breaking news
Karimnagar District Latest News
-
కబడ్డీ.. కబడ్డీ
కరీంనగర్స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ.. కూత రేపటినుంచి నగరంలో హోరెత్తనుంది. రాష్ట్రస్థాయి కబడ్డీపోటీలకు కరీంనగర్ వేదికై ంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అంబేద్కర్స్టేడియంలోని హాకీ మైదానంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. 17ఏళ్ల తరువాత రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళల విభాగంలో 32 జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి 2 జట్లు హాజరుకానున్నాయి. మొత్తంగా 34 చొప్పున పురుషుల, మహిళల జట్లు ట్రోపీ కోసం పోటీపడనున్నాయి. 952 మంది క్రీడాకారులు, 156 మంది కోచ్, మేనేజర్లు, 100 మంది రెఫరీలు, 40 మంది కబడ్డీ సంఘం ప్రతినిధులు హాజరుకానున్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఆస్ట్రో టర్ఫ్ కోర్టులపై ఆట అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానాన్ని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్లో తొలిసారిగా ఆస్ట్రోటర్ఫ్ కోర్టులపై కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. గతంలో ఇదే స్టేడియంలోని ఇండోర్హాల్లో కబడ్డీ ప్రీమీయర్ లీగ్ నిర్వహించారు. ఈసారి ఆరు కోర్టులు సిద్ధం చేస్తున్నారు. మంత్రులతో ప్రారంభం 17 ఏళ్ల తరువాత కరీంనగర్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నట్లు కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు తెలిపారు. 28న జరిగే ముగింపు పోటీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. 8 చొప్పున పూల్లు.. 142 మ్యాచ్లు అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులు కబడ్డీ కూత మోగనుంది. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. మహిళలు, పురుషుల జట్లను 8 విభాగాల చొప్పున మొత్తం 16 గ్రూప్లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తంగా 142 మ్యాచ్లు జరుగనున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో మ్యాచ్లు జరుగనున్నాయి. రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపికచేసి, 72వ జాతీయస్థాయి సీనియర్స్ పోటీలకు పంపనున్నారు. మహిళల జాతీయ కబడ్డీ పోటీలు హైదరాబాద్లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుండగా, పురుషుల పోటీలు గుజరాత్లో ఫిబ్రవరి 24 నుంచి 27వరకు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జరిగే 72వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్, పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ.ప్రసాద్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో పోటీల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వేదికగా 17ఏళ్ల అనంతరం కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, కబడ్డీ సంఘం కోశాధికారి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. రేపటి నుంచి కరీంనగర్ వేదికగా రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు 33 జిల్లాల నుంచి హాజరుకానున్న క్రీడాకారులు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కబడ్డీ సంఘం -
వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చితేనే రైతులకు మనుగడ సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయంలోనూ ఇతర దేశాలతో పోటీపడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మనం పండించిన పంటల్లో రసాయనాల శాతం అధికంగా ఉండటంతో అమెరికా వంటి చాలా దేశాలు మన ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని తెలిపారు. సహకార సంఘాలు, ఎఫ్పీఓ సంఘాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రతి పంటకూ ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. రైతు భూసార పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు రసాయన ఎరువులు వాడాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ మాట్లాడుతూ.. మానవ రహిత వ్యవసాయం చేసేందుకు వర్సిటీ పరిధిలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ.. మార్కెట్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటల సరళి మార్చాలన్నారు. వరి పంటల్లో యాజమాన్య పద్ధతులపై శ్రీనివాస్, నూతన వరి రకాలపై సతీష్చంద్ర, యాసంగి పంటల్లో వచ్చే తెగుళ్లపై ఎన్.సుమలత, పంటల్లో యాజమాన్య పద్ధతులపై వై.స్వాతి, రవి, మామిడి పంటపై కె.స్వాతి, రబీలో జింక్లోపంపై సాయినాథ్ వివరించారు. కోతుల బెడదతో వ్యవసాయం చేయలేకపోతున్నామని, రైతులకు అవసరమైన విషయాలపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని రైతులు కోరారు. ఉత్తర తెలంగాణలోని వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, చెరుకు, పత్తి, నువ్వులు, మొక్కజొన్న రకాలను ప్రదర్శనగా పెట్టారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్, పొలాస సర్పంచ్ శంకరయ్య పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్, హాజరైన వివిధ జిల్లాల రైతులు రైతు వ్యాపారిలా ఆలోచించాలి అప్పుడే అన్నదాతలకు మనుగడ పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ రైతు సదస్సు పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు అలరించిన స్టాళ్లు -
ముగిసిన పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ను జీపీటీ హుస్నాబాద్ కళాశాల జట్టు కై వసం చేసుకోగా బాలికల విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ పాలిటెక్నిక్ కళాశాల జట్టు కై వసం చేసుకున్నాయి. అథ్లెటిక్స్ బాలికల విభాగంలోలో కె.కీర్తన (కరీంనగర్), బాలుర విభాగంలో బి.అభిషేక్(కోరుట్ల) చాంపియన్గా నిలిచారు. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి ట్రోపీలు అందజేశారు. బాలికల విజేత కరీంనగర్, బాలుర చాంపియన్ హుస్నాబాద్ -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య..?
● హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆందోళనజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద శక్తి మిల్క్ డెయిరీలో కలవేని కిరణ్ (29) ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన కిరణ్ మిత్రుడు రాజేశ్తో కలిసి అన్నపూర్ణ థియేటర్ వద్ద శక్తి మిల్క్ డెయిరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరు కలిసి దుకాణం మూసి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. మంగళవారం ఉదయం లేచేసరికి కిరణ్ దుకాణంలో ఉరేసుకుని కనిపించాడు. దీంతో రాజేశ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కిరణ్కు ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి భార్య వీణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. -
మా బతుకులు మారవా..?
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన ● జీతం చారెడు.. పని బారెడు ● అరకొర వేతనాలతో ఇబ్బందులు కరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1,993 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నా ప్రభుత్వాలు తమపై చిన్నచూపు చూస్తున్నాయని వాపోతున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు చర్చలకు పిలిచినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సచివాలయానికి పిలిచి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ నెరవేరకపోవడంతో తమ పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,993 మంది ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్షా విభాగంలో వివిధ కేటగిరీల్లో 1,993 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 560 మంది, కరీంనగర్లో 560, పెద్దపల్లిలో 428, రాజన్నసిరిసిల్లలో 445 మంది ఉన్నారు. కేజీబీవీల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, యూఆర్ఎస్ పాఠశాలల్లో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, డీపీవో కాంట్రాక్ట్ స్టాఫ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్, ఎంఆర్సీ కంప్యూటర్ ఆపరేటర్స్, భవిత సెంటర్లలో ఐఈఆర్పీలు, సీర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఎంఆర్సీ మెసెంజర్లుగా, వాచ్మెన్లుగా, స్కావెంజర్, కుక్స్గా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత కరువు విధి నిర్వహణలో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి, ఇతరకారణాల వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణిస్తే ప్రభుత్వం నేటి వరకు ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆదుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా టీఏ, డీఏలు ఇస్తూ ఉద్యోగ భద్రత, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మొండిచేయి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, గతంలో ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ నియామకాలకు సరిపోయే విద్యార్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
అనారోగ్య సమస్యలతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన పర్స ధనుష్ (17) అనారోగ్య సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ధనుష్ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇతడు పుట్టుకతోనే షుగర్, ఫిట్స్ వ్యాధులతో బాధపడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించిన ముస్తాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి తనం భరించలేక ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమేడిపల్లి: మానసిక ఒత్తి డి తట్టుకోలేక ఉరేసుకు ని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్లో చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. గొల్లపల్లి జలందర్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా, కొద్ది నెలలకే విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న జలందర్ ఇలీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చాడు. 18 నెలలుగా ఒంటరిగా ఉంటున్న జలందర్ మానసికంగా బాధపడుతున్నాడు. జీవితం మీద విరక్తితో మంగళవారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి గొల్లపల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. 14 ఇసుక ట్రాక్టర్ల పట్టివేతరాయికల్: మండలంలోని ఇటిక్యాల పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 14 ట్రాక్టర్లను మంగళవారం తహసీల్దార్ నాగార్జున మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. వివాహేతర సంబంధం అనుమానంతో దాడి సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని సుగ్లాంపల్లి వద్ద మేకల శ్రీనివాస్పై మంగళవారం దాడి జరిగింది. కరీంనగర్ జిల్లా మందలపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్కు పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె భర్త, కొడుకు, కొడుకు స్నేహితులు ఈ దాడి చేశారు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. సదరు వివాహిత, ఆమె భర్త మధ్య గొడవలు జరుగుతుండగా.. భర్తపై ఫిర్యాదు చేసేందుకు పరిచయం ఉన్న శ్రీనివాస్తో కలిసి వివాహిత ద్విచక్రవాహనంపై తొలుత పెద్దపల్లికి వెళ్లింది. అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తుండగా.. ఆమె కొడుకు సోన్నాయిటెంకం అభిషేక్, భర్త చంద్రమోహన్, కొడుకు స్నేహితులు ఎల్లంకి సాగర్, తాటిపల్లి వినయ్ కలిసి సుగ్లాంపల్లి వద్ద కాపుకాసి శ్రీనివాస్పై కత్తితో దాడి చేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీ కోల్సిటీ(రామగుండం): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్ ఆదేశాలతో గోదావరిఖనిలోని స్కానింగ్ కేంద్రాలను, ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోగ్రాం అధికారి వాణిశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. డాక్టర్ వాణిశ్రీ మాట్లాడుతూ, లింగనిర్ధారణ చట్ట విరుద్ధమన్నారు. పుట్టబోయే పిల్లలు ఆడ అయినా, మగ అయినా సమానమే అనే భావన ప్రజల్లో పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చదువులకు లేని పైసలు అందాల పోటీలకు ఎక్కడివి?
● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి పెద్దపల్లి: చదువులకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అందాల పోటీలు, ఆటలకు ఎక్కడి నుంచి వెచ్చిస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ నాలుగో మహాసభలు మంగళవారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ విద్యార్థులకు ఇచ్చిన ఒక్కహామీ కూడా అమలు చేయలేదన్నారు. కేంద్రప్రభుత్వం మతం పేరిట రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి కమాన్ చౌరస్తా, ఎన్ఎస్ గార్డెన్ వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జెండాను ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మార్కపురి సూర్య ఆవిష్కరించారు. సాయిఆజాద్ అధ్యక్షతన మహాసభలు జరిగాయి. రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్, కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఉపాధ్యక్షుడు మొలుగూరి నితిలేశ్, కోశాధికారి ఎల్కపల్లి సురేశ్, కార్యవర్గ సభ్యులు మాతంగి సాగర్, గుండ్లా లక్ష్మీప్రసన్న, పల్లె హర్ష, సాయిఅనుప్, సాయితేజ, పూదరి సాయి, అభిషేక్, చైత్ర, మైథిలి, సాయిశరణ్య, వైశాలి తదితరులు పాల్గొన్నారు. -
ఇటుకబట్టీల్లో విచారణ
పెద్దపల్లిరూరల్: గౌరెడ్డిపేట గ్రామశివారులోని ఓ ఇటుకబట్టీలో రెవెన్యూ, పోలీస్, కార్మికశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. కనీస సౌకర్యాలు లేవని జాతీయ మానవహక్కుల సంఘానికి కొంతకాలం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేసినట్లు తెలిసింది. ఇటుకబట్టీ నిర్వహణ తీరు పరిశీలించిన కార్మికశాఖ అధికారి హేమలత, రూరల్ ఎస్సై మల్లేశ్, రెవెన్యూ డెప్యూటీ తహసీల్దార్ విజేందర్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు తనిఖీచేసి నివేదిక రూపొందించారు. బుధవారం కలెక్టర్కు నివేదించనున్నట్లు కార్మికశాఖ అధికారి హేమలత తెలిపారు. -
పొగమంచుతో రైళ్ల ఆలస్యం
రామగుండం: ఉత్తరాదిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో న్యూఢిల్లీ, బిహార్, యూపీ రాష్ట్రాల నుంచి వచ్చే పలు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. అయ్యప్ప మాలాధారణ స్వాములు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. న్యూఢిల్లీ నుంచి చైన్నె, త్రివేండ్రం వైపు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్ల మంగళవారం చాలా ఆలస్యంగా నడిచాయి. మధురై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20494) మధ్యాహ్నం 2.53 గంటలకు రామగుండం రావాల్సి ఉంది. కానీ, ఏడు గంటల ఆలస్యంతో రాత్రిపది గంటలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్(20806) మధ్యాహ్నం 3.50గంటలకు రావాల్సి ఉండగా ఆరు గంటల ఆలస్యంగా నడుస్తోంది. జీటీ ఎక్స్ప్రెస్(12616) సాయంత్రం 4.10గంటలకు రావాల్సి ఉండగా 4 గంటల ఆలస్యంగా నడుస్తోంది. కేరళ ఎక్స్ప్రెస్(12626) మధా్య్హ్నం 3.23గంటలకు రావాల్సి ఉండగా 11 గంటల ఆలస్యంతో బుధవారం వేకువజామున నాలుగు గంటలకు రామగుండం రానుంది. సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(12296 ) రాత్రి 9.45గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటల ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. -
కొత్త పంటల గురించి తెలిసింది
మా ప్రాంతంలో పత్తి, జొన్న, మక్క వేస్తాం. పరిశోధన స్థానంలో సాగుచేసే ఆవాలు, అలిసెంత వంటి కొత్త పంటల గురించి తెలుసుకున్నాం. కొత్త విషయాలు తెలుసుకునేందుకు పొలాస పరిశోధన స్థానంలో జరిగే ప్రతి సదస్సుకు హాజరవుతుంటాను. – గంగుబాయి, ఊట్నూర్, మంచిర్యాల జిల్లా ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలను ఆకళింపు చేసుకుని, మా పొలంలో ప్రయోగాలు చేస్తుంటాను. రైతు సదస్సుకు రావడంతో ఎన్నో కొత్త సాగు విషయాలు తెలిశాయి. తోటి రైతులు సాగు చేసే పంటల గురించి తెలుసుకున్నాను. – పవన్కుమార్, బోధన్, నిజమాబాద్ జిల్లా రైతు సదస్సులో ఖర్చు తగ్గించే పద్ధతులు చెప్పారు. యాసంగిలో పంటల్లో ఏ సమస్యలు వస్తాయి..? వాటిని ఎలా ఎదుర్కోనాలనే విషయాలను వివరించారు. వరిని ఎక్కువగా సాగు చేస్తుండటంతో ఇతర పంటలవైపు దృష్టి మళ్లింది. – మహేష్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా -
విద్యుత్ బిల్లు రద్దు చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ బిల్లు, ససవరణ బిల్లు(విద్యుత్ ప్రైవేటీకరణ)–2025 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్, ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈ) పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ శాంతి అనే విద్యుత్తు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు ను నిలిపివేయాలన్నారు. బిల్లును ప్రవేశపెడితే విద్యుత్ ఉద్యోగులు, రైతులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ నాయకులు రమేశ్, రఘు, రాజు, షరీఫ్, పవన్ కుమార్ వెంకట్ నారాయణ, శ్రీనివాస్, స్వామి, సంపత్ కుమార్, సత్యనారాయణ, శ్యామయ్య, శ్రీనివాస్, మహేందర్, శ్రీమతి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆర్అండ్బీ, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, ఇతరశాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, గతంలో గుర్తించిన బ్లాక్స్పాట్ల నివారణ చర్యలు, గత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్బోర్డులు ఏర్పా టు చేయాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డుసేఫ్టీ కమిటీ మీటింగ్లో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకొని, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలన్నారు. పాఠశాల బస్సులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ అతికించాలని సూ చించారు. జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్– జగిత్యాల రోడ్డు కు ఇరువైపులా చెట్లకొమ్మలు ఎక్కువగా ఉన్నందున రాత్రివేళలో దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇబ్బందులను తొలగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
కరీంనగర్క్రైం: రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ పోలీసులకు కమిషనరేట్లోని కన్వెన్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ గౌస్ ఆలం హాజరై మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. నేరగాళ్ల కొత్త పద్ధతులపై పోలీసులకు అవగాహన ఉంచుకోవాలన్నారు. సైబర్ మోసాలు, డిజిట ల్ అరెస్టు, యూపీఐ లావాదేవీలు, నకిలీనోట్ల గుర్తింపు, సైబర్నేరాలపై ఫిర్యాదు చేసే విధా నం, ఆర్బీఐ, అంబుడ్స్మెన్ల సేవలపై వివరించారు. నగదు రహిత లావాదేవీలతో కలిగే ప్ర యోజనాలు, సైబర్ భద్రతా చిట్కాలను వివరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్బీఐ ఇంటిగ్రెటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజీత్ హోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు. మానకొండూర్: గత రెండేళ్లలో ప్రజలు బీఆర్ఎస్ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్చి పోయారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రి వడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే సత్యం చేసిన వ్యాఖ్య లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు ఖండించారు. మానకొండూర్లో మంగళవారం మాట్లాడుతూ కేసీఆర్పై అసందర్భంగా మాట్లాడటం అనుచితమన్నారు. హైడ్రా, మూసీ అక్రమ కూల్చివేతలు, బనకచర్ల భూసే కరణపై పోరాటం చేశామన్నారు. రాజకీయ అవగాహన లేకుండా ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. మాజీ జెడ్పీటీసీ టి.శేఖర్, యాదగిరి పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: ఉపాధి పఽథకాన్ని రద్దు చేసి, దానిస్థానంలో పేదల పొట్టగొట్టే పథకాన్ని కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇందుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం గాంధీరోడ్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, నిధులు ఎగ్గొట్టడానికే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాయకులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు పాల్గొన్నారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు జెడ్పీ పాఠశాలలో మంగళవారం నెహ్రు యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్స్పోర్ట్స్ మీట్ను జిల్లా యువజనశాఖ అధికారి రాంబాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్పోటీలు హోరాహోరీగా జరిగాయి.కబడ్డీలో మా సేవా, నగునూరు జట్లు ఫైనల్కు చేరాయి. సర్పంచ్ సాయిల్ల శ్రావణి, హెచ్ఎం రవీందర్, మై భారత్ యూత్ వలంటరీ గణేశ్, పీడీ సౌజన్య పాల్గొన్నారు. -
త్వరలో కాంగ్రెస్ కొత్త కమిటీలు
● కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్కుమార్ కరీంనగర్కార్పొరేషన్: జనవరి 1వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కమిటీల ఎన్నిక నేపథ్యంలో పాత కమిటీలు రద్దయ్యాయని అన్నారు. వారం రోజుల్లోగా కార్పొరేషన్ పరిధిలో కమిటీలను పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం పీసీసీ నుంచి పరిశీలకులుగా నమిండ్ల శ్రీనివాస్,గుత్తా అమిత్రెడ్డిలు నియమితులయ్యారన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సూచన మేరకు త్వరలో పరిశీలకులతో సమావేశం ఉంటుందన్నారు. నగరంలోని 66 డివిజన్లకు గాను 11 డివిజన్లకు ఒకటి చొప్పున ఆరు జోన్లుగా విభజించి కమిటీలను నియమిస్తామన్నారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. నాయకులు ఎండీ.తాజ్, మడుపు మోహన్, సిరాజ్ హుస్సేన్, శ్రావణ్ నాయక్, మహమ్మద్ అజీమ్, బోనాల శ్రీనివాస్, అహమ్మద్ అలీ, అబ్దుల్ రహమాన్, వంగల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల(కోమండ్లపల్లి)కి చెందిన ఐలవేణి వెంకటేశ్(28) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం పైనుంచి పడి మృతిచెందాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. వెంకటేశ్ ద్విచక్రవాహనంపై నీరుకుల్ల రంగనాయకస్వామి ఆలయం వైపు వెళ్లారు. పనిముగించుకుని రాత్రి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రంగంపల్లి వద్ద వద్ద ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే విజయరమణరావు పరామర్శించారు. వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తురాలు చీకట్ల సమ్మక్క సోమవారం తప్పిపోయినట్లు టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లికి చెందిన సమ్మక్కగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎవరికై నా కనిపిస్తే 81064 79146, 83319 40691లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఒంటరైన చిన్నారి● నాడు తల్లి... నేడు తండ్రి మృతి కోనరావుపేట(వేములవాడ): నాడు తల్లి.. నేడు తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన మారు అంజిరెడ్డి(65) భార్య మల్లవ్వ అనారోగ్యంతో బాధపడుతూ మూడేళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి అంజిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. దీంతో వారి కూతురు నైనిక ఒంటరిగా మారింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి పరామర్శించారు. -
అన్నదమ్ములను కలిపిన పంచాయతీ ఎన్నికలు
వీర్నపల్లి(సిరిసిల్ల): సర్పంచ్ ఎన్నికలు విడిపోయిన అన్నదమ్ములను కలిపాయి. ఏళ్లుగా మాటలు లేని సోదరులను దగ్గర చేశాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్సింగ్తండా, గర్జనపల్లి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు అన్నదమ్ములను ఒక్కటి చేశాయి. 23 ఏళ్ల తర్వాత.. లాల్సింగ్తండాకు చెందిన అన్నదమ్ములు భూక్య గంగారెడ్డి, భూక్య చిన్నారెడ్డి మధ్య 23 ఏళ్లుగా మాటలు లేవు. 2001లో ఎన్నికల సమయంలో అన్న గంగారెడ్డిని దగ్గర ఉండి గెలిపించిన చిన్నారెడ్డి తర్వాత దుబాయి వెళ్లి 2002లో తిరిగి వచ్చారు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 23 ఏళ్లుగా మాటలు లేవు. గతంలో వీర్నపల్లి ఎస్సైగా పనిచేసిన ఎల్లాగౌడ్ అన్నదమ్ములను పిలిపించి సఖ్యత పెంచేందుకు ప్రయత్నించారు. అయినా వారు ఎడమొహం.. పెడమొహంగానే తిరిగారు. అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటయ్యారు. అన్న గంగారెడ్డిని గెలిపించేందుకు తమ్ముడు చిన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారు. 23 ఏళ్ల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అన్న విజయం సాధించడంతో అన్నదమ్ములను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత ఒక్కటయ్యారు వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన బుచ్చగారి భాస్కర్గౌడ్, రాకేశ్గౌడ్ అన్నదమ్ములు. వీరి మధ్య ఆరేళ్లుగా మాటలు లేవు. తమ్ముడు రాకేశ్గౌడ్ గ్రామ సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. అన్నకు ఫోన్ చేసి సహకరించాలని కోరడంతో భాస్కర్గౌడ్ ముందుకొచ్చాడు. తమ్ముడిని గెలిపించేందుకు భాస్కర్గౌడ్ గ్రామస్తులను ఒక్కటి చేశారు. రాకేశ్గౌడ్ విజయం సాధించడంతో గ్రామస్తులు సైతం హర్షద్వానాలు వ్యక్తం చేశారు. -
తాళం వేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం బాలపల్లిలో ఆదివారం రాత్రి తాళం వేసిన నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పడిగెల లచ్చవ్వ ఇంటికి తాళం వేసి కూతురు వద్దకు వెళ్లింది. ఎనగందుల జయలక్ష్మీ, బుర్ర రమ, గాలిపల్లి కవిత తమతమ ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్ వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్ల తాళాలు పగులగొట్టి బుర్ర రమ ఇంట్లోనుంచి రెండు బంగారు ఉంగరాలు, పడిగెల లచ్చవ్వ ఇంట్లోనుంచి వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బంగారు ఉంగరాలు, నగదు చోరీ -
హామీ ఇచ్చి.. అమలు చేసి..
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చేగుర్తి సర్పంచ్ బాషవేణి సరోజన సోమవారం ఆరుగురు పంచాయతీ సిబ్బంది నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతీనెల వారికి నిత్యావసరాలు పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించారు. వారి కుటుంబాలకు ఐదేళ్లపా సరిపడే కిరాణా సామగ్రిని ప్రతీనెల అందిస్తామన్నారు. అంతేకాదు.. ఆడపిల్ల జన్మిస్తే రూ.5,116 విలువైన పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ బహుమతి అందిస్తామని సర్పంచ్ సరోజన–మల్లేశం దంపతులు వెల్లడించారు. ఆడపిల్లకు రూ.5,116 కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ సర్పంచ్ కూర నరేశ్రెడ్డి, జూబ్లీనగర్ సర్పంచ్ సుద్దాల కమలాకర్ మాట్లాడుతూ.. ఇకనుంచి తమ ఊళ్లలో జన్మించే ఆడపిల్ల పేరిట రూ.5,116 డిపాజిట్ చేస్తామన్నారు. నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణి.. ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తామని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రోజే.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్ పూర్మాని రాజశేఖర్రెడ్డి.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం రోజే అమలు చేశారు. తాను సర్పంచ్గా గెలిచాక గ్రామంలో ఆడబిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్డ్ డిపాజిట్, పెళ్లికి రూ.5వేలు నగదు కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈఏడాది గ్రామంలో జన్మించిన 9 మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.45 వేలు పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. రూపాయికే 20 లీటర్ల మినరల్వాటర్.. బోయినపల్లి(చొప్పదండి): విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనుయ్య.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలపల్లి రామారావు కుటుంబంలో జన్మించిన ఆడపిల్లకు రూ.5వేలు విలువైన చెక్కు అందించారు. పంచాయతీ పాలకవర్గంతో కలిసి రూపాయికే 20 లీటర్ల ప్యూరిఫైడ్ వారట్ పథకం ప్రారంభించారు. పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొందరు అనేక వాగ్దానాలు చేస్తారు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు హామీలు ఇస్తారు.. ఇంకొందరు నగదు, విలువైన బహుమతులు అందిస్తారు.. గద్దెనెక్కాక చాలామంది మాటతప్పుతారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మాటిచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు.. పదవీ ప్రమాణం స్వీకరించిన సోమవారం రోజే హామీలు అమలు చేసి ‘ప్రజాప్రతినిధి’ గౌరవం పెంచారు. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి కొందరిపై కథనం..పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొందరు అనేక వాగ్ధానాలు చేస్తారు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరికొందరు హామీలు ఇస్తారు.. ఇంకొందరు నగదు, విలువైన బహుమతులు అందిస్తారు.. గద్దెనెక్కాక చాలామంది మాటతప్పుతారు.. కానీ, ఈసారి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మాటిచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు.. పదవీ ప్రమాణం స్వీకరించిన సోమవారం రోజే హామీలు అమలు చేసి ‘ప్రజాప్రతినిధి’ గౌరవం పెంచారు. ఉమ్మడి జిల్లాలోని ఇలాంటి కొందరిపై కథనం ఇది.. ఆదర్శంగా నిలిచిన సర్పంచులు ప్రమాణం చేసినరోజే అమలు -
రూ.35వేలతో వార్డు ప్రజలకు సౌకర్యాలు
● వార్డుసభ్యురాలి ఉదారత కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో 3వ వార్డు సభ్యురాలిగా గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సోమవారం బాధ్యతలు చేపట్టిన వార్డు సభ్యురాలు గుజ్జుల జయ రూ.35వేల నగదును స్థానికులకు అందజేశారు. వార్డు ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉండేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టారు. స్థానికులకు ఐదేళ్లపాటు ఉచితంగా దినపత్రిక వేయించడం, వార్డులోని అన్ని వీధుల్లో వీధిదీపాలకు రూ.15వేలతో ఎల్ఈడీ లైట్లను బిగించడం జరుగుతోంది. విద్యార్ధులు, యువకుల కోసం రూ.5వేలతో క్రీడాసామగ్రి కొనుగోలు, మిగిలిన రూ.15వేలను వార్డు ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి ఖర్చుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం వార్డుసభ్యురాలు జయ రూ.35వేలతో చేపట్టిన పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దాడిచేసిన వ్యక్తులపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్నగర్కు చెందిన సంపంగి సతీశ్పై దాడిచేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. టీఆర్నగర్కు చెందిన సంపంగి సతీశ్ ఇంటిపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మద్యంమత్తులో ఫిరోజ్, కోటగిరి సుమన్, కొండ నాగేంద్ర, దాగిమల్ల రమేశ్ నానాబూతులు తిట్టి రాళ్లతో కొట్టారు. అడ్డువచ్చిన సతీశ్ తల్లి లక్ష్మీపై కూడా దాడిచేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. నేడు ఫుడ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ మేళాకరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల) కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాను ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆహార తనిఖీ అధికారులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ వెనకాల గల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఆఫీస్లో మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94048 93871, 70320 87727లో సంప్రదించాలని సూచించారు. భీమన్నకు మొక్కులువేములవాడ: వేములవాడలో ప్రచారరథం వద్ద రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈవో రమాదేవి, ఏఈవోలు, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
ఓవరాల్ చాంపియన్ మైనార్టీ గురుకులం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లాస్థాయి స్పోర్ట్స్మీట్లో ప్రతిభచాటి ఓవరాల్ చాంపియన్షిప్ సాధించినట్లు ప్రిన్స్పాల్ చంద్రమోహన్ తెలిపారు. బొమ్మకల్లో ఈ నెల 19నుంచి 21వరకు 3వ ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. పలు క్రీడల్లో విద్యార్థులు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కప్ అందించారు. కప్ సాధించిన విద్యార్థులను సోమవారం మైనార్టీ గురుకులాల ఇన్చార్జి సుభాన్, కోఆర్డినేటర్ విమల, విజిలెన్స్ అధికారులు అక్రమ్, ఇంతియాజ్ అభినందించారు. -
‘జ్యోతిష్మతి’లో వర్క్షాప్ ప్రారంభం
తిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి (అటానమస్) కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీపై మూడు రోజుల జాతీయస్థాయి వర్క్షాప్ను సోమవారం ప్రారంభించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహింంచనున్నట్ల కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ , కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి తెలిపారు. ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. డీన్ డా. పి.కె. వైశాలి విద్య, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివద్ధి ప్రాముఖ్యతను వివరించారు. హైఈఈ – ఎంపవరింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. మదన్ మోహన్ గౌడ్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తాజా సాంకేతిక పరిణామాలు, సవాళ్లు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ వోడీ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అల్ఫోర్స్లో రామానుజన్ జయంతి
కొత్తపల్లి(కరీంనగర్): గణిత పితామహుడు శ్రీనివా స రామానుజన్ జయంతి సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డితో కలిసి గణిత అవధాని, ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఇ.చంద్రయ్య రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గణితం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, మన దేశ గణితశాస్త్రానికి నిర్వచనం రామానుజన్ అని, ఆయన సేవలు చారిత్రాత్మకమన్నారు. ప్రతీ విద్యార్థి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. కాగా, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్(అమోట్)–2025లో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందించి సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
టెంట్ కిందనే..
