబ్బును అంతం చేయ డం ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు అన్నారు. ఆదివారం కరీంనగర్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో 78ఏళ్ల స్వాతంత్య్రం సామాజిక న్యాయం అనే అంశంపై సె మినార్ నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్, జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్, గాజుల కనకరాజు, గోవర్ధన్, విజయ, సుకోసి శ్రీకాంత్, కదాసి కుమార్, సదానందం, సంకీర్త్ పాల్గొన్నారు. -
మత్తుపై యువ‘కలం’
కరీంనగర్ కల్చరల్: మత్తు మహమ్మారిపై యువ కలం గళమెత్తుతోంది. గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా అక్షరాలే ఆయుధాలయ్యాయి. మాదకద్రవ్యాల మాయలో చిక్కుకుని భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న యువతను మేల్కొలిపేందుకు పలువురు యువ కవులు తమ కవిత్వంతో గళమెత్తారు. ‘మత్తుకు దూరంగా ఉండాలి.. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం మనమంతా ఒక్కటవ్వాలి’ అంటూ సందేశమిచ్చారు. ‘యుద్ధం మొదలైంది’ అంటూ కవితల రూపంలో తిరుగుబాటును ప్రకటించారు. ఆదివారం తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కవి సమ్మేళనంలో పలువురు యువ కవులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను కవితల రూపంలో వినిపించారు. మత్తు పదార్థాలు వ్యక్తినే కాదు.. కుటుంబాన్ని, సమాజాన్ని ఛిద్రం చేస్తాయని హెచ్చరిస్తూ, వాటి నిర్మూలన కోసం సమాజంతో కలిసి తామూ ముందుండి పోరాడతామని తమ కవితల రూపంలో చాటిచెప్పారు.యువత మేలుకో. లే లేచి నిలబడు. నీ శక్తిని వృథా చేసుకోకు మత్తుపై యుద్ధం చేయి. మత్తు కాదు. ఇది మరణపు విత్తనం గంజాయి కాదు.. ఇది భవిష్యత్తు శవపేటిక నీ రక్తంలో ఉరకలెత్తే స్వప్నాలు సాకారం కావాల్చి కానీ.. మత్తు విషపు కోరల్లో బందీ అవకు.. ప్రతి పాఠశాలలో చైతన్య దీపం వెలిగిద్దాం ప్రతి యువకుడి హృదయంలో ధైర్యాన్ని నాటుదాం – మహాంకాళి సుగుణ, బెజ్జంకి, యువ రచయిత్రికళ్లు తెరువు యువకా.. నీ కలలను మింగేస్తున్న మత్తును వదిలేయ్! నీ చేతిలో పుస్తకం ఉండాలి.. సిరంజి కాదు.. మైదానంలో ఆడాలి.. చీకటి అడ్డాల్లో కాదు.. అమ్మ కన్నీటిని చూడు.. నాన్న ఆశలను గుర్తుచేసుకో.. రేపటి భారతాన్ని నిర్మించే చేతులు ఈ రోజు చెడిపోకూడదు..లేచి నిలబడు యువభారతమా. – మాసం సీమ, కరీంనగర్ గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా కవితలతో చైతన్య సందేశం -
ఉచితంగా మద్యం ఇవ్వలేదని దౌర్జన్యం
పెద్దపల్లి: తమకు ఉచితంగా మద్యం ఇవ్వలేదనే ఆగ్రహంతో ముగ్గురు వైన్స్షాప్లోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారు. ఆస్తులను ధ్వంసం చేసి, నిర్వాహకులను హత్య చేస్తామని బెదిరించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేటలో చోటుచేసుకుంది. వైన్స్షాప్ నిర్వాహకుడు విద్యాసాగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈనెల 8న రాత్రి సుమారు 7.30 నుంచి 8 గంటల మధ్య సురభి కిరణ్రావు, శ్రీనివాస్రావు, పోలసాని సుధాకర్రావు హన్మంతునిపేటలోని లక్ష్మీగణపతి వైన్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. తమకు ఉచితంగా మద్యం ఇవ్వాలని డిమాండ్ చేయగా నిర్వాహకులు నిరాకరించారు. దీంతో విద్యాసాగర్తోపాటు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ హత్య చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా గ్రిల్ ధ్వంసం చేశారు. మద్యం బాటిళ్లు పగులగొట్టట్టారు. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు. దీంతో తనకు పెద్దఎత్తున ఆస్తినష్టం వాటిల్లిందని విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్రావు గతంలోనూ ఇదేవిధంగా ఇబ్బందులకు గురిచేసినా.. సమస్యను పెద్దది చేయకుండా వదిలేశామని, ఈసారి ఆస్తినష్టం వాటిల్లడంతోపాటు ప్రాణహాని కలిగించేలా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలనిపోలీసులను కోరారు. -
అమరుడి కుటుంబానికి అందని సాయం
బోయినపల్లి(చొప్పదండి): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర సైనికుడి కుటుంబం ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురుచూస్తోంది. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన పబ్బాల్ల అనిల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన హామీలు ఇప్పటి అమలు కాలేదు. మూడేళ్లుగా ఎక్స్గ్రేషియా కోసం సైనికుడి భార్య అధికారుల చుట్టూ తిరుగుతోంది. అధికారులు జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వ్యాఖ్యానించడం వైరల్గా మారింది. మల్కాపూర్కు చెందిన పబ్బాల లక్ష్మి –మల్లయ్యల కుమారుడు అని పదిహేనేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. జమ్మూకాశ్మీర్లో విధి నిర్వహణలో ఉండగా 2023 మే 4న హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడయ్యాడు. అనిల్కు భార్య సౌజన్య, కొడుకులు అయాన్, అరయ్. అనిల్ మరణాన్ని యుద్ధ సమయంలో ప్రాణనష్టంగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన సతీమణి సౌజన్య పేర్కొంది. ఎదురుచూపులే.. ఎక్స్గ్రేషియా, సేన మెడల్కు సంబంధించిన నగదు పురస్కారం మూడేళ్లుగా అందలేదని అనిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం విషయంలోనూ తుది పరిష్కారం లభించలేదన్నారు. పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ భార్య ఇద్దరు పిల్లలను చూసుకుంటూ మల్కాపూర్లోనే నివసిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె కోరుతోంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఎక్స్గ్రేషియా, సేన మెడల్ నగదు పురస్కారం, వ్యవసాయ భూమి, ఇంటి స్థలం అందించాలని కోరుతుంది. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వ్యాఖ్యలు వైరల్ దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన అనిల్ సతీమణి సౌజన్య ఎక్స్గ్రేషియా కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తోందని ఈ విషయంలో అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తానని చెపుతున్నారు. ఆయన మాటలు సైతం అధికారులు వింటున్నారో.. లేదోనని పేర్కొన్నారు. అనిల్ అమరుడైన సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు శ్రద్ధాంజలి ఘటించి దేశభక్తిని ప్రకటించారు. అమరుడైన సైనిక కుటుంబానికి సాయం చేయాలని మెసేజ్ చేస్తే పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. వ్యవసాయభూమి, ఇంటి స్థలం కోసం ఎదురుచూపు జమ్మూకాశ్మీర్లో అమరుడైన సైనికుడు అనిల్ జీవోల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు -
ఆమె కళ్లు సజీవం
ధర్మపురి: కూతురు చనిపోయిన దుఃఖాన్ని దిగమించుకుని ఆమె కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది తల్లి. ఈ సంఘటన మండలంలోని కమలాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవునూరి లక్ష్మణ్, గంగమ్మ దంపతుల కూతురు లావణ్య (21) మూడురోజుల క్రితం తన బంధువుల ఇంటికి అన్న, వదినలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తిమ్మాపూర్, మద్దునూర్ మధ్య డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న లావణ్య, ఆమె అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్యను చికిత్స నిమిత్తం 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయింది. తన కూతురు కళ్లు సజీవంగా ఉండాలని, మరో ఇద్దరికి చూపునివ్వాలని పెద్ద మనసుతో తల్లి గంగా సోదరులు ఆవునూరి మహేష్, శ్రీనివాస్, ప్రదీప్ హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైధ్యులు శ్రీనివాస్కు లావణ్య కళ్లను అందించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నోజి రాజేంద్రప్రసాద్, మల్లేష్, నరేష్ తదితరులున్నారు. ఫేక్ సర్టిఫికెట్ల కలకలం ● ఆరుగురు లెక్చరర్లకు నోటీస్లు ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లలో కొంతమందికి ఇంటర్మీడియట్బోర్డు అధికారులు నోటీసులు జారీచేశారు. 2023లో ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కొంతమంది లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఇంటర్బోర్డు అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కాకుండా ఇతర రాష్ట్రాలలో పీజీ చదివి లెక్చరర్లుగా నియామకమైన వారి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు వెళ్లి సర్టిఫికెట్లపై ఆరా తీశారు. ఈనేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలు కళాశాలల్లో పనిచేస్తున్న ఆరుగురు లెక్చరర్లకు ఇంటర్బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలకు ప్రభుత్వం నడుం బిగించింది. కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, ఇల్లంతకుంట కళాశాలల్లో పనిచేస్తున్న వారికి నోటీసులు జారీ కావడం చర్చకు దారితీసింది. వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదంకరీంనగర్ క్రైం: కరీంనగర్ రాజీవ్చౌక్లోని అస్లాం మసీదు ఎదురుగా ఉన్న పల్లవి క్లాత్స్టోర్లో శనివారం వేకువజామున స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ విజ్ఞత మృతి ● ఆస్పత్రిలోనే భర్త వసంత్ యైటింక్లయిన్కాలనీ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు యాదనవేని వసంత్ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్స్టౌవ్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
కరుడుగట్టిన ‘థార్ గ్యాంగ్’ పట్టివేత
కొత్తపల్లి(కరీంనగర్): కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని శనివారం కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా తాండా తాలూకాకు చెందిన కరుడుగట్టిన నలుగురు సభ్యుల ముఠా (థార్ గ్యాంగ్) ఇటీవల కరీంనగర్కు చేరుకుంది. కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రేకుర్తి, మల్కాపూర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. రేకుర్తి కంటి ఆసుపత్రి కమాన్ సమీపంలో సర్దు(25), సర్దార్(29)ను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే సుత్తె, పానను స్వాధీనం చేసుకున్నారు. గతేడాడాది సంక్రాంతి సమయంలో చింతకుంట ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. మళ్లీ దొంగతనాలకు పాల్పడేందుకు కరీంనగర్కు వచ్చినట్లు విచారణలో తేలింది. నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు పరారైనట్లు, అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
భర్తపై మొదటి భార్య బంధువుల దాడి
వేములవాడ: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్ ఆటో డ్రైవర్. శంకర్కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
కోహెడలో రోడ్డు ప్రమాదం – తారుపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్: కోహెడ సమీపంలోని రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన జక్కుల సాయికృష్ణ(25) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కారు అద్దెకు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న యువకుడు .. గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి తిరుగు ప్రయాణంలో కోహెడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తారుపల్లిలో విషాదం అలుముకుంది. మృతుడికి తల్లిదండ్రులు రమాదేవి– మల్లయ్య ఉన్నారు. సాయికృష్ణ అందరితో కలిమిడితో ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కోరుట్లరూరల్: పట్టణంలోని ఎన్హెచ్ 63పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోరుట్లకు చెందిన మహమ్మద్ ఖాసీం (37) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విలాసాగర్ గ్రామానికి చెందిన దూలపల్లి శంకర్ తన టాటా ఏస్ వాహనంపై మెట్పల్లి నుంచి కోరుట్లకు వస్తున్నాడు. మొహమ్మద్ ఖాసీం తన ఎలక్ట్రిక్ స్కూటర్పై కోరుట్ల వైపు నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్నాడు. టాటా ఏస్ వా హనం వేగంగా వచ్చి ఖాసీం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘ టనలో ఖాసీంకు తీవ్ర గా యాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చె ందాడు. ఖాసీం భార్య అనీ షాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బంగారం చోరీ.. నిందితుడి అరెస్టు
కరీంనగర్క్రైం/కరీంనగర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన కిసాన్నగర్కు చెందిన మునుగొండ మధుకర్ అలియాస్ మధు(42)ను కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల ప్రకారం.. శివాజీనగర్లో నివాసముండే జంగం రాజమ్మ ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మధుకర్ ముఖానికి మాస్క్ ధరించి ప్రవేశించాడు. మెడలోని బంగారు గొలుసు, ఎడమ చెవి కమ్మను బలవంతంగా లాక్కున్నాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో తలను గోడకేసి కొట్టడంతో గాయపడింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న బంగారాన్ని బజాజ్ ఫైనాన్స్లో గోల్డ్లోన్ కింద తాకట్టు పెట్టి రూ.2.25 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నాడు. కేసు నమోదైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు విశ్లేషించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలిని పరామర్శించిన డిప్యూటీ మేయర్ దోపిడి దొంగ దాడిలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం రాజమ్మను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. బాధితురాలికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల–కిరణ్ పాల్గొన్నారు. -
గుడిలో నిద్రకు వెళ్లి అనంతలోకాలకు..
గోదావరిఖని: బంధువు చనిపోతే దశదినకర్మ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రకు వెళ్లాడు. రాత్రి నిద్రలోనే అనంత లోకాలకు చేరుకోవడం విషాదం నింపింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కృష్ణానగర్ చెందిన దాసరి సదానందం(45) ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సమీప బంధువు మృతి చెందింది. దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రించేందుకు ఈనెల 7న రాత్రి గోదావరిఖనిలోని కోదండరామాలయం వెళ్లాడు. రాత్రి నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున గుడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సదానందం నిద్రలేపేందుకు యత్నించారు. ఎంతపిలిచినా చలనం లేకుండా పోయింది. దీంతో కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని 108అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య దాసరి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. మంథనిరూరల్: బంధువు చనిపోతే దశదిన కర్మ అనంతరం గుడిలో నిద్ర చేసేందుకు వెళ్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఘటనతో స్వగ్రామం మంథని మండలం పోతారంలో విషాదం నెలకొంది. పోతారం గ్రామానికి చెందిన దాసరి నదానందం గోదావరిఖనిలోని కృష్ణానగర్లో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాల వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటి పోయాయి. బంధువు చనిపోతే గుడికి నిద్రకు పోయి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్వంతమయ్యారు. స్వగ్రామమైన పోతారంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. -
మహిళపై లైంగికదాడిలో రౌడీషీటర్లు!
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఈనెల 3న నిజామాబాద్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా.. వీరికి మరో ఇద్దరు సహకరించారు. రౌడీషీటర్లలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటూ పలు భూ సెటిల్మెంట్లు, పలు పంచాయితీలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ–1 నిందితుడు, రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్పై మల్యాల పోలీస్స్టేషన్లో 13 కేసులు, మరోచోట మరో కేసు నమోదైంది. రాజారం గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్పై ఇప్పటికే 9 కేసులున్నాయి. అలాగే గుర్రం అంజయ్యపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇది రెండో కేసు. అలాగే ఏ–3, ధరూర్ గ్రామానికి చెందిన మర్రవేని మల్లేశ్పై గతంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు నమోదైంది. మహిళను రౌడీషీటర్ నరేశ్ పథకం ప్రకారమే రప్పించి శ్రీకాంత్కు సమాచారం అందించి.. లైంగికదాడికి పాల్పడి.. వీడియో చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు. రౌడీషీటర్ల హంగామా.. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లలో ఒకరు ఎమ్మెల్యే అనుచరుడిగా మండలంలో చలామణి అవుతున్నాడు. పలువురు యువకులను వెంటేసుకుని నిత్యం రాజారం, టీఆర్నగర్, నూకపల్లి, మల్యాల, ముత్యంపేట, కొండగట్టు తదితర ప్రాంతాల్లో భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏదైనా గొడవలు జరిగితే తన వద్దనున్న గ్యాంగ్ను తెప్పించి దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దికాలంగా కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రేమికులు, స్నేహితులు, కొంతమంది మహిళలను వీడియోలు చిత్రీకరించి భయబ్రాంతులకు గురిచేసి నగదుతోపాటు, బంగారు ఆభరణాలు కూడా బలవంతంగా లాక్కున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చూసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. పథకం ప్రకారమే వీడియో చిత్రీకరణ నిందితుల్లో ఒకరు అధికారి పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు మహిళపై అత్యాచార కేసులో ఉన్న రౌడీషీటర్లపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేపట్టి పీడీయాక్ట్ ఓపెన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతుంది. నేర చరిత్ర ఉన్న వారిపై కూడా పోలీసు శాఖ వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతోంది. – అశోక్కుమార్, జగిత్యాల ఎస్పీ -
మద్యం మత్తులో కొడుకుపై దాడి
కోనరావుపేట(వేములవాడ): తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం ముదిరి.. గొడ్డలితో దాడికి దారితీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన గుడిపేట రాఘవులు, రాజేందర్(36) తండ్రీకొడుకులు. గల్ఫ్కు వెళ్లిన రాజేందర్ ఏడాది క్రితం ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాజేందర్ దాడి చేయడంతో తండ్రి రాఘవులు చేయి విరిగింది. ఇటీవల కొడుకును హత్య చేసేందుకు తండ్రి బండరాయితో ప్రయత్నించగా రాజేందర్కు గాయాలయ్యాయి. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరి మధ్య ఇంట్లోనే వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన రాఘవులు ఇంట్లోనే మంచంపై పడుకుని ఉన్న రాజేందర్పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో రాజేందర్ మెడపై, చెవిబాగంలో గాయాలయ్యాయి. వెంటనే గమనించిన గ్రామస్తులు సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద రహదారి పక్కన ఆగింది. అదేసమయంలో పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వేగంగా వస్తున్న ఆటో ఆగిఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ షబ్బీర్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహానందు, చందు, మల్లవ్వ, గట్టమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకోగానే డ్రైవర్ చక్రపాణికి ఫిట్స్ వచ్చాయి. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దింపిన తర్వాత అతను అక్కడే నేలపైన కొంత సేపు సేదతీరారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్కు ఫిట్స్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ ప్రయాణికులు సురక్షితం -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
చిగురుమామిడి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. శనివారం సీపీఐ జాత చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట్, సుందరగిరి గ్రామాల్లో పర్యటించింది. చాడ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దేశాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని వాగ్దానం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, పోనుగంటి కేదారి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రాజేందర్రెడ్డి మృతికి ఎమ్మెల్యేనే కారణం
గన్నేరువరం: గుండ్లపల్లికి చెందిన బేతెల్లి రాజేందర్రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కారణమని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. రాజేందర్రెడ్డి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. కుట్ర పూరితంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఎమ్మెల్యేకు చెప్పుకుందామని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజేందర్రెడ్డిని వేధింపులకు గురి చేయడంతోనే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ ఘటననకు సంబంధించి క్యాంపు కార్యాలయంలోని సీసీ పుటేజీని పోలీసులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్రెడ్డి ఆగడాలు శృతిమించుతున్నాయని ధ్వజమెత్తారు. రాజేందర్రెడ్డి కుటుంబానికి రూ.కోటి సాయం అందించాలని, రాజేందర్రెడ్డి భార్య సమతకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో కుటుంబానికి న్యాయం జరుగకాపోతే బీఆర్ఎస్ శ్రేణులు, బాధితులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజేందర్రెడ్డి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన భార్య సమత డిమాండ్ చేశారు. సిద్దం వేణు, గంప వెంకన్న, మాడుగుల రవీందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, శేఖర్గౌడ్, మహేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
డబ్బులు రాష్ట్రానివి.. డబ్బా బీజేపీది
కరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధిలో డబ్బులు రాష్ట్రానివైతే డబ్బా బీజేపీదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. నగరంలో అభివృద్ధి పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పుకోవడం విడ్డూరమన్నారు. శనివారం నగరంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ యూఐడీఎఫ్, యూసీఎఫ్, స్మార్ట్సిటీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటానే అధికమన్నారు. యూఐడీఎఫ్ రూ.50 కోట్ల నిధులు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రుణం ద్వారా ఇస్తున్నవని, ఆ రుణం చెల్లించేంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రం వాటా రూపాయి కూడా లేదన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ రూ.840 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.210 కోట్లు ఇవ్వగా, హడ్కో రుణం రూ.420 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. రూ.840 కోట్లలో రూ.630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంటే, కేంద్రం రూ.210 కోట్లు ఇస్తోందన్నారు. బీజేపీ నాయకులు కేంద్రమే రూ.840 కోట్లు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకొంటున్నారన్నారు. స్మార్ట్సిటీ బ్యాలెన్స్ రూ.140 కోట్లలో, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.70 కోట్లు జమ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.70 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిందన్నారు. యూఐడీఎఫ్ మార్గదర్శకాల ప్రతిని బండి సంజయ్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. -
పంచాయతీలకు ‘కరెంట్’ షాక్
కరీంనగర్టౌన్: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు తయారైంది జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిస్థితి. ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలపై విద్యుత్ బకాయిలు భారంగా మారాయి. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో రూ.11,26,69,783 విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. వచ్చిన అరకొర నిధులను గ్రామాభివృద్ధికి వెచ్చించాలా.. విద్యుత్ బిల్లులు చెల్లించాలా అన్న అయోమయంలో పాలకులు ఉన్నారు. నాలుగేళ్లుగా నిధుల కటకట నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీల కు నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, క్లోరినేషన్, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐల ఖర్చులకే సరిపోవడం లేదని పంచాయతీ పాలకులు చెబుతున్నారు. 15 శాతం చెల్లించాల్సిందే విద్యుత్ బకాయిల్లో కనీసం 15 శాతం చెల్లించాలని ట్రాన్స్కో అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు కొత్త కష్టం వచ్చిపడింది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మొత్తాన్ని విద్యుత్ బకాయిలకు మళ్లించాల్సి రావడంతో అత్యవసర పనులకు నిధుల కొరత మరింత తీవ్రం కానుంది. చిన్న పంచాయతీలదే అసలు కష్టం జిల్లాలోని 318 గ్రామాల్లో మేజర్ పంచాయతీలు మినహా చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయంగా ఉంది. జనాభా ప్రాతిపదికన చిన్న పంచాయతీలకు నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు, మేజర్ పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. ఈ నిధులతోనే పలు రకాల నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తోంది. నీటి సరఫరాతో అదనపు భారం మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో పంచాయతీ పరిధిలోని బావుల్లో విద్యుత్ మోటార్ అమర్చి నల్లానీరు సరఫరా చేయాల్సి వస్తోంది. ఫలితంగా ఒక్కో పంచాయతీకి రూ.వేలల్లో అదనంగా విద్యుత్ బిల్లు వస్తోంది. కొన్నేళ్లుగా జీపీలకు నిధులు రాకపోవడంతో విద్యుత్ భారం తలనొప్పిగా మారింది. బిల్లులు కట్టాలా.. గ్రామాలు నడపాలా? వీధిదీపాలు వెలిగించేందుకు, తాగునీటి సరఫరాకు కరెంట్ అవసరం.. పారిశుధ్య పనులకు సిబ్బందికి జీతాలు ఇవ్వాలి. మరోవైపు పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పంచాయతీలకు వచ్చిన కొద్దిపాటి నిధులు కరెంట్ బిల్లులకే మళ్లించే పరిస్థితి నెలకొనడంతో గ్రామాల్లో అభివృద్ధి మందగించే ప్రమాదం ఉందని పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
1,79,879
ఓట్లు ఔట్!సర్ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి ఈ నెల 3వరకు ఇంటింటా ఓటర్ల పరిశీలన, ఫారాల పంపిణీ, సేకరణ జరగగా పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ ఈ నెల 3లోపు చేపట్టారు. సోమవారం ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. అందులో అన్కలెక్టబుల్ ఫామ్స్ కాలమ్లో లక్షన్నర ఓట్లకు పైగా ఓటర్లను చూపించడం విశేషం. 1,79,879 ఈఎఫ్లు అన్కలెక్టబుల్గా నమోదయ్యాయి. మొత్తం ఓటర్లతో పోలిస్తే ఇది 16.52 శాతం. 12,332 మంది ఓటర్ల వివరాలు ఏఎస్డీ జాబితాలో నమోదయ్యాయి. ఇది మొత్తం ఓటర్లలో 1.13 శాతం. ఇంట్లో వ్యక్తి లేకపోవడం, చిరునామాలో వ్యక్తి అందుబాటులో లేకపోవడం, ఫారం తిరిగి అందకపోవడం, ఇతర సమస్యలుగా అధికారులుగా చెబుతున్నారు. ఇక అనొమలిస్ కాలమ్లో 2,09,443 ఓట్లను గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది 19.23శాతం. 7,178 మంది ఓటర్లకు సంబంధించిన డీఎస్ఈ నమోదైంది. ఈ వివరాలను అధికారులు పరిశీలించి, అవసరమైన చోట సవరణలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారాల డిజిటలైజేషన్, వెరిఫికేషన్ పనులు జిల్లాలో 83 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు, బీఎల్వోలు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల మిస్మ్యాచ్, వివరాలు పొంతన లేకపోవడం, ప్రత్యేకంగా పరిశీలించాల్సినవిగా ఎన్నికల విభాగం అధికారి వివరించారు. ఓటర్లు తస్మాత్ జాగ్రత్త.. ఓటర్లు అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం జరిగే అవకాశముంది. ఓటరు ఇక్కడే ఉండి ఓటరు జాబితాలో పేరు లేకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 10న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనుండగా ఓటర్లు కచ్చితంగా జాబితాలో తమ పేరుందో లేదో చూసుకోవాల్సిందే. లేకుంటే తదుపరి ఓటరుగా నమోదు కావాలంటే ఇబ్బందితో కూడుకున్న పని.మొత్తం బీఎల్వోలు: 1,338 మొత్తం ఓటర్లు: 10,89,090సగటున బీఎల్వోలు పరిశీలించిన ఓట్లు: 814ఓటరు ఫాం పంపిణీ చేసినవి: 10,89,090డిజిటైజ్డ్ చేసిన ఫామ్స్: 9,09,205డిజిటైజ్డ్ కానివి: 06తేడాలు,లోపాలుఉన్న ఓటర్ల సంఖ్య: 12,332 ఫామ్స్ సేకరించలేని కేసులు: 1,79,879డేటాలో గుర్తించిన తేడాలు: 2,09,443సర్ షెడ్యూల్ ముసాయిదా జాబితా ప్రకటన: ఆగస్టు 10 ఫిర్యాదులు, అభ్యంతరాలు: ఈ నెల 10నుంచి సెప్టెంబర్ 9వరకు నోటీసుల జారీ, పరిశీలన: ఈ నెల 10నుంచి అక్టోబర్ 10తుది ఓటరు జాబితా: అక్టోబర్ 12, 2026జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. మొత్తం ఓట్లలో 15శాతానికి పైగా తగ్గడం ఖాయమనిపిస్తోంది. ఇన్నాళ్లు ఉన్నవి బోగస్ ఓట్లా, డబుల్ ఓట్లా అన్న ది అనుమానమే. సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 10న ప్రకటించనుండగా దాదాపు ఖరారైంది. ఫారమ్స్ కలెక్ట్ చేయలేని వాటి సంఖ్య 1,79,879 ఉండటం గమనార్హం. అంటే సదరు ఓట్లు జాబితా నుంచి తొలగించడం లాంఛనమే. ఎన్నికల సంఘం మాత్రం అన్కలెక్టబుల్ ఫామ్స్గా కాలమ్లో సూచించింది. తదుపరి వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఓట్లు తొలగించినట్లేనని తెలుస్తోంది. సర్ ప్రక్రియకు ముందు జిల్లాలో మొత్తం 10,89,090 ఓటర్లుండగా ప్రత్యేక రివిజన్ కార్యక్రమం క్రమంలో 9.09లక్షల ఓట్లకు చేరనుంది. సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించనుండగా నియోజకవర్గాల సమగ్ర స్వరూపం వెల్లడవనుంది. – కరీంనగర్ అర్బన్/కరీంనగర్ -
● 65 ఏళ్ల వృద్ధురాలికి విజయవంతంగా మోకాలి కీలు మార్పిడి ● రిస్క్ ఉన్నా సవాల్గా తీసుకున్న ఆర్థోపెడిక్ వైద్యులు
