breaking news
Karimnagar District News
-
కోళ్లను మింగిన కొండచిలువ
● రెండు నెలలుగా మాయమవుతున్న కోళ్లుపెద్దపల్లిరూరల్: అది పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామం. ఆ గ్రామ పరిసరాల్లో ఓ కొండచిలువ తిరుగుతూ కోళ్లనే ఆహారంగా తీసుకుంటున్నట్టుంది.. రెండు నెలలుగా కోళ్లు మాయమవుతున్నాయి. పొద్దున ఇంటినుంచి వెళ్లిన కోళ్లు సాయంత్రానికి ఇంటికి చేరకపోవడంతో బాధితులు కడుపుమంటతో అనుమానితులను దూషణలు చేస్తున్నారు. ఇలా రెండు నెలలు గడచింది.. చివరకు ఇదే గ్రామంలోని బొక్కల రవీందర్ ఇంట్లోకి సోమవారం ప్రత్యక్షమైన కొండచిలువ రెండుకోళ్లను మింగి ఎటూ పోలేని స్థితికి చేరింది. మంగళవారం ఉదయం గమనించిన రవీందర్ కుటుంబీకులు.. వార్డు సభ్యుడు కొంటు రాజు తదితరుల సాయంతో కొండచిలువను పట్టి ఊరుచివర గుట్ట ప్రాంతంలో వదిలేశారు. రవీందర్ ఇంట్లో కూడా కోళ్లనే తింటూ కనిపించిన కొండచిలువ.. తమ కోళ్లను కూడా మింగి ఉంటుందనే విషయాన్ని గ్రామస్తులు గ్రహించారు. -
పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
కరీంనగర్ టౌన్: బహుజన నేత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని కలెక్టర్ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో పాపన్న 376వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలవేసి నివాళి అర్పించారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఎక్స్గ్రేషియా, కాటమయ్య కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్వో స్వామి, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్, గౌడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర నాయకులు పడాల స్వామిగౌడ్, పులి ఆంజనేయులుగౌడ్, పడాల అజయ్గౌడ్, దూలం అంజన్న గౌడ్, తాళ్లపల్లి ఎల్లాగౌడ్ పాల్గొన్నారు. -
వారంలో దుబాయ్కి.. అంతలోనే మృత్యు ఒడికి
● ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి ● గ్రామంలో విషాధచాయలురాయికల్: మరో వారంలో ఆ యువకుడు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అంతలోనే విధి అతడిని వెక్కిరించింది. ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయికల్ మండలం కొత్తపేట ఒడ్డెరకాలనీకి చెందిన ఆలకుంట మహేశ్ (20) ఉపాధి నిమిత్తం కొద్దిరోజులుగా గల్ఫ్ వెళ్లి వస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. మరో వారం రోజుల్లో దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మంగళవారం ట్రాక్టర్లో ఇసుక నింపుకొని ఓ గ్రామంలోని ఇంటి వద్ద డంప్ చేసి తిరిగి వస్తున్నాడు. ఇటిక్యాల భూపతిపూర్–కొత్తపేట క్రాస్ రోడ్ వద్ద బండరాయికి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహేశ్ ట్రాక్టర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మహేశ్ మృతిచెందాడనే విషయం తెలియడంతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. మహేశ్కు తండ్రి పోశయ్య, తల్లి లక్ష్మీ ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
పకడ్బందీగా పింఛన్ దరఖాస్తుల పరిశీలన
కరీంనగర్కార్పొరేషన్: చేయూత పింఛన్ దరఖాస్తు ల పరిశీలన పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించా రు. మంగళవారం నగరపాలకసంస్థకార్యాలయంలో ఇంజినీరింగ్, రెవెన్యూ, శాని టేషన్ విభాగాల గెజిటెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్లు, మున్సిపల్ షాపుల అద్దెల వసూళ్ల పురోగతిపై చర్చించారు. చేయూత పింఛన్ పథకం కింద ఆన్లైన్ పోర్టల్లో నమోదైన ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పూర్తిస్థాయిలో ప్రారంభించేలా చూడాలన్నారు. రెండో విడత అర్హుల గుర్తింపునకు మరోసారి విచా రణ చేపట్టాలన్నారు. నగరపాలకసంస్థ అద్దెకిచ్చిన వ్యాపారషాపుల నుంచి నిబంధనల ప్రకారం అద్దె వసూలు చేయాలన్నారు. అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, ఈఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
బల్దియాలో ఏసీబీ వణుకు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కార్యాల యంలో ఏసీబీ దాడులు చేపట్టింది. మంగళవారం సాయంత్రం పట్టణ ప్రణాళిక విభాగానికి చేరుకున్న బృందం రాత్రి వరకు సోదాలు కొనసాగించింది. మీడియా కథనాలు, ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో రైడ్ చేసింది. సోదాల్లో భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్లో సోదాలు ఆరోపణలను ఎదుర్కొంటున్న పట్టణ ప్రణాళిక వి భాగంపై ఎట్టకేలకు ఏసీబీ దృష్టి పెట్టింది. మీడియా కథనాలు, ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆరో పణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టింది. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న టౌన్ప్లానింగ్ విభాగంలోకి ఏసీబీ బృందం నేరుగా వెళ్లింది. ఆ సమయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తన చాంబర్లోనే ఉన్నారు. టౌన్ప్లానింగ్ విభాగానికి చెందిన డీసీపీ, ఏసీపీ, టీపీఎస్, టీపీబీవోల చాంబర్లు, క్యాబిన్లను చుట్టుముట్టారు. ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తలుపు తోసుకొని రావడంపై డీసీపీ బషీ ర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కాసేపు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకొంది. భవన అనుమతులపై ఆరా టౌన్ప్లానింగ్ విభాగంలోని అన్ని సెక్షన్న్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ‘మేం అడిగిన సబ్జెక్ట్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వండి. ఇప్పుడిచ్చే వివరాలు, తరువాత తీసుకొనే వివరాలు ఒకేలా ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడతారు’ అంటూ ఏసీబీ అధికారులు హెచ్చరించారు. నగరంలో టౌన్ప్లానింగ్ జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, పెండింగ్ దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు ఆ దరఖాస్తులు డిస్పోజ్ చేయకపోవడం లాంటి అంశాలనూ తనిఖీ చేసినట్లు సమాచారం. ఫోన్పే లావాదేవీలు తనిఖీ ఏసీబీ అధికారులు టౌన్ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఫోన్లలో ఉన్న గుగుల్ పే, ఫోన్ పేలను చెక్ చేసినట్లు సమాచారం. అనుమతులు, ఇతరత్రా పనుల కోసం ఎవరైనా ఆన్లైన్లో డబ్బులు తీసుకున్నారా అనే అనుమానంతో లావాదేవీలు చూసినట్లు వినికిడి. సోదాల సమయంలోనే ఫిర్యాదు సోదాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి వచ్చి టౌన్ప్లానింగ్పై ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. నగరంలోని భగత్నగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీపతిరావు కార్యాలయానికి వచ్చి ఏసీబీ డీఎస్పీ మహేందర్రెడ్డిని కలిశాడు. టౌన్ప్లానింగ్ అధికారులు ఆయన్ను బయటకు వెళ్లాలని చెప్పినప్పటికీ, ఏసీబీ అధికారులు వారించి ఫిర్యాదు తీసుకున్నాడు. తీగలగుట్టపల్లిలో ఉన్న తన స్థలంలోకి చొచ్చుకువచ్చి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇక్కడ డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగదంటూ శ్రీపతిరావు ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. టెన్షన్.. టెన్షన్ ఏళ్లకాలం తరువాత నగరపాలకసంస్థ కార్యాలయ ంలో ఏసీబీ సోదాలు చేపట్టడంతో ఇతర విభాగాల ఉద్యోగులు సైతం ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో ఉన్నారు. టౌన్ప్లానింగ్, ఇతర విభాగాల అధికారులు కొందరు ఏసీబీ సోదాల సమాచారంతో కార్యాలయానికి కూడా రాకపోవడం విశేషం. -
విజిలెన్స్.. ఇంటెలిజెన్స్.. ఎంటీఎఫ్
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణకు విజిలె న్స్, ఇంటెలిజెన్స్, మొబైల్ టాస్క్ఫోర్స్(ఎంటీఎఫ్) ఏర్పాటు చేసింది. అక్రమాలు, ఆస్తులపై ఇవి డేగకళ్లతో పహారా కాస్తున్నాయి. మూడంచెల భద్రతను దాటి దొంగల ముఠాలు విలువైన ఆస్తులు చోరీచేస్తున్నాయి. పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బందితోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అన్ని ఏరియాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నా చోరీలు ఆగడంలేదు. పర్మినెంట్ తగ్గి.. ప్రైవేట్ పెరిగి.. సింగరేణిలో పర్మినెంట్, ప్రైవేట్ భద్రతా సిబ్బంది 60:40 నిశ్పత్తిలో ఉండాలి. ఈ నిబంధనలు కాదని పర్మినెంట్ కన్నా ప్రైవేట్సెక్యూరిటీ గార్డులనే అత్యధిక సంఖ్యలో నియమిస్తోందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. తద్వారా పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య తగ్గుతూ వస్తోందని, ఇది సంస్థ ఆస్తుల పరిరక్షణపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకూ అనేక ఫిర్యాదులు వెళ్తున్నాయి. కాపర్పైనే దొంగల కన్ను దొంగల ముఠాలు కాపర్పైనే దృష్టి సారించాయి. ప్రధానంగా ఓసీపీలు, స్క్రాప్యార్డులు, కేబుల్ యార్డుల్లో పడిఉన్న కాపర్ను ఎత్తుకెళ్తున్నాయి. త్రీ కోర్ ఆర్మ్డ్, ఫోర్కోర్ ఆర్మ్డ్, ఫ్లెక్సిబుల్ తదితర విలువైన కాపర్ కేబుళ్లను కట్చేస్తూ చోరీచేస్తున్నా యి. ఎత్తుకెళ్లిన కేబుళ్లను మంటల్లో కాల్చగా వచ్చిన కాపర్ను కిలో సుమారు రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్న దొంగలు సొమ్ముచేసుకుంటున్నారు. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు.. ఓసీపీల్లో విద్యుత్తో నడిచే భారీయంత్రాల కోసం సింగరేణి రూ.కోట్లు వెచ్చించి కేబుళ్లు కొనుగోలు చేస్తోంది. భూగర్భ గనుల్లోనూ భారీకాపర్ కేబుళ్లను వినియోగిస్తోంది. కేబుళ్ల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్న యాజమాన్యం.. ఇదే కేబుల్ చోరీకి గురైతే స్క్రాప్ కింద లెక్కిస్తూ తక్కువ ధర చూపిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఓసీపీ–2లో మరో కేబుల్చోరీ సింగరేణి రామగుండం డివిజన్–3 పరిధిలోని ఓసీపీ–2లో మరో కేబుల్చోరీ జరిగినట్లు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున సిగ్నల్ పాయింట్ వద్ద 120ఎంఎం ఫ్లెక్సిబుల్ పవర్కేబుల్ 60 మీటర్ల మేర దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈవిషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ముఠాల ‘మేనేజ్ పాలసీ’ కాపర్ కేబుల్ ముఠాలు దొంగతనం చేసి ఘటనా స్థలాల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటున్నాయి. ఒకవేళ సెక్యూరిటీ, భద్రతా సిబ్బందికి దొరికితే ‘మేనేజ్ పాలసీ’ అమలు చేస్తున్నాయి. తమకు అండగా నిలుస్తున్న రాజకీయనాయకుల పలుకుబడి ఉపయోగించి కేసులు లేకుండా బయట పడుతున్నాయి. సెక్యూరిటీ అధికారులు నామమాత్రపు ఫిర్యాదులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోనే కేబల్ చోరీ ముఠాలకు హద్దూఅదుపు లేకుండా పోతోందని కార్మిక సంఘాలు, కార్మికులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనమే.. గత జూలైలో ఓసీపీ–2లో దొంగలు ఏకంగా యంత్రంలోకి చొరపడ్డారు. కాపర్ కేబుల్ చోరీచేస్తూ భద్రతా సిబ్బంది చేతికి చిక్కారు. వారిపై ఇప్పటివరకూ పోలీసుస్టేషన్లో కేసు నమోదు కాకపోవడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.భారీ యంత్రాలే లక్ష్యం ఓసీపీల్లో మూలనపడేసిన యంత్రాలకు కేబుళ్లను అలాగే ఉంచారు. దొంగలు రాత్రిపూట వీటిని కట్చేసి ఎత్తుకెళ్తున్నారు. ఓసీపీ–1లోని పృథ్వీభంజన్ డ్రాగ్లైన్ యంత్రానికి చెందిన కాపర్వైర్ను గత మేలో దొంగలు చోరీచేయడం కలకలం రేపింది. సుమారు మీటర్ పొడవున కేబుల్లో సుమారు 10 కేజీల వరకు కాపర్ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
కదం తొక్కిన విద్యార్థులు
కరీంనగర్ టౌన్: ‘ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు.. సర్కారే ఇస్తుందని కదా అని ఇంట్లో తల్లిదండ్రులు.. అయోమయంలో మా చదువులు.. ఎవరికి చెప్పుకున్నా జరగని న్యాయం.. ఎన్నిసార్లు ఆందోళనకు దిగినా పట్టించుకోని ప్రభుత్వం.. వెరసి తప్పనిసరి పరిస్థితిల్లో మరోసారి మేం రోడ్డెక్కాం.. స్కాలర్షిప్ సర్కా రు వేసే బిక్షకాదు.. మా హక్కుగా పోరాడుతున్నాం’.. అంటూ నగరంలో మంగళవారం విద్యార్థులు కదం తొక్కారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాది మంది కలెక్టరేట్కు చేరుకుని ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం స్కాలర్షిప్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న రూ.12వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను పోలీసులు ఆరెస్టు చేశారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్, బి.రాజ్, మల్యాల రాకేశ్, పూసాల విష్ణు, యోగేష్, బామాండ్ల నందు పాల్గొన్నారు. -
సహకార పీఠం.. విధేయులకే పట్టం
సీనియర్లకే ప్రాధాన్యం..? పీఏసీఎస్ నుంచి డీసీసీబీ దాకా.. పాత పద్ధతికి స్వస్తి కరీంనగర్ సంఘాలు 30 సభ్యులు 1.30లక్షలు జగిత్యాల సంఘాలు 51 సభ్యులు 1.50లక్షలు పెద్దపల్లి సంఘాలు 20 సభ్యులు 41,639 రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘాలు 24 సభ్యులు 65,000 -
వలస జీవులకు తీపి కబురు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వలస జీవులకు కేంద్ర రైల్వేశాఖ తీపి కబురు తీసుకొచ్చింది. సామాన్య, మధ్య తరగతి వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అత్యధికంగా సాధారణ బోగీలు ఉండేలా అమృత్ భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి జంక్షన్లో రెండు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి జంక్షన్ మీదుగా ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే వలసకార్మికులు దాణాపూర్, రక్సల్ వంటి రైళ్లలో ప్రమాదకర స్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. వీటిలో కేవలం నాలుగు సాధారణ బోగీలు ఉండడంతో అందులోనే కిక్కిరిసి ఒక రోజంతా ప్రయాణం చేస్తున్నారు. -
గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్
కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి(కరీంనగర్): నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరెంట్ బిల్లు మొత్తం నగర పాలక సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. 21వ డివిజన్ విద్యానగర్లోని శ్రీరాంనగర్ కాలనీలో రూ.కోటి మున్సిపల్ సాధారణ నిధులతో సీసీరోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులు, 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్లో రూ.15లక్షల 15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టిన పైప్లైన్ పనులకు మంగళవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. పాపన్న స్ఫూర్తితో అధికారం చేపడతాం సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిలో రాష్ట్రంలో అధికారం చేపడతామని కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పాపన్న 376వ జయంతి సందర్భంగా మంగళవారం రేకుర్తిలోని ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్రావు, సుదగోని మాధవి, బండారి వేణు పాల్గొన్నారు. -
రాజన్న హుండీ ఆదాయం రూ.2.31 కోట్లు
వేములవాడ: రాజన్నకు 47 రోజుల్లో స్వామివారి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,31,38,480 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. 137 గ్రాముల బంగారం, 9.200 కిలోల వెండి సమకూరింది. ఆషాఢమాసంలో ఇంత భారీ ఆదాయం రావడం విశేషమని ఈవో పేర్కొన్నారు. కరీంనగర్ ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, డీఈవో నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.పేకాట రాయుళ్ల అరెస్ట్జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం లచ్చక్కపేట గ్రామంలో పేకాట స్థావరంపై ఎస్సై గీత ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడిచేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,550 స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా పేకాట ఆడితే పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరిపై కేసు నమోదుజగిత్యాలక్రైం: జగిత్యాలలోని గొల్లపల్లి రోడ్లో మంగళవారం సాయంత్రం గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. నిందితులకు పరీక్షలు చేయగా.. గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యిందని ప ట్టణ ఎస్సై సుప్రియ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్లు కుమారస్వామి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు వేములవాడ: పట్టణంలోని గుడి చెరువు కట్టకింది బస్టాండ్ నుంచి శాత్రాజపల్లి వెళ్లే రోడ్డులోని పెట్రో ల్ బంక్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాలక్ష్మివీధికి చెందిన ఏదుల భూమ య్య, కొండయ్యకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ను కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
రహదారిపై కూలిన భారీ వృక్షం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై మంగళవారం భారీ మర్రి వృక్షం రోడ్డుపై కూలింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో వాహనదారులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నేలతడిగా మారి మహావృక్షం నేల కూలింది. వృక్షం ప్రధాన రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందుగా గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఈ ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఆర్అండ్ బీ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి వృక్షాన్ని రోడ్డుపై నుంచి తొలగించి వాహనాలను పునరుద్ధరించారు. భారీ వృక్షాన్ని తొలగించడానికి అధికారులకు 2 గంటల సమయం పట్టింది. అప్పటివరకు వాహనాలు ప్రధాన రహదారిపై నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. -
వైఫైతో జాతీయ జెండా ఆవిష్కరణ
● బాలుడిని అభినందించిన మాజీ స్పీకర్ మధుసుదనాచారి జమ్మికుంట: సెల్ఫోన్ వైఫై అధారంగా జాతీయ జెండాను ఆవిష్కరించాడు జమ్మికుంట పరిధిలోని కాటిపల్లి రాజు– మానస దంపతుల కుమారుడు సృష్టిసాయి. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సృష్టిసాయి తాడు సాయం లేకుండా మొబైల్ వైఫై సిగ్నల్ పంపగానే మోటర్ సాయంతో జెండా పైకి ఎగిరేలా డిజైన్ చేశారు. ఏఐ, కోడింగ్పై పట్టు సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు. బాల మేధావి వినూత్న ఆవిష్కరణ గురించి తెలుసుకున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి సృష్టిసాయి ఇంటికి వెళ్లాడు. అతని ఆవిష్కరణలు వీక్షించి, అభినందించారు. నూతన ఆవిష్కరణలకు తనవంతు ఆర్థికసాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. గంప నాగేశ్వరావు, ఉదయ్కుమార్, అంజిరెడ్డి, కిరణ్ ఉన్నారు. -
‘నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి’
రాయికల్: వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తండ్రి కష్టం చూడలేని ఆ యువకుడు కాస్త సహాయం చేద్దామని వెళ్లగా.. విధి వెక్కిరించి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాతలు ఆదుకోవాలని, తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన శామిల్, రాధ దంపతులు. వారికి విశాల్ ఏకై క కుమారుడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రికి ఆసరాగా ఉండేందుకు తండ్రితోపాటు గోడ కట్ చేసే పనికి వెళ్లాడు. అక్కడ విధి వక్రీకరించి.. గోడ కూలి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రోజుకు సుమారు రూ.25వేల చొప్పున ఖర్చవుతోంది. కూలీ పనిచేస్తేనే కుటుంబం గడిచే ఆ తల్లిదండ్రులకు విశాల్ వైద్య ఖర్చులు పెను భారంగా మారాయి. కాలనీలో అందరితో కలిసి అల్లారుముద్దుగా ఉండే విశాల్ను దక్కించుకునేందుకు కాలనీవాసులు స్వయంగా భిక్షాటన చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. దాతలు, మానవతాహృదయులు స్పందించి విశాల్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం చేయాలని తల్లిదండ్రులు, కాలనీవాసులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు 8008192221 నంబర్లో సంప్రదించాలని వేడుకుంటున్నారు. -
న్యాయసాయంలో ముందుండాలి
కరీంనగర్ టౌన్: బాధితులకు న్యాయసాయం అందించడంలో ‘సఖి’ కేంద్రం ముందుండాలని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సూచించారు. కరీంనగర్ సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలో మంగళవారం నిర్వహించిన 13వ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గృహహింస నిరోధక చట్టం– 2005 ప్రకారం కోర్టుల్లో నమోదయ్యే కేసుల్లో జాప్యం లేకుండా, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సమన్వయంతో బాధితులకు త్వరితగతిన న్యాయసాయం అందించడంలో సఖి కేంద్రం ముందుండాలని ఆదేశించారు. పీసీఆర్ కోర్టుల ద్వారా దాఖలయ్యే గృహహింస కేసుల్లో రక్షణాధికారి విచారణ నివేదికల ప్రక్రియను ఐసీడీఎస్ సీడీపీవోల సమన్వయంతో పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని, పోలీస్ స్టేషన్లలోని వరకట్న వేధింపుల కేసుల స్టేటస్ వివరాలను అందించాలని సూచించారు. సఖి సెంటర్ నిర్వాహకురాలు దామెర లక్ష్మి పూర్వ చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, మెప్మా పీడీ స్వరూప రాణి, అడ్వకేట్ మహేశ్ పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
కరీంనగర్క్రైం: పెండింగ్ కేసులు తక్షణమే పరిష్కరించాలని సీపీ గౌస్ఆలం సూచించారు. కమిషనరేట్లో సమావేశ మందిరంలో మంగళవారం జూలై మాస నేరసమీక్ష నిర్వహించారు. నేరం జరిగిన వెంటనే శాసీ్త్రయ ఆధారాలతో సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, పోక్సో, అత్యాచారం కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. సైబర్ మోసాల్లో బాధితులకు త్వరగా నగదు రికవరీ చేయడంతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని సూచించారు. జూలైలో 15 ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా ప్రాసిక్యూషన్ విజయవంతంగా పనిచేసిందని సీపీ అభినందించారు. ఇందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అదనపు డీసీపీ వెంకటరమణ, డీడీ ప్రాసిక్యూషన్ పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
బీఎల్ఏ–2లు క్షేత్రస్థాయిలో పనిచేయాలి
కరీంనగర్: తెలంగాణలో ఓటరు తుది జాబితా వెలువడే వరకు బూత్ లెవెల్ ఏజెంట్–2లు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాల ని బీజేపీ లీగల్సెల్ కన్వీనర్ ఆంథోనిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపుని చ్చారు. ఎస్ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియపై మంగళవారం కరీంనగర్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో సమీక్షించారు. ఎస్ఐఆర్ ముసాయిదా లిస్టులో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలిందని, లిస్ట్లో తమ ఓటు ఉందో లేదోననే ఆందోళన ఓటర్లలో నెలకొన్న దృష్ట్యా పార్టీ శ్రేణులు వారి కి భరోసా కల్పించాలని కోరారు. అర్హత ఉండి ముసాయిదాలో పేరు లేకపోతే సంబంధిత బీఎల్వో, ఎన్నికల అధికారులను సంప్రదించేలా సాయం చేయాలన్నారు. సెప్టెంబర్ 16 లోగా సరైన ఆధారాలతో స్పందించడం కీలకమని స్పష్టం చేశారు. నాయకులు బాస సత్యనారాయణ, హరిబాబు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వాసాల రమేశ్, శ్రీనివాసరావు, నాంపల్లి శ్రీనివాస్, రంగు భాస్కరాచారి పాల్గొన్నారు. బూత్స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలికరీంనగర్ కార్పొరేషన్: పోలింగ్ బూత్స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ ప్రధానకార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్ఏలు, సూపర్వైజర్ల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో పటిష్టంగా నిర్మించడంలో బీఎల్ఏలు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు, నాయకులు గంట శ్రీనివాస్, కాంతాల జగన్రెడ్డి, పార్వతుల మల్లేశం, విక్రమ్, సికిందర్, ఆకుల ఉదయ్, మడుపు మోహన్ పాల్గొన్నారు.కరీంనగర్ టౌన్: కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న డంప్యార్డ్ను జనావాసాలకు దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి అంకం శివరాణి ఆధ్వర్యంలో మంగళవారం డంపింగ్యా ర్డ్ వద్ద ధర్నా చేపట్టారు. హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తతో కోతి రాంపూర్, లక్ష్మీనగర్, కట్టరాంపూర్, కొత్తయశ్వాడ, కమాన్, బస్టాండ్, అంబేద్కర్ స్టేడియం ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డంపింగ్యార్డ్ను నగరాని కి దూరంగా తరలించాలని కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరా ముల రమేశ్, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పరశురాం, నూతి చరణ్, బాసవేణి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్గా రణధీర్కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా ప్రొఫెసర్, డెంటల్ సర్జన్ ఈరవేణి రణధీర్ నియామకమయ్యారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ గుండ వీరారెడ్డి మంగళవారం నియామకపత్రం అందజేశారు. ప్రస్తుతం డెంటల్ సర్జన్గా సేవలందిస్తున్న ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది సమన్వయం, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షించనున్నారు. -