ఇల్లంతకుంట: మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో రెండేళ్లుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని ఓ గదిలో పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవాన్ని టెంట్ కింద నిర్వహించారు. చిక్కుడువానిపల్లె, కృష్ణరావుపల్లి గ్రామాల్లోనే ఇదే పరిస్థితి. బోటుమీదిపల్లెలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో కుర్చీలు వేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. తాళ్లల్లపల్లిలో పంచాయతీ భవనం కోసం కేటాయించిన స్థలంలో కార్యక్రమం నిర్వహించారు. -
కరీంనగర్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 20257భీమన్నకు మొక్కులువేములవాడ: వేములవాడలో ప్రచారరథం వద్ద రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. క్వింటాల్ పత్తి రూ.7,400జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,400 పలికింది. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. వాతావరణం పొడిగా ఉంటుంది. పొద్దంతా ఎండగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. -
పైసల్లేని ప్రయోగం..!
‘ఇంటర్ చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్లో సాధించే మార్కులు కూడా అంతే కీలకం. సాధారణంగా సైన్స్ గ్రూప్లు, ఓకేషనల్ విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పరీక్షలకు ముందు నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో ప్రాక్టికల్స్ నామమాత్రంగా కొనసాగుతున్నాయానే విమర్శలు ఉన్నాయి.’కరీంనగర్టౌన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్కు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ను ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. మరో 40 రోజుల్లో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి చివరి మాసంలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలు నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రయోగ పరీక్షలంటే వాటికి సంబంధించిన పరికరాలు, కెమికల్స్, ఇతరత్రా వస్తువులు అవసరం ఉంటాయి. కానీ, ప్రభుత్వం ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాక్టికల్స్ తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. జిల్లాలో 17,128 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, 6 టీఎస్ సోషల్ వెల్ఫేర్, 9 మైనార్టీ, 6 ఎంజేపీ, 11 మోడల్ స్కూల్స్, 8 కేజీబీవీ, 49 ప్రైవేట్ కళాశాలలు జిల్లావ్యాప్తంగా మొత్తం 104 కళాశాలున్నాయి. నిధుల లేమితో భారంగా నిర్వహణ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ కళాశాలలకు భారంగా మారింది. చదువుకున్న పాఠాన్ని ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నా ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలున్నాయి. మూడేళ్లుగా ప్రాక్టికల్స్ నిర్వహణకు సంబంధించిన నిధులు విడుదలకాకపోవడంతో కళాశాలల్లోని ల్యాబ్లలో అరకొర వసతులు, శిథిలావస్థలో ఉన్న ల్యాబ్లు, తుప్పుపట్టిన పరికరాలతోనే విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పాతవాటితో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రైవేటు విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ కళా శాలలవారు తక్కువ మార్కులను సాధిస్తున్నారు. ఈ ప్రభావం ఎంసెట్ ర్యాంకులపై, ఇతరాత్ర పోటీ పరీక్షల సమయంలో చూపే అవకాశం ఉంది. అరకొర వసతులు... సిబ్బంది, నిధులు లేక ప్రభుత్వ కళాశాలలు సమస్యలకు నిలయంగా మారాయి. గ్రామీణ ప్రాంత క ళాశాలల్లో సమస్యలు అధికంగా ఉంటున్నాయి. జి ల్లాలోని 11 ప్రభుత్వ కాలేజీల్లో 6,500 మంది వర కు విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు తెలుస్తోంది. 7వేల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు చ దువుతున్నారు. ప్రతీ విద్యార్థికి రూ.38 చొప్పున క ళాశాలల నిర్వహణకు ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. కానీ, ఆరునెలలుగా బిల్లుల రాక కళాశాలల్లో శానిటైజర్లు, రిజిస్టర్లు ఇతరత్రా వస్తువులు కొనేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. -
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్
కొత్తపల్లి(కరీంనగర్): భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు భేష్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ ప్రశంసించారు. పోలీసుశాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కొత్తపల్లి శివారులో ఏర్పాటు చేసిన కేంద్రం మొదటి వార్షికోత్సవం సోమవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు, వేధింపులకు గురైన సమయంలో ఆదరణకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, ఏడాది క్రితం ప్రారంభమైన భరోసా కేంద్రం ఎన్నో మైలురాళ్లను దాటిందని, అనేక కేసుల్లో మహిళలు, చిన్నారులకు అండగా నిలిచి బాధితుల్లో ధైర్యం నింపిందన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 47 పోక్సో, 13 లైంగికదాడి కేసులు నమోదు చేశామని చెప్పారు. బాధితులకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించినట్లు వెల్లడించారు. మహిళలు, 18 ఏళ్లలోపు బాలబాలికలు ఎవరైనా నేరుగా, పోలీస్స్టేషన్ ద్వారా భరోసా కేంద్రం సేవలు పొందవచ్చని తెలిపారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్.. రెండో విజయం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా అండర్ –14 క్రికెట్ జట్టు హెచ్సీఏ వన్డే నాకౌట్ టోర్నీలో రెండోవిజయం నమోదు చేసింది. సోమవారం ఘటకేసర్లోని కీసర ఏకలవ్య మైదానంలో కరీంనగర్, విజ్ఞాన్ విద్యాలయం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచిన విజ్ఞాన్ విద్యాలయం జట్టు ఫీల్డింగ్ ఎంచుకొంది. 50 ఓవర్ల ఫార్మాట్లో భాగంగా కరీంనగర్ జట్టును 43 ఓవర్లలో 172 పరుగులిచ్చి ఆలౌట్ చేసింది. కరీంనగర్ జట్టులో కెప్టెన్ అచ్యుతానంద్ హాఫ్ సెంచరీ(54 పరుగులు) చేయగా, ప్రేంసాయి 44 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన విజ్ఞాన్ విద్యాలయం జట్టును కరీంనగర్ జట్టు 42.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ చేసింది. జిల్లా జట్టులో సిద్ధార్థ అద్భుతంగా బౌలింగ్ చేసి 9 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. అదేవిధంగా శ్రయాంక్, వర్షిత్ రెండేసి వికెట్లు తీశారు. బౌలింగ్లో అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సిద్ధార్థ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈనెల 24న గౌతం మోడల్ స్కూల్, అమీర్పేట జట్టుతో మూడోమ్యాచ్ జరుగనుందని పేర్కొన్నారు. ఆ మ్యాచ్లో విజయం సాధిస్తే కరీంనగర్ జట్టు క్వార్టర్స్కు అర్హత సాధిస్తుందని జట్టు మేనేజర్, జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు మహేందర్గౌడ్ తెలిపారు. -
పాలన మురువాలె!
కరీంనగర్: గ్రామాభివృద్ధే ధ్యేయంగా కోటి ఆశలతో కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పల్లెల్లో జోష్ పెరిగి పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల మూడు విడతల్లో పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. జిల్లాలో 318 గ్రామపంచాయతీలకు గాను 315 పంచాయతీలు, 2,946 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో 23 నెలల నుంచి కొనసాగిన ప్రత్యేక పాలన ముగిసినట్లయింది. ఇన్నాళ్లు గ్రామాల్లో పత్యేక అధికారుల పాలన కొనసాగడంతో.. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టారు. ఇక నుంచి పాలకవర్గాలు పగ్గాలు చేపట్టడంతో పల్లెప్రజలు అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు సర్పంచ్లు, వార్డు సభ్యులకు గ్రామాల్లో నిధుల లేమి సవాలుగా మారనుంది. కొత్తగా గెలుపొంది ఉత్సాహంగా ఏ పనులైనా చేపడతామంటే ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో పాలన ఎలా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి తోడు గ్రామాల్లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గ్రామాల్లో పేరుకుపోయిన పలు సమస్యలు, అప్పుల చిట్టా, పెండింగ్ బిల్లులు చెల్లించడమే వారికి ఇబ్బందిగా మారనుంది. ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే.. కాస్త ఉపశమనం లభించనుంది. అంతకుముందు 23 నెలలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. నిబంధల ప్రకారం పాలకవర్గాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను ఆపేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు సర్పంచ్లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, ఇటు పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం చేపట్టిన ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాకపోవడంతో వారు అప్పుల పాలయ్యారు. సర్కార్ నిధులిస్తేనే అభివృద్ధి పంచాయతీల్లో గత ప్రభుత్వం ప్రతి నెలా కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి నిధులు ఇస్తూ వచ్చింది. దీంతో చిన్న పంచాయతికి రూ.50 వేలు, పెద్ద పంచాయతీలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రతి నెలా ఆయా గ్రామాల్లోని జనాభాను బట్టి నిధులు ఇచ్చింది. ఆ నిధులతో పారిశుధ్యం, వీధి లైట్ల మరమ్మతు, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు తెచ్చి పనులు చేశారు. చివరకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతుండడంతో.. పాత బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే పడనుంది. -
డ్రగ్స్ మూలాలను పెకిలించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్అర్బన్: మాదకద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలోని అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్, ఎకై ్సజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్స్లో అమ్మకాలను పరిశీలించాలని, వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి కేవలం డ్రగ్స్పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, పోలీసుశాఖ తరఫున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్ స్క్వాడ్ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. డ్రగ్స్ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.కరీంనగర్అర్బన్: గొర్రెలు, మేకల ఎదుగుదలకు నట్టలే ప్రధాన అవరోధం. పెంపకందారులు వాటిని గుర్తించకపోవడం వల్ల అనారోగ్యంతో మరణిస్తుంటాయి. పదులు, వందల సంఖ్యలో మరణాలు సంభవించడం ఏటా జరుగుతున్న తంతు. ఈ క్రమంలో గొర్రెల పెంపకందారులు లక్షల్లో నష్టపోవడం జరుగుతున్న ప్రక్రియ. ఈ నేపథ్యంలో గొర్రెలు, మేకల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం జిల్లాలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి పలు ప్రాంతాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 31వరకు కార్యక్రమాలు జిల్లాలో ప్రాంతీయ, ప్రాథమిక వైద్యశాలలు, ఉప కేంద్రాలు 64 ఉండగా వాటి పరిధిలో నట్టల నివారణ మందును ఉచితంగా అందజేయనున్నారు. గొ ర్రెల వయసు, శరీర బరువు, మందు రకం తదితర అంశాల క్రమంలో మందు మోతాదును నిర్ణయిస్తారు. జీవాల పెంపకందారులు పశు వైద్య సిబ్బంది సూచించే మోతాదు ప్రకారం నట్టల మందు వా డాలని ఏడీహెచ్ డా.వినోద్కుమార్ వివరించారు. కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని బీఆర్ అంబేడ్కర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. పో టీలను ఉదయం జిల్లా క్రీడా శాఖ అధికారి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, కళాశాలల మధ్య స్నేహబంధాన్ని కలిగించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి, కె.వెంకటేశ్వర్లు, ఎం.చంద్రప్రకాశ్, బి.ఝాన్సీ, సీహెచ్.స్వప్న, తుల్జారామ్ షా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి: విద్యుత్ లైన్ల మరమ్మతు నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు గోపాల్పూర్, దుర్శేడ్, సీతారాంపూర్, ఆర్టీసీ కాలనీల్లో సరఫరా నిలిపివేస్తామని రూరల్ ఏడీఈ రఘు తెలిపారు. -
● పంచాయతీల ఓటమి జీర్ణించుకోలేక ప్రగల్భాలు ● సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వంపై.. సీఎం రేవంత్రెడ్డిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం కరీంనగర్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మార్పును కోరిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని, జూబ్లీహిల్స్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే భయంతో కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లపాటు ఫాంహౌస్కే పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని కేసీఆర్ ఇప్పుడు పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందని భావించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. గత పాలనలో రాష్ట్ర బడ్జెట్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఎంపై వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని, ఎవరి దయదాక్షిణ్యాలతోనో కుర్చీలో కూర్చోలేదని పేర్కొన్నారు. బయట విమర్శలు చేయడం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు. కేటీఆర్కు అహంకారం ఎక్కువగా ఉందని, హరీశ్రావు బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బుద్ది తెచ్చుకొని ప్రజలు ఆమోదించే పనులు చేయాలని హితవుపలికారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లు కడితే రూ.లక్ష
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పాలకవర్గం పదవీకాలం ముగిసి రెండేళ్లవుతున్నా కొంతమంది మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందా ఆగడం లేదు. పదవిలో ఉన్నప్పుడు చేసిన వసూళ్లకు కొనసాగింపుగా జోరు తగ్గడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ‘సీ ట్యాక్స్’ (నిర్మాణదారులు పెట్టుకున్న పేరు ‘కార్పొరేటర్ ట్యాక్స్’) వసూళ్లలో ఆరితేరినవారు మాజీలైనా చేతివాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటికో రూ.లక్ష నగరంలో గృహ నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యతరగతి, ఇతరత్రా వర్గాలు ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే అ దనుగా కొందరు మాజీ కార్పొరేటర్లు వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారు. కొత్తగా ఎవరు ఇంటి నిర్మాణం చేపట్టినా, అక్కడికి అనుచరులను పంపించి తమను అనివార్యంగా కలిసేలా చేస్తున్నారు. త మకు డబ్బులు ముట్టచెబితే నిర్మాణానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూస్తామని హామీ ఇస్తున్నా రు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, ఒక్కో అంతస్తుకు రూ.లక్ష అదనం. ఎన్ని అంతస్తులు వేస్తే అన్ని రూ. లక్షలుగా ఫిక్స్ చేశారు. అపార్ట్మెంట్లకు ప్రత్యేక రేటు. టౌన్ ‘ప్లానింగ్’తోనే వసూళ్ల దందాలో మాజీ కార్పొరేటర్లు సూత్రధారులైతే, నగరపాలకసంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు పాత్రధారులు. తాము చెప్పినట్లు డబ్బులు ఇవ్వని నిర్మాణదారులను టౌన్ప్లానింగ్ విభాగంతో వేధింపులకు గురిచేయడం మాజీ కార్పొరేటర్ల ప్రత్యేకత. నిర్మాణం జరుగుతున్న ఇంటి పక్కల వారితో లేనిపోని ఫిర్యాదులు చేయించడం, టౌన్ప్లానింగ్తో నోటీసులు ఇప్పించడం, మామూళ్లు ఇచ్చేలా ఒప్పించుకోవడం మాజీ కార్పొరేటర్ల స్టైల్. తమకు సహకారం అందించిన టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి పర్సంటేజీలు ఇస్తుండడం బల్దియాలో బహిరంగ రహస్యమే. మొన్నటి వరకు విధులు నిర్వర్తించిన కొంతమంది చైన్మెన్న్లు ఇందులో ఆరితేరిన వాళ్లే. ఇలాంటి ఆరోపణలతో నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఇటీవల గంపగుత్తగా చైన్మెన్లను బదిలీ చేయడం తెలిసిందే. బాధితుల బెంబేలు మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందాతో భవన నిర్మాణదారులు బేజారెత్తిపోతున్నారు. బ్యాంక్లోన్లు, అప్పులు, కూడబెట్టుకొన్న సొమ్ము, ఇతర ఆస్తులు అమ్మి ఇల్లు కట్టుకుంటున్న తమను బెదిరించి మరీ రూ.లక్షలు వసూలు చేయడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ కార్పొరేటర్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలో అర్థం కావడం లేదని, టౌన్ప్లానింగ్ విభాగం జోక్యంతో ఎందుకొచ్చిన సమస్యలని ఇష్టం లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ఓ భవన నిర్మాణదారుడు ‘సాక్షి’తో వాపోయాడు. ఈ నేపథ్యంలోనే ఓ మాజీ కార్పొరేటర్తో బాధితులంతా ఇటీవల నగరపాలకలసంస్థకు వచ్చారు. నగరానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సహకారంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాజీ కార్పొరేటర్ల దందాకు సహకరిస్తూ, అధికారులు నోటీసులు ఎలా ఇస్తారంటూ నిలదీయడంతో ఈ వసూళ్ల దందా మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికై నా మాజీ కార్పొరేటర్ల వసూళ్ల దందాకు టౌన్ప్లానింగ్ సహకరించకుండా, భవన నిర్మాణాల్లో పారదర్శకంగా వ్యవహరించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ‘నగరంలోని ఓ శివారు డివిజన్ వివాదాలకు చిరునామా. ఆ ప్రాంతంలోనూ భవన నిర్మాణాలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఓ ఇంటి నిర్మాణదారుడిని డివిజన్ మాజీ కార్పొరేటర్ సంబంధీకులు సంప్రదించారు. ఇంటి నిర్మాణం జరుగుతున్నందున మాజీ కార్పొరేటర్ను కలవాలంటూ హుకూం జారీ చేశారు. తనకున్న పలుకుబడితో యజమాని ఇంటి నిర్మాణాన్ని కొనసాగించారు. చుట్టు పక్కలవారితో తరచూ ఏదో ఒక ఫిర్యాదు ఇప్పిస్తూ, సదరు యజమానిపై వ్యూహాత్మకంగా మానసిక ఒత్తిడి పెంచారు. తట్టుకోలేక ఆ మాజీ కార్పొరేటర్కు రూ.50వేలు ఇవ్వడంతో నిర్మాణం సాఫీగా సాగుతోంది.’‘కలెక్టరేట్కు కూతవేటులో ఉన్న ప్రాంతంలో ఇంటి నిర్మాణాలు రెగ్యులర్గా కొనసాగుతాయి. ఇదే అదనుగా మాజీ కార్పొరేటర్ అక్రమ వసూళ్లకు తెరలేపారు. ‘సీ’ ట్యాక్స్లో ఆరితేరిన సదరు మాజీ కార్పొరేటర్ నిర్మాణదారులకు ‘ఫిక్స్డ్ రేట్’ పెట్టారు. ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, అంతస్తు పెరిగితే అదనంగా రూ.లక్ష ఇవ్వాలని రూల్ పెట్టారు. పదవి పోయి రెండేళ్లవుతున్నా వసూళ్లు ఆగడం లేదు. డబ్బులు ఇవ్వనివారిని టౌన్ప్లానింగ్ అధికారుల నుంచి ఏదో ఒక వంకతో నోటీసులు ఇప్పిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంత బాధితులంతా కమిషనర్కు ఫిర్యాదు చేశారు.’ -
శాసనసభ కార్యదర్శి స్వగ్రామం కల్వచర్ల
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన రేండ్ల తిరుపతిని తెలంగాణ శాసనసభ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు సామాన్య రైతు కుటుంబానికి చెందిన నర్సయ్య–లక్ష్మి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన తిరుపతి భువనగిరి, వరంగల్, బోధన్, హైదరాబాద్, భద్రాచలం, ఖమ్మం, రంగారెడ్డి, తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్గా, హైదరాబాద్ ఏసీబీ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వివిధ హోదాల్లో సనిచేశారు. 2023 ఆగస్టు 21 నుంచి 2025 ఆగస్టు 20 వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శిగా, 2025 ఆగస్టు 22 నుంచి తెలంగాణ వక్ఫ్ ట్రెబ్యునల్ చైర్మన్గా పనిచేయగా ప్రభుత్వం శాసనసభ కార్యదర్శిగా నియమించింది. తిరుపతి నియామకంపై కల్వచర్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు -
బోగస్ ఏరివేతకు ఈ– కేవైసీ
కరీంనగర్ అర్బన్: బోగస్ కార్డులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ– కేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేపడుతోంది. రేషన్ కార్డు యజమానితో పాటు కార్డులోని సభ్యులంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే రేషన్ దుకాణాల్లోనే సదరు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతి నెల 1 నుంచి 15– 17వ తేదీ వరకు సరుకుల పంపిణీ ఉంటుండగా డీలర్లు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 3,17,748 రేషన్కార్డులుండగా 9,45,665 మంది సభ్యులుండగా ఇప్పటివరకు ఈకేవైసీ జరిగింది కేవలం 71.86శాతమే. 7,20,517 యూని ట్లు మాత్రమే ఈకేవైసీ కాగా మరో 2లక్షల మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. రేషన్ దుకాణాల్లో సదరు ప్రక్రియ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండగా క్షేత్రస్థాయిలో రేషన్ దుకాణాలు మూసివేసి ఉండటం గమనార్హం. మరో 9రోజులే గడువు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. పౌరసరఫరాల అధికారులు మాత్రం నిర్ణీత గడువంటూ లేదని కా నీ ఈకేవైసీ చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు. వా స్తవానికి డిసెంబర్ 31లోపు కేవైసీ చేసుకోకుంటే కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. నిజమైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ధృవీకరణ చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. కాగా రేషన్ దుకాణాలు మాత్రం మూసివేసి ఉండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగుంటే ఎలా ఈకేవైసీ చేసుకోవాలని వాపోతున్నారు. కొత్త సభ్యులు కూడా చేసుకోవాల్సిందే జిల్లాలో కొత్తగా 42వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 1.01లక్షల మంది సభ్యులుండగా వీరంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. పాత కార్డుల్లో పేరు తొలగించుకొని వీటిల్లో చేరిన వారు సైతం ఈ ప్రక్రియ పూర్తిచేయించుకోవాల్సిందే. ఇందుకు లబ్ధిదారులు సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. రేషన్ డీలర్ పూర్తి ఉచితంగా సేవలందించాల్సిందే. ఎంత మంది వచ్చినా బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 3,17,748కార్డుల్లో మొత్తం సభ్యులు: 9,45,665రేషన్ దుకాణాలు: 566మొత్తం గ్రామాలు: 316మున్సిపాలిటీలు: 4ఈకేవైసీ చేసుకున్న సభ్యులు: 7,20,517ఈకేవైసీ చేసుకోవాల్సిందే ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర కార్డుల్లో ఇప్పటివరకు 70 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలి. – నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని..