కరీంనగర్: ప్రైవేటులో రూ.లక్షలు ఖర్చయ్యే టోట ల్ నీ రీప్లేస్మెంట్ (టీకేఆర్) శస్త్రచికిత్సను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఉచితంగా నిర్వహించారు. వయసు కారణంగా రిస్క్ ఉన్నప్పటికీ సవాల్గా తీసుకుని శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి శనివారం వెల్లడించారు. కరీంనగర్లోని మంకమ్మతోటకు చెందిన జయలక్ష్మి (65) కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఇటీవల కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు మోకాలి కీలు పూర్తిగా అరిగిపోయినట్లు గుర్తించి, కీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమని సూచించారు. జయలక్ష్మి వయసు దృష్ట్యా శస్త్రచికిత్స రిస్క్ ఉన్నప్పటికీ వైద్యులు సవాలుగా తీసుకున్నారు. ఈ నెల 5న టీకేఆర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అరిగిపోయిన ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని, వాకర్సాయంతో మూడు రోజుల్లోనే నడుస్తుందన్నారు. జీజీహెచ్లో తొలిసారి 2023లో మెడికల్ కళాశాలకు అనుబంధ ఆస్పత్రిగా మారిన తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో తొలిసారిగా టీకేఆర్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్లు వంశీ, ఆదిత్య, అనిస్థీషియా డాక్టర్ శంతన్కుమార్, సతీష్కుమార్, మమతతో పాటు వైద్య సిబ్బంది శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. డబ్బు లేక వైద్యం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య బృందం నిరంతర కృషిచేస్తోందని వీరారెడ్డి పేర్కొన్నారు. -
‘నారాయణపూర్’ పనులకు రూ.20కోట్లు మంజూరు
గంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పనులకు మోక్షం లభించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, చెరువు కట్ట మరమ్మతు, గ్రావిటీ పనులు, బండ్, మత్తడి పనులకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణపూర్ నిర్వాసితుల కోసం గతంలో రూ.23.50 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం రిజర్వాయర్ పనుల కోసం నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్ పనులు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గంతో పాటు, చుట్టు పక్కల మండలాలకు చెందిన 49,500 ఎకరాలకు సాగు నీరందుతుంది. సిటీలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: 33/11 కే.వీ. టవర్ సర్కిల్ సబ్స్టేషన్లో నిర్వహణ పనులతో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు టవర్ సర్కిల్, రాజీవ్చౌక్, భారత్ టాకీస్, రూరల్ పోలీస్స్టేషన్, అన్నపూర్ణ కాంప్లెక్స్, సిక్వాడీ, బోయవాడ, గంజ్, మార్కెట్ ప్రాంతాలతో పాటు చెట్ల కొమ్మల తొలగింపు, ఏబీ స్విచ్ మరమ్మతులతో ఉద యం 9 నుంచి 11 గంటల వరకు 11కే.వీ.మంకమ్మతోట ఫీడర్ పరిధిలోని ఫైర్స్టేషన్, రెండో టౌన్ పోలీస్స్టేషన్, ఫాండస్ స్కూల్, విఘ్నేశ్వర హాస్టల్, ఆర్బీ స్వీట్ హౌస్, అన్వర్ హోటల్, శ్రీరామ బుక్స్టాల్, మోర్ సూపర్ మార్కెట్, గోపాల్రావు బిల్డింగ్, వాణి సూపర్ మార్కెట్, జాఫ్రీ మసీదు, జిల్లా గ్రంథాలయం, వాణినికేతన్ కళాశాల ప్రాంతాలు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11కే.వీ.ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరి యా, మానేరునగర్, పద్మనగర్, ప్రగతినగర్, లారెల్ స్కూల్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 11కే.వీ. గీతాభవన్ ఫీడర్ పరిధిలోని మంకమ్మతోట, రాంనగర్, పారమిత స్కూల్. రాజీవ్పార్క్, జయరాం హాస్పిట ల్, పద్మనగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలికరీంనగర్కల్చరల్: డీడీఎన్ అర్చకులకు ఉద్యో గ భద్రత కల్పించడంతో పాటు 99వ పీఆర్సీని అమలు చేయాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డీడీఎన్ అర్చకులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీడీఎన్ అర్చకుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కళాభారతిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ డాక్టర్ రాజశేఖరరెడ్డి డీడీఎన్ పథకం ప్రారంభించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒకటో తేదీన వేతనాలు అందించడం అర్చకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దూప దీప నైవేద్యం రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నవజ్జుల ప్రసాద్ శర్మ, జాక్ కన్వీనర్ డీవీఆర్ శర్మ, ప్రధాన కార్యదర్శి వేగ్గలం సంతోష్ శాస్త్రి, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు జక్కాపురం నారాయణస్వామి పాల్గొన్నారు. అవధానం.. మనకు ప్రత్యేకంకరీంనగర్కల్చరల్: తెలుగు వారికే సొంతమైన ప్రత్యేక సాహిత్య ప్రక్రియ అవధానం అని జిల్లా విద్యా శిక్షణ కళాశాల (డైట్) ఇన్చార్జి ప్రిన్సిపాల్ గుర్రాల మహేశ్వర్రెడ్డి అన్నారు. ఎల్ఎండీ కాలనీలోని డైట్ కళాశాలలో అవధాన శేఖర, సాహితీ రత్న డాక్టర్ గండ్ర లక్ష్మ ణరావు ఆధ్వర్యంలో శుక్రవారం అష్టావధాన నిర్వహించారు. మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తిరుపతి వెంకట కవుల నుంచి నేటి అవధానుల వరకు అవధాన ప్రక్రియ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతోందన్నారు. డాక్టర్ గండ్ర లక్ష్మణరావు నిర్వహించిన అష్టావధానం రసరమ్యంగా సాగింది. గాజుల రవీందర్ అప్రస్తుత ప్రసంగం తన చమత్కారాలతో విద్యార్థులను, పండితులను ఆకట్టుకుంది. సముద్రాల వేణుగోపాలచార్య, రాజారాం మోహన్శర్మ, డాక్టర్ తత్వాది ప్రమోద్కుమార్, సుదర్శనం వేణుశ్రీ, కె.ఎస్.అనంతాచార్య, రామక విఠలశర్మ, శ్రీమతి శ్రీలత, గాజుల రవీందర్ పాల్గొన్నారు. -
గ్యాస్ మాటున గుండెపోటు
నగరంలోని మంకమ్మతోటకు చెందిన రమేశ్(40) ఉదయం లేవగానే చాతిలో మంటగా అనిపించింది. మొదట గ్యాస్ సమస్య అనుకున్నప్పటికీ ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలుచేయించుకోగా ఒక వాల్వ్ బ్లాక్ అయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టంట్ వేశారు● అతి పెద్ద కిల్లర్గా మారిన హార్ట్ ఎటాక్ ● కరీంనగర్లో పెరుగుతున్న కేసులు ● నడక, వ్యాయామంతో నివారించే అవకాశం ● జీవనశైలి, ఆహార మార్పులు తప్పనిసరి ● ముందు జాగ్రత్త మేలంటున్న వైద్యులుకరీంనగర్: ఛాతీలో మంటగా ఉంది. గ్యాస్ అయి ఉంటుంది. అజీర్ణం వల్ల నొప్పి వస్తోంది.. అంటూ చాలామంది నిర్లక్ష్యం చేసే లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ అని అనుకుని ప్రతి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రతి నొప్పి గుండెపోటే అని భయపడాల్సిన అవసరం కూడా లేదని చెబున్నారు. అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. గుండెపోటు చికిత్సలో శ్రీగోల్డెన్ అవర్శ్రీ అత్యంత కీలకం. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారిలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, ధూమపానం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. యువతలో పెరుగుతున్న ముప్పు ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు 25 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో కూడా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు ఇందుకు కారణం అవుతున్నాయి. గ్యాస్.. గుండెపోటు లక్షణాలు గ్యాస్ లేదా అజీర్ణం వల్ల సాధారణంగా కడుపు ఉబ్బరం, తేపులు, భోజనం చేసిన తర్వాత అసౌకర్యం, గొంతు వరకు మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మందులు తీసుకుంటే లేదా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గుండెపోటు సమయంలో ఛాతీ మధ్య భాగంలో బిగుతుగా లేదా నొక్కుతున్నట్లుగా నొప్పి ఉండవచ్చు. ఆ నొప్పి చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపుకు వ్యాపించవచ్చు. అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర నీరసం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో నొప్పి తక్కువగా ఉన్నప్పటికీ గుండెపోటు ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి... ఛాతీలో 15 నుంచి 20 నిమిషాలకు పైగా కొనసాగే నొప్పి, ఒత్తిడి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎడమ చేయి, మెడ, దవడకు వ్యాపించే నొప్పి అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు తీవ్రమైన బలహీనత లేదా తల తిరగడం ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెంటనే వెళ్లి ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
చేనేత కళాకారుల నైపుణ్యం అమోఘం
కరీంనగర్: చేనేత కార్మికుల కళానైపుణ్యం అమోఘమని మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం 39వ డివిజన్లోని చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో మాట్లాడారు. దేశీయ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మా ర్కెటింగ్ అవకాశాలు కల్పించడంతోపాటు చేనేత కార్మికుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. చేనేత మగ్గంపై స్వయంగా నేస్తూ మగ్గం పనితీరును పరిశీలించారు. చేనేత సహకార సంఘం అధ్యక్షు డు, డైరెక్టర్లు, సభ్యులను సన్మానించారు. కార్పొరేట ర్లు వాసాల రమేశ్, వేముల కవిత చంద్రశేఖర్, లక్ష్మి రమేశ్, చొప్పరి జయశ్రీ, మాసం గణేశ్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, సత్యం పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యుల చెంతకు వృద్ధురాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన పోతురాజుల గంగవ్వ(75) గాంధారీ ఖిల్లా దర్శనానికి వచ్చి తిరుగువెళ్లే క్రమంలో అటవీ ప్రాంతంలో తప్పిపోయింది. కుటుంబ సభ్యులు పోలీస్, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి అటవీ క్షేత్రాధికారి సంతోష్ ఆదేశాల మేరకు గాంధారిఖిల్లా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో భాగంగా జంతువుల కదలికల కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు గంగవ్వ ఫొటో చిక్కింది. దీంతో నిర్ధిష్టమైన ప్రణాళికతో పోలీస్, అటవీ అధికారులు మరింతగా గాలింపు చేపట్టగా రాత్రి 9 గంటల ప్రాంతంలో సఫారీ 1వ గేట్ వద్ద గంగవ్వను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రైలు రాకపాయె!
పదేళ్లు అయిపాయెగోపాల్రావుపల్లి.. అనుపురం మధ్య ప్రారంభమైన రైల్వే వంతెన పనులుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్కు రైల్వే ద్వారా రాకపోకలు సాగించేందుకు కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 7న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. హైదరాబాద్– మనోహరాబాద్– సిద్దిపేట– సిరిసిల్ల– వేములవాడల మీదుగా కరీంనగర్ చేరుకునేలా రూటు డిజైన్ చేశారు. భూసేకరణ, పరిహారం, బడ్జెట్ కేటాయింపుల్లో సమస్యలతో ప్రాజెక్టు రోజురోజుకు జాప్యమవుతోంది. రాజధాని హైదరాబాద్– పాత కరీంనగర్ జిల్లాకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు. తొలి ఐదేళ్లు వచ్చే నష్టాలను భరించేందుకు కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 17 స్టేషన్లతో 151 కిలోమీటర్ల దూరం మేర విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఆరంభ వ్యయం రూ.1,167 కోట్లు కావడం గమనార్హం.కొత్తపల్లిలో 3 గుంటలు సేకరణకొత్తపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల ఓ ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డు కోసం రైల్వేకు అప్పగించేందుకు కరీంనగర్ రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపి భూమి అప్పగించారు. ఇటీవల తాము అప్పగించిన భూమి కన్నా మూడు గుంటల భూమి అధికంగా రైల్వే కోసం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని పాత ఆర్డీవో మహేశ్వర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మూడు గుంటల భూమి కోసం నిబంధనల ప్రకారం.. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మొత్తం 3 గుంటల భూమికి మార్కెట్ రేటు ప్రకారం.. పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.పెరగనున్న కనెక్టివిటీఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లకు కీలకమైన రూట్గా మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను ఇటు హైదరాబాద్ అటు, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్ ఎర్త్ మెటల్స్ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
సంధ్యా సిందూరం
నీలినీలి ఆకాశాన్ని వాన మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపు వరుణుడు జల్లులు కురిపించగా గెరువివ్వగానే ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. మేఘాల చాటున దాగిన సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుండగా.. ఆకాశం ఎరుపెక్కి సప్తవర్ణంలోకి మారింది. ఓ వైపు కొండలు.. మరోవైపు విశాలమైన రహదారి.. మధ్యలో వాహనాల రాకపోకలతో మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి ప్రాంతం శుక్రవారం సాయంత్రం సుందరంగా కనిపించింది. అప్పుడే వెలిగిన విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలుపుతూ సాయంకాలపు అందాలతో కనువిందు చేశాయి. – మానకొండూర్ -
భారత ఆహార భద్రతకు దిక్సూచి స్వామినాథన్
కరీంనగర్సిటీ: భారత ఆహర భద్రతకు దిక్సూచిగా స్వామినాథన్ నిలిచారని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ కొనియాడారు. హరిత విప్లవ పితామహుడు, భారతరత్న ఎం. ఎస్.స్వామినాథన్ 101వ జయంతిని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ ఎం.ఎస్.స్వామినాథన్ భారత వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు దేశ ఆహార భద్రతకు బలమైన పు నాది వేశాయన్నారు. విద్యార్థులు ఆయన శా సీ్త్రయ దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నా రు. కడారు సురేందర్రెడ్డి మాట్లాడుతూ స్వా మినాథన్ హరిత విప్లవానికి కీలకమైన నాయకత్వం వహించారన్నారు. బోటనీ ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామినా థన్ పరిశోధనలు వ్యవసాయ రంగానికి కొత్త దిశను చూపించాయన్నారు. అధ్యాపకులు రౌతు రాధాకృష్ణ, ఎండీ.థేర్ హుస్సేన్, పడాల తిరుపతి, కళాజ్యోతి, అందె బుంగ తిరుపతి, తాజొద్దీన్, స్వరూపారాణి పాల్గొన్నారు. కరీంనగర్కల్చరల్: విద్యార్థులు, యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రాధాన్యతను వివరించేందుకు జ్ఞాన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. స్వేరోస్ ఆధ్వర్యంలో ఈనెల 30న మధ్యాహ్నం 12 గంటలకు గంగాధరలో నిర్వహించే జ్ఞాన సమ్మేళన పోస్టర్ను శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ప్రతినిధులు, ఫిట్ ఇండియా ఫౌండేషన్ నాయకుడు కొంకటి శేఖర్, దుస్సా కుమార్స్వామి, మేకల రవీందర్, ఎర్ర రాజు, జన్ను స్వరూప, మారుపాక రాజు, దొబ్బెల ప్రేమ్, జెట్టిపల్లి అనిల్, మొలుమ్మూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. జాబ్మేళాకు స్పందనకరీంనగర్సిటీ: కరీంనగర్లోని తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (టీఎస్కేసీ) ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం మెగా జాబ్మేళా ఘనంగా నిర్వహించారు. క్యూస్కార్ప్, ఫాక్స్కానన్, రిలయన్స్ నిప్పాన్ ఇన్సూరెన్స్, పీఎస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సహస్ర సాప్ట్వేర్ సొల్యూషన్స్, సచీనీడర్ ఎలక్ట్రానిక్స్, ఫొర్చూన్ మెడికేర్ హస్సిటల్, దృవంత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొని తయారీ, సాఫ్ట్వేర్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఫ్రంట్ ఆఫీస్, రిలేషన్షిప్ మేనేజర్, టెలీకాలర్స్, టీమ్ లీడర్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. 300 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరుకాగా 120మందిని షార్ట్లిస్ట్ చేసి ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటెంట్ లెటర్స్ అందించారు. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆయా సంస్థల నిబంధనల ప్రకారం తదుపరి దశలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్కేసీ బృందం సభ్యులు డి.శ్రీనివాస్, జి.రాజశేఖర్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంకొత్తపల్లి: కొత్తపల్లి, రేకుర్తి 33/11 కేవీ సబ్స్టేషన్లలో నిర్వహణ పనుల నేపథ్యంలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తపల్లి, వెలిచాల, దేశరాజ్పల్లి, వెదిర, రాణిపూర్, రేకుర్తి, సీతారాంపూర్, కంటి హాస్పిటల్, బ్లైండ్ స్కూల్ ప్రాంతం, సాలేహ్నగర్, గౌడ్స్ కాలనీ, కొత్తవాడ, పాతవాడతో పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొగ్ధుంపూర్ సబ్స్టేషన్ పరిధిలోని మొగ్దుంపూర్, మండులపల్లి, చెగుర్తి, ఇరుకుల్ల, చర్లభూత్కూర్, చామన్పల్లి, దుబ్బపల్లి, తహెర్కొండాపూర్, జూబ్లీ నగర్, బహదూర్ఖాన్పేట్, ఫకీర్పేట్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
10 నుంచి జిల్లా సెన్సెస్ హ్యాండ్బుక్ డేటా
కరీంనగర్ కార్పొరేషన్: ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లా సెన్సెస్ హ్యాండ్ బుక్ రూపొందించేందుకు డేటా సేకరించాలని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, డీసీపీ బషీర్ కరీంనగర్ నుంచి పాల్గొన్నారు. జనాభా లెక్కల్లో భాగంగా చేపట్టనున్న ఈ సెన్సెస్ హ్యాండ్ బుక్ జిల్లా సమగ్ర సమాచారం ఉండాలన్నారు. ఈ నెల 10 నుంచి ప్రారంభించి సెప్టెంబర్ 8వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుందన్నారు. నగరంలోని ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, కళాశాలలు , వినోద, సాంస్కతిక సౌకర్యాలు, తాగునీటి సరఫరా, నీటి లభ్యత, రవాణా, విద్యుత్, బ్యాంకింగ్, ఇతర మౌలిక సదుపాయాలు, నగరంలోని డివిజన్లు గృహాల సంఖ్య, మొత్తం జనాభా, పురుషులు,సీ్త్రల నిష్పత్తి,అక్షరాస్యత శాతం, ఎస్సీ,ఎస్టీ జనాభా, రైతులు, కూలిలు, భౌగోళిక, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్ సదుపాయాలు, డ్రైనేజీ, పారిశుధ్య వ్యవస్థ తదితర గణంకాల వివరాలను సేకరించాలన్నారు. సేకరించిన డేటా ప్రకారం వెబ్ పోర్టల్ ద్వారా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. -
ఉరివేసుకుని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
గోదావరిఖని: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న ఆజ్మీర జైతులాల్(52) శుక్రవారం గోదావరిఖని శారదానగర్లోని చిన్నకూతురు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మమత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్టౌన్ ఎస్ఐ అనూష కథనం ప్రకారం.. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైన జైతులాల్కు.. ఆరునెలల క్రితం ఓపెన్హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన జైతులాల్ మంచిర్యాల డిపోలో డ్రైవర్గా చేస్తూ కూతురు వద్ద ఉంటున్నాడు. భార్య సొంతూరులో వ్యవసాయం చేయిస్తూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ వెళ్లేది. ఓపెన్హార్ట్ సర్జరీ తర్వాత మద్యం, ధూమపానం పూర్తిగా మానేయాలని కుటుంబ సభ్యులు కోరారు. ఒకనెలపాటు బాగానే ఉన్నా.. తర్వాత మళ్లీ మద్యపానం, ధూమపానం మొదలెట్టాడు. దీంతో ఆరోగ్యం క్షీణించింది. ఈక్రమంలో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. అనారోగ్య సమస్యలే కారణం -
తిరుపతి–కరీంనగర్ రైలు వేళల్లో మార్పు
రామగుండం: తిరుపతి – కరీంనగర్ మధ్య నడిచే బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(12761) వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఇకనుంచి 7.50గంటలకేల బయలుదేరనుందని, అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని వివరించారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీవిద్యానగర్(కరీంనగర్): బోనాల పండుగా సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాల దర్శనం కోసం ఈనెల 9 ఆదివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ లగ్జరీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ కరీంనగర్–1 డిపో మేనేజర్ ఐ. విజయమాధురి తెలిపారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ బస్సు సర్వీసు బయలుదేరి నిమిషాంబిక టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, జగన్నాథ టెంపుల్, చిలుకూరు బాలజీ టెంపుల్ సందర్శన అనంతరం అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.975 టికెట్ ఉంటుందని వివరించారు. వివరాలకు 73828 49352, 9959225920 ఫోన్ నెంబర్లలో సంప్రదిచాలని సూచించారు. 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత పెద్దపల్లి: పేదలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పెద్దపల్లికి చెందిన పలువురు పౌరులు కలెక్టర్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 6న రాత్రి ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో సుమారు 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా అడ్డుకుని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయినా, వారు స్పందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం డయల్ 100 నంబరుకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యం లోడుతో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించినట్లు వారు తెలిపారు. పట్టుబడిన బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కలెక్టర్ను కోరారు. బావిలోపడి వృద్ధురాలి మృతి సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లమ్మ(83)శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి మృతి చెందింది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. మల్లమ్మకు నాలుగేళ్లుగా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో అటుఇటు తిరుగుతుండేది. శుక్రవారం ఇంటిసమీపంలోని వ్యవసాయబావి వైపు వెళ్లాగా అందులో ప్రమాదవశాస్తు పడి మృతి చెందింది. ఆమె కొడుకు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. నకిలీ ఇంటి పన్ను రశీదు తయారు చేసిన నిందితుల అరెస్ట్మల్యాల: నకిలీ ఇంటి పన్ను రశీదు తయారు చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నగేశ్, బాసోజి అనిల్, అరుణ్ సర్వాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నకిలీ రశీదును తయారు చేశారు. అధికారిక రబ్బర్ స్టాంపులు, ముద్రలతో ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. మండల పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. నర్సింగ్ విద్యార్థిని అదృశ్యంకరీంనగర్క్రైం: కరీంనగర్లోని కోతిరాంపూర్లో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందని ఓ విద్యార్థిని అదృశ్యమైంది. మూడురోజుల క్రితం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వివిధ ప్రాంతాల్లో గాలించి, వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు వివాహ సంబంధాలు చూస్తున్న క్రమంలో విద్యార్థిని అదృశ్యమైనట్లు సమాచారం. -
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది
సైదాపూర్/చిగురుమామిడి: దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని రవాణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో పర్యటించారు. సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి శివారులో రూ.1.56కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సైదాపూర్ న్యాల చెరువు కట్టపై వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. వెన్కెపల్లిలో మండల కార్యాలయాల సముదాయం వద్ద రూ.30 లక్షలతో నిర్మించే ఆహార ఉత్పత్తుల గిడ్డంగి పనులకు శంకుస్థాపన చేశారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో రూ.30లక్షలతో వెటర్నరీ సబ్ సెంటర్, రూ.16లక్షలతో నిర్మించే వీవో మహిళా సంఘ భవన నిర్మాణానికి, చిగురుమామిడిలో రూ.20 లక్షలతో నిర్మించే ప్రాథమిక పశువైద్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు గత పాలకులు వ్యవసాయం దండగ, వరి వేసుకుంటే ఉరేనన్నారని, నేడు వ్యవసాయం పండగ అని సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో నిరూపితమవుతోందన్నారు. జలసిరి కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. ఐదెకరాల భూమి ఉన్న రైతు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. కలెక్టర్ చిత్రామిశ్రా, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, చాడ కొండాల్రెడ్డి, హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు. -
మొరాయించిన 108 వాహనం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ రోగిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తున్న 108 వాహనం రోడ్డుపైనే మొరాయించింది. ఎంతకీ కదలకపోవడంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మరో వాహనాన్ని తెప్పించి రోగిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్తండాకు చెందిన భూక్య జెమిలి(85) ఇంట్లో శుక్రవారం ఉదయం జారిపడడంతో కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వీర్నపల్లికి చెందిన 108 వాహనం లక్ష్మీపూర్తండాకు వెళ్లి జెమిలిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వాహనం హఠాత్తుగా ఆగిపోయింది. 108 సిబ్బంది ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలోనే గంభీరావుపేటకు చెందిన 108 వాహన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జెమిలిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందిన రోగి బంధువులు మరో వాహనం కోసం నిరీక్షణ -
ఆలయ భూమి వివాదాస్పదం
కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్ హామ్లేట్ గ్రామం కిషన్రావుపల్లె శివారులోని మారెమ్మతల్లి ఆలయ స్థలం వివాదాస్పదంగా మారింది. గ్రామ శివారులో ఓ వ్యక్తికి సంబంధించి 72 ఎకరాల స్థలం ఉండగా, కొన్నేళ్ల క్రితం అందులో నుంచి 25 ఎకరాలు కిషన్రావుపల్లె వాసులు, 12 ఎకరాలు అయిలాపూర్ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. గీత కార్మికులు 12 ఎకరాల నుంచి 9 ఎకరాలు ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించారు. రియల్టర్ ఆ స్థలాన్ని చదును చేసే పని ప్రారంభించగా, అందులో మారెమ్మతల్లి ఆలయం ఉందని, జేసీబీతో తొలగించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కూల్చిన ఆలయాన్ని పునర్నిర్మించాలని మారెమ్మతల్లి ఫ్లెక్సీ, జెండాలు పెట్టి ఆందోళన చేపట్టారు. కాగా, ఆ స్థలంలో ఏ ఆలయం లేదని గ్రామస్తులు కావాలని వివాదం సృష్టిస్తున్నారని గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ, రెవెన్యూ అధికారులు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులు, గీతకార్మికులతో మాట్లాడారు. ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సముదాయించారు. కాగా పునర్నిర్మించే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
బోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో బోయినపల్లికి చెందిన బొటుకు మహేశ్(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై ఎన్.రమాకాంత్ తెలిపిన వివరాలు. మహేశ్ కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. మహేశ్ తండ్రి నందయ్య గతంలో మృతిచెందాడు. కొద్ది నెలులుగా అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక తన ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్కు భార్య నవ్య, ఇద్దరు కుమారులు లోకేశ్(6), అశ్విత్(4) ఉన్నారు. మృతుడి తల్లి బొటుకు లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నూరైన్కు స్వర్ణ పతకం
కరీంనగర్స్పోర్ట్స్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర 12వ యూత్ అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. 12 సంవత్సరాల కేటగిరీలో 60 మీటర్ల పరుగు విభాగంలో 48 మంది క్రీడాకారులు పాల్గొనగా, నూరైన్ ప్రతి భ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు నూరైన్ను అభినందించి భవిష్యత్లో మరి న్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇద్దిరికి జైలు శిక్షకరీంనగర్క్రైౖం: ఒకరి మృతికి కారణమైన ఇద్దరికి పదేళ్ల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కరీంనగర్ హౌసింగ్బోర్డ్ కాలనీలో గులాం షబ్బీర్ హుస్సేన్ తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరి పక్కనే రియాజ్ బేగం కుటుంబం ఉంటోంది. వీరు పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని షబ్బీర్ ఇంటి ఓనర్కు ఫిర్యాదు చేశాడు. ఇంటి ఓనర్ రియాజ్బేగంను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశాడు. 2023 నవంబర్ 30న రియాజ్ బేగం కుటుంబ సభ్యులు షబ్బీర్ కుటుంబంతో గొడవపడ్డారు. ఆ సమయంలో పాలు తీసుకుని వచ్చిన షబ్బీర్ మామ మహమ్మద్ ఉస్మాన్(64)పై కర్రతో దాడి చేయడంతో గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు ఘటనకు బాధ్యులైన షేక్ మజీద్, రియాజ్ బేగం, షేక్ ఇర్ఫాన్ ఖాన్, మున్నీ బేగం, మహమ్మద్ ముబీన్పై కేసు నమోదు చేశారు. సీఐ వి.శ్రీనివాస్ దర్యాప్తు జరిపారు. సాక్ష్యులను సీడీవో సుధాకర్ కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ ప్రతాప్ విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి శివకుమార్ షేక్ ముజీద్, షేక్ ఇర్ఫాన్ ఖాన్పై నేరం నిరూపణ కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు. మిగితా వారిపై కేసు కొట్టి వేశారు. -
మహిళపై సామూహిక లైంగిక దాడి