వేగవంతంగా అభివృద్ధి పనులు
● మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని 3వ డివిజన్ విద్యారణ్యపురిలో డ్రైనేజీ, 23వ డివిజన్ బాలాజీనగర్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు మంజూరు చేస్తున్నామని, అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగర ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేటర్లు సాదినేని లావణ్య మునీందర్, గుమ్మడి రాజ్కుమార్, వరాల నర్సింగం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్రూరల్: వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై విద్యార్థులకు అవగాహన ఉండాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పి.సతీశ్కుమార్ అన్నారు. సోమవారం నగునూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్సనల్ ఫైనాన్స్ అండ్ వెల్త్క్రియేషన్ అంశంపై రెండురోజుల వర్క్షాప్ను ప్రారంభించి మాట్లాడారు. స్టాక్మార్కెట్, మ్యూచువల్ఫండ్స్, ఎస్ఐపీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం ఫైనాన్షియల్ అవెన్యూస్ సెషన్లో వర్క్షాప్ డైరెక్టర్, అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కన్వీనర్ ఎన్వీ రంగప్రసాద్, డాక్టర్ జి.సమత, కోటగిరి శంకర్లింగం వివిధ ఆర్థిక మార్గాలు, స్టాక్మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ఫండ్స్, ఎస్ఐపీలద్వారా పెట్టుబడి చేయడంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, కామర్స్ డిపార్ట్మెంట్ కన్వీనర్ ఈశ్వరమ్మ, సమత, సరిత, స్వప్న, దీప్తి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు సీపీ గెట్–2026 ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ మాలతి తెలిపారు. బాటనీ విభాగంలో డి.శ్యామల 11వ ర్యాంకు, పొలిటికల్సైన్స్లో టి.చందన 56, జువాలజీలో డి.శ్యామల–17, హెచ్ఆర్ఎంలో పి.కావ్య– 121, కంప్యూటర్సైన్స్లో జక్కం అక్షర–131, ఫిజిక్స్లో మారిశెట్టి వినీల–112, తెలుగులో ఎస్.శ్రావ్య–101, శ్రీవాణి–148, డాటాసైన్స్లో తేజస్వి–148, లక్ష్మిపూజిత–150, స్టాటిస్టిక్స్లో స్రవంతి–71వ ర్యాంకు సాధించారు. ఈసందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పద్మజ, ఏసీవో వసుమతి, అధ్యాపకులు అభినందించారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: నగరంలో 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్పై మరమ్మతు పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు తాహెరా మసీదు, శ్రీనగర్ కాలనీ, అంజనాద్రి ఆలయం, దోబిఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్, జెడ్పీ క్వార్టర్స్, భగత్నగర్, మల్లమ్మ మార్కెట్ సమీపం, కొమ్ము రాజు, రఘుపతిరెడ్డి ఆసుపత్రి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు. -
మంత్రి పొన్నం ఇంటి ముట్టడి
కరీంనగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందుకు సోమవారం పీడీఎస్యూ నాయకులు కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించారు. ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల పై చదువులకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ ఆరోపించారు. ఈ విషయంపై న్యాయస్థానాలు స్పందించి విద్యార్థుల అకౌంట్లలో స్కాలర్షిప్ జమ చేయాలని చెప్పినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేకుండా రోజురోజుకు జాప్యం చేస్తుందన్నారు. వెంటనే ఫీజురీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజు, మానుపాటి కార్తీక్, మానుపాటి సవర్ధన్, కట్ట శ్రీకర్, వంశీ, అరుణ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం
లోకాయుక్త ఆదేశాల ప్రకారం.. 175, 197, 198 సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చామని రెవెన్యూ అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే, లోకాయుక్త ఆదేశాల కాపీ కా వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా.. ఆదేశాలు లేవని, మౌఖిక ఆదేశాలంటూ కొత్తరాగం అందుకోవడంతో మేమంతా విస్తుపోయాం. గతంలో సర్ఫరాజ్ అహ్మద్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఈ మూడు సర్వే నంబర్లు పట్టా భూములేనని ప్రభుత్వానికి నివేదించారు. ఏడు నెలలుగా హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అమలు కాకపోతే త్వరలో కోర్టు ధిక్కరణ కింద కేసు వేసే ఆలోచనలో ఉన్నాం. – రాజగోపాల్రెడ్డి, రేకుర్తి -
9,11,933
జిల్లా ఓటర్లుకరీంనగర్ అర్బన్: రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ప్రకటించాల్సి ఉండగా షెడ్యూల్ను మార్చగా సోమవారం ప్రకటించారు. మొత్తం జిల్లా ఓటర్లు 9,11,933 కాగా ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్ల వివరాలు వెల్లడించారు. జిల్లా గణాంకాలను పరికిస్తే మహిళల హవానే కనిపించింది. పురుష ఓటర్లు 4,47,808 మంది ఉండగా వీరికన్న 16,332 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషం. ఇక సర్వీస్, ఎన్ఆర్ఐ ఓటర్లలో పురుషులే అత్యధికంగా ఉండగా మహిళలు అత్యల్పంగా నమోదయ్యారు. ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్ల నమోదు అంతంతే ఎన్ఆర్ఐ, సర్వీస్ ఓటర్లు వేలల్లో ఉన్నప్పటికీ కేవలం రెండుమూడంకెల్లో నమోదడం విస్తుగొల్పుతోంది. ఎన్ఆర్ఐ ఓటర్లలో కరీంనగర్ నియోజకవర్గంలో 39 మంది నమోదవగా ఇందులో 30మంది పురుషులు, 9మంది మహిళలు, చొప్పదండిలో ఆరుగురు పురుషులు ఒక మహిళ, మానకొండూరులో ఎవరూ నమోదు చేసుకోకపోగా హుజూరాబాద్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మాత్రమే ఓటరుగా నమోదయ్యారు. ఇక సర్వీస్ ఓటర్ల వివరాల్లో కరీంనగర్ నియోజకవర్గంలో 107 మంది నమోదు చేసుకోగా 93మంది పురుషులు, 14 మంది మహిళలు, చొప్పదండిలో 205 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, మానకొండూరులో 139 మంది పురుషులు, ఐదుగురు మహిళలు, హుజూరాబాద్లో 163 మంది పురుషులు, 12 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కరీంనగర్ 1,32,259 1,35,889 27 2,68,175 చొప్పదండి 1,03,104 1,07,999 5 2,11,108 మానకొండూరు 1,01,837 1,04,754 1 2,06,592 హుజూరాబాద్ 1,10,566 1,15,485 7 2,26,058 -
సంక్షేమం, ఆరోగ్యానికి పెద్దపీట
కరీంనగర్: కార్పొరేట్ తరహా విద్య, వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, నూతన భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు నిరుపేదలు ఎక్కువగా వస్తుంటారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రి అవుట్ పోస్ట్ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.40 లక్షలు మంజూరు చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆస్పత్రిలో కనీస అవసరాలకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఆస్పత్రిలో ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ఇది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్వో వీరారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తాఖీయుద్దీన్ఖాన్, ఆర్ఎంవో నవీన తదితరులు పాల్గొన్నారు. -
పథకాలకు తూట్లు పొడిచే కుట్ర
కరీంనగర్టౌన్: ఎన్నికల సమయంలో ఆడబిడ్డల వివాహానికి ‘తులం బంగారం’ ఇస్తామని ఆర్భాటంగా హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట నిలబెట్టుకోలేక ఇప్పుడు కుట్రలకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెరవెనుక నుంచి హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశానుసారం నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని పథకాలకు చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్పొరేటర్లు నలువాల రవీందర్, యూసుఫ్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించండి
కరీంనగర్అర్బన్: ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించగా డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 225 అర్జీలు రాగా, అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు 58, గృహ నిర్మాణ శాఖకు 56 దరఖాస్తు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం, చీఫ్ సెక్రటరీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, 30 రోజులు దాటిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలన్నారు. పింఛన్ల దరఖాస్తు సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీ, మండల కేంద్రం, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఆహార భద్రత కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో గ్రామ, వార్డుసభలు, ప్రజాపాలన వారోత్సవాల సమయంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తారని పేర్కొన్నారు. -
తల్లి జన్మదినం రోజే కొడుకు దుర్మరణం
కోరుట్ల: ‘అమ్మా హ్యాపీ బర్త్డే. రాత్రికి బర్త్డే కేక్ కట్ చేద్దాం..’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ‘నా పుట్టిన రోజు నీ చావు రోజైంది..కొడుకా..’ అని ఆ తల్లి విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ప్రకాశంరోడ్కు చెందిన గంగాదేవి శ్రీనివాస్, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. వనిత బల్దియా 13వ వార్డు ఆర్పీగా పనిచేస్తోంది. పెద్ద కొడుకు రాహుల్(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం వనిత పుట్టినరోజు కావడంతో తల్లికి బర్త్డే శుభాకాంక్షలు చెప్పాడు. సాయంత్రం కేక్ కట్ చేద్దామని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటల వరకు స్నేహితులతోనే ఉన్నాడు. తల్లి నుంచి పలుమార్లు ఫోన్లు వస్తుండటంతో స్నేహితులు దుంపేట వర్షిత్, సల్లం శ్రీశాంత్తో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. పట్టణంలోని ఎరుకలవాడ కల్వర్టు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడిపోయారు. రాహుల్ తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. వర్షిత్, శ్రీశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాహుల్ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాహుల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
మల్యాల/జగిత్యాల/కరీంనగర్/కరీంనగర్అర్బన్:ఆర్టీసీ బస్సు, ఓ లారీ ఎదురెదురుగా ఢీకొనగా.. బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా.. మరో 19 మంది స్వల్ప గాయాల బారిన పడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద సోమవారం చోటుచేసుకుంది. కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తోంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వస్తున్న లారీ దిగువ కొండగట్టు సమీపంలోని మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మురళి, గుడివాడకు చెందిన లారీ డ్రైవర్ జాజి బాబు, అలాగే బస్సులో ప్రయాణిస్తున్న నిర్మల్ జిల్లా కడెంకు చెందిన ఎండీ.మునార్, సుప్రియ తీవ్రంగా గాయపడ్డారు. మరో 19మంది ప్రయాణికుల ముఖాలు, చేతులు, కాళ్లు, తలకు స్వల్ప గాయాలయ్యాయి. కొందరు ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం, కిటికీల గుండా స్థానికుల సాయంతో కిందికి దిగారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మల్యాల ఎస్సై సందీప్ సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా దారి మళ్లించారు. బాధితులకు అండగా ఉంటాం : మంత్రులు పొన్నం, అడ్లూరి బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి వెంటనే కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనపై కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. అధికారులను అప్రమత్తం చేసిన కరీంనగర్ కలెక్టర్ ఆర్టీసీ బస్సు, లారీ ప్రమాద ఘటనపై కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం రాత్రి పరామర్శించారు. దూర ప్రాంతాలవారు కావడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. నలుగురికి తీవ్ర గాయాలు 19మందికి స్వల్పగాయాలు నుజ్జునుజ్జయిన బస్సు, లారీ ముందుభాగం కొండగట్టు మూలమలుపు వద్ద ఘటన క్షతగాత్రులు వీరే.. తుమ్మనపల్లి జ్యోష్నవి, సుప్రియ, కటుకం సుప్రజ, అఫియాజీన్ (కోరుట్ల), కోడూరి సుజాత(రామన్నపేట), గంధం గీతాంజలి, మోటం శంకర్, మోటం గంగు (కన్నాపూర్), అకూరి వైష్ణవి, వై.స్వప్న, దాసరి వినీల (మెట్పల్లి), జేరిపోతుల రాజమణి, జయసుధ (కామారెడ్డి), వెలిగొండ శ్రీనివాస్ (జగిత్యాల), ఏలేటి హర్షిత (రేకులపల్లి), ఎద్దం రమ్య(రామోజీపేట), వంగల సతీశ్ రెడ్డి(బోధన్)తోపాటు మరో ఇద్దరు పిల్లలు గాయపడిన వారిలో ఉన్నారు. గాయపడిన వారిలో కొందరు ఉద్యోగులు విధులకు వెళ్లి వస్తుండగా.. మరికొందరు పిల్లలను హాస్టల్లో దింపి వస్తున్నారు. వీరిలో కొంతమందిని జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. డీఎంహెచ్వో సుజాత ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంబులెన్స్లో వచ్చిన క్షతగాత్రులకు వెంటవెంటనే చికిత్స అందించడంతోపాటు స్కానింగ్ చేపట్టారు. కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. -
రాజన్న ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు
వేములవాడ: రాజన్న ఆలయంలోని పలు విభాగాలను విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు సీఐలు ప్రశాంత్రావు, రాజేందర్, తహసీల్దారు శ్రీనివాస్లతో కూడిన పది మంది అధికారుల బృందం ఆరు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. ఆలయానికి చేరుకున్న ఈ బృందం విచారణ కార్యాలయం, కల్యాణకట్ట, లీజులు, అన్నదానం, గోదాం, లడ్డూ ప్రసాదం, పీఆర్వో కార్యాలయంతోపాటు పలు విభాగాల్లోని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రెండో రోజు మంగళవారం సైతం విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు ఆలయాల నుంచి సొంత గుడికి చేరుకున్న ఉద్యోగులకు నెల రోజుల వ్యవధిలోనే విజిలెన్స్ తనిఖీలు చేపట్టడంతో బెంబేలెత్తిపోయారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గుల్ల సంపత్ (51) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. సంపత్ కారు నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. కాగా, కుటుంబంలో భూ సమస్యలతో మోసం చేశారని, వారు ఇబ్బందులు పెడుతున్నారని వాట్సప్లో సూసైడ్ నోటు మెస్సెజ్ ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు రామగుండం రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు. పరిహారానికి నోచుకోకుండానే కార్మికుడి మృతి రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు మహ్మద్ నసీరొద్దీన్(71) వయోభారంతో సోమవారం మృతి చెందాడు. ఇతడికి రావాల్సిన వేతన బకాయిలు, ఇళ్లస్థలం ఇతరత్రా ప్రయోజనాలు అందకుండానే మృతి చెందడంపై బర్మా, కాందీశీకుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే టెక్స్టైల్ మిల్లు కార్మికులకు రావాల్సిన బకాయిలు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. పోలీసులకు అనుమానాస్పద వ్యక్తుల అప్పగింతకథలాపూర్: మండలంలోని భూషణరావుపేటలో సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు వింత వేషధారణలో కారులో భూషణరావుపేట వచ్చారు. పలు దుకాణాల్లోకి వెళ్లి భిక్షాటనకు వచ్చామని చెప్పి యజమానులపై పొగ పెట్టడంతో మత్తు మందు కావచ్చనే అనుమానంతో వారంతా కేకలు వేశారు. గ్రామస్తులు గుమిగూడి కారును అడ్డగించి వారిని నిలదీశారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నలుగురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు. బైక్పై నుంచి పడి ఒకరికి గాయాలుకొడిమ్యాల: ద్విచక్రవాహనం అదుపు తప్పి కింద పడడంతో ఓ వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని దమ్మయపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన రమేశ్ తన ద్విచక్రవాహనంపై గోవిందారం వెళ్లాడు. అక్కడ కోడిగుడ్లు విక్రయించి తిరిగి ఇంటికి వస్తుండగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేసి చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈతపోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ప్రతిభ గోదావరిఖనిటౌన్: హైదరాబాద్ అంబర్పేట జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ స్విమ్మర్స్ పలు పతకాలు సాధించారు. ఆర్.ప్రశాంత్, గోల్డ్మెడల్, ఎం.శ్రీధర్ గోల్డ్, సిల్వర్, ఆర్.రామారావు, గోల్డ్, 2 కాంస్య, ఎ.రమేశ్కుమార్, గోల్డ్, మంగ వెంకటేశ్వర్లు కాంస్య, ఎం.శ్రీధర్ కాంస్య, బంగారి రాజయ్య సిల్వర్, కాంస్య పతకాలు సాధించినట్టు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన స్విమ్మర్స్ హరియాణాలో సెప్టెంబర్లో జరిగే జాతీయస్థాయి ఈతపోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. -
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం
వేములవాడ: అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడడం, జూదం నిర్వహించడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. భక్తుల రద్దీ ప్రాంతంలో ఇటీవల తాడు ఆట పేరుతో జూదం నిర్వహిస్తున్న వైనాన్ని సాక్షి ప్రచురించింది. సాక్షి కథనంపై పోలీసులు సీరియస్గా వ్యవహరించి నిఘా పెంచారు. సోమవారం తాడు ఆట పేరుతో జూదం నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తాడు ఆట నిర్వహిస్తున్న ప్రదేశంపై దాడి చేసి జూదం నిర్వహిస్తున్న సురేందర్, దేవందర్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి వారి వద్ద నుంచి తాడు ఆటకు ఉపయోగించే సామగ్రి, అప్సర పెన్సిళ్లు, రూ.2వేల నగదును స్వాధీనపరచుకొని రిమాండ్కు తరలించారు. నిందితులు హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రాయపురం సురేందర్, అదే జిల్లా ఆత్మకూరుకు చెందిన పల్లకొండ దేవేందర్గా గుర్తించినట్లు చెప్పారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన ఓదయ్య
వేములవాడరూరల్: దాదాపు రెండున్నర నెలలుగా ఆస్పత్రిలో మృత్యువులో పోరాడుతున్న వేములవాడకు చెందిన మిట్ట ఓదయ్య చివరికి సోమవారం తుదిశ్వాస విడిచాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడలోని మిట్ట ఓదయ్య(53)కు సర్వేనంబర్ 590లో 1.31 ఎకరం భూమి ఉంది. అందులో నుంచి రైల్వే పట్టాలు పోతున్నాయి. వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న ఓదయ్య భూమికి మార్కెట్లో రూ.2కోట్లు పలుకుతుంది. కానీ ప్రభుత్వం రూ.73 లక్షలు చెల్లించింది. తక్కువ పరిహారం వచ్చిందన్న మనోవేదనకు గురయ్యాడు. గత జూన్ 5వ తేదీన తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు కరీంనగర్కు తరలించి 72 రోజులపాటు చికిత్స అందించారు. ఓదయ్యను బతికించుకునేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం డబ్బులతోపాటు అదనంగా అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘పీఎంజే’ దోపిడీ కేసులో ఐదుగురిపై పీడీ యాక్ట్
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని పీఎంజే జువెల్లర్స్ దోపిడీ కేసులో ప్రధాన నిందితులపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝళిపించారు. ముఠాకు చెందిన ఐదుగురిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మే 3న పీఎంజే జువెల్లర్స్లోకి చొరబడిన దుండగులు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి, సుమారు రూ.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీరా సింగ్, రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమాన్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్, మొహమ్మద్ ఆదిల్ఖాన్పై సోమవారం పీడీ యాక్ట్ అమలు చేశారు. నిందితులకు కరీంనగర్ జిల్లా జైలులో నిర్బంధ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితుల నేర కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, భవిష్యత్లో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించడమే పీడీయాక్ట్ అమలు ఉద్దేశమని సీపీ తెలిపారు. పీడీయాక్ట్ అమలులో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ టౌన్ ఏసీపీ ఎన్.వెంకటస్వామి, టూటౌన్ సీఐ కె.సృజన్రెడ్డి, పీడీ సెల్ సిబ్బంది పండరి, హెడ్ కానిస్టేబుల్ శంకర్ను సీపీ అభినందించారు. -
ఔట్సోర్సింగ్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
జగిత్యాల: మున్సిపాలిటీల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల వేతనాలను తగ్గిస్తూ జీవో జారీ అయిన విషయం తెల్సిందే. రూ.6వేలకు పైగా వేతనాలు తగ్గడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో రమేశ్ అనే ఔట్సోర్సింగ్ కార్మికుడు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. మంగళవారం హైదరాబాద్లో కార్మికులకు సంబంధించిన సమావేశం ఉండటంతో సుమారు 50మంది వెళ్తామని మున్సిపల్ ఉన్నతాధికారులను అడిగితే కొంత మందికే పర్మిషన్ ఇచ్చారని, అందరికీ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టూ ఉన్న వారు గమనించి వెంటనే కార్యాలయానికి తరలించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ను వివరణ కోరగా.. పర్మిషన్ ఏమీ లేదని, 50 మంది కాకుండా కొంతమంది వెళ్లాలని చెప్పామని తెలిపారు. న్యాయం చేయాలంటూ తల్లీకూతుళ్లు.. బెజ్జంకి (సిద్దిపేట): న్యాయం చేయాలంటూ తల్లి, ఇద్దరు కుమార్తెలు బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన అందె లక్ష్మి, ఆమె కూతుళ్లు శృతి, శైలులను రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సకాలంలో అడ్డుకుని వారించారు. బెజ్జంకిలోని తల్లిగారికి చెందిన 38 గుంటల భూమిని తమకు ఇవ్వకుండా సోదరి కుమారుడు అక్రమంగా విక్రయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించినా వివాదంలో ఉన్న భూమిని తహసీల్దార్ ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
నాగుల పంచమి వేళ.. నాగుపాముకు హింస
జగిత్యాలక్రైం: నాగుల పంచమి వేళ.. భక్తుల కళ్ల ముందే పామును హింసిస్తూ ఓ వేటగాడు డబ్బుల వసూళ్లకు పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్లోని మోతె శివారులోని పాముల పుట్ట వద్ద పుట్టలో పాలు పోసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇదే ఆసరాగా చేసుకున్న పాముల వేటగాడు ఓ నాగుపామును బంధించి దానిని హింసిస్తూ భక్తుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వని భక్తులపై నాగుపామును ఉసిగొల్పడంతో కొంతమంది భక్తులు భయభ్రాంతులతో పరుగులు పెట్టారు. నాగుపామును వేటగాడు గంటలతరబడి హింసించినా అటవీశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించారని, పాముతో వసూళ్లకు పాల్పడుతున్న వేటగానిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
కూతురును చూసేందుకు వెళ్లి అనంతలోకాలకు..