● ఉరేసుకుని తనువు చాలించిన యువకుడు ధర్మపురి: ప్రేమించిన అమ్మా యి పెళ్లికి నిరాకరించిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రామయ్యపల్లెలో జరిగింది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాల్ల లింగన్న, కరుణ దంపతులకు కుమారుడు నవీన్, ఇద్దరు కూతుళ్లున్నారు. లింగన్న ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. నవీన్ కూడా రెండేళ్లపాటు దుబాయి వెళ్లివచ్చి ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేసుకుంటున్నాడు. కొంతకాలంగా రామయ్యపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఆమె పెళ్లికి నిరాకరిస్తోందని తరచూ బాధపడుతుండేవాడు. పది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన నవీన్.. అమ్మాయి వ ద్దకు వెళ్లి పెళ్లి చేసుకుందామని కోరగా ఆమె ని రాకరించింది. దీంతో మనస్తాపానికి గురై శని వారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కాసేపటికి తల్లి చూడగా నవీన్ (24) వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు తనువు చా లించడంతో కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న లింగన్న దుబాయి నుంచి వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి కావడం లేదని వ్యక్తి.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామానికి చెందిన బండారి నరేశ్ (31) పెళ్లి కావడం లేదన్న బెంగతో మానసిక వేదనకు గురై పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్సై మల్లేశ్ కథనం ప్ర కారం.. కొంతకాలంగా నరేశ్కు పెళ్లిసంబంధాలు చూసినా కుదరడం లేదు. మానసిక వేదనకు గురై శనివారం క్రిమిసంహారక మందుతాగాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధ భరించలేక ఒకరు.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం దస్తగిరిపల్లి గ్రా మానికి చెందిన నూనెల రవి (37) అప్పుల బాధతో ఆది వారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లు కట్టేందుకు చేసిన అప్పు ఎలా తీర్చాలోనని తరచూ మదనపడుతుండేవాడు. అదే వేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. మృతుడి భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చలిమంట కాగుతూ.. నిప్పంటుకొని వృద్ధురాలు మృతిగన్నేరువరం చలిమంట కాగుతుండగా.. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ (85) మృతి చెందింది. స్థానికులు, ఎస్సై నరేందర్రెడ్డి కథనం ప్రకారం నర్సవ్వ ఇంటి ముందు ఉన్న పొయ్యి వద్ద ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఆదివారం చలిమంట కాగుతోంది. ఈ క్రమంలో మంట వేడికి కుర్చీ విరిగి వృద్ధురాలు మంటలో పడి తీవ్రంగా గాయపడింది. చుట్టూపక్కల వారు గమనించి నర్సవ్వను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. నర్సవ్వ మనమడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. ఇద్దరు కుమారులు అనారోగ్యంతో గతంలోనే మృతిచెందారు. -
భక్తులు ఎక్కువ.. రైళ్లు తక్కువ
రామగుండం: కాగజ్నగర్ (కోల్బెల్ట్) నుంచి నేరుగా తమిళనాడులోని తిరువన్నామలై (అరుణాచలం) అరుణాచలేశ్వరాలయానికి వెళ్లేందుకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్నా రైల్వేశాఖ క్యాష్ చేసుకోవడంలో విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల రద్దీని గుర్తించి కాలానుగుణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరిఖని, కరీంనగర్ డిపోల నుంచి అరుణాచలంకు నేరుగా బస్సులను నడిపిస్తూ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటుంది. ప్రస్తుతం కరీంనగర్–తిరుపతి మీదుగా అనే రైళ్లు నడుస్తున్నాయి. ఇదే తరహాలో అరుణాచలంకు కూడా నేరుగా రైలు సర్వీసులు నడిపించాలని భక్తుల నుంచి డిమాండ్ వస్తుంది. ప్రత్యేక రైలుతో పుణ్యక్షేత్రాల దర్శనం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి అరుణాచాలంకు ప్రత్యేక రైళ్లు నడిపితే విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి శివాలయం, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరాలయం, చిత్తూరులోని కాణిపాకం, వేలూర్ (తమిళనాడు)లోని గోల్డెన్ టెంపుల్, కాంచీపురంలోని కామాక్షి ఆలయాలు తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు సౌకర్యంగా ఉంటుంది. ఫలితంగా భక్తుల రద్దీ పెరిగి రైల్వేశాఖకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. అరుణాచలంకు రోజురోజుకు పెరుగుతున్న భక్తులు వీక్లీ రైళ్లు నడిపించాలని డిమాండ్ ఆర్టీసీ బస్సు ప్రయాణం గంటల తరబడి అంటే అసౌకర్యం. చార్జీలు, ప్రయాణ సమయం ఎక్కువే. రైలు ప్రయాణం చార్జీలు తక్కువ, సౌకర్యవంతంగా ఉంటుంది. నాలుగైదు కుటుంబాలతో వెళ్లే తీర్థయాత్రలు మరపురాని జ్ఞాపకాలను మిగుల్చుతాయి. – కమ్మల చంద్రశేఖరశర్మ, రామగుండం కాగజ్నగర్ నుంచి రామగుండం మీదుగా త్రివేండ్రంకు నడిచే రైళ్లు కేరళ, తమిళనాడులోని కా ట్పాడి మీదుగా వెళ్తాయి. కాట్పా డి నుంచి అరుణాచలంకు 80 కిలోమీటర్లు ఉంటుంది. తొలుత వీక్లీ రైళ్లను నడిపించాలని ఒత్తిడి తీసుకువస్తా. ప్రధానంగా ఎంపీలు సైతం ఈ రూట్పై ప్రత్యేక దృష్టి సారించాలి. – కంకటి ఫణికుమార్, అధ్యక్షుడు, రైల్వేఫోరం -
సుపారీ ఇచ్చి కొడుకు హత్య
కరీంనగర్క్రైం: ఉపాధి కోసం కొడుకు గల్ఫ్ దేశాలకు వెళ్తే.. కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. కొద్దిరోజులకు కొడుకు ఇంటికి వచ్చి భార్య, తండ్రి మధ్య నడుస్తున్న వ్యవహారంపై మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న కొడుకును చంపించాలని అనుకున్నాడు. ఇందుకు రూ.3లక్షల సుపారీ ఇచ్చి పథకాన్ని అమలు చేశాడు. పోలీసుల విచారణలో నేరం బయటపడగా.. నిందితులను ఆదివారం ఆరెస్టు చూపారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో వెల్లడించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య(36)కు శిరీషతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు ఆడ పిల్ల లున్నారు. అంజయ్య 2017లో విదేశాలకు వెళ్లి 2019లో తిరిగొచ్చాడు. తన తండ్రి గాదె లచ్చయ్య, శిరీష మధ్య సాన్నిహిత్యాన్ని చూసి పలుమార్లు ఇరువురిని మందలించాడు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్న కొడుకును హతమార్చాలని లచ్చయ్య నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్లతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా రూ.1.25 లక్షలు ఇచ్చాడు. అంజయ్యను చంపాలని పథకం వేసిన కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్ అతనితో స్నేహం చేశారు. ఈనెల 2న అతిగా మద్యం తాగించి గొంతునులిమి చంపేశారు. మృతదేహాన్ని సమీపంలోని కెనాల్లో పడేశారు. 5వ తేదీన కాలువలో అంజయ్య శవంలభ్యం కాగా.. ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నమ్మించేందుకు యత్నించారు. పోలీసులకు దర్యాప్తులో పలు అనుమానాలు రావడంతో లోతుగా విచారించారు. గాదె లచ్చయ్య సుపారీ ఇచ్చి చంపించాడని నిర్ధారణకు వచ్చారు. నిందితులు గాదె లచ్చయ్య, గాదె శిరీష, ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్, కొలిపాక రవిని ఆదివారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.40వేల నగదు, బైకు స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్సై రాజు పాల్గొన్నారు. కోడలితో మామ వివాహేతర సంబంధం అడ్డు తొలగించుకునేందుకు పథకం రూ.3లక్షలు ఇచ్చి కొడుకును చంపించిన తండ్రి వివరాలు వెల్లడించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్ -
పారా మోటారింగ్ టూరిజంపై పరిశీలన
రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పారామోటారింగ్ టూరిజం ఏర్పాటుకు ఆదివారం పొరుగు రాష్ట్రాల నుంచి పలువురు రైడర్స్ పరిశీలన నిమిత్తం వచ్చారు. ఈ విషయమై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్తో స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన పారా మోటారింగ్ రైడర్ అర్జున్ పలు విషయాలు చర్చించారు. పారా మోటారింగ్ యంత్రంతో నిష్ణాతులైన రైడర్స్ రామగుండంకు చేరుకోగా స్థానిక జెన్కో గ్రౌండ్ నుంచి యంత్రం సాయంతో ఫ్లయింగ్ చేస్తూ కొండలు, వాగులు, గోదావరినది, అటవీ ప్రాంతం, రాజీవ్ రహదారి, రైల్వే ట్రాక్, విద్యుత్ కేంద్రాలు, అంజనాద్రి జంక్షన్, రామునిగుండాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతీ పంపుహౌజ్ తదితర సుందరమైన దృశ్యాలను తిలకించి పారా మోటారింగ్ రైడింగ్కు స్థానికంగా అనుకూలంగా ఉందని ధ్రువీకరించినట్లు అర్జున్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పారా మోటారింగ్తో సుందర దృశ్యాలను వీక్షించేలా ఒక ప్లాట్ఫాం ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశీలనలో పారా మోటారింగ్ రైడర్స్ సుజిత్ (ముంబయి), పరమేశ్ (హైదరాబాద్), అర్జున్ (రామగుండం) తదితరులు పాల్గొన్నారు. ఫ్లయింగ్తో ఆకర్షణీయమైన దృశ్యాలు తిలకించేందుకు పర్యాటకుల ఆసక్తి -
విద్యతోనే మహిళల ఉన్నతి
కరీంనగర్కల్చరల్: మహిళల ఉజ్వల భవితకు ఏకై క మార్గం ఉన్నత విద్యేనని ప్రముఖ రచయిత, విశ్రాంత ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ ప్రాంగణం, చింతకుంట సాంఘీక సంక్షేమ జూనియర్ కళాశాల ఆవరణలో వేర్వేరు కార్యక్రమాల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పేదరికాన్ని తరిమే ఆయుధం ఉన్నత విద్య మాత్రమే అన్నారు. ప్రముఖ ధ్యాన శిక్షకుడు లయన్ సింగమ రాజు మాట్లాడుతూ ధ్యానం ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, సామాజిక శ్రేయస్సు కలుగుతుందన్నారు. సీనియర్ లైబ్రేరియన్ అర్జున్, లైబ్రేరియన్ సరిత, కళాశాల అధ్యాపకురాలు ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
జనావాసాల్లోకి జింక
పెద్దపల్లిరూరల్: అడవుల్లో చెంగుచెంగున ఎగిరే జింకపిల్ల దారి తప్పింది.. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని జనావాసాల్లోకి వచ్చింది. ఆదివారం కొమ్ము మోహన్ ఇంటి ఆవరణలో గుర్తించిన స్థాని కులు దాన్ని పట్టుకున్నట్లు తెలుసుకున్న సర్పంచ్ తనయుడు కొమ్ము అభిలాష్ అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స తీశ్కుమార్ వాహనాన్ని సమకూర్చి సెక్షన్ ఆఫీసర్ మంగిలాల్, బీట్ ఆఫీసర్ రామ్మూర్తితో జింకను బ సంత్నగర్ అటవీప్రాంతంలో వదిలేశారు. అట వీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గొర్రెల మందలో కలిసి గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: ఈ నెల 22న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రామ సర్పంచ్లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున, అధికార యంత్రాంగం సదరు పనుల్లో ఉంటారని పేర్కొన్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ప్రకటనలో వివరించారు. ఈ నెల 29నుంచి కార్యక్రమం యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని, సోమవారం కలెక్టరేట్కు రావద్దని సూచించారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ఆస్పత్రులుకరీంనగర్టౌన్: ధనా ర్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ మాఫి యా రెచ్చిపోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే నిలువునా దోచుకుంటున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రోగికి ఎంఎన్సీ మందులతో వైద్యం అందించాల్సిన వైద్యులు, లోకల్ మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. అనవసరమైన వైద్య పరీక్షలు చేసి, అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మందుల ధరలు ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యాలు నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ప్రైవేటు ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. నాసిరకం మందులతో వైద్యం అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’లో పాల్గొన్న సుడా చైర్మన్కరీంనగర్ కార్పొరేషన్: భారత రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము శీతకాల విడిది సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. ఎన్నికల ఆర్వోపై వేటు? చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తిలో ఈనెల 14న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని ఆర్వోపై వేటు వేసినట్లు తెలిసింది. ఇందుర్తిలో 12 వార్డులున్నాయి. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యుర్థులు గెలుపొందారు. సీపీఐ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు. మొదట 10వ వార్డు సభ్యురాలు అందె స్వరూపను ఉపసర్పంచ్గా ఐదుగురు ఎన్నుకున్నారు. బీజేపీ వార్డు సభ్యులు తటస్థంగా ఉన్నారు. ఆర్వో రెండోసారి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించి, చింతపూల అనిల్ గెలిచినట్లు ధ్రువీక రించారని సర్పంచ్ నరేందర్, మిగితా వార్డు సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్వోను కలెక్టర్ స స్పెండ్ చేసినట్లు తెలిసింది. సస్పెన్షన్ ఉత్తర్వు లు రావాల్సిఉందని ఎంపీడీవో తెలిపారు. -
లోక్ అదాలత్లో 3,031కేసులు పరిష్కారం
కరీంనగర్క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నిర్వహించిన లోక్ అదాలత్లో 3,031 కేసులు పరిష్కరించినట్లు కరీంనగర్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.శివకుమార్ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి జడ్జి హాజరై మాట్లాడారు. రాజీ ద్వారా తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతోషంగా ఉంటారని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ.. అందరి సహకారంతో లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అవుతున్నాయన్నారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్జీ మాట్లాడుతూ రాజీతో లోక్ అదాలత్లో కేసుల పరిష్కరించుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతుదన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి కే.రాణి లోక్ అదాలత్ గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 3,031 కేసులు పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 85, క్రిమినల్ కేసులు 2,859, ఇతర కేసులు 87 పరిష్కరించారు. వాహన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.78 లక్షల పరిహారం చెక్కును జిల్లా జడ్జి చేతుల మీదుగా అందించారు. -
రాష్ట్రానికే ‘పెద్ద’పల్లి ఆదర్శం
పెద్దపల్లిరూరల్: యూరియా కృత్రిమ కొరత సృిష్టించే అవకాశం లేకుండా.. రైతు తన అవసరాలకు మించి ఎరువును వినియోగించకుండా.. ఇంటి నుంచే బుకింగ్ చేసుకుని దుకాణం నుంచి సులువుగా తీసుకెళ్లేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ‘యూరియా బుకింగ్యాప్’ను అందుబాటులోకి తెచ్చారు. యాప్ను జిల్లాలో 15రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించడంతో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఇంటి నుంచే సులువుగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ యాప్ను శనివారం నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఇంటినుంచే బుకింగ్ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆలోచనల్లో నుంచి పుట్టిన యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ ద్వారా పట్టా పాసుపుస్తకం నంబరు నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్కు ఓటీపీ వస్తోంది. ఆ నంబరు నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంట వేశారు అనే వివరాలతో పాటు యూరియా ఎంతమేర అవసరమవుతుందనే సమాచారంతో బుకింగ్ ఐడీ వస్తుంది. వాటి ఆధారంగా సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. ఐదెకరాల భూమికలిగిన రైతులు రెండు విడతల్లో, 20 ఎకరాల లోపుగలవారు మూడు దఫాలుగా, అంతకన్న ఎక్కువ ఉంటే నాలుగు దశల్లో యూరియా తీసుకెళ్లేలా యాప్ను రూపొందించారు. ఈ నెల 20 నుంచి పొరుగు జిల్లాలో.. పెద్దపలి జిల్లా నుంచి మొదలైన యూరియా బుకింగ్ యాప్ నమోదు ప్రక్రియ రాష్ట్రంలోని పొరుగు జిల్లాలకు పాకింది. ఈనెల 20న తొమ్మిది జిల్లాల్లో సాగింది. కొద్దిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ను రైతులు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. పెద్దపల్లిలో ఈనెల 1నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. శనివారం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్నగర్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలోనూ యూరియా బుకింగ్ ప్రక్రియ మొదలైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రానికి ఆదర్శం జిల్లా తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అలగు వర్షిణి పాలనలో అమల్లోకి తెచ్చిన ‘సాండ్టాక్సీ పాలసీ’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ప్రస్తుత కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని విద్య, వైద్యశాఖల్లో అమలు చేసేలా యాప్ను అందుబాటులోకి తెచ్చారు. తా జాగా ఎరువుల కృత్రిమ కొరత రాకుండా యూరి యా బుకింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇబ్బంది పడొద్దనే యూరియా కోసం రైతులు ఇబ్బంది పడొద్దనే యూరి యా బుకింగ్ యాప్ రూ పొందించాం. ఇంటినుంచే సులువుగా బుకింగ్ చేసుకుని ఏ దశలో ఎంత యూరియా అవసరమో సులువుగా తీసుకెళ్చొచ్చు. ఈ విధానంతో రైతులు క్యూలో నిలబడే పరిస్థితికి ఆస్కారం ఉండదు. విలువైన సయమం వృథాకాదు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ పెద్దపల్లి -
ప్రజల మనసులోంచి గాంధీని ఎలా తొలగిస్తారు
కరీంనగర్ కార్పొరేషన్: జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగిస్తారేమో కాని, ప్రజల గుండెల్లో ఉన్న గాంధీని ఎలా తొలగిస్తారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని కిసాన్నగర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఉపాధి హామీ పథకానికి గాంధీపేరుకొనసాగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర తీసుకువచ్చిన గాంధీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. పేదల ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి పెట్టిన గాంధీ పేరు ను తొలగించడం సిగ్గుచేటన్నారు. కొత్త సర్పంచ్లు తమ గ్రామపంచాయతీల మొదటి సమావేశంలో ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని తొలి తీర్మాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అంబేడ్కర్, నెహ్రూ, గాంధీ కుటుంబంపై కుట్ర చేస్తున్నారన్నా రు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆకా రపు భాస్కర్రెడ్డి, ఉప్పుల అంజనీప్రసాద్, చాడగొండ బుచ్చిరెడ్డి, మెండి చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ ‘కిసాన్ గ్రామీణ మేళా’
కరీంనగర్: రైతులు, మహిళా సంఘాలు, గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ ‘కిసాన్ జాగరణ్’ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా మరోసారి భారీ ఎత్తున శ్రీకిసాన్ గ్రామీణ మేళ్ఙాను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు తెలిపారు. కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభిస్తారని వెల్లడించారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 2022, 2023లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రైతులు హాజరైన రికార్డు ఉందని, ఈసారి అంతకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ప్రదర్శనలకు దూర ప్రాంత రైతులు వెళ్లలేకపోతున్నారని, అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలనే ఉద్దేశంతో కరీంనగర్ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ మేళాలో లాభదాయక ప్రత్యామ్నాయ పంటలు, కేవలం వరి సాగుకే పరిమితం కాకుండా.. పామాయిల్, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం వంటి మార్గాల ద్వారా ఎకరాకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఎలా పొందాలనే అంశంపై రైతులకు దిశానిర్దేశం చేయనున్నామన్నారు. ఎస్సారెస్పీ కెనాల్ పరీవాహక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి వరి పంట దెబ్బతింటున్న పొలాల్లో.. చేపలు, రొయ్యల పెంపకం ద్వారా అధిక లాభాలు గడించే విధానాలను వివరిస్తారని అన్నారు. యూరియా బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ వినియోగం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం, గీత కార్మికుల కోసం చెట్లు ఎక్కే ఆధునిక పరికరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ మేళాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన ప్రగతిశీల రైతులు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రారంభించనున్న హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పి.సుగుణాకర్ రావు -
ఉపాధి.. పల్లె ఊపిరి
కరీంనగర్ అర్బన్: పల్లెలే పట్టుకొమ్మలన్నది మహాత్ముడి మాట. మరీ అ మాటను సర్పంచిలు ఔపోసన పడితే గ్రామీణాభివృద్ధి ఇట్టే సాధ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ క్రమంలో ప్రభుత్వ పథఽకాలను లక్షిత వర్గాలకు చేర్చడమే కాకుండా మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆయుధంగా మలచుకోవాల్సిన తరుణమిది. జిల్లావ్యాప్తంగా ఎన్నికై న సర్పంచిలు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నందున కథనం.. స్వచ్ఛత.. నీటి నిల్వ గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో నిధులు పుష్కలం. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊట కుంటలు, ఫాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తి చేస్తే భూగర్భ జలాలు పెరగనున్నాయి. సాగుకు ఊతం.. మొక్కలు నాటుదాం గ్రామాల్లో మొక్కలు నాటి హరిత వనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంది. గుంతలు తవ్వడం మొదలు, మొక్కలను నాటేందుకు, పోషణకు కూడా డబ్బులు ఇస్తున్నారు. గ్రామాల్లో చెరువులు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు, ప్రాజెక్టు కాల్వల్లో నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే అటు వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులను బాగు చేసుకోవచ్చు. ఉపాధితో బాట గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద దారులు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది. ఎవరిని సంప్రదించాలంటే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో డిఆర్డీవోతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి. సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సర్పంచ్లూ దృష్టిసారించండి -
పల్లె పాలన
ఖాళీ ఖజానా..కరీంనగర్/కరీంనగర్ టౌన్: గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య పాలన తిరిగి ప్రారంభమవుతున్న వేళ.. సర్పంచ్లు, వార్డు సభ్యులకు సమస్యలు స్వా గతం పలుకుతున్నాయి. రెండేళ్లు ప్రత్యేకాధికారుల చేతిలో కొనసాగిన గ్రామాల్లో అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. నిధులు లేక పల్లెలు కుదేలయ్యాయి. ఇప్పుడు బాధ్యతలు చేపట్టనున్న పాలకవర్గాలకు ఖాళీ ఖజానా, పెరిగిన నిర్వహణ భారమే మిగిలింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోకపోవడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంట్ బిల్లులు, తరచూ వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్థికం భారంగా మారబోతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న జిల్లాలోని 316 పంచాయతీలు, 2,946 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 11న మొదటి విడతలో 92 పంచాయతీలు, 866 వార్డులకు.. 14న రెండో విడతలో 113 పంచాయతీలు, 1046 వార్డులకు, మూడో విడతలో 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 17న ఎన్నికలు నిర్వహించింది. సర్పంచులు సహా వార్డు సభ్యు ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ 22న(నేడు) ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. అదే రోజు నుంచి పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పెండింగ్లో నిధులు పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్లకు 2024– 2025, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.2000 కోట్లకుపైగా నిధులు పెండింగ్లోనే ఉన్నాయి. మేజర్ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా... పేరుక పోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. జీపీలను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత ప్రభుత్వం 500 జనాభా కలిగిన తండాలను జీపీలుగా మార్చింది. ప్రతీ జీపీలో కార్యదర్శి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్లు, పారిశుధ్య కార్మికులను నియమించాల్సి ఉంది. చాలా గ్రామాల్లో సరిపడా ఉద్యోగులు లేక ఉన్నవారితో సర్దుబాటు చేయాల్సి వస్తోంది.15వ ఆర్థిక సంఘం నిధులపైన కొత్త సర్పంచ్లు కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రతి గ్రామానికి జనాభా ప్రకారం.. ఒక్కొక్కరికి రూ.900 నుంచి రూ.1,400 చొప్పన నిధులు రానున్నాయి. 3వేల జనాభా ఉంటే రూ.27లక్షల నిధులొస్తాయి. రెండేళ్లకు రూ.54లక్షలు రానున్నాయి. వచ్చే మార్చి ఆఖరి నాటికి ఆర్థికసంఘం గడువు ముగిసిపోనుంది. రెండేళ్లు నిధులొస్తే కొత్త సర్పంచ్లకు ఊరట కలగనుంది. 15వ ఆర్థిక సంఘంతో పాటు ఎస్ఎఫ్సీ నిధులు వస్తేనే పల్లెల అభివృద్ధి పట్టాలెక్కనుంది.జిల్లాలోని గంగాధర మండలం హిమ్మత్నగర్ గ్రామంలో రూ.లక్షలు వెచ్చించి వైకుంఠధామం నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడికి వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. ఇక్కడ పారుతున్న ఓ ఒర్రైపె కల్వర్టు నిర్మాణం చేపడితే వైకుంఠధామం ఉపయోగంలోకి వస్తుంది. నూతన పాలకవర్గం సమస్యను పరిష్కరించి, చివరి మజిలీలో ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.పాలకవర్గాలదే బాధ్యత ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కోసం వెచ్చించే బాధ్యత సర్పంచ్లదే. ఐదేళ్లపాటు ప్రభుత్వాలకు, అధికారులకు అనుసంధానం ఉంటూ గ్రామాల్లో జవాబుదారి పాలన అందించాలి. ప్రజల శ్రేయస్సే, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలి. నూతన పాలకవర్గాలకు అభినందనలు. – జగదీశ్వర్, డీపీవో ఆనందంగా ఉంది సర్పంచ్గా గెలవడం ఆనందంగా ఉంది. నేటినుంచి పద వీ బాధ్యతలు చేపట్టడం మరి చిపోలేని అనుభూతి. గ్రామంలోని సమస్యలను అన్ని వర్గాలతో చేర్చించి పరిష్కరించేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామంలోని అన్ని రకాల పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేసి.. రేణికుంట అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా. – ఎలుక ఆంజనేయులు, రేణికుంట సర్పంచ్ -
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బీసీలవిజయబావుటా69745698120156224648212657పెద్దపల్లికరీంనగర్సిరిసిల్లజగిత్యాలజనరల్లో బీసీలుగెలిచినవి మొత్తంబీసీరిజర్వ్ -
వెహికిల్ షెడ్డు వెనక్కి!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీలో నగరపాలకసంస్థ వాహనాల పార్కింగ్కు తలపెట్టిన షెడ్డు నిర్మాణ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నారు. వాహనాల షెడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వస్థలంలో కాలనీ అభివృద్ధికి ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వెహికిల్షెడ్డు వెనక్కి నగరపాలకసంస్థ వాహనాల పార్కింగ్కు హౌసింగ్బోర్డుకాలనీలోని సమ్మక్కసారలమ్మ గద్దెల పక్కనున్న స్థలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే సప్తగిరికాలనీలో వాహనాల షెడ్డు ఉండగా, అక్కడే వాహనాలు పార్క్ చేస్తున్నారు. పారిశుధ్య, ఇతర అవసరాలకు సంబంధించి కొత్తగా 30 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, సప్తగిరికాలనీలోని షెడ్డు సరిపోకపోవడంతో మరోచోట షెడ్డు నిర్మించాలని నిర్ణయించారు. హౌసింగ్బోర్డుకాలనీలోని 728 సర్వే నంబర్ పరిధిలో దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలంలో వాహనాల షెడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవల ప్రతిపాదించారు. నాలుగు రోజుల క్రితం స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. చుట్టూ ఇండ్లు ఉన్న ఈ స్థలంలో వాహనాల షెడ్డు నిర్మిస్తే, వాహనాలు రాకపోకలు, మరమ్మతులు కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతాయని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి స్థానికులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్ ఆదేశం మేరకు షెడ్డు ప్రతిపాదనను విరమించారు. ఎస్టీపీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని సూచనాప్రాయంగా నిర్ణయించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. -
కొలువుదీరనున్న పల్లె పాలకవర్గం
కరీంనగర్టౌన్: గ్రామాల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లావ్యాప్తంగా 316 గ్రామపంచాయతీలు, 2,946 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విజయం సాధించిన సర్పంచ్లు, వార్డుమెంబర్లు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొదటగా ఈ నెల 20న ప్రమాణం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముహుర్తాలు సరిగా లేవని వచ్చిన ఫిర్యాదులతో 22వ తేదీన ప్రమాణ స్వీకారానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీల పరిపాలన సాగనుంది. ప్రత్యేకపాలన నుంచి.. గత సర్పంచ్ల పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియగా ఇన్నాళ్లు ప్రత్యేక అధికారులపాలన సాగింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడ్డారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్లు, పాలకవర్గాలతో సోమవారం నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అదేరోజు తొలి సమావేశం కొత్తపాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. చట్టప్రకారం నెలకోసారి పాలకవర్గాలు భేటీ కావాల్సి ఉంటుంది. సారి గెలుపొందిన సర్పంచ్ల్లో ఎక్కువ మంది యువకులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, సర్పంచ్లుగా పని చేసిన వారే మళ్లీ గెలుపోందడంతో అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బలబలాలు ఇవే.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకున్నా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుదారులే కావడంతో రాజకీయ రంగు అంటుకుంది. 316స్థానాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 123 స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 114, బీజేపీ మద్దతుదారులు 43, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ మద్దతుదారులు 36మంది మిగతా చోట్ల విజయం సాధించారు. నిధుల ఇక్కట్లు తీరేనా? గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. పల్లెల్లో పారిశుధ్యం, తక్షణ అవసరాలు, వీధిలైట్లు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పచ్చదనం వంటి ప్రాథమిక అంశాలు, జీపీ కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించలేక కార్యదర్శులకు పాలన తలకు మించిన భారంగా మారింది. ఖజానా మొత్తం ఖాళీ కావడంతో కొత్తసర్పంచ్లు మొదట సొంతనిధులు వినియోగించాల్సిన అవసరముంది. రెండుళ్లుగా ఆర్థిక సంఘం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. తర్వలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన వస్తుడడంతో మళ్లీ నిధుల ఇక్కట్లు తప్పేలా లేదు. సంక్రాంతి లోపు నిధులు రాకుంటే పరిషత్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. -
ఏ విద్యార్థికి దంత సమస్యలు ఉండొద్దు
కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి విద్యార్థులందరికీ దంత వైద్య పరీక్షలు చేయాలన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంకమ్మతోట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దంత చికిత్స చేశారు. కలెక్టర్ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీరును పరిశీలించారు. కార్పొరేట్ స్థాయిలో ఉచి తంగా అందిస్తున్న దంత వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 12వేల మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నామని, దంత సమస్యలతో బాధపడుతున్న 1500మందిని గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 23 వరకు మొదటి విడత క్యాంపులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ జి.వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, వైద్యులు రవి ప్రవీణ్, రణధీర్, ప్రవీణ్, రాజిరెడ్డి, మంగ, శరత్ పాల్గొన్నారు. కంగ్రాట్స్.. మేడమ్ కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ ముందు వరుస స్థానంలో నిలవడంపై ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అప్రమత్తతతోనే నష్ట నివారణ ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ, నష్టాలను నివారించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 22న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు విపత్తు నివారణ చర్యలపై చర్చించారు. -
ఎస్పీఈని పునరుద్ధరించాలి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ (ఎస్పీఈ యాక్ట్ 1976)ను పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్ఆర్యూ) కరీంనగర్శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ మాట్లాడుతూ.. నాలుగు కొత్త కార్మిక చట్టాలతో దేశంలో ఉన్న కార్మికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అనంతరం జిల్లా కార్మికశాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శులు జి.విద్యాసాగర్, ఏ.సదానందచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.అంజయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. క్రీడలకూ ప్రాధాన్యమివ్వాలికరీంనగర్రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఇంట ర్మీడియట్ అధికారి గంగాధర్ సూచించారు. బొమ్మకల్లోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల–1లో మూడు రోజుల పాటు నిర్వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. మానసిక ఒత్తి డితగ్గి, శారీరక ఎదుగుదలకు క్రీడలు దోహాదపడతాయన్నారు. మైనార్టీ గురుకులాల కో–ఆర్డినేటర్ విమల మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతా యన్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్స్ వీర్ల మహేశ్, పిడిశెట్టి సంపత్, పి.చంద్రమోహన్, కుమారస్వామి, విజిలెన్స్ అధికారి అక్రమ్పాషా, అకడమిక్ కో–ఆర్డినేటర్ మీరాజ్ పాల్గొన్నారు. ఆక్రమణలు తొలగింపుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రోడ్డు ఆక్రమణలపై నగరపాలకసంస్థ అధికారులు ఎట్టకేలకు మరోసారి చర్యలు పూనుకున్నారు.. ‘ఆక్రమణలకు అడ్డా’ పేరిట ‘సాక్షి’లో శుక్రవారం వచ్చిన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్, సిరిసిల్ల మెయిన్రోడ్డుపై ఉన్న రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగింగే రోడ్డు, పుట్పాత్ ఆక్రమణలౖపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. టీపీఎస్ తేజస్విని ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో డీఆర్ఎఫ్ సిబ్బంది ఆక్రమణలను తొలగించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల మరమ్మతు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు 11 కేవీ మహాశక్తి ఆలయం ఫీడర్ పరిధిలోని మహాశక్తి ఆలయం, సంతోష్ నగర్, బాలాజీ సూపర్మార్కెట్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. 33/11 కె.వీ.కొత్తపల్లి, రేకుర్తి, బొమ్మకల్ సబ్స్టేషన్లలో విద్యుత్ పనులు చేపడుతున్నందున మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి సబ్స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, శ్రీపురం కాలనీ, రజ్వీచమన్, సిటిజన్కాలనీ, ప్రియదర్శినికాల నీ, కృష్ణానగర్, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూర్, నల్లకుంటపల్లి, మరియాపూర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నారు. సర్వీస్ క్రమబద్ధీకరించండికరీంనగర్ అర్బన్: వీఆర్ఏ నుంచి జీపీవోలుగా నియామకమైనవారి సర్వీస్ క్రమబద్ధీకరించాలని గ్రామ పాలన అధికారులు శుక్రవారం కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని వార్డు ఆఫీసర్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా సేవలందించామని వివరించారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుతో తమ సర్వీస్ ఆగమ్యగోచరంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మాతృశాఖకు తీసుకోవడం హర్షణీయమని వివరించారు. జీపీవోల సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్పై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వీస్ క్రమబద్ధీకరణతో పాటు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయాలని కోరారు. -