జగిత్యాలక్రైం/మల్యాల: మహిళ తన సన్నిహితుడితో ఉన్న సమయంలో వీడియో తీసి, బెదిరించి ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడగా, వీరికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఎస్సై సందీప్తో కలిసి సీఐ రాజ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఈనెల 3న ఓ మహిళ నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి తన సన్నిహితుడితో వెళ్లింది. సన్నిహితుడితో ఉన్న సమయంలో రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్ వీడియో తీసి సామూహిక లైంగిక దాడి చేశారు. వీరికి దరూర్కు చెందిన మారవేని మల్లేశ్, రాజారం గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య సహకరించారు. వీడియో మరికొందరికి పంపారు. దీంతో బాధితురాలు ఈ నెల 6న మల్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి ఇన్నోవా వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితులు నరేశ్పై 13 కేసులు, గుర్రం శ్రీకాంత్పై 9, మారవేని మల్లేశ్పై 2, గుర్రం అంజయ్యపై 1 కేసులు నమోదు కాగా, రౌడీషీట్ కూడా నమోదయినట్లు సీఐ తెలిపారు. కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్కరీంనగర్క్రైౖం: కరీంనగర్ టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. సీఐ సృజన్రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బి.కమలాకర్రెడ్డిని అమ్మిగల్ల ప్రశాంత్ ఊరాఫ్ శశి, అమ్మిగల్ల అంజయ్య ఊరాఫ్ అంజి, కావంపల్లి శ్రావణ్ కుమార్ కలిసి ఈ నెల 4న కారులో తీసుకెళ్లారు. అతనిపై దాడిచేసి, చంపేస్తామని బెదిరించారు. సెల్ఫోన్ లాక్కుని ఫోన్పే, క్రెడిట్కార్డుల ద్వారా రూ.52,009 బదిలీ చేసుకుని వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసి రూ.20వేల నగదు, మూడు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. -
బడికి బస్పాస్
దూరం నెలవారీ మూడు నెలలకు (కిలోమీటర్లు) రుసుము(రూ.లో) 5 275 650 10 425 1,070 15 500 1,400 20 650 1,775 25 725 2,075 30 800 2,300 35 875 2,450 ● కరీంనగర్ ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కౌంటర్లు ● అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచన కరీంనగర్టౌన్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ బస్పాసులు అందిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల పరిధిలో విద్యార్థులకు ఉచిత, రాయితీ బస్సు పాసులు పంపిణీ చేస్తున్నారు. విద్యాసంస్థలకు బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. బస్పాస్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 35 కిలోమీటర్ల పరిధి వరకే పన్నెండేళ్లు దాటిన బాలురు, ఇంటర్, డిగ్రీ, ఇతర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 35 కిలోమీటర్ల పరిధిలో రాయితీ బస్పాస్లు మంజూరు చేస్తారు. ప్రయాణ దూరాన్ని బట్టి పాస్ రుసుం నిర్ణయిస్తారు. పాస్ గుర్తింపు కార్డు కోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పన్నెండేళ్లలోపు బాలురు జిల్లా పరిధిలోని పల్లెవెలుగు బస్సుల్లో 20 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో సమీపంలోని బస్సుపాస్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ జారీకి రూ.50 గుర్తింపు కార్డు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు ఆధార్ కార్డు ఆధారంగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా, బాలురకు బస్ పాస్ పథకం ద్వారా ప్రయాణ భారం తగ్గనుంది. ప్రైవేటు విద్యాసంస్థలకు డీడీ రూపంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రాయితీ బస్సు పాస్లు అందించాలంటే ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించిన వార్షిక రుసుం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. అనంతరం సంస్థలకు ప్రత్యేక యూజర్ నేమ్, పాస్వర్డ్ కేటాయించి విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
ధాన్యం బకాయిల వసూళ్లలో వేగం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి న టెండర్ ధాన్యం బకాయిల వసూళ్లలో ప్రభుత్వం వేగం పెంచింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు, ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు, వరుసగా గడువు విధించడం వంటి చర్యలతో జిల్లాలో బకాయిల చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో మొత్తం రూ.125 కోట్ల మేర బకాయిలు ఉండగా, ప్రభుత్వం నిర్దేశించిన శుక్రవారం గడువు ముగిసే నాటికి రూ.77.01 కోట్లు ప్రభుత్వ ఖాతా లో జమయ్యాయి. ఇంకా దాదాపు రూ.48 కోట్ల మేర బకాయిలు మిగిలి ఉండటంతో వసూళ్లపై అధి కారులు దృష్టి సారించారు. ఇప్పటికే పలుమా ర్లు గడువు ఇచ్చినప్పటికీ కొందరు మిల్లర్లు బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు ఇచ్చి కేసులు న మోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.77 కోట్లు వసూలు జిల్లాలో రూ.125 కోట్ల బకాయిలు పేరుకుపోగా ప్రభుత్వం ఇచ్చిన గడువు (శుక్రవారం వరకు) లోపు రూ.77 కోట్లు వసూలయ్యాయి. మరో రూ.48కోట్లు పెండింగ్లో ఉంది. ఇందులో అత్యధికంగా ఒకే యాజమాన్యానికి సంబంధించిన మానకొండూరులోని వీరభద్ర ఇండస్ట్రీస్, సిద్ది వినాయక ఇండస్ట్రీస్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని ఆర్కే ఇండస్ట్రీస్, సాయిశ్రీనివాస్ ఇండస్ట్రీస్ నుంచి రూ.35 కోట్లు దఫాలవారీగా పూర్తిగా చెల్లించడం విశేషం. అలాగే తిమ్మాపూర్లోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్, మానకొండూరులోని మానస, హనుమాన్ ఇండస్ట్రీస్ నుంచి బకాయిలు వసూలయ్యాయి. కొన్ని మిల్లుల్లో భారీ బకాయిలు జమ్మికుంట, హుజురాబాద్కు చెందిన చాలా మిల్లుల నుంచి బకాయిలు వసూలు కావాల్సి ఉంది. జమ్మికుంట మండలం కోరపల్లిలోని మహాశక్తి ఇండస్ట్రీస్ నుంచి 12,277 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.27 కోట్లు, ఇల్లందకుంట మండలం శ్రీసీతారామ ఇండస్ట్రీస్కు సంబంధించి 16,807 మెట్రిక్ టన్నులకు రూ.37 కోట్లు వసూలు కావాల్సి ఉంది. చొప్పదండిలోని శ్రీశ్వేత ఇండస్ట్రీస్, హుజూరాబాద్ లోని వరుణ్ ఇండస్ట్రీస్, శ్రీనిధి ట్రేడర్స్, సాయిట్రేడర్స్(జగన్మాత)తోపాటు తదితర మిల్లుల్లో ఒక్కో మిల్లు రూ.5 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. వీరందరిని డీఫాల్టర్లుగా గుర్తించి కేసులు నమోదు చేసి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీకి ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్ల నుంచి 25 శాతం అదనంగా వసూలు చేయనున్నారు. డిఫాల్టర్లపై చట్టపరమైన చర్యలు బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు శుక్రవారంతో ముగియడంతో ఇకపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చెల్లింపులు చేయని మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత మిల్లులకు నోటీసులు జారీ చేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తుల జప్తు, రికవరీ చర్యలకు సిద్ధమవుతున్నారు. -
దొంగల ముఠా అరెస్టు.. సొత్తు స్వాధీనం
మహాముత్తారం: ఓ వైన్స్లో బైక్ చోరీచేసిన కేసులో నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చచేస్తుండగా.. కరీంనగర్ జిల్లా మొగ్దంపూర్ గ్రామానికి చెందిన భూతం ఆంజనేయులు, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మహంకాళి కమల్, కరీంనగర్ ఆదర్శనగర్లో నివాసం ఉంటుంన్న శివరాత్రి అభిలాష్, కరీంనగర్ మండలం మండులపల్లి గ్రామానికి చెందిన కవ్వంపల్లి అరుణ్ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించారు. యామన్పల్లి గ్రామంలోని తెలంగాణ వైన్స్లో చోరీ, ఒక హీరోస్పెలండర్ మోటార్సైకిల్ను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 5 బీరుబాటిళ్లు, 25 రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిళ్లు, రూ.5వేలు నగదుతోపాటు చోరీకి వినియోగించిన స్విఫ్ట్కారు, 2 స్మార్ట్ఫోన్లు, మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచినట్లు మహాముత్తారం ఎస్ఐ రమేశ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
ముత్తారం: పెద్దపల్లి జల్లా ముత్తారం మండలం కేశనపల్లిలో శుక్రవారం ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను ఢీకొన్న ప్రమాదంలో భవన నిర్మాణ రంగ కూలీ అక్కడకక్కడే మృతి చెందాడు. గోదావరిఖనికి చెందిన జాడి రాజేందర్ ముత్తారంలో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణంలొ పనిచేయడానికి వచ్చాడు. ముత్తారం నుంచి గోదావరిఖనికి తిరుగు ప్రయాణంలో కేశనపల్లి వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర డీసీఎం వ్యాన్ను ఢీకొని చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్ తెలిపారు. -
కండ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని అదృశ్యం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ నుంచి ఏడో తరగతి విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం జిల్లాకేంద్రంలో కొన్నేళ్లుగా పానీపూరి దుకాణం నిర్వహిస్తున్నారు. వారి కూతురు ఎప్పటిలాగే తోటి విద్యార్థులతో పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో బాత్రూంకు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని పుస్తకాల బ్యాగ్తోపాటు ఓ లేఖను స్కూల్లో వదిలి బయటకు వెళ్లిపోయింది. విద్యార్థిని తండ్రి రామ్వీర్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్స్టేషన్ ఎస్సై ఉమాసాగర్ కేసు నమోదు చేశారు. పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టగా.. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారని తన స్నేహితులతో చెప్పుకున్నట్లు బయటపడింది. తాను మధ్యప్రదేశ్ వెళ్లిపోతున్నట్లు లేఖలో రాసింది. సదరు బాలిక ఇన్స్ట్రాగాం వేదికగా ఓ యువకుడితో చాటింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే సదరు బాలిక మధ్యప్రదేశ్లోని రైల్వేస్టేషన్లో అక్కడి పోలీసులు గుర్తించినట్లు ఇక్కడి పోలీసులకు సమాచారం అందగా.. విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు గాలింపు చేపట్టిన పోలీసులు -
ఏసీబీకి చిక్కిన ఆత్మకూర్ జీపీవో
మెట్పల్లిరూరల్: భూ రికార్డుల్లో పేరు సవరించేందుకు లంచం డిమాండ్ చేసి.. రూ.ఐదు వేలు తీసుకుంటుండగా మెట్పల్లి మండలం ఆత్మకూర్ జీపీవోను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ మహేందర్రెడ్డి, బాధితుడి కథనం ప్రకారం.. ఆత్మకూర్కు చెందిన బుజ్జకర్ల మల్లేశ్ తన తండ్రి నడ్పిమల్లయ్యకు చెందిన రెండెకరాల వ్యవసాయ భూమిని కొన్నినెలల క్రితం సెల్డీడ్ చేయించుకున్నాడు. పట్టాపాస్బుక్లో మల్లేశ్ తండ్రి పేరు తప్పుగా నమోదైంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేరు సవరణకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసిన మల్లేశ్.. గ్రామ పాలన అధికారి రాజేశ్ను సంపద్రించి త్వరగా పని పూర్తి చేయాలని కోరాడు. దీనికి ఆయన రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. అయినప్పటికీ తీవ్ర జాప్యం చేస్తుండడంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. డీఎస్పీ మహేందర్రెడ్డి బృందం పథకం ప్రకారం గురువారం ఆత్మకూర్ చేరుకుంది. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన మల్లేశ్ జీపీవో రాజేశ్ను కలిసి పేరు సవరణ విషయంపై చర్చించాడు. త్వరగా పని పూర్తి చేయాలని రూ.5వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు రాజేశ్ను పట్టుకున్నారు. రాజేశ్ను మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. రికార్డులు పరిశీలించి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. భూ రికార్డుల్లో పేరు సవరణకు డబ్బులు డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రూ.5వేలు తీసుకుంటుండగా పట్టివేత -
భూ బాధితుడి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో భూవిక్రయాల్లో జరుగుతున్న మోసానికి ఇదో నిదర్శనం. భూవిక్రయదారుడు గతంలో విక్రయించిన భూమిని రెండోసారి మరొకరికి విక్రయించిన మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు గాజుల నవీన్ తెలిపిన వివరాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్కు చెందిన గాజుల నవీన్ టెంట్ నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి తన భార్య పేరున ఉన్న భూమిని నవీన్కు విక్రయించాడు. స్థానిక భవానినగర్లోని ఆరున్నర గుంటలకు రూ.34లక్షలకు బేరం కుదిరింది. ఇరువర్గాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి పత్రాలను నవీన్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఏడాది క్రితం తాను కొన్న ఆరున్నర గుంటల భూమికి కంచె వేయడానికి నవీన్ వెళ్లగా హుజూరాబాద్కు చెందిన వ్యక్తి ఆ భూమిలో తనకు 2012లోనే స్థలం యజమాని మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేసిచ్చినట్లు పత్రాలు చూపించాడు. దీంతో తాను మోసపోయినట్లు గమనించిన నవీన్ స్థలం విక్రేత వద్దకు వెళ్లి తనకు రావాల్సిన మూడు గుంటల డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. అతను ససేమిరా అంటున్నాడు. దీంతో రెండు నెలల క్రితం భూవిక్రేత ఇంటికి కుటుంబ సభ్యులతో సహా నిలదీయడానికి వెళ్లగా నవీన్పై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. ఈవిషయమై పోలీస్టేషన్లో ఫిర్యాదుకు వెళ్లినట్లు తెలిపారు. కానీ స్థలం విక్రేత తరఫున అధికార పార్టీ నేతలు వచ్చి ఎస్సైతో కలిసి తనపైనే ఉల్టా కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.3లక్షలు తీసుకో.. ఏడాదిగా పెద్దమనుషులు పంచాయితీ చేస్తున్నారని తనకు రూ.16లక్షలు రావాల్సి ఉండగా.. రూ.3లక్షలు ఇస్తామంటున్నారని రోదించాడు. ఇలా తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. మానసికంగా క్షోభకు గురై బుధవారం రాత్రి ఐదు పారాసిటమాల్ మాత్రలు మింగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం నవీన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకే భూమిని ఇద్దరికి అంటగట్టిన విక్రేత -
బకాయిలు లేకుండా చూడాలి
ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి ఎంతో మేలు కలిగింది. కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులు వెంటనే అందిస్తే మరీ మంచిది. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిశ్రమ సవ్యంగా నడుస్తోంది. పీసీ ఆర్డర్లు టెండర్ల ద్వారా కాకుండా నేతన్నల ద్వారా కొనుగోలు చేయాలి. – ఆడెపు భాస్కర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిసిల్లలోని డయింగ్ పరిశ్రమ పురాతనమైంది. దీన్ని ఆధునీకరిస్తూ ఒకే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి. నీటివసతి కల్పించి రంగులు, రసాయనాల నీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేయాలి. అద్దకం పరిశ్రమ తిరోగమనంలో ఉంది. ఆధునిక క్లాత్ ప్రాసెసింగ్ యూనిట్లకు చేయూతనివ్వాలి. – తాటిపాముల దామోదర్, వస్త్రోత్పత్తిదారుడు ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభం లేకుండా నడుస్తోంది. కొనుగోలు చేసిన వస్త్రానికి సంబంధించిన చెల్లింపులు జాప్యం చేయొద్దు. కార్మికులకు వెంటనే పేమెంట్స్ ఇవ్వాలి. నిర్ణీత గడువులోగా చెల్లింపులు ఇస్తే ప్రణాళిక ప్రకారం వస్త్రోత్పత్తి సాగుతోంది. – దూడం శంకర్, సిరిసిల్ల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, వస్త్రోత్పత్తిదారుడు నేతకార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ఆర్డర్లు ఇస్తున్నా శ్రమించే కార్మికులకు బట్టకు, పొట్టకే సరిపోతుంది. వర్కర్లను ఓనర్లను చేసే పథకాన్ని అమలు చేస్తే నేతకార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు వ్యవసాయానికి ఇచ్చినట్లుగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలి. కార్మికుడికి నేరుగా ప్రయోజనం దక్కేలా పథకాలు అమలు చేయాలి. – మూషం రమేశ్, కార్మిక నాయకుడు -
ఆశల ‘పోతలు’..
ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో గంపెడాశలు నింపాయి. ఎండిపోతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారగా, మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలను ఎత్తిపోతలతో నింపుతున్నారు. ఎల్లంపల్లి నంది పంప్హౌజ్ నుంచి రోజూ 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్లోకి నీరు ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగువ, దిగువ మానేరుతో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు తాగు, సాగు నీటికి కాస్త ఉపశమనం కలిగిందంటున్నారు సంబంధిత అధికారులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు
కరీంనగర్ అర్బన్: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదనపు డీసీపీ వెంకటరమణతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రొటోకాల్ సమస్య తలెత్తకూడదన్నారు. వేదిక వద్ద సీటింగ్, తాగునీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. దేశభక్తి పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం కురిసినా కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. స్టాల్స్, శకటాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయశాఖ, గృహనిర్మాణశాఖ, ఆర్టీసీ, వైద్యశాఖ, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల పనితీరు తెలిసేలా శకటాలు ఏర్పాటు చేయించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల శకటం, డ్రగ్స్ నియంత్రణకు పోలీస్శాఖ తీసుకుంటున్న చర్యలతో శకటం ఏర్పాటు చేయాలన్నారు. ప్రశంసాపత్రాలు అందించేందుకు ఉత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులను ఎంపిక చేయాలని సూచించారు. సమన్వయంతో యూనిఫామ్ పంపిణీకరీంనగర్ టౌన్: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విద్యార్థుల యూనిఫామ్ పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్డీఏ, మెప్మా, విద్యాశాఖ సమన్వయంతో యూనిఫామ్ పంపిణీ పూర్తి చేయాలన్నారు. ‘అపార్’ నమోదు వేగవంతం చేయాలన్నారు. ఆధార్లో పొరపాట్లతో రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఈ బాధ్యతను హెచ్ఎంలు తీసుకోవాలన్నారు. 95శాతం విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఈవో చైతన్య జైనీ, డి.ప్రశాంత్రెడ్డి, కో ఆర్డినేటర్లు అశోక్రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విదేశీ విద్య
అందని ద్రాక్ష..కరీంనగర్టౌన్: ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే కలను నెరవేర్చేందుకు ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రస్థాయిలో టార్గెట్లు పెట్టి ఎంపిక చేస్తుండడంతో జిల్లా నుంచి ఎక్కువ మంది లబ్ధిపొందలేక పోతున్నారు. ఉన్నత చదువులకు జిల్లా నుంచి ఎవరికి వారే సొంతంగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, పిలిప్పీన్స్, కెనడా, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణకొరియా తది తర దేశాలకు వెళ్తుండగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో వెళ్లేవారి సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఒక్కోపేరుతో ఈ విదేశీ విద్యాపథకాన్ని అమలు చేస్తోంది. తల్లిదండ్రుల వార్షికాదా యం రూ.5 లక్షల లోపు ఉండి చదువులో ప్రతిభ చూపేవారు ఈ పథకానికి అర్హులు. రాష్ట్రస్థాయిలో నిధుల కేటాయింపు మేరకు కమిషనరేట్స్థాయిలో ఉన్న టార్గెట్లను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేస్తున్నారు. దీంతో పైచదువులకు జిల్లానుంచి విదేశాల కు వెళ్లాలనే వారి ఆశలు ఆడియాశలవుతున్నాయి. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు అందిస్తోంది. ఈ సాయంతో విదేశీ యూనివర్సిటీల్లో ఎంఎస్, పీహెచ్డీతో పాటు ఇతర ఉన్నత విద్య చదివే అవకాశముంది. ఎస్సీ, ఎస్టీలకు బీఆర్.అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం, బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మజ్యోతిరావు పూలే ఓవర్సీస్ విద్యా పథకం పేరిట 2013 నుంచి అమల్లో ఉండగా.. మొదట్లో రూ.10లక్షలు సాయం అందించారు. 2015 నుంచి రూ.20 లక్షలకు పెంచారు. ఇంజినీరింగ్తో పాటు డిగ్రీలో కనీసం 60శాతం మార్కులుపైబడి ఉండి, టోఫెల్లో 60, ఐఈఎల్టీలో 60, జీఆర్ఈలో 260, జిమాట్లో 500 మార్కులు వచ్చి ఉండాలి. దరఖాస్తుదారుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో ఫీజుల నిమిత్తం ఈ సొమ్మును చెల్లిస్తారు. ఆయా యూనివర్సిటీల్లో ఫీజు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం రూ.20లక్షలు మాత్రమే అందిస్తుంది. -
16న కలెక్టరేట్ ప్రారంభం
కరీంనగర్ అర్బన్: నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తవగా పరిసర అభివృద్ధి, హెలిప్యాడ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈనెల 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే సీఎంతో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. అన్నీ అనుకూలంగా జరిగితే 16న కలెక్టరేట్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యాలయాల తరలింపునకు కసరత్తు ప్రస్తుత కలెక్టరేట్లో ఉన్న కార్యాలయాలను తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా సామగ్రి, ఫైళ్లు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తొలుత కలెక్టర్ చాంబర్, సిబ్బంది కార్యాలయాలను తరలించనుండగా తదుపరి అదనపు కలెక్టర్(స్థానికసంస్థలు), అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్వో కార్యాలయాలను తరలించనున్నారు. తదుపరి అన్ని కార్యాలయాలు కొత్త భవనం నుంచి సేవలందించనున్నాయి. ఎక్కడెక్కడ యేయే కార్యాల యాలంటే.. నూతన కలెక్టరేట్లో తాజా లేఔట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. గ్రౌండ్ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో, రెవెన్యూ ప్రధాన విభాగం, డీడబ్ల్యూవో, ఎలక్షన్ విభాగం, పోస్టల్, ఎన్ఐసీ, ఇన్వార్డు, ఔట్వార్డు, వీడియో కా న్ఫరెన్స్ చాంబర్, మీటింగ్ హాల్ ఉండనున్నా యి. ఫస్ట్ఫ్లోర్లో డీఆర్డీవో, డీపీవో, జిల్లా వ్యవసాయశాఖ, ఆత్మ, సీపీవో, ఉద్యాన పట్టుపరిశ్రమశాఖ, మెప్మా, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ శాఖలు, ఆడిట్ శాఖలు ఉండనున్నాయి. సెకండ్ ఫ్లోర్లో డీఎస్వో, డీఎం సివిల్ సప్లయ్, ట్రైబల్ వెల్ఫేర్, విద్యాశాఖ, మైన్స్, సర్వే లాండ్ రికార్డ్స్, ఎస్డీసీ, హౌజింగ్, మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయాలు, విభాగాలు ఉండనున్నా యి. జిల్లా పశుసంవర్ధకశాఖ, పశువైద్యాల యం, ట్రైనింగ్ సెంటర్, డీఎంహెచ్వో, ఫుడ్సేఫ్టీ కంట్రో ల్, నీటిపారుదలశాఖల కార్యాలయాలు ప్రస్తుం ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగనున్నాయి. పలు విభాగాలు పాత కలెక్టరేట్లోనే ప్రస్తుత కలెక్టరేట్లోనే పలు కార్యాలయాలు కొనసాగనున్నాయి. ట్రెజరీశాఖ అక్కడే ఉండనుంది. భద్రత ప్రమాణాల ప్రకారం అదే సురక్షిత ప్రాంతం కావడంతో అక్కడే ఉండనుంది. అలాగే ఎస్బీఐ బ్యాంక్, లీడ్ బ్యాంక్ కార్యాలయాల అవే స్థలాల్లో ఉండనున్నాయి. -
మద్యం తాగొద్దన్నారని..
● గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం తాగొద్దని కుటుంబసభ్యులు చెప్పడంతో మనస్థాపం చెందిన వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంగళ్లపల్లి మండలంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన అట్టె మల్లేశం(55) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లేశం గత నెల 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి పెద్ద కుమారుడు అట్టె చంద్రశేఖర్ ఫిర్యాదుతో ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓసీపీ–2లో బోజర్ బోల్తా.. కార్మికులకు గాయాలు రామగిరి: సింగరేణి ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2లో గురువారం డీజిల్ బోజర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు కార్మికులు గాయాలపాలయ్యారు. ఓసీపీ–2లోని పాత పార్కింగ్ ప్రాంతం నుంచి కింద ఉన్న క్వారీలోకి వెళ్లే మార్గంలో బోజర్ అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న బొగరి సుధీర్కు తీవ్రగాయాలు కాగా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు కార్మికులు తెలిపారు. రోడ్డుప్రమాదంలో మహిళ దుర్మరణం ధర్మారం: ధర్మారం మండల కేంద్ర శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గోపాల్రావుపేటకు చెందిన రంగు రాజమ్మ (60) మృతిచెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజమ్మ గోపాల్రావుపేటకు వెళ్లేందుకు ధర్మారం బస్టాండ్ వద్ద వేచి ఉంది. అంతలోనే అదే గ్రామానికి చెందిన సిరిపురం స్వామి మోటార్ సైకిల్పై రాగా, అతడి వాహనంపై రాజమ్మ గోపాల్రావుపేటకు వెళ్తుండగా వెనుక నుంచి మరో బైకు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో కిందపడిన రాజమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని గ్రామస్తులు తెలిపారు. ఆర్మేనియాలో చిక్కుకున్న మల్యాల వాసి● స్వదేశానికి రప్పించాలని ఎమ్మెల్యే సత్యంకు వినతి మల్యాల: మల్యాల మండలకేంద్రానికి చెందిన నాంతాబాద్ గంగకిషన్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఆర్మేనియా దేశంలో చిక్కుకుపోయాడు. సదరు ఏజెంట్ రష్యా పంపిస్తామని చెప్పి తనను ఆర్మేనియా పంపించాడని, తనవద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. పని లేకపోవడంతో అడుక్కుని తింటున్నానని కన్నీరుపెట్టుకుంటున్న వీడియో పంపించాడు. సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి తనను ఆదుకోవాలని, స్వదేశానికి రప్పించాలని వేడుకున్నాడు. మైసమ్మ గుడి కూల్చివేత● కిషన్రావుపల్లి గ్రామస్తులు ఆందోళన కోరుట్ల: కోరుట్ల మండలం కిషన్రావుపల్లెలో మైసమ్మ గుడిని కొంతమంది రియల్టర్లు కూల్చివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గుడి కూల్చివేసిన చోట గురువారం ధర్నా చేసి టెంట్ వేసి నిరసన తెలిపారు. కూల్చివేసిన ఆలయానికి సంబంధించిన స్థలాన్ని వదిలేసి కొత్త ఆలయం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ కృష్ణచైతన్యకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించి గుడిని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. యువకుడి కిడ్నాప్.. కేసు నమోదుకరీంనగర్క్రైం: ఓ యువకుడిని అపహరించి, చిత్రహింసలకు గురిచేసి, రూ.52వేలు వసూలు చేశారంటూ అందిన ఫిర్యాదుతో గురువారం కరీంనగర్ టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు దర్యాప్తు జరుగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. సప్తగిరికాలనీకి చెందిన బుద్దిరెడ్డి కమలాకర్ రాంపూర్లోని ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. ఈనెల 4న తనకు పరిచయమున్న ప్రశాంత్ అలియాస్ శశి పనిఉందని కారులో తీసుకెళ్లాడు. మంకమ్మతోట వద్ద సెల్ఫోన్ లాక్కున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లి అతని భార్యతో అక్రమసంబంధం ఉందని ఒప్పుకోవాలని ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు బంధించి తీవ్రంగా దాడిచేశారు. కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ జ్యోతినగర్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద తన బ్యాంకు కార్డుల ద్వారా రూ.52వేలు స్వైప్ చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం సప్తగిరికాలనీ డంపింగ్ యార్డ్ సమీపంలో దింపి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ప్రశాంత్ మద్యంమత్తులో కమలాకర్ ఇంటికి వెళ్లాడు. రెండు బైక్లు ధ్వంసం చేశాడు. కమలాకర్ భార్యను బెదిరించాడు. ఈ విషయమై బాధితుడు టూ టౌన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విషప్రచారాన్ని తిప్పికొట్టాలి
కరీంనగర్ కార్పొరేషన్: ప్రజాపాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినప్పటికి, రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల నెరవేర్చిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ధీటుగా బదులివ్వాలన్నారు. లక్ష్యం.. గ్రీన్సిటీ కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని గ్రీన్సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో వనమహోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో 3,50,000 మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తించిన స్థలాల్లో మియవాకీ, బ్లాక్, ఎవెన్యూ ప్లాంటేషన్ పద్ధతుల్లో పండ్లు, పూలు, ఔషధ మొక్కలు నాటి, ప్రతి మొక్క వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి డిజిటల్ ట్రాకింగ్ ద్వారా సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ల వారీగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలన్నారు. నగరవ్యాప్తంగా ఖాళీ స్థలాలు, రోడ్డు డివైడర్లు, ప్రభుత్వ ప్రాంగణాల్లో మొక్కలు నా టాలన్నారు. అదనపు కమిషనర్ అయాజ్, డీఈ వెంకటేశ్వర్లు, హరితహారం ఇన్చార్జి స్వా మి, పర్యావరణ ఇంజినీర్ రమేశ్ పాల్గొన్నారు. కృత్రిమ మేధస్సు ప్రత్యామ్నాయం కాదుకరీంనగర్ టౌన్: కృత్రిమ మేధస్సు ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని, వారి బోధనను మరింత సమర్థవంతంగా మలిచే శక్తివంతమైన సాధనమని డీఈవో చైతన్య జైనీ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల భాషను సులభంగా, ఆసక్తికరంగా, అర్థమయ్యేలా బోధించాలనే లక్ష్యంతో 4వ తరగతి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలోని మొత్తం 12 యూనిట్లకు ఏఐ ఆధారిత వీడియో పాఠాలుగా రూపొందించగా, ఆ సీడీని గురువారం ఆవిష్కరించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే ప్రతి తరగతి గది ఆనందదాయకమైన అభ్యాస కేంద్రంగా మారుతుందన్నారు. ఏఐ వీడియో పాఠాలు విద్యార్థులకు ఇంగ్లిష్ సులభంగా అర్థమయ్యేలా చేసి, భాషపై ఆసక్తి, అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ టౌన్: కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని, అదానీ, అంబానీల మాయలో ప్రధాని నరేంద్ర మోదీ పడ్డాడని సీపీఐ సీని యర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారజాతను గురువారం నగరంలోని పద్మనగర్లో ప్రారంభించా రు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచార జాతా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, అందెస్వామి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చేనేత.. ఎదురీత !