ముస్తాబాద్(సిరిసిల్ల): బిడ్డ, అల్లుడు, మనుమలు, మనవరాండ్లను చూసేందుకు వెళ్లిన దంపతులకు టిప్పర్ యమపాశమైంది. రెండు నిమిషాలైతే కూతురు ఇంటికి చేరుకోవాల్సిన ఆ రైతు అంతలోనే మృత్యువాత పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన సుల్తాన్ యాదిరెడ్డి(61), అంజమ్మ(58) బైక్పై ఆవునూర్లో ఉన్న కుమార్తె మంజుల వద్దకు బయలుదేరారు. జగిత్యాల నుంచి నామాపూర్ వైపు వస్తున్న టిప్పర్ వీరి బైక్ను గూడెం, ఆవునూర్ మధ్య ఢీకొట్టింది. ఈ సంఘటనలో యాదిరెడ్డి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ అంజమ్మను అంబులెన్స్లో సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు. కూతురు మంజుల, అల్లుడు శ్రీనివాస్రెడ్డి వద్దకు మరో నిమిషమైతే చేరుకునే వారు. నాన్న వస్తున్నాడని ఎదురుచూసిన మంజులకు.. తండ్రి మరణవార్త తెలియడంతో గుండెలవిసేలా రోదించింది. సంఘటన స్థలాన్ని ఎస్సై జ్యోతి, ఏఎస్సై అశోక్కుమార్ పరిశీలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ ఢీకొని రైతు దుర్మరణం తీవ్రంగా గాయపడ్డ భార్య -
అత్తపై అల్లుడి దాడి
జగిత్యాలరూరల్: జగిత్యాల పట్టణం గాంధీనగర్కు చెందిన నర్సమ్మపై ఆమె అల్లుడు కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీనగర్కు చెందిన నర్సమ్మ కుమార్తె లక్ష్మిని మూడేళ్ల క్రితం టీఆర్నగర్కు చెందిన కట్ట ప్రశాంత్కు ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో లక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నర్సవ్వ తన ఇంటి ఎదుట వాకిలి ఉడుస్తున్న సమయంలో అల్లుడు ప్రశాంత్ కత్తితో దాడి చేశాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. గుండెపోటుతో ఏఎల్ఎం మృతిఎలిగేడు: ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన ఇరుగురాల రాజయ్య(46) ఏఎల్ఎం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడుగొండలో ఏఎల్ఎంగా పనిచేస్తున్న ఇరుగురాల రాజయ్య శనివారం సాయంత్రం తన విధులు ముగించుకొని ధూళికట్టలోని ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసిన అనంతరం రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు తెలపడంతో వెంటనే 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు రాజయ్యకు భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటిదొంగను పట్టించిన సీసీ కెమెరాపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు ఎల్ల మ్మ ఆలయ పరిసరాల్లో మేకల మండిలో నుంచి రెండు మేకలు మాయమయ్యాయి. మండల కేంద్రమైన పాలకుర్తికి చెందిన యజమాని అదే గ్రామానికే చెందిన యువకుడిని పనిలో ఉంచుకున్నాడు. నమ్మకంగా ఉంటాడని అనుకుంటే ఇలా జరిగిందేంటని ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా మేకలు అమ్మి ఆ డబ్బు యజమానికి ఇవ్వలేదనే నిర్దారణకు వచ్చాడు. ఆదివారం సదరు యువకుడిని పిలిచి మేకల సంగతేంటని నిలదీశాడు. తనకేం తెలియదని చెప్పడంతో సీసీ పుటేజీలను చూపించాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియని సదరు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
జ్ఞాపకాల్లో వేములవాడ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ అలనాటి చిత్రాలు ముచ్చటగొలుపుతున్నాయి. రాజరాజేశ్వరస్వామి ఆలయం కాలక్రమంలో జరిగిన అభివృద్ధి పనులు.. పట్టణ రూపురేఖలు.. ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నాయి. 1970లో వేములవాడ దేవస్థాన అభివృద్ధి పనులు నాటి కాంట్రాక్టర్ చేదురువెల్లి రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణ విశేషాలు ఇవీ.. ధర్మగుండం ధర్మగుండం ఫిబ్రవరి 20, 1971లో నిర్మించారు. నాడు భక్తుల కోసం ధర్మగుండం మెట్లు, కాంక్రీట్వాల్ నిర్మిస్తున్న అరుదైన ఫొటోలు లభించాయి. పారపట్టి, రాళ్లు మోసి ఆలయానికి పునాది వేసిన శ్రామికుల కష్టానికి నిదర్శనంగా నిలుస్తోంది. కమాన్ ప్రారంభోత్సవం మార్చి 6, 1973న వేములవాడ ఆలయ స్వాగత తోరణం(కమాన్) పనులు పూర్తయ్యాయి. నాడు కట్టిన పునాదులే నేడు లక్షలాదిమందికి ఆధ్యాత్మిక నిలయాలుగా నిలుస్తున్నాయి. స్వాగత తోరణంఅర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. మనం చూస్తున్న ఈ వైభవం వెనుక ఎందరో కృషి దాగి ఉంది. మనం అనుభవిస్తున్న నేటి సౌకర్యాల వెనుక మన పూర్వీకులు చిందించిన చెమటచుక్కల ఫలితమే. ఒకనాటి వేములవాడ స్వాగత తోరణంఆనాటి ఊరి ముఖద్వారం -
వనభోజనాల్లో విషాదం
● ఈతకు వెళ్లి మానేరులో మునిగి వ్యక్తి మృతి సుల్తానాబాద్రూరల్: ఆదివారం సరదాగా గడిపేందుకు వనభోజనాలకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. అప్పటి వరకు అందరూ కలిసి వంటలు పూర్తి చేసుకొని.. భోజనాలకు సిద్ధమవుతుండగా ఈతకొట్టేందుకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు. సుల్తానాబాద్ పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన కారు డ్రైవర్ ఎం.డి.జహంగీర్(38) ఆదివారం భార్య, కూతుళ్లు, అల్లుళ్లు, తన బాబాయి కూతుళ్లు, అల్లుళ్లతో కలిసి నీరుకుల్లలోని మానేటి శ్రీరంగనాయకస్వామి ఆలయం సమీపంలో వన భోజనాలకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి వంటలు చేసుకున్నారు. భోజనం చేసేందుకు సిద్ధమవుతుండగా తన బాబాయ్, అల్లుళ్లతో కలిసి మానేరువాగులో ఈత కొట్టేందుకు దిగారు. జహంగీర్ ఊపిరి ఆడక ఈత కొట్టలేకపోయాడు. నీటిలో మునిగిపోతున్న జహంగీర్ను కుటుంబ సభ్యులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. దీంతో నీరుకుల్ల గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా మృతదేహం బయటపడింది. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరిపై దాడి.. కేసు నమోదుమానకొండూర్: మండలకేంద్రంలోని తూర్పు దర్వాజా సమీపంలో శనివారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయగా.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మానకొండూర్ రాజీవ్నగర్ కాలనీకి చెందిన పార్వతం నరసింహ(30) తన తమ్ముడు సిరిగిరి హరీశ్తో కలిసి కిరాణాషాపునకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన సుధీర్, ప్రణయ్, చింటూ అడ్డుకుని దాడి చేశారు. నరసింహ రోడ్డు పక్కనున్న డ్రైనేజీలో గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ పి.శ్రీలత తెలిపారు. గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్జమ్మికుంట: పట్టణంలో గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మంద్రమర్రికి చెందిన నాగిరెడ్డి హరిప్రసాద్, వెంకటాపురం గ్రామానికి చెందిన దుర్గం కార్తీక్ గంజాయికి బానిసయ్యారు. గంజాయి విక్రయించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించొచ్చని ఆలోచన చేశారరు. ఈ నెల 15న మహారాష్ట్రలోని నాగపూర్ వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని ఓ వ్యక్తి వద్ద రూ.11,400 విలువ చేసే 230 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. ఆదివారం జమ్మికుంటకు వచ్చి ఎఫ్సీఐ ప్రాంతంలో గంజాయి అమ్మేందుకు యత్నిస్తుండగా గస్తీలో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. -
అర్హుల ఓట్లు తొలగకుండా చూడాలి
కరీంనగర్ కార్పొరేషన్: అర్హుల ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా బీఎల్ఏలు చూడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కో ఇన్చార్జి సచిన్ సావంత్ అన్నారు. ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ కార్పొరేషన్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పొలిటికల్ అడ్వైజరీ కమిటీల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా తొలగిపోతుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగనున్న ఓట్లపై మరోసారి దృష్టి సారించి, అర్హులైన ఓటర్లు ఉంటే తిరిగి చేర్చేలా చర్యలు తీసుకో వాలన్నారు. సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు బీజే పీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్, నేతలపై సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూ చించారు. ఈ నెల 31లోగా మండల, డివిజన్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. కాగా కరీంనగర్లో పార్టీకి నాయకత్వ లోపం ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్నాయక్ ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేతతో తిరిగి పార్టీలోకి వచ్చిన పురుమల్ల శ్రీనివాస్ కార్యాలయానికి వచ్చి, తనను కూడా పీఏసీ సమావేశాలకు ఆహ్వానించాలని సావంత్ను కోరారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, వుట్కూరి నరేందర్ రెడ్డి, కర్ర సత్య ప్రసన్నరెడ్డి, ఎండీ.తాజ్, పులి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్వోబీ పనులు వెంటనే పూర్తి చేయాలి
కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులు వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు సూచనల మేరకు 3వ డివిజన్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైల్వేట్రాక్ వద్ద ఆదివారం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య మాట్లాడుతూ మూడేళ్ల నుంచి కొనసాగుతున్న ఆర్వోబీ పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్రమంత్రి బండి సంజయ్ పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కాశెట్టి శ్రీనివాస్, భాస్కర్ నాయక్, కొలగాని అనిల్, మనోహర్, రాము పాల్గొన్నారు. 1న హైదరాబాద్లో భారీ ధర్నాకరీంనగర్ టౌన్: పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్లో భారీ ధర్నా చేపట్టనున్నట్లు సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్లో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద 50వేల మందితో భారీ ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇటీవల మరణించిన ఉపాధ్యాయులు వావిలాలసుధ (రామడుగు), ముస్తఫా అహ్మ ద్ కుటుంబాలను పరామర్శించి సంఘం తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఐలేని కరుణాకర్రెడ్డి, మర్రి జయపాల్ రెడ్డి, అబ్దుల్ జమీల్, లక్ష్మీనారాయణ, తిరుపతిరెడ్డి, లింగారెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీని వాస్రెడ్డి, ముజీబ్, గౌస్ఖాన్ పాల్గొన్నారు. సివిల్స్ శిక్షణ పరీక్షలు పూర్తికరీంనగర్టౌన్: కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కి ల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ శిక్షణ ఎంపిక పరీక్షలు ఆదివారం ముగిశాయి. జ్యోతిష్మతి, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు మొదటి షిఫ్ట్ పరీక్షలు జరిగాయి. 101మంది హాజరైనట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. రంగస్థల కళాకారుల రాష్ట్ర కార్యవర్గంకరీంనగర్కల్చరల్: రాష్ట్ర రంగస్థల కళాకారుల వేదిక నూతన కార్యవర్గాన్ని సప్తగిరికాలనీలోని కోదండ రామాలయంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బోళ్ల కొమురెల్లి, రాష్ట్ర అధ్యక్షుడిగా తాళ్లపల్లి సంపత్గౌడ్, కార్యనిర్వహక అధ్యక్షుడిగా అందె స్వామి, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు రాములు, కోశాధికారిగా గాండ్ల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు అబ్బిడి రాంరెడ్డి, కూకట్ల తిరుపతి ప్రకటించారు. కార్యవర్గ సభ్యులుగా శ్రావణపల్లి శ్రీనివాస్, ఆరెల్లి లక్ష్మీకళ, ఆడెపు ద్వితీయ చందు, తాళ్లపల్లి రాజేశం, నర్సింగోసు రవీంద్రాచారి, పెనుకుల తిరుప తి, పన్నాటి సంతోష్కుమార్, మంథని సరిత, తోట విజయ, ముత్యాల సంతోష్, తిప్పారపు ముత్యం, పొన్నం పరశురాములు, బొమ్మరవేణి రాజేశం ఎన్నికయ్యారు. ‘అసత్య ప్రచారం చేస్తున్నారు’ విద్యానగర్(కరీంనగర్): పదవుల కాంక్షతో కొన్ని యూనియన్లు అసత్య ప్రచారాలతో కార్మి కుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏవీఆర్రెడ్డి అన్నారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఏవీఆర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ను గెలింపించాలని కోరారు. -
ఫొటో తీయట్లే.. బిల్లు పడ్తలే!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వార్డు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. క్షేత్రస్థాయి పరిశీలన, జియో ట్యాగింగ్ సకాలంలో జరగకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఫొటో తీసే తీరిక లేక లబ్ధిదా రులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తీరిక లేక కాదని, కావాలనే చేస్తున్నారనే అనుమానమూ ఉంది. ప్రస్తుతం నగరంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇది ప్రధాన సమస్యగా మారింది. బిల్లుల చెల్లింపు ఇలా ఇందిరమ్మ పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు నాలుగు విడుతల్లో చెల్లిస్తోంది. పునాది పూర్తి చేస్తే రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు, తలుపులు, కిటికీలు, రంగులు సహా పనులు మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష అందిస్తోంది. ప్రతి దశ పూర్తయిన తరువాత నగరంలో సంబంధిత వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ద్వారా నిర్మాణ ఫొటోలను జియోట్యాగింగ్తో అప్లోడ్ చేయాలి. ఆమోదం పొందితే లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమవుతాయి. ఫోటో తీయట్లే నగరంలోని పలు డివిజన్లలో వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ఫొటోలు తీసి అప్లోడ్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్మాణం పూర్తయ్యాక వార్డు అధికారులకు సమాచారం ఇస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హౌసింగ్ అధికారులూ పట్టించుకోవడం లేదు. ఎస్ఐఆర్ విధుల్లో ఉన్నామని, బిజీగా ఉన్నామని, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్ఐఆర్ ఈ నెల 10వ తేదీతో ముగియగా.. రెండు నిమిషాల సమయం కేటాయించే తీరిక లేకుండా చేసే విధులు ఏంటని లబ్ధిదారులు ప్రశ్ని స్తున్నారు. డివిజన్లో ఇతర పనుల కోసం తిరుగుతున్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఫొటో తీసే అవకాశం ఉన్నా.. కావాలనే వాయిదా వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలైనా బిల్లు జాడ లేదు... కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఆరు నెలలుగడుస్తున్నా బిల్లులు రావడం లేదు. నిర్మాణాలను దశలవారీగా ఫొటో తీయకపోవడంతోనే బిల్లులు పడడం లేదని వాపోతున్నారు. అప్పులు చేసి ఇంటిని నిర్మిస్తే వార్డు అధికారుల నిర్వాకంతో ఆర్థికభారం పడుతోందని అంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన కనిపించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న ఫొటోలను అప్లోడ్ చేయాలని, సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.ఇందిరమ్మ ఇండ్ల వివరాలు నగరంలో డివిజన్లు 66మంజూరైన ఇండ్లు 1,737నిర్మాణంలో ఉన్నవి 1,620పూర్తయినవి 22125వ డివిజన్ పరిధిలోని సుభాష్నగర్లో పిల్లి శ్రీలత ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు బిల్లు రావడం లేదు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పుల వడ్డీలు పెరిగిపోతోంది. నెల, రెండు నెలల్లో బిల్లులు వస్తే చెల్లించొచ్చు అనుకుంటే ఆరు నెలలు గడుస్తున్నా బిల్లు జాడ లేకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి పెంచుతున్నారు.నగరపాలకసంస్థ 27వ డివిజన్ అంబేడ్కర్నగర్కు చెందిన మణిమాలకు సంబంధించిన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇది. పునాదిస్థాయి పూర్తయిన తరువాత రూ.లక్ష బిల్లు వచ్చింది. పైకప్పు వరకు గోడల నిర్మాణం పూర్తయింది. వార్డు అధికారి వచ్చి ఇంటినిర్మాణ ఫొటో తీసి, జియోట్యాగింగ్తో యాప్లో అప్లోడ్ చేస్తే మరో రూ.లక్ష బిల్లు వస్తుంది. 45 రోజులు అవుతున్నా వార్డు అధికారికి ఫొటో తీసే తీరిక లేకుండా పోయింది. ఫొటో తీస్తేనే స్లాబ్ వేసుకోవాల్సి ఉండడంతో లబ్ధిదారులకు తప్పనిసరి నిరీక్షణ తప్పడం లేదు. -
నిధులు లేవు.. వైద్యులు లేరు
కరీంనగర్: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాల న్న ప్రభుత్వ లక్ష్యం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. ఒకవైపు నిధుల లేమి.. మరో వైపు వైద్యుల కొరత.. మందుల అరకొర సరఫరా.. వెరసి ఆస్పత్రి నిర్వహణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షతన జరిగే సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యే అవకాశముంది. సదుపాయాలు, నిధుల కొరత, మందులు, వైద్యుల నియామకాలు, భవనాల మరమ్మతులు తదితర అంశాలపై చర్చించనున్నారు. బకాయిలు రాక భారంగా నిర్వహణ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం నుంచి సుమారు రూ.4.5 కోట్లు, మెడికల్ బిల్లులకు సంబంధించి రూ.4 కోట్లు, విద్యుత్ బిల్లులకు మరో రూ.4 కోట్లు ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉండడంతో నిర్వహణపైనా ప్రభావం పడుతోంది. మందులను బైహ్యాండ్ సప్లయి ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా మందులు సరఫరా చేసేందుకు నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు. క్రిటికల్ కేర్కు వైద్యులేరీ? జీజీహెచ్లో క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించి ఏడాది గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకాలు జరగలేదు. 2డీ ఎకో మిషన్ ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించే వైద్యులు అందుబాటులో లేరు. క్రిటికల్కేర్కు అవసరమైన కార్డియాక్, న్యూరో, నెఫ్రాలజీ వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉంది. పెచ్చులూడుతున్న పాత భవనం జీజీహెచ్లో మరో ప్రధాన సమస్య పాత భవనం. సరైన నిర్వహణ, మరమ్మతులు లేక భవనం పలు చోట్ల పైకప్పులు, గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగులు, సహాయకులు, వైద్య సిబ్బందికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భవనానికి తక్షణ మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. నిధుల కొరతను అధిగమించేందుకు బకాయిలు విడుదల చేయడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. నిధుల విడుదల, వైద్యుల నియామకాలు, మందుల సరఫరా, భవనాల మరమ్మతులకు కార్యాచరణ రూపొందిస్తేనే జీజీహెచ్లో సేవలు మెరుగుపడే అవకాశముంది. -
ఆర్టీపీసీఆర్ కిట్లు లేవు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఈ వైరస్ బారిన పడి పలువురు మృతి చెందుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇంకా సంసిద్ధంగా లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతవారం ఒకే రోజు 12 మందికిపైగా బాధితులు ప్రాణాలు కోల్పోవడం వైరస్ తీవ్రతకు అద్ధం పడుతోంది. నిత్యం ఏపీ నుంచి తెలంగాణతో పాటు ఉమ్మడి కరీంనగర్ లక్షలాది మంది ప్రయాణాలు సాగిస్తారు. ఈ క్రమంలోనే పలువురు తెలంగాణవాసులకూ కోవిడ్ సోకుతోంది. లక్షణాలతో పరీక్షలు చేయించుకుందామనుకుని ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఆర్టీపీసీఆర్ కిట్లు లేవని తిప్పి పంపుతున్నారు. ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. వరంగల్ ఎంజీఎంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. వెలుగు చూసిందిలా జూలై చివరివారంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నుంచి పలువురు స్నేహితుల బృందం విజయవాడ వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగొచ్చాక బృందంలో కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పరీక్షలు జరిపేందుకు ఆర్టీపీసీఆర్తోపాటు ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు లేవని సిబ్బంది చెప్పడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు తీయాల్సి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో చివరికి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తీరా అక్కడ కోవిడ్ పాజిటివ్గా తేల్చారు. ఆ బృందంలోని ఇతర జిల్లాలకు చెందిన వారూ ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే కిట్లు లేవని తిప్పిపంపారు. గతంలో ఎలా ఉండేది? కోవిడ్–19 ప్రారంభంలో ర్యాపిడ్ కిట్లతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. తర్వాత ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కరోనా సోకిన వారి కి ప్రభుత్వాసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం అందించి చాలా మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ విస్తరిస్తున్నప్పటికీ తెలంగాణలో ఆరోగ్యశాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.ఆదేశాలు లేవు కరోనా లక్షణాలతో ఇప్పటి వరకు ఎవరు జీజీహెచ్కు రాలేదు. ప్రభుత్వం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి ఆదేశాలు లేవు. ఆర్టీపీసీఆర్ కిట్లు కూడా పంపించలేదు. కరోనా అనుమానిత కేసులు వస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించి కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తాం. – డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్ కరీంనగర్ -
కరీంనగర్
7భీమేశ్వరా పాహిమాం వేములవాడ: భీమేశ్వరస్వామిని ఆదివారం 35 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.41 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.నృసింహుని సేవలో కలెక్టర్ ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్వామివారి ప్రసాదం అందజేశారు.సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026 -
సొంత మరమ్మతు.. ప్రాణాలకు ముప్పు
● వర్షాల వేళ కరెంట్తో పొంచి ఉన్న ప్రమాదాలు ● జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు ‘ఈ ఫొటోలో విద్యుత్ షాక్తో మృతిచెందిన వ్యక్తి దర్ర రాజన్న. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శంకరావుపేట. గత జూలైలో తన పొలంలో వ్యవసాయ పనులు మొదలుపెట్టాడు. విద్యుత్ మోటార్ సరి చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్తో మృతిచెందగా, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు’. ● ‘గతేడాది జూన్లో కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన జూనియర్ లైన్మెన్ దుంపేట రాజేశం (40) వాల్గొండలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతిచెందాడు’. ● ‘2025 అక్టోబర్లో ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో అడవిపందుల నుంచి పంటలు కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి షాక్తో వ్యవసాయ కూలీ ప్రాణాలు కోల్పోయాడు’. ● ‘గతేడాది ఆగస్ట్లో సారంగాపూర్ మండలం పెంబట్లలో డిష్ తీగలు సరిచేస్తుండగా విద్యుత్ షాక్తో పల్లికొండ మహేశ్ మృతి చెందాడు’. గొల్లపల్లి: ‘వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వినియోగదారులు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా మరమ్మతు చేయవద్దు’ అని విద్యుత్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం, పొలాల చుట్టూ వేలాడే తీగలు, తడిసిన విద్యుత్ పరికరాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. విద్యుత్ వినియోగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదమని, రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో నష్టం వాటిల్లితే సంబంధిత సంస్థల ద్వారా లభించే పరిహారం వివరాలు.. ● మనుషులు మరణిస్తే: రూ.8 లక్షలు ● ఆవులు, గేదెలు మృతిచెందితే: రూ.45 వేలు (ప్రతి దానికి) ● మేకలు, గొర్రెలు మృతిచెందితే: రూ.5 వేలు (ప్రతి దానికి) గమనిక: పరిహారం పొందడానికి ప్రమాదానికి సంబంధించిన పోలీసు ఫిర్యాదు, పోస్టుమార్టం రిపోర్టును సంబంధిత అధికారులకు సమర్పించాలి. పరిహారం దక్కే సందర్భాలు ● అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడి మనుషులు లేదా పశువులు మరణించినప్పుడు ● లో వోల్టేజ్ సమస్యలు లేదా ట్రాన్స్ఫార్మర్ లోపాల వల్ల విద్యుత్ ప్రసారమై మృతిచెందినప్పుడు ● తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదం జరిగినప్పుడురైతులు పాటించాల్సిన జాగ్రత్తలు రక్షణ వేదిక: మోటార్లను నేరుగా నేలపై ఉంచకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిమెంట్/కాంక్రీట్ గట్లపై అమర్చుకోవాలి. స్టార్టర్ బోర్డులు: వర్షపు నీరు తగలకుండా స్టార్టర్ బోర్డులకు తగిన రక్షణ (షెడ్) కల్పించాలి. నిపుణుల సేవలు: మోటార్లు పనిచేయకపోయినా లేదా ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలున్నా సొంతంగా బాగు చేయకుండా, తక్షణమే అర్హులైన టెక్నీషియన్లను లేదా లైన్మెన్లను పిలిపించాలి. వైరింగ్ తనిఖీ: పొలాల్లో విద్యుత్ తీగలు, వైరింగ్ లైన్లను నిత్యం తనిఖీ చేస్తూ ప్లాస్టరింగ్/ఇన్సులేషన్ చర్యలు తీసుకోవాలి. సొంత వైరింగ్ వద్దు: తెగిపడిన వైర్లను పొలాల చుట్టూ రైతులు సొంతంగా అమర్చుకోకూడదు. -