ప్రజాక్షేత్రంలో పనిచేయండి
చిగురుమామిడి: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన సీపీఐ శ్రేణులు, అధైర్యపడకుండా ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడాలని పార్టీ సీనియర్ నాయకుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. చిగురుమామిడిలోని ముస్కురాజిరెడ్డి స్మారకభవనంలో శుక్రవారం పార్టీ మండలస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం ముల్కనూర్ ఉపసర్పంచ్ పైడిపల్లి వెంకటేశ్ అధ్యక్షతన జరిగింది. చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీకి కొంత నిరాశ కలిగించినప్పటికీ.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజివేకా మిషన్ గ్రామీణ పేరిట మహాత్మాగాంధీని అవమానపరుస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 22న అన్నిజిల్లాలు, మండలాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి నట్లు తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందెస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కౌన్సిల్ సభ్యులు బోయిని పటేల్, చాడ శ్రీధర్రెడ్డి, బూడిద సదాశివ, తేరాల సత్యనారాయణ, జాగిరి సత్యనారాయణ పాల్గొన్నారు. -
పార్క్ నిర్మించాలి
సమ్మక్కసారలమ్మ గద్దెల ప్రక్కనున్న స్థలంలో గతంలో ప్రతిపాదించినట్లు సీనియర్ సిటిజన్స్ పార్క్ నిర్మించాలి. ఓపెన్ థియేటర్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ తదితర సదుపాయాలతో పార్క్ను తీర్చిదిద్దాలి. కాలనీలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నందున, పార్క్ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. – తోట సాగర్, హౌసింగ్ బోర్డుకాలనీకాలనీలోని ప్రభుత్వ స్థలంలో మున్సిపల్కార్పొరేషన్ గెస్ట్హౌస్ నిర్మించాలి. నగరపాలకసంస్థ పరిధిలో ప్రస్తు తం మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్ ఎక్కడా లేదు. గతంలో ఉన్న ము న్సిపల్ గెస్ట్హౌస్ను ఇతర అవసరాలకు భవ నం నిర్మించారు. ఈ స్థలంలో గెస్ట్ హౌస్ ని ర్మిస్తే, కాలనీ అభివృద్ధికి దోహదమవుతుంది. – వాడె వెంకటరెడ్డి, హౌసింగ్బోర్డుకాలనీ -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. టవర్సర్కిల్ సమీపంలో వేసిన బీటీరోడ్డు పనులు తనిఖీ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద తాగునీటి సరఫరా పైప్లైన్ లీకేజీ మరమ్మతు పనులు పరిశీలించారు. పైప్లైన్ లీకేజీని త్వరగా అరికట్టాలని ఆదేశించారు. అశోక్నగర్లో రోడ్డు పనులు, మదీనా కాంప్లెక్స్లోని ఐడీఎస్ఎంటీ భవన ఆధునీకరణ పనులను, మానేరుడ్యాం సమీపంలోని వాకింగ్ ట్రాక్ను పరిశీలించారు. అమరవీరులస్తూపం సమీపంలో చేపట్టిన తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి లీకేజీని అరికట్టాలన్నారు. 30ఏళ్ల క్రితం వేసిన తాగునీటి ౖపైప్లైన్ కాబట్టి తరుచుగా లీకేజీలు సంభవిస్తే, శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఐడీఎస్ఎంటీ భవన ఆధునీకరణ పనులు జనవరి 1వ తేదీలోగా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలన్నారు. సప్తగిరికాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ కోసం స్థల పరిశీలన చేసి, భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలకసంస్థ ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, మాజీ డిప్యూటీ మేయర్ జి.రమేశ్ పాల్గొన్నారు. స్మార్ట్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలినిర్ణీత వ్యవధిలో స్మార్ట్సిటీ పనులు పూర్తిచేసి, జీఎంఐ పోర్టల్లో నమోదు చేయాలని స్మార్ట్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. స్మార్ట్సిటీ మిషన్ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ, స్మార్ట్ సిటీ మిషన్ నేషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ నుంచి నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. -
మేడారం జాతరకు 700 బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజు కరీంనగర్టౌన్:జనవరిలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు మరమ్మతులు, భక్తుల సురక్షిత ప్రయాణంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్. భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఖర్చు దాచితే కుర్చీ గల్లంతే
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాక గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ల ఖర్చులెక్క చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డగోలుగా ఖర్చుచేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి ఎక్కువ కాకుండా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే పదవి గల్లంతయ్యే అవకాశముంది. ఖర్చు చేయడం ఒక ఎత్తయితే.. దానిని నిబంధనల ప్రకారం తగ్గించి లెక్కచెప్పడం తలకు మించిన భారంగా అభ్యర్థులు భావిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల లెక్కలను 45 రోజుల్లోగా ఎంపీడీవోలకు సమర్పించి రశీదు తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసారి సదరు వివరాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ– పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. గడువులోపు సమర్పించకపోతే వేటే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలను అప్పచెప్పకుంటే అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు... వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీవోలకు అప్పగించాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడినవారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. 316 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలు ఉండగా 316 పంచాయతీలు, 2,946 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్లు నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదముంది. ఈ మేరకు కొత్త సర్పంచ్లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. కరీంనగర్స్పోర్ట్స్: శాతవాహన యూనివర్సిటీలోని సైన్స్ కళాశాలలో శనివారం వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ క్రీడాశాలను ప్రారంభించారు. క్యారమ్ ఆడి విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. క్రీడలతో శారీరక దృఢత్వం వస్తుందని, విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. ప్రిన్సిపాల్ ఎస్.రమాకాంత్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మున్వర్, కృష్ణ కుమార్ పాల్గొన్నారు.ఈ తేదీల్లోగా సమర్పించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు మెంబర్ పోటీ చేసే అభ్యర్థి అయితే రూ. 30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2,50,000 వరకు... వార్డు అభ్యర్థి రూ.50,000 వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026, జనవరి 24 లోపు, రెండో విడత జనవరి 27న, మూడో విడతలో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలి. -
పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్గా విజయం సాధించాడు. -
హుజూరాబాద్ రుణం తీర్చుకుంటా
హుజూరాబాద్/ఇల్లందకుంట: రాజకీయ జన్మనిచ్చి, శాసనమండలి సభ్యుడిగా నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డరుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లను సత్కరించారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా 30కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, ఇల్లందకుంట ఆలయ చైర్మన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ కరీంనగర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22నుంచి గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందును పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రాధమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం కరీంనగర్ జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయకపోవడంతో గొర్రెకాపరులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్పందించిన ప్రభాకర్ వెంటనే సంబంధిత పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వద్దకు మల్లేశం బృందాన్ని తీసుకెళ్లారు. నట్టల మందు పంపిణీ చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 22నుంచి మందు పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో మంత్రులకు మల్లేశం కృతజ్ఙతలు తెలిపారు. అడహక్ కమిటీ సభ్యులు కాల్వ సురేశ్, దాడి అంజనేయులు, సతీశ్, రంజిత్, రవీందర్, వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు. బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి కరీంనగర్టౌన్: సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశాడని, 42శాతం రిజర్వేషన్లపై చెప్పేదొకటి, చేసేదొకటి అని, పరిషత్ ఎన్నికలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో శనివారం మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం.. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమైక్య కార్యదర్శి తవటం సత్యం, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి కాలువ మధుబాబు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరిగె కోటేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ల మహేశ్ పాల్గొన్నారు. రేషన్కు ఈకేవైసీ తప్పనిసరి కరీంనగర్ అర్బన్: రేషన్ కార్డుదారులందరూ తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. జిల్లాలో 3,17,748 రేషన్కార్డులుండగా 9,45,605 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. ఇందులో 7,20,517 మంది మాత్రమే ఈ– కేవైసీ చేసుకున్నారని, మిగతా రేషన్కార్డుదారులు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి సదరు ప్రక్రియను పూర్తి చేయాలని వివరించారు. కార్డుదారుతో పాటు కార్డులో ఉన్నవారంతా రేషన్ దుకాణంలో వేలిముద్ర, ఐరిస్ చేయించుకోవాలని సూచించారు. -
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా. ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్గా ఎన్నికై న జీల రాజుయాదవ్కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. -
సమష్టి కృషి అభినందనీయం
కరీంనగర్అర్బన్/కరీంనగర్టౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఎన్నికలను విజయవంతంగా పూర్తి కాగా జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఎంపీడీవోలు శనివారం అదనపు కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఆయా మండలాల ఎంపీడీవోలు కీలకంగా పని చేశారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. -
వ్యక్తి మృతిపై అనుమానాలు
● అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పోలీసులకు ఫిర్యాదు ● పోస్టుమార్టంకు తరలించిన అధికారులు ● అనుమానాస్పద మృతిగా కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
రాజన్న ఎన్కౌంటర్కు 40 ఏళ్లు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి ప్రాంతంలోని రెబ్బల్దేవులపల్లి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన అ ప్పటి పీపుల్స్వార్, ప్రస్తు త మావోయిస్టు పార్టీకి చెందిన దళనేత తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్న చనిపోయిన ఆదివారం నాటికి 40 ఏళ్లు. పీడిత, తాడిన ప్రజల పక్షాన పెద్దపల్లి గడ్డపై గళమెత్తిన ధీరుడు రాజన్న. దొరలను గడగడలాడించిన వీరుడు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని రెబ్బల్దేవులపల్లిలోని ఓ ఇంట్లో తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్నతోపాటు ధర్మారం మండలం ఖానంపల్లికి చెందిన చంద్రయ్య ఉరఫ్ శీనన్న షెల్టర్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు రాజన్న, శీనన్న షెల్టర్ తీసుకున్న గుడిసెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం కావటంతో తొలు కానిస్టేబుల్ నర్సయ్య మృతిచెందారు. ఆగ్రహం చెందినపోలీసులు.. గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆనాటి జ్ఞాపకాలు జిల్లా ప్రజల మదిలో ఇంకా మెదలుతూనే ఉన్నాయి. రాజన్న చనిపోయిన 40 ఏళ్లు కావడంతో భార్య తుంగాని రాధక్క, కూతురు క్రాంతి, కుటుంబసభ్యులు ఆయనను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యున్ని కోల్పోయి కన్నీటిపర్యంతమయ్యారు. స్మరించుకున్న కుటుంబసభ్యులు -
అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ ఎన్నికల జాబితా విస్తృత సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధారణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గం ఓట్లు కరీంనగర్ 3,68,166చొప్పదండి 2,35,849మానకొండూరు 2,26,385హుజురాబాద్ 2,52,351రామగుండం 2,19,723మంథని 2,39,699పెద్దపల్లి 2,57,192కోరుట్ల 2,48,270జగిత్యాల 2,39,114ధర్మపురి 2,33,182సిరిసిల్ల 2,23,115వేములవాడ 2,13,284 ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధి, వలసలు, వివాహా లు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూ డు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మ డి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకు కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది. -
సమస్యలపై అవగాహనతో..
బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి 2014 నుంచి లాయర్గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు. కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. -
చెక్డ్యాం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి చెక్డ్యాంను ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సాయంత్రం పరిశీలించారు. మూడురోజుల క్రితం చెక్డ్యాం కూలిపోగా ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు చెక్డ్యాం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మానేరులో పడిపోయిన గోడ బండరాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంపిళ్లు సేకరించారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి వాటిని పరీక్షిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. -
సుడా భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (సుడా) కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని నగరపాలకసంస్థ కమిషనర్, సుడా వైస్చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని సిక్వాడీలో నూతనంగా నిర్మిస్తున్న సుడా కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పునాది, పిల్లర్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత డిజైన్ ప్రకారం సుడా కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ చేపడుతున్న ప్రతి పనిపై ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, సుడా డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. 713 మందికి షోకాజ్ నోటీసులు కరీంనగర్టౌన్: మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు జిల్లా విద్యాధికారి, గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ ఆఫీసర్లుగా విధులు కేటాయించినప్పటికీ కొందరు విధులకు హాజరు కాలేదని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అసౌకర్యం ఏర్పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు, సీసీఏ నియమాల ప్రకారం సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. -
చలితీవ్రతకు వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు. లారీ ఢీకొని ఒకరు..కోరుట్ల: కోరుట్ల బస్టాండ్ ఇన్గేట్ సమీపంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన దశరథ్ సోనాజి ఉసరె శనివారం బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో దశరథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన ఆయన కొంతకాలంగా కోరుట్లలో ప్లంబింగ్ పని చేస్తున్నాడు. బంధువుల ఫిర్యాదుమేకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ అలీ(70) అనేడు వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పాతబస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్న మహబూబ్ అలీని బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మహబూబ్ అలీ మృతి చెందాడని అతని కుమారుడు రషీద్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాపీ మేస్త్రీ ఆత్మహత్యసిరిసిల్ల క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన తాపీమేస్త్రీ చిద్రాల రవీందర్(45) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే వివాహాలు జరగగా, కుటుంబ పోషణకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతోపాటు మరో కూతురి వివాహం ఎలా చేయాలనే ఆలోచనలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలోనే తాను మేస్త్రిగా పనిచేస్తున్న ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గదుల నిర్మాణానికి స్థల పరిశీలన మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆల య పరిసరాల్లో 96 గదుల సత్రం నిర్మాణానికి రూ.35.19కోట్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఇంజినీరింగ్ అధికారులు కొండగట్టులో స్థల పరిశీలన చేశారు. ఆలయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై చర్చించారు. కొండగట్టులో 96గదుల సత్రం భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసినట్లు ఇంజినీర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, అధికారులు పాల్గొన్నారు. -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్లో గోల్మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ -
నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్కు ఫోన్పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు. బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు -
మోడల్ విలేజ్గా..
మా ఆయన విజయ్కుమార్ సైన్యంలో చేరి దేశరక్షణ కోసం సేవలందించారు. ఆయన స్ఫూ ర్తి, ప్రోత్సాహంతో ప్రజా సేవ చేయాలన్న తపనతో సర్పంచ్గా పోటీచేశా. గ్రామస్తులంతా తనకే అండగా నిలవడంతో 1,124 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఎ మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన. గ్రామాభివృద్ధికి పాటుపడతా. గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతా. పెద్దపల్లి: భోజన్నపేట గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎంకాం, డీఈడీ, బీఈడీ చదువుకున్న. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ వర్తింప జేసేలా అధికారులను కోరుతా. గ్రామంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని పరిష్కరిస్తా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. -
జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్తోపాటు ఓనర్ విజయ్ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రయాగ్రాజ్కు మరిన్ని ప్రత్యేక రైళ్లు రామగుండం: ధనుర్మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 23, 24, 25, 26వ తేదీల్లో 07402/03/04/05 రైళ్లు ప్రయాగ్రాజ్కు నడుస్తాయన్నారు. ఇవి చర్లపల్లిలో రాత్రి 7.45గంటలకు బయలుదేరి కాజీపేటకు రాత్రి 9.42 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.50గంటలకు, మంచిర్యాలకు అర్ధరాత్రి 12.35గంటలకు చేరుకుంటాయన్నారు. రెండోరోజు వేకువజామున 4.30గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటాయని వివరించారు. -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో.. విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జ యశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వ చ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చే శారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపా టు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షి ఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో పనిచేస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు. -
ఆక్రమణలకు అడ్డా..!
నగరంలోని శనివారం అంగడి చౌరస్తా వద్ద ఉన్న ఎస్ఆర్ఆర్ కాంప్లెక్స్లోని దుకాణదా రులు ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణలు తొలగించినా.. కొద్ది రోజులకు షరా మా మూలుగానే ఫుట్పాత్తోపాటు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు.నగరంలోని గీతాభవన్ చౌరస్తా నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే కరీంనగర్, సిరిసిల్ల మెయిన్ రోడ్డుపైనే దుకాణాలున్నాయి. టూటౌన్ పోలీసుస్టేషన్ ముందున్న షాపు ఏకంగా రోడ్డుపైనే కొనసాగుతోంది. ఇక్కడ ఫుట్పాత్లే కాదు.. రోడ్డుపై వైట్ లైన్ కూడా కనిపించని పరిస్థితి. గతంలో బల్దియా అధికారులు తొలగించినా.. మళ్లీ యథాస్థానంలోనే వ్యాపార సామగ్రి ఆక్రమించుకుంది. -
15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్కు చెందిన 15 ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతుండగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లో అలోజెనిక్ బోన్ మ్యా రో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలు డు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్ల డించారు. గురువారం కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ.. హెమటాలజీ, బోన్ మ్యా రో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమియా, లింఫోమాస్, మల్టీపుల్ మై లోమా, అప్లాస్టిక్ అనీమియా, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు పెద్దలు, పి ల్లలకు సమగ్ర చికిత్స అందిస్తున్న ట్లు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీల ను నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా యశోద హాస్పిటల్స్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. -
బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్కాస్ట్ –1, ఎక్స్టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్గ్రౌండ్ కోల్మైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, వకీల్పల్లి మైన్తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం.. బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్కాస్ట్గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్పల్లి మైన్ను కూడా ఓపెన్కాస్ట్గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజల ప్రధానమైన డిమాండ్లు ● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి ● ఓపెన్కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు ● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు ● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి. నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తొమ్మిది గ్రామాల్లో భూమి.. వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన -
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరి ధిలో సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం రేకుర్తి,హౌసింగ్బోర్డుకాలనీల్లోని జాతర నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. జనవరిలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.కరీంనగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన బీమారంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు అతిపెద్ద విఘాతంగా పరిణమించనున్నదని ఎల్ఐసీ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు సతీశ్ అన్నారు. బిల్లు, బీమా చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఇప్పటివరకు ఉన్న 74శాతం పరిమితిని 100శాతం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చి పడతాయ ని, కొత్త టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తుందని, ఇన్సూరెన్స్ విస్తరణ మరింతగా దేశం నలుమూలలకు పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు అబద్ధాలని రుజువైందన్నారు. రామ్మోహన్రావు, సూర్యకళ, వామన్రావు, బసవేశ్వర్, అనుపమ పాల్గొన్నారు.పత్తి మార్కెట్కు మూడురోజులు సెలవుజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,450 పలికింది. గురువారం మార్కెట్కు 19వాహనాల్లో 144 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకాని కి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.6,800కు వ్యాపారులు కొనుగోలు చే శారు. మార్కెట్కు శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు సెలవులుంటా యని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయ ని ఇన్చార్జి కార్యదర్శి రాజా పేర్కొన్నారు. 27న ఎస్యూలో మెగా జాబ్మేళాసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో ఈనెల 27న మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఆవరణలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ వంటి 50కి పైగా కార్పొరేట్ కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
పైసలు పాయే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలుబడే వరకూ విజయం తనదేననే ధీమాతో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నిక ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా.. ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు.సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్: జిల్లాలోని 316 గ్రామ పంచాయతీలు 2,946 వార్డుస్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 8 సర్పంచ్, 657 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ఖర్చుచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకు నేందుకు డబ్బు, మద్యంతోపాటు విలువైన బహుమతులూ అందజేశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు నగదు కూడా పంపిణీ చేశారు. చాలామంది ఆస్తులు విక్రయించగా, కొందరు మరీ అప్పు తీసుకొచ్చారు. ఓటమి పాలయ్యాక అప్పులే మిగిలాయని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గెలిచిన వారు సైతం అప్పుచేసి గెలిచామని, ఎలా తీర్చాలన్న మదనతో ఉన్నారు. ఖర్చుకు వెనుకాడలేదు.. సర్పంచ్తోపాటు వార్డుస్థానాల్లోని అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు. రూ.లక్షల్లో వెచ్చించారు. చెక్పవర్ ఉండడంతో రిజర్వేషన్ కలిసిరాని పంచాయతీల్లో వార్డుస్థానాల్లో పోటీచేసిన కొందరు ఉప సర్పంచ్ పదవి చేజిక్కించుకోవాలని వ్యూహం పన్నారు. వార్డు అభ్యర్థులు.. సర్పంచ్ అభ్యర్థులతో సమానంగా ఖర్చు చేశారు. ఫలితం తేడా రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తే గెలుపు ‘నల్లేరుపై నడకే’నని భావించిన కొందరు ఓటమి చెందారు. తమ ఓటమికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషించుకుంటున్నారు. నగదు పంపిణీ, తమ క్యాంపులో ఉంటూ ప్రత్యర్థికి సహకరించిన వారెవరనే కారణాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. రెబల్స్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు.. పార్టీలో ఉండి రెబల్స్కు సహకరించిన వారిని గుర్తించి, వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేస్తున్నారు. వారిపై ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీలకు సహకరించిన వారిపై తమ పార్టీ ముఖ్యనాయకులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు.. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ఈసారి పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా రిజర్వేషన్ కలిసి వస్తే ఓడిపోయిన సానుభూతితో ఎంపీటీసీగా గెలవవచ్చని భావిస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల వేళ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాల సమయంలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవచ్చని పరిషత్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్యాంప్ఫైర్లో నృత్యం చేస్తున్న క్రిస్టియన్లుసింగరేణి సంస్థ చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. – సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లోu తీగలవంతెనను కమ్మేసిన మంచు దుప్పటిమొగ్ధుంపూర్లో ఉదయిస్తున్న సూర్యుడు చెర్లభూత్కూర్లో లైట్లు వేసుకుని వస్తున్న లారీజిల్లాలో చలి వణికిస్తోంది. కొన్ని రోజుల నుంచి చలితీవ్రతతో ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. నగరశివారులోని తీగలవంతెన, ప్రధాన రహదారులపై ఉదయం 8 గంటల వరకు పొగ మంచు వీడడం లేదు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పొగమంచు నిండిపోయింది. రాజీవ్ రహదారి, రాయపట్నం స్టేట్ హైవే, మొగ్ధుంపూర్– నగునూరు రహదారి కన్పించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొద్ది రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్/ కరీంనగర్రూరల్మంచు కురిసే వేళలో.. -
గల్ఫ్లో గుండెపోటుతో ఎల్లారెడ్డిపేటవాసి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పుట్టి న ఊరిలో ఉపాధిలేక బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఓ వలసజీవి గుండెపోటుకు గు రై మృతిచెందాడు. ఈ సంఘటనతో ఎల్లారెడ్డిపేట మండ ల కేంద్రంలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలనర్సు(40) గత 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. బాలనర్సు మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య దేవ కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆమె వేడుకుంటుంది. వలస కార్మికుడి ఆత్మహత్యరుద్రంగి(వేములవాడ): రు ద్రంగి మండల కేంద్రంలో బుధవారం రాత్రి వలస కా ర్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ నుంచి రుద్రంగికి వచ్చిన వలసకార్మికుడు సన్ని(25) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. రుద్రంగి పోలీసులు శవ పంచనామా చేసి మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారిపై దాడిజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధికారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులురాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. -
పంచాయతీ కిక్కు రూ.151కోట్లు
కరీంనగర్క్రైం: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఎకై ్సజ్శాఖకు కాసులవర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.151 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27వ తేదీన విడుదల కాగా... డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 94 మద్యం దుకాణాలు, 34 బార్లు ఉన్నాయి. 17 రోజుల వ్యవధిలో ఎన్నికల సందర్భంగా 1,16,963 కాటన్ల మద్యం, 1,57,659 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయని ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మూడు దఫాలుగా పోలింగ్ జరిగింది. ఆయా ప్రాంతాల్లో రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేశారు. ఆయా సందర్భాల్లో పక్క ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసుకెళ్లారు. మొత్తంగా కొత్త మద్యం పాలసీలో దుకాణాలు దక్కించుకున్న వారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోణీ కొట్టగా మంచి ఆదాయం సమకూరుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందుకు మరిన్ని ఎన్నికలు ఉండడంతో ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా వేడినీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలోపే అల్పాహారం తిన్నాం. – మాధవి, ఉపాధ్యాయురాలు ఏర్పాట్లు బాగున్నాయ్ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. మాకు రాత్రిబస చేసేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు కలుగకుండా స్థానిక అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది పంచాయతీ ఎన్నికల విధులను నిర్వహించడం సంతృప్తినిచ్చింది. పోలింగ్ సమయానికల్లా సిద్ధంగా ఉండేంలా సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. – సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
ప్రభుత్వ విద్యార్థులకు దంత పరీక్షలు
కరీంనగర్టౌన్/కరీంనగర్ అర్బన్/మానకొండూర్: జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12వేల మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న దంత వైద్య శిబిరాన్ని గురువారం సందర్శించారు. జిల్లావ్యాప్తంగా 9వేల మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయని, 24మందికి చికిత్స అందించామన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, డెంటల్ నిపుణులు రవి ప్రవీణ్, రణధీర్, సాహిత్య, ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు. కుష్ఠును శాశ్వతంగా నిర్మూలించాలి కుష్ఠువ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశ వర్కర్లు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టి కుష్ఠు రోగులను గుర్తించాలన్నారు. ఈనెల 18 నుంచి 31వరకు సర్వేచేసి అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్వో రాజగోపాల్, ఉమాశ్రీ, తహసీల్దార్ విజయ్కుమార్, సల్మాన్ పాల్గొన్నారు. శభాష్.. ఎన్నికల సేన ఎన్నికల నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటింది కరీంనగర్. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసిన మొదటి జిల్లాగా నిలిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం కలెక్టర్తో పాటు యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఇందుకు సహకరించిన అధికారులు, పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు. సాధారణ పరిశీలకుడు వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ను సన్మానించారు. -
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ కార్యాలయ ముట్టడితో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షతో నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ ఆందోళన నిర్వహించింది. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా, మార్గమధ్యలో కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొన్నారు. కాంగ్రెస్కు పోటీగా డీసీసీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు చౌరస్తా నుంచి జ్యోతినగర్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు ర్యాలీగా బయల్దేరారు. కోర్టు వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు. అదుపులోకి తీసుకొని పీటీసీకి, టూటౌన్పోలీసు స్టేషన్కు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంను బాలాజీనగర్లోని ఆయన నివాసంలో హౌస్అరెస్ట్ చేశారు. సత్యం తన ఇంటి గేటు దూకేందుకు పలుమార్లు ప్రయత్నించగా, పోలీసులు వారించారు. నిరంకుశ పాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఆటలు ఇక సాగవని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్రెడ్డి, మల్లికార్జున రాజేందర్, కాశెట్టి శ్రీనివాస్, సిరాజు హుస్సేన్, బానోతు శ్రావణ్ నాయక్, అరుణ్ కుమార్, కల్వల రామచందర్, లింగంపల్లి బాబు పాల్గొన్నారు. డీసీసీ ముట్టడికి బీజేపీ యత్నం కాంగ్రెస్ నాయకుల బీజేపీ ఎంపీ కార్యాలయ ము ట్టడికి నిరసనగా డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు బయలుదేరడంతో పోలీ సులు అరెస్టు చేశారు. మాజీ మేయర్ సునీల్రావు, పార్టీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ మాట్లాడుతూ బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఈ కేసును రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటోందన్నారు. -
కొట్టుకుపోయిందా.. కూలగొట్టారా?