సిరిసిల్ల: ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతరంగం కాలానికి ఎదురీదుతోంది. వస్త్రోత్పత్తిలో వస్తున్న టెక్నాలజీతో చేనేతమగ్గాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరమగ్గాల రాకతో వస్త్ర ఉత్పత్తిలో వేగం.. నాణ్యత.. నవ్యత రావడంతో చేనేత మగ్గాల నుంచి మరమగ్గాల వైపు నేతన్నలు మారుతున్నారు. ప్రస్తుతం చేనేతరంగంలో వయోవృద్ధులు మాత్రమే కొనసాగుతున్నారు. పవర్లూమ్(మరమగ్గాల) రంగం ఆటుపోట్ల మధ్య తలెత్తుకొని జీవించేందుకు ఆరాటపడుతోంది. చేనేతమగ్గాలపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన ఘనత సిరిసిల్ల నేతకార్మికులది. అయితే చేనేతలో అరకొర కూలితో చివరితరం నెట్టుకొస్తోంది. ఆర్థిక సంక్షోభంలోనూ శ్రమిస్తున్న నేతన్నలపై జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అరకొర కూలి.. కడుపులు ఖాళీ ● ఆటుపోట్ల మధ్య వస్త్రపరిశ్రమ ● పవర్లూమ్స్ రాకతో మూలకుపడుతున్న మగ్గాలు ● నేడు జాతీయ చేనేత దినోత్సవం ● వందేళ్లు దాటిన ఘన చరిత్ర 1905లో స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ చేనేతరంగంలో విప్లవం మొదలైంది. కలకత్తా టౌన్హాల్లో అదే సంవత్సరం ఆగస్టు 7న నిర్వహించిన సమావేశంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేతరంగానికి గుర్తింపునిస్తూ 2012 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ నేతకార్మికులకు అవార్డులు అందిస్తున్నారు. ● సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి చేనేత కార్మికుని కాంస్య విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. మగ్గం, అడ్డం పోగుల ధారంతో బట్టను నేసే జోట(నాడె), వస్త్రపరిశ్రమలోని అనుబంధ రంగాల చిత్రాలను ఆవిష్కరిస్తూ సిరిసిల్లలోని కలెక్టరేట్ కూడలిని తీర్చిదిద్దారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 28 వేల వరకు ఉన్నాయి. వీటిపై పాలిస్టర్ వస్త్రం, 4 వేల మగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి సాగుతోంది. నిత్యం 25 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సిరిసిల్లలో ఉన్న 175 చేనేత మగ్గాలపై 58 మంది వృద్ధులు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. జాతీయ జెండాలను గతేడాది 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్, ఎస్సీ, బీస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలకు అవసరమైన యూనిఫామ్ వస్త్రం ఆర్డర్లను ఇక్కడి నేతన్నలకు ఇస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పక్కనపెట్టి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్, గోకుల్దాస్ గార్మెంట్ యూనిట్లలో రెండు వేలకు పైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడి నుంచి అమెరికాకు రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. ● బీమా ఓ వరం నేతన్నలకు రైతుల తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించారు. 2021 జూలై 4న సిరిసిల్ల వేదికగా ఈ పథకాన్ని ప్రకటించారు. 18–59 ఏళ్ల మధ్య వయసు గల నేతకార్మికులకు అమలు చేస్తున్నారు. బీమా వయసును 70 ఏళ్ల వరకు పొడిగించాలని నేతన్నలు కోరుతున్నారు. బీమాలో చేరిన నేతన్నలు ఏ కారణంగా మరణించినా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఎల్ఐసీ ద్వారా అందుతుంది. కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి. ● ఇవి చేస్తే మేలు ఉత్పత్తి అయిన వస్త్రానికి మార్కెట్ వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. వస్త్రోత్పత్తి వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో కార్మికులు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వపరంగా ఆజమాయిషి ఉండేలా తీర్చిదిద్దాలి. నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. పేదరికమే అర్హతగా అంత్యోదయ కార్డులు, ఆర్థిక చేకూర్పు, మహిళా సంక్షేమ పథకాల అమలు చేయాలి. నేతకార్మికులకు పీఎఫ్ సౌకర్యం, త్రిఫ్ట్ పథకంలో అందరినీ చేర్పించాలి. గుర్తింపుకార్డులు ఇచ్చి ఆరోగ్య సంరక్షణ పథకాలు అమలు చేయాలి. ● సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తామని చేనేత, జౌళిశా ఖ సహాయ సంచాకులు శ్రీరాం సంతోష్కుమార్ తెలి పారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పాతబస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాల వేసి, నేతకార్మికులతో కలిసి చేనేత వాక్ నిర్వహిస్తామన్నారు. ఇందిరా నగర్లోని వ్యవసాయశాఖ గోదాములో 10.30 గంటలకు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాల్వశ్రీరాంపూర్: నా ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు పోగు వదిలిపెట్టను. చేనేత వస్త్రాలు నేస్తూనే ఉంటా. ప్రభుత్వం చేనేత కార్మికులను, మా కుటుంబాలను ఆదుకోవాలి. మా పిల్లలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. – గోలి రమణయ్య, చేనేత కార్మికుడు, కాల్వశ్రీరాంపూర్ కాల్వశ్రీరాంపూర్: చేనేత కార్మికుల పిల్లలకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై పవర్లూమ్ యంత్రాలు అందించాలి. వస్త్రోత్పత్తిలో శిక్షణ ఇచ్చి, బట్టను మార్కెటింగ్ చేసుకునేందుకు సబ్సిడీపై మోపెడ్స్ అందజేయాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమకు ఆదరణ ఉండేది. మళ్లీ ఆ రోజులు రావాలి. – గోలి శ్రీకాంత్, కాల్వశ్రీరాంపూర్ -
నీరజ్ చోప్రాయే రోల్ మోడల్
ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా మెడల్ గెలిచిన వీడియోను యూట్యూబ్లో చాలా సార్లు చూశాను. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ ఆటను కెరీర్గా ఎంచుకున్నాను. సౌత్జోన్లో 6వ స్థానం, రాష్ట్ర పోటిల్లో బంగారు పతకాలను సాధించాను. భవిష్యత్లో జాతీయ పోటిల్లో పతకం సాధించడమే లక్ష్యం. – కె స్వామి నేను రెండేళ్లుగా జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం లోకల్ గ్రౌండ్లోనే సీనియర్ల సలహాలతో నేర్చుకుంటున్నాను. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సాధించాను. త్వరలోనే జాతీయస్థాయి పోటీల్లో జిల్లా పేరు నిలబెడతా. ఇప్పటి వరకు మూడు రజత పతకాలను సాధించాను. – సురేశ్నాయక్ సాధారణంగా అమ్మాయిలు జావెలిన్ వైపు రారు అనుకుంటారు. కానీ ఈ ఆటలో పవర్ మాత్రమే కాదు, ఫ్లెక్సిబిలిటీ కూడా ముఖ్యం. నీరజ్ చోప్రా విజయాలు నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల నమ్మకం నాకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో ఒక రజతం, ఒక కాంస్యం సాధించాను. – వి.సహస్ర -
● విలీన గ్రామాలకు ప్యాకేజీ ప్రకటించండి ● సీడీఎంఏ, ఈఎన్సీ, డీటీసీపీలకు మేయర్ శ్రీనివాస్ వినతి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర అభివృద్ధికి సహకారం అందించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్సిపల్పరిపాలనశాఖ ఉన్నతాధికారులను కలిసి కోరారు. గురువారం హైదరాబాద్లో జరగాల్సిన కరీంనగర్ నగరపాలకసంస్థ అభివృద్ధిపై రాష్ట్రమంత్రుల సమీక్ష ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో సీడీఎంఏ శ్రీదేవి, ఈఎన్సీ భాస్కర్రెడ్డి, డీటీసీపీ దేవేందర్ను కలిసిన మేయర్ నగరాభివృద్ధి, పాలనాపరమైన ప్రతిపాదనలు అందించారు. విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీడీఎంఏ శ్రీదేవిని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్, వీధి దీపాలు, పారిశుధ్య వసతులు కల్పించాలన్నారు. అమృత్ కింద యూజీడీకి కేటాయించిన రూ.70 కోట్లను తాగునీటి పైప్లైన్లు, ట్యాంక్ల నిర్మాణానికి మళ్లించాలన్నారు. తీగలగుట్టపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని, ఆర్అండ్బీ రోడ్లకు ప్యాచ్వర్క్, అప్రోచ్ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాలన్నారు. టౌన్ప్లానింగ్ను బలోపేతం చేయాలి టౌన్ప్లానింగ్ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, బలోపేతం చేయాలంటూ డీటీసీపీ దేవేందర్ను కలిసి మేయర్ వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ ఈఎన్సీ భాస్కర్రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో మంత్రుల సమీక్ష నగర అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. గురువారం హైదరాబాద్ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసినప్పటికి, మంత్రుల బిజీ షెడ్యూల్తో వాయిదా పడినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
పోక్సో కేసుల్లో శిక్షలు పడాలి
వేములవాడఅర్బన్: పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రాజన్న జోన్ డీఐజీ సన్ప్రీత్సింగ్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పోలీస్ సబ్డివిజన్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. భీమేశ్వరస్వామిని ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి గురువారం దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించారు. అనంతరం వేములవాడ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, పెండింగ్, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. వేములవాడకు వచ్చే భక్తులకు సమగ్ర భద్రత కల్పించాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, రవీందర్ తదితరులు ఉన్నారు. రాజన్న జోన్ డీఐజీ సన్ప్రీత్సింగ్ -
విసిరితే విజయమే..
కరీంనగర్స్పోర్ట్స్: ఈటె.. విసిరితే సుర్రున ఆకాశమంతా ఎత్తుకెళ్తున్నాయి. పోటీలో దిగితే విజయం ఖాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జావెలిన్త్రోపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ జోష్ రావడానికి ఐదేళ్ల క్రితం అంటే 2021 ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్లో నీరజ్చోప్రా సాధించిన విజయమే. అథ్లెటిక్స్ చరిత్రలోనే భారత్కు మొదటి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. ఆ విజయంతో దేశంలోని యువతలో జావెలిన్త్రోపై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఆ విజయానికి గుర్తుగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఏటా ఆగస్టు 7ను నేషనల్ జావెలిన్ డేగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో జావెలిన్ త్రో క్రీడకు వస్తున్న ఆదరణపై ప్రత్యేక కథనం. మట్టి ట్రాక్లపై.. ఒకప్పుడు జిల్లాలో అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్ వరకే పరిమితం. కానీ ఐదేళ్ల నాటి ఒలింపిక్స్ విజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని ఏ మైదానంలోకి వెళ్లి ఒకరిద్దరు యువకులు ఈటెలు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. సదుపాయాలు కల్పిస్తే.. జిల్లాలో ప్రతిభకు కొదవలేకపోయినా వసతుల కొరత క్రీడాకారులను వేధిస్తోంది. నాణ్యమైన జావెలిన్ స్టిక్స్ ధరలు వేలల్లో ఉండటంతో పేద, మధ్యతరగతి క్రీడాకారులు సొంతంగా కొనుగోలు చేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రాల్లో సింథటిక్ రన్వేలు, ఆధునిక జిమ్ సదుపాయాలు, ప్రత్యేక అథ్లెటిక్స్ కోచ్లను అందుబాటులోకి తెస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని క్రీడావిశ్లేషకులు పేర్కొంటున్నారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ పొందుతున్న యువత నేడు జాతీయ జావెలిన్ దినోత్సవం గతంలో అసోసియేషన్ ట్ర యల్స్ నిర్వహిస్తే ఐదారుగురు కూడా వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో హాజరువుతున్నారు. గ్రామీణ ప్రాంత అథ్లెట్లలో సహజంగానే మంచి భుజబలం ఉంటుంది. జావెలిన్కు అదే ప్రధానం. దీనికి టెక్నిక్, ఫ్లెక్సిబిలిటీ తోడైతే రాణించే అవకాశాలు ఉంటాయి. – నందెల్లి మహిపాల్, అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు -
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
గంగాధర: మండలంలోని నారాయణపూర్ గ్రామంలో బుధవారం జరిగిన గ్రామసభ వివాదం, ఎస్సీ,ఎస్టీ కేసుపై కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. గ్రామసభలో తనతో పాటు తన భర్త మధును కొందరు కులం పేరుతో దూషించి బెదిరించారని, మనస్తాపానికి గురైన తన భర్త మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సర్పంచ్ దీకొండ బాబాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వంశీకృష్ణ 13మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏసీపీ విజయ్కుమార్, సీఐ ప్రదీప్కుమార్ వివరాలు సేకరించారు. సర్పంచ్ భర్తే తమను తిట్టారని, కావాలనే నాటకమాడి తమపై తప్పుడు కేసులు పెట్టించారని బాధితులు పోలీసులతో ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి కేసులో నిందితులుగా ఉన్న కొందరు కనిపించడం లేదని, వారి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. -
కాలువలోపడి సెక్యూరిటీ సూపర్వైజర్ మృతి
రామగుండం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తే నయీం(50) పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్నగర్లోని ఎన్టీపీసీ బూడిద కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఎస్సై సంధ్య కథనం ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు చెందిన నయీం స్థానిక ఐవోసీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి రోజూ రైలులో వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్కు వెళ్తుండగా అక్బర్నగర్లోని బూడిదకాలులో బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: మహాలక్ష్మీనగర్కు చెందిన మెహమద్ మహమ్మద్ (50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. మహమ్మద్ అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగాడు. మృతుడి బంధువు మహమద్ ముజీబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతిఇబ్రహీంపట్నం: వర్షకొండలో గతనెల 30న స్కూ ల్ వ్యాన్ ఢీకొని గాయపడిన సల్వల రాజేశ్ (28) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకా రం.. వర్షకొండ గ్రామాని కి చెందిన రాజేశ్ తన ద్విచక్రవాహనంపై వె ళ్తుండగా.. మెట్పల్లికి చెందిన ఓ పాఠశాల వ్యాన్ పిల్లలను దింపి వస్తోంది. మూలమలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘ టనలో రాజేశ్ తలకు తీవ్రగాయాలు అయ్యా యి. స్థానికులు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రాజేశ్ 25రోజుల క్రితమే సౌదీ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతడి తల్లి నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోతారంలో యువకుడు..జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం గ ణేశ్పల్లి పోతారం గ్రామానికి చెందిన యాకసి రి సుబ్రహ్మణ్యం (29) అప్పుల బాధతో ఈనె ల 3న పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కళ్లను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మృతుడి భార్య గంగజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. కార్యక్రమంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నీషియన్ ప్రవీణ్, ఎస్సై గీత, ఫోరెన్సిక్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ● జేఎన్వీలో ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం
చొప్పదండి: అత్యుత్తమ విద్యతో పాటు, విభిన్న రంగాల్లో విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి జవహర్ నవోదయ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే కొనియాడారు. తానూ మహారాష్ట్రలోని సోలాపూర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థినేనని గుర్తు చేశారు. చొప్పదండిలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. హాజరైన అశ్వినీ తానాజీ మాట్లాడుతూ నవోదయలో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నవోదయలో ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ నవీన్ కుమార్, నరోత్తంరెడ్డి, సాంబయ్య, కృష్ణహరి పాల్గొన్నారు. -
సేవ చేయడం సంతృప్తినిస్తుంది
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఒక్క ఉద్యోగంగా కాకుండా, కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. ఓ వైపు ఉద్యోగం.. మరో వైపు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుండటంతో హ్యాపీగా గడిచిపోతుంది. మహిళా అధి కారులుగా ఆఫీసు పనుల్లో ఎంత ఒత్తిడికి గురైనా.. ఆ భావం మన ముఖంపై కనిపించొద్దు. చిరునవ్వుతోనే చాలా సమస్యలు పరిష్కరించవచ్చనేది నా అభిప్రాయం – సి.రత్న పద్మావతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల కుటుంబ సహకారంతో ఉన్నత స్థానానికి ఎది గాను. మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కాంక్ష ఉండాలి. మహిళలు ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలకు సమన్యాయం చేస్తున్నారు. కుటుంబంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తుండడంతో మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. – జి.సునీత–రవీందర్రెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి, జగిత్యాల ఓ వైపు జడ్జీగా ఉద్యోగానికి, మరోవైపు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తాను. కోర్టులో జరిగిన విషయాలను ఇంట్లో, కుటుంబ విషయాలను కోర్టుల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడి బాధ్యతలు అక్కడే నిర్వర్తించుకోవాలి. మహిళా అధికారులుగా అనుకున్న లక్ష్యాలను సాధించి శభాష్ అనిపించుకోవాలి. – ఆర్.లావణ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జగిత్యాల -
ఎవరూ ఖాళీగా ఉండద్దు
జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఉద్యోగాలు కావాలని ప్రజావాణికి వస్తున్నారు. ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సాధించాలి. ఆ దిశగా యువకుల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. యువకులు ఎవరూ ఖాళీగా ఉండొద్దు. వారి కోసమే జాబ్మేళాలు నిర్వహిస్తూ.. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. – నిర్మల, జిల్లా ఉపాధి కల్పనాధికారి -
ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం
కరీంనగర్అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా పాలనలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అధికారిగా ఆమె దిశానిర్ధేశం బాగుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలే అధికారులుగా ఉండటం సంతోషకర పరిణామం. ప్రజలకు మరింత సేవ చేయాలనే కాన్ఫిడెన్స్ పెరిగింది. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం నాకు ప్రేరణగా నిలుస్తాయి. – షర్మిళ, కరీంనగర్ ఆర్డీవో కరీంనగర్అర్బన్: మహిళా అధికారిగా పనిచేయడం.. సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించిన గొప్ప అవకాశం. మహిళలు, పిల్ల లు, దివ్యాంగులు, వద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమం కోసం పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ.. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నా ఉద్యోగంలో అత్యంత విలువైన అంశం. – సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్ పరిపాలనలో లభిస్తున్న అవకాశాలు, బాధ్యతలు మాపై మరింత జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కుటుంబ, పరిపాలన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. మహిళా సాధికారత అంటే సమాజంలో సానుకూల మార్పునకు నాయకత్వం వహించడం. ఆ దిశగా ప్రతి మహిళ ముందుకురావాలి. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పెద్దపల్లి -
విద్య, వైద్యంపై ఫోకస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ విద్యా, వైద్యంపై దృష్టి పెడుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లు తరచూ తనిఖీ చేస్తున్నారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు. వారితో కలిసి పాఠాలు వింటున్నారు.. బోధి స్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆమె ఆదేశిస్తున్నారు. కలెక్టర్ చొరవతో రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. – సిరిసిల్ల -
అందాల కొండగట్టు
మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయం పరిసరాలు, ప్రకృతి సోయగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కొండపైకి వెళ్లే దారిలో రోడ్డుకిరువైపులా ఎత్తుగా.. ఎటు చూసినా పచ్చదనంతో కూడిన చెట్లు అలరిస్తున్నాయి. కొండలరాయుడి సన్నిధి నుంచి లోయలు.. గుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్లు స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ● ఆకట్టుకుంటున్న కొండలు..లోయలు.. ● ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న భక్తులు -
● ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిపాలనలో నారీశక్తి ● ఉన్నతాధికారులుగా ప్రజలకు సేవలు ● ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్న 50 మందికిపైగా అధికారిణులు
మహిళా అధికారులు పాలనలో తమ సత్తా చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ విభాగాల అధిపతులుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన ప్రభుత్వశాఖలు, న్యాయస్థానాలు, రెవెన్యూ, పోలీసు, సంక్షేమ విభాగాలు సమర్థులైన మహిళా అధికారుల చేతుల్లో కొనసాగుతున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లుగా చిత్రామిశ్రా, గరీమా అగ్రవాల్ ప్రత్యేక గుర్తింపు పొందుతుండగా.. అత్యంత కీలక హోదాల్లో 50 మందికి పైగా మహిళలు సత్తా చాటుతున్నారు. వందలాది మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తూ, లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తూ.. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ పరిపాలనలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
సాగుకు ఏఐ సాయం
సాక్షి,పెద్దపల్లి: పొలంలో పంటను పీడిస్తున్న తెగులు ఏదో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఏ కాలంలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో లెక్కలు వేసుకుని తలపట్టుకుంటున్నారా? దిగుబడిని ఎక్కడ విక్రయించాలో, ఈరోజు మార్కెట్ డిమాండ్ ఎంతఉందనే సందిగ్ధంలో ఉన్నారా? ఇకపై అన్నదాతలు ఈ సమస్యలన్నింటికీ ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో కూడిన ‘భారత్ విస్తార్’ అనే అత్యాధునిక డిజిటల్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విత్తనం నుంచి విపణి వరకు సమస్త సమాచారాన్ని అరచేతిలో ఉంచుతున్న స్మార్ట్ యాప్పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. భారతీయ వ్యవసాయ రంగాన్ని డిజిటలీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను చేపట్టింది. ఇందులో భాగంగానే వివిధ పరిశోధనా సంస్థలు, అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్) ప్యాకేజీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు విడివిడిగా ఉన్న ఈ డేటాను ఏఐతో అనుసంధానించడం ద్వారా రైతులకు నేరుగా, సకాలంలో సరైన సలహాలు అందేలా ‘భారత్ విస్తార్’ను రూపొందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ టూల్ ద్వారా ఏకంగా 95 లక్షలకుపైగా రైతుల ప్రశ్నలకు సముచిత సమాధానాలు అందాయి. దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తున్నా.. అవగాహన లేక చాలామంది రైతులు ప్లాట్ఫాం సేవలు వినియోగించుకోలేకపోతున్నారు. ఏఐ టూల్ విశేషాలు సమగ్ర సమాచారం ఒకే చోట: ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్లు, పరిశోధన కేంద్రాల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకేగొడుగు కిందకు తీసుకొచ్చి, రైతులకు సులభంగా అర్థమయ్యేలా ఏఐ వ్యవస్థ విశ్లేషించి చెబుతుంది. ఉచిత డౌన్లోడ్ సౌలభ్యం: గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఎవరైనా ‘భారత్ విస్తార్’ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. స్థానిక భాషల్లో సేవలు: సంక్లిష్టమైన శాసీ్త్రయ సమాచారాన్ని రైతులు మాట్లాడే స్థానిక భాషల్లోకి అనువదించి మరీ ఈ సలహాలిస్తుంది. -
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత
కరీంనగర్ కార్పొరేషన్: ఆత్మహత్యలను నివా రించడం సామాజిక బాధ్యత అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ రూపొందించిన పోస్టర్,కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఎంతటి కష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగడమే జీవితమన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసే వ్యక్తులతో సమాజం సానుభూతితో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ భాస్కర్నాయక్, ఆడెపు సంపత్ పాల్గొన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మహిళలు తమ నైపుణ్యాలు మెరుగుపరచుకొంటూ, స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్ రామచంద్రాపూర్కాలనీలో అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వాహకుడు బాలచంద్ర స్వామీజీ పాల్గొన్నారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలికరీంనగర్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–2010 కింద ఏర్పాటైన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ జిల్లాస్థాయి సమావేశం బుధవారం రాత్రి కలెక్టరేట్లో జరిగింది. రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం పెండింగ్లో ఉన్న ఆస్పత్రుల వివరాలు, వివిధశాఖల నుంచి రావాల్సిన ఎన్వోసీల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. ఆలస్యానికి తావు లేకుండా పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అన్ని దరఖాస్తులను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు సేవల చార్జీలు, టారిఫ్ వివరాలను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్వో రాజగోపాలరావు, డెమో శ్రీనివాస్, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశంకరీంనగర్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం నియామకం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు బుధవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. సాయిని మల్లేశం ఉమ్మడి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా, లీగల్ సెల్ కార్యదర్శిగా, న్యాయవాది పరిషత్ ఉమ్మడి స్టేట్ కార్యదర్శిగా పనిచేశారు. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మూడుసార్లు కొనసాగారు. మల్లేశంతో పాటు బోయినపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీను పేర్లు పరిశీలించి, హైకమాండ్ మల్లేశం పేరును ఖరారు చేసింది. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. రేపు మెగా జాబ్ మేళాకరీంనగర్ సిటీ: కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వరలక్ష్మి బుధవారం తెలిపారు. ప్రముఖ సంస్థలైన ఫాక్స్కనాన్, జోన్ సొల్యూషన్స్, పీఎస్ సొల్యూషన్స్, సహస్ర సాప్ట్వేర్ సొల్యూషన్స్తో పాటు పలు సంస్థలు పాల్గొని అర్హులైన మహిళా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పీజీతో పాటు అన్ని డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సెల్ఫోన్, రెజ్యూమ్, ఎసెస్సీ, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆధార్కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు శివ 78931 86719, పవిత్ర 78930 82090, రాజశేఖర్ 99120 93500 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
బోనం.. వైభోగం
కరీంనగర్ కల్చరల్: డప్పు చప్పుళ్లు.. ఒగ్గుడోలు విన్యాసాలు.. కళాకారుల నృత్యాలు.. జై పోచమ్మ తల్లి నినాదాల మధ్య కరీంనగర్లో కళాకారులు బోనాల వేడుకను బుధవారం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతరలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని బోనం ఎత్తారు. గీతాభవన్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఊరేగింపు బస్టాండ్, వన్టౌన్, కమాన్ మీదుగా కోతిరాంపూర్ శ్రీ పోచమ్మ ఆలయానికి చేరుకుంది. మహిళా కళాకారులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సంద స్వప్న, ప్రతిపల్లవి, రేణుక, గోగుల ప్రసాద్, బాబు గౌరవేణి, సంతోష్ తమ్మిశెట్టి, అభినవ్ కొత్తకొండ, తిప్పబత్తిని రవి, చిలివేరి శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏదీ గృహజ్యోతి?