రామగుండంలో నూతన ట్రాక్షన్ విద్యుత్ సబ్స్టేషన్
రామగుండం: రామగుండం–మణుగూర్ నూతన రైల్వే ప్రాజెక్టు, పూర్తిస్థాయి వినియోగంలోకి మూడో రైల్వే లైన్, పెరిగిన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు, వివిధ పరిశ్రమలకు పెరిగిన గూడ్సు ఎగుమతులు నేపథ్యంలో విద్యుత్ వినియోగ సామర్థ్యం పెంచుకునేందుకు రామగుండం రైల్వేస్టేషన్ ప్రధాన రైల్వేలైన్ పక్కనే ట్రాక్షన్ సబ్స్టేషన్ ఏర్పాటుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగా టీఎస్ఎస్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.8.46 కోట్ల నిధులు కేంద్రం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీనిని టీజీ ట్రాన్స్కో చీఫ్ ఇంజినీర్ ప్రాజెక్ట్సు–2 ఉన్నతాధికారి పర్యవేక్షణ చేపట్టనుంది. -
భవానీమాతకు ఒడిబియ్యం
విద్యానగర్(కరీంనగర్): శ్రావణ ఆదివారం సందర్భంగా నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారు విఽశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి చీరె సారె సమర్పించి ఒడిబియ్యం పోశారు. సుల్తానాబాద్ నుంచి ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, వనభోజనాలు చేశారు. విశ్వహిందు పరిషత్, భజరంగదళ్ బృందం కరీంనగర్ నుంచి బైక్ర్యాలీగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, నీరుమల్ల తిరుపతి, శివరాం, హరిశ్చంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆదుకుంటే.. కుటుంబం నిలబడుతుంది
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్కు చెందిన రామంచ లచ్చయ్య (58) తీవ్రమైన ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అంతటి పెద్ద మొత్తంలో వైద్యఖర్చులు భరించే శక్తి లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లచ్చయ్య ప్రాణాలను నిలిపేందుకు గ్రామస్తులు, దాతలు, యువత, స్వచ్ఛంద సంస్థలు ఉదారంగా స్పందించి, ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. లచ్చయ్య కొడుకు శోభన్బాబును 96033 84576లో సంప్రదించాలని వేడుకుంటున్నారు. మంచానికి పరిమితమైన లచ్చయ్య -
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ శివారులో ఆదివారం రెండు బైక్లు ఢీకొట్టిన సంఘటనలో పలువురు గాయపడ్డారు. పోతుగల్కు చెందిన సాయి బైక్పై ముస్తాబాద్ నుంచి పోతుగల్ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఆవునూర్ నుంచి ముస్తాబాద్ వైపు వస్తున్న రాకేశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఒకే రూట్లో రెండు బైక్లు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో సాయి కాలు విరిగింది. రాకేశ్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పెద్దమ్మ ఆలయంలో చోరీ
రామగిరి: మండలంలోని బేగంపేట శివారు తాటివనం వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ ఆలయాన్ని శుభ్రం చేసేందుకు ఉదయం మధునమ్మ అనే మహిళ వెళ్లగా ఆలయ తలుపులు, తాళాలు పగులగొట్టి హుండీని ధ్వంసం చేయడంతో ఆలయ చైర్మన్ బొంతల రవికి సమాచారం అందించింది. పూజారి, చైర్మన్ కలిసి ఆలయాన్ని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించగా మంథని సీఐ బి.స్వామి, రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్ పరిశీలించి క్లూస్టీంతో వివరాలు సేకరించారు. ఆలయ చైర్మన్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాడవేని శ్రీనివాస్ తెలిపారు. -
మహిళను కాపాడిన పోలీసులు
కాశిబుగ్గ: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఆత్మహత్యకు యత్నిస్తోందన్న సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వరంగల్ మట్టెవాడ పోలీసులు ఆమెను గుర్తించి కాపాడారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చందా నవ్య.. వరంగల్ భద్రకాళి ఆలయానికి శనివారం వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం, ఆరోగ్యం సరిగాలేక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తన భర్తకు కాల్ చేసి చెప్పింది. ఆమె భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బీట్ కానిస్టేబుల్ కల్యాణ్కుమార్ అక్కడికి వెళ్లి భద్రకాళి గుడి సమీపంలో ఆమెను గుర్తించారు. అనంతరం మట్టెవాడ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత ఆనంద్కు సమాచారం ఇచ్చి అప్పగించారు. -
నాట్య మయూరాలు
చిన్న వయసులోనే నాట్యకళపై ఆసక్తి పెంచుకుని కూచిపూడి, జానపద నృత్యాలతో రాష్ట్రస్థాయి వేదికలపై సత్తాచాటారు హుజూరాబాద్కు చెందిన చిన్నారులు. పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన యల్చల మహేందర్రెడ్డి–వినోద దంపతులకు ఇద్దరు కుమార్తెలు నిర్విరెడ్డి, దేవ్నారెడ్డి. చిన్నప్పటి నుంచే కూచిపూడి, జానపద నృత్యాల మీద ఆసక్తిని పెంచారు. పెద్దకూతురు నిర్విరెడ్డి ఇటీవల రాష్ట్రస్థాయి కళా ఉత్సవంలో జానపద నృత్యం జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి కై వసం చేసుకుంది. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం విజయవాడ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో నిర్విరెడ్డి నాట్య ప్రతిభతో ఆకట్టుకున్నట్లు నాట్యగురువు కొంతం వెంకటేశ్వర్లు తెలిపారు. చిన్న వయసులోనే ఎన్నో ఘనతలు నిర్విరెడ్డి ఇప్పటికే కూచిపూడి నృత్యంలోనూ పలు అవార్డులు సాధించింది. రాజమండ్రికి చెందిన శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో సబ్జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి, కరీంనగర్ రెయిన్ స్టార్ డాన్స్ అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి, వరంగల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కల్చరల్ కాంపిటీషన్లో ప్రథమ బహుమతి సాధించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, గుంటూరులోని సనాతన నృత్య కళా విభాగం, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, హైదరాబాద్, వీవీఐటీ బాలోత్సవ్ వంటి వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు అందుకుంది. రెండేళ్లలోనే అద్భుత ప్రస్థానం హుజూరాబాద్లో ఎన్సీఎన్ కళాక్షేత్రం ప్రారంభమైనప్పటి నుంచి నిర్విరెడ్డి కూచిపూడి, జానపద నృత్యాలను గురువు కొంతం వెంకటేశ్వర్లు వద్ద అభ్యసిస్తోంది. ఈమె చెల్లెలు దేవ్నారెడ్డి కూడా అక్కతో కలిసి కూచిపూడి నృత్యంలో పలు ప్రదర్శనలు ఇచ్చింది. -
విత్తనోత్పత్తి కంపెనీల దగా
వీణవంక: వర్షాభావ పరిస్థితులను అధిగమించి ధాన్యం పండించిన రైతులకు విత్తనోత్పత్తి కంపెనీలు చేయిచ్చాయి. ఆశించిన స్థాయి కంటే మూడొంతుల దిగుబడి వచ్చిందని రైతులు సంబరపడితే, అధిక దిగుబడి వచ్చిందని, విత్తనం అమ్ముడుపోవడం లేదని కంపెనీలు చేతులెత్తేశాయి. రైతులు పండించిన సీడ్ (ఆడ, మగ)ను తీసుకెళ్లిన కంపెనీలు.. 20 రోజుల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పి 80 రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మరో పక్క వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని కంపెనీలు డబ్బు చెల్లించినా కొందరు డీలర్లు తమ ఖాతలో జమ చేసుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆడ, మగ వరి 1.20లక్షల ఎకరాలు, 22వేల ఎకరాల్లో మక్క సాగు చేశారు. వరి క్వింటాల్కు రూ.6 వేల నుంచి 20వేలు ఉండగా, మక్క క్వింటాల్కు రూ.2 వేల నుంచి 3,300 వరకు కంపెనీలు ధరలు నిర్ణయించాయి. ఈ లెక్కన రూ.150కోట్లకు పైగా కంపెనీలు రైతులకు బకాయి పడినట్లు సమాచారం. ఇక్కడి నేలలు అనుకూలం రాష్ట్రంలోనే హైబ్రిడ్ (ఆడ, మగ) సీడ్ వరి, మక్క సాగులో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విత్తనోత్పత్తికి ఇక్కడి నెలలు అనువుగా ఉన్నాయి. అందుకే జిల్లాలో సాగు చేయడానికి 50కి పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. 48 ఏళ్లుగా ఇక్కడి రైతులు ఈ పంటలు సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తులను తీసుకెళ్లిన తర్వాత కొన్ని కంపెనీలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేస్తుండగా, మరికొన్నిడీలర్ల ద్వారా ఇస్తున్నాయి. దీంతో కొందరు డీలర్లు సొంత అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఒప్పందం ప్రకారం చెల్లిస్తామని కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో రైతులు సాగు చేశారు. కానీ, వానాకాలం ప్రారంభమైనా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు. అంతేకాకుండా కంపెనీలు మరో మాయాజాలానికి తెరలేపాయి. క్వింటాల్కు 10–15కిలోల చొప్పున తరుగు పేరిట దోపిడీకి దిగుతున్నాయి. అప్పులపాలైన ఆర్గనైజర్లు సీడ్ కంపెనీలు నేరుగా రైతుకు విత్తనం ఇవ్వకుండా ఆయా గ్రామాల్లో డీలర్ల(ఆర్గనైజర్లు)ను నియమిస్తుంది. వారి ద్వారా విత్తనాలను రైతులకు అంటగడుతుంటారు. దీంతో ఏ సమస్య వచ్చినా రైతులు డీలర్లను మాత్రమే ఆశ్రయించాలి. నేరుగా కంపెనీకి వెళ్లకుండా యాజమాన్యాలు తమ మాయజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే కొందరు డీలర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని ఓ డీలర్ 600ఎకరాలకు పైగా మక్క విత్తనాలు ఇచ్చాడు. ఇందులో కొంత కంపెనీ ఇవ్వగా, మిగిలినది తన సొంతంగా ఇచ్చాడు. కానీ, ఈసారి మార్కెట్లో మక్కకు డిమాండ్ లేక సదరు డీలర్ చేతులెత్తేశాడు. మరికొందరు డీలర్లు గత్యంతరం లేక రూ.లక్షలో అప్పు తెచ్చి రైతులకు చెల్లించారు. దీంతో వారు రోడ్డునపడే దుస్థితి నెలకొంది. కాగా, గతంలో ఇదే డీలర్లు రైతులను నిలువుదోపిడీ చేసి రూ.లక్షల్లో సంపాదించారు. ఈ సారీ మాత్రం వారికి గడ్డు పరిస్థితి ఎదురైంది రూ.150కోట్లకు పైగా పెండింగ్ హైబ్రిడ్ వరిని శంకరపట్నం, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడేడు, జగిత్యాల జిల్లాలో సాగు చేస్తున్నారు. ఎకరాకు 8క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కంపెనీలు ఆశించగా, ఈసారి వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 15క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. కంపెనీలు మాత్రం టార్గెట్ కంటే మూడొంతులు ఎక్కువ దిగుబడి వచ్చిందని, ఎల్నినో ప్రభావంతో విత్తనం అమ్ముడుపోవడంలేదనే సాకుతో డబ్బులు చెల్లించడంలేదనే ఆరోపణలున్నాయి. మక్క, వరి కలిపి రూ.150కోట్లకు పైగా కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉందని ఓ డీలర్ చెప్పుకొచ్చాడు. హుజూరాబాద్ నియోజ్కవర్గంలోని ఓ డీలర్కు రూ.30కోట్లు రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు కలుగజేసుకొని సకాలంలో డబ్బులు వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు. సీడ్ ధాన్యం ఉత్పత్తులను తీసుకెళ్లిన కంపెనీలు 80 రోజులు గడిచినా రైతులకు అందని సొమ్ము ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి, మక్క కలిపి రూ.150 కోట్లకు పైగా పెండింగ్ శ్రమకు తగిన ఫలితం రాక రైతుల కుదేలు ‘వీణవంక మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు రెండెకరాల్లో ఆడ, మగ వరి.. మరో రెండెకరాలు ఆడ, మగ మక్క వేశాడు. వరి ఎకరాన రూ.1.20 లక్షల చొప్పున, రూ.80 వేల చొప్పున మక్క మొత్తం రూ.4లక్షల దిగుబడి వచ్చింది. అదే గ్రామానికి చెందిన కంపెనీ డీలర్ నెల రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి ఉత్పత్తులను తీసుకెళ్లాడు. ఇప్పటికీ 80రోజులు గడిచినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. పిల్లల చదువులకు ఫీజు కట్టాలని ఎంత మొరపెట్టుకున్నా కంపెనీలు డబ్బులు ఇవ్వడం లేదని, రోజూ దాటవేస్తున్నారని సదురు రైతు వాపోయాడు. కంపెనీల మాయలో రైతులు, డీలర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదీ ఈ ఒక్క రైతు దుస్థితి కాదు. ఆడ, మగ పంటలు సాగు చేసిన రైతుల దీనస్థితి’. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వని కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నాకున్న రెండెకరాల్లో మక్క సాగు చేసిన .60క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.1.80లక్షలు రావాల్సి ఉంది. రెండునెలలుగా డీలర్ను అడుగుతున్న. రేపు మాపంటూ అరిగోస పెడుతుండు. మంత్రి కలుగజేసుకొని కంపెనీల నుంచి డబ్బులు ఇప్పించాలి. – సంపత్, రైతు, వీణవంక -
సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్రూరల్: కరీంనగర్రూరల్ పోలీస్స్టేషన్ సీఐ అనుముల నిరంజన్రెడ్డి పోలీస్సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించగా శనివారం స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అసాంఘిక శక్తుల అణచివేత, మావోయిస్టుల ఏరివేతలో అత్యున్నత సేవలందించి ప్రస్తుతం కరీంనగర్రూరల్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న నిరంజన్రెడ్డి 2025 సంవత్సరం ఐపీఎం అవార్డుకు ఎంపికయ్యారు. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు.. 1989లో కానిస్టేబుల్గా ఎంపికై న నిరంజన్రెడ్డి పోలీస్ శిక్షణ అనంతరం 1990లో జగిత్యాల రూరల్పోలీస్స్టేషన్లో తొలిపోస్టింగ్ పొందారు. నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పలు ఎదురుకాల్పుల్లో విధులు నిర్వహించారు. నిరంజన్రెడ్డి సేవలను గుర్తించిన అప్పటి కరీంనగర్ జిల్లా ఎస్పీ రత్నారెడ్డి తక్కువ సర్వీస్లోనే హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించారు. 1992లో స్వగ్రామం వరంగల్ జిల్లాకు వెళ్తున్న క్రమంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నిరంజన్రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. ధైర్యంగా మావోయిస్టులపై ఎదురుకాల్పులు జరిపి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ధైర్యసాహసాలు, విశిష్టసేవలను అప్పటి ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి సేవాపతకం, ముఖ్యమంత్రి ఉత్తమ సేవాపతకంతో సత్కరించింది. అనంతరం 1994లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్లలోని వీర్నపల్లిలో సీఆర్పీఎఫ్ పోలీస్క్యాంప్ గైడ్గా నిరంజన్రెడ్డి వ్యవహరించారు. నక్సలైట్ల నుంచి బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కీలకంగా పనిచేశారు. 1994 సంవత్సరం తర్వాత ఎస్సైగా, 2023లో సీఐగా ప్రమోషన్ పొందారు. ఎస్సైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో పనిచేసిన ఆయన సీఐగా విజిలెన్స్, ఇంటెలిజెన్స్తోపాటు మెట్పల్లిలో సేవలందించారు. సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేపట్టారు. ప్రస్తుతం కరీంనగర్రూరల్ సీఐగా పనిచేస్తున్న నిరంజన్రెడ్డి డ్రగ్స్ నిర్మూలన, ఇసుక అక్రమరవాణా నియంత్రణ, సైబర్క్రైంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండియన్ పోలీస్ మెడల్ రావడంలో ప్రజలు అందించిన సహకారం, ఉన్నతాధికారులు తన సేవలను గుర్తించి సిఫారసు చేయడం ఎంతో ముఖ్యమైనవన్నారు. ఇప్పటివరకు 82 క్యాష్ రివార్డులు, 64 జీఎస్సీలు, 24 ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు తెలిపారు. సీఎం చేతుల మీదుగా స్వీకరణ -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
కరీంనగర్క్రైం: కరీంనగర్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో షేకబికాలనీ, రేకుర్తి, కొత్తపల్లి మండల పరిధిలో శనివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రేకుర్తి ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాబిక్, మహమ్మద్ షారుక్ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 190 గ్రాముల గంజాయి, ఒక బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కరీంనగర్ రూరల్ ఎకై ్సజ్ స్టేషన్కు అప్పగించినట్లు వెల్లడించారు. దాడుల్లో ట్రైనీ ఎస్సైలు అరుణ్కుమార్, మహేశ్, శ్రీనివాస్, సిబ్బంది రాజు, సతీశ్, రాజేందర్, అక్షర పాల్గొన్నారు. -
నాదం.. సాధనం
విద్యానగర్(కరీంనగర్)/హుజూరాబాద్: పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా పలువురు విద్యార్థులు ఆయా కళల్లో సత్తాచాటుతునాన్నారు. కరీంనగర్ ద్వారకనగర్కు చెందిన భీమనాతిని ప్రణవి కూ చిపూడి, కరాటే, యోగా, చదువులో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. హుజూరాబాద్కు చెందిన నిర్విరెడ్డి, దేవ్నారెడ్డి నాట్యంలో పలు ప్రదర్శనలు ఇస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. నాలుగేళ్లుగా నృత్యం ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ప్రణవి 6వ తరతగతి నుంచి నాలుగేళ్లుగా కూచిపూడి నృత్యం నేర్చుకుని వివిధ వేదికల మీద ప్రదర్శించి అందరితో శభాష్ అనిపించుకుంటుంది. కరీంనగర్ మార్కెట్ రోడ్డులోగల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో తన నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. శ్రీయజ్ఞవరాహస్వామి వార్షికోత్సవాలతోపాటు ఇతర వేదికలపై ప్రదర్శనలిచ్చి అనేక బహుమతులు అందుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని 30 పైగా మెడల్స్ సాధించింది. తండ్రి రంజిత్కుమరా సివిల్ ఇంజినీర్ కాగా తల్లి రమాదేవి ప్రైవేట్ టీచర్. చిన్నప్పటి నుంచి డాన్స్, కరాటేపై మక్కువ చూపిస్తుండడంతో తల్లిదండ్రులు ఆమెకు శిక్షణ ఇప్పించారు. వివిధ కళా సంస్థల ఆధ్వర్యంలో 50పైగా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చిన ప్రణవి నృత్యకారిణి, కరాటే చాంపియన్, యోగా మాస్టార్గా రాణించాలని ఆశిద్దాం.కూచిపూడి, కరాటే ప్రదర్శనలో ప్రణవి నృత్యం, కరాటే, యోగా, చదువులో రాణిస్తున్న చిన్నారులు -
అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య
ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన చింతకింది భూమయ్య (60) అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మధ్యాహ్నం గడ్డి మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అంబులెన్స్లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. కొడుకు నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు.. చొప్పదండి: తాగిన మైకంలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొలిమికుంటలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీకట్ల మహేశ్ (37)కు భార్య సరిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మహేశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. తరుచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో సరిత ఇద్దరు పిల్ల లను హాస్టల్లో ఉంచి చదివిస్తోంది. శుక్రవారం రాత్రి మహేశ్ భార్యతో గొడవపడగా, అదే గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఉదయాన్నే భార్య వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించడంతో మరిది అనిల్కు తెలుపగా ఇరుగుపొరుగుతో కలిసి ఉరి నుంచి కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతుడి సోదరుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై చొరవ.. బాధితుడికి సకాలంలో వైద్యంజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్త నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా బాధితుడు సహకరించకుండా రోడ్డుపై గొడవ చేస్తుండగా, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ గమనించారు. వెంటనే స్పందించిన ఎస్సై, బాధితుడిని తమ వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ఎస్సై సకాలంలో స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. -
అభివృద్ధే మా ఎజెండా!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్: అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, వివిధశాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాల అమలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో మహిళలు, బాలికలు 8.03 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా రూ.366.31 కోట్ల లబ్ధి పొందారన్నా రు. రూ.500కే గ్యాస్ పథకంలో 1.58 లక్షల మందికి 9,23, 755 సిలిండర్లు సరఫరా చేసి రూ.29.78 కోట్ల సబ్సిడీ చెల్లించామన్నారు. గృహజ్యోతి కింద 1,71,622 సర్వీసులకు రూ.182.30 కోట్ల జీరో బిల్లులు జారీ చేశామన్నారు. వానా కాలంసాగుకు 1,92,628మంది రైతుల ఖాతాల్లో రూ.206. 82 కోట్ల రైతుభరోసా జమ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు.. పింఛన్లు జిల్లాకు తొలి విడతలో 10,506 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 8,557 నిర్మాణంలో ఉన్నాయన్నారు. రూ.222 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1,500 ఇళ్లు, పైకప్పుల మార్పునకు 500మందికి రూ.2లక్షల చొప్పున సాయం అందించనున్నామన్నారు. 1,32,229 మందికి నెలకు రూ.30.60 కోట్ల పింఛన్లు అందుతుండగా కొత్తవారికి పింఛన్లు మంజూరు ప్రక్రి య ప్రారంభమైందన్నారు. 47,138 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి 97,013 కుటుంబ సభ్యుల పేర్లు చేర్చామ ని, 3,22,198 కుటుంబాలకు నెలకు 6,063 మెట్రిక్ టన్ను ల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా జనవరి నుంచి 14,932 మందికి శస్త్రచికిత్సలు చేయి ంచి ఆస్పత్రులకు రూ.42.75 కోట్లు చెల్లించామన్నారు. మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి కింద 93 యూనిట్లకు రూ.2.65 కోట్లు మంజూరు చేశామన్నారు. 175 మహిళా సంఘాలకు రూ.26 కోట్ల బ్యాంకు లింకేజీ, గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 1,706 సంఘాలకు రూ.165.74 కోట్ల రుణాలు అందించామన్నారు. 374 మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, కరీంనగర్ అర్బన్, గంగాధరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన.. భూభారతి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 4,290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించామన్నారు. అన్ని గ్రామాల్లో 15 రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టగా కోనేరుపల్లి, వెలిచాల ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయన్నారు. ఈ ఏడాది 2.20 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైందని, 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గత యాసంగిలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. విద్య.. వైద్యం చొప్పదండిలో రూ.37 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. మానకొండూరులో రూ.17.5 కోట్లతో 30 పడకల సామాజిక వైద్యశాల నిర్మాణంలో ఉందన్నారు. కొత్తపల్లిలో రూ.15 కోట్లతో ఆయుష్ ఆస్పత్రి నిర్మించనున్నామన్నారు. కొత్తపల్లి మెడికల్ కళాశాలలో రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం తుది దశకు చేరిందన్నారు. సీఎస్ఆర్ నిధులతో రూ.2.98 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్సులు, వైద్య పరికరాలు సమకూర్చామని తెలిపారు. చొప్పదండి, మానకొండూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో 5,351మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధికి రూ.50 లక్షలు విడుదల చేశామన్నారు. మహిళలు.. బాలల సంక్షేమం 777 అంగన్వాడీల ద్వారా 7,579 మంది గర్భిణులు, బా లింతలు, 42,909 మంది చిన్నారులకు పోషకాహార అందుతోందన్నారు. జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో 151 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామన్నారు. దివ్యాంగులకు 132 సహాయ ఉపకరణాలు, దివ్యాంగులను వివాహం చేసుకున్న 17 జంటలకు బహుమతులు ఇచ్చామని తెలిపారు. నగరాభివృద్ధి.. జనగణన కరీంనగర్లో రూ.840 కోట్ల యూసీఎ ఫ్, రూ.50 కోట్ల యూఐడీఎఫ్, రూ. 158 కోట్ల సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలి పారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రుఫుల్ దేశాయ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలుకరీంనగర్ కల్చరల్: పోలీస్ పరేడ్ గ్రౌండ్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ‘పాడవోయి భారతీయుడా’ పాటకు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. కేజీబీవీ తిమ్మాపూర్ విద్యార్థులు ‘భారత్ మాతా’ పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. మహాత్మజ్యోతిభా పూలే కరీంనగర్ విద్యార్థులు ‘కాబ్ నై హై జీషన్ భారత్’ పాటకు ప్రదర్శన ఇచ్చారు. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ చొప్పదండి విద్యార్థులు ‘జయతి జయతి భారతం’ గీతానికి చేసిన నృత్యం అలరించింది. పారమిత విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. -
ఆధ్యాత్మికం.. త్రివర్ణ శోభితం
