ఉమ్మడి జిల్లాకు గుండుసున్నా
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయించింది గుండుసున్న. బీజేపీ ప్రజా ప్రతినిధులు, కేంద్రమంత్రులు బడ్జెట్పై జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు, రైల్వేలైన్లు, విద్యాలయాల ఊసే లేకపోవడం బాధాకరం. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చే యడంలో వైఫల్యం చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి. మొత్తంగా కేంద్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారాలా ఉంది.
– జీవీ రామకృష్ణారావు,
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
శుభపరిణామం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెద్దగా మార్పులు ఏమీ లేవు. విదేశీ చదువులకు వెళ్లిన విద్యార్థులకు పంపే మొత్తంపై టీసీఎస్ను ఐదు శాతం నుంచి రెండుశాతానికి తగ్గించడం శుభపరిణామం. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు జూలై 31గానే కొనసాగిస్తూ ఆడిట్ అవసరం లేని వ్యాపారుల ఐటీఆర్ గడువును ఆగస్టు 31వరకు పెంచడం, సవరించిన గడువును మార్చి 31 వరకు పొడగించడం ఊరటనిచ్చే అంశం.
– కె.వెంకటేశ్వర్లు, ట్యాక్స్ ప్రాక్టీషనర్
ఉమ్మడి జిల్లాకు గుండుసున్నా