● 194 యూనిట్లు వాడినా రూ.1,146 బిల్లు ● 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలేది? వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. వేములవాడలో ఓ గృహ యజమాని 194 యూనిట్లు మాత్రమే వినియోగించినా బిల్లు వచ్చింది. పట్టణానికి చెందిన కనకయ్య తన ఇంటి అవసరాలకు 194 యూనిట్ల విద్యుత్ వినియోగించగా... రూ.1,146 బిల్లు వచ్చింది. అదే బిల్లులో యూనిట్కు రూ.2.62 చొప్పున రూ.510.21 సబ్సిడీ చూపించింది. అయినా బిల్లు చెల్లించాలని అందులో ఉంది. 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు గంగాధర: మండలంలోని నారాయణపూర్ సర్పంచ్ దీకొండ బాబాలక్ష్మి భర్త మధు ఆత్మహత్యాయత్నానికి కారణమైన 13మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామంలో బుధవారం గ్రామసభ జరుగుతుండగా కొంతమంది అడ్డుకుని దళిత సర్పంచ్ అని చూడకుండా భయభ్రాంతులకు గురిచేశారు. మధు ఆపే ప్రయత్నం చేయగా అంతు చూస్తామని బెదించారు. బెదిరింపులను తట్టుకోలేక మధ్యాహ్నం మధు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్ బాబాలక్ష్మి ఫిర్యాదు మేరకు అన్నాడి దామోదర్రెడ్డి, బత్తిని వెంకటరమణ, సుంకె శంకర్, ఎండీ.నజీర్, తోడేటి అనిల్, తోడేటి రాజేందర్, జడ మహేశ్, మ్యాకల మల్లేశ్, మ్యాకల హరిబాబు, పెద్దిప్యాట శ్రీపతి చారి, గుర్రం రాము, మేకల మల్లేశం, కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ సర్పంచ్ ధీకొండ బాబలక్ష్మి భర్త ధీకొండ మధును చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం పరామర్శించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి జరిగే గ్రామసభల్లో రాజకీయ కక్షలతో ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, బాధ్యులపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆమె సంతకం
● మహిళా అధికారులు.. పాలనలో ఆదర్శమూర్తులు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 మంది అధికారిణులు ● అభివృద్ధి.. సంక్షేమం పరుగులు ● ఆదర్శంగా నిలుస్తున్న లేడీబాస్లు ఒక ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఒక జిల్లాను, పరిపాలనా వ్యవస్థను ఎంత సమర్థంగా నడిపించగలరో మహిళా అధికారులు చేసి చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, సంక్షేమ పథకాల అమలు, న్యాయసేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. సేవాభావం, నాయకత్వపటిమతో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న మహిళా అధికారులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘కలలు కనండి... కష్టపడండి... నాయకత్వం వహించండి’ అనే నమ్మకాన్ని బలపరుస్తున్నారు. -
వృద్ధులకు భరోసా
కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆ ఫీసర్. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు వరుసలో నిరీక్షించకుండా కుర్చీలు ఏర్పాటు చేశారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. పక్షం రోజులకోసారి పర్యవేక్షిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకుంటే తదుపరి చర్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల మెయింటెనెన్స్ విషయంలో వారి వేతనాల నుంచి కోత విధించి పేరెంట్స్ ఖాతా లకు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. – కరీంనగర్ అర్బన్ -
యువ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
సిరిసిల్లటౌన్: దేశం గర్వించేలా విక్రమ్–1 రాకెట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మన జిల్లా ఇంజినీర్లను యువత ఆదర్శంగా తీసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో మంగళవారం శ్రీనాగుల మల్లయ్యశ్రీఅవార్డుల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు, జిల్లాలో బీసీలు రాజకీయంగా ఎదగడానికి కృషి చేసిన నాయకుడు ‘నాగుల మల్లయ్య’ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో మెరిసిన జిల్లా యువ ఆణిముత్యాలు సంతోష్కుమార్, కిరణ్, నాగరాజును సన్మానించి అవార్డులు అందజేశారు. 170 నిమిషాల్లో, 175 గ్రాముల బరువుతో అరుదైన చీరను చేనేత మగ్గంపై నేసిన వెల్ది హరిప్రసాద్ దంపతులను కూడా సత్కరించారు. అవార్డు కమిటీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డైరెక్టర్లు నాగుల సంతోష్గౌడ్, ఎండీ సలీం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు యువ ఇంజినీర్లు అడుప సంతోష్కుమార్, అడుప కిరణ్, బొమ్మదేని నాగరాజు మంగళవారం సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శ్రీకృష్ణ దేవరాయ హై స్కూల్, కాకతీయ హై స్కూల్, వికాస్ డిగ్రీ కాలేజీ పక్షాన సన్మానించారు. విప్ ఆది శ్రీనివాస్ -
ఆన్లైన్లోనే ఎరువులు
కరీంనగర్ అర్బన్: ఎరువుల అక్రమాలకు చెక్ పెడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు ఎరువులు తరలుతుండగా ఎమ్మార్పీకి మించి విక్రయించడం, పాత వాటికి కొత్త ధరలను అమలు చేస్తూ అన్నదాతను దోచుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఇప్పటికే యూరియా కోసం యాప్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎరువులన్నింటికి కలిపి ఒకే యాప్ను ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్ఎఫ్పీ) రూపొందించారు. సాగుకు మాత్రమే వినియోగించేలా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో యాప్ అందుబాటులోకి రానుండగా ఇప్పటికే వ్యవసాయ అధికారులకు శిక్షణనిచ్చారు. ఫర్టిలైజర్ దుకాణదారులకు శిక్షణనివ్వనుండగా వీలైనంత వరకు సదరు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఆధార్/బయోమెట్రిక్తో యూరియా పంపిణీ చేస్తుండగా యాప్ అందుబాటులోకి రాగానే స్లాట్ విధానంలో ఎరువులు ఇవ్వనున్నారు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే.. అండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లో ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత రాష్ట్రాన్ని ఎంచుకోని ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి. తదనంతరం ఓటీపీ ప్రెస్ చేయాలి. ఆధార్ లింకు లేని రైతులు ఫేస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ కావాలి. అపుడు రైతు పేరు మీద ఎంత భూమి ఉందో సర్వే నంబర్ వారీగా చూపిస్తుంది. అనంతరం పండించే పంటను ఎంపిక చేసుకోవాలి. పంట వర్గంలో సైరెల్స్ ఎంపిక చేస్తే పంటలు కనిపిస్తాయి. ఏ పంటనో ఎంపిక చేసుకోని పండించబోయే పంట అని ఉన్న చోట ప్రెస్ చేయాలి. తరువాత భూమిని ఎంచుకుని సర్వే నంబర్ సెలెక్ట్ చేస్తే ఏ ఎరువు ఎంత వస్తుందో చూపిస్తుంది. అప్పుడు అవును అని ఉన్న చోట ప్రెస్ చేయాలి. అప్పుడు ఎరువుల బస్తాలు ఎన్ని అవసరమో గరిష్టంగా సెలెక్ట్ చేసుకుని ఎక్కడ ఎరువులు అందుబాటులో ఉన్నాయో షాపుల వారీగా చూసుకుని ఎంపిక చేసుకోవాలి. బుక్ చేసుకున్న రోజు ఎరువులు ఇవ్వరు. తరువాత రెండు రోజులు మాత్రమే ఎరువులు ఇస్తారు. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు ఈ–పొస్ మిషన్ ద్వారా స్కాన్ చేసుకుని ఇస్తారు. హెక్టారు వరకు ఏక మొత్తంలో ఎరువులు ప్రస్తుతం వరకు ఉన్న యాప్లో రైతులు ఒకేసారి కాకుండా విడతలవారీగా బుక్ చేసుకోవాల్సి ఉండేది. అయిదెకరాల్లో భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, 5నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో ఎరువులు తీసుకెళ్లాల్సి ఉండేది. తాజా యాప్లో ఒక హెక్టారు అంటే రెండున్నర ఎకరాల వరకు పూర్తిస్థాయిలో ఎరువులు తీసుకోవచ్చు. అంతకుమించి భూమి ఉన్న రైతులు హెక్టారు లెక్కన ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్తో పంపిణీ కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎంఎఫ్ఎంఎస్) ప్రవేశపెట్టి వ్యాపారులతో పాటు సంఘాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లు సరఫరా చేసింది. ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేసి రైతుల వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నారో పీఓఎస్ మిషన్లలో తెలుస్తుంది. దీంతో అధికంగా తీసుకుని నిల్వ చేసుకునే వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వేరేవారి ఆధార్ తీసుకువస్తే సంబంధిత రైతు చరవాణికి వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. వచ్చే నెల నుంచి అమలు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు బుక్ చేయాల్సిందే ఎఫ్ఎఫ్పీ యాప్లో హెక్టార్కు బస్తాలు అక్రమాలకు ముకుతాడు పడేనా.? -
మంచానికే పరిమితమైన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య
యైటింక్లయిన్కాలనీ: కాలు విరిగి మంచానికే పరిమితమైన భార్య పరిస్థితి చూసి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన భర్త వేముల ఎల్లయ్య(85) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి యైటింక్లయిన్కాలనీ సంతోష్నగర్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లయ్య భార్య లక్ష్మికి రెండుసార్లు కాలు విరిగింది. కనీసం కదలలేని స్థితిలో ఉంది. నెలరోజులుగా మంచానికే పరిమితమైంది. అయితే, కొంతకాలంగా బీపీ, షుగర్, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న ఎల్లయ్య.. రోజూ భార్యకు సపర్యలు చేస్తున్నా డు. అప్పుడప్పుడు కూతురు అరుణ వచ్చి ఆలనాపాలనా చూస్తోంది. మంగళవారం ఉదయం కూడా కూతురు వీరి ఇంటికి వచ్చి వంటలు తయారు చేసి తన అత్తగారింటికి వెళ్తూ.. ‘అమ్మ కు మందులు వేయాలి’ అని తండ్రికి చేప్పి పె ద్దపల్లికి వెళ్లింది. భార్య మంచానికే పరిమితం కావడం, తనూ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పుల తో బాధపడుతూ కుంగిపోయిన ఎల్ల య్య జీ వితంపై విరక్తి చెంది తనఇంటి వరండా లో పైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని వడ్డెరకాలనీకి చెందిన బత్తిని సంతోష్(18) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. గతనెల 30న ఇదే కాలనీకి చెందిన బత్తిని అజయ్, దేవరాజ్తోపాటు సంతోష్ కారులో కరీంనగర్ నుంచి ధర్మారం వస్తుండగా అదపు తప్పి ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో సంతోష్ తీవ్రంగా గాయపడగా అజయ్, దేవరాజ్ సైతం గాయపడ్డారు. వీరిని కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా అజయ్, దేవరాజ్ కోలుకున్నారు. సంతోష్ చికిత్స పొందుతూ మరణించాడు. విషాదంలో కుటుంబం.. వడ్డెరకాలనీకి చెందిన బత్తిని మల్లయ్య– మల్లేశ్వరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దకుమారుడు హరీశ్ వారం రోజుల క్రితమే ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. విదేశాల్లో స్థిరపడుతూ కుటుంబానికి అండగా నిలవాలనే పెద్దకుమారిడిపై ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబానికి.. ఇక్కడ ఉన్న చిన్న కుమారుడు సంతోష్ ప్రమాదంలో మృతి చెందడం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒక కుమారుడు విదేశాల్లో ఉండగా, మరొక కుమారుడు శాశ్వతంగా దూరం కావడంతో మల్లయ్య, మల్లేశ్వరి దంపతులు కన్నీరుమున్నీరవున్నారు. తమ్ముడి మరణవార్త తెలియడంతో హరీశ్ దుబాయ్ నుంచి వచ్చే ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం. అనారోగ్యం భరించలేక వృద్ధుడి బలవన్మరణంశంకరపట్నం: కన్నాపూర్ గ్రామంలో మంగళవారం అడితం రాజయ్య(70) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజయ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు రాజయ్య వేలాడుతూ కనిపించడంతో కిందికి దించారు. కేశవపట్నం పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తప్పు చేస్తే కటకటాలే..
‘సిరిసిల్లకు చెందిన బుర్లా చంద్రశేఖర్ పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి దర్యాప్తు చేపట్టి నిందితుడిని రిమాండ్కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. 15 మంది సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. శాసీ్త్రయ ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్లు జైలు, రూ.2వేలు జరిమానా విధించారు. సిరిసిల్లటౌన్: తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందేనన్న కోణంలో పోలీసులు ముందుకెళ్తున్నారు. జిల్లాలో పోక్సో కేసుల్లో పలువురు నిందితులకు ఇటీవల జైలుశిక్షలు పడ్డాయి. కేసు నమోదైనప్పటి నుంచి చార్జిషీటుదాఖలు.. సాక్ష్యుల ప్రవేశాల వరకు జిల్లా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీంతో ఇటీవల జిల్లాలో పలు పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. కొందరికి ఇరువై ఏళ్ల వరకు జైలుశిక్ష ఖరారైంది. పోక్సో కేసులు.. శిక్షలపై ప్రత్యేక కథనం. ● నేరాలు.. శిక్షలు జిల్లాలో నేరాల తగ్గింపులో భాగంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి తప్పు చేసినా ఏం జరుగుతుందిలే.. అని సమాజంలో ధీమాగా తిరిగే నేరగాళ్ల ధైర్యంపై పోలీసులు దెబ్బకొడుతున్నారు. తప్పు చేసినోళ్లకు పదేళ్లు, ఇరవై ఏళ్లు జైలుశిక్షలు పడుతున్నాయి. ఆడబిడ్డలకు ఏ చిన్న ఆపద వచ్చినా భయపడకుండా 1098, 100 నంబర్లకు కాల్ చేస్తే చాలు రక్షణ కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ● పోక్సో కేసుల్లో ఫాస్ట్‘ట్రాక్’ న్యాయం పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు కావడం, పోలీసుల దర్యాప్తులు వేగిరమవుతున్నాయి. దీంతో పోక్సో కేసులు పోలీస్స్టేషన్లో నమోదుకాగానే అధికారులు విచారణను వేగం చేసి నిందితులను రిమాండ్ చేస్తున్నారు. అనంతరం చార్జీషీట్ దాఖలు, సాక్ష్యాల ప్రవేశాలు, సాంకేతిక ఆధారాలతో శిక్షలు పడేలా చూస్తున్నారు. నేరం చేయాలన్న ఆలోచన రాకుండా చర్యలు జైలులో నిందితులు.. కోర్టుల్లో సాక్ష్యులు సాంకేతిక విచారణలతో పోలీసుల చార్జీషీట్స్ శిక్షలు ఖరారు చేస్తున్న కోర్టులు -
వరంగల్కు దారేది?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: చత్తీస్ఘడ్– తెలంగాణ– మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ వేస్తున్న జాతీయ రహదారి– 563 నిర్మాణంలో కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని ఇరుకుల్ల జంక్షన్ వద్ద అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్హెచ్– 563 వరంగల్– కరీంనగర్ సెక్షన్ రోడ్డు, హైదరాబాద్– రామగుండం రాజీవ్ రహదారి ఒక్కచోట కలుస్తున్నాయి. ఎన్హెచ్ 563 ఎలివేటేఎడ్ హైవే కావడంతో కింద నుంచి రాజీవ్ రహదారి వెళ్తుంది. ఈ హైవే నిర్మాణంతో కరీంనగర్లోకి భారీ వాహనాలు రాకుండా ఇరుకుల్ల నుంచే వరంగల్వైపు వెళ్తాయనుకున్నారంతా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ జగిత్యాల వైపుగా వెళ్లేందుకు అనుకూలంగా కనెక్టివిటీ ఉన్నా.. వరంగల్ వైపు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. వాస్తవానికి ఎన్హెచ్ 563 రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఇరుకుల్ల వరకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలు వరంగల్ వైపు వెళ్లేందుకు ఎలాంటి ర్యాంపు నిర్మించకపోవడంతో కరీంనగర్ వరకు ప్రయాణించి తీగల వంతెన, మానకొండూరు మీదుగా ఎన్హెచ్– 563 ఎక్కుతున్నాయి.పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నిత్యం వేలాది లారీలు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వైపు ప్రయాణిస్తుంటాయి. బసంత్నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, సింగరేణి బొగ్గు, ఎన్టీపీసీ బూడిద, మంథని ఇసుక, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే లారీలు నిత్యం కరీంనగర్– వరంగల్– విజయవాడ మధ్య తిరుగుతుంటాయి. పెద్దపల్లి నుంచి బయల్దేరిన వాహనాల్లో కొన్ని హైదరాబాద్ వైపు వెళ్లగా, మెజారిటీ వరంగల్ మీదుగా వెళ్తుంటాయి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఎంజీఎం వెళ్లే వారు ఇదే దారిని ఎంచుకుంటారు. ఇరుకుల్ల వద్దకు రాగానే అందరికీ ఎన్హెచ్–563 హైవే శిఖరంలా దర్శనమిస్తోంది. కానీ, ఎలివేటెడ్ హైవేను ఎలా ఎక్కాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొంతదూరం సర్వీసు రోడ్డుమీద ప్రయాణించినా ఇరుకుల్ల వాగుతో రోడ్డు మూతపడుతోంది. -
అవినీతి అంతస్తులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అక్రమ నిర్మాణాలు భారీ గా పెరిగిపోతున్నాయి. అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టడం, తీసుకున్న అనుమతులు మీరి అంతస్తులు నిర్మించడం, ఆపై పెంట్హౌస్లు ఏర్పాటు చేసుకోవడం సాధారణంగా మారింది. తద్వారా నగరపాలకసంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఏటా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా పట్టణ ప్రణాళిక విభాగం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘనలు వాణిజ్య భవనాలు, సముదాయాలు, అపార్ట్మెంట్లు.. ఏ నిర్మాణాలైనా నిబంధనలు ఉల్లంఘించడం నగరంలో సర్వసాధారణంగా మారింది. నగరం శరవేగంగా విస్తరిస్తుండడం, విద్య, వైద్య, వస్త్ర, తదితర వ్యాపారాలకు హబ్గా మారుతున్న క్రమంలో బహుళ అంతస్తులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో యజమానులు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకొని భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, సంబంధిత అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను ‘మచ్చిక’ చేసుకొని నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకటి, రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని, ఆపై అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్న భవనాల సంఖ్య నగరంలో రోజురోజుకు పెరిగిపోతోంది. వాటాలే ప్లానింగ్ ప్రతి సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల్లో అగ్రభాగం టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించినవే. అక్రమ నిర్మాణాలు, సెట్ బ్యాక్ లేకుండా రోడ్లపైనే కట్టడాలపై ఫిర్యాదులు ప్రతి వారం వస్తున్నా, తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే. రోడ్లు, వీధుల్లో ఇసుక, కంకర కనిపించగానే వాలిపోయే టౌన్ప్లానింగ్ కిందిస్థాయి సిబ్బంది, అధికారులకు అక్రమ నిర్మాణాలు కనిపించకపోవడం నమ్మశక్యంగా లేదు. ఆపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఉండడం లేదు. భవన యజమానులు, ప్రైవేట్ ఇంజనీర్ల ద్వారా ముడుతున్న ముడుపుల వాటాలు కిందినుంచి పైస్థాయి వరకు పంచుకొంటుండడంతోనే అక్రమ నిర్మాణాల బాగోతం నిరాటంకంగా సాగుతోందనే ప్రచారం బల్దియాలో ఉంది. బల్దియా ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలతో నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలకు లక్షల రూపాయలు నగరపాలకసంస్థకు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుసుం ఎగవేసేందుకు, ముడుపులతో మేనేజ్ చేస్తుండడంతో, ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని నగరపాలకసంస్థ కోల్పోతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాల వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సి ఉంది. నగరంలోని గణేశ్నగర్ బైపాస్ రోడ్డులో నిర్మించిన ఈ బహుళ అంతస్తుల భవనాన్ని చూశారు కదా. ఈ భవన నిర్మాణ సమయంలో జీ ప్లస్ టు అంతస్తుకు మాత్రమే నగరపాలకసంస్థ నుంచి అనుమతి తీసుకున్నారు. అనుమతిని మీరి మరో రెండు అంతస్తులు కలిపి,మొత్తం నాలుగు అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. నగరపాలకసంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నా చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.గణేశ్నగర్లో జీ ప్లస్ టూ అనుమతి తీసుకొని, అక్రమంగా మరో రెండు అంతస్తులు నిర్మించినట్లు గుర్తించాం. ఇప్పటికే ఆ భవన యజమానికి నోటీసు ఇచ్చాం. చర్యలు కూడా తీసుకొంటాం. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియలో టౌన్ప్లానింగ్ అధికారులు పాల్గొంటున్నందున, ప్రక్రియ ముగిసిన తరువాత పూర్తిస్థాయిలో నగరంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతాం. – బషీర్, డీసీపీ, నగరపాలకసంస్థ -
పెళ్లికార్డులో ప్రకృతిపై ప్రేమ
సాధారణంగా పెళ్లి కాగానే కార్డును బయట పడేస్తాం. కానీ, ఈ కార్డును బయట పడేయకుండా మట్టికుండీలో పెట్టి పైన మట్టిని వేసి నీరు పోస్తే వారం రోజుల వరకు కార్డు మట్టిలో కరిగిపోయి అందులోంచి తులసీ మొక్క బయటకు రావడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా వ్యాపారరీత్యా నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఉంటున్నాడు. నిరుపేదల కోసం సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్లో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాలు, బాడీ ఫ్రీజర్లు సమకూరుస్తున్న ఆయన కూతురు వివాహానికి వినూత్నంగా ఆలోచించాడు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా కార్డును తయారు చేయించాడు. పెళ్లి అయిన తర్వాత మంచిరోజు చూసుకుని ఆహ్వానపత్రికను మట్టితో కూడి పాత్రలో పెట్టాలని, వారంరోజులకు తులసీ మొక్క వస్తుందని పేర్కొన్నాడు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నట్లు వివరించాడు. – కోనరావుపేట(వేములవాడ) -
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
రుద్రంగి(వేములవాడ): కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిందని కార్మిక, ఉపాధి, శిక్షణ, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రుద్రంగి మండలకేంద్రంలో రూ.45 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏటీసీ సెంటర్, రూ.40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంగళవారం విప్ ఆది శ్రీనివాస్, డైరెక్టర్ ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ఐఏఎస్ నిర్మల క్రాంతి వెస్లీ, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ఐటీఐలకు నిధులు మంజూరు చేయకుండా యువత ఉద్యోగ అవకాశాలను నాశనం చేశారన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం జర్మనీ బాష నేర్చుకుంటే కేటీఆర్ హేళనగ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పేదలు విదేశి భాష నేర్చుకొని అభివృద్ధి చెందడం కేటీఆర్కు ఇష్టం లేదన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని విదేశీ భాషల శిక్షణ అందిస్తున్నామని, రుద్రంగికి జర్మన్ భాష శిక్షకుడిని పంపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విప్ ఆది మాట్లాడుతూ, మూడపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రుద్రంగి ఏటీసీలో 288 మంది విద్యార్థులు ఏడు కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఏటీసీల ద్వారా పరిశ్రమలకు ఉపయోగపడే శిక్షణ ఇస్తారని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ ముకుందరెడ్డి, ఆర్డీఓ కేఎస్బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, ఈఈ పీఆర్ సుదర్శన్రెడ్డి, మైనింగ్ ఏడీ క్రాంతి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నట్రాజ్, సర్పంచ్ గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకట స్వామి -
రోగుల సేవకా..కాసుల వేటకా..?
మెట్పల్లి: మెట్పల్లిలో కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యుల తీరు వివాదాస్పదమవుతోంది. ఏమాత్రం సేవాభావం లేకుండా వైద్యం పేరుతో కాసులవేట సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన పోటీ పెరిగి వారి మధ్య గొడవలకు దారి తీస్తోంది. తాజాగా ఓ వైద్యుడిపై పోలీస్స్టేషన్లో కేసు నమోదు కావడం గమనార్హం. వైద్యం విషయంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడానికి బదులు వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య పోరు, రోగుల కోసం దిగజారుడు పనులు చేయడం వంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దుష్ప్రచారం.. ఫిర్యాదులు రోగుల నిలువు దోపిడీ.. పట్టణంలో ఆత్మకూర్ రమేశ్ సాయిలక్ష్మీనివాస్ పేరిట ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. అందులో కొన్నేళ్లు అశోక్రెడ్డి వైద్యుడి పనిచేశాడు. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో అశోక్రెడ్డి తప్పుకొని సాయిలక్ష్మీనివాస్ ఆస్పత్రి పక్కనే సొంతంగా మరొకటి నెలకొల్పాడు. అయితే.. తనపట్ల రమేశ్ దుష్ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో ఆదివారం వేకువజామున అశోక్రెడ్డి అతడి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీనిపై రమేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు అశోక్రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రమాణాలు పాటించాలివైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వైద్యసేవల విషయంలో తప్పనిసరిగా నైతిక ప్రమాణాలు పాటించాలి. ఆదాయమే లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. రోగులను రప్పించుకోవడానికి కమీషన్ల ఆశ చూపుతూ ఆర్ఎంపీలను ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించాలి. ఇటీవల మెట్పల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన రెండింటికి నోటీసులు ఇచ్చాం. – జైపాల్రెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి -
అంతరాయం లేకుండా విద్యుత్ లైన్ల నిర్వహణ
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ అంతరాయం లేకుండా 11 కేవీ, 33 కెవీ లైన్ల నిర్వహణ పనులు నిర్వహించాలని టీజీఎన్పీడీసీఎల్ సీఈ (హెచ్ఆర్డీ), నోడల్ అధికారి కంకటి వేణుమాధవ రావు సూచించారు. కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ ఆర్.రవీందర్తో కలిసి మంగళవారం సర్కిల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 11 కె.వీ పోల్ సంఖ్య నంబరు వేసి ఆన్లైన్లోనే జీఐఎస్ కోఆర్డినేటర్స్తో డిజిటలైజేషన్ చేయాలని ఏఈ, ఏడీఈలను ఆదేశించారు. కొత్త కనెక్షన్ మీటర్ దరఖాస్తు రెండు, మూడు రోజుల్లో పరిష్కరించాలన్నా రు. లైన్ పనులు, ట్రాన్స్ఫార్మర్ చార్జ్ అయితే వర్క్ ఆర్డర్ క్లోజ్ చేయాలన్నారు. నాన్ ఐఆర్డీఏ మీటర్లను ఐఆర్డీఏగా మార్చాలన్నారు. ప్రజా బాట కార్యక్రమాన్ని మంగళ, గురు, శనివారా ల్లో తమ సెక్షన్ పరిధిలో నిర్వహించి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా రు. ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే విద్యుత్ సంస్థ వాహనంలోనే రవాణా చేయాలని సూ చించారు. డీఈ కే.ఉపేందర్, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి, చంద్రమౌళి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. విద్యుత్ భవన్ సమావేశ మందిరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో 40మంది విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. కరీంనగర్ అర్బన్: జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. సంఘం జిల్లా చైర్మన్ బాసవేని మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కార్యవర్గం మంత్రులను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు పాలక వర్గాన్ని సన్మానించారు. అనంతరం పశుగణనశాఖ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్మన్ సరితతిరుపతయ్య, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్, డైరెక్టర్లు అగిత రవిందర్, కాల్వ సురేశ్, చౌటపల్లి రంజిత్, జిల్లెల్ల పర్శరా ములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఓదెలు, ముక్కెర సదానందం, సందవేణి ప్రసాద్, నాగారపు సత్యనారాయణ ఉన్నారు. చిగురుమామిడి: ఇంటర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రమశిక్షణతో చదవాలని డీఐఈవో వి.సత్యవర్ధన్రావు సూచించారు. మంగళవారం చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఇంటర్లో ఉత్తీర్ణులైన వారు పైచదువులను సులభంగా పూర్తిచేస్తారని తెలిపారు. విద్యతో పాటు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ప్రిన్సిపాల్ శశిధర్శర్మ, అధ్యాపకులు జనార్దన్, సంపత్, రవికుమార్, గోవర్దన్రెడ్డి, మహేందర్, అనిత, స్వరూప, మమత, చంద్రశేఖర్, రవి, కవిత పాల్గొన్నారు. కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న తొలి విడత టీజీ ఐసెట్– 2026 కౌన్సెలింగ్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశా ల హెల్ప్లైన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకున్న 333 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేసినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. -
క్రిటికల్ కేర్ లెస్!