● మంకమ్మతోట శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ కరీంనగర్ కల్చరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్లో ఆధ్యాత్మికతకు దేశభక్తి తోడైంది. మంకమ్మతోట శ్రీ వేంకటేశ్వర ఆలయంలో స్వామివారిని జాతీయ జెండాలోని త్రివర్ణాలను ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పుష్పాలతో అలంకరణ చేశారు. దేశ స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ ఆలయ అర్చకులు చేపట్టిన ఈ ప్రత్యేక అలంకరణ ఆధ్యాత్మికతతోపాటు దేశభక్తి సందేశాన్ని చాటింది. త్రివర్ణ పుష్పాల మధ్య కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ప్రశంస.. పదిలంకరీంనగర్ అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా నిర్ణయాన్ని ఉద్యోగ లోకం హర్షించింది. ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం పరిపాటి. ల్యామినేషన్ పేపర్ ద్వారా ఉండే పత్రాలను అందజేస్తుండటం జరిగే ప్రక్రియ. కలెక్టర్ చిత్రామిశ్రా చిరకాలం నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. శనివారం 288 మందికి ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసాపత్రాలు అందజేయగా, వాటికి ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. కాగితం కాకుండా ఫ్రేమ్తో ఇవ్వడంతో ఇంట్లో గుర్తుగా పెట్టుకోవచ్చని, కలెక్టర్ నిర్ణయం బాగుందని సర్వత్రా హర్షం వ్యక్తమైంది. భళా.. వ్యవసాయశాఖకరీంనగర్ అర్బన్: ప్రభుత్వ నిర్ణయాల అమలులో క్రీయాశీలకంగా వ్యవహరించి జిల్లా వ్యవసాయ శాఖ శభాష్ అనిపించుకుంది. శనివారం హైదరాబాద్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికగా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్గా ప్రథమ స్థానం అవార్డు పొందింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మికి ఆ శాఖ డైరెక్టర్ గోపి అవార్డు అందజేశారు. జెండా పంచాయితీ.. పోలీస్ పహారాకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొ గ్ధుంపూర్లో యాదవ సంఘం భవనం వద్ద పోలీస్పహారాలో జాతీయ జెండా ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. జెండాను ఎగురవేసే విషయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య, యాదవ కుల సంఘం ప్రతినిధుల మధ్య వివా దమేర్పడింది. పంచాయితీ పోలీస్స్టేషన్కు చేరింది. శనివారం పోలీసులు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఏటా కుల సంఘం కూకట్ల మల్లయ్య జెండా ఎగురవేయడం అనవాయి తీ వస్తోందని, పెద్దమనిషి మృతిచెందడంతో అతని కుమారుడు తిరుపతికి అవకాశం ఇవ్వాలని యాదవ సంఘం ప్రతినిధులు చెప్పగా సహకార సంఘం అధ్యక్షుడిగా తనకే జెండా ఎగురవేసే అధికారముందని బండి మల్లయ్య తెలిపారు. ఇరువర్గాల వాగ్వాదంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చర్చల అనంతరం ఇరువర్గాల ఆమోదంతో మరో పెద్దమనిషి దాడి నర్సయ్య జాతీయజెండాను ఎగురవేయడంతో వివాదం సద్దుమణిగింది. -
అనుబంధాల ‘రాఖీ’కి తపాలా సేవలు
జమ్మికుంట: అనుబంధాల కు రాఖీ పండుగ మారుపేరుగా నిలుస్తోంది. రాఖీతో సో దర, సోదరీమణుల అనుబంధాలను మరింత దగ్గర చేసేందుకు తపాలాశాఖ తనవంతు సేవలందిస్తోంది. ఐటీపీఎస్, ఇంటర్నేషనల్ టి కెట్ ప్యాకెట్ సర్వీస్ను ప్రత్యేకంగా ప్రారంభించిందని జమ్మికుంట తపాలాశాఖ పోస్టుమాస్టర్ మహేందర్ శనివారం తెలిపారు. ఐటీపీఎస్తో రాఖీలను చౌకధరలతో విదేశాల్లో ఉన్నవారికి పంపే అవకాశం ఉందన్నారు. 20 గ్రాముల లెటర్ రూ.253, 2కిలోల వరకు పార్శిల్ను రూ.660, రెండున్నర కిలోలున్న పార్శిల్ను రూ.1180 చార్జీలతో విదేశాలకు పంపొచ్చని తెలిపారు. పార్శిల్ చేసిన ఏడు రోజుల నుంచి 15రోజుల్లో చేరుతుందన్నారు. ఐటీపీఎస్ సేవలో 2 కిలోల బరువుతో చిన్న పార్శిల్స్, మొదటి నుంచి చివరి వరకు పంపిన వస్తువు ట్రాకింగ్తో తెలుసుకోవచ్చన్నారు. డెలివరీ విషయంలో ఇబ్బందులు ఎదురైతే ఆన్లైన్ ద్వారా సూపరింటెండెంట్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తపాలా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కరీంనగర్ కార్పొరేషన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం నగరపాలకసంస్థ 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలోని మినీస్టేడియం ఆవరణలో బ్లాక్ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరపాలకసంస్థ విస్తృతస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హౌసింగ్బోర్డుకాలనీ మైదానంలో దాదాపు 200 వరకు మొక్కలు నాటడం జరిగిందని వెల్లడించారు. నాటిని మొక్కలు సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాలనీ వాసుల విన్నపం మేరకు సింథటిక్వాకింగ్ట్రాక్, ఓపెన్జిమ్, బోర్వెల్ మోటారు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, అదనపు కమిషనర్ సువార్త, కాలనీ వాసులు పెందోట చారి, గర్రెపల్లి సత్యనారాయణరావు, జాజాల మోహన్రావు, తోట సాగర్, వాడె వెంకటరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మినారాయణ,నల్ల గణపతిరెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్మీలో ఇల్లంతకుంట యువత..
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామం ఆర్మీ జవాన్లకు కేరాఫ్గా నిలుస్తోంది. 1948లో మొదటిసారిగా ఇల్లంతకుంట నుంచి జెట్టిపోచయ్య సైన్యంలో చేరారు.మహమ్మద్ జైనుద్దీన్ సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1985 నుంచి ఆర్మీలో సేవలందించారు. రిటైర్డ్ అయిన తర్వాత రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వీరే కాకుండా బండారి అజయ్, అనిల్, అంతటి అనిల్, గడ్డమీద శ్రీకాంత్, డి.శశి కుమార్, కూనబోయిన పరశురాం, బైరి అనిల్ కుమార్, ఓదెల శివ, ఆనంద్ సైన్యంలో సేవలందిస్తున్నారు. -
అదనపు డీసీపీ పి.వెంకట రమణకు రాష్ట్రపతి పతకం
కరీంనగర్క్రైం: పోలీసుశాఖలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ, కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ (పరిపాలన) పి.వెంకటరమణకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాల్లో భాగంగా ఈ గౌరవం దక్కింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పి.వెంకటరమణ 1991 జూలై 15న ఎస్ఐగా పోలీసుశాఖలో చేరారు. మాండ్రక్స్ మాదకద్రవ్యాల కేసు, అక్రమ ఆయుధాల స్వాధీనం, బిహార్కు చెందిన నేర ముఠాల కేసులు, నకిలీ స్టాంపుల కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించారు. పోలీసుసేవా పతకం, ఉత్తమ సేవా పతకం, కేంద్ర హోం మంత్రిత్వశాఖ దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభకు ఇచ్చే పతకం అందుకున్నారు. 2025 మే 22న అడిషనల్ డీసీపీగా పదోన్నతి పొంది జూన్ 2నుంచి కరీంనగర్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధతతో సేవలందించినందుకు రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. సీపీ గౌస్ ఆలం, అధికారులు అభినందించారు. లీడింగ్ ఫైర్ ఫైటర్ నరసింహాచారికి.. కరీంనగర్క్రైం: అగ్నిమాపకశాఖలో 33ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మానకొండూరుకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ టి.నరసింహచారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్కు ఎంపికయ్యారు. 1993 బ్యాచ్కు చెందిన నరసింహచారి తన సుదీర్ఘ సర్వీసులో అనేక అగ్ని ప్రమాదాలు, రక్షణ చర్యలు, అత్యవసర ఘటనల్లో సేవలందించారు. మూడు దశాబ్దాల్లో ఎలాంటి ప్రతికూల రిమార్క్ లేకుండా విధులు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు, ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడం వంటి కీలక ఘటనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్వోబీతో ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలుకరీంనగర్: ఆర్వోబీ పను ల జాప్యంతో జరుగుతు న్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త డైవర్షన్ రోడ్డు కోసం ఎస్ ఎస్ఆర్ రేట్లను సవరించి టెండర్ పిలిచినట్లు మే యర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’లో ‘డైవర్షన్ టెండర్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మే యర్ స్పందించారు. ఎస్ఎస్ ఆర్ రేట్లు పెరగడంతో పాత రేట్ల ప్రకారం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. గతంలో చేసిన తీర్మానాన్నే కొనసాగిస్తూ, ప్రస్తుతం అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్ పిలిచినట్లు వివరించారు.ఆర్వోబీ డైవర్షన్ రోడ్డు నిర్మాణం మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన పని కాదని, రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు ఆర్అండ్బీశాఖ వద్ద లేవని, పనిని మున్సిపల్ ద్వారా చేపట్టాలని కోరుతూ ఆశాఖ నుంచి లేఖ అందిందన్నారు. దాని ఆధారంగా రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో పాత ధరలకు టెండర్ ఖరారు చేయడం సాధ్యం కాదని, ప్రస్తుత రేట్ల ప్రకారం ప్రక్రియ చేపట్టామని వివరించారు. -
స్మార్ట్రేషన్ కార్డులొచ్చాయ్
కరీంనగర్ అర్బన్: స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లాకు చేరాయి. ఽఆధునిక సాంకేతికతతో ముద్రించగా శాశ్వత కార్డులుగా మిగిలిపోనున్నాయి. కుటుంబ మహిళా పేరుతో కార్డును ముద్రించారు. జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులు శుక్రవారం కలెక్టరేట్కు చేరుకోగా జిల్లా పౌరసరఫరాల అధికారి గట్టు నర్సింగరావు అధికారులతో సన్నాహాక సమావేఽశం నిర్వహించారు. సివిల్ సప్లయ్ నాయబ్ తహసీల్దార్లు పెద్ది విజయ్, ఆకారపు ఉషా, అన్నాడి శ్రీనివాస్రెడ్డి కార్డులను మండలాల వారీగా వేర్వేరుగా విభజించి రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు. శని వారం స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మండలానికి 10కార్డులు పంపిణీ పరేడ్ మైదానంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కార్డులు పంపిణీ చేయనుండగా, ప్రతి మండలంలో 10కార్డులు అందించనున్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక వచ్చిన కార్డుల బాక్స్లను మండలాల వారీగా తహసీల్దార్లకు అప్పగించనుండగా తదుపరి అక్కడి నుంచి గ్రామాలు, పట్టణాల వారీగా రేషన్ డీలర్లకు కార్డులు చేరనున్నాయి. జీపీవోలు, వార్డు అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో కార్డులు పంపిణీ చేయనున్నారు. అధునాతన తరహాలో కార్డు రహస్య భద్రతా గుర్తులు, స్పర్శ ద్వారా గుర్తించే సాంకేతికత, డిజిటల్ ధ్రువీకరణ వంటి పద్ధతులను కార్డులో వినియోగించారు. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన హోలోగ్రామ్ను ముద్రించారు. కార్డు ప్రామాణికతను నిర్ధారించడం, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారుల గుర్తింపును బలోపేతం చేయడం కార్డు లక్ష్యం. అలాగే కార్డులో మైక్రో ప్రింటెడ్ టెక్సట్ను ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అక్షరాలు సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. సాధారణ ప్రింటర్లతో నకిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఇది యాంటీ కాపీ భద్రతా అంశంగా పనిచేస్తుంది. ‘గవర్న మెంట్ ఆఫ్ తెలంగాణ’, ‘ఒరిజినల్’ వంటి అక్షరాలతో ద్వంద్వ రహస్య చిత్రాలను పొందుపరిచారు. కార్డు అసలైనదో కాదో నిర్ధారించేందుకు నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని అతినీలలోహిత కాంతిలో కనిపించేలా ప్రత్యేక సిరాతో ముద్రించారు. అధీకృత సాఫ్ట్వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే ఇందులోని సమాచారాన్ని ధ్రువీకరించేలా రూపొందించారు.స్మార్ట్ రేషన్కార్డుకార్డులపై చర్చిస్తున్న డీఎస్వో నర్సింగరావుమండలం కార్డులు కరీంనగర్ అర్బన్ 63,475 హుజూరాబాద్ 24,165 జమ్మికుంట 24,061 చొప్పదండి 17,775 మానకొండూరు 23,863 కరీంనగర్ రూరల్ 18,036 గంగాధర 17,673 రామడుగు 17,003 వీణవంక 16,944 ఇల్లందకుంట 11,246 శంకరపట్నం 15,785 తిమ్మాపూర్ 16,551 కొత్తపల్లి 18,565 సైదాపూర్ 14,275 చిగురుమామిడి 14,507 గన్నేరువరం 7,290 -
కలెక్షన్ కింగ్ సాయిరాం
సిరిసిల్లటౌన్: చిన్నప్పటి నుంచి పెంచుకున్న దేశభక్తి, గాంధీపై ప్రేమ అతడిని కలెక్షన్ కింగ్గా మార్చింది. దేశంలో స్వాతంత్రం ముందునుంచి, అనంతరం ముద్రించిన కరెన్సీ భద్రపరిచాడు సిరిసిల్లకు చెందిన సాయిరాం. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బాపూజీ బొమ్మలతో వెలువడిన రూపాయి నాణేలనూ సేకరించారు. ఇప్పటి వరకు 200కు పైగా దేశాలకు సంబంధించి వివిధ రకాల నాణేలు, కరెన్సీని సేకరించి సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్లో జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 12 ఏళ్ల వయసులోనే ఈ సేకరణ మొదలైన ఆయన ప్రయత్నం ఇంకా కొనసాగుతోంది. -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్టౌన్: వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. శుక్రవారం రాత్రి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల పోస్టర్, బుక్లెట్ను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి ఓపెన్ స్కూల్ విధానం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. విద్యాభ్యాసానికి వయసు, పరిస్థితులు అడ్డంకి కాకూడదని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత విద్యకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఈవో చైతన్య జైనీ, కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ పాల్గొన్నారు. -
నాణేం నుంచి స్కాన్
సాక్షి, పెద్దపల్లి: ఒకప్పుడు జేబులో చిల్లర నాణేలు గలగలమంటేనే డబ్బున్న భావన. ఇప్పుడు డిజిటల్ రూపాయి, ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల దిశగా భారత రూపాయి ప్రయాణం సాగుతోంది. ఎనిమిది దశాబ్దాల స్వతంత్య్ర భారత చరిత్రలో డబ్బు రూపం ఎన్నోసార్లు మారింది. 1949లో స్వతంత్ర భారత ప్రభుత్వం రూపాయి నోటు ను విడుదల చేసింది. 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చింది. యూపీఐ అందుబాటులోకి రావడంతో దేశ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద సంస్థ వరకు.. కూరగాయల బండి నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు నగదు అవసరం తగ్గింది. ‘క్యాష్ ఉందా?’ అనే ప్రశ్నకు బదులుగా ‘స్కాన్ ఉందా?’ అనే మాట వినిపించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్లాస్టిక్ కరెన్సీ దిశగా కరెన్సీ నవ భారత ప్రయాణం సాగుతోంది. -
అంతరిక్ష బాటలో యువకెరటాలు
సిరిసిల్ల: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తన తొలి కక్ష్య రాకెట్ ‘విక్రమ్–1’ విజయవంతంగా ప్రయోగించి కొత్త చరిత్రను సృష్టించింది. ఆ ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్ల భాగస్వామ్యం ఉంది. దేశం నాకేమిచ్చిందని ఆలోచించే ఈ రోజుల్లో దేశానికి తాము ఏమిచ్చామనే లక్ష్యంతో అంతరిక్ష ప్రయోగంలో జిల్లా యువకులు పాల్గొనడం విశేషం. పాలిటెక్నిక్ డిప్లొమాతో డీఆర్డీవోకు వెళ్లిన సిరిసిల్లలోని సుభాష్నగర్కు చెందిన అడుప కిరణ్ రాకెట్ క్యాడ్ డిజైనర్గా పని చేశారు. పోస్టాఫీస్ వీధికి చెందిన అడుప సంతోష్ భువనగిరిలో బీటెక్ పూర్తి చేసి డీఆర్డీఏలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా చేరారు. మూడేళ్ల పాటు సీనియన్ ఇంజినీర్గా ప్రైవేటు కంపెనీలో పని చేసి 2024 నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెండ్ కంపెనీలో టీమ్ లీడర్గా పని చేశారు. రాకెట్లో తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సిరిసిల్లలో ప్రాథమిక విద్యను అభ్యసించిన బొమ్మదేని నాగరాజు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. నిజామాబాద్లో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అంతరిక్ష ప్రయోగంలో ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థ సమీకరణ పనులను పర్యవేక్షించారు. -
ఖర్గేను అవమానించారు
కరీంనగర్ కార్పొరేషన్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు అవమానించాయంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టింది. కిసాన్నగర్ గాంధీ విగ్రహం నుంచి మంచిర్యాల చౌరస్తా మీదుగా కోర్టు వరకు ర్యాలీ సాగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వైపు వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో మల్లికార్జున ఖార్గే పాల్గొన్న సభ వేదికను అపవిత్రం అయిందంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్టశక్తులు శుద్ధిచేయడాన్ని ఖండించారు. ఇది ఖార్గేకు జరిగిన అవమానం కాదని, యావత్దళిత బహుజనులకు జరిగిన అవమానమన్నారు. పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, నరేందర్రెడ్డి, ఉప్పుల అంజనీ ప్రసాద్ , మల్లికార్జున రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’
కరీంనగర్: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ‘హర్ ఘర్ తిరంగా’ భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాంనగర్ వరకు సాగింది. కళాశాల విద్యార్థులు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలతో ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినదిస్తూ ముందుకు సాగారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ.. ‘హర్ ఘర్ తిరంగా’ అనేది ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించే గొప్ప ఉద్యమం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పెట్రోల్బంక్లో అదుపుతప్పిన కారు
సిరిసిల్ల అర్బన్: పెట్రోల్బంక్లో పనిచేసే ఆపరేటర్ కారు నడిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి బంక్లోని పంపింగ్ మిషన్ను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న హెచ్పీ పెట్రోల్బంక్లో పనిచేసే పంపింగ్ ఆపరేటర్ డ్రైవింగ్ తెలియకపోయినా బంక్లో ఆగి ఉన్న కారును నడిపేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలోనే కారు అదుపుతప్పి బంక్లోని పంపింగ్ మిషన్ను ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో పెట్రోల్బంక్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కారుపై ఇప్పటికే 5 చలాన్లు, ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదై ఉన్నాయి. పంపింగ్ మిషన్ ధ్వంసం -
అనారోగ్యంతో హెడ్కానిస్టేబుల్ మృతి
కాళేశ్వరం: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసుస్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న హనుమండ్ల కనుకయ్య (52) అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరుగుతాయని పోలీసులు తెలిపారు. కనుకయ్య పదేళ్లుగా కాళేశ్వరంలోనే ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. అందరితో మర్యాద, కలివిడిగా ఉండేవాడని గుర్తు చేసుకుంటున్నారు. -
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
ఇల్లంతకుంట(మానకొండూర్): అత్తింటి వారి కట్నం వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఆరేపల్లిలో విషాదం నింపింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. ఆరేపల్లికి చెందిన మరిజ సంకీర్తన(27) బెజ్జంకికి చెందిన సోమని రమేశ్ను ప్రేమించగా కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు కరీంనగర్లో ఉంటున్నారు. రమేశ్ ఆటో నడుపుతున్నాడు. రెండు నెలల క్రితం ఆరేపల్లికి రమేష్ భార్యతో సహా వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. ఈక్రమంలో సంకీర్తన గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తండ్రి జయాదన్రావు తన కూతురును భర్త రమేశ్, అత్త లచ్చవ్వ, మామ నర్సయ్య, మరదలు శివ, ప్రవీణ్ వరకట్నం తీసుకురమ్మని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ సురేష్ శవ పంచనామ చేసి పోస్టుమార్టంకు తరలించారు. -
డెంగీ నివారణపై అవగాహన కల్పించాలి
చిగురుమామిడి:మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు డెంగీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో రాజగోపాల్రావు ఆదేశించారు. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం డెంగీ కేసు నమోదు కాగా బాధితుడి నివాసాన్ని పరిశీలించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో యాంటీ లార్వల్ అపరేషన్ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. డాక్టర్ ప్రిసిల్లా, సిబ్బంది పాల్గొన్నారు. -
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నాం
గత 19 ఏళ్లుగా 108 అంబులెన్స్ సేవల్లో ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించాం. రోగులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంతోపాటు వారికి ప్రాథమిక వైద్యం అందిస్తున్నాం. ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి తప్పించగలిగాం. – పెద్ది శ్రీనివాస్, సీనియర్ పైలట్ అత్యవసర చికిత్స అందించే సమయంలో ప్రతీ నిమిషం ఎంతో విలువైంది. ఎన్నో సందర్భాల్లో ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులు, దూర ప్రాంతాల నుంచి బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రాణాలు నిలిపే 108 పైలట్గా సేవలందించడం గర్వంగా ఉంది. – జలగం సత్యసాగర్, ఈఎంటీ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే 108 సిబ్బంది పది నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుతున్నారు. ప్రతీ ఆర్నెళ్లకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం. వాహనాలను ఎప్పటికప్పుడు కండీషన్లో ఉంచుతున్నాం. చిన్నచిన్న లోపాలను సరిదిద్దుతున్నాం. 12 సర్వీసులు నిరంతర సేవలందిస్తున్నాయి. – భూమా నాగేందర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
● ఇద్దరికి గాయాలు హుజూరాబాద్: కారు.. వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్లోని లక్ష్మీనగర్కు చెందిన దర్శనాల శేఖర్(43) మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా కారులో ఆర్.శ్రీధర్, అజీమొద్దీన్తో కలిసి హుజూరాబాద్ వచ్చారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ వెళ్తుండగా తుమ్మనపల్లి శివారులో ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకర్ ఢీకొంది. శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్.శ్రీధర్, అజీమొద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధురాలి ఆత్మహత్యకోరుట్లరూరల్: మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన కస్తూరి వెంకమ్మ (81) మతి స్థిమితం సరిగా లేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వెంకమ్మ కాలుకు ఏడాది క్రితం శస్త్రచికిత్స చేయించారు. కాలు నొప్పి కారణంగా ఆరునెలల నుంచి రెండుసార్లు కిందపడడంతో మెదడులోని నరాలు దెబ్బతిని మతిస్థిమితం కోల్పోయింది. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతురు బోదాసు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
తిమ్మాపూర్: శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో మొదటి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఫార్మసీ విద్యార్థుల కోసం రానున్న కాలంలో శాతవాహన యూనివర్సిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని, అందులో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు తప్పక పాల్గొనాలని కోరారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న ఫార్మసీ విద్యార్థుల సేవలు దేశానికి అవసరమని అన్నారు. సెక్రటరీ సాయి చైతన్య రెడ్డి, డైరెక్టర్ నరేందర్ రెడ్డి పట్టా పొందిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.2012– 2026లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా మొదటి గ్రాడ్యుయేషన్ డే -
ఆపదలో సంజీవని