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరుపై నిర్మించిన చెక్డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మానేరుపై చెక్డ్యాం నిర్మించగా బుధవారం వేకువజామున సుమారు పది మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వెళ్లి వచ్చిన కాసేపటికే చెక్డ్యాం కొట్టుకు పోయిందని చెబుతున్నారు. గత నవంబర్లో జిల్లాలోని గుంపుల వద్ద చెక్డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. అదే తరహాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 16 చెక్డ్యాంలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం రూ.128కోట్లు వెచ్చించింది. ఇందులో మంథని మండలం అడవిసోమన్పల్లి, చిన్నఓదాల, గోపాల్పూర్ ప్రాంతాల్లో చెక్డ్యాంలు ఉన్నాయి. అడవిసోమన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాం అవతలివైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బుంగపడి.. కుంగిపోయిందా..? కొద్దిరోజుల క్రితం చెక్డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉందని, ఈక్రమంలో బుంగతోనే కుంగిపోయి కొట్టుకుపోయిందని స్థానికులు అంటున్నారు. నాణ్యతపై ఆరోపణలు.. చెక్డ్యాంల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్డ్యాంలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు వినిపించాయి. కానీ భారీవర్షాల సమయంలో కొట్టుకుపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరద తాకిడితో కొట్టుకుపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన.. చెక్డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్ ఏఈ నిఖిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు. ఘటనపై అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కూలిన అడవిసోమన్పల్లి చెక్డ్యాం నాసిరకమా?.. కావాలనే కూల్చారా? పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు చెక్డ్యాం కొట్టుకుపోవడంపై అనుమానాలు -
కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విజయ్నగర్లో నివాసముంటూ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఆవుల రమేశ్(50) బుధవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు వన్టౌన్ ఏఎస్సై వెంకటేశ్వరబాబు తెలిపారు. ఏడాదిన్నర క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. భార్య కాపురానికి రావడంలేదని తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్సై వివరించారు. మృతుడి తల్లి ఆవుల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. విద్యార్థి మృతితో రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుర్రం శరత్రెడ్డి(20) కరీంనగర్లో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కరీంనగర్లోని తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు రేపాక నుంచి సోమవారం బైక్పై మరో ఫ్రెండ్తో కలిసి వెళ్లాడు. కరీంనగర్లోని ఎల్ఎండీ వద్ద రాజీవ్ రహదారిపై స్కూటీ ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శరత్రెడ్డిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపుతప్పి ఒకరి దుర్మరణం● మరొకరి పరిస్థితి విషమం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని వారసంత సమీపంలో బుధవారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పింగిలి బబ్బులు(25)తీవ్రగాయాలతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఒజ్జం వినయ్(22) తీవ్రంగా గాయపడగా.. కరీనంగర్ తరలించారన్నారు. వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బైక్ అదుపుతప్పి మోరీ గోడకు ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
ఉపసర్పంచ్ పదవికి వేలం
● ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత ● రంగంలోకి దిగిన పోలీసులు ధర్మపురి: ధర్మపురి మండలం కమలాపూర్లో బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కుమ్మరి తిరుపతి గెలుపొందారు. ఉపసర్పంచ్ పోటీలో ఉన్న కొందరు తనకంటే తనకు అంటూ రసాభాస చేశారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఉపసర్పంచ్ పదవికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ వేలానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ కార్మికుడికి గాయాలు జూలపల్లి (పెద్దపల్లి): అబ్బాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొమ్మెనవేని చంద్రయ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పనినిమిత్తం అబ్బాపూర్ నుంచి జూలపల్లికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో స్థానిక కొచ్చెరువుకు సమీపంలో ఆటోను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈఘటనలో కాలితీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 వాహనం సిబ్బంది ఆరె సతీశ్, ఈఎంటీ, పైలెట్ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఉద్యాన రైతుకు చేయూత
కరీంనగర్రూరల్: వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక పద్ధతులు, ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలను రైతులు సాగు చేసేందుకు వీలుగా యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లాకు 86 యూనిట్లు మంజూరు చేసింది. దశాబ్దం తర్వాత.. గతంలో వ్యవసాయంతోపాటు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీ చేస్తున్నారనే సాకుతో సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేశారు. దీంతో పలువురు రైతులు ప్రైవేట్గా పరికరాలను కొనుగోలు చేయడంతో ఆర్థికంగా భారం పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు 86 యూనిట్లు మంజూరు కాగా.. అర్హులైన రైతుల నుంచి ఉద్యాన శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 49 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలకు సంబంధించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకుంది. పరికరాల కొనుగోలుపై 5 ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు 40 శాతం సబ్సిడీని అందిస్తారు. ప్రభుత్వం సబ్సిడీపై ఉద్యాన రైతులకు యంత్ర పరికరాలను అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. పరికరాలు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. – అయిలయ్య, ఉద్యాన శాఖ అధికారి, ఉమ్మడి కరీంనగర్ మండలంపవర్ వీడర్లు: 18, బ్రష్ కట్టర్లు: 29 పవర్ స్ప్రేయర్లు: 27, పవర్ టిల్లర్లు: 9 మినీ ట్రాక్టర్లు: 3 -
వేతనం.. సతమతం..
కరీంనగర్ అర్బన్: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 2 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు.. మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్లుగా మూడు నెలలు, నాలుగు నెలలకోసారి వేతనమిస్తూ ఉద్యోగులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ఆపరేటర్ నుంచి ఏపీవో వరకు.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్), టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 15, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 274 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే రెండు నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్ సాఫ్ట్వేర్లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోటి పైనే.. ఉపాధిహామీలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.25వేల నుంచి రూ.30వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.50.25లక్షల చొప్పున 2 నెలలకు గాను రూ.1.05కోట్లు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. తగ్గని టార్గెట్లు.. వేతనాలు పెండింగ్లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న టార్గెట్ ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన తండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి. 2 నెలలుగా అందని వైనం ఆందోళనలో ‘ఉపాధి’ ఉద్యోగులు -
యాప్తోనే జనగణన
కరీంనగర్ అర్బన్: సాగుతూ.. ఆగిన జనగణన ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కనుంది. గత నాలుగేళ్లుగా జనగణనపై ప్రభుత్వ ప్రకటన.. అంతలోనే వాయిదా వంటివి జరగగా ఈ సారి పక్కాగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే బ్లాకులుగా విభజించిన అధికారులు మరో 20రోజుల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా లెక్కలతో పాటు ఇళ్లు, కట్టడాల వివరాలతో పాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఇక సదరు ప్రక్రియ అంతా స్మార్ట్ఫోన్లోనే జరగనుండగా ఇంటర్నెట్ లేకున్నా యాప్ పని చేయనుంది. ఒక్కో ఇల్లు రెండుసార్లు పరిశీలన స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసిన జనగణన యాప్లోనే వివరాలను నమోదు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతుండటంతోనే ఆఫ్లైన్ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జనగణన కార్యక్రమం చేపట్టనుండగా ఎన్యుమరేటర్లకు జనవరి, ఆ తదుపరి రెండు దశల్లో శిక్షణనిస్తారు. ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లకు రెండు దశల్లో వెళ్లి వివరాలు నమోదు చేయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబరులోగా మొదటి దశ కింద ప్రతి ఇల్లు, కట్టడం వివరాలన్నీ సేకరించనుండగా రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. నాలుగేళ్లుగా సా..గదీత 2019లోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్–19 క్రమంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2018లో అందుకు సంబంధించిన ప్రక్రియ జరగగా కరోనా నీళ్లు చల్లింది. కోవిడ్–19 నేపథ్యంలో వాయి దా పడుతూ రాగా అన్ని సక్రమంగా ఉంటే జనవరిలో జనగణన ప్రక్రియ షురూ కానుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, నూతన మండలాలు, కొ త్త మున్సిపాలిటీలు వాటి పరిధిలో నివాసాలెన్ని, ఎ ంత మంది సిబ్బంది అవసరమనేది తేల్చారు. భౌ గోళిక స్వరూపం క్రమంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇచ్చిన ఇంటి నంబర్ల ఆధారంగా బ్లాకులుగా విభజించారు. ప్రతీ గ్రామం, మండలం, జిల్లా జనగణన పటాలను సిద్ధం చేశారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు.. ఛార్జ్ ఆఫీసర్లు తహసీల్దార్లు ఎన్యుమరేట్ బ్లాక్లకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్లో వివరాలను రూపొందించారు. జిల్లాలో 316 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలుండగా 2.62లక్షల నివాసాలున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో నిర్మాణమైన కొత్త భవనాలను పరిగణలోకి తీసుకున్నారు. కాగా ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను తీసుకోనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించనుండగా పర్యవేక్షకులుగా స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం, యంఆర్సీలను నియమించనున్నారు. మొత్తం బ్లాక్ల సంఖ్య క్రమంలో 402మంది పర్యవేక్షకులు అవసరం. మండలస్థాయిలో ఛార్జ్ ఆఫీసర్గా తహసీల్దార్, అదనపు ఛార్జ్ అఫీసర్గా ఎంపీడీవో వ్యవహరించనుండగా మండల ప్రణాళిక, గణాంక అధికారులు డీలింగ్ అసిస్టెంట్లుగా వ్యవహరించనున్నారు. మరో 20రోజుల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఏప్రిల్ నుంచి జనగణన ప్రక్రియ షురూ ఎన్యుమరేటర్ రెండుసార్లు ఇంటి వివరాలు సేకరించాల్సిందే ఇంటర్నెట్ లేకున్నా యాప్లో నమోదు జిల్లా జనాభా: 10,05,711 నివాసాలు: 2,58,485కుటుంబాలు: 2,90,6572011 జన గణనలో బ్లాక్లు.. కొత్తగా 2021 జనగణన బ్లాకుల ఏర్పాటు వివరాలు మండలం 2011 2022 గంగాధర 89 101 రామడుగు 104 114 చొప్పదండి 61 71 కరీంనగర్ రూరల్–1 55 65 కరీంనగర్ రూరల్–2 53 63 గన్నేరువరం 55 56 మానకొండూరు 128 133 తిమ్మాపూర్ 83 94 చిగురుమామిడి 83 91 సైదాపూర్ 79 93 శంకరపట్నం 81 101 వీణవంక 91 96 హుజూరాబాద్ 124 79 జమ్మికుంట 139 83 ఇల్లందకుంట 69 69 మున్సిపాలిటీ 2011 2021 కరీంనగర్ 388 808 చొప్పదండి 26 50 హుజూరాబాద్ 46 109 జమ్మికుంట 73 116 -
ఎన్నికలు తెచ్చిన పంచాయితీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలోని ఓ వర్గంలో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయితీని తెచ్చి పెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో ఇటీవల రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కాగా ఓ వర్గానికి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ బరిలో పోటీచేయగా ఆవర్గం వారు సదరు అభ్యర్థికే ఓటేయాలని తీర్మానించారు. సుమారు 500 ఓట్లు ఉన్న ఆ వర్గం వారి ఓట్లలో 150 వేరే అభ్యర్థికి పోల్ కావడంతో అతడు విజయం సాధించాడాని తేల్చారు. దీంతో బుధవారం గ్రామంలోని ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. తమ అభ్యర్థి రూ.లక్షలు ఖర్చుచేసి పోటీలో ఉంటే ఓట్లు వేరే వారికి ఎలా వేస్తారని చర్చించుకున్నారు. ఓ మహిళ దీనంతటికి కారణమని గుర్తించి ఆమెను కూడా నిలదీశారు. ప్రశాంతంగా ఉండే పచ్చని పల్లెలో ఎన్నికలు చిచ్చు రేపాయాని గ్రామస్తులు చర్చించుకుంటున్నా రు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
సెంచరీ కొట్టిన బీజేపీ
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టు పెంచుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో వంద సీట్లకు పైగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటారు. తొలి, మలి దశలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 76 స్థానా లను కై వసం చేసుకుంది. గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడలోని విజయనగర్ కాలనీ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై న సంగతి తెలిసిందే. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా 112 స్థానాల్లో పోటీ చేస్తే బుధవారం వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే అందులో 24 స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంది. మూడు దశలో బీజేపీ సెంచరీ కొట్టింది. గెలిచిన అభ్యర్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్లకు అభినందనకరీంనగర్ కార్పొరేషన్/చిగురుమామిడి: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఇటీవల విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో మంత్రులను కలిశారు. మంత్రులు సర్పంచ్లను సన్మానించారు. రేకొండ సర్పంచ్ అల్లెపు సంపత్ కాంగ్రెస్లో చేరగా, మంత్రి పొన్నం కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో చర్లభూత్కూర్, చామనిపల్లి, దుబ్బపల్లి బహదూర్ఖాన్ పేట్, జూబ్లీ నగర్, ఎలబోతారం, ఫకీర్పేట్, చేగుర్తి, నల్లగుంటపల్లె, ఓగులాపూర్, ఇందుర్తి, లంబాడిపల్లి, సీతారాంపూర్, నవాబుపేట్, కొండాపూర్, ఉల్లంపల్లి సర్పంచ్లు పాల్గొన్నారు. పెన్షన్ భిక్ష కాదు.. హక్కుకరీంనగర్ అర్బన్: పెన్షనర్లకు పెన్షన్ భిక్ష కాదని రాజ్యాంగబద్ధమైన హక్కని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ పెన్సనర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో భవన్లో తెలంగాణ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి, కార్యదర్శి ఎలదాసరి లింగయ్య అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ.. తమ వద్దకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక కుటుంబ, ఆర్థిక సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని, పెన్షనర్లు ఎవరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నరసయ్య, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్షణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సంగ్రామం
సైదాపూర్: సూచనలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిపర్యవేక్షిస్తున్న సీపీ గౌస్ ఆలంమండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు పోలైన ఓట్ల శాతం ఇల్లందకుంట 26,100 22,720 11,175 11,544 87.05 హుజూరాబాద్ 35,945 30,891 14,915 15,976 85.94 జమ్మికుంట 28,929 24,798 12,149 12,649 85.72 వీణవంక 42,659 36,630 18,140 18,489 85.87 వి.సైదాపూర్ 31,415 27,598 13,619 13,978 87.85 మొత్తం 1,65,046 1,42,637 69,998 72,636 86.42 -
అతివలదే అంతిమ తీర్పు
పంచాయతీ పోరులో..కరీంనగర్ అర్బన్: ఎన్నికల సం‘గ్రామం’లో అతివలే నిర్ణేతలయ్యారు. జిల్లాలో మొత్తం 316 గ్రామ పంచాయతీలకు గానూ 126 గ్రామాల్లో మహిళలే గ్రామ ప్రథమ పౌరురాలిగా సేవలందించనున్నారు. గ్రామ సర్పంచ్ల నిర్ణయంలో మహిళల ఓట్లే కీలకమయ్యాయి. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక, చిగురుమామిడి మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగగా అన్ని విడతల్లోనూ అతివలే అఽత్యధికంగా ఓట్లు వేశారు. ఎక్కడా పురుష ఓటర్ల ఆధిక్యం కనిపించకపోవడం విశేషం. అత్యధికంగా గంగాధర మండలంలో 2,171 మంది మహిళలు పురుష ఓటర్ల కన్న ఎక్కువ మంది ఓట్లు వేయగా అత్యల్పంగా శంకరపట్నం మండలంలో వంద మహిళా ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేశారు.మండలం పురుషులు మహిళలు మహిళల ఆధిక్యం ఇల్లందకుంట 11,175 11,544 369 హుజూరాబాద్ 14,915 15,976 1,061 జమ్మికుంట 12,149 12,649 500 వీణవంక 18,140 18,489 349 సైదాపూర్ 13,619 13,978 359 చొప్పదండి 11,145 12,008 863 గంగాధర 16,293 18,464 2,171 కరీంనగర్ రూరల్ 9,233 9,438 205 కొత్తపల్లి 6,810 7,259 449 రామడుగు 16,023 17,411 1,388 చిగురుమామిడి 14,585 14,913 328 గన్నేరువరం 7,533 7,902 369 మానకొండూరు 24,360 24,967 607 శంకరపట్నం 16,617 16,717 100 తిమ్మాపూర్ 15,919 16,670 751జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో థర్డ్ జెండర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 12 మంది ఓటర్లుండగా 8మంది ఓటేయగా నలుగురు ఓటు వేయలేదు. చిగురుమామిడిలో ఒకరు ఉండగా ఓటు వేయకపోగా మానకొండూరులో ఒకరుండగా ఓటు వేశారు. చొప్పదండిలో ఒకరు, గంగాధరలో ఇద్దరికి ఒకరు ఓటేశారు. కరీంనగర్ రూరల్లో ఒకరు, రామడుగులో ముగ్గురుండగా ఒకరు ఓటేశారు. ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఒక్కొ ఓటరుండగా అందరూ ఓటేశారు. అవును.. అక్షరాల 75,548 మంది ఓటర్లు ఓటు వేయలేదన్నది సుస్పష్టం. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5,02,457 ఓటర్లకు గానూ 4,26,909 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 84.96శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 15 మండలాల్లోని 316 గ్రామ పంచాయతీలకు గానూ 312 గ్రామాల్లో పోలింగ్ జరగగా ఎక్కడా 90శాతం పోలింగ్ నమోదు కాలేదు. తొలి విడతలో 28,320 మంది ఓటర్లు ఓటు వేయకపోగా రెండో విడతలో 24,819, మూడో విడతలో 22,409 మంది ఓటు వేయలేదు. గంగాధర, కొత్తపల్లి మండలాల్లో ఓటేయనివారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత జమ్మికుంట నిలుస్తుంది. -
పట్టు పెంచుకున్న ‘బండి’
● ఈటల బలపర్చిన అభ్యర్థి ఒక్కరే గెలుపు హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అభ్యర్థులను బరిలో దింపిన మల్కాజ్గిరి ఎంపీ ఈట ల రాజేందర్కు భంగపాటు ఎదురైంది. మెజారి టీ గ్రామాల్లో అభ్యర్థులను పోటీలో దింపగా.. పోతిరెడ్డిపేట సర్పంచ్ అభ్యర్థి సుమలత సురేందర్ మాత్రమే గెలుపొందారు. హుజూరాబాద్ మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బలపర్చిన అభ్యర్థులు ఐదుగురు గెలుపొందారు. కందుగుల, బొత్తలపల్లి సర్పంచ్ అభ్యర్థులు మహేశ్, బాసవోయిన శ్రీనివాస్ ఉన్నా రు. రాంపూర్లో ముశం సంగీత గణేశ్ స్వతంత్రులుగా పోటీ చేసి వెంటనే బీజేపీలో చేరారు. శాలపల్లి సర్పంచ్గా గెలిచిన కొడిగూటి ప్రవీణ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చిన్న పాపయ్యపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి బండి సంజయ్ అభిమాని. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఒకటి, రెండ్రోజుల్లో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. -
తలరాత మార్చిన ఒక్కఓటు
కరీంనగర్అర్బన్/ ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/ బుగ్గారం/సుల్తానాబాద్ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మూడు విడతల్లో జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరగగా బుధవారంతో తుది సమరం ముగిసింది. ఒక్కో విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఫలితాలు ఆసక్తికరంగా ఉండటం విశేషం. ఒక్క ఓటూ ఎంత కీలకమో స్పష్టం చేసింది. మెజారిటీ అటుంచితే విజయమే అతి కష్టంపై వరించింది. టై: కరీంనగర్ రూరల్ మండలంలోని బహుదూర్ఖాన్పేట గ్రామ పంచాయతీ 1వ వార్డులో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు లభించగా టై అయింది. మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్ కాగా బుర్ర మారుతి, బుర్ర సంపత్కుమార్, బుర్ర తిరుపతిలకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. డ్రా తీయగా మారుతి గెలుపొందారు. 01: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పెద్దూరుపల్లి గ్రామ సర్పంచిగా పోటీచేసిన రామడుగు హరీశ్ ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ సర్పంచ్గా పొన్నాల సంపత్ ఒకే ఓటు ఆధిక్యతతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థికి ఏకానందంకు 642 ఓట్లు రాగా సంపత్కు 643 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో సర్పంచ్ అభ్యర్థులు అంజిత్రావుకు 437 ఓట్లు, ధర్మరాజుకు 438 ఓట్లు వచ్చాయి. ధర్మరాజును ఒక్కఓటు తేడాతో విజయం వరించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో ఉమ్మెంతల శోభకు 213, పల్లెలక్ష్మికి 212 ఓట్లు రాగా.. ఒక్కోటు తేడాతో శోభ సర్పంచ్గా గెలిచారు. 02: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచిగా గోదరి శోభారాణి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కనకలక్ష్మిపై 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శోభా రాణికి 324 ఓట్లు పోలవగా కనకలక్ష్మికి 322 ఓట్లు పోలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో కాశోల్ల పద్మకు వంద ఓట్లు రాగా, రొడ్డ భాగ్యకు 102 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో భాగ్య సర్పంచ్గా విజయం సాధించారు. 03: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ సర్పంచ్గా శ్రీలత ఎన్నికయ్యారు. అగ్గని శ్రీలతకు 505 ఓట్లు పోలవగా రాసమల్ల అనూషకు 502 ఓట్లు పోలయ్యాయి. కేవలం మూడు ఓట్లతో శ్రీలత సర్పంచ్గా గెలుపొందారు. 06: చొప్పదండి మండలంలోని రేవెల్లి గ్రామ సర్పంచ్గా బందారపు అజయ్కుమార్ 6 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి రాజిరెడ్డిపై గెలుపొందారు. అజయ్కుమార్కు 385 ఓట్లురాగా ప్రత్యర్థి రాజిరెడ్డికి 379 ఓట్లు పోలయ్యాయి. రామడుగు మండలంలోని కిష్టాపూర్ గ్రామ సర్పంచ్గా వేల్పుల మల్లేశం తన ప్రత్యర్థిఽ తిరుమల్పై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మల్లేశంకు 145 ఓట్లు రాగా తిరుమల్కు 139 ఓట్లు పోలయ్యాయి. 07: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో కల్లూరు బాపురెడ్డి ఏడు ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందాడు. తన సమీప ప్రత్యర్థి నమిలికొండ శ్రీనివాస్పై 7 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. 08: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లెలో సర్పంచ్గా చొప్పరి శైలజ ప్రత్యర్థి పన్నాల స్వరూపపై 8 ఓట్ల తేడాతో గెలుపొందారు. 10: జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామ సర్పంచ్గా సంఘం అమృత సమీప ప్రత్యర్థిపై 10ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా పలువరు సర్పంచ్, వార్డు సభ్యులు ఓటు తేడాతో గెలుపొందారు. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
హుజూరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే శాఖాఫరమైన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం అన్నారు. మూడో విడత ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో మంగళవారం డివిజన్వ్యాప్తంగా హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ వేళ ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలా భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద నిఘా పెంచాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. నిబంధనలకనుగుణంగా విధులను నిర్వర్తించాలని అన్నారు. ఏసీపీ మాధవి తదితరులున్నారు. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
హుజూరాబాద్/జమ్మికుంట/ఇల్లందకుంట: మూడో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు–2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, వీణవంక, సైదాపూర్ మండలాల్లోని పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. హుజూరాబాద్ మండలానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జమ్మికుంట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఇల్లందకుంట మండలానికి సీతారామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతీ కౌంటర్, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు జిల్లాకేంద్రానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఆర్డీవో రమేశ్బాబు, ఇల్లందకుంట తహసీల్దార్ రాజమల్లు, ఎంపీడీవో రాజేశ్వర్రావు, ఎంఈవో రాములునాయక్, ఎస్సై క్రాంతికుమార్ తదితరులున్నారు. -
బిడ్డను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి..