కరీంనగర్: జిల్లా ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ యూనిట్ ఏడాది గడిచినా ప్ర జలకు అందుబాటులోకి రాలేదు. గతేడాది జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన ఈ భవనం సాధారణ వార్డులా మారింది. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన సూపర్ స్పెషాలిటీ విభాగాలు, ప్రత్యేక వైద్యులు, ఆధునిక చికిత్సా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో నిరూపయోగంగా మారింది. ఇతర జిల్లాల నుంచి బాధితులు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతో పాటు మంచిర్యా ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రినే ఆశ్రయిస్తున్నారు. గుండెపోటు, మెదడులో రక్తస్రావం, తీవ్ర రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, తీవ్ర గాయాల వంటి అత్యవసర కేసులకు చికిత్స అందక హైదరాబాద్, వరంగల్కు తరలిస్తున్నారు. ‘గోల్డెన్ అవర్’లో అందాల్సిన వైద్యం ఆలస్యం కావడంతో ప్రాణనష్టం పెరుగుతోందని వైద్య వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యాధునిక భవనం.. అరకొర సేవలు కేంద్ర నిధులతో నిర్మించిన ఈ క్రిటికల్ కేర్ కేంద్రంలో ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, మానిటరింగ్ వ్యవస్థలు, ఆపరేషన్ థియేటర్లు వంటి సదుపాయాలకు అనుగుణంగా భవనాన్ని సిద్ధంగా ఉంచారు. కార్డియాలజిస్టులు, న్యూరో ఫిజీషియన్లు, న్యూరో సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, నెఫ్రాలజిస్టు, ట్రామా సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, ప్రత్యేక నర్సింగ్ సిబ్బంది నియామకం జరగలేదు. ఫలితంగా భవనం ఉన్నా, సేవలు సాధారణంగా మారాయి. క్రిటికల్ కేర్ ప్రారంభమై ఏడాది పూర్తయినా పూర్తిస్థాయి సేవలు అందడం లేదని ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘క్రిటికల్ కేర్ విభాగంలో అత్యవసర వైద్యం అందించే సూపర్స్పెషాలిటీలకు సంబంధించిన పరికరాలు సరఫరా జరుగుతున్నాయి. త్వరలో వైద్యుల నియామకం పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే క్రిటికల్కేర్లో వైద్యం అందిస్తున్నాం. పరికరాలు వచ్చి, వైద్యుల నియామకం జరిగితే రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించగలుగుతాం’. అని సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి వివరించారు. -
ఇళ్ల పంపిణీకి అర్హులను గుర్తించండి
● వార్డుల వారీగా జాబితా సిద్ధం చేయాలి ● కలెక్టర్ చిత్రామిశ్రా కరీంనగర్ అర్బన్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకతతో నిర్వహించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. అర్హులకు అన్యాయం జరగకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఒక్కొ దరఖాస్తును కనీసం రెండుసార్లు పరిశీలించి, అర్హత ప్రమాణాల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండా ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించవద్దని సూచించారు. ప్రతి వార్డులో క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి, పారదర్శకంగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆకర్షణీయంగా కలెక్టరేట్ ద్వారం నూతన కలెక్టరేట్లో నిర్మిస్తున్న ఆర్చీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. నూతన కలెక్టరేట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్చి పనులను పరిశీలించారు. ఆర్చి నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రధాన గేటు నిర్మాణంతో పాటు రహదారి, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, ఆర్అండ్బి ఈఈ కుమారస్వామి ఉన్నారు. కరీంనగర్టౌన్: కరీంనగర్లోని జ్యోతినగర్ అంగన్వాడీకేంద్రంలో మంగళవారం నిర్వహించిన తల్లిపా ల వారోత్సవాల్లో జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే ముర్రుపాలు అమృతంతో సమానమన్నారు. బిడ్డ జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తర్వాత బాలామృతం అందించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, చైల్డ్ హెల్ప్లైన్ కేస్ వర్కర్ మహేశ్ పాల్గొన్నారు. -
సీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా సురేందర్రెడ్డి
కరీంనగర్సిటీ: తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ కడారు సురేందర్ రెడ్డిని కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం ఘనంగా సన్మానించారు. టీజీసీజీటీఏ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికవడం సురేందర్రెడ్డి నాయకత్వ పటిష్టతకు నిదర్శనమని కొనియాడారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతీ ప్రాథమిక సభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధి ఏ.నాగరాజు, టి. రాజయ్య, డాక్టర్ మల్లారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు సైనిక్ విద్యార్థులుచొప్పదండి: కరీంనగర్లో నిర్వహించిన ఐదో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో రాణించిన రుక్మాపూర్లోని సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో 200 మీటర్ల లాంగ్ జంప్ అండర్– 18 విభాగంలో ఆర్.అభిషేక్, అండర్–16 జావెలిన్త్రోలో ఇ.వివేకానందు, అండర్–14 విభాగంలో ఎం.గౌతమ్ బంగారు పతకాలు సాధించారు. వంద మీటర్ల పరుగు పందెం అండర్–18 విభాగంలో డి.భరత్కుమార్ రజతం సాధించాడు. అండర్– 18 లాంగ్జంప్లో డి.భరత్ కుమార్, జావెలిన్త్రోలో కె.రాంచరణ్లు కాంస్యం సాధించారు. విజేతలను డైరెక్టర్ లారా దత్త, ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, జేవీపీ ప్రమోద్, పీఈటీ విక్రమ్, సుమన్ అభినందించారు. శాతవాహనకు రెండు స్వర్ణాలు విరాళంకరీంనగర్సిటీ: వీసీ అమెరికా పర్యటన సందర్భంగా, అక్కడ జరిగిన సదస్సులో ఇద్దరు ఎన్నారైలు తమ చెరో స్వర్ణ పతకాన్ని శాతవాహన విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిలో ఒకరు న్యూయార్క్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి.రాజశేఖర్ రెడ్డి కాగా, మరొకరు వాషింగ్టన్ డీసీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బి.రవీందర్ రెడ్డి. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు లభించే గొప్ప మద్దతు, గుర్తింపు అని వారు కొనియాడారు. -
పల్లె పాలనలో పారదర్శకత
కరీంనగర్రూరల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి 45 రోజులకోసారి సర్పంచ్లు, మండలస్థాయి అధికారుల భాగస్వామ్యంతో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 45రోజులకోసారి ప్రత్యేక సమావేశం జిల్లాలో 318 గ్రామపంచాయతీలు, 15 మండల పరిషత్తులున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలు జరగకపోవడంతో మండలపరిషత్ సమావేశాలు నిర్వహించడం లేదు. గతంలో ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తగా అధికారులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సర్పంచులు గ్రామాల్లోని సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించడం ద్వారా అధికారుల్లో జవాబుదారీతనం వస్తుందని భావించిన ప్రభుత్వం ఇక నుంచి 45 రోజులకోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో తప్పనిసరిగా మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలంటూ గత నెల 27న కరీంనగర్ జెడ్పీ సీఈవో శ్రీనివాస్ ఎంపీడీవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. చర్చించే అంశాలివే మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచులు, మండలస్థాయి అధికారులు పాల్గొంటారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తారు. సర్పంచులు ప్రస్తావించే సమస్యలకు సంబంధితశాఖల అధికారులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. -
లక్ష ఓట్లు ఔట్!
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు లక్ష ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు పూర్తి కానున్న తరుణంలో అధికారిక లెక్కలు ఇవే చెబుతున్నాయి. నియోజకవర్గంలో 3,68,832 ఓట్లకు ఇప్పటివరకు 1,01,387 ఓట్లు అన్కలెక్టబుల్ అని అధికారులు చెబుతున్నారు. తుది జాబితా వరకు లెక్కలు కాస్త మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం కరీంనగర్లో సోమవారంతో ముగియాల్సి ఉన్నప్పటికీ.. ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేదీ వరకు పొడగించడం తెలిసిందే. కరీంనగర్ నియోజకవర్గంలోని 390 పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం.. తిరిగి సేకరించడం, వివరాలు ఆన్లైన్లో నమోదు కొనసాగిస్తున్నారు. సోమవారం నాటికి కరీంనగర్లో 71 శాతం పూర్తయినట్లు ఈఆర్వో, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్ష ఓట్లకు పైగా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 3,68,832 ఓట్లర్లలో 1,01,387 ఓట్ల అన్కలెక్టెబుల్ జాబితాలో ఉన్నాయి. అందులో మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తమ ఓటు తరలించుకున్నవాళ్లు, డబుల్ ఓట్లు ఉన్నవాళ్లు ఉంటారు. దీంతో సహజంగానే జాబితా నుంచి ఈ ఓట్లు తొలగిపోనున్నాయి. ఎక్కువగా 74,964 షిఫ్టెడ్ ఓట్లు ఉండడంతో, తుది జాబితా ప్రకటించే సమయానికి అన్కలెక్టబుల్ జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు కాస్త అటు, ఇటుగా తొలగిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఓట్లు 3,68,832 పోలింగ్ బూత్లు 390 డిజిటలైజ్డ్ అయినవి 2,62,466 డిజిటలైజ్డ్ చేయాల్సినవి 4,959 అన్కలెక్టెబుల్ 1,01,387 డెత్ 9,391 ఆబ్సెంట్ 4,506 షిఫ్టెడ్ 74,964 డబుల్ 7,990 ఇతర 4,536 -
స్టడీ ఫుల్.. స్కిల్స్ నిల్!
జెన్జీ కాలంలో విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సర్టిఫికెట్లలో మార్కులను చూసి కొలువులు ఇవ్వగా.. ఇప్పుడు ఆయా రంగాల్లో సాంకేతిక నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తూ.. ప్రతిభ ఉన్నవారిని గుర్తించి రూ.లక్షల్లో ప్యాకేజీలిస్తుండగా.. చదువు పూర్తిచేసి, సర్టిఫికెట్లు చేతిలో పట్టుకుని ఏటా వేలాది మంది నిరుద్యోగులు వివిధ ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ‘మీకు ప్రాక్టికల్ నైపుణ్యాలు (స్కిల్ డెవలప్మెంట్) లేవు‘ అనే సమాధానం ఎదురవుతుండడంతో చాలా మంది స్కిల్స్ కోసం మళ్లీ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు.కరీంనగర్ సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో సుమారు 115కు పైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జేఎన్టీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 11 నుంచి 13 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీలో 45,000కి పైగా సీట్లు అందుబాటులో ఉండగా.. మూడేళ్లలో 50,000 నుంచి 70,000 మంది వరకు విద్యార్థులు డిగ్రీ చదువుతున్నట్లు అంచనా. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా సుమారు 4,500 నుంచి 6,000 వరకు కొత్త అడ్మిషన్లు జరుగుతుంటాయి. నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సును ప్రస్తుతం సుమారు 18,000 నుంచి 22,000 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరిలో 30నుంచి 40శాతం మంది డిగ్రీ పట్టాలతో బయటికి వస్తుండగా.. కేవలం 3నుంచి 5శాతం మంది మంచి ప్యాకేజీలో కొలువు సాధిస్తున్నారు. మిగితావారు ఉద్యోగ ప్రయత్నంలో ఉంటున్నారు. -
భూ సమస్యలు.. వృద్ధుల తిప్పలు
పట్టా భూముల నిషేధిత చట్టం 22/ఏ సీలింగ్ యాక్ట్ నుంచి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని గతేడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. రేకుర్తి, విద్యానగర్ పరిధిలోని పాత రేకుర్తి గ్రామానికి సంబంధించి 125 సర్వేనంబర్లు 536 ఎకరాలు, విద్యానగర్కు సంబంధించి 16 సర్వే నంబర్లు 115 ఎకరాలు మొత్తం 6వేల ఇండ్లు, పదివేల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాకు ఆత్మహత్యలే గతి. – డివిజన్ ప్రజలు, రేకుర్తి, విద్యానగర్, కరీంనగర్కరీంనగర్ అర్బన్: ‘సమస్యలతో వేగలేకపోతున్నాం.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. రోజులు.. నెలలు గడిచినా పరిష్కారం కావడం లేదు. జర మీరైనా మా సమస్యలను తీర్చరూ’.. అంటూ అర్జీదారులు జిల్లా అదనపు కలెక్టర్లతో ఏకరవు పెట్టారు. సోమవారం కలెక్టరేట్లో జరిగి న ప్రజావాణిలో బారులు తీరారు. కలెక్టర్ను కలిసి ఫిర్యాదులు ఇచ్చేందుకు ఆసక్తి చూపగా అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంఽధించిన అర్జీలు రాగా మొత్తం 212 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.గ్రామంలోని సర్వే నంబర్ 109లో 0.28గుంటల భూమిని గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా. ఇప్పటివరకు నాకు ఎలాంటి పాస్బుక్ జారీ కాలేదు. అధికారులు నా కుమారుని పేరున పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయండి. – బోయిని కొమురయ్య, మైలారంమాది శంకరపట్నం మండలం అంబాలాపూర్. కష్టం చేసి ఎకరంనర భూమిని సంపాదిస్తే ఇద్దరు కొడుకులకు చెరి 30గుంటలిచ్చి నం. ఇప్పుడేమో మాకు తిండి పెడ్తలేరు. దవాఖానాల చూపించుకుందామంటే ఇప్పటికి చేసిన అప్పులు రూ.2.50లక్షలయ్యాయి. అప్పులు కట్టరట.. ఉన్న 10గుంటల భూమిని అమ్ముకోనియరట. – వడ్లకొండ చంద్రయ్య, లక్ష్మి, అంబాలాపూర్మొత్తం అర్జీలు: 212, ఆర్డీవో, కరీంనగర్: 66 హౌజింగ్: 44 కరీంనగర్ కార్పొరేషన్: 42 సీపీ ఆఫీస్: 08 -
శ్రమైక్య భోజనం
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026నాలుగు టీఎంసీలు ఎత్తిపోతక్యారం ఆడి.. పోటీలు ప్రారంభించిముస్తాబాద్(సిరిసిల్ల): ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. ఉదయం 9.30 గంటలకే వరినాట్లు వేసేందుకు మహిళా కూలీలు పొలాల్లోకి దిగుతున్నారు. శ్రమను మరిచిపోయేందుకు జానపదాలు పాడుతూ నాట్లు వేసే కూలీలు మధ్యాహ్న భోజనాన్ని ఇలా ఒడ్డుపై కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ తింటున్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ శివారులోని పొలాల గట్లపై సోమవారం ఇలా మధ్యాహ్న భోజనం తింటూ కనిపించారు. రోజంతా కష్టపడితే రూ.450 కూలీ వస్తుందని తెలిపారు.రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం లక్ష్మీపూర్ పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ గాయత్రి పంపుహౌజ్ నుంచి బాహుబలి మోటార్ల ద్వారా ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని గ్రావిటీ కాలువ ద్వారా మిడ్ మానేరుకు తరలించడం జరిగిందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఐదు బాహుబలి మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతోందని వివరించారు. వర్షాలు ప్రారంభం అయిన నాటి నుంచి పంపింగ్ కొనసాగుతోందని.. వర్షాలు ఇలాగే ఉంటే నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు.కరీంనగర్క్రైం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు న్యా యవాదుల ఆటల పోటీలను సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్, మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్ ప్రారంభించారు. క్యారం, క్విజ్, చెస్, సాంగ్స్, డాన్స్, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, స్పోర్ట్స్, కల్చరల్ కార్యదర్శి బెజ్జంకి శ్రీకాంత్ తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ కిరణ్కుమార్, క్యారం పోటీల ఇన్చార్జ్ అర్జిత్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న గాయం.. పెద్ద ప్రమాదం
● పంజా విసురుతున్న సెల్యులైటిస్ ● ఉమ్మడి కరీంనగర్లో రోగుల ఉక్కిరిబిక్కిరి ● మూడేళ్లుగా తీవ్రమవుతున్న ముప్పుకరీంనగర్: ఒకప్పుడు అరుదుగా కనిపించిన సెల్యులైటిస్ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆందోళనకరస్థాయికి చేరుకుంది. మూడేళ్లుగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో మరింత వేగంగా కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జనరల్ సర్జరీ విభాగం ఉన్న ఆస్పత్రుల్లో సెల్యులైటిస్ బాధితులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. కొందరు మందులతో కోలుకుంటుండగా, మరికొందరికి చీము పేరుకుపోవడంతో శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. మధుమేహం, రక్తప్రసరణ లోపాలు, పాదాల పగుళ్లు, చిన్న గాయాలను నిర్లక్ష్యం చేయడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా విజంభిస్తోందని వైద్యలు చెబుతున్నారు. తొలిదశలో చర్మ సమస్యగా కనిపించే ఈ ఇన్ఫెక్షన్ను చాలామంది నిర్లక్ష్యం చేయడంతో తీవ్రస్థాయికి చేరుకుని శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ లక్షణాలు ప్రమాదకరం... సెల్యులైటిస్ అనేది చర్మంతో పాటు చర్మం కింద ఉన్న మదుకణజాలంలో ఏర్పడే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మం ఎర్రగా మారడం, వాపు వేగంగా పెరగడం, భరించలేని నొప్పి, ప్రభావిత భాగం వేడిగా అనిపించడం, జ్వరం, వణుకు, చర్మం బిగుసుకుపోవడం, చీము ఏర్పడటం, నడవడంలో ఇబ్బంది, ఈ లక్షణాలతో పాటు మధుమేహం కూడా ఉంటే వెంటనే శస్త్రచికిత్స నిపుణుడిని సంప్రదించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే... సెల్యులైటిస్ను నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ లోతైన కణజాలానికి వ్యాపించి నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్, సెప్సిస్, గ్యాంగ్రీన్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. కొందరిలో చీము పేరుకుపోవడంతో ఇన్సిషన్ అండ్ డ్రైనేజీ శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీనిని గుర్తించేందుకు సీ–రియాక్టివ్ ప్రోటీన్, టోటల్ ల్యూకోసైట్ కౌంట్, అల్ట్రాసౌండ్ పరీక్షలు, చీము ఉంటే కల్చర్ పరీక్ష ద్వారా ఏ బ్యాక్టీరియా కారణమో గుర్తిస్తారు. చీము వస్తోందని స్వయంగా నొక్కడం, కోయడం, ఇంటి చిట్కాలతో కాలయాపన చేయడం ప్రమాదకరం. ఇన్ఫెక్షన్ పెరిగితే ఒక్కోసారి కాలుకూడా తీసి వేయాల్సి వస్తుంది. -
కలల కన్నీరు!
మల్యాల: పిల్లలు బాగా చదువుకుని తమ కలలు నెరవేరుస్తారని భావించిన ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. ఊహ తెలియని వయసులో ఉన్న ఊరికి.. కన్నవాళ్లకు దూరంగా హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులను నీటిగుంత మింగింది. బహిర్భూమికని బయటకు వెళ్లి.. లోతు తెలియని గుంతలో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో నిత్యం సందడిగా ఉండే ఆ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల విరామ సమయంలో.. మల్యాలలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ.. ఒడ్డెరకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జగిత్యాల రూరల్ మండలం టీఆర్నగర్కు చెందిన జగన్నాథం కృష్ణ, లక్ష్మి దంపతుల కుమారుడు సుశాంత్(10) నాలుగో తరగతి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన వనం రాములు, రాధ దంపతుల కుమారుడు విష్ణు(11) ఐదో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే సోమవారం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సుశాంత్, విష్ణు బహిర్భూమకని బయటకు వెళ్లారు. పాఠశాల సమయం ముగిసినా తిరిగి రాకపోవడంతో అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సుశాంత్ తమ్ముడు ఈశ్వర్ తన అన్న రాలేదని ఉపాధ్యాయుడికి తెలిపాడు. ఆయన వెంటనే సమీపంలో హాస్టల్కు వెళ్లి ఆరా తీయగా.. రాలేదని వార్డెన్ చెప్పాడు. పాఠశాలకు సుమారు 500మీటర్ల దూరంలో ఉన్న కొత్తకుంట చెరువు వద్దకు వెళ్లగా.. అక్కడి నీటిగుంతల వద్ద పిల్లల దుస్తులు, బూట్లు కనిపించాయి. వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. సీఐ రాజ్కుమార్, ఎస్సై సందీప్, ఎంఈవో జయసింహారావు సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు విగతజీవులై జాలర్ల వలకు చిక్కారు. పాఠశాలకు మూడు రోజులుగా నిలిచిన విద్యుత్.. పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. సోమవారం ఓ ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడు. పాఠశాలలో బాత్రూంలు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఉంది. ఇటీవలి వర్షాలకు పాఠశాలకు మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బాత్రూములకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండు రోజులుగా విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్తున్నారు. అక్రమమట్టి తవ్వకాలతో గుంతలు.. భీమన్న గుట్ట సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో ఇటీవల వర్షాలకు నీరు చేరింది. బహిర్భూమికని బయటకు వెళ్లిన చిన్నారులు ఆ నీటిలో ఈత కొట్టేందుకు దిగి లోతు తెలియక మునిగిపోయినట్లు స్థానికులు, ఎంఈవో జయసింహారావు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణవార్త తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్తో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి విద్యార్థుల మృతి తీవ్రంగా కలిచివేసిందని, ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో కోరారు. -
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు
● రూ.25 లక్షల విలువ గల 28 బైక్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ శ్వేతవరంగల్ క్రైం: వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగలను సీసీఎస్, కేయూ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బైక్ల చోరీలు చేసిన తరువాత నిందితులు అనంతరం చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నమోదైన కేసుల్లో బైక్ల రికవరీ కోసం సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మంచిర్యాల ఎన్టీపీసీ కాలనీకి చెందిన దొంతుల ప్రశాంత్ కుమార్, మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాయి కార్తీక్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో నిందితులు ప్రయాణిస్తున్న బైక్ను స్వాధీనం చేసుకుని విచారించగా నిందితులు వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన వాహనాల వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిపల్లి గ్రామం, ఎల్కతుర్తి శివారులో 28 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. వాహనాల చోరీలు ఇలా... నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్తోపాటు పలు జిల్లాలో వాహనాల చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. వరంగల్ కమిషనరేట్లో–8, కరీంనగర్ కమిషనరేట్లో –9, రామగుండం కమిషనరేట్ పెద్దపల్లిలో –3, సిద్దిపేట కమిషనరేట్లో –2 హైదరాబాద్ కమిషనరేట్లో–3, రాచకొండ కమిషనరేట్లో –1, భూపాలపల్లి జిల్లాలో –2 మొత్తం 28 బైక్లు చోరీ చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నరసింహరావు, సీసీఎస్ ఏసీపీ సదయ్య, కేయూ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, సిబ్బందిని సీపీ అభినందించారు. -
బైక్ నంబరు మార్చేసుకున్నారు
● నకిలీ నంబరుతో తిరిగి పట్టుబడ్డారు పెద్దపల్లిరూరల్: రోడ్లపై తిరిగే బైక్ నంబర్లను టాంపరింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు యత్నిస్తుంటే.. ఇంకొందరు ఏకంగా వాహన నంబరునే మార్చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖిల్లో నకిలీ నంబరు(టీఎస్ 19ఏ 9821)తో హెచ్ఎఫ్ డీలక్స్బైక్ తిరుగుతున్నట్టు గుర్తించి దానిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఇదే నంబరుగల బైక్ హైదరాబాద్లో ఉన్నట్టు తేలింది. ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తే ఆ నంబరు యజమాని సెల్ఫోన్కు మెసేజ్లు వెళ్తున్నాయి. దీంతో నకిలీ నంబరు వినియోగిస్తున్న బైక్ యజమాని పెద్దపల్లి పట్టణంలోని కొంతంవాడకు చెందిన వీరేశంపై కేసు నమోదు చేశారు. ఈబైక్ యజమాని తన అవసరాల నిమిత్తం ఓ వ్యాపారి వద్ద కుదువపెట్టగా.. సదరు వ్యాపారి ఇలా బోగస్ నంబరుతో తిరిగాడని వీరేశం పోలీసులకు వివరించినట్టు తెలిసింది. వాహనదారులు రవాణశాఖ కేటాయించిన నంబరునే వాహనంపై రాయాలి. వాహనానికి అమర్చిన నంబరు ప్లేటును టాంపరింగ్ చేసినా, నకిలీ, బోగస్ నంబర్లు వినియోగిస్తున్నట్లు తేలినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ, పెద్దపల్లి -
బావిలో పడ్డా బతికారు
బైక్ పడిన వ్యవసాయ బావిబాలికను బయటకు తీసుకొస్తున్న స్థానికులుఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో సోమవారం ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఆ శబ్దాదనికి సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే వచ్చి దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థినులు, బైక్ నడిపించే వ్యక్తి ప్రాణాలు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. తొలిఏకాదశి సెలవులు ముగియడంతో సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన అనవేని సతీశ్ తన కూతురు అరణ్య(ఎనిమిదో తరగతి), చెల్లెలి కూతురు ఆరాధ్య(తొమ్మిదో తరగతి) కాల్వశ్రీరాంపూర్లోని కేజీబీవీకి తీసుకెళ్లేందుకు సోమవారం తన బైక్పై ఇద్దరి తీసుకుని బయలు దేరాడు. కొలనూర్ శివారులో ఎదురుగా మరోబైక్ రావడంతో దానిని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లారు. ఇదేసమయంలో వ్యవసాయ పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న రైతులు, కూలీలు ఆశబ్దాన్ని గుర్తించి వెంటనే అక్కడకు వచ్చి ముగ్గురినీ బయటకు తీశారు. గాయాలపాలైన ఆరాధ్య, అరణ్యను ఆస్పత్రికి తరలించారు. సతీశ్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, గాయాలపాలైన విద్యార్థినులు రోదించడం కలచివేసింది. -
ఇంటికి చేరకముందే మృత్యుగూటికి..
● స్నేహితుడితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదం ● గుర్తు తెలియనివాహనం ఢీకొని కాంట్రాక్ట్ కార్మికుడి మృతి జ్యోతినగర్: పెద్దపల్లిలోని తమ బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కోండ్ర లింగమూర్తి(42) ఎఫ్సీఐ క్రాస్రోడ్డు రాజీవ్ రహదారిపై ఆదివారం అర్ధరాత్ర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో నివసిస్తున్న కోండ్ర లింగమూర్తి ఎన్టీపీసీలోని సీహెచ్పీ విభాగంలో హౌస్కీపింగ్ పనులు చేస్తున్నాడు. ఆదివారం పెద్దపల్లిలో తమ బంధువుల ఇంటిలో జరిగిన కార్యక్రమానికి హాజరై రాత్రి శ్రీరాంపూర్ బస్సులో వెళ్తున్నాడు. ఎఫ్సీఐ క్రాస్రోడ్డులోని తన స్నేహితుడు ముల్కల శ్రవణ్కుమార్ను కలుసుకునేందుకు అక్కడికి రాగానే బస్సు దిగాడు. ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా గోదావరిఖని వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతివేగంతో లింగమూర్తిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని శ్రవణ్కుమార్తోపాటు గోదావరిఖని గంగానగర్కు చెందిన కారుడ్రైవర్ కలవేని అనిల్ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోండ్ర నర్సయ్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై బుచ్చిన్నాయుడు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యుల అంగీకారంతో సదాశయ ఫౌండేష్న్ ఆధ్వర్యంలో టెక్నీషియన్ ప్రదీప్ మృతుడి నేత్రాలను సేకరించి హైదరాబాద్కు పంపించారు. మృతుడికి భార్య స్వర్ణలత, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, కార్మికులు సంతాపం తెలిపారు. శ్రీరాంపూర్లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు. -
రాజన్నకు బంగారు గొలుసు
వేములవాడ: పట్టణంలోని బ్రహ్మంగారివీధికి చెందిన విద్యాసాగర్–సురేఖ దంపతులు రాజన్నకు రూ.3.50 లక్షల విలువైన బంగారు గొలుసును సోమవారం ఆలయ ఈవో రమాదేవి, అధికారులకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళం స్వీకరించారు. ఆలయ డీఈవో నవీన్కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు. రూ.30 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణంకథలాపూర్(వేములవాడ): మండలంలోని ఇప్పపెల్లికి చెందిన అతికెం ధనుంజయ్(55) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ధనుంజయ్ గతేడాది నవంబర్ 11న బైక్పై పెట్రోల్బంక్కు బయల్దేరాడు. రోడ్డు దాటుతుండగా కారు వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలైన ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. సుమారు 8 నెలలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందగా రూ.30 లక్షల వరకు ఖర్చయినట్లు బంధువులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. ధనుంజయ్కి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కానిస్టేబుల్ రాసలీలలు.. సస్పెన్షన్ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ మహిళతో కానిస్టేబుల్ రాసలీలలపై జిల్లా పోలీస్ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్, ఓ మహిళతో చనువుగా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట శివారులో సదరు మహిళతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉండగా గమనించిన రైతు వీరిని ప్రశ్నించాడు. పంట పొలాల్లో ఈ పాడు పనిలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కానిస్టేబుల్ సదరు రైతును బెదిరించడంతో.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో జిల్లా పోలీస్ అధికారులకు చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ వీడియో పక్షం రోజుల క్రితం తీసిందని చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉంటు హద్దులు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్ ఠాణాలో గతంలో పనిచేసిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారాలపై కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం. మూడోసారి మింగేసిన మద్యం మత్తు పెద్దపల్లి: మద్యం మత్తులో ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన ముత్యాల రాజగోపాల్(36) మూడోసారీ యత్నించడంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి కనిపించడంతో బోరుమన్నారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు వినక పోగా.. ఆ మత్తులో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వారించడంతో బతికిపోయాడు. కానీ, మద్యం మానేయలేదు. సోమవారం మద్యం తాగి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మత్తులో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. -
వాహిని షాపింగ్మాల్ ప్రారంభం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహిని షాపింగ్మాల్ సోమవారం సినీనటి కృతిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఓంప్రకాశ్ జాజు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీనటి కృతిశెట్ట్టి మాట్లాడుతూ.. వాహిని షాపింగ్మాల్లో వైరెటీ చీరలు, చిన్న పిల్లల బట్టలు, మెన్స్వేర్ చాలా వైరెటీలు ఉన్నాయన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాహిని షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలని కోరారు. వాహిని షాపింగ్ మాల్లో కస్టమర్లకు మంచి ఆఫర్లను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని నగర, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమాని వేముల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, అనిల్, ప్రశాంత్, శ్రీనివాస్, విష్ణు, వేణుగోపాల్ జాజు, నవనీత్ బంగ్, శ్రీరామ్ జాజు, దేవరాజు, నాగరాజు, నటరాజ్, నందరాజ్, కొమురవెల్లి రవితేజ, గాజుల అరుణ్ పాల్గొన్నారు. -
అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
● తారురోడ్డు ఎక్కించే క్రమంలో ప్రమాదం చందుర్తి(వేములవాడ): బైక్ అదుపుతప్పి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్–బండపల్లి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్ గ్రామానికి చెందిన పులి ప్రణయ్ ద్విచక్ర వాహనంపై బండపల్లికి వచ్చి వెళ్తుండగా మార్గమధ్యలో బైక్ అదుపుతప్పి రోడ్డు దిగింది. సైడ్బర్మ్స్ లేకపోవడంతో తారు రోడ్డు ఎత్తుగా ఉంది. బైక్ను రోడ్డుపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పడంతో యువకుడు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ సంఘటనలో యువకుడి తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లాడు. 108 అంబులెన్స్లో వేములవాడకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ రోడ్డుపై గత రెండు వారాల్లో రెండో ప్రమాదం. గత నెల 16న జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. స్పృహ తప్పిన ఎన్గల్ యువకుడు ప్రణయ్ సంఘటన స్థలంలో పడి ఉన్న ద్విచక్రవాహనం -
బతకాలి.. మరణానంతరం కూడా..