అత్యవసర వేళల్లో ప్రసూతి, ప్రమాదాల్లో క్షతగాత్రులకు 108 సర్వీసుల్లోని ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్), పైలట్(అంబులెన్స్ డ్రైవర్స్) ప్రత్యేక శిక్షణ పొందారు. అత్యవసర వైద్యం అందాల్సిన రోగులు ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రాథమిక చికిత్స పొందుతున్నారు. ఇక అత్యవసరంగా ప్రసూతి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే 108 సిబ్బంది పురుడు పోస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. క్షతగాత్రులు, అత్యవసరంగా వైద్యం అందాల్సిన రోగులకు సిబ్బంది కాల్సెంటర్ ద్వారా హైదరాబాద్లోని వైద్యులతో ఫోన్లో మాట్లాడుతూ వారి సూచనలతో చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని 108 వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట మండలాల వాహనాలు మొరాయించడంతో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. వాహనాలను కండీషన్లో ఉంచి ఫోన్కాల్ అందిన పది నిమిషాల్లోపే ప్రమాద స్థలానికి చేరుతున్నాయి. వాహనాల్లో ట్రాన్స్పోర్టు వెంటిలేటర్, ఆక్సిజన్, బీపీ ఆపరేటర్, గ్లూకోమీటర్, థర్మామీటర్, స్టెతస్కోప్స్, పల్స్ ఆక్సిమీటర్, అత్యవసర సమయంలో వాడే మందులు అందుబాటులో ఉన్నాయి. సిరిసిల్లటౌన్: అత్యవసర పరిస్థితుల్లో సంజీవనిలా ప్రాణాలు పోస్తున్న 108 సేవలకు ఇరవై ఏళ్లు నిండాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మానస పుత్రిక అయిన 108 ద్వారా ఎందరో ప్రాణాలు నిలిచాయి. 2005లో 108 సర్వీసులు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు నిలిపాయి. ఉమ్మడి జిల్లాలో 54 అంబులెన్స్ సర్వీసులు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు అంబులెన్స్లతో ప్రారంభమైన అత్యవసర సేవలు నేడు 12 అంబులెన్స్లతో బలోపేతమైంది. 108 సేవలు 21వ ఏటలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 అంబులెన్స్ వాహనాలు సేవలందిస్తున్నాయి. కరీంనగర్లో 80 మంది, రాజన్నసిరిసిల్లలో 54, జగిత్యాలలో 74, పెద్దపల్లిలో 53 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణీలను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చడం, ప్రమాద బాధితులకు వెంటనే వైద్యసేవలకు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సహాయం అందించడం వంటి ఎన్నో సేవలు చేస్తున్నారు. కరోనా సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా ఏడు అంబులెన్స్లను అందించడంతో అత్యవసర సేవలకు మరింత బలం చేకూరింది.108 వాహనాలు ఇలా.. జిల్లా వాహనాలు కరీంనగర్ 16 రాజన్నసిరిసిల్ల 12 జగిత్యాల 15 పెద్దపల్లి 11 సిబ్బంది ఇలా.. జిల్లా ఈఎంటీ పైలట్స్ కరీంనగర్ 39 41 రాజన్నసిరిసిల్ల 27 27 జగిత్యాల 36 38 పెద్దపల్లి 26 27 108.. 20 ఏళ్ల ప్రస్థానం మొబైల్ చికిత్సతో రోగులకు ఊరట దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 54 అంబులెన్స్ సర్వీసులు -
ఇబ్బందులు లేకుండా విద్యాబోధన
కరీంనగర్టౌన్: నగరంలోని ముకరంపురంలోని ఓల్డ్ హైస్కూల్ క్యాంపస్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ బా లుర హాస్టల్ను, డాక్టర్ స్ట్రీట్లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ను గురువారం కలెక్టర్ చిత్రామిశ్రా పరిశీలించారు. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో లీకేజీలు, కిచెన్ షెడ్డు, తాగునీరు, టాయిలెట్లు తదితర వసతులపై సమస్యలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ముకంరపురంలోని ఓల్డ్ హైస్కూల్ క్యాంపస్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు తరలించి, అక్కడే హాస్టల్ వసతితో పాటు తరగతులు నిర్వహించాలన్నారు. హాస్టల్ను పరిశీలించి కొద్దిరోజుల పాటు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటూ, తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టిజిల్లాలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేలా దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించా రు. గురువారం రాత్రి తన చాంబర్లో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గత సంవత్సరం ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం, ప్రస్తుతం సాగు చేసిన విస్తీర్ణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతేడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 16వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్పామ్తో పాటు కూరగాయలు, పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఏవో భాగ్యలక్ష్మి, హుజూరాబాద్ వ్యవసాయ అధికారి భూంరెడ్డి, జమ్మికుంట వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ పనితీరుపై సమీక్ష
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో గురువారం రీజియన్ పరిధిలోని 11మంది డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు, సిస్టమ్ సూపర్వైజర్లతో ఆర్ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. జూలై చివరినాటికి ఆపరేషన్స్, మెకానికల్ విభాగాల్లో అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితి, బస్ ఆన్ కాంట్రాక్టు, ప్యాకేజీ టూర్లకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రమాదాలు, నివారణ చర్యల గురించి సమీక్షించారు. మరో సమావేశంలో రీజనల్ మేనేజర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లతో కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ సమావేశమై డిపోలు లాభాల బాటలో నవడవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతి రెడ్డి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు సీహెచ్.కవిత, ఎన్.వెంకన్న, వి.రవీంద్రనాథ్, ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, ఎన్.రమేశ్, ఎన్.మనోహర్, డి.హరి, ప్రకాశరావు, శ్రీనివాస్, సంపత్ కుమార్ పాల్గొన్నారు. -
పింఛన్ దరఖాస్తులు షురూ
ఆన్లైన్కు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లుపింఛన్ కోసం వచ్చిన పాత దరఖాస్తులుకరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల తరువాత చేపట్టిన కొత్త పింఛన్దారుల ఎంపిక ప్రక్రియ నగరపాలకసంస్థలో మొదలైంది. ప్రస్తుతం వృద్ధాప్య, బీడికార్మికులు మినహా మిగతా కేటగిరీల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని ఆన్లైన్ చేసేందుకు నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. పాత దరఖాస్తులు 2 వేలు నగరపాలకసంస్థ పరిధిలోని 66 డివిజన్ల నుంచి పింఛన్కోసం దాదాపు రెండు వేల మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, నగరపాలకసంస్థ పౌరసేవా కేంద్రం ద్వారా వివిధ సందర్భాల్లో గతంలో తీసుకున్న వాటిని పాత దరఖాస్తులుగా పరిగణిస్తున్నారు. వాటిని డివిజన్లవారీగా వేరు చేశారు. ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. వృద్ధాప్య ఫించన్కు ఎదురుచూపులే పింఛన్లలో ఎక్కువగా కనిపించే వృద్ధాప్య కేటగిరీకి ప్రస్తుతం అవకాశం కల్పించలేదు. వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళ, చేనేత, గీతకార్మిక, పైలేరియా, తలసేమియా కేటగిరీలకు సంబంధించిన పింఛన్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు మాత్రమే ప్రభుత్వం లాగిన్ అవకాశం కల్పించింది. దీంతో వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్త దరఖాస్తులు 379 పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో, నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని 66 డివిజన్లకు సంబంధించిన వార్డు అధికారులు,నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు 272 దరఖాస్తులు రాగా, గురువారం 107 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా పది లాగిన్లు ఏర్పాటు చేశారు. -
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
కరీంనగర్: ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్లో భాగంగా కరీంనగర్లో బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షుడు పాదం శివరాజ్ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కోర్టు చౌరస్తా వరకు సాగింది. అక్కడ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బారి అపర్ణ– జితేందర్, కో– ఆప్షన్ మెంబర్ చిగురు రవి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మొక్కలను సంరక్షించాలికరీంనగర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి సూచించారు. ఆస్పత్రి ఆవరణలో ఎన్ఎస్ఎస్ విభాగం, కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు. వీరారెడ్డి మా ట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించినప్పుడే కార్యక్రమానికి పూర్తి సార్థకత చేకూరుతుందన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ సూచనల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఆర్ఎంవో డాక్టర్ నవీన, డాక్టర్ ఉదయ్ ఆదిత్య, కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ లిల్లీ మేరీ, ఉమామహేశ్వరి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుజాత, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లతో నాణ్యమైన సరఫరాకొత్తపల్లి (కరీంనగర్): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా కరీంనగర్ సర్కిల్ పరిధి లో ఇంటర్ లింక్ లైన్ల ఏర్పాటు చర్యలు వేగవంతం చేసినట్లు ఎస్ఈ ఆర్.రవీందర్ వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, నిర్వహణ సమయంలో, ఇతర కారణాల చేత ఒక లైన్లో లేదా సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఇంటర్ లింక్ లైన్ ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ద్వారా సరఫరా కొనసాగుతుందన్నారు. విస్తృత వాహన తనిఖీలుకరీంనగర్క్రైం: కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు గురువారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రంకెన్ డ్రైవ్, నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. నగరంలోని హోటళ్లు, లాడ్జిల్లోనూ తనిఖీలు చేపట్టారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఏసీపీ జి.విజయ్కుమార్, సీఐలు రాంచందర్రావు, సృజన్రెడ్డి, తిరుమల్ పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: కరీంనగర్లోని వావిలాలపల్లి సబ్స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఐబీ ఫీడర్పై చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో ఉదయం 8 నుంచి 10.30 గంటల వరక ఐబీచౌరస్తా సర్కస్ గ్రౌండ్, పద్మనాయక కల్యాణ మండపం, సాఫ్రాన్ స్వీట్ హౌస్, కోర్ట్ చౌరస్తా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కొత్తపల్లి ఫీడర్ పరిధిలో.. 11 కేవీ కొత్తపల్లి ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొత్తపల్లి టౌన్, రెడ్డిరాంపల్లి, తూర్పువాడ, మెడికల్ ఏరియా, రామాలయం ఏరియా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. -
డైవర్షన్ టెండర్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తీగలగుట్టపల్లి ఆర్వోబీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పనుల జాప్యానికి తోడు గోతులు పడిన రోడ్లతో ముక్కుతూ మూలుగుతూ ప్రయాణం చేస్తున్న ప్రజలకు కనీసం కొత్త డైవర్షన్ రోడ్డు ఇంతవరకూ అందుబాటులోకి రాలేదు. ఈ డైవర్షన్ రోడ్డు వ్యవహారం ఇపుడు చర్చానీయాంశంగా మారింది. రోడ్డు నిర్మాణానికి జూలై 7వ తేదీన రూ.28 లక్షల అంచనా వ్యయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈ టెండరు (నోటీసు నంబరు ఈ1/ డీబీ/ఎంసీకే /8201/274/2026–27/4)కు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో రీకాల్ చేసింది. రీకాల్కు సైతం స్పందన రాకపోవడంతో రెండోసారి రీకాల్ పెట్టకుండా ఇదే పనికి కొత్తగా(నోటీసు నంబరు ఈ1/ డీబీ/ ఎంసీకే /8201/279/2026–27) ఆగస్టు 11తేదీన టెండరు పిలిచారు. దీని గడువు 20తో ముగుస్తుంది. ఒకే పనికి సంబంధించినవి రెండు టెండర్లు పిలవడం, వాటిలో ఐటెం క్వాంటిటీస్, రేట్లలో వ్యత్యాసాలు ఉండటం అనుమానాలకు దారి తీస్తుంది. పని ఒకటే.. ఐటెంలు వేర్వేరు ఒకే అధికారి రెండుసార్లు ఒకే అంచనా వ్యయంతో క్వాంటిటీస్, రేట్లతో ఒకే పనికి పరిపాలన, సాంకేతిక అనుమతులు ఎలా ఇచ్చారని కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. ఒక టెండరుకు గుత్తేదార్ల నుంచి స్పందన రాని పక్షంలో 10 సార్లయినా రీకా ల్ చేసే అవకాశముంది. అంచనా వ్యయం మారకుండా అదే పనికి కొత్త టెండరు పిలవడం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాంకేతికంగా ఐటెం క్వాంటిటీ, రేట్లను మార్చి చూపించారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఏ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం మార్చారో పేర్కొనలేదు. రెండు వేర్వేరు నంబర్లతో పిలిచిన ఈ టెండరును వేర్వేరుగా క్లెయిం చేసుకునే ప్రమాదముందని గుత్తేదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పనులు రోడ్లు భవనాలశాఖ చేపట్టాల్సి ఉండగా.. బల్దియా మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టడంపై విస్మయం చెందుతున్నారు. దీనిపై ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా.. రోడ్డు నిర్మాణం తమ పరిధిలో లేదని రైల్వే, బల్దియా చూసుకుంటాయన్నారు. తొలి టెండరుకు స్పందన రాకపోవడంతోనే కొత్త టెండరు పిలవాల్సి వచ్చిందని బల్దియా కమిషనర్ కార్యాలయం టెండురును సమర్థించుకుంది. యూఐడీ ఎఫ్ టెండర్ల డూప్లికేషన్ మాదిరిగా ఈ టెండరుపైనా అనేక ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.డైవర్షన్ రోడ్డు లేక ఉన్న మట్టి రోడ్డుపై గుంతల్లో వాహనదారులు పడుతూ లేస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ గుంతల పరిమా ణం పెరిగిపోవడం కష్టాలు పెంచుతున్నాయి. గంటకోసారి రైల్వేగేటు పడుతోంది. వర్షం పడుతున్న సమయంలో గేటు పడినప్పుడు ద్విచక్రవాహనదారులు తడిసి ముద్దవుతున్నారు. ఇటీవల ఆర్వోబీకి సంబంధించిన భూసేకరణకు ఆటంకాలు తొలగినా.. ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఇంకెంతకాలం పడుతుందో? తమ కష్టాలు ఇంకెప్పుడు తీరుతాయో అని వాహనదారులు తమ దురదృష్టాన్ని తామే నిందించుకుంటున్నారు. ఇక గేటు పడిన సందర్భంలో అంబులెన్సు ట్రాఫిక్లో చిక్కుకుని రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి. -
పుస్తకం.. జ్ఞాన విప్లవం
కరీంనగర్ కల్చరల్: ఒక మంచి పుస్తకం విద్యార్థిలో ఆలోచనను పెంపొందిస్తుంది. ఆ ఆలోచన భవిష్యత్ను మార్చుతుంది. తరగతి గదిలో ఉపాధాయుడు చెప్పే పాఠంతో పాటు గ్రంథాలయంలో లభించే పుస్తకాలు విద్యార్థి జ్ఞానాన్ని మరింత విస్తరిస్తాయి. అందుకే పాఠశాలల్లో గ్రంథాలయానికి ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 34గ్రంథాలయాలు మంజూరయ్యాయి. ఒక్కో గ్రంథాలయానికి రూ.15 వేల విలువైన పుస్తకాలు, ప్రతినెలా రూ.2 వేల నిర్వహణ నిధులతో పాటు.. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేలా అవసరమైన ఫర్నిచర్ను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. రూ.15 వేల విలువైన పుస్తకాలు ప్రతి గ్రంథాలయానికి రూ.15 వేల చొప్పున పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిధులు అందనున్నా యి. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవసరమే పుస్తకాలను తీసుకునే అవకాశం ఉంది. కథలు, నవలలు, జీవిత చరిత్రలు, విజ్ఞానశాస్త్రం, సాధారణ జ్ఞానం, సాహిత్యం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచితే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నెలనెలా నిర్వహణ నిధులు గ్రంథాలయాలు కేవలం పుస్తకాలతోనే కాకుండా నిరంతరం కొత్త సమాచారం విద్యార్థులకు అందించే కేంద్రాలుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి నెల రూ.2వేల చొప్పున నిర్వహణ నిధులు అందించనున్నారు. ఇందులో రూ.1,000 పత్రికల కోసం, మరో రూ.1,000 ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు సమాచారం. ఈ నిధులను గ్రంథాలయం నుంచి అందజేయనున్నట్లు గ్రంథాలయ పాలకులు పేర్కొంటున్నారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు అవసరమైన బల్లలు, కుర్చీలు, బుక్షెల్ఫ్లు తదితర ఫర్నిచర్ను జిల్లా విద్యాశాఖ సమకూర్చనుంది. పుస్తకంతో మారే ఆలోచన గ్రంథాలయం అంటే నాలుగు గోడల మధ్య పుస్తకాలను భద్రపరిచే గది మాత్రమే కాదు.. విద్యార్థి ఆలోచనలకు రెక్కలు తొడిగే జ్ఞాన కేంద్రం. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా ఇతర పుస్తకాలు చదివే విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, సాధారణ జ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయి. పోటీ పరీక్షలకు కూడా గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయి. -
నాణ్యమైన పరిశోధనలపై దృష్టిపెట్టాలి
కరీంనగర్సిటీ: విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలపై దృష్టి పెట్టాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాల కామర్స్ విభాగం వారు శాతవాహన యూనివర్సిటీ ‘అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా యూనివర్సిటీ కామర్స్ విభాగం సహకారంతో పరిశోధన పద్ధతులపై ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యశాల ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనల ద్వారానే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కళాశాల కామర్స్ విభాగాధిపతి రాజయ్య మాట్లాడుతూ పరిశోధన పద్ధతులు అనే అంశం పీహెచ్డీ, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉపయోగకరమని తెలిపారు. కార్యశాల సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధన పద్ధతులపై అవగాహన కల్పించడమే వర్క్షాప్ ఉద్దేశం అన్నారు. డాక్టర్ డి.వెంకట్రావు వివిధ గణాంక శాస్త్ర పద్ధతుల గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, టి.రాజయ్య, కడారు సురేందర్రెడ్డి, డి.హరికాంత్ పాల్గొన్నారు. -
ఫీజు పోరు
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026నింగి.. నీరు.. నీలంఎల్నినో ఎఫెక్ట్తో వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి అరకొర వర్షాలతో లోయర్ మానేరు డ్యాంలో నీటిమట్టం లేక మైదానాన్ని తలపించింది. ఇటీవల ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరుకు అక్కడి నుంచి లోయర్ మానేరుకు నీరు సరఫరా చేయడంతో జలకళను సంతరించుకుంటోంది. గురువారం సాయంత్రం వర్షం కురిసే ముందు ఆకాశం మొత్తం నీలి రంగులోకి మారగా.. మానేరులోని నీరు సైతం నీలిరంగులో కనిపించింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్కరీంనగర్టౌన్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఆందోళన నిర్వహించిన విద్యార్థినాయకులను పోలీసులు సీపీటీసీకి తరలించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బకాయిలు రాక కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. కరీంనగర్ సైన్స్ కళాశాలకు నూతన భవనం నిర్మించడంతో పాటు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గజ్జెల శ్రీకాంత్, కంపెల్లి అరవింద్, మానస, సంజన, వినయ్ సాగర్, సురేశ్, సందేశ్, రాకేష్, సన్నీ, మణికంఠ, జాన్సన్ రిషి, ఓంకార్, అభి, అర్ఫన్, నితిన్, సిరివెన్నెల, సాత్విక, అమూల్య పాల్గొన్నారు. -
అంజన్న సొమ్ము గోల్మాల్పై చర్యలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సుమారు రెండేళ్ల క్రితం.. కొండగట్టు ఆలయ నిధుల గోల్మాల్ వ్యవహారంలో దేవాదాయ శాఖ కొరఢా ఝుళిపించింది. సొమ్ము గల్లంతుకు బాధ్యులుగా చేస్తూ నలుగురు అధికారులను పేర్కొన్న దేవాదాయ శాఖ.. వారిలో ముగ్గురికి రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. మరో అధికారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో 2024లో దాదాపు రూ.52,90,000 సొమ్ము గల్లంతైంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అంతర్గత ఆడిటింగ్లో గుర్తించి విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్ను విచారణాధికారిగా నియమించింది. ఆయన తన విచారణలో నిధుల గోల్మాల్ నిజమేనని నిర్ధారించారు. ఈ వ్యవహారానికి బాధ్యులుగా ప్రస్తుతం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న అప్పటి సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసాచారి, వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసశర్మ, కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్ డి.సునీల్కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఈ నలుగురు అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన ఉన్నతాధికారులు నలుగురిపైనా చర్యలకు ఉపక్రమించారు. నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. రికార్డులను సరిగా తనిఖీ చేయనందుకు వీరిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీనివాసశర్మ (వేములవాడ), సునీల్కుమార్ (కొండగట్టు)కు రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్గా ఉండి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న శ్రీనివాసాచారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే వ్యవహారంలో కొండగట్టు ఈవో (ఎండోమెంట్ ఆఫీసర్)గా ఉన్న టంకశాల వెంకటేశ్ సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే.దేవాలయానికి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం అధికారుల నిర్లక్ష్యంతో గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంతవరకూ బానే ఉన్నా.. గల్లంతైన అంజన్న సొమ్ము రికవరీ బాధ్యత ఎవరిది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఆదాయం వస్తున్న అంజన్న ఆలయానికి రూ.52.9 లక్షల రికవరీకి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2023లో ఆలయంలో చోరీ చేసిన దొంగల నుంచి అంజన్న ఆభరణాలను పోలీసులు రికవరీ చేసిన విధంగానే ఇపుడు కూడా గల్లంతైన సొమ్మును దేవాదాయ శాఖ వసూలు చేయాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు. -
యువతకు ఆదర్శం.. స్వామి వివేకానందుడు
● జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్గౌడ్ కరీంనగర్స్పోర్ట్స్: స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వామి వివేకానందుని ఆదర్శాలను ఆశయాలను యువత మరవరాదన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్, సుజాత, మల్లిక, సంపత్, జితేందర్, మహేశ్, పలు యువజన మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తికరీంనగర్టౌన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ బుధవారం పూర్తిచేశారు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలకు 191 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రంలోగా కేటాయించిన పాఠశాలల్లో హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత.. విద్యార్థులు లేని బడుల్లో ఉపాధ్యాయులు అధికంగా ఉండడం.. గురువులు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం వంటి సమస్యలు ఉన్న స్కూళ్ల జాబితాను సేకరించి ఈమేరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ ప్రక్రియతో ఉపాధ్యాయుల కొరతకు పరిష్కారం లభించింది. కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో చేయూత పింఛన్ల పథకంలో భాగంగా కొత్త పింఛన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల దరఖాస్తులు మినహాయించి.. వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, గీత, చేనేత, ఫైలేరియా, తలసేమియా, హీమోఫిలియా, సికల్సెల్ కేటగిరీల్లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోనివాళ్లు, డివిజన్లలోని వార్డు అధికారులకు, నగరపాలక సంస్థ పౌరసేవా కేంద్రంలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కరీంనగర్: నగరంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్ అరటి మొక్కలను నాటారు. మేయర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతీ ఒక్కరి బాధ్యతని అన్నారు. ఇంజనీర్ అన్నారెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. డ్రైనేజీ పనులు ప్రారంభంకరీంనగర్ కార్పొరేషన్: డ్రైనేజీల నిర్మాణాలతో రోడ్లు, వీధుల్లో నీళ్లు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు మేయర్ తెలిపారు. 26వ డివిజన్ ఆదర్శనగర్లో రూ.10లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. -
కష్టపడి చదవాలె.. కాన్ఫిడెంట్గా ఉండాలె
శంకరపట్నం/కరీంనగర్ రూరల్: కష్టపడి చదివి కాన్ఫిడెంట్గా ఉండాలని కలెక్టర్ చిత్రామిశ్రా విద్యార్థినులకు సూచించారు. బుధవారం రాత్రి శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్స్కూల్, కేజీబీవి హాస్టళ్లను తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, విద్యుత్దీపాలు, ఫ్యాన్లు పనిచేస్తున్నాయా లేదా అని ఆరాతీశారు. ఏమైనా సమస్యలుటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. డీఈవో చైతన్యజైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు శ్రీనివాస్, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు. ‘డబుల్’ ఇళ్లకు తక్షణమే మరమ్మతుకరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరెపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో షర్మిల, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ లక్ష్మీనరసింహారావులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీ ప్రతినిధులను పిలిపించి ఇళ్ల ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. ఇళ్లను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. -
తెలుసుకునే సోయి కూడా లేదా?
● మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ కార్పొరేషన్: బల్దియా సమావేశాలు జరిగాయా లేదా అనేది కూడా తెలుసుకునే సోయి మాజీ మేయర్ రవీందర్సింగ్కు లేదా అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరపాలక సంస్థలో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదని, మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ రవీందర్సింగ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ పాలకవర్గం ఏర్పడిన 5 నెలల్లో మూడుసార్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధికి కీలకమైన బడ్జెట్ సమావేశం కూడా అందులో ఉందని గుర్తు చేశారు. జరిగిన సమావేశాలు అధికారికంగా రికార్డుల్లో ఉన్నాయని, మాజీ మేయర్ రవీందర్సింగ్ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. అబద్ధపు రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలని సూచించారు. -
తెలంగాణను ఎడారి చేసేందుకు కుట్ర
కరీంనగర్టౌన్: తెలంగాణను ఎడారి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలోవిలేకరులతో మాట్లాడారు. ఈనెల 18న హైదరాబాద్లో నిర్వహించే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని కోరారు. తెలంగాణ సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమన్నారు. కేసీఆర్ హయాంలో చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏడు ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎలా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా కొట్లాడాలని సూచించారు. ఈనెల 18వ తేదీలోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి, బోనాల శ్రీకాంత్, నాగి శేఖర్, గందె మాధవి పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరు గర్హనీయం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేయాలి జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ వినోద్కుమార్ డిమాండ్ -
సోషల్ చిచ్చు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్: సోషల్ మీడియా వేదికగా సాగుతున్న బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ పోరు కరీంనగర్లో ప్రత్యక్ష దాడుల దిశగా వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కూడిన పోస్టులు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తుండగా.. తాజాగా ఓ ఆడియో వ్యవహారం ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. గతంలో ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగిన విషయం మరవకముందే.. ఇపుడు బీజేపీ కార్పొరేటర్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి సిద్ధమవడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో బుధవారం రాజకీయ యుద్ధాన్ని ముందే నివారించగలిగారు. 000000000000000000000000ఒక వర్గం పోస్టుకు మరో వర్గం కౌంటర్ ఇవ్వడం.. వ్యక్తిగత ఆరోపణలు, పరుష వ్యాఖ్యల వరకు వ్యవహారం వెళ్లడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. గతంలో కాంగ్రెస్–బీజేపీ, తాజాగా బీజేపీ–బీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కార్యకర్తలు క్షణాల్లో ఒకచోటుకు చేరుతున్న నేపథ్యంలో పోలీసులకు పరిస్థితిని అదుపులో ఉంచడం సవాల్గా మారుతోంది. -
హెచ్ఐవీ నివారణకు అవగాహనే ముఖ్యం
కరీంనగర్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు అవగాహన, సరైన సమాచారమే ప్రధాన ఆయుధాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రాజగోపాల్ అన్నారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్–2026’లో భాగంగా బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేపట్టిన బైక్ ర్యాలీని డాక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తి మార్గాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవీతో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా అండగా నిలవాలని ఆయన సూచించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా హెచ్ఐవీ నివారణ, పరీక్షలు, చికిత్స, అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ‘బీ పాజిటివ్ టు ప్రివెంట్ హెచ్ఐవీ పాజిటివ్’ సందేశంతో జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ర్యాలీలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధ, పీవో–ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా, ఏవో రాజగోపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి రాజగోపాల్ కరీంనగర్లో భారీ బైక్ ర్యాలీ -
పాత పెన్షన్ విధానంపునరుద్ధరించాలి
కరీంనగర్ అర్బన్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధ్ధరించాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఎగ్జి క్యూటివ్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు స్పష్టమైన పెన్షన్ భద్రత కల్పించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు.టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, పోలు కిషన్, మహిళా చైర్మన్ ఇరుమల్ల శారద, సునీత, సరిత, సుస్మిత పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులతో జాగ్రత్తవీణవంక: ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని, సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రాజగోపా ల్ సూచించారు. మండలంలోని చల్లూరు, వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. హాజరు, అవుట్ పేషెంట్ రిజిస్టర్, పిల్లల వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు. వైద్యులు సంతోష్, వరుణ, బియాబాని, సబ్యూనిట్ ఉన్నారు. కౌన్సిల్ నిర్వహించని వారిపై చర్య తీసుకోవాలికరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ప్రతి నెల సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికి, గత మూడు నెలలుగా ఏర్పాటు చేయడం లేదన్నారు. నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి సంబంధించిన వివరాలు కలెక్టర్కు పంపించాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 13న లోలెవెల్లో నీటి సరఫరాకు అంతరాయంకరీంనగర్ కార్పొరేషన్: ఫిల్టర్బెడ్లో మరమ్మతులతో ఈ నెల 13వ తేదీన నగరంలోని లో లెవెల్ జోన్ పరిధిలో తాగునీటి సరఫరా ఉండదని నగరపాలకసంస్థ ఈఈ లచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిల్టర్బెడ్లోని 150 హెచ్పీ, 350హెచ్పీ పంప్ హౌస్లో మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. గురువారం తాగునీటి సరఫరా ఉండదు కాబట్టి, లో లెవెల్ జోన్ పరిధిలోని డివిజన్ల వాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణతో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.సీసీ ఫీడర్ పరిధిలోని ముకరంపుర, కలెక్టర్ ఆఫీస్, బస్టాండ్, 1వ టౌన్ పోలీస్ స్టేషన్, భగత్నగర్, పీఎఫ్ ఆఫీస్ ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.అల్కాపురి ఫీడర్ పరిధి లోని కోతిరాంపూర్, గిద్ద పెరుమాళ్ల గుడి, భవానీనగర్ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు పరిధిలోని శ్రద్ధా ఇన్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం, డిమార్ట్, బైపాస్ రోడ్డు, పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. రేకుర్తి, బావుపేటలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు11 కె.వీ. రేకుర్తి సమ్మక్క గద్దెలు ఫీడర్ పరిధిలోని సమ్మక్క గద్దెలు, విజయపురి కాలనీ, స్వామికా లనీ, షేకాబ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, ఐ హా స్పిటల్, మైత్రివనం, బుడిగె జంగాల కాలనీ, అంజనేయులు కాలనీ ప్రాంతాలతో పాటు 33/11 కె.వీ. ఆసిఫ్నగర్, బావుపేట సబ్స్టేషన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఆసిఫ్నగర్, ఆసిఫ్నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఎలగందల్, ఎలగందల్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
మెలకువలు నేర్పిస్తున్నా
క్రికెట్పై ఆసక్తిని ఉన్న విద్యార్థులను సరైన మార్గంలో మలచ డమే మా లక్ష్యం. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, జట్టు భావన, పట్టుదలను నేర్పిస్తాయి. సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి మైదానానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభ ఉన్నవారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. – సుధీశ్, క్రికెట్ కోచ్ పిల్లలు ఎక్కువ సమయం సెల్ఫోన్లలో గడపకుండా క్రీడలు ఆడడం సంతోషంగా ఉంది. క్రికెట్ శిక్షణతో మా పిల్లల్లో శారీరక చురుకుదనం, క్రమశిక్షణ పెరుగుతున్నాయి. చదువుతోపాటు ఆటలూ సమాన ప్రాధాన్యం ఇవ్వడంతో వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. – సింఽఽఽధు, పేరెంట్ మొదట్లో ఖాళీ సమయం దొరికితే సెల్ఫోన్లో గేమ్స్ ఆడేవాళ్లం. ఇప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ కోసం మైదానానికి రావడం ఆనందంగా ఉంది. కోచ్ చెప్పే సూచనలతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. భవిష్యత్లో మంచి క్రికెటర్గా ఎదగాలనుకుంటున్నాం. – కోడెం అశ్విత్, ఎన్టీపీసీ -
మాల్టా దేశంలో రోడ్డు ప్రమాదం..
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని ఇస్లాంపురకు చెందిన మహ్మద్ అబ్దుల్ జావిద్ (27) మాల్టా దేశంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అతని బంధువులు తెలిపారు. జావిద్ ఏడాదిన్నర క్రితం ఉద్యోగ నిమిత్తం మాల్టా వెళ్లాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకుని మళ్లీ తిరిగి వెళ్లాడు. ఎప్పటిలాగే కంపెనీ ఉద్యోగం కోసం కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో జావిద్ అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అతని బంధువులు, స్నేహితులు భారీగా తరలివచ్చి కన్నీరుమున్నీరవుతున్నారు. జగిత్యాల యువకుడి మృతి మూడు నెలల క్రితమే పెళ్లి ఇస్లాంపురలో విషాదం -
సారూ.. నేను బతికే ఉన్నా
శంకరపట్నం: ‘సర్ నేను మానసిక వికలాంగుడిని.. కొన్నాళ్లుగా సర్కారు ఇచ్చే పెన్షన్తోనే బతుకుతున్నా.. రెండు నెలలుగా నాకు పెన్షన్ రావడం లేదు. అధికారులను అడిగితే.. ఆన్లైన్లో నేను చనిపోయినట్లు చూపుతోందని అంటున్నారు’. నాకు పెన్షనే ఆధారం.. రెండు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు’. అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లికి చెందిన తోట శ్రీనివాస్(39) వాపోయాడు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీనివాస్ మానసిక దివ్యాంగుడు. నెలకు రూ.4016 చేయూత పెన్షన్ వస్తోంది. దాంతోనే శ్రీనివాస్ బతుకుతున్నాడు. రెండు నెలలుగా తన ఖాతాలో పెన్షన్ పడడం లేదు. కారణం ఏంటని పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, జిల్లా కార్యాలయాల్లో కలిశాడు. పింఛన్ వెబ్సైట్ను పరిశీలించగా జూన్4న శ్రీనివాస్ చనిపోయినట్లు నమోదు చేసి ఉంది. ఆందోళన చెందిన శ్రీనివాస్ తాను బతికుండానే ఎలా చంపేస్తారని అధికారులు, కార్యదర్శులను ప్రశ్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై కలెక్టర్ చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. గ్రామ కార్యదర్శిని ‘సాక్షి ’ వివరణ కోరగా.. ‘శ్రీనివాస్ పెన్షన్కు సంబంధించి లైవ్ సర్టిఫికెట్ మే16న పంపించాను. ఆ సమస్య నా దృష్టికి వచ్చింది. జిల్లా అధికారులకు నివేదించాను. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించి, పెన్షన్ వచ్చేలా చూస్తాం’ అని సమాధానం ఇచ్చారు. -
కుటుంబ వివరాలకు అధికారిక రికార్డు
జ్యోతినగర్: కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా నమోదు చేసేందుకు ఫ్యామిలీ రిజిష్టర్ (కుటుంబ రిజిష్టర్) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమపథకాలు, ఇతర అధికారిక అవసరాల కోసం కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించేందుకు సమగ్ర అధికారిక రికార్డు లేదు. పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో కుటుంబాల వివరాలను ఒకేచోట నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రేషన్కార్డు డేటా ఆధారంగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నరేషన్ కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాల ఆధారంగా ఫ్యామిలీ రిజిష్టర్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్లో ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిష్టర్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించింది. దీంతో కుటుంబంలో ఎవరు సభ్యులు, వారిప్రాథమిక వివరాలు ఏమిటనే అంశాల అధికారిక ధ్రువీకరణ పత్రం అందుబాటులో ఉంటుంది. సంక్షేమ పథకాలకు కీలకంగా మారే అవకాశం సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులను గుర్తించడం , కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించడం, ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించడం వంటి అంశాల్లో ఫ్యామిలీ రిజిష్టర్ కీలకంగా మారే అవకాశం ఉంది. కుటుంబ వివరాల ఆధారంగా పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రేషన్ కార్డు డేటా ఆధారంగా ఫ్యామిలీ రిజిష్టర్ మీ సేవ ద్వారా వివరాల సర్టిఫికెట్ జారీకి ఏర్పాట్లు -
జిల్లా ఓటర్లు
కరీంనగర్ అర్బన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(సర్)తో ఆసక్తికర అంకెలు చోటు చేసుకున్నాయి. డ బుల్ ఓటర్లు, మరణించినవారి సంఖ్య గణనీయంగా కనిపించింది. ఎన్నికల సంఘం జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించగా జిల్లావ్యాప్తంగా 1,77,102మందిని తొలగించారు. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 1,00,618 ఓటర్లను తొలగించడం గమనార్హం. అత్యల్పంగా మానకొండూరు నియోజకవర్గంలో 19,658 మంది ఓటర్లను తొలగించారు. తాజా గణాంకాల ప్రకారం జిల్లా మొత్తం ఓటర్లు 9,11,988. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 12న ప్రకటించనుండగా మరిన్ని ఓట్లు తొలగించే అవకాశముందని తెలుస్తోంది. శాశ్వత షిఫ్ట్లో కరీంనగర్ టాప్.. గన్నేరువరం లాస్ట్ సర్.. ప్రక్రియలో ఆయా అంశాల వారీగా ఓటర్ల గణాంకాలను వెల్లడించారు. మండలాల వారీగా శాశ్వతంగా షిఫ్ట్ అయినవారు కరీంనగర్ పట్టణంలోనే ఎక్కువగా ఉన్నారు. 59,766 మంది షిఫ్ట్ కాగా.. అత్యల్పంగా షిఫ్ట్ అయిన మండలం గన్నేరువరం. ఇక్కడి నుంచి 661మంది ఓటర్లు మాత్రమే వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కరీంనగర్ రూరల్ 6159, కొత్తపల్లి 8,430, చొప్పదండి 3,187, గంగాధర 3,287, రామడుగు 2,314, మానకొండూరు 2,605, శంకరపట్నం 1,905, తిమ్మాపూర్ 2,607, హుజూరాబాద్ 4,571, వీణవంక 2,082, జమ్మికుంట 5,957, ఇల్లందకుంట మండలాలవారు 1,163మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కరీంనగర్ నియోజకవర్గం నుంచి 74,355 మంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా హుజూరాబాద్ 16,384, చొప్పదండి 16,291, మానకొండూరు 11,361 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యారు. ఇక మరణించిన ఓటర్ల సంఖ్యలో కరీంనగర్ 6,373 మంది ఉన్నట్లు తేలగా హుజూరాబాద్ 1,981, జమ్మికుంట 1,847, మానకొండూరు 1,543, కరీంనగర్ రూరల్ 1,545, కొత్తపల్లి 1,511, వీణవంక 1,462, చొప్పదండి 1,381, రామడుగు 1,339, గంగాధర 1,167, తిమ్మాపూర్ 1,098, శంకరపట్నం 5,77, ఇల్లందకుంట 399 మంది ఓటర్లు ఉన్నారని తేల్చారు. డబుల్ ఓటర్లు 17,812 ఒక చోట కాకుండా మరో ప్రాంతంలోనూ ఓటర్లుగా నమోదైనవారు వేలల్లో ఉండటం విశేషం. జిల్లాలో 17,812 మంది ఓటర్లు తమ సొంత ఊళ్లలో, నివసించే పట్టణాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నట్లు గుర్తించారు. డబుల్ ఓట్లు కరీంనగర్లో 5,297, కరీంనగర్ రూరల్ 1,456, కొత్తపల్లి 1,326, చొప్పదండి 252, గంగాధర 1,510, రామడుగు 1,012, మానకొండూరు 817, శంకరపట్నం 228, తిమ్మాపూర్ 669, గన్నేరువరం 153, హుజూరాబాద్ 605, వీణవంక 607, జమ్మికుంట 454, ఇల్లందకుంట మండలంలో 209 ఉన్నాయని వెల్లడైంది. ఇక బీఎల్వోలు ఇంటికి వెళ్లినప్పుడు 6,149 మంది అందుబాటులో లేరని పేర్కొన్నారు. జాబితా చూసుకుంటేనే సరి ఎన్నికలు వచ్చినప్పుడే ఓటు తొలగించారని ఆందోళన చేసే బదులు తాజా జాబితాను పరిశీలించడం ఉత్తమం. ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకుంటే తుది జాబితా ప్రక్రియ వరకై నా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశముంది. ఫిర్యాదులు, అభ్యంతరాలకు సెప్టెంబర్ 9వరకు అవకాశముండగా అధికారులు వచ్చిన అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన చేయనుండగా అక్టోబర్ 10లోపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తుది ఓటరు జాబితా అక్టోబర్ 12న ప్రకటించనున్నారు.నియోజకవర్గం గతంలోని ఓట్లు ప్రస్తుతం లెక్కకురానివి కరీంనగర్ 3,68,832 2,68,214 1,00,618 చొప్పదండి 2,39,716 2,11,115 28,601 మానకొండూరు 2,26,250 2,06,592 19,658 హుజూరాబాద్ 2,54,292 2,26,067 28,225సర్కు ముందు జిల్లా మొత్తం ఓటర్లు: 10,89,090 సర్ ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు: 9,11,988 తొలగించిన ఓట్లు: 1,77,102 ఫిర్యాదులు, అభ్యంతరాలు: ఈ నెల 10నుంచి సెప్టెంబర్ 9వరకు నోటీసుల జారీ, పరిశీలన: ఈ నెల 10నుంచి అక్టోబర్ 10 తుది ఓటరు జాబితా: అక్టోబర్ 12, 2026 -
కొండగట్టులో భక్తుల రద్దీ
మల్యాల:ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. గోడలు పాఠాలు బోధిస్తాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే కాకుండా గోడలు కూడా పాఠాలు బోధిస్తున్నాయి. విద్యార్ధులకు బోధించడంతోపాటు కళ్లకట్టినట్లు చిత్రాలు చూపిస్తే సులువుగా అర్థమవుతుందన్న ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఈప్రక్రియ చేపట్టింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారం మండల ప్రాథమిక పాఠశాల గోడలపై ఇందుకోసం ప్రత్యేకంగా చిత్రాలు రూపొందించారు. వివిధ పాఠ్యాంశాల ఆధారంగా చిత్రకారులతో బొమ్మలు గీయించారు. తెలుగు గణాంకాలు, ఆంగ్ల పదాలు, పండ్లు, వాటి పేర్లలాంటి చిత్రాలతో పాఠశాల ఆకట్టుకుంటోంది. హెచ్ఎం కోండ్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత విద్యాసంవత్సరం చిత్రాలు వేయించారు. ఆకట్టుకునే చిత్రాలతో పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయని హెచ్ఎం తెలిపారు. – మంథనిరూరల్ -
కబ్జాల బీఆర్ఎస్.. కత్తుల బీజేపీ
● సుడా మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: భూకబ్జాలతో అప్పటి బీఆర్ఎస్, కర్రలు, కత్తులతో దాడులు చేస్తూ ఇప్పటి బీజేపీ నగర ప్రశాంతతను చెదరగొడుతున్నాయని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ నగరపాలకసంస్థను అప్పుడు బీఆర్ఎస్కు అప్పగిస్తే కార్పొరేటర్లు భూకబ్జాలకు పాల్పడి జైళ్లకు వెళ్లారని గుర్తుచేశారు. దేశం, ధర్మం అంటూ మాయమాటలతో నగరపాలక సంస్థను కై వసం చేసుకొన్న బీజేపీ కార్పొరేటర్లు కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బలంతోనే బీజేపీ కార్పొరేటర్లు ఈ దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు దాడులు చేశారని, ఎంపీ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై కర్రలతో దాడులకు దిగారన్నారు. తాజాగా కిసాన్నగర్లో కత్తులు, బీరుసీసాలతో దాడి చేసి ఓ బీజేపీ కార్పొరేటర్ జైలుకు వెళ్లాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్పొరేటర్లు వరాల నర్సింగం, కాంతాల జగన్రెడ్డి, పర్వతం మల్లేశం, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.తాజ్, గుండాటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
పుస్తెలతాడు మాయం!