● వ్యవసాయబావిలో ఆటోపడి మహిళ మృతి జూలపల్లి(పెద్దపల్లి): తన కూతురు యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చిన తల్లి అనూహ్యంగా మృత్యుఒడిలోకి చేరుకుంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట – ధూళికట్ట మధ్య మంగళవారం చోటుచేసుకుంది. ఘటనలో బోమ్మగాని చిలుకమ్మ(55) దుర్మరణం చెందింది. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం ముంజంపెల్లికి చెందిన బోమ్మగాని చిలుకమ్మ.. తన కూతురు రమ్యను ధూళికట్టకు చెందిన దుర్గం నగేశ్కు ఇచ్చి వివాహం చేసింది. రమ్యను చూసేందుకు చిలుకమ్మ ఇటీవల ధూళికట్టకు వచ్చింది. ముంజంపెల్లిలో బుధవారం జరిగే ఎన్నికల్లో చిలుకమ్మ ఓటువేయాల్సి ఉంది. ఆమెను తీసుకెళ్లేదుకు కుమారుడు సతీశ్ ధూళికట్టకు వచ్చాడు. ఈక్రమంలో బావ దుర్గం నగేశ్తో కలిసి సతీశ్ మద్యం తాగారు. ఆ తర్వాత నగేశ్ తన ఆటోలో అత్త చిలుకమ్మ, బామ్మర్ది సతీశ్ను తీసుకుని చీమలపేటలో దింపేందుకు బయలు దేరాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి వ్య వసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఆటోలోని చిలుకమ్మ నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెంది. నగేశ్, సతీశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతురాలి కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఫణి శివాజీ(35) కడుపునొప్పి భరించలేక క్రిమిసంహరిక మందుతాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పొత్కపల్లి ఏఎస్సై కిషన్ కథనం ప్రకారం.. శివాజీ 2021లో బెటాలియన్ కానిస్టేబుల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సెలవులపై స్వగ్రామమైన కొమిరకు వచ్చారు. గ్రామంలో తనకున్న రెండు ఎకరాల పొలం వద్దకు నిత్యం వెళ్లి వ్యవసాయ పనులు చూసుకునేవారు. ఈక్రమంలో మంగళవారం అక్కడకు వెళ్లగా కడుపునొప్పి వచ్చింది. భరించలేక అక్కడే క్రిమిసంహరిక మందుతాగారు. స్థానికులు గమనించి సుల్తానాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య తేజస్విని, కుమారుడు(2) ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవునిపల్లిలో యువకుడు.. పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కె.గణేశ్(27) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారులోని మంథని ఫ్లైఓవర్ వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మానసిక, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు(2) ఉన్నట్లు వివరిబంచారు. కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ఇప్పుడు గులాం
సర్పంచ్గిరీకి ఓ సలాం..సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ పదవికి ఎంతో మంది నామినేషన్లు వేసి పోటీలో ఉన్నారు. చదువుకున్న విద్యావంతులు, సమీప బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు బంధాలను మరిచి బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటాపోటీగా నీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నెన్నో వ్యూహాలు అమలు చేశారు. మందు విందులు, నోట్ల పంపిణీ, చీరల పంపిణీ ఇలా అభ్యర్థులు చేయని ప్రలోభాలు లేవు. ఆఖరికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లోనూ వేలం పాటలు, భూమిని విరాళంగా ఇవ్వడం, ఊరందరికీ అక్కరకు వచ్చే పనులు చేసేందుకు నగదు ఇవ్వడం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్కోక్కరు రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఊరిలోనే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన పదవీ కాంక్ష ఏమేరకు ప్రభావం చూపిందో అర్థమవుతుంది. ఇవీ గ్రామాల్లో గతానుభవాలు శాసించే తుపాకుల మధ్య గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఆఖరికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలున్నాయి. గ్రామాల్లో చీకటి పడిందంటే చాలు పోలీసుల బూట్ల చప్పుడు, నక్సలైట్ల తుపాకుల మోతలతో తెల్లవారేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఊరికి దూరంగా పట్టణాల్లో నివాసం ఉండేవారు. కొందరైతే రాత్రి అయితే ఊరు విడిచి వెళ్లేవారు. అనేక సందర్భాల్లో నక్సలైట్లు ప్రజాప్రతినిధులను పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ.. టార్గెట్ చేసి భౌతికదాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రామాభివృద్ధికి వచ్చే జవహర్ రోజ్గార్ యోజన(జేఆర్వై) నిధులను మింగారంటూ, అనేక మంది సర్పంచులపై దాడులు జరిగాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది ‘సర్పంచ్ గిరీకి ఓ సలాం.. మాకు వద్దు ఆ పదవి’ అంటూ దూరంగా ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. అందుకు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే తాజా ఉదాహరణగా నిలుస్తాయి. గతం గాయాలు ఇవీ.. ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, మాజీ సర్పంచ్లను మావోయిస్టు, జనశక్తి నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ హత్య చేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సర్పంచ్ రాధాకిషన్రావును నక్సలైట్లు హత్య చేశారు. ఇదే మండలం సుద్దాల మాజీ సర్పంచ్ ఏనుగు ప్రభాకర్రావు అలియాస్ వేణుగోపాల్రావును మారుపాక శివారులో చంపేశారు. ● చందుర్తి మండలం రామారావుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పోతుగంటి భాస్కర్ను చంపేశారు. ● ఎల్లారెడిపేట మండలం కంచర్లకు చెందిన మాజీ సర్పంచ్ సూర వెంకటిని, ఇదే మండలం సింగారంకు చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య ను, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ ఎల్సాని మల్లయ్యను నక్సలైట్లు చంపేశారు. ● గంభీరావుపేట మండలం గజసింగారంకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డిని కాల్చి చంపారు. ● జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన మాజీ సర్పంచ్ బచ్చు నందంను హత్య చేశారు. ● పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీపతి రాజయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ తుల సుధాకర్రావును, ఇదే మండలం పెద్దరాతిపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డిని చంపేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక మంది నక్సలైట్ల తూటాలకు బలి అయ్యారు. నక్సలైట్లు చేసిన భౌతికదాడులకు లెక్కే లేదు. ఇలాంటి పరిస్థిల్లో రెండు దశాబ్దాల కిందట సర్పంచ్ పదవి ముళ్ల కిరీటంలా భావించి తమకు వద్దు అనేవారు. కానీ, నక్సలైట్ల కదలికలు క్షీణించడంతో పల్లెల్లో ఎన్నికల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు వచ్చాయి. నాడు పోటీకి నై.. నేడు సై.. మారిన పల్లె ముఖచిత్రం రెండు దశాబ్దాల కిందట పల్లెల్లో కల్లోలం ప్రాబల్య ప్రాంతాల్లో ‘అన్నలదే’ రాజ్యం ఇన్ఫార్మర్ల పేరిట సర్పంచ్లను హత్య చేసిన నక్సలైట్లు -
కుష్ఠు నిర్మూలనే లక్ష్యం
కరీంనగర్/పెద్దపల్లి: కుష్ఠు నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వ్యాధిని తొలదశలోనే గుర్తించి చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటా రెండోవిడత సర్వేకు శ్రీకారం చుట్టింది. ఏటా రెండుసార్లు సర్వే నిర్వహిస్తోంది. ఈఏడాది మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు తొలివిడత సర్వే నిర్వహించింది. అప్పుడు కరీంనగర్ జిల్లాలో సుమారు వెయ్యి మందికిపైగా, పెద్దపల్లి జిల్లాలో 216మంది అనుమానితులను గుర్తించారు. పరీక్షల అనంతరం కరీంనగర్లో 8 మంది, పెద్దపల్లి జిల్లాలో ఏడుగురికి వ్యాధి ఉన్నట్లు తేలింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన రెండోవిడతలో కరీంనగర్ జిల్లాలో 2 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల 9,372 ఇళ్లలో సర్వే చేస్తారు. ఇందుకోసం కరీంనగర్లో 645 మంది ఆశ కార్యకర్తలు, 250 మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, సూపర్వైజర్లు, పెద్దపల్లి జిల్లాలో 638 మందితో సర్వే చేయన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 29 మందికి చికిత్స అందిస్తున్నారు. చర్మంపై మచ్చలు కనిపించినా, కాళ్లు, చేతులు చచ్చుబడినా వైద్యుల ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంపై స్ప ర్శలేని మచ్చలు, నరాలవాపు, నొప్పితెలియని పుండ్లు, ముఖంపై గుళ్లలు, చేతులు, పాదాల తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తే కుష్ఠుగా అనుమానిస్తారు. వ్యాధి లక్షణాలు.. ● చర్మంపై స్పర్శలేని రాగిరంగు మచ్చలు. చెవులపై బుడిపెలు, కణితులు, నరాల తిమ్మిర్లు. ● మందమైన మెరిసే జిడ్డుగల చర్మం ● కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం ● కనురెప్పలు మూతపడకపోవడం ● చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం ● చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం ● కాళ్ల చెప్పులు జారిపోవడం ● చల్లని, వేడివస్తువులు గుర్తించకపోవడం ● పాదాలు, మడమల్లో వాపు రావడం ● ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం. చికిత్స విధానం.. కుష్ఠు నివారణకు రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తారు. శరీరంపై మూడు మచ్చలు ఉన్నవారికి పాసివ్బ్యాసిలరీ(పీబీ) విధానంలో ఆరు నెలల పాటు చికిత్స అందిస్తారు. ఐదు మచ్చలకు పైబడి ఉన్నవారికి మల్టీబ్యాసిలరీ(ఎంబీ) విధానంలో చికిత్స చేస్తారు. ఇందులో భాగంగా నెలకు ఒకసారి మందులను పేషెంట్ల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తారు. సర్వేలో గుర్తించిన బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందజేయడంతోపాటు ఆ వ్యాఽధిపై అవగాహన కల్పిస్తారు. బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. బాధితులకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. 12 నెలల పాటు చికిత్స.. మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మక్రిమితో కుష్టు సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చర్మం, నరాలకు సోకుతుంది. లక్షణా లు బహిర్గతమయ్యేందుకు సగటున 3ఏళ్ల నుంచి 5ఏళ్ల సమయం పడుతుంది. వ్యాధి ఎవరికై న రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6నెలల నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు. వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే రేపటి నుంచి 31వరకు ఇంటింటా సర్వే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు -
రేకుర్తి కంటి ఆసుపత్రికి విరాళం
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా.భాస్కర్ మడేకర్ ఉదార నేత్ర వైద్యశాలకు ఐడీబీఐ బ్యాంకు రూ.74,08,700 భారీ విరాళం సీఎస్ఆర్ కింద అందజేసినట్లు ఆసుపత్రి చైర్మన్ కె.వేణుమూర్తి తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రెటీనా డిపార్ట్మెంట్లో మాడ్యులర్ మూడు ఆపరేషన్ థియేటర్లు, అశోక్ ల్యాండ్ బస్ గురించి ఈ విరాళం డబ్బును ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ ఆపరేషన్లతోపాటు గ్లకోమా, మెల్లకన్ను, రెటీనా వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ గురువారం ఉచితంగా కంటి(తెల్ల రేషన్ కార్డు, 50 ఏళ్ల వయస్సు తప్పనిసరి) ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని అన్నారు. కేవలం హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్న రెటీనా డిపార్టుమెంటును సుమారు రూ.5కోట్ల బడ్జెట్తో రేకుర్తి ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేణుమూర్తితోపాటు ఆసుపత్రి ప్రతినిధులు సురేశ్, ప్రకాశ్హొల్లా, పవన్కుమార్, ఇంజనీర్ అన్నారెడ్డి, డా.టి.మురళీధర్రావు, శరత్కృష్ణ, శివకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆఖరి పోరాటం!
హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సామగ్రితో బయల్దేరుతున్న సిబ్బంది జిల్లా పంచాయతీలు ఏకగ్రీవాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కరీంనగర్ 111 03 02 00 00 01 పెద్దపల్లి 91 06 06 00 00 00 జగిత్యాల 119 06 06 00 00 00 సిరిసిల్ల 87 07 02 02 00 03 మొత్తం 408 22 16 02 00 04 సాక్షిప్రతినిధి,కరీంనగర్: గ్రామ పంచాయతీ తుది పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మమైన ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆదినుంచీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఆదినుంచీ తన పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ రెండు విడతల ఎన్నికల్లో ఇదే దృశ్యం కనిపించింది. కీలకమైన మూడో విడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇక ఆఖరి పోరాటంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తుండగా.. ఇప్పటివరకు 64 సీట్లు గెలిచిన బీజేపీ.. 100 సీట్లకు పైగా గెలుపొంది సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డేందుకు ఆఖరి ఎన్నికల బరిలోకి దిగాయి. ఆగని డబ్బు, మద్యం పంపిణీ.. తొలి రెండు విడతల్లో మద్యం, డబ్బు పంపిణీతో అభ్యర్థులు చేతులు కాల్చుకున్నా.. మూడో విడతలోనూ అవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. సర్పంచ్ బరిలో ఉన్నవారు ఎక్కడా తగ్గడం లేదు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మేందుకు సిద్ధమవుతు న్నారు. ఓటర్లకు తాయిలాలిచ్చి ప్రలోభాలకు గురిచేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకే పరిమితమవగా.. జగిత్యాల జిల్లాలో ఒకడుగు ముందుకేసి ఓటర్లకు ఏకంగా వెండి నాణేలు పంచు తుండడం విశేషం. ఇంత జరుగుతున్నా.. ప్రలోభాలను పోలీసులు పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదన్న విమర్శలు ఆగడం లేదు.ఇప్పటివరకు తొలివిడత 398 గ్రామాలు, రెండోవిడతలో 418 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 436 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ మద్దతిచ్చిన చోట 224 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీజేపీ సపోర్ట్తో 64 మంది సర్పంచులుగా గెలిచారు. ఇతరులు 87 మంది స్వతంత్ర సర్పంచులుగా ఎన్నికయ్యారు. కీలకమైన మూడో విడతలో 436 స్థానాల్లో కనీసం 300 వరకు స్థానాలను వశపరచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సగానికిపై సీట్లు గెలవాలని బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. రెండో విడత ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రులు, బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చిన వారిని, మూడో విడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో కలిపి 800 వరకు సర్పంచుల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాలోని 408 గ్రామాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
తీర్థయాత్రలకు స్పెషల్ లగ్జరీ బస్సులు
కరీంనగర్ టౌన్: తీర్థయాత్రల కోసం ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతోంది. ఇప్పటికే ఆయా పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను ప్రారంభించిన అధికారులు కొత్తగా ఉడిపి, గోకర్ణ, గోవా, కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ దర్శనం కోసం బస్సులు ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్–1, 2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 24న కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్, మైహర్, రామ్ టెక్, చందా మహంకాళి, చిత్రకూట్ తదితర ప్రాంతాల సందర్శన కోసం బయలుదేరుతుందన్నారు. వివరాల కోసం 7382849352, 9959225920, 80746 90491 నంబర్లకు కాల్చేయాలని సూచించారు. కరీంనగర్–2 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి 27న సాయంత్రం 6 గంటలకు హంపి, హరిబేరు, కుక్కి, శృంగేరి, ఉడిపి, మృగేశ్వర్, గోకర్ణ తదితర ఆలయాల సందర్శన కోసం బయలు దేరుతుందని వివరించారు. పెద్దలు, పిల్లల టికెట్ల వివరాలు, ఇతర సమాచారం కోసం 9398658062, 7382850708, 8978383084 నంబర్లకు ఫోన్చేయాలని సూచించారు. నీటిపారుదల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా లక్ష్మణ్రావుతిమ్మాపూర్: నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అడ్హక్ కమిటీ కన్వీనర్ టీఎన్జీవోస్ కరీనంగర్ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు నియమితులయ్యారు. రాష్ట్ర మేజర్ టెంపుల్ ఎంప్లాయీస్ జేఏసీ కోకన్వీనర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యాయుల చంద్రశేఖర్ ఎల్ఎండీ నీటిపారుదలశాఖ కార్యాలయంలో లక్ష్మణ్రావును సత్కరించారు. కొండగట్టు అంజన్న శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగారపు రమేశ్ గౌడ్, తిమ్మాపూర్ టీఎన్జీవో యూనిట్ ప్రెసిడెంట్ పోలు కిషన్, కరీంనగర్ జిల్లా అసోషియేట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, నాయకులు ప్రసాద్, పవన్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
పెన్షనర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి గ్రంథాలయం, టీవీ ఇతరత్రా అన్నిరకాల పుస్తకాలు ఏర్పాటు చేసి భవనంలో యోగా, సాహిత్యం తరగతులు నిర్వహిస్తున్నాం. పింఛన్దారులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం. ఏటా డిసెంబర్ 17న పెన్షనర్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. –మోసం అంజయ్య, రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆనందంగా ఉంది ఉద్యోగ విరమణ అనంతరం అంతా ఒకచోట కలిసి కూర్చోవడం, ఒకరి బాధల్ని మరొకరు పంచుకోవడం, సామాజిక సేవల్లో భాగస్వామ్యమవడం ఆనందంగా ఉంది. ఒంటరి వాళ్లం కాదు అన్న సంకేతాన్ని పింఛన్దారులకు అందిస్తున్నాం. సామాజిక సేవలో భాగస్వాములమవుతాం. –దామెర మహేందర్రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బస్చార్జీల్లో రాయితీ కల్పించాలి మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వం కూడా రిటైర్డు ఉద్యోగులకు బస్సు ప్రయాణాల చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించాలి. మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించి హెల్త్కార్డులు మంజూరు చేయాలి. 65 ఏళ్లు నిండిన పెన్షనర్కు పంజాబ్ రాష్ట్రం ఇస్తున్నట్లు అదనపు పెన్షన్ను జమచేయాలి. –దాసరి రామయ్య, పెన్షనర్ -
సమర్థతకు సలాం.. కావొద్దు గులాం
కరీంనగర్ అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. గ్రామ తలరాతను మార్చే శక్తి ఓటరుదే. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తవగా.. తుది విడతగా బుధవారం ఎన్నికలు ముగియనున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రచారం పూర్తి చేశారు. ఈ క్రమంలో ఓటరు ఓటు ప్రాధాన్యం చాటేలా తీర్పునివ్వడమే ఉత్తమం. ఇటీవల ఫలితాల్లో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులుండగా.. ఓట్లు సమానంగా వచ్చి టాస్తో గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు కీలకమేనన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ప్రలోభాలకు లొంగకుండా ఓటరు తనదైన శైలిలో ఓటును సద్వినియోగం చేసుకోవడం అత్యవసరం. ఆ ఊరును గుర్తుంచుకోండి.. ఓటర్లంతా సింగారంను మరిపించేలా వ్యవహరించడం సుపరిపాలనకు బీజం వేసినట్లే. మహబూ బాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రా మంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఏ ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 875 మంది ఓటర్లుండగా.. అందరూ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నా.. పోలింగ్ రోజున స్వగ్రామం చేరి అందరూ ఓటేశారు. నిష్పక్షపాతం.. కులం, మతం, వర్గం, కుటుంబం, తమవారంటూ పక్షపాతం చూపకుండా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఉండాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపకుండా లక్షిత వర్గానికి అందేలా చూడాలి. సమన్వయంతో.. గ్రామంలో ఏమేం సమస్యలున్నాయి.. వాటి పరిష్కార మార్గాలు.. నిధుల సమీకరణలో చాకచక్యం ఉండాలి. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకెళ్లేవారే అవసరం. గ్రామంలో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఇతర నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామసభలు నిర్వహించి నిర్ణయం మేరకు అడుగులేయాలి. శాంతియుతంగా.. ప్రజల సమస్యలు తనవిగా భావించి, ప్రజా ప్రయోజనమే ముఖ్యమనే వారు కావాలి. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం, గ్రంథాలయం తదితర వసతుల కల్పనపై దృష్టి పెట్టే నేర్పరి అవసరం. గ్రామంలో ఘర్షణలు, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి. శాంతియుత వాతావరణం ఉండేలా చొరవ చూపాలి. పారదర్శకత.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా గ్రామ సర్పంచ్ వద్దకే వెళ్తారు. సర్పంచ్గా గెలిచినవారు కొందరు పట్టణాలకు వెళ్తుంటారు. స్థానికంగా ఉండి ప్రజల కష్టాల్లో భాగమయ్యే వ్యక్తి కావాలి. అలాగే వచ్చే నిధులను సొంత అవసరాలకు కాకుండా.. గ్రామానికే పారదర్శకంగా వినియోగించాలి. ప్రతీ రూపాయికి లెక్క చూపేవారు కావాలి. జవాబుదారీతనంగా ఉండాలి. -
దేహదానానికి తల్లీబిడ్డల అంగీకారం
జ్యోతినగర్(రామగుండం): తమదేహాలు దానం చేసేందుకు తల్లీబిడ్డలు అంగీకరించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సామ శిరీష, ఆమె తల్లి శారద తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తమ మరణానంతరం నేత్రాలు, అవయవాలతోపాటు శరీరాన్ని కూడా దానం చేస్తామని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష చదువుతోపాటు విలువలు కూడా బోధించాల్సిన బాధ్యతను ఆచరణలో చూపించారు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె తల్లి శారద సదాశయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అవయవదాన అవగాహన కార్యక్రమాల ప్రభావంతో ఈ మహత్తర నిర్ణయానికి వచ్చారు. మరణానంతరం ఇతరులకు చూపు, జీవితం అందించడంతో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా శరీరాన్ని దానం చేయాలని శారద తన కూతురు శిరీషకు తెలియజేశారు. తల్లి ఆలోచనను గౌరవించిన శిరీష కూడా అదే బాటలో నడుస్తానంటూ తల్లితో పాటు తాను కూడా అవయవాలు, శరీరాన్ని దానం చేస్తానని అంగీకరించారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ కృష్ణానగర్లో తల్లి, బిడ్డ ఇద్దరూ తమ అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు. సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, జిల్లా సలహాదారు తడబోయిన రామన్న వారిని శాలువాతో సత్కరించారు. ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, భీష్మాచారి, వాసు, వెద్దీ అనంతరాములు, కవిత, రఘురాం తదితరులు ప్రశంసించారు. -
సామాజిక సేవలో మేము సైతం
కరీంనగర్టౌన్: ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించి విరమణ పొంది సంఘటితమై సంఘం ఏర్పర్చుకున్నారు. తమ హక్కుల సాధనకోసమే కాకుండా వృద్ధులకు మూడు నెలలకోసారి ఉచిత వైద్యశిబిరాలు, యోగాశిక్షణ తరగతులు, చెట్లు, మొక్కలు నాటడం, గ్రంథాలయంలో పఠనం సాగించడం, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడం, చలివేంద్రాల ఏర్పాటు లాంటి సేవా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం పెన్షనర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. గ్రంథాలయం, చెస్, క్యారం.. పెన్షనర్ భవన్లో ఒక గదిలో గ్రంథాలయం, హాల్లో టీవీతో పాటు, క్యారం, చెస్ ఆడేందుకు గదులతో పాటు దినపత్రికలు అందుబాటులో ఉంటాయి. రూ.2లక్షల విలువైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉండడంతో వివిధ పుస్తకాలు చదవడం పెన్షనర్లు అలవాటుగా మార్చుకున్నారు. అలాగే సంఘం సభ్యుల కుటుంబ సభ్యులు చనిపోతే గ్రూప్గా వెళ్లి నివాళి అర్పిస్తారు. నేడు వేడుకలు ఇందిరానగర్లోని పెన్షనర్స్ భవన్ కార్యాలయంలో 75 ఏళ్లు నిండిన పెన్షనర్ల దంపతులను బుధవారం సన్మానించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిగా డిప్యూటీ డైరెక్టర్ యు. నాగరాజు హాజరుకానున్నారు. టీఎన్జీవో భవన్లో పెన్షనర్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 మండలాల్లో 31 శాఖలతో 300 మండల యూనిట్లతో 15 వేల మంది పెన్షనర్ల సభ్యత్వంతో సొంత భవనాలు ఏర్పర్చుకోని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. విజయవంతం చేయాలి కరీంనగర్ అర్బన్: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం టీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేఽశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలదాసరి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ పెన్షనర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెన్షనర్లు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం.. సేవా కార్యక్రమాలు నెలనెలా సమావేశాలు జిల్లాలో 15 వేల మంది పెన్షనర్లు నేడు పెన్షనర్స్ డే -
జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవ్..
జగిత్యాల: ‘నీ వ్యక్తిగత పనుల కోసం జగిత్యాల ఆ త్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవ్.. కోరుట్ల వారు జి ల్లాకేంద్రానికి వస్తున్నారని అంటున్నావ్.. జిల్లాకేంద్రం అందరిదీ.. ఎవరైనా రావచ్చు.. మెడికల్ కళా శాల విద్యార్థులకు మంచి విద్య అందాలని అడిగే హక్కు నాకూ ఉంది. నేను వ్యక్తిగత విమర్శలు చే యలేదు..’ అంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై ఫైర్ అయ్యా రు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కా ర్యాలయంలో మాట్లాడారు. తన కృషితోనే జగిత్యాలకు మెడికల్ కళాశాల వచ్చిందని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పరి పాలన సౌలభ్యం కోసం కేసీఆర్ జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసి మెడికల్ కళాశాల మంజూరు చేశారని చెప్పారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు ఒక డాక్టర్గా మంచి విద్య అందాలని సందర్శించడం తప్పా.. అని ప్రశ్నించారు. తాను ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. సంజయ్ కుమార్లో ఆత్మవిశ్వాసం తక్కువ.. అభద్రత ఎక్కువగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లా అంటే ఏంటి..? జిల్లాలో ఏమేం ఉంటాయి..? ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని సూచించారు. తన నాన్న కాంట్రాక్టర్ కాదని, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి ఆస్పత్రుల గురించి అసెంబ్లీలో అడిగి హక్కులు సాధించుకున్నానని, తాను కోరుట్లలో రాజీనామా చేస్తా.. సంజయ్ జగిత్యాలలో రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. ఆయన వెంట మారు సాయిరెడ్డి, రాజేశ్, దశరథరెడ్డి, లక్ష్మీరెడ్డి, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నట్లు? కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లా ఏర్పాటు చేశారు జిల్లాకేంద్రానికి అందరూ వస్తారు.. అందులో తప్పేంటి..? నేను రాజీనామా చేస్తా... నువ్వు రాజీనామా చేయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్ -
ఉపాధిహామీని నిర్వీర్యం చేసే కుట్ర
కరీంనగర్ కార్పొరేషన్: మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని సుడా చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధిహామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని ఖండించారు. కేవలం కాంగ్రెస్కు పేరు వస్తుందనే కుట్రపూరితంగా మహాత్మాగాంధీ పేరును తొలగించారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా కూలీ రేట్లు, పని దినాలు పెంచని ప్రభుత్వం కొత్త బిల్లు పేరిట నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు బల్లలు చరచడం కాదని, బిల్లును వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, మేకల నర్సయ్య, రమణారెడ్డి, సుదర్శన్, మేరాజ్, మాసుంఖాన్, తోట అంజయ్య, బషీర్, పెద్దిగారి తిరుపతి, కొట్టె ప్రభాకర్, అష్రఫ్, బత్తుల రాజ్కుమార్, బషీర్, భారీ, సాయిరాం, ఉప్పరి అజయ్, యోనా తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు ముకుతాడు!