● నేడు జాతీయ అవయవదాన దినోత్సవం ● దానంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన పొన్నం మల్లేశంగౌడ్ బ్రెయిన్డెడ్ కావడంతో అవయవదానం చేయడానికి భార్య రేణుక, కుమారులు భార్గవ్, భరత్ అంగీకరించారు. వారిగొప్ప నిర్ణయంతో మరో ఆరుగురికి కొత్త జీవితం ప్రసాదించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పెరుక శ్రీనివాస్(43) మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై బ్రెయిన్డెడ్ అయ్యారు. దుఃఖంలోనూ ఆయన భార్య సంధ్యారాణి అవయవదానానికి అంగీకరించారు. శ్రీనివాస్ లివర్, కిడ్నీలు, కార్నియాలను వైద్యులు సేకరించి అమర్చగా.. ముగ్గురికి ప్రాణదానం, ఇద్దరికి కంటిచూపు లభించింది. కోల్సిటీ: మరణం మరణం మరో మనిషి జీవితానికి ఆరంభమైతే? చితిలో బూడిదయ్యే గుండె మరో చాతీలో కొట్టుకుంటే.. మూసుకుపోయే కళ్లు.. మరో వ్యక్తికి ఈ ప్రపంచాన్ని చూపిస్తే? డయాలిసిస్తో రోజులు లెక్కపెడుతున్న ఓ యువకుడికి మీ కిడ్నీ ప్రాణం పోస్తే? అదే అవయవదానం. ఏటా ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం నిర్వహించడం వెనుక ఉద్దేశం ఇదే. ● వైద్యం ఉంది.. అవయవాలే లేవు... ఆధునిక వైద్యశాస్త్రం గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలను విజయవంతంగా మార్పిడి చేసే స్థాయికి చేరుకుంది. అయినా వేలాది మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కారణం కాదు... అవయవాల కొరత అంటున్నారు నిపుణులు. ● ఒక్క దానం.. ఎనిమిది కుటుంబాల్లో వెలుగు... బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన ఒక వ్యక్తి అవయవాలను దానం చేస్తే ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, చిన్నపేగుతోపాటు కార్నియాలు, చర్మం, ఎముకలు కూడా పలువురికి ఉపయోగపడతాయి. ఒక కుటుంబం కోల్పోయిన వ్యక్తి.. మరో ఎనిమిది కుటుంబాలకు తిరిగి దొరికిన జీవితంగా మారతాడు. ● అపోహలు వీడితే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నేత్ర, అవయవ, శరీర దానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. మానవతా దృక్పథంతో మరణానంతరం కూడా మరొకరికి జీవం అందించాలనే సంకల్పంతో అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటం విశేషం. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,638 నేత్రదానాలు, 160 శరీరదానాలు, 95 అవయవదానాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ● స్ఫూర్తికి చిరునామా ఓదెల, అబ్బిడిపల్లి పెద్దపల్లి జిల్లా ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాలు అవయవ, నేత్రదాన చైతన్యానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తమ మరణానంతరం నేత్రాలు, అవయవాలు దానం చేస్తామని గ్రామస్తులు తీర్మానం చేయగా.. వార్డు సభ్యులతో ఆమోదంతో కలెక్టర్, ప్రభుత్వానికి చేరాయి. ఈ రెండు గ్రామాల్లోనే ఇప్పటివరకు సుమారు 250 మంది నేత్రదానం చేయడం వారి సేవా భావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ● మరణం తర్వాత దానం చేసేవి ● మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. ● మరణించిన వ్యక్తి నుంచి ఎనిమిది మందికి అవయవాలను దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్సెల్స్, కళ్లని మార్పిడి చేసే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ● బతికుండగా దానం చేసేవి... ● కిడ్నీ, కాలేయం, ఎముక మజ్జ .టి.శ్రవణ్ కుమార్: 99486 09591 సీహెచ్ లింగమూర్తి: 94927 81306 మేరుగు భీష్మాచారి: 98495 90415 కేఎస్ వాసు: 98497 37100 కె.రాజేందర్: 73962 95999 పి.మల్లికార్జున్: 90000 67777 కొదాటి ప్రవీణ్: 97013 48999 మరణానంతరం కూడా మరొకరికి జీవం ప్రసాదించే మహోన్నత దానం అవయవదానం. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విస్తృత అవగాహన కల్పించాలి. మా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,638 నేత్రదానాలు, 160 శరీరదానాలు, 95 అవయవదానాలు విజయవంతంగా జరిగాయి. నాటో మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అవయవదాతల కుటుంబాలకు ప్రోత్సాహకాలు అమలు చేయాలి. – టి. శ్రవణ్ కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
స్నేహితుల దినోత్సవం రోజు విషాదం
● ఎల్ఎండీలో మునిగి యువకుడు.. ● కుంటలో పడి బాలుడి మృతి ● కరీంనగర్ జిల్లాలో విషాదం తిమ్మాపూర్/శంకరపట్నం: స్నేహితుల దినో త్సవం రోజు కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో నీట మనిగి చనిపోయారు. కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూర్కు చెందిన గోల్కొండ మణి ప్రసాద్ (23) తిమ్మాపూర్లో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్స వం సందర్భంగా నలుగురు స్నేహితులతో కలిసి రోజంతా ఆనందంగా గడిపారు. సాయంత్రం లో యర్ మానేరు జలాశయంలోని మినీ బీచ్ తీరాన నీళ్లలో ఆనందంగా గడుపుతున్న సమయంలో ప్రసాద్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై అన్వర్ తెలిపారు. కుంటలో మునిగి బాలుడు మృతి జిల్లాలోని శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో స్నేహితులతో కలిసి కుంటలో ఈతకు వెళ్లిన బాలుడు నీటమునిగి చనిపోయాడు. బిహర్కు చెందిన వీనాసాహిని– భవితదేవి దంపతులు మొలంగూరుకు వలస వచ్చారు. వీరి పెద్ద కొడుకు రితిక్కుమార్(8) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామంలోని అల్లయ్యకుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈజీఎస్ పథకంలో పూడికతీత పనులు చేపట్టిన ప్రాంతంలో రితిక్ మునిగిపోయాడు. మిగతా ఇద్దరు ఇంటికి వెళ్లి వీనాసాహినికి విషయం చెప్పడంతో గ్రామస్తులతో కలిసి కుంట వద్దకు చేరుకుని నీటిలో గాలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నోట్లోంచి నీళ్లు వస్తుండంతో బతికున్నాడనే ఆశతో కారులో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు. పోస్టుమార్టం అనంతరం రితిక్కుమార్ అంత్యక్రియలు మొలంగూర్లో నిర్వహించారు. గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం మల్లాపూర్: మండలంలోని ఒబులాపూర్ శివారు గోదావరిలో ఆదివారం గుర్తు తెలి యని మహిళ మృతదేహం కనిపించింది. స్థా నికుల సమాచారం మే రకు ఎస్సై అనిల్, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. మహిళ వయస్సు 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని, ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులు, నావి బ్లూ టాప్, పసుపు రంగు ప్యాంట్ ధరించి ఉందని, చేతిపై అమ్మ అనే టాటూ ఉందని, ఎవరైనా ఆమెను గుర్తిస్తే 87126 56796 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఆదుకుంటే.. నిలబడతాడు
వేములవాడ: కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలనే గంపెడాశలతో గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ యువకుడు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యాడు. వైద్య ఖర్చులు భారంగా మారడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆర్థికసాయం కోరుతోంది. బంధువులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన నేరెళ్ల సతీశ్(32) రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఒక రోజు అనారోగ్యానికి గురికాగా.. మెదడులో రక్తం గడ్డకట్టింది. దీంతో వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే చికిత్స కోసం కుటుంబ సభ్యులు తమ వద్ద ఉన్న సొమ్ము ఖర్చు చేశారు. వైద్యం కొనసాగించేందుకు మరిన్ని డబ్బులు కావాలని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సతీశ్ పూర్తిగా కోలుకోవాలంటే నిరంతరం చికిత్స కొనసాగించాలని వైద్యులు సూచించారని.. దాతలు స్పందించి సాయం చేస్తే బతుకుతాడంటున్నారు. దాతలు 9398936440లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. సతీశ్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో మంచానికే పరిమితం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు -
సీపీఏతో డాక్టర్, పేషెంట్ల రిలేషన్ దెబ్బతింది
కరీంనగర్: కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్తో డాక్టర్ పేషెంట్ల మధ్య రిలేషన్షిప్ దెబ్బతిన్నదని, అందువల్లే డాక్టర్లపై దాడులు పెరిగాయని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ అన్నారు. ఆదివారం నగరంలోని కేఎస్ఎల్ గార్డెన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జోన్–2 కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గతంలో వైద్యుడు పేషెంట్ల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండేదన్నారు. అన్ని ఆసుపత్రులలో ఒకే రకమైన ఫీజులు అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోరకమైన వైద్య సేవలు అందుతాయని, ఒకే రకమైన ఫీజులు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలను ప్రైవేటు ఆసుపత్రులలో అందించాలని కోరారు. అనంతరం ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ను ప్రకటించారు. కాన్ఫరెన్స్ చైర్మన్ ఎం.ఎల్.ఎన్.రెడ్డి, కో చైర్మన్ పొలాస రామ్కిరణ్, ఐఎంఏ జాతీయ రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ రవీంద్రారెడ్డి, ఐఎంఏ స్టేట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ విజయకుమార్, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కె శ్యాంసుందర్, ఎడవల్లి విజయేంద్రరెడ్డి, బి.ఎన్.రావు, ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.అశోక్, కోశాధికారి టి.దయాల్సింగ్, ఆర్గనైజింగ్ కన్వీనర్ పొలాస రామ్చరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యూ.రామకృష్ణ కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షురాలు శైలజ, కార్యదర్శి ఎన్.మహేశ్బాబు, కోశాధికారి నీలిమ, హరికిషన్, ఎనమల్ల నరేశ్, పీవీకే కిషోర్, వసంతరావు, దాసరి శ్రీనివాస్, నవీన, బంగారు స్వామి, రజిని ప్రియదర్శిని పాల్గొన్నారు. -
భారత యోగా సమాఖ్య సభ్యుడిగా మనోజ్కుమార్
కరీంనగర్స్పోర్ట్స్: భారత యోగా సమాఖ్య జాతీయ వివాద పరిష్కారాల ఉప కమిటీ సభ్యుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తెడ్డు మనోజ్కుమార్ ఆదివారం ఎంపికయ్యారు. గతంలో ఏషియన్, అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొన్న ఆయన, ప్రస్తుతం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఆయన నియామకం పట్ల జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, గుంటి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, భారత యోగా సమాఖ్య ఉపాధ్యక్షుడు జే.మనోహర్ కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఐశ్వర్య, ప్రభాకర్రెడ్డి, కన్న కృష్ణ, కమలాకర్, బాలరాజు, సీహెచ్.గంగాధర్, కె.విజయ్ కుమార్, పి.శ్రీనివాస్, మతిన్, కే.రవీందర్, యు.రవీందర్, రాజు, నాగార్జున, పి.స్వరూప చారి అభినందనలు తెలిపారు. -
మీ సేవలు ఇక చాలు..!
● రెండేళ్ల తరువాత మళ్లీ కలుసుకుందాం.. ● విత్తనోత్పత్తి సిబ్బందిపై సంస్థల కత్తి.. ● అకస్మాత్తుగా రెండు వేల మందికిపైగా తొలగింపు ● విత్తన ఎగుమతి లేదంటూ సాకులు ● అధిక దిగుబడి రావడమే కారణమా..? ● సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్ టాప్ వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన ఓ వ్యక్తి 25 ఏళ్లుగా ఓ మల్టీనేషన్ విత్తన కంపనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి పనిచేస్తున్న ఆయనను ఇటీవల కంపెనీ తొలగించింది. సమావేశానికి పిలిచి ఈ విషయం చెప్పడంతో కంగుతిన్నాడు. కంపెనీకి లక్ష్యాన్ని మించి దిగుబడి వచ్చిందని, ఉద్యోగుల భారం మోయలేమని చెప్పడంతో ఆయన ఆవేదనకు అంతులేకుండాపోతోంది. ఇది ఈ ఒక్క వ్యక్తి సమస్య కాదు.. రాష్ట్రంలో విత్తనోత్పత్తి చేయిస్తున్న కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల దుస్థితి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వేల మందికిపైగా ఉద్యోగులను కంపెనీలు తొలిగించాయి. ఇందుకు కారణాలపై ఆరా తీస్తే.. ధాన్యం అధిక దిగుబడి రావడమేనని తెలుస్తోంది. తెలంగాణలో హైబ్రిడ్(ఆడ, మగ) వరికి మంచి డిమాండ్ ఉంది. 48 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. దిగుబడిలో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో, వరంగల్ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు అనుకూలం కావడంతో 40కి పైగా కంపెనీలు పోటీ పడి విత్తనాలు ఇస్తున్నాయి. ఈసారి వరి గణనీయమైన దిగుబడి వచ్చింది. ఆ దిగుబడే సిబ్బందికి ఎసరుతెచ్చింది. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎల్నినో ప్రభావం కూడా తీవ్రంగా పడింది. వర్షాలు లేక.. వరి సాగు పూర్తిగా పడిపోయింది. దీంతో విత్తనం విక్రయించలేక కంపనీలు చేతులెత్తాశాయి. ఫలితంగా ఏళ్లతరబడి పనిచేసిన వారు రోడ్డున పడుతున్నారు. ఇక్కడ పండిన ధాన్యం ఎక్కువగా పంజాబ్, గుజురాత్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఉద్యోగులపై వేటు రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల ఎకరాల్లో హైబ్రిడ్ వరి సాగయ్యిందని కంపెనీ ప్రతినిధులు అంచనా వేస్తునారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1.50లక్షల ఎకరాలు సాగైంది. వంద ఎకరాలకు ఒక ఫీల్డ్ అసిస్టెంట్, 250ఎకరాలకు ఒక సూపర్వైజర్, 400ఎకరాలకు ఒక పీవో, వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల వరకు అసిస్టెంట్ మేనేజర్, జిల్లాకు ఒకరు చొప్పున మేనేజర్ ఇలా వందలాది మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ప్రతిరోజూ వీరు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీలను నమ్ముకున్న వీరంతా రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కంపెనీలు తీసేస్తుండడంతో అప్పు ఎలా చెల్లించాలని తలలు పట్టుకుంటున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నుంచి 120మందికి పైగా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తుండగా.. పశ్చిమాసియా యుద్ధం ఎగుమతుల మీద ప్రభావం చూపిందని ఓ ఉద్యోగి తెలిపారు. కంపెనీల నుంచి ఇక సేవలు చాలు అని వచ్చినప్పటి నుంచి సిబ్బంది కూలీనాలి పనులకు వెళ్తున్నారు. యాసంగిలోనే సాగు.. ఆడ, మగ వరిని కేవలం యాసంగిలోనే సాగు చేస్తారు. వాతావరణం ఆ సమయంలోనే అనుకూలిస్తుంది. ఖర్చుతో కూడిన సాగు అయినప్పటికీ క్వింటాల్కు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు వస్తుండడంతో రైతులు దీనివైపు మొగ్గుచూపుతున్నారు. నాటు వేసిన 45నుంచి60రోజుల మధ్య ఆడ వరి పూతకు వస్తుంది. మగ వరి రేణువులు ఆడ వరిపై పడేలా 15రోజులు తాడుతో దులుపాల్సి ఉంటుంది. ఎకరాాకు ఎనిమిది క్వింటాళ్ల లోపు దిగుబడి వస్తుందని కంపెనీలు అంచనా వేయగా.. 15నుంచి 20క్వింటాళ్లకు పైగా వచ్చింది. ఆ విత్తనాన్ని తిరిగి అమ్ముకోవడం కంపెనీలకు తలకుమించిన భారంగా మారిందని సమాచారం. ఓ కంపెనీలో 20ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్, సూపర్వైజర్గా పనిచేస్తున్న. 400 ఎకరాలు చూసుకునేవాడిని. రైతులు కూడా అధిక దిగుబడికి కష్టపడ్డారు. ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కంపెనీ అవార్డు ఇస్తుందనుకుంటే ఉద్యోగం నుంచి తొలిగించింది. కంపెనీకి ధాన్యం ఎక్కువగా వచ్చిందని, రెండేళ్ల తర్వాత మళ్లీ పిలుస్తామని లెటర్ చేతిలో పెట్టింది. – శ్రీనివాస్, బాధితుడు, వీణవంక మండలం -
చోరీ కేసులో నిందితుడి పట్టివేత
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్నగర్లో ఈనెల 27న దొంగతనానికి పాల్పడ్డ కేసులో స్థానిక శాంతినగర్కు చెందిన మిర్యాల రంజిత్రెడ్డిని ఆదివారం పట్టుకున్నట్టు టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన రాయిని రమాదేవి, అర్జున్ దంపతులు పనినిమిత్తం మే 27న ఇంటికి తాళం వేసి సాయంత్రం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువా తలుపులు తెరచి 15 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని భూంనగర్లో అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా రంజిత్రెడ్డిని పట్టుకుని విచారించగా హనుమాన్నగర్లో దొంగతనం చేసినట్టు అంగీకరించాడని ఎస్సై వివరించారు. -
పేదింటి ప్రతిభకు కేంద్రం అండ
కరీంనగర్టౌన్/మల్లాపూర్: ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాలకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం(ఎన్ఎంఎంఎస్ఎస్)2026–27 విద్యా సంవత్సరానికి ప్రకటన విడుదలైంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చురుకుదనం, తెలివితేటలు, చదువుపై మంచి పట్టు ఉన్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కారాదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి ఎన్ఎంఎంఎస్ఎస్ అమలు చేస్తోంది. గతంలో ఉపకార వేతనాలకు ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.6 వేల చొప్పున 9,10, ఇంటర్ రెండు సంవత్సరాల్లో కలిపి రూ. 24 వేలు అందించేది. ప్రస్తుతం రూ.12 వేలకు పెంచింది. అంటే నాలుగేళ్లకు కలిపి విద్యార్థులు రూ. 48 వేలు అందుకోనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 1న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ● అర్హతలు ఇవే.. 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్, మోడల్, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్కు అర్హులు. ప్రైవేటు స్కూళ్లు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో చదివేవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. ఏడో తరగతిలో జనరల్, బీసీ కులానికి చెందినవారు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలి. http://scholarship.gov.in ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. ● నవంబర్ 1న రాతపరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో విద్యార్థులకు ఈ ఏడాది నవంబర్ 1న ఆదివారం మూడుగంటల పాటు రెండు ప్రశ్నపత్రాల ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటి పరీక్ష, వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలు (90 మార్కులు) ఇస్తారు. స్కాలస్టిక్ అప్టిట్యూడ్ పరీక్ష, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం విషయాలపై 90 ప్రశ్నలు (90 మార్కులు) ఇస్తారు. 7వ తరగతిలోని పూర్తి సిలబస్, 8వ తరగతిలోని సగం సిలబస్పై ప్రశ్నలు అడుగుతారు. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం కటాఫ్గా నిర్ణయించారు. ఎంపిక సమయంలో రిజర్వేషన్ నిబంధనలు పాటిస్తారు. సత్తా చాటితే ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ఈనెల 24 వరకు ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు -
● మూతబడే దశలో మద్దికుంట పాఠశాల
మానకొండూర్: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలా డిన పాఠశాల ఇప్పుడు వెలవెలబోతోంది. సకల సౌకర్యాలు ఉన్నా పిల్లలు సర్కారు బడి వైపు చూడకపోవడంతో మూతబడే దశకు చేరుకుంది మానకొండూర్ మండలం మద్దికుంటలోని ప్రభుత్వ ప్రా థమిక పాఠశాల.ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు చదువుతుండగా.. వారికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. గ్రామంలో 72మంది చిన్నారులు ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న వారు ఉన్నారు. వారు ప్రైవేటుతో పాటు మోడల్, గురుకుల పాఠశాలల్లో చదువుతున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. మద్దికుంట ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది ఒక్క అడ్మిషన్ కాకపోగా.. ఉన్న ఇద్దరిలో శివకుమార్ 5వ తరగతి, హర్షవర్ధన్ 4వ తరగతి చదువుతున్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన ని ర్వాహకురాలు సరోజన భోజనం వండి పెడుతున్నారు. ఇద్దరికి నెలంతా వండితే రూ.96 బిల్లు వస్తోందని తెలిపారు. రెండేళ్లు గడిస్తే ఈ ఇద్దరు కూడా పై తరగతులకు వెళ్తారని, బడిని బతికించేందుకు గ్రామస్తులతో పాటు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సర్పంచ్ బుర్ర శ్రీధర్ కోరుతున్నారు. -
● 60 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం ● 15 వరకు దరఖాస్తులకు ఆహ్వానం
కరీంనగర్టౌన్: మహిళా నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గంగాధర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 20 పోస్టులు, హుజూరాబాద్ పరిధిలో 16, కరీంనగర్ రూరల్ పరిధిలో 16, కరీంనగర్ అర్బన్ పరిధిలో 08 టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 15 సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ విద్యార్హతతో.. అంగన్వాడీ టీచర్ పోస్టుకు గతంలో పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్హత ఉండేది. తాజాగా ఇంటర్మీడియట్కు పెంచారు. కేంద్రాల నిర్వహణలో సాంకేతిక వినియోగం, ఆన్లైన్ రికార్డుల నమోదు, మొబైల్ యాప్ ద్వారా రోజువారీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి.. వివాహితురాలై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికురాలై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్ మార్కులు, ఇంటర్వ్యూలో నైపుణ్యం ద్వారా అభ్యర్థులను కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఎంపిక చేస్తారని శిశు సంక్షేమశాఖ డీడీ సరస్వతీ వెల్లడించారు. -
అగ్రగామిగా నిలుపుతా
కరీంనగర్ కార్పొరేషన్: అభివృద్ధిలో కరీంనగర్ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ 24వ డివిజన్లోని బ్యాంకుకాలనీలో రూ.50లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర అభివృద్ధిపైనే తాను ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు. మరిన్ని నిధులు తీసుకువచ్చి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. తమ కాలనీలో అభివృద్ధి పనులు చేపడుతున్న సందర్భంగా సంజయ్ని స్థానిక ముస్లిం మహిళలు సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, కార్పొరేటర్లు సత్యనారాయణరెడ్డి, వేణు పాల్గొన్నారు. అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు రామడుగు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాళేశ్వ రం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ విమర్శించారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూ ర్ గాయత్రి పంపుహౌస్ను ఆదివారం మాజీ మంత్రులు టి.జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ లక్ష్మీపూర్ పంపుహౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తున్నారని, ప్రాజెక్టును కూలేశ్వ రం ప్రాజెక్టు అని కాంగ్రెస్ నాయకులు ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ వద్ద 5లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పో తోందన్నారు. ప్రభుత్వం మేడిగడ్డ నుంచి నీటి ని పంపింగ్ చేయాలని కోరారు. టీపీసీసీ ఆధ్యక్షులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రాజెక్టుపై అవగాహన తరగతులను నిర్వహించాలని సూచించారు. రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, రవీందర్సింగ్, కొత్త జయపాల్రెడ్డి, రామకృష్ణారావు, రవీందర్రెడ్డి, వెంకట్రెడ్డి, జితేందర్రెడ్డి పాల్గొన్నారు. ఆటా వేడుకల్లో శాతవాహన వీసీ కరీంనగర్సిటీ: అ మెరికాలోని మేరీ ల్యాండ్ వేదికగా అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ వేడుకల్లో శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ యు.ఉమేశ్కుమార్ పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, విద్యా వికాసమే లక్ష్యంగా జరుగుతున్న వేడుకల్లో వీసీ భాగస్వాములు కావడం విశ్వవిద్యాలయ వర్గాలకు ఎంతో గర్వకారణమని శాతవాహన అధికారులు తెలిపారు. శిశిర యామిని కథల సంకలనం ఆవిష్కరణ కరీంనగర్ కల్చరల్: మలిసంధ్యలోని పెద్దల బాధలను ప్రతిబింబించే కథలతో రూపొందిన ‘శిశిర యామిని’ కథల సంకలనాన్ని ఆదివారం నగరంలోని చార్వాక నిలయంలో ఆవిష్కరించారు. సంకలన సంపాదకుడు ఇటిక్యాల రాము, దామరకుంట శంకరయ్య సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పెద్దల జీవితాల్లోని అనుభవాలు, సమస్యలు, భావోద్వేగాలకు అక్షరరూపమే ఈ సంకలనం అని పేర్కొన్నారు. పుస్తకం రూపుదిద్దుకున్న తీరు, ప్రచురణ నేపథ్యాన్ని వివరించారు. పుస్తకంలోని కథలను విలాసాగరం రవీందర్ సమీక్షిస్తూ.. వృద్ధుల జీవిత వాస్తవాలను హృదయానికి హత్తుకునేలా రచయితలు ఆవిష్కరించారన్నారు. రచయితలు నూటింకి రవీంద్ర, దేవి యాదగిరి, సీవీ.కుమార్, నడిమెట్ల రామయ్య, నెరువట్ల చైతన్య, చంద్రయ్య, మంచికట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గ్యాస్ డెలివర్రీ!
కరీంనగర్ అర్బన్: గ్యాస్ ఏజెన్సీలు అక్రమ దందాకు అడ్డాలుగా మారుతున్నాయి. నగరంలో 11 ఏజెన్సీలు ఉండగా, నిర్వాహకులు వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వినియోగదారుకు తెలియకుండానే బుక్ చేసిన సిలిండర్ మాయం చేస్తున్నారు. సేల్స్ ఆఫీసర్ల పర్యవేక్షణ డొల్లతనం.. అధికారుల ఆకస్మిక తనిఖీలు కరవవడం ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బుక్ చేస్తే బ్లాక్ మార్కెట్కే వినియోగదారు గ్యాస్ బుక్ చేస్తే రెండ్రోజుల్లోనే ఇంటికి చేరాల్సిన సిలిండర్ రాకపోగా డెలివరీ అయినట్లుగా మెసేజ్ వస్తోంది. ఇదేంటని ఆశ్చర్యపోయిన కస్టమర్ ఏజెన్సీకి వెళ్లి నిలదీస్తే పంపిస్తున్నారు. కొందరు మాకేం సంబంధమంటూ దురుసుగా ప్రవర్తిస్తుండగా సేల్స్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే తప్పా గ్యాస్ డెలివరీ చేయడం లేదు. జిల్లాలో వేలమంది ఇదే సమస్యను ఎదుర్కొంటుండగా తనిఖీలపై అధికారులు దృష్టి సారించడం లేదు. మహాలక్ష్మి పథకం ఏజెన్సీలకు వరం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. వినియోగదారు రూ.1013 చెల్లిస్తుండగా ప్రభుత్వం రూ.500కు మించిన నగదును ఖాతాలో జమ చేస్తోంది. ఈ నేపథ్యంలో పథకాన్ని తమ వ్యాపారానికి అనువుగా మలచుకున్నారు పలువురు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. కార్డుదారులతో ఒప్పందం కుదుర్చుకుని టిఫిన్ సెంటర్లు, దాబాలు, రెస్టారెంట్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, బేకరీలు, జిలేబీ కేంద్రాలకు తరలిస్తున్నారు. వినియోగదారులకు సిలిండర్లు చేరాల్సి ఉండగా నేరుగా వ్యాపార కేంద్రాలకు తరలిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర మూడు వేల వరకు ఉండగా వంటగ్యాస్ సిలిండర్ రూ.1013కే లభిస్తుండటంతో వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. నిబంధనలేం చెబుతున్నాయ్ వంటగ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్న తదుపరి వినియోగదారు ఇంటికి డెలివరీ బాయ్స్ చేర్చాలి. 5 కిలోమీటర్లలోపు దూరం ఉంటే ఉచితంగా అందించాలి. కమర్షియల్ సిలిండర్లను వ్యాపార కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ వంట గ్యాస్ సిలిండర్లను రాత్రి, వేకువజామున నేరుగా టిఫిన్ సెంటర్లకు, పెద్ద పెద్ద హోటళ్లకు చేర్చుతున్నారు. గ్యాస్ పక్కదారి పడితే చర్యలు తీసుకుంటామని, తనిఖీ లు నిరంతరం చేస్తామని డీఎస్వో నర్సింగరావు వివరించారు.తీగలగుట్టపల్లికి చెందిన పద్మ హెచ్పీ గ్యాస్ వినియోగదారు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేస్తే గత నెల 17న డెలివరీ అయిందని, మరోసారి బుక్ చేయాలంటే మరింత సమయం వేచిచూడాలని సందేశం వచ్చింది. గత నెలలో గ్యాస్ బుక్ చేయకపోగా ఎవరికి డెలివరీ చేశారు, ఎవరు బుక్ చేశారు అని ఎస్సారార్ కళాశాల రోడ్డులో ఉన్న ఏజెన్సీని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.ఆయిల్ కంపెనీలపై: 1906 ఇండెన్: 9986998433 హెచ్పీ: 18002333555 భారత్: 1800224344కోతిరాంపూర్లో నివాసముండే అజయ్కి నగరంలోని హనుమాన్నగర్లో ఉన్న ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ ఉంది. గ్యాస్ బుక్ చేయగా.. డెలివరీ బాయ్ ఫోన్ చేసి ఓటీపీ అడిగాడు. అజయ్ ఓటీపీ చెప్పడంతో సదరు వ్యక్తి గ్యాస్ను ఇతరులకు అధిక ధరకు అమ్ముకున్నాడు. తన ఇంటికి గ్యాస్ రాలేదని ఏజెన్సీలో ఫిర్యాదు చేస్తే ఓటీపీ చెప్పాక తమకు సంబంధం లేదని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని నిర్వాహకులు చేతులెత్తేశారు. -
ధాన్యం.. మాయాజాలం
కరీంనగర్ అర్బన్: జిల్లాలో రైస్ మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ఇవ్వాల్సి ఉండగా లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్ముకుని రూ.వందల కోట్లు కూడబెడుతున్నారు. ఏటా ఈ దందా సాగుతుండగా అధికార యంత్రాంగం కేసులు నమోదు చేసినా, నోటీసులిచ్చినా ఎలాంటి జంకు లేకపోవడం ఇరువురి మధ్య సంబంధాలకు నిదర్శనం. గతంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైనా కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లరును రిమాండ్కు తరలించిన విషయం విదితమే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు నిగ్గు తేలుతుండగా అధికార యంత్రాంగ డొల్లతనాన్ని చాటుతోంది. కరీంనగర్కు చెందిన బడా వ్యాపారి దందాలో కీలకపాత్ర పోషిస్తుండగా, పీడీ యాక్ట్ నమోదైనా దందాను మరింత విస్తృతం చేశాడని వినికిడి. సీఎంఆర్తో మిలర్ల వ్యాపారం మిల్లు కట్టుకుంటే చాలు వ్యాపారం ప్రభుత్వమే ఇస్తుండటంతో ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వమిచ్చే ధాన్యాన్ని మరాడించి అక్రమ మా ర్గంలో అమ్ముకుని సదరు లోటును రేషన్ బియ్యంతో భర్తీ చేస్తున్నారు. ఆయా సీజన్లలో ఇచ్చిన సుమా రు 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అందించారు. ఇందులో 40శాతానికి పైగా మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. గడువుల మీద గడువుల పొడిగించడంతో వీరి వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ‘వృద్ధులం, రోగగ్రస్తులం మాపై పీడీ యాక్ట్ పెట్టలేరు.. పెట్టేది 6ఏ కేసు.. దాంతో ఒరిగిదేం లేదు’ అని మిల్లర్లు బాహాటంగా చర్చిస్తుండటం వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతోంది. విల్లాలు.. ఎకరాల కొద్ది భూములు అక్రమాలకు రుచిమరిగిన మిల్లర్లు భారీగా ఆస్తులను కూడబెట్టారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో విల్లాలు, ఉమ్మడి జిల్లాలో ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారు. ఓ వ్యాపారి ప్రభుత్వ ధాన్యం అమ్ముకుని రూ.200ల కోట్లకు పైగా కూడబెట్టారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టమవుతోంది. లక్షల క్వింటాళ్లు ధాన్యం.. రూ.కోట్లు పక్కదారి జిల్లాలో జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ రూర ల్ చుట్టు పక్కల రైస్మిల్లులున్నాయి. ఏటా సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొంటూ పైసా ఖర్చు లేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట అప్పగిస్తోంది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా, వారే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి దిగజా రారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్లోని ఏడు మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికా రులు లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఓ మిల్లులో దాదాపు 4 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించారు. రైస్మిల్లర్ల సంఘం మౌనముద్ర ధాన్యం కేటాయింపులో రైస్మిల్లర్ల సంఘం మధ్యవర్తిత్వం వహిస్తుండగా సదరు సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఏటా అక్రమాలు తారాస్థాయికి చేరుతుండగా లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్ముకున్నారని తేలుతుండగా రైస్మిల్లర్ల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకర అంశం. అక్రమార్కులను సంఘం నుంచి బహిష్కరిస్తామని చెప్పడమే తప్పా ఆచరణలో కనిపించడం లేదు.2024లో జమ్మికుంట మండలం కోరపల్లిలో శ్రీమహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇల్లందకుంట మ ండలం శ్రీరాములపల్లిలో శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వెలుగుచూసిన రూ.130 కోట్ల ధాన్యం కుంభకోణం వ్యాపార లోకాన్నే నివ్వెరపరిచింది. మిల్లరు బండారు శారద యజమాని కాగా.. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్కు తరలించింది. 2025లో పెద్దపాపయ్యపల్లిలో రవిచంద్ర ఇండస్ట్రీస్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయగా 32,207 క్వింటాళ్ల ధాన్యం కనిపించలేదు. వీటి విలువ రూ.6.68 కోట్లు. బోర్నపల్లిలోని విజయకృష్ణ మోడ్రన్ రైస్మిల్లులో 238.4క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో అధికారులే అవాక్కయ్యారు. తాజాగా.. జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లో సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారులు త నిఖీ చేయగా బోర్నపల్లిలోని సాయిట్రేడర్స్, జగన్మాత ఇండస్ట్రీస్లో నిల్వల్లో భారీగా తేడాలు కనిపించాయి. సాయిట్రేడర్స్ యజమాని జ్యోతిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. -
పెట్టుబడి మోసం
సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దోపిడీకరీంనగర్క్రైం: జిల్లాలో సైబర్ నేరాలు కొత్త రూపం దాల్చుతున్నాయి. ఒకప్పుడు లాటరీ, బ్యాంక్ కాల్స్కే పరిమితమైన మోసాలు ఇప్పుడు పెట్టుబడులు, షేర్ ట్రేడింగ్, సోషల్ మీడియా, నకిలీ కొరియర్, ఉద్యోగాలు, లోన్యాప్, ఫేక్ కస్టమర్ కేర్ వరకు విస్తరించాయి. నేరుగా బ్యాంక్ వివరాలు అడగడం తగ్గించి, డబ్బు రెట్టింపు, షేర్ మార్కెట్లో భారీ లాభాలు, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్, టెలిగ్రామ్ వీఐపీ గ్రూప్, పార్ట్టైమ్ ఉద్యోగం, ఆన్లైన్ టాస్క్ పేర్లతో ప్రజలను వలలోకి దింపుతున్నారు. మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం కల్పించి, తర్వాత రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టించి డబ్బుతో పరారవుతున్నారు. జిల్లాలోని సైబర్ నేరాల మూడేళ్ల విశ్లేషణలో ఈ అంశాలు స్పష్టమయ్యాయి. పెట్టుబడులే ప్రధాన టార్గెట్ సైబర్ నేరాల్లో అత్యధికంగా నమోదయ్యేవి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులేనని గణాంకాలను చూస్తే స్పష్టమవుతోంది. 2024లో 100 కేసుల్లో 53 పెట్టుబడి మోసాలవే ఉన్నాయి. 2025లో మొత్తం 39 కేసుల్లో 26 ఇదే తరహావి. 2026లో ఇప్పటివరకు నమోదైన 11 కేసుల్లో 8 కేసులు పెట్టుబడి మోసాలకు సంబంధించినవే. యేటా మొత్తం కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడి మోసాల శాతం పెరుగుతుండడం అత్యంత ఆందోళనకరంగా మారింది. నేరాల పద్ధతిలో భారీ మార్పు 2024లో నమోదైన 100 కేసుల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 53, ఐడెంటిటీ థెఫ్ట్ 25,, అడ్వర్టైజ్మెంట్ ఫేక్ కస్టమర్ కేర్ 8, ఆన్లైన్ ట్రేడింగ్ జాబ్ ఫ్రాడ్ 6, నకిలీ కొరియర్ 4, ఫేక్ బ్యాంక్ కస్టమర్ కాల్స్ 2, లాటరీ ఫ్రాడ్ 1, లోన్ యాప్ ఫ్రాడ్ ఒకకేసు నమోదయ్యాయి. 2025లో నమోదైన 39 కేసుల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ 26, సోషల్ మీడియా మోసాలు 4, సైబర్ టిప్లైన్ 3, ఉద్యోగాల పేరుతో సైబర్ స్లేవరీ 2, నకిలీ కొరియర్ 1, ఐడెంటిటీ థెఫ్ట్ 1, పోలీసులమంటూ బెదిరింపులు 1, చీటింగ్ ఐడెంటిటీ థెఫ్ట్ ఒకకేసు చొప్పున నమోదయ్యాయి. 2026లో ఇప్పటివరకు నమోదైన 11 కేసులు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 8, లాటరీ ఫ్రాడ్ 1, ఆన్లైన్ ట్రేడింగ్ /ఇన్వెస్ట్మెంట్ 1, ఆన్లైన్ ట్రేడింగ్ జాబ్ఫ్రాడ్ ఒకటి జరిగాయి. సంఖ్య తగ్గి.. ప్రమాదం పెరిగింది 2024లో 100 కేసులు నమోదుకాగా, 2025లో 39, 2026లో ఇప్పటివరకు 11 కేసులే నమోదయ్యాయి. కేసుల సంఖ్య తగ్గడాన్ని బట్టి సైబర్ నేరాలు తగ్గాయని భావించడం పొరపాటే. నమోదవుతున్న కేసుల్లో అత్యధికం భారీ మొత్తాల పెట్టుబడి మోసాలే కావడంతో ఒక్కోకేసులో బాధితులు రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు నష్టపోతున్నారు. మూడేళ్లలో నమోదైన 150 సైబర్ కేసుల్లో 87కేసులు (దాదాపు 58శాతం) పెట్టుబడి మోసాలే ఉండడంతో కరీంనగర్లో సైబర్ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం ఇప్పుడు పెట్టుబడిదారులేనని స్పష్టమవుతోంది. సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సంబంధం లేని లింకులను సోషల్ మీడియాలో ఓపెన్ చేయకూడదని, నేరాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 87ఐడెంటిటీ థెఫ్ట్ 26అడ్వర్టైజ్మెంట్ ఫేక్ కస్టమర్ కేర్ 8ఆన్లైన్ ట్రేడింగ్/జాబ్ ఫ్రాడ్ 7సోషల్ మీడియా 4నకిలీ కొరియర్ 5ఉద్యోగాల పేరుతో సైబర్ స్లేవరీ 2లాటరీ 2ఫేక్ బ్యాంక్ కస్టమర్ కాల్స్ 2చీటింగ్/ఐడెంటిటీ థెఫ్ట్ 1పోలీసులమంటూ బెదిరింపు 1లోన్ యాప్ ఫ్రాడ్ 1 -
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనుల నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.ఎల్లమ్మ ఫీడర్ పరిధిలోని ఆటోనగర్, బైపాస్ రోడ్డు, కోతిరాంపూర్, ఎన్టీఆఆర్ చౌరస్తా, మై విలేజ్ రెస్టారెంట్, గ్యాస్ గోదాం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.రేకుర్తి సమ్మక్క గద్దెలు ఫీడర్ పరిధిలోని సమ్మక్క గద్దెలు, విజయపురికాలనీ, స్వామి కాలనీ, షేకాబ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కంటి ఆసుపత్రి, మైత్రివనం, బుడిగె జంగాల కాలనీ, అంజనేయులుకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. -
● క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసు ● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
టెండర్లతో మాకేం సంబంధం?కరీంనగర్ కార్పొరేషన్: యూఐడీఎఫ్ నిధులతో చేపట్టే పనుల టెండర్తో తమకేం సంబంధమని, బట్టకాల్చి మీద వేస్తామంటే ఊరుకునేది లేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో లీగల్నోటీసు ఇస్తామన్నారు. శనివారం నగరపాలకసంస్థ 48వ డివిజన్ విద్యానగర్ కురుమవాడలో రూ.కోటి అంచనాతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, పైప్లైన్ పనులకు, లక్ష్మినరసింహకాలనీలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. చింతకుంటలోని బుల్సెమెన్ సెంటర్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. గత పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను భ్రష్టు పట్టించిన నాయకులే తమకు అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని, అలాంటి వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. క్షమాపణ చెప్పకపోతే,లీగల్ నోటీసులు పంపించేలా చూడాలని మేయర్, డిప్యూటీ మేయర్ను ఆదేశించారు. యూఐడీఎఫ్ పనుల టెండర్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని, అందులో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మి ప్రకాశ్, సుధగోని మాధవి కృష్ణాగౌడ్, బండారి వేణు, బోయినపల్లి ప్రవీణ్రావు పాల్గొన్నారు. -
బాలల హక్కుల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
కరీంనగర్క్రైం: పాఠశాలల్లో బాలల హక్కులను పరిరక్షించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా య సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ పేర్కొన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మిషన్ బాల సురక్ష, శిక్షా, న్యాయ–2026’ కార్యక్రమంలో భాగంగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియామకమైన ఉపాధ్యాయులకు జిల్లా కోర్టు ఆవరణలో శని వారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ బాలలపై వేధింపులు, పోక్సో చట్టం కింద నేరాలు, బా ల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు ఉపాధ్యాయులకు చట్టాలపై పూర్తి అవగాహన అవసరం అన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, సీని యర్ సివిల్ జడ్జి కె.రాణి ఆధ్వర్యంలో బాలల హక్కులు, ఉచిత న్యాయ సేవలు, చట్టపరమైన రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి.వెంకటేశ్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నామ సంతోష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు. చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల నమోదు గడువు తేదీని అగస్టు 7వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పరీక్ష నవంబర్ 28న జరుగుతుందని, 2027–28 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశం కోరబోయే విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతూ ఉండాలని సూచించారు. ఈ ఏడాది జగిత్యాల జిల్లాలోనూ నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని జగిత్యా ల, మల్యాల, మెట్పల్లి బ్లాక్ల విద్యార్థులు జగిత్యాల జిల్లాలోని నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనాలు శనివారం బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల ఇదే తరహాలో 1వ తేదీనే క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరీంనగర్ అర్బన్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. గత నెల 31తో కేవైసీ గడువు ముగియగా మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల ఆధార్ అప్డెట్ క్రమంలో ఆధార్ కేంద్రాలు కిక్కిరిసిపోగా వేలమంది చిన్నారులు రేషన్కు దూరమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో గడువు పెంచాలన్న విజ్ఞప్తులతో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ నెల 31వరకు కేవైసీ చేసుకోవచ్చని, సమీప రేషన్ దుకాణం లేదా మీ సేవ కేంద్రాల్లో కేవైసీ చేసుకోవాలని అధికారులు సూచించారు. కరీంనగర్ క్రైం: కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆగస్టు 31వరకు ని షేధాజ్ఞలు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలి పారు. సంబంధిత ఏసీపీల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. మారణాయుధాలతో సంచరించడం, ప్రజా ప్రదేశాల్లో గుమికూడడం నిషేధమన్నా రు. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్లు, పారాగ్లైడర్ల వినియోగం, డీజే వినియోగంపై నిషేధాజ్ఞలను పొడిగించినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యానగర్(కరీంనగర్): డీఐఈవోగా వి.సత్యవర్ధన్రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాంజనేయ, జిల్లా జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, రాజేశ్వర్ రావు, వెంకటరమణచారి, నిర్మల అభినందించారు. -
ఆత్మబంధువు!
స్నేహ బిందువు.. జగిత్యాల: స్నేహబంధం చాలా గొప్పది. ఓపెన్గా మాట్లాడుకోవడం, ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం ఒక స్నేహితులతోనే ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కడలి జయకృష్ణ. బీటెక్ పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ నన్ను ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర కూడా ఉంది. జయకృష్ణ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటాం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాలసప్తగిరికాలనీ(కరీంనగర్): ఒకప్పుడు స్నేహమంటే ఒకే బెంచ్, ఒకే వీధి, ఒకే ఊరు. ఇప్పుడు స్నేహమంటే ఒకే స్క్రీన్, ఒకే గ్రూప్, ఒకే వీడియో కాల్. కాలంతో పాటు మనుషులు మారారు. స్నేహం కొత్త రూపం దాల్చింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ నేటితరం జీవితంలో నిజమైన దోస్త్గా మారాయి. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలిపే వేదికగా, కొత్త పరిచయాలకు పునాదులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, జ్ఞాపకాల ఫొటోలు, రీయూనియన్లు.. ఇవన్నీ డిజిటల్ వేదికలతో సాధ్యమయ్యాయి. వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్తో రక్తదానం చేసిన స్నేహితులు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.లక్షలు సేకరించి వైద్యం చేయించినవారు.. వరదలు, ప్రమాదాల సమయంలో తమ ప్రాణా లను సైతం ఫణంగా పెట్టి స్నేహితులను కాపాడిన ఘటనలు నిజమైన స్నేహానికి నిర్వచనాలు.బంధంగా పుట్టకపోయినా.. అనుబంధంగా రూపుదిద్దుకుని.. కలిసిన సమయం నుంచి.. కడదాకా నీడనిచ్చేదే స్నేహం..! అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు.. స్నేహితుడు బతుకుదారి చూపుతాడు..!! బుడిబుడి అడుగులతో మొదలయ్యే స్నేహం జీవిత చరమాంకం వరకు కొనసాగుతుంది. బడిబాటతో ముడిపడి.. జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే నడుస్తుంది. ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే జీవితకాలం కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే స్నేహమంటే రెండక్షరాల పదమే కాదు.. రెండు హృదయాల బంధం.. ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్రెండ్షిప్కు మారుపేరుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఒకేచోట చదువుకుని.. ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. స్నేహితులూ ముఖ్యమంటున్నారు. పలువురు తమ స్నేహానికి గుర్తుకు నెలకోసారి కలుసుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణరావు, పి.చంద్రశేఖర్ 42ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో స్నేహితులయ్యారు. ముగ్గురు పుట్టి పెరిగిన జిల్లాలు వేరైనా ప్రభుత్వ డాక్టర్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. కడపకు చెందిన పెంచలయ్య, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం నిడిగుంటపాలెం చెందిన రమణరావు, నెల్లూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్కు ఎంబీబీఎస్ కాలేజీ ఫంక్షన్లో స్నేహం కలిసింది. పెంచలయ్య, చంద్రశేఖర్ 1993లో, 1995లో రమణరావు సిరిసిల్లకు వచ్చారు. ఇప్పుడు సర్జన్గా పెంచలయ్య, ఆర్థోపెడిక్గా రమణరావు, డీఎంహెచ్వోగా చంద్రశేఖర్ మంచి గుర్తింపు పొంది ఉద్యోగ విమరణ చేశారు.ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చుని 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు మిత్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామానికి చెందిన గుర్రం సందీప్ రెడ్డి, మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమణారెడ్డి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. గుర్రం సందీప్రెడ్డి 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై , పెద్ద లింగాపూర్లో పనిచేస్తున్నాడు. సింగిరెడ్డి మనోహర్రెడ్డి 2005లో ఉపాధ్యాయుడిగా ఎంపికై స్కూల్ అసిస్టెంట్గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. -
కలెక్టరేట్ వేదికగా స్నేహం చిగురించి..
కరీంనగర్ అర్బన్: కరీంనగర్లోని కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేసే నాయబ్ తహసీల్దార్ నేరేళ్ల కిషన్, భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల తహసీల్దార్ కుంబాల రవికుమార్, మైన్స్లో నాయబ్ తహసీల్దార్(ఎపిక్) భూషణబోయిన రాకేశ్కుమార్, వెల్ది ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల వసంత్, నిజామాబాద్ జిల్లా రూరల్ నాయబ్ తహసీల్దార్ వినయ్సాగర్ 2012లో కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్యోగులే. జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడే చిగురించిన వీరి స్నేహం కష్టసుఖాల్లోనూ తోడునీడగా నిలుస్తోంది. ఉద్యోగ రీత్యా మొదలైన స్నేహం ఆదర్శంగా నిలుస్తోంది. -
‘సకుటుంబ’ స్నేహితులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గుర్రాల అమరేందర్, తడుక వెంకటరమణ, శ్రీపతి రమేశ్, జోగిన్పెల్లి కృష్ణమోహన్రావు, ఖాందేశి ఉత్తమ్కుమార్, తిరుమల శ్రీధర్, రాచకొండ వెంకటేశ్, జిల్లా ధనుంజయ్, మండలోజు నరేందర్, రుద్రంగికి చెందిన రానవేని శ్రీనివాస్, వెగ్యారపు చంద్రశేఖర్, ఆకుల గంగాధర్ చిన్నతనం నుంచి స్నేహితులు. వీరు వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగరీత్యా కొనసాగుతున్నా ప్రతినెల 10వ తేదీన గత 26ఏళ్లుగా కలుసుకుంటున్నారు. ప్రతి స్నేహితుడి పెళ్లిరోజు ఆరు గ్రాముల బంగారం కానుకగా ఇస్తున్నారు. మూడేళ్లకోసారి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లి తమ అనుబంధాలను కాపాడుకుంటున్నారు. -
7 నెలలు.. రూ.11.07కోట్ల జరిమానా
కరీంనగర్క్రైం: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. 2026 జనవరి నుంచి జూలై వరకు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో భారీసంఖ్యలో కేసులు నమోదు చేయడంతో పాటు రూ.కోట్లలో జరిమానాలు వేశారు. ఏడు నెలల్లో 2,63,781 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసి, రూ.11,07,83,600 జరిమానా విధించారు. 1,587మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసు నమోదు చేశారు. జూలైలోనే అత్యధిక కేసులు జూలైలో అత్యధిక సంఖ్యలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 59,161 కేసులు నమోదు చేయగా.. రూ.1.62 కోట్లకు పైగా జరిమానా విధించారు. మే నెలలో అత్యధికంగా 293 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. జూన్లో 241, ఏప్రిల్లో 205, జనవరిలో 190, జూలైలో 182, ఫిబ్రవరిలో 111 మంది పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హెల్మెట్ ధరించకపోవడం, సీట్బెల్ట్ వినియోగించకపోవడం, సిగ్నల్ ఉల్లంఘన, అధికవేగం, రాంగ్ రూట్, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తన ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొంటున్నారు.నెల కేసులు జరిమానా డ్రంకెన్ డ్రైవ్లు జనవరి 32,373 రూ.1.84కోట్లు 190 ఫిబ్రవరి 18,703 రూ.1.06కోట్లు 111 మార్చి 27,753 రూ.1.37కోట్లు 365 ఏప్రిల్ 34,169 రూ.1.53కోట్లు 205 మే 42,991 రూ.1.96కోట్లు 293 జూన్ 48,631 రూ.1.67కోట్లు 241 జూలై 59,161 రూ.1.62కోట్లు 182ట్రాఫిక్ కేసులు: 2,63,781 జరిమానాలు: రూ.11,07,83,600 డ్రంకెన్డ్రైవ్ కేసులు: 1,587 -
నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం కష్టమే. మహారాష్ట్రలో నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. మేం 14 ఏళ్లుగా స్నేహితులం. నా కాలేజీ రోజుల్లో రూమ్మేట్. అనుకోకుండా ఓ సారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే కేన్సర్గా తేలింది. ఆ సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. అప్పుడు ఐపీఎస్ కాలేదు. కానీ రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించాను. పృఽథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఇప్పటికీ మేం ఫోన్లో మాట్లాడుకుంటాం. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
నిధులు మంజూరు చేయాలి
వట్టిమల్ల నుంచి నిమ్మపల్లికి, కోనరావుపేట మండలకేంద్రానికి వెళ్లాలంటే ఇదే మూలవాగు పైనుంచే వెళ్లాలి. వాగుపై గతంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నా వర్షాలకు మళ్లీ కొట్టుకుపోతుండడంతో రవాణాకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. – గుండా వెంకటేశ్, వట్టిమల్ల సర్పంచ్రవాణాకు ఇబ్బంది మండలంలోని మూలవాగుపై వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన రాహిత్యంతో ఎస్డీఎఫ్ నిధులను రద్దు చేశారు. దీంతో ఏటా వర్షాకాలంలో రవాణాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికై నా వంతెనల కోసం నిధులు మంజూరు చేయాలి. –బడుగు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మామిడిపల్లి -
చోరీ కేసులో నిందితురాలు అరెస్ట్
కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లిలో జరిగిన రూ.26 లక్షల నగదు చోరీ కేసులో మరో నిందితురాలు ఆడెపు రేష్మాను గురువారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు తగరం శంకర్ను రిమాండ్కు తరలించారు. తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న రేష్మాను అదుపులోకి తీసుకున్నారు. శంకర్తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్లో ప్లాస్టిక్డ్రమ్లో దాచిన సుమారు రూ.26 లక్షల నగదును అపహరించినట్లు అంగీకరించింది. శంకర్ను అరెస్ట్ చేయడంతో భయపడిన రేష్మా చంద్రాపూర్ వెళ్లేందుకు గురువారం రైల్వేస్టేషన్కు రావడంతో పట్టుకున్నారు. కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
గుండెపోటుతో రైతు మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లో గురువారం గుండెపోటుతో బండి అంజయ్య(50)అనే రైతు పొలంలోనే మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు భార్య కొమురమ్మతో కలిసి అంజయ్య ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 3.30గంటలకు ఇంటికి బయల్దేరాడు. కొంతదూరం నడిచిన అంజయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పొలంలోనే పడిపోయాడు. భార్య కొమురమ్మ కేకలు వేయడంతో స్థానిక రైతులు వచ్చారు. చికిత్స నిమిత్తం కరీంనగర్లో ఆటోలో తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పారిశుధ్య కార్మికుడు.. రాయికల్: రాయికల్ బల్దియాలో వాటర్ లైన్మన్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి భీమయ్య (50) గుండెపోటుతో గురువారం మృతిచెందాడు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అంత్యక్రియల నిమ్తితం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు గంగాధర్, రాకేశ్నాయక్, నాయకులు తురగ శ్రీధర్రెడ్డి, భూమేశ్, రాము, అనిల్, నాగరాజు పాల్గొన్నారు.