కరీంనగర్ అర్బన్: యూరియా అక్రమాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు యూరియా తరలుతుండగా.. లక్షిత వర్గానికే చేరేలా యాప్ను అందుబాటులోకి తెస్తోంది. ఈనెల 20 నుంచి యాప్ అందుబాటులోకి రానుండగా.. ఈనెల 18, 19ల్లో వ్యవసాయ అధికారులకు శిక్షణనివ్వనున్నారు. ప్రస్తుతం ఆధార్/బయోమెట్రిక్తో యూరియా పంపిణీ చేస్తుండగా.. యాప్ అందుబాటులోకి రాగానే స్లాట్ విధానంలో యూరియా పంపిణీ చేయనున్నారు. వానా కాలం సీజన్లో యూరియా కోసం రైతులు బారులు తీరడం, పలు మండలాల్లో అవసరం మేరకు లభ్యం కాకపోవడంతో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రైతులకు సరిపడా లభించేలా కొత్తగా బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 3.38లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. రెండు సీజన్లు కలిపి 90వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. పత్తి పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నట్లే.. రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. విడతలవారీగా.. రైతులు ఒకేసారి కాకుండా విడతలవారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదెకరాల్లో భూమి ఉ న్న రైతులు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్లోనే బుకింగ్.. యూరియా బుకింగ్ యాప్లో పట్టాదారు పాసు పుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్కు ఓటీపీ వస్తుంది. సదరు నంబర్ నమోదు చేయగానే రైతుకు ఎన్ని ఎకరాలుంది.. ఏ పంట వేశారనే వివరాలతోపాటు ఆ పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం, బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రీటైలర్ లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆలోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్టాక్లోకి వెళ్తుంది. ఈ యాప్తో జిల్లా మొత్తంలో యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉందనే సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు సైతం తెలిసిపోతుంది. ప్రస్తుతం ఆధార్తో పంపిణీ కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎంఎఫ్ఎంఎస్) ప్రవేశపెట్టి వ్యాపారులతోపాటు సంఘాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లు సరఫరా చేసింది. ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేసి రైతుల వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్న్రాు. దీంతో ఆధార్ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నారో పీఓఎస్ మిషన్లలో తెలుస్తుంది. అధికంగా తీసుకొని నిల్వ చేసుకునే వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వేరేవారి ఆధార్ తీసుకొస్తే సంబంధిత రైతు చరవాణికి వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. పంట వివరాలెలా.. ఇదిలా ఉండగా.. యాసంగి క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి వరకు పూర్తి కాదు. అలాంటప్పుడు రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనేది ఎలా నిర్ధారిస్తారు? ఏ ఆధారంగా యూరియా కేటాయిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఒకే సమయంలో రైతులకు యూరియా అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి లక్ష మంది రైతులు నమోదు చేసుకుంటే యాప్ పని చేస్తుందా? సర్వర్ సపోర్ట్ చేస్తుందా?. 15 రోజులకోసారి.. 15 రోజులకోసారి యూరియా ఇస్తారు. అయితే మొదటి 15 రోజుల్లో కొరతతోనో లేక రైతులు రావడానికి వీలు లేకనో లేదా ఆర్థిక సమస్య కారణంగానో యూరియా లభించకపోతే తర్వాత రెండు కలిపి ఇస్తారా? లేదా ఎగవేస్తారా అన్నది స్పష్టత లేదు. కౌలు రైతుల నమోదుకు అసలు రైతులు అంగీకరించే పరిస్ధితి లేదు. ఎకరం వరికి కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్న పంటకు 2 బస్తాలివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
సర్వేకు సహకరించాలి
కుష్ఠు రహిత ఉన్నతమైన సమాజం కోసం చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలి. వైద్యసిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు శరీరంపై మచ్చలు చూపించాలి. కుష్ఠు మచ్చలుగా అనుమానిస్తే పరీక్షలు చేయించి, నిర్ధారిస్తారు. ఇలాంటివారి వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తాం. ముందస్తు చికిత్స చేస్తే వ్యాధి సులువుగా నయం చేయవచ్చు. – వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ మందులు ఉచితం ఈనెల 18వ తేదీ నుంచి వైద్యసిబ్బంది ఇంటింటా లెప్రసీ సర్వే చేస్తారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారికి సహకరించాలి. మచ్చలు ఉంటే వారు పరిశీలిస్తారు. గోధుమరంగుతో కూడిన మచ్చలు ఉంటే సిబ్బందికి చూపించాలి. వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే ప్రభు త్వమే పూర్తిస్థాయిలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. – సుధాకర్ రెడ్డి, లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్, పెద్దపల్లి -
గుండెపోటుతో అన్నదాత మృతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): పొద్దంతా వ్యవసాయ పనులు చేసిన అన్నదాత నిద్రలోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతిచెందిన ఘటన బాధిత కుటుంబ సభ్యులను కలచివేసింది. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో విషాదం నింపింది. వివరాలు.. బండలింగంపల్లికి చెందిన రైతు జంగా ముత్తిరెడ్డి (45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం పొద్దంతా ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం రోజులాగే తన బెడ్ రూమ్లోకి వెళ్లి పడుకున్నాడు. వేకువజామున కుటుంబ సభ్యులు నిద్ర లేపగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కుటుంబీకులు స్థానిక వైద్యులకు చూపించగా అప్పటికే మరణించినట్లు వారు ధ్రువీకరించారు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు నరేశ్, కూతురు దివ్య ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లారీ బోల్తా.. డ్రైవర్కు స్వల్పగాయాలుధర్మపురి: పత్తి లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయపట్నం నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ ధర్మపురిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ శివారులోని కల్వర్టు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదగిరి, నర్సింలు ద్విచక్ర వాహనంపై సిరిసి ల్లకు వస్తుండగా, కల్వర్టుపై వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. కాగా ఈ కల్వర్టుపై రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన కల్వర్టుకు మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఈ కల్వర్టుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదుపాలకుర్తి(రామగుండం): మండలంలోని జీడీనగర్ గ్రామంలో ఆదివారం తన కారుపై దాడి చేసిన సూర సంతోష్పై సోమవారం బసంత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు ఫీట్ల గోపాల్ తెలిపారు. ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి సూర రమ గెలుపొందగా.. అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన తనను బీసీకాలనీలో నివాసముండే సూర సంతోష్ పరుష పదజాలంతో దూషిస్తూ తన కారు అద్దాలు ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. -
● సొంత వైద్యంతో సమస్య జఠిలం ● జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దూరం
కరీంనగర్: ప్రస్తుతం జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు శీతల గాలుల తీవ్రత పెరుగుతోంది. ఆ ప్రభావంతో చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. చర్మం పొడిబారడం, పగళ్లు రావడం, దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎక్కువగా చర్మసమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇంట్లో ఒకరికి చర్మ సమస్య వచ్చిందంటే అది ఇంటిల్లిపాదికి వచ్చే ప్రమాదముందని, చర్మ సమస్యలు ఉన్న వారు వాడిన సబ్బులు, టవల్స్, బట్టలు ఇతరులు వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, లేదంటే అందరికి చర్మ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందంటున్నారు. జిల్లాలో 50 మందికి పైగా చర్మవ్యాధి నిపుణులు ఉండగా వారం పది రోజులుగా నిత్యం 100కుపై ఓపీ పేషెంట్లు వస్తున్నారు. ఎదురయ్యే ఇబ్బందులు చలికాలంలో చర్మం పొడిబారి తామర వస్తుంది. దురద ఉంటుంది. గోకితే దద్దుర్లు ఏర్పడి మంట పుడుతుంది. జలుబు, దగ్గు, ఎక్కువగా ఉన్న పిల్లలు ఎటోఫిన్ డెర్మటైటిస్ వ్యాధికి గురికావడంతోఎరుపు రంగు మచ్చలు వస్తాయి. సోరియాసిస్ సోకి చర్మంపై మచ్చలు ఏర్పడి పొట్టులా రాలిపోతూ దురద వస్తుంది. తలలో చుండ్రు పెరుగుతోంది. సెబోరిక్ డెర్మటైటిస్ తలలో ఏర్పడి పొట్టులా చర్మం ఊడిపోతుంది. కాళ్ల మడమలు, పెదాలు, చేతులపై పగుళ్లు వస్తాయి. చేతి మునివేళ్లు మంగా ఉండి గుంజినట్లు అవుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్లేటప్పుడు పూర్తిగా చర్మాని కప్పేలా ఉన్ని లేదా కాటన్ దుస్తులు ధరించాలి. సన్స్క్రీన్ లేపనాలు వాడాలి. గ్లిజరిన్ సబ్బులు వాడాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. చర్మం తేమగా ఉండేలా ప్రతి 2 గంటలకోసారి కొబ్బరినూనె, కోల్డ్ మాయిశ్చరైజర్ క్రీములు పూసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. విటమిన్‘సి’ ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. సోరియాసిస్, తామర, దద్దుర్లు ఏర్పడితే ఇంట్లోనే సొంత వైద్యాన్ని చేసుకోకుండా తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాలి. గహిణులు పాత్రలు కడిగేందుకు సబ్బులు వాడతారు. ఆ పని పూర్తయిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకొని కొబ్బరినూనె, మాయిశ్చరైజర్క్రీములు, ఇతర లేపనాలు రాసుకోవాలి. -
‘ఊయల’కు చేరిన ఐదు నెలల పసికందు
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు ఐదు నెలల వయసున్న పసికందును ఆ ఊయలలో వదిలి వెళ్లారు. పసికందుకు సంబంధించి ఆరోగ్య వివరాల రికార్డును కూడా చిన్నారివద్దనే ఉంచడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై చిన్నారిని పరిశీలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని, ఐసీయూలో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కుటు ంబ పరిస్థితులు ఎలా ఉన్నా, శిశువులను నిర్లక్ష్యంగా వదిలేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చని మరోసారి ఈ ఘటన రుజువుచేసింది. పిల్లలు భారంగా అనిపించినా, జీవితం విలువైనదేనని గుర్తించి ఊయ ల మార్గాన్ని ఎంచుకోవడం మానవత్వానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఊయల వ్యవస్థ వల్ల అనేకమంది చిన్నారులకు కొత్త జీవితం లభిస్తోందని, సమాజం మరింత బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ● కుటుంబాన్ని పోషించే దారి లేక ఆత్మహత్య కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించే దారి లేక మనస్తాపం చెందాడు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్లకు చెందిన రెవెల్లి రాజ్కుమార్(38) జీవనోపాధి కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడాదిగా డ్రైవర్గా పని చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల గ్రామానికి చేరుకున్నాడు. ఈనెల 11న ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్కుమార్ భార్య రజిత.. తన పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. రాజ్కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోయాడు. అయితే, హైదరాబాద్ వెళ్లాక భార్య రజిత తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. హైదరాబాద్ రాకపోవడంతో ఉద్యోగంలోంచి తొలగించారని, చిట్టీ డబ్బులు ఎలా చెల్లివస్తాని నిలదీసింది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రాజ్కుమార్ ఉరివేసుకుని చనిపోయాడు. తన కుమారుడు ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానం లేదని తండ్రి పీసారయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఏఎస్సై నీలిమ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు దినేశ్, కూతురు లాస్య, తల్లిదండ్రులు సమ్మక్క –పీసారయ్య ఉన్నారు. రాజ్కుమార్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
లాభాల ‘పుట్ట’
● పుట్ట గొడుగుల పెంపకంలో వ్యవసాయ విద్యార్థులు ● తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ● రైతులకు శిక్షణ ఇస్తామంటున్న ప్రొఫెసర్లు జగిత్యాలఅగ్రికల్చర్: ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది ఔత్సాహిక రైతులు పెంచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలాస వ్యవసాయ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు సైతం తమ ప్రాజెక్టులో భాగంగా పుట్టగొడుగులు పెంచుతున్నారు. వీరికి గైడ్గా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్లాగౌడ్ వ్యవహరిస్తున్నారు. ఇలా పెంచుతారు పుట్టగొడుగులను పెంచేందుకు 6–12 నెలల వయస్సు ఉన్న గడ్డిని ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన గడ్డిపై నీళ్లు చల్లి, తగినంత తేమ ఉండేలా చూస్తారు. ఒక కిలో వరిగడ్డికి 50 గ్రాముల స్పాన్ కలిపి పాలిథీన్ సంచుల్లో నింపి రబ్బర్ బ్యాండ్ వేస్తారు. సంచులను తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉన్న గదుల్లోకి పెడితే 3–4 వారాలకు గడ్డిపైన తెల్లని శీలింధ్రం వస్తోంది. ఇలా చేసిన 6–7 రోజులకు తొలి పంట వస్తుంది. రంగు మారిన, మచ్చలు కలిగిన గడ్డిని ఉపయోగించరు. పుట్టగొడుగులు పెంచే గదుల్లో పురుగులు, కీటకాలు, ఎలుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గదిలో ఉష్ణోగ్రత, తేమ శాతం తటస్థంగా ఉండేలా చూస్తారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనువైన వరిగడ్డి పుట్టగొడుగులు, బటన్, అయిస్టర్, పాల పుట్టగొడుగుల రకాలను ఎక్కువగా పెంచుతున్నారు. లాభాలు పుట్టగొడుగులను తక్కువ పెట్టుబడితో, తక్కువ వ్యవధిలో అంటే 30–40 రోజుల్లో పెంచవచ్చు. వీటిలో ప్రొటీన్స్ వరి, గోధుమ, కూరగాయల కంటే అధికంగా ఉంటాయి. తాజా పుట్టగొడుగుల్లో విటమిన్–డీ అధికంగా ఉంటుంది. పోటాషియం, సోడియం నిష్పత్తి, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల బీపీ, ఆసిడిటితో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్–బీ కాంప్లెక్స్, విటమిన్–సీ, ఫాంటాథెనిక్, నియాసిన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తాజా పుట్టగొడుగుల్లో 43 కిలోల కాలరీలు ఉంటాయి. మార్కెట్లో డిమాండ్ పుట్టగొడుగులపై ప్రజలకు అవగాహన పెరగడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో శాఖాహారులకు మాంసాహారంగా ఉపయోగపడుతుంది. గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలు, సన్నకారు రైతులు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడితే మంచి ఆదాయం పొందవచ్చు. పుట్టగొడుగుల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు. వాటితో పచ్చళ్లు, బిర్యాని, సూప్ పౌడర్, కెచప్ వంటి పదార్థాలను తయారు చేయవచ్చు. -
షార్జా పోలీసుల అదుపులో కల్లెడ యువకుడు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు రెండేళ్లు ఉండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా షార్జా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం జరిగింది. వివరాలు.. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన గాలిపల్లి మధు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. స్వగ్రామం వస్తున్నానని ఇటీవల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో మధు షార్జా ఎయిర్పోర్టుకు చేరుకుని బోర్డింగ్ చేస్తున్న సమయంలో ఎయిర్పోర్టు పోలీసులు అతడి నుంచి పాస్పోర్టు, సెల్ఫోన్ తీసుకుని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సప్లో వాయిస్రికార్డు పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అక్కడున్న వారికి సమాచారం అందించారు. కాగా గతంలో మధు పేరిట ఉన్న ఐడీ కార్డుతో గుర్తుతెలియని వ్యక్తులు రుణం తీసుకోగా, రుణం ఎగవేసి వెళ్లకుండా బ్యాంక్ అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి మధును స్వదేశానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వాయిస్ రికార్డుతో కుటుంబ సభ్యులకు సమాచారం -
వరినారుపై చలి పంజా
మల్లాపూర్(కోరుట్ల): యాసంగి సీజన్కు సంబంధించి వరినారుపై చలి పంజా విసురుతుంది. దీంతో నారు ఎదగడం లేదు. వరి సాగు కోసం రైతులు 10– 15 రోజుల క్రితం నారు పోశారు. చలిగాలులు తీవ్రంగా వీస్తుండడం నారు పెరుగుదలకు ఆటంకంగా మారింది. నాలుగైదు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగి నారు ఎదగకపోవడంతో పాటు ఎర్రబడిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చలి ప్రభావంతో నారు భూమిలో నుంచి సరైన పోషకాలను గ్రహించలేదు. దీంతో నారు ఇటుక రంగులోకి మారి పలు ప్రాంతాల్లో ఎదగడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో నారుమడిపై నేరుగా మంచు పడకుండా నాలుగు వైపుల కర్రలు పాతి పాలిథీన్ కవర్లు కట్టాలని సూచిస్తున్నారు. జింక్ లోప నివారణకు నారుపై జింక్ సల్పేట్ను నీటిలో కలిపి పిచికారీ చేయాలని, రాత్రి వేళల్లో నారుమళ్లకు నీరు పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పాత నీరు తీసేసి వెచ్చటి నీరు అందించాల్సింగా పేర్కొంటున్నారు. జింక్, మాంగనీస్, రాగి వంటి సూక్ష్మపోషక ద్రావణాలను పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. చలిగాలులకు ఎదగని నారు -
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
రాయికల్/పాలకుర్తి: చిన్న వయస్సులోనే పలువురు మహిళలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన బండారి మానస 21 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్తండాకు చెందిన ఇస్లావత్ అఖిల 22 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికవడం విశేషం. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అఖిల తన సమీప అభ్యర్థి బదావత్ లక్ష్మిపై విజయం సాధించారు. స్థానిక కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన అఖిల ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. చిన్నవయస్సులోనే సర్పంచ్గా ఎన్నికై న వీరిని స్థానికులు అభినందిస్తున్నారు. అలాగే రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొడిపల్లి రాజవ్వ సర్పంచ్గా గెలుపొందారు. రాయికల్ మండలంలో మానస, రాజవ్వ అత్యల్ప, అత్యధిక వయస్సు గల సర్పంచులు. మానస, ఒడ్డెలింగాపూర్రాజవ్వ, బోర్నపల్లి ఇస్లావత్ అఖిల, బామ్లానాయక్తండా ఇరవై ఏళ్లుగా ఆ దంపతులే.. రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో 20 ఏళ్లుగా ఆ దంపతులే సర్పంచ్, ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన బెజ్జంకి మోహన్ 2006–11 వరకు సర్పంచ్, 2014–19 వరకు ఎంపీటీసీగా గెలిచారు. 2019–24 వరకు ఆయన భార్య రమాదేవి సర్పంచ్గా సేవలందించగా, ప్రస్తుతం మోహన్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అక్క సర్పంచ్.. తమ్ముడు ఉపసర్పంచ్జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారు విజయం సాధించడంతో పాటు, రెండు పదవులను కై వసం చేసుకోవడం వారిలో ఆనందం నింపింది. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామ సర్పంచ్గా రెడ్డిరత్న గెలుపొందగా, ఆమె సోదరుడు గుంటి రవి వార్డుమెంబర్గా గెలిచి ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్గా గెలిచి.. హామీ నెరవేర్చిఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చారు. వివరాలు.. ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ తనను సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. విజయం సాధించగానే నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులను పట్టెవారిని రప్పించారు. సోమవారం 113 కోతులను బోనులో బంధించి అడవికి తరలించారు. ఒక కోతిని పట్టుకుంటే రూ.500 చొప్పున చెల్లిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో చాలా కోతులు ఉన్నాయని వాటన్నింటినీ తరలిస్తామని పేర్కొన్నారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్: జిల్లాలో మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్తో సమీక్షించారు. గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. మూడో విడతకు హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇల్లందకుంటలో సీతారామచంద్రస్వామి ఆలయ కల్యాణమండపం, సైదాపూర్లో వెంకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
● మూడో విడత సర్పంచ్ అభ్యర్థుల మల్లగుల్లాలు ● రెండు విడతల ఫలితాలపై విశ్లేషణ ● గెలిచిన వారి నుంచి పలువురి సలహాలు ● ప్రలోభాలు.. ఓటర్ల నాడిపై అంచనాలు ● సైలెంట్ మోడ్లో చివరి విడత పల్లెలు
కరీంనగర్: పల్లెపోరు చివరి దశకు చేరింది. రెండు విడతల్లో జరిగిన పలు సంఘటనలు.. గెలుపోట ములు.. మూడో విడత అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు చేసిన వారే ఓటమిని చవిచూశారన్న సమాచారంతో కొందరు గెలుపే లక్ష్యంగా ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరికొందరు సాధ్యమైనంత వరకు ఖర్చుచేసి కాళ్లా..వేళ్లా పడేందుకు నిర్ణయించుకున్నా రు. జిల్లాలోని హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఇక్కడ ప్రచారం ముగిసి, సైలెంట్ మోడ్ ప్రారంభం కావడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ప్రలోభం.. ప్రసన్నం గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఒకప్పుడు అభ్యర్థి పేరు, వంశపారంపర్యం, గ్రామానికి చేసిన సేవలు గుర్తొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నోటు, మద్యం, మాంసం మధ్యే గ్రామ రాజకీయాలు నడుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్నది కాదు.. ఓటరును ప్రసన్నం చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. గత రెండు విడతల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టిన కొందరు ఓటమి పాలవుతుంటే, సాదాసీదాగా ప్రజలతో మమేకమైన కొందరు విజయపథాన నడిచారు. మూడో విడతలోనూ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా వీడియోలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రసంగాలతో బిజీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు పూర్తిగా ప్రలోభాల బాట పట్టారు. మద్యం, మాంసం, ఓటుకింత అంటూ అభ్యర్థులు స్వయంగా రంగంలోకి దిగకుండా తమ అనుచరులతో పని కాని చ్చేస్తున్నారు. ఎవరి ఇంటికి ఏ రోజు ఏ ‘సరుకు’ వెళ్లాలన్నది ముందే లిస్టులు తయారు చేసుకొని కార్యాచరణ పూర్తి చేస్తున్నారు. ఇక వార్డు మెంబర్ అభ్యర్థులు ఉపసర్పంచ్ పదవిని లక్ష్యంగా పెట్టుకొని రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ‘ఇప్పుడు ఖర్చు చేస్తేనే రేపు పదవి’ అన్న భావనతో ముందుకు సాగుతున్నారు. ఓటరు మాత్రం తమ మనసుకు నచ్చిన వారికే ఓటు వేస్తున్నారు. ఈ విషయం గత రెండు విడతల్లో ఖాయమైంది. మూడో విడత అభ్యర్థుల ఫలితాల కోసం బుధవారం సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. -
అమృత్ పనుల్లో అలసత్వం వద్దు
కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2 పథకం పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ శ్రీదేవి హెచ్చరించారు. పనులు మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, ఆయాజ్, నాగరాజు పాల్గొన్నారు. అమృత్ 2 పథకం అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా పైప్లైన్ పనులు, సమస్యలు, రిజర్వాయర్లు, సంప్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్లో సీడీఎంఏ చర్చించారు. పనులను ప్రారంభించకుండా, నత్తనడకన పనులు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా పైప్లైన్ల పనులతో పాటు, రిజర్వాయర్లు, సంప్ల నిర్మాణం పనులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం అమృత్ అభివృద్ధి పనుల పురోగతి ఫొటోలు, వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. అమృత్లో భాగంగా చేపట్టిన లేక్ పునర్జీవ స్కీం ఒప్పందం పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం యూడీఐఎఫ్ ద్వారా విడుదల చేసిన రూ.50 కోట్ల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రణాళికలు సిద్దం చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్ఈ రాజ్ కుమార్, ప్రజారోగ్యశాఖ ఈఈ సంపత్ రావు పాల్గొన్నారు. -
నాటి అల్ఫా.. నేడు రాజీవ్ చౌక్
విద్యానగర్(కరీంనగర్): నగరంలోని రాజీవ్ చౌక్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత రాజీవ్చౌక్ను గతంలో అల్ఫాచౌరస్తాగా పిలిచేవారు. ఇదే ప్రాంతంలో ఉన్న తీరందాజ్ థియేటర్ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. దాని చుట్టు పక్కల పంటపొలాలు ఉండేవి. 1953లో నిర్మించిన వక్ఫ్బోర్డు బిల్డింగ్లో చిన్న పిల్లలకు టీకాలు వేసేవారు. తర్వాత బిల్డింగ్ తీసేసి రెండంతస్తులల్లో దుకాణాల సముదాయం నిర్మించారు. ఈ సముదాయం ఎదురుగా అల్ఫా పేరుతో హోటల్ ఉండేది. ఈ హోటల్లో ఇరానీ చాయ్, బిస్కెట్టు, బన్ను అమ్మేవారు. ఉదయం సాయంత్రం ఈ హోటల్లో చాయ్ తాగేవారితో రద్దీగా ఉండేది. అల్ఫా హోటల్ పేరుతోనే ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మరణనంతరం 12 జనవరి 1994లో ఇక్కడి సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడే ఈ ప్రాంతానికి రాజీవ్చౌక్గా నామకరణం చేశారు. ప్రస్తుతం రాజీవ్చౌక్గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రాంతం వారధి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటీవల ఇక్కడి రాజీవ్గాంధీ విగ్రహాన్ని తొలగించారు. అధునాతన కాంస్య విగ్రహం ఏర్పాటుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పనులు కొనసాగుతుండగా.. విగ్రహం ఏర్పాటు.. చౌరస్తా సుందరీకరణతో ఈ ప్రాంతం మరింత ప్రాచూర్యం పొందనుంది. -
నేటి నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): ధనుర్మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని ముయార గిరి పీఠదీశులు నమిలకొండ రమణా చార్య స్వామి తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్లోని శ్రీ నిలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం అర్చన, ఆరాధన సేవాకాలం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, 30వ తేదీ వైకుంఠ ఏకా దశి పూజలు, జనవరి 11న కూడారై ఉత్సవం, 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి గోదారంగనాధుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కరీంనగర్టౌన్: సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రకాశం గంజ్లో సంఘం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి పతాకం ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆవుల రాజయ్య, సురేందర్, సుక్క కుమార్, ఆవుల లక్ష్మణ్, సంపత్, బిక్షపతి, రాజమౌళి పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూ నివర్సిటీ పరిధిలోని కళాశాలలకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులో 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు ఈ నెల 24లోపు ఫీజు చెల్లించాలని పరీక్షలనియంత్రణ అధికారి డి.సురేశ్ కుమార్ తెలిపా రు. పరీక్షలు 2026 జనవరిలో జరుగుతా యని, రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 30లోపు ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. -
సమ్మక్క భక్తులకు ముస్తాబైన వేములవాడ
వేములవాడ: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న, అనుబంధ ఆలయాలను అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క జాతరకు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుని, కోడె మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా ఉండటంతో భక్తుల రద్దీ ప్రారంభమైంది. దీంతో, ఆలయ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడి చెరువు పార్కింగ్ ప్లేస్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.100 కోడె కట్టె దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. వీఐపీ రోడ్తోపాటు ఆలయ పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తులు స్నానం చేసేందుకు ప్రత్యేకంగా వేడి నీరు (హాట్ వాటర్) సదుపాయం కల్పించినట్లు ఆలయ ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. స్నానఘాట్ల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, భక్తులు సులభంగా స్నాన ప్రాంతాలను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రత, నీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక లైటింగ్.. వేడి నీటి సౌకర్యం -
‘ఇందిరమ్మ’ పేరిట మట్టిదందా
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ట్రాక్టర్ యజమానులు అక్రమ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. సమీపంలోని గుట్ట నుంచి మట్టిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి. ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు మాత్రమే గుట్ట నుంచి మట్టిని ట్రాక్టర్ యజమానులు రవాణా చేయాలని నిర్ణయించారు. అయితే కొందరు ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో ఇతర అవసరాలకు సైతం మట్టిని రవాణా చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో అధికారులు ఉండటంతో ఇదే అదునుగా మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గ్రామంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్మాణానికి అవసరమైన మట్టిని ట్రాక్టర్ యజమానులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే గ్రామస్తుల సమాచారంతో సోమవారం రెవెన్యూ అధికారులు గుట్ట వద్దకు వెళ్లడంతో ట్రాక్టర్ యజమానులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి గుట్టనుంచి అక్రమ మట్టి రవాణాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. అధికారుల రాకతో ట్రాక్టర్ డ్రైవర్ల పరార్ -
షార్ట్ సర్క్యూట్తో రూ.2.50 లక్షల ఆస్తినష్టం
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక మల్లికార్జున్నగర్లో చిరువ్యాపారి పి.రాజేశ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం రాజేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలవారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.2.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. సిబ్బంది ఎ.రమేశ్, ఎం.బానయ్య, పి.మనోహర్, ఇ.చందు పాల్గొన్నారు. -
15 రోజుల్లో వ్యవధిలో..
ఎప్పుడూ తేమ ఉండేలా చూ స్తే పుట్టుగొడుగులు పెరిగి, 15 రోజుల వ్యవధిలోనే 3 పంటలు వస్తాయి. కిలో ఎండుగడ్డి నుంచి దాదాపు కిలో పచ్చి పుట్టగొడులు వస్తాయి. రైతులకు లాభాసాటిగా ఉంటుంది. – సాయి లిఖిత, వ్యవసాయ విద్యార్థిని పుట్టగొడుగులు తాజాగా ఉన్నప్పుడే మార్కెట్ చేస్తే మంచి ధర వస్తుంది. ప్రిడ్జ్లో అయితే మరో 3 రోజులు నిల్వ ఉంటాయి. ఏడాదికి 9 పంటలు తీయవచ్చు. పుట్టుగొడుగుల్లో నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు వంటివి వస్తే వెంటనే తీసివేయాలి. – తరుణ్, వ్యవసాయ విద్యార్థి పుట్టగొడుగులు పెంచే రైతులు బృందాలుగా వస్తే వ్యవసాయ కళాశాలలో శిక్షణ ఇస్తాం. ప్ర యోగాత్మకంగా విద్యార్థులు ప్రాజెక్టులో తయారు చేసి సక్సెస్ సాధించారు. పుట్టగొడుగులను పెంచడం తేలిక, తక్కువ ఖర్చులో పెంపకం చేపట్టవచ్చు. – డాక్టర్ ఎల్లాగౌడ్, గైడ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలాస -
ఐదుగురు గుమికూడితే చర్యలే
● మూడో విడత ఎన్నికల్లో నిషేధాజ్ఞలు కరీంనగర్క్రైం: ఈ నెల 17న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న వీణవంక, హు జూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వి– సైదాపూర్ మండలాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్న ట్లు సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం, సమావేశం కావడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు 15వ తేదీ సాయంత్రం నుంచి 17 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉల్లంఘించిన వా రిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యానగర్(కరీంనగర్): రెండు రోజుల వరుస సెలవుల అనంతరం సోమవారం కరీంనగర్ బస్స్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో ప్రయాణికుల రద్దీని కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) పి.మల్లేశం పర్యవేక్షించారు. వివిధ రూట్లలో బస్సుల అందుబాటును పరిశీలించి, కరీంనగర్ బస్స్టేషన్లో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, బస్స్టేషన్ సూపర్వైజర్ రామకృష్ణకు సూచించారు. కరీంనగర్: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కఠినంగా అమలు చేస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 అమలు విధానంపై ఓరియంటేషన్ నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 598 ప్రైవేట్ హాస్పిటల్స్ను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 కింద రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని, యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి. వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010ను సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అధికారులు, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు నాగరాజు, సునీల్ రాజు, వెంకటరమణ, మౌనిక పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. మూడు నెలల క్రితం రూ.5 పలికిన గుడ్డు ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్సేల్లో రూ.7 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8 పలుకుతోంది. గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల వరకు హోల్సెల్లో వందగుడ్లు రూ.550 పలకగా, ప్రస్తుతం 100 గుడ్లు రూ.650 వరకు విక్రయిస్తున్నారు. చలికాలం కావడంతో గుడ్ల వినియోగం పెరిగిందని, దీనికి తోడు రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరగడంతో గుడ్ల రేట్లు పెరుగుతున్నాయని, కోళ్లదాణా ఖర్చు పెరగడం కారణంగా ఫౌల్ట్రీఫామ్ యాజమానులు చెబుతున్నారు. జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,500 పలి కింది. సోమవారం మార్కెట్కు 52 వాహనాల్లో 300 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
నోట్లు పాయే.. ఓట్లు రాకపాయే!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి, మలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండు విడతల్లోని ఫలితాలపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తున్నారు. నోట్ల కట్టలు పాయే.. ఓట్లు రాకపాయే అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రెండో విడత ఫలితాలు వెలువడిన ఆదివారం వరకు అభ్యర్థులు చేసి ఖర్చు తడిసి మోపైడెంది. తొలివిడత నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత.. వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబరాల్లో ముగిని తేలుతుండగా.. ఓడిన వారు ఎక్కడ బోల్తాకొట్టామని సమీక్షించుకుంటున్నారు. నమ్మకంగా వంచించారంటూ ఆవేదన ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండ ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కులసంఘాల వారీగా, ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు ఓట్లను రాల్చకపోవడంతో ఏమైందనే ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేశారు. ఇంకా కులసంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందుపార్టీలు అదనం. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ, వెండి భరణిలు, దేవుడి లడ్డూలను పంపిణీ చేసిన అభ్యర్థులు గెలుపు అంచు వరకు వెళ్లి ఓడిపోవడంతో అవాక్కయ్యారు. నమ్మకంగా వంచించారంటూ కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎన్నికలు సవ్యంగా సాగడంతో అధికారులు ఫలితాలు ప్రకటించారు. ఒక రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడఅర్బన్ మండలం చింతల్ఠాణాలో చనిపోయిన వ్యక్తి చెర్ల రమేశ్ గెలుపొందడంతో ఆ ఫలితాలను నిలిపివేశారు. ఓట్ల ఖరీదు రూ.200 కోట్లు ఉమ్మడి జిల్లాలో తొలి, మలి విడతల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే రెండు విడతల్లో దాదాపు రూ.50కోట్లకు పైగా డబ్బును వెచ్చించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పక్షం రోజులుగా సగటును ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అనధికారికంగా వెచ్చించారు. ఒక్కో ఊరిలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు కలిపి సగటున రూ.35 లక్షల వరకు ఖర్చు చేశారు. పెద్ద గ్రామాల్లో ఈ వ్యయం మరింత పెరిగింది. ఈ లెక్కన ఒక్కో ఓటు కోసం సగటున సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రూ.3వేలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చు చేసిన డబ్బుకు గౌరవ ప్రదమైన ఓట్లు రాకపోయేనని పరాజితులు కన్నీరుపెడుతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు లెక్కల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో ఉన్నారు. వదిలిందెంత? వచ్చిందెంత ? ఎన్ని‘కల’ల్లో రూ.‘లక్ష’ణంగా ఖర్చు పైసలు పోయే.. ఫలితం లేకపాయే ‘పంచాయతీ’ ఎన్నికల ఫలితాలపై పరాజితుల పోస్ట్మార్టం నమ్మకంగా వంచించారని ఆవేదన తొలి, మలి విడతల్లో అనధికారిక ఖర్చు రూ.200 కోట్లు -
చలో ‘గురుకులం’
కరీంనగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత కేజీ టు పీజీ మిషన్లో భాగంగా 2026– 27 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇంగ్లిష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ జోనల్ పరిధిలో50 గురుకులు పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలలో జిల్లాలో 2,227పై సీట్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 5, జగిత్యాలలో 5, పెద్దపల్లిలో6, రాజన్న సిరిసిల్లలో 7 కలిపి 23 గురుకులాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో చింతకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూర్, జగిత్యాల జిల్లాలో మేడిపల్లి, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, గొల్లపల్లి, పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని, రామగుండం, నందిమేడారం, మల్లాపూర్, గొల్లపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బద్దెనపల్లి, వేములవాడ, చిన్నబోనాల, బోయినపల్లి, ముస్తాబాద్, నర్మాల, ఇల్లంతకుంట లలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు రాజన్నసిరిసిల్ల జోన్ పరిధిలో గురుకులాలు కుండా కరీంనగర్ జోన్ పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్లు గరిష్ట సడలింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1 లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. కరీంనగర్ జోన్ల్ పరిధిలో 2,227 సీట్లు ఉమ్మడి జిల్లాలోని 23 గురుకులాల్లో 5వ తరగతిలో ఒక్కొక్క పాఠశాలలో 80 సీట్ల చొప్పున 1,840 సీట్లు ఉన్నాయి. కరీంనగర్లో జోన్ల్ పరిధిలో మిగితా పాఠశాలలున్నాయి. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధనతో పాటు, భోజనవసతితో పాటు సకల వసతులు ఉంటాయి. సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉండనుంది. ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు. ఎస్సీలకు 65 సీట్లు, ఎస్టీ, బీసీ,ౖ మెనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఒక్కసారి ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు ఉచితంగా చదువు, హస్టల్తో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తారు. బట్టలు, పుస్తకాలు, కాస్మోటిక్ చార్జీలు అందించనున్నారు. జనవరి 21 వరకు దరఖాస్తు గడువు 5వ తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు దరఖాస్తులను ఆన్లైన్లో 22 ఫిబ్రవరి 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్నంబరుతో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు. వేరే వారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే వారిపై సెక్షన్ 416 ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. 2025లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో గుర్తించిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు వరం. పిల్లలకు పౌష్టికాహార లోపంతో తలెత్తే రుగ్మతలు మాయమవుతాయి. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధన కావడంతో పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటి నెలకొంది. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. జనవరి 21 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. కరీంనగర్ జోనల్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాలకై అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – కె.ప్రత్యూష, గురుకులాల జోనల్ ఆఫీసర్ 5వ తరగతిలో ప్రవేశాలు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జనవరి 21 వరకు గడువు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష కరీంనగర్ జోనల్ పరిధిలో 50 గురుకులాలు -
ఎల్లలు దాటి వచ్చి.. ఓటేసి
రాయికల్: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా యువతీ, యువకులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహ్రెయిన్, యూఎస్ఏ, తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో మాట్లాడారు. యూఎస్ఏ నుంచి వచ్చా నేను యూఎస్ఏ హస్టన్ టెక్సెస్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నా. కొద్దిరోజుల తర్వాత మా ఊరికి వస్తాననుకున్న. కానీ, ఇంతలోనే సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుగానే వచ్చా. – బొలిశెట్టి భావన, ఇటిక్యాల ఆనందంగా ఉంది సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయడం ఆనందాన్ని ఇచ్చింది. గ్రామాభివృద్ధి కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకున్న. – సుప్రియ, ఇటిక్యాల ప్రతీ ఓటు కీలకం సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. మంచి నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటు హక్కు మంచి అవకాశం. నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చి విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్తున్నా. – సిరిపురం గిరి, డెప్యూటీ తహసీల్దార్, ఎలిగేడు మండలం, పెద్దపల్లి నోటిఫికేషన్ రాగానే.. నేను ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో ఉంటున్నా. ప్రతి రెండేళ్లకోసారి నాకు కంపెనీ సెలవు ఇస్తుంది. ప్రస్తుతం మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకుని ఎలాగైనా ఓటు వేద్దామన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ రాగానే స్వగ్రామానికి వచ్చి ఓటు వేశా. – పడాల రమేశ్, కుమ్మరిపల్లి ప్రలోభాలకు లొంగకుండా.. ఓటు వేసేందుకు ముంబయ్ నుంచి వ చ్చాం. తిరిగి వెళ్తున్నా ం. ప్రతి ఓటు కీలకం కాబట్టి వచ్చినం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్నాం. – గాజంగి శ్రీధర్, రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా.. హైదరాబాద్ నుంచి సుమా రు 20 మందిమి మా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఆది వారం సెలవు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశాం. – పారిపల్లి సుధీర్, ప్రైవేటు ఉద్యోగి, కుమ్మరిపల్లి -
కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ పరీక్షకు స్పందన
కరీంనగర్ టౌన్: కరీంనగర్లోని కోట పబ్లిక్ స్కూల్ ఆదివారం నిర్వహించిన టాలెంట్ ఎంకరేజ్మెంట్ పరీక్ష– 2026కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి మాట్లాడుతూ.. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుత సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100శాతం స్కాలర్షిప్తో పాటు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతిభను ప్రోత్సహించడమే కోట పబ్లిక్ స్కూల్ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులకు బలమైన అకాడమిక్ ఫౌండేషన్తో పాటు విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా శిక్షణ ఉంటుందని వివరించారు. -
మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్కు స్పందన
కొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అమోట్–2025కు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ (అమోట్)–2025ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించిన టెస్ట్కు 18,450 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఎన్ఆర్ మాట్లాడుతూ, అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆరంభం నుంచి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ రూ.3 వేలు, తృతీయ రూ.2 వేలు ఈ నెల 22న రామానుజన్ జయంతి సందర్భంగా అందజేస్తామని తెలిపారు. -
పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ సీటు
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ దక్కింది. పట్టణంలోని గీతానగర్కు చెందిన యువకుడు రెడ్డిమల్ల అభినవ్ సాయి నీట్ పీజీ 2025–26 ప్రవేశ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో 716వ ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్ సీటు కైవసం చేసుకున్నారు. సిరిసిల్లకు చెందిన రేషన్ డీలర్ రెడ్డిమల్ల హన్మాండ్లు–కల్యాణి దంపతుల కొడుకు అభినవ్సాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. ఆర్ఎంఎల్లో సీటు సాధించడంతో ఆదివారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. అభినవ్సాయి సోదరుడు గుణశేఖర్ సైతం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రోడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేశ్, సమ్మయ్య, భాను, ప్రతినిధులు గట్టయ్య, రవీందర్, ఆకునూరి బాలరాజు, రాజయ్య, మహేశ్, శ్రీనివాస్, మహేందర్రెడ్డి, నర్సయ్య, గాజుల శ్రీనివాస్, ప్రసాద్, చంద్రం, శంకర్, శ్యామ్, శోభన్ పాల్గొన్నారు. ఆర్ఎంఎల్ మెడికల్ కాలేజీలో సీటు అభినందించిన రేషన్డీలర్ల సంఘం ప్రతినిధులు -
మా ఓటు అమ్మబడదు
● మామిడాలపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు వీణవంక: ‘మా ఓటు మద్యానికి, డబ్బుకు అమ్మబడదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కల్పించిన ఓటుహక్కును వినియోగించుకుందాం. మన గ్రామ అభివృద్ధికి ఓటు వేద్దాం’ అని మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు మద్యం, డబ్బు పంపిణీ చేయొద్దని, పంపిణీ చేసినా ఓటర్లు తీసుకోవద్దని, యువకులు, విద్యావంతులు అలోచన చేియాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు. -
మేడిపల్లి ఓసీపీలో పులి సంచారం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)లో ఆదివారం పెద్దపులి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది. రామగుండం డివిజన్–1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వలు అడుగండంతో దానిని గతంలోనే యాజమాన్యం మూసివేసింది. ఆ ప్రాంతంలోనే పెద్దపులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మంచిర్యాల వైపు నుంచి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు వారు వెల్లడిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పులి వేలిముద్రలను వారు పరిశీలించారు. లింగాపూర్ శ్మశానవాటిక వైపు ఉన్న ముళ్ల పొదల్లో పులి సంచరినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఫారెస్ట్ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ రహ్మతుల్లా తెలిపారు. దీంతో లింగాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా వెళ్లవద్దు – డీఎఫ్వో శివయ్య మేడిపల్లి, లింగాపూర్, పాములపేట, హౌసింగ్బోర్డు కాలనీ వాసులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని డీఎఫ్వో శివయ్య సూచించారు. అవసరమైతేనే గుంపులుగా వెళ్లాలని, ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అన్నారు. ద్విచక్రాహనాలపై కూడా ఒంటరిగా వెళ్లవద్దని ఆయన పేర్కొన్నారు. స్థానికుల్లో భయం.. భయం జ్యోతినగర్(రామగుండం): మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఓసీపీ, సమీప గోదావరి నదీతీరంలో పులి సంచరించినట్లు పాదముద్రలు పరిశీలించిన అనంతరం.. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎన్టీపీసీ, ఎఫ్సీఐ పంప్హౌస్ ప్రాంతం మల్కాపూర్ గ్రామానికి సమీపంలో ఉండడంతో ఎప్పుడేమవుతుందోనని గ్రామస్తులు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం పులి సంచరించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. పేట్రేగనున్న స్క్రాప్ చోరీ ముఠాలు ఓపెన్కాస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో జనసంచారం ఉండదని భావించే ఇనుప సామాను దొంగలించే ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో సైతం పులి సంచారం ప్రచారం కావడంతో పెద్దమొత్తంలో ఇనుస సామగ్రి చోరీ అయినట్లు తెలుస్తోంది. గోదావరి నదీతీరంలో పాదముద్రలు నిర్ధారించిన అటవీశాఖ అధికారులు -
కొత్త ఓటు.. అవగాహన లోటు
మానకొండూర్: సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన నూతన ఓటర్లలో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కరువు అవడంతో అయోమయానికి గురయ్యారు. చాలామంది నూతన ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడని అనుకున్నారు. బ్యాలెట్ పేపర్పై ఓటు వేయాలని పోలింగ్ కేంద్రంలో తెలుసుకున్నాక అయోమయానికి గురయ్యారు. నాకు తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటు వేసుడు ఏ విధంగానో నాకు తెలియదు. పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు కొంత కంగారుగా ఉండే. మొదటి సారి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది. – రసజ్ఞ, గంగిపల్లి నేను తొలిసారిగా ఓటు వేస్తున్నా. ఓటుహక్కు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేసుడనుకున్నా. బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఓటు వేసుడో తెలియదు. అవగాహన కల్పించాల్సి ఉంది. – మమత, గంగిపల్లి తొలిసారి నాకు ఓటు హక్కు వచ్చి ంది. ఓటు వేయడం సం తోషంగా ఉంది. ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడనుకుంటున్నా. ఓటు ఏ విధంగా వేయాలో తెలియ దు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలా వేయాలో తెలుసుకుంటా. – కొలిపాక అఖిల( కొండపల్కల) ఈవీఎంలు ఉంటాయనుకున్నా యువ ఓటర్లు బ్యాలెట్ పేపర్లతో అయోమయం -
తుప్పు.. తుక్కు!
గాడి తప్పితే వేటేమా పేర్లు ఎక్కడున్నాయ్: మానకొండూర్లో ఓటర్ లిస్టులో పేర్లు సరిచూసుకుంటున్న ఓటర్లుయువతరంగం: మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామంలో తొలిసారి ఓటేసిన యువతులుబ్యాలెట్ భద్రం: తిమ్మాపూర్లో ఓటింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్స్కు సీల్ వేస్తున్న ఎన్నికల సిబ్బందిపిల్లలతో వచ్చాం: కేశవపట్నంలో చంటి బిడ్డలతో ఓటేసేందుకు వచ్చిన మహిళలుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఓపెన్జిమ్ల నిర్వహణ ఎవరికీ పట్ట డం లేదు. స్మార్ట్సిటీలో భాగంగా నగరవ్యాప్తంగా పార్క్లు, ఓపెన్ప్లేస్లు, వాకింగ్ ట్రాక్ల వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో పరికరాలు అధ్వానంగా మారుతున్నాయి. చెడిపోయి.. తుప్పు పట్టిన పరికరాలకు మరమ్మతులు చేసే నాథుడు కరువవడంతో నగరవాసులు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 30 ఓపెన్ జిమ్లు నగరప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 30 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్ రూ.12 లక్షల చొప్పున, సుమారు రూ.3.60 కోట్ల వ్యయంతో నెలకొల్పారు. నగరంలోని వివిధ కాలనీలు, పార్క్లు, బహిరంగ ప్రదేశాలు, వాకింగ్ ట్రాక్లు, స్టేడియం, మైదానాల్లో ఈ ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. వ్యాయామానికి విరామం రూ.లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ అధికారులు వాటి నిర్వహణలో చూపడం లేదనే విమర్శలున్నాయి. జిమ్ల నిర్వహణ బాధ్యతను అధికారులు గాలికి వదిలేయడంతో పరికరాలు దెబ్బతింటున్నాయి. ఆరోగ్యపరంగా వ్యాయామం అవసరం, అందులో శీతాకాలం కావడంతో ప్రస్తుతం ఓపెన్జిమ్లకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ఆయా కాలనీల కు చెందిన మహిళలు, యువత ఎక్కువగా ఓపెన్జిమ్లపై ఆధారపడుతున్నారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని చోట్ల వాడకం ఎక్కువై, మరికొన్ని చోట్ల నాసిరకం పరికరాలు, చాలా చోట్ల పోకిరీల కారణంగా ఓపెన్ జిమ్ల్లోని పరికరాలు దె బ్బతింటున్నాయి. పరికరాలను ఎప్పటికప్పుడు మ రమ్మతులు చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా నగరపాలకసంస్థ అధికారులు ఓపెన్జిమ్ల నిర్వహణపై దృష్టి సారించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.కరీంనగర్టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదుకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన డీఎస్ఈ, ఎఫ్ఆర్ఎస్ యాప్పై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎఫ్ఆర్ఎఫ్ విధానంతో ఇప్పటికే ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం 85శాతం నుంచి 90శాతానికి పెరిగింది. ఎఫ్ఆర్ఎస్పై నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. ఇటీవల జరిగిన ఎంఈవోల సమావేశంలో హాజరుశాతం తక్కువగా ఉన్న పాఠశాలల హెచ్ఎంలపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. స్కూళ్లకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్లో ఇన్టైమ్, అవుట్ టైమ్పై ప్రత్యేక నిఘా పెట్టారు. సెలవు కోసం యాప్లో దరఖాస్తు చేసుకుని, హెచ్ఎంలతో అనుమతి పొందిన తర్వాతే అది సాధారణ సెలవుగా పరిగణించబడుతుంది. ట్రైనింగ్, ఇతరత్రా కార్యాలయ పనులకు వెళితే ఓడీ వెళ్లిన చోట నుంచి పాఠశాల ముగింపు సమయంలోపే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ యాప్పై గుర్రుగా ఉన్నాయి. విద్యాశాఖ అధికారుల దృష్టి.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం, విధులకు అనధికారికంగా హాజరు కాకపోవడం, పారిశుధ్యం లోపించడం.. తదితరాల అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్న, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న, నిధులను దుర్వినియోగం చేస్తున్నవారిపై గ్రామస్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు వేటు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులతో అమర్యాదగా ప్రవర్తించడం, మద్యం సేవించి పాఠశాలకు రావడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం, ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా వాట్సాప్లో సందేశాలు పంపించడం వంటి ఘటనలతో కరీంనగర్ రూరల్, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంత పాఠశాలల్లో రెండు నెలల వ్యవధిలో 9మంది ఉపాధ్యాయులపై వేటు వేసిన విషయం తెలిసిందే.మానేరు వద్ద పాడైపోయిన జిమ్ పరికరం కిసాన్నగర్లో పాడైపోయిన పరికరం ఓపెన్ జిమ్లు వినియోగంలోకి తేవాలి నగరపాలకసంస్థ పరిధిలో ఉన్న ఓపెన్ జిమ్లు పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. చాలా చోట్ల నిర్వహణ లోపంతో పరికరాలు పనిచేయడం లేదు. దీంతో వ్యాయామానికి వచ్చే వాళ్లు వెనుదిరగాల్సి వస్తోంది. ఓపెన్జిమ్ల నిర్వహణ నగరపాలకసంస్థదా, సంబంధిత కాంట్రాక్టర్లదా తెలియడం లేదు. కమీషన్ల కోసమే ఓపెన్జిమ్లను ఏర్పాటు చేసినట్లుంది. నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓపెన్జిమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. – అనంతుల రమేశ్, కాంగ్రెస్ నాయకుడు, కిసాన్నగర్, కరీంనగర్ -
చేయి ఎత్తిన సంగ్రామం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ ●: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక గ్రామాలు తమ ఖాతాలో వేసుకున్న హస్తం పార్టీ అదే జోరును రెండో విడతలోనూ కొనసాగించింది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 398 స్థానాలకు 203స్థానాలు కై వసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆదివారం జరిగిన రెండో విడతలో 418కి 234 స్థానాలతో జోరును కొనసాగించి పల్లెపోరులో పట్టు సాధించింది. తొలి విడతలో 121స్థానాలకే పరిమితమైన కారు పార్టీ, రెండో విడతలో 102 గ్రామాలతో అదేస్థాయిలోనే నిలిచింది. రెండో విడతలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. తొలి విడతలో జరిగిన తప్పులను సరిదిద్దుకున్న బీఆర్ఎస్, రెండో విడతలో గట్టి పోటీనిచ్చింది. రెండు జిల్లాల్లో కారు పార్టీకి మంచి స్పందన లభించగా, కాంగ్రెస్కు సవాల్ విసిరినట్టుగా పరిస్థితి మారింది. మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటేందుకు ప్రయత్నించింది. తొలి విడతలో 37స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ రెండో విడతలో 27 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ప్రశాంతంగా రెండో విడత రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. రెండో శనివారం, ఆది వారం సెలవులు కలిసి రావడంతో భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో తొలివిడతలో 81.42శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో 86.58శాతం రికార్డవడం నిదర్శనం. హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున రావడం పోలింగ్శాతం పెరగడానికి దోహదపడింది. ఉదయం 7 గంటల నుంచి మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగింది. ఉదయం 9 గంటలకల్లా చాలా కేంద్రాల్లో 55శాతం పోలింగ్ దాటడం విశేషం. మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో 86.58శాతం పోలింగ్ నమోదైంది. గన్నేరువరం లో 88.91శాతం పోలింగ్ నమోదైంది. ఓటెత్తిన పుషులు.. ఈనెల 11న జరిగిన తొలివిడత కన్నా 5శాతం పోలింగ్ పెరిగింది. తొలివిడతలో మహిళలు 82.51 శాతం ఓట్లు వేయగా.. పురుషులు 80.26 శాతానికే పరిమితమయ్యారు. తాజా పోలింగ్లో మహిళలు 85.77శాతం ఓటింగ్లో పాల్గొనగా.. పురుషులు 87.44శాతం మేర ఓట్లేసి ముందంజలో నిలిచారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటట్లలో పురుషులే అధికంగా ఉండటం కూడా ఓటింగ్ పర్సంటేజీ పెరగడంలో కారణంగా చెబుతున్నారు.మేమూ ఓటేశాం: పచ్చునూరులో ఓటేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతులుఇదిగో ఇలా మలవాలమ్మా: కేశవపట్నంలో బ్యాలెట్ పేపర్ గురించి వివరిస్తున్న సిబ్బందిజిల్లాలో విజయం సాధించిన వివిధ పార్టీల మద్దతుదారులు గ్రామపంచాయతీలు 113కాంగ్రెస్ 45బీఆర్ఎస్ 42బీజేపీ 09ఇతరులు 17మండలం గ్రామాలు మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం శాతం చిగురుమామిడి 17 34,370 29,498 14,585 86.58 14,913 85.11 85.82గన్నేరువరం 15 17,430 15,435 7,533 88.19 7,902 88.91 88.55 మానకొండూర్ 29 56,922 49,328 24,360 87.85 24,967 85.52 86.66 శంకరపట్నం 27 37,867 33,334 16,617 89.1 16,717 86.99 88.03 తిమ్మాపూర్ 23 38,414 32,589 15,919 85.59 16,670 84.13 84.84 మొత్తం 111 1,85,003 1,60,184 79,014 87.44 81.169 85.77 86.58 -
గ్రామాల్లో వికసిస్తున్న కమలం
కరీంనగర్: గ్రామాల్లో కమలం పార్టీ వికసిస్తోందని 1, 2వ విడత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జరుగబోయే మూడో విడత ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతామని అన్నా రు. మొదటి, రెండో విడత ఫలితాలు సంతృప్తిని చ్చాయని, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానంగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సర్పంచ్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చారని, ఎంతోమంది వార్డు మెంబర్లుగా గెలు పొందారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసించారని అన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల వైపు చూశారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ చొరవతో నేడు గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన చోట గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బండి సంజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.రూ.18 లక్షలతో రాజీవ్ చౌక్ సుందరీకరణ కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులు మొదలయ్యాయి. సుడా నిధులు సుమారు రూ.18 లక్షలతో జంక్షన్ పనులు చేపట్టారు. రాజీవ్గాంధీ పాత విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం చౌక్లోని పాత విగ్రహాన్ని నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించారు. జంక్షన్ పనులు పూర్తి అయిన తరువాత కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజీవ్ చౌక్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి రాజమండ్రిలో రాజీవ్గాంధీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. పది రోజుల్లో పనులు పూర్తి చేసి, రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 27నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్, నీలం లక్ష్మణ్ తెలిపారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ.. ఈనెల 13, 14వ తేదీల్లోనే పోటీలు జరగాల్సి ఉండగా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వే య డం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లా ల నుంచి సుమారు 1,200మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో 48 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ చాటిన మాస్టర్ అథ్లెట్స్ను రాజస్థాన్లోని ఆజ్మీరాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ వరాల జ్యోతి, స్టేట్ ట్రెజరర్ డి.లక్ష్మి, జాయింట్ సెక్రటరీలు లక్ష్మణ్ రావు, కోశాధికారి శిరీశ్, సలహాదారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నగరంలో పునుగు పిల్లి కరీంనగర్: కరీంనగర్ విద్యానగర్లో ఓ ఇంట్లోకి ఆది వారం ఉదయం పునుగు పిల్లి రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే శ్రీలక్ష్మి జంతు సంరక్షణశాలకు, ఫారెస్ట్ అధికారులకు సమాచా రం ఇవ్వగా... ఆ ఇంటికి చేరుకొని, అధికారులు, జంతు సంరక్షణశాల నిర్వాహకులు ఆసిరి సుమన్ పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నా రు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు ఆ పిల్లిని అప్పజెప్పారు. పిల్లిని క్షేమంగా డీర్పార్క్లో ఉంచినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. -
గోదావరిలో స్నానానికి వచ్చి..
● గల్లంతైన వ్యక్తి మృతి వెల్గటూర్(ధర్మపురి): గోదావరిలో స్నానానికి వచ్చి గల్లంతైన వ్యక్తి మృతిచెందిన ఘటన వెల్గటూర్ మండలం కోటిలింగాలలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గోలెం మల్లయ్య (53) సమీప బంధువు మృతిచెందగా అతడి అంత్యక్రియలకు వెళ్లాడు. ఆదివారం ఇంట్లో మల్లన్న బోనాల కార్యక్రమం ఉండడంతో శనివారం గోదావరి స్నానానికి కోటిలింగాలకు వచ్చాడు. సాయంత్రం కావడంతో పుష్కర ఘాట్లపై కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించగా మల్లయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మృతుడి బావ నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిజమ్మికుంట: అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన పార్వతి రాజయ్య(46) అనారోగ్యంతో ఈ నెల 10న పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాజయ్య ట్రాక్టర్ డ్రైవర్. భార్య వనజ, కొడుకు ఉన్నారు. కొడుకు శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
ఆరు గంటలు పనిచేస్తున్నా
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటుతో ఉపాధి దొరుకుతుంది. ప్రింటర్స్ నుంచి ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఫ్రేమ్లకు అతికించడం, గిరాకీ చెప్పిన చోట్లలో కట్టేస్తున్నాం. ఒక్క ఫ్లెక్సీ కడితే రూ.150 నుంచి రూ.200 ఇస్తారు. సాధారణ రోజుల్లో నెలలో 10 సార్లు పని దొరికేది. ఇప్పుడు పదిహేను రోజులుగా నిరంతరం పని ఉంటుంది. ప్రతీ రోజు 6గంటలకు పైగా ఫ్లెక్సీల ఏర్పాటులో బిజీగా ఉంటున్నాం. – యెల్లె లక్ష్మణ్, ఫ్లెక్సీ కార్మికుడు 300 పాటలు రికార్డు చేశాం ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రచారానికి మూడు వందల పాటలను రికార్డు చేశాం. నాకు 30 ఏళ్లుగా రికార్డింగ్ రంగంలో అనుభవం ఉంది. ఇరవై ఏళ్ల క్రితం సిరిసిల్ల లో రికార్డింగ్ స్డూడియో ఏర్పాటు చేసిన. అభ్యర్థులు కేవలం తమ కరపత్రాలు, మేనిఫెస్టో అందిస్తే చాలు వారిపై పాటలు కట్టి రికార్డు చేసి పంపిస్తాం. మా స్డూడియోలో ఆరుగురు రచయితలు, ఆరుగురు సింగర్స్, ముగ్గురు కోరస్ కళాకారులు ఉన్నారు. పాటల రాయడం, ప్లేబ్యాక్, సంగీతం, రికార్డింగ్ అంతా మాదే. చాలా మంది అభ్యర్థులకు ప్రచార బాణీలు కూడా అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలు గతంలో కన్నా ఎక్కువ గిరాకీ వస్తుంది. – ఎండీ సత్తార్, రికార్డింగ్ స్డూడియో నిర్వాహకుడు