కోల్సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలి మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు మాయమైంది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... కుందనపల్లి సమీప బద్రిపల్లి గ్రామానికి చెందిన రాజమ్మ షుగర్ లెవల్స్ తగ్గడంతో సోమవారం జీజీహెచ్చే చేరింది. వైద్యుల సూచన మేరకు తొలుత సీటీ స్కాన్ చేయించారు. ఈ సమయంలో పేషెంట్ మెడలోని పుస్తెలతాడును కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. సీటీస్కాన్ అనంతరం ఈసీజీ కోసం ఈఎండీ విభాగానికి తరలించారు. బెడ్పై పడుకోబెట్టారు. ఆమె కూతురును బయటకు పంపించారు. ఈ క్రమంలోనే పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఈసీజీ విభాగాన్ని పరిశీలించినట్లు తెలిసింది. పేషెంట్ కుటుంబ సభ్యులతోపాటు ఆస్పత్రి సిబ్బందిని కూడా విచారించినట్లు సమాచారం. ఈఎండీలో ఇటీవల ఓ పేషెంట్ మెడలోని చైన్ మాయమైనట్లు సమాచారం. అయితే అది ఒకేగ్రామ్ గోల్డ్ కావడంతో బాధితులు పెద్దగా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు రాలేదని తెలుస్తోంది.హైదరాబాద్లో కథలాపూర్ యువకుడు మృతికథలాపూర్: మండలకేంద్రానికి చెందిన కస్తూరి నరేశ్(38) హైదరాబాద్లో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపా రు. నరేశ్ కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. నరేశ్కు వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. అందరితో కలిసిమెలిసి ఉండే నరేశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. యువకుడి బలవన్మరణంముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండలం చీకొడులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. చీకొడుకు చెందిన బొమ్మెన మల్లేశం, దేవవ్వలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీశైలం(25) ఊర్లోనే వ్యవసాయం చేస్తున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం శ్రీశైలం పడుకోగా తెల్లవారేసరికి తనగదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మల్లేశం, నాన్నమ్మలకు శ్రీశైలం మృతి చెంది కనిపించడంతో బోరున విలపించారు. తల్లి దేవవ్వ హైదరాబాద్లో ఉన్న పెద్ద కుమారుడి వద్దకు వెళ్లింది. శ్రీశైలం మృతికి గల కారణాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తండ్రి మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రూ.1.93 లక్షలకు బెల్ట్షాపు వేలంమల్యాల: మల్యాల మండలం ఒబులాపూర్ గ్రా మంలో బెల్ట్షాపునకు వేలం నిర్వహించారు. వి విధ కుల పెద్దల సమక్షంలో వేలం నిర్వహించగా ఓ నిర్వాహకుడు రూ.1.93లక్షలకు దక్కించుకున్నట్లు స్థానికుల ద్వారా తెల్సింది. ఈ షాపు నుంచి 24గంటలు మద్యం విక్రయించుకునేలా వేలం పాడినట్లు సమాచారం. ఇంత జరిగినా ఎకై ్సజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పర్యాటకం కావొద్దు ప్రమాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు జలకళతో తొలకరిస్తుండటంతో పర్యాటకుల సందడి పెరిగింది. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్ల పర్యాటకం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందువల్ల నీరు ఉన్న ప్రాంతాలు, జలాశయాల వద్దకు వెళ్లే పర్యాటకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని సందర్శయ ప్రాంతాలు మిడ్మానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర జలాశయం–బోయినపల్లి/మాన్వాడ): 27.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ భారీ ప్రాజెక్టులోకి నీరు చేరడంతో నిత్యం పర్యాటకులు గుమిగూడుతున్నారు. తంగళ్లపల్లి మిడ్ మానేరు బ్యాక్వాటర్ (గోపాల్రావుపల్లె): చుట్టూ కొండలు, మధ్యలో నీటి తలాలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అప్పర్ మానేరు ప్రాజెక్టు (గంభీరావుపేట/నర్మాల): చారిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టు అలుగు పారే సమయంలో పరిసర గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి సందర్శకులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఇటీవలి ప్రమాదకర విన్యాసాలు ఇటీవల తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లె శివారు మిడ్ మానేరు బ్యాక్వాటర్ వద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు యువకులు కార్లతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తూ విన్యాసాలు చేయడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నీటి ఉధృతి, లోతు తెలియకుండా ఈతకు దిగడం, జారే రాళ్లపై నిలబడి ప్రాణాలకు తెగించి సెల్ఫీలు దిగడం, మద్యం సేవించి నీటిలో అడుగుపెట్టడం వంటి చర్యల వల్ల మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పర్యాటకులకు పోలీసుల, అధికారుల సూచనలు ● బ్యాక్వాటర్స్లో అడుగుభాగం బురదతో కూడుకుని, హఠాత్తుగా లోతుగా మారే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగవద్దు. ● పిల్లలు నీటి దరిదాపులకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణ వహించాలి. ● వంతెనల అంచులు, నీటి ప్రవాహం వద్ద, జారే రాళ్లపై ప్రమాదకరంగా సెల్ఫీలు, రీల్స్ చేయోద్దు. ● ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 112 లేదా 100కి సమాచారం అందించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జలాశయాల వద్ద పర్యాటకుల సందడి ప్రకృతిని చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు, అధికారులు 2020లో శభాష్పల్లి వంతెన వద్ద ఇద్దరు విద్యార్థులు సెల్పీలు దిగే క్రమంలో కాలుజారి జలాశయంలో పడి మృతి చెందారు. 2021 మార్చిలో కొదురుపాక వంతెన వద్ద ఇల్లందుల సాయికృష్ణ(26), గడ్డం రాజశేఖర్ రెడ్డి(30) మరణించారు. సాయికృష్ణ నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోగా చూసేందుకు వెళ్లిన రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయాడు. 2021 నవంబర్లో సిరిసిల్ల చెక్డ్యాం వద్ద ఆరుగురు విద్యార్థులు కొలిపాక గణేశ్(15), తేగల అజయ్(14), కొంగ రాకేశ్(15), జడల వెంకటసాయి(14), శ్రీరాముల క్రాంతి (14), సింగం మనోజ్(16) మృతిచెందారు. ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు చెక్డ్యాం వద్ద లోతైన గోతిలో ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. 2022 ఏప్రిల్లో మిడ్ మానేరు కందికట్కూర్ వద్ద కుర్రు శ్రీనివాస్(30), పొన్నం రాజు(27) మృతిచెందారు. కుటుంబ సభ్యులతో గుడికి వెళ్లి సరదాగా జలాశయంలో ఈత కొడుతుండగా నీటిలో మునిగి చనిపోయారు. 2023లో అప్పర్మానేరు వద్ద ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి లోతైన నీటి గుంతల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. 2023లో తంగళ్లపల్లి ఎల్లమ్మ గుడికి వచ్చిన కుటుంబం సరదాగా చెక్డ్యాం నీటి వద్దకు వెళ్లగా భార్య, పిల్లలు మునిగిపోతుండగా భర్త నీటిలోకి దిగి వారిని రక్షించి అతను ప్రాణాలు కోల్పోయాడు. 2026 మేలో మిడ్మానేరు గోపాలరావుపల్లె వాగులో సిరిసిల్ల పట్టణం శాంతినగర్కు చెందిన ఇద్దరు యువకులు ఎదురుగట్ల హరిచరణ్ గౌడ్(18), అల్లం మణికంఠ(17) సరదాగా ఈతకువెళ్లి మునిగిపోయారు. మణికంఠను కాపాడే ప్రయత్నంలో హరిచరణ్ కూడా నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. జలాశయాల వద్ద నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. జలాశయాల సందర్శనకు వచ్చే పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. ప్రమాదకర నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. సరదా విషాదంగా మారకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. – మహేష్ బీ గీతే, ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగువ మానేరు, మిడ్ మానేరు జలాశయాల వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులు, ప్రజలకు సమాచారం అందించాలి. నీటి ప్రవాహం ఎక్కువైతే ప్రజల క్షేమంకోసం రాకపోకలు నియంత్రించాలి. – గరీమా అగ్రవాల్, కలెక్టర్ రాజన్న సిరిసిల్ల -
నిరుద్యోగులకు లైబ్రరీలు
● పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ● పలువురికి సర్కారు కొలువులు ● నేడు నేషనల్ లైబ్రేరియన్స్ డేబోయినపల్లి(చొప్పదండి): నిరుద్యోగులకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంధాలయం పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సహకారం అందిస్తోంది. డబ్బులు వెచ్చించి కోచింగ్ లేకుండా లైబ్రరీలో ఉచితంగా పుస్తకాలు చదివి పోటీ పరీక్షల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఏటా ఆగస్టు 12న నేషనల్ లైబ్రేరియన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సిరిసిల్లలో ఆధునిక లైబ్రరీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో గ్రంధాలయ భవనం నిర్మించారు. రోజుకు 150 మంది పాఠకులు హాజరు అవుతారు. పోటీ పరీక్షల పుస్తకాలు, తెలుగు అకాడమీ తదితర సుమారు 32 వేలకు పైగా అందుబాటులో ఉన్నాయి. అలాగే జిల్లాలో 9 గ్రంధాలయాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో, వేములవాడ తదితర స్వంత భవనాలు 8 ఉన్నాయి. ముస్తాబాద్లో అద్దె లేకుండా ఓ భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. లైబ్రరీ పోస్టులన్నీ ఖాళీలే జిల్లాలో 9 లైబ్రేరియన్ పోస్టులు ఉండాల్సి ఉండగా అన్ని ఖాళీలే ఉన్నాయి. కేవలం గ్రేడ్–2 లైబ్రరీయన్ ఒకరు, గ్రేడ్–3 లైబ్రేరియన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఔట్సోర్సింగ్ లైబ్రేరియన్స్, ఒక అటెండర్లు, ఇద్దరు పార్ట్టైం స్వీపర్లు ఆయా చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలోని లైబ్రరీలో పోటీ పరిక్షల పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగులు పైసా ఖర్చు లేకుండా పలు ఉద్యోగాలకు సంబందించిన స్టడీ మెటేరియల్ చదివే అవకాశాన్ని కల్పించాం. సద్వినియోగం చేసుకోవాలి. – శంకరయ్య, జిల్లా గ్రంధాయల సంస్థ, కార్యదర్శి, సిరిసిల్ల -
‘ఎల్లంపల్లి’ నీటి వినియోగానికి దశాబ్దం
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2016 నుంచి ఇప్పటివరకు నీటి తరలింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.వందల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన మంత్రులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా ఎన్టీపీసీ, హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాలు, వివిధ పరిశ్రమలు, సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకున్న నీటికి చెల్లించిన రుసుంతో సుమారు రూ.648 కోట్లు సమకూరినట్లు వారు వివరించారు. భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ప్రతీ టీఎంసీ నీటి వినియోగానికి రూ.7.16 కోట్లు రుసుం వసూలు చేస్తున్నారు. పరిశ్రమలు, తాగునీటి రంగం, మత్స్య సంపద, మైనింగ్ డీసిల్టేషన్ ద్వారా వచ్చే ఆదాయాలు వేర్వేరుగా ఉంటాయి. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం35.0/26.0బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 20267నృసింహునికి పూజలుధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామికి కుజదోష నివారణ పూజలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదోషాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు తరలివచ్చారు. పోలీస్స్టేషన్ తనిఖీగన్నేరువరం: గన్నేరువరం పోలీస్స్టేషన్ను అడిషనల్ డీసీపీ వెంకటరమణ తనిఖీ చేశారు. వివిధ కేసుల రికార్డులు పరిశీలించారు. శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. -
వ్యక్తిగత గొడవలు బీజేపీకి అంటగట్టొద్దు
● కిసాన్నగర్ ఘటనతో పార్టీకి సంబంధమే లేదు ● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్రావు కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యక్తిగత గొడవలను బీజేపీకి అంటగట్టడం దుర్మార్గమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణును గతంలో కారుతో ఢీకొట్టి దాడిచేసినా, తాము ఎవరిపైనా ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెబుతున్న గంగుల కమలాకర్ వ్యక్తిగత కక్షలు, దాడులను తమ పార్టీపై రుద్దడం మానుకోవాలని హెచ్చరించారు. కిసాన్ నగర్ ఘటనను బీజేపీ పార్టీకి అంటగడ్డి రాజకీయ పబ్బం గడుపుకోవడం మంచిదికాదన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేరును వాడటం సిగ్గుచేటన్నారు. బీజేపీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, ఒంటెల సత్యనారాయణరెడ్డి, చొప్పరి జయశ్రీ, గణేశ్, పొన్నం మొండయ్య వేణు, చంద్ర పాల్గొన్నారు. -
స్క్రబ్బర్ల పేరిట స్కాం!
ప్యాకింగ్ యంత్రంస్క్రబ్బర్ ప్యాకింగ్ కవర్లుజగిత్యాలకు చెందిన ఓ మహిళ.. ఇన్స్ట్రాగాంలో పార్ట్టైం ఉద్యోగాలు, ఎంఎక్స్వో కంపెనీ పేరిట వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసింది. విజ యవాడలోని కొందరు తాము స్క్రబ్బర్లు ప్యాకింగ్ చేయిస్తామని, మెటీరియల్ ఇస్తామని, ఇంటి వద్ద ఉండి పనిచేసుకుంటే నెలకు రూ.24వేలు ఇస్తామని చెప్పారు. ప్యాకింగ్ మెటీరియల్ కోసం రూ.1.50 లక్షలు చెల్లించింది. నెలనెలా ఠంఛనుగా రూ.24వేలు రావడంతో కరీంనగర్, గోదావరిఖనిలతో ఉండే తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో వారూ చేరారు. ఇలా వందలాది మంది స్కీంలో చేరారు. ఈ స్కీములో చేరిన వారికి ఒక ప్యాకింగ్ మెషీన్, కొన్ని స్క్రబ్బర్ల షీట్లు, ప్యాకింగ్ కవర్లు ఇచ్చారు. వీటిని ప్యాకింగ్ చేసిన తరువాత స్థానికంగా సదరు కంపెనీ నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సామగ్రిని కలెక్ట్చేసి తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో పెద్దపల్లి నుంచి 30 మంది, కరీంనగర్ నుంచి 57 మంది, జగిత్యాలలో 52 మంది మహిళలు ఈ స్కీములో చేరారు. -
సెల్ఫోన్లకు దూరం.. క్రికెట్ వైపు పరుగులు
● మారుతున్న విద్యార్థుల అభిరుచి ● ఎన్టీపీసీలో శిక్షణ పొందుతున్న వైనం జ్యోతినగర్: చేతిలో సెల్ఫోన్.. గంటల తరబడి గేమ్స్ ఆడడం.. నిత్యం సోషల్ మీడియాపై దృష్టి సారించడం విద్యార్థుల దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. ఇలాంటి వారిని డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకొచ్చి మైదానం వైపు నడిపించేందుకు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు సీనియర్ క్రీడాకారులు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఫిజికల్ డైరెక్టర్ సుధీష్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారికి.. క్రికెట్పై ఆసక్తి ఉన్న చిన్నారులు, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచ్లు, ఫిట్నెస్ వంటి అంశాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. కేవలం ఆటలో నైపుణ్యం సాధించడమే కాకుండా సమయపాలన, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, ఓటమిని స్వీకరించే మనస్తత్వం వంటి జీవిత విలువలూ పెంపొందిస్తున్నారు. మైదానమే మంచి మార్గం విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం, సెల్ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంచడం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం ఉమ్మడి బాధ్యత. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో కొనసాగుతున్న క్రికెట్ కోచింగ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరింత మంది మైదానం వైపు అడుగులు వేస్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
బోర్డు తిప్పేయడంతో లబోదిబో
ఏప్రిల్ నుంచి జూన్ వరకు బాగానే తన కస్టమర్లకు నెలనెలా డబ్బులు పంపిన సంస్థ అకస్మాత్తుగా జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. రేపు మాపూ అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ వారంలో విజయవాడకు చెందిన ఎంఎక్స్వో కంపెనీ ప్రతినిధులందరి ఫోన్లు మూగబోవడంతో మోసపోయామని గ్రహించారు. కొందరు విజయవాడకు వెళ్లి కంపెనీ ప్రతినిధులను కలిసే ప్రయత్నం చేసినా అవేమీ సఫలం కాలేదు. దీంతో మెటీరియల్ కొనుగోలు చేసిన వారంతా డిస్ట్రిబ్యూటర్ల వెంట పడుతుంటే.. వారంతా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నారు. మోసపోయిన వారిలో చాలామంది గత నెలలో మెటీరియల్ కొన్న వారు కూడా ఉండటం గమనార్హం. తమకు కనీసం ఒక నెల చెల్లింపులు కూడా దక్కలేదని వాపోతున్నారు. -
చేయూత పింఛన్లు సువర్ణావకాశం
కరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూడాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొత్త పింఛన్లకు అర్హత పొందే వారిని గుర్తించి, వారం రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నా రు. మంగళవారం తన కార్యాలయంలో డీఆర్డీవో, జిల్లా సంక్షేమశాఖ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నందున ప్రతి గ్రామం, ప్రతి వార్డు నుంచి అర్హులు దరఖాస్తు చేసుకునేలా చైతన్యం కల్పించాలని ఆదేశించారు. తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ఆయా వర్గాలకు చెందినవారిని గుర్తించాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు చొప్పదండి, హుజూరా బాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రక్రియను సవాలుగా తీసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన, తుది జాబితా తయారీ వరకు ఎక్కడా తప్పిదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్డీవో గీత, మెప్మా పీడీ స్వరూపారాణి, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన సాయిని మల్లేశం
కరీంనగర్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను సోమవారం కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మల్లేశంను సంజయ్ అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాశ్, గాజ రమ శివరాం, కర్రె పద్మ అనిల్, నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, గుంజేటి శివ, గాదగోని రమేశ్ పాల్గొన్నారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం33.0/26.0మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 20267భీమన్నకు మొక్కులు వేములవాడ: భీమన్నను సోమవారం భారీగా భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.కొత్తపల్లి: 33/11 కేవీ బ్యాంక్కాలనీ సబ్స్టేషన్ పరిధి లో లైన్ పనులు చేపట్టనున్నందున నేడు మధ్యాహ్నం 12నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ–1 పి.శ్రీనివాస్ తెలిపారు. -
నగరాభివృద్ధిలో ఆధునిక సాంకేతికత
కరీంనగర్ కార్పొరేషన్: నగరాభివృద్ధికిఽ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు పనుల్లో వేగం, నాణ్యత కోసం అజాక్ష్ సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నగరపాలకసంస్థ 35వ డివిజన్లో అజాక్ష్ ఆధునిక యంత్రంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. యంత్రాన్ని స్వయంగా నడిపి పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమన్నారు. అజాక్ష్ యంత్రం ద్వారా కాంక్రీట్ తయారీ, మిశ్రమ నిష్పత్తుల నియంత్రణ, నిర్మాణ ప్రాంతంలోనే కాంక్రీట్ సిద్ధం చేయడం, వేగవంతమైన సరఫరా వంటి ప్రయోజనాలు లభిస్తాయన్నారు. కార్పొరేటర్ సుజాత, శ్రీనివాస్ ఉన్నారు. డివిజన్లలో వసతులకు కృషి ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరపాలకసంస్థ 21వ డివిజన్ కొత్తయాస్వాడలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి ప్రారంభించారు. లైట్ల ఏర్పాటుతో కొత్తయాస్వాడ ప్రాంతంలో రాత్రివేళల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పాయన్నారు. -
కల్తీ.. నిఘా గల్తీ
కరీంనగర్ అర్బన్: జిల్లా వ్యవసాయశాఖ రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సింది పోయి అక్రమార్కులకు కొమ్ముకాస్తుందనే విమర్శఽలు వస్తున్నాయి. కల్తీరాయుళ్లను అరికట్టాల్సిందిపోయి మామూళ్ల మత్తులో తూగుతుందనే విమర్శలొస్తున్నాయి. రూ.లక్షల్లో వ్యాపారం ప్రభుత్వపరంగా విత్తనాలు, ఎరువుల ఉత్పత్తి అంతంతమాత్రమే.ప్రయివేటు కంపనీలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఎరువులు నాణ్యమైనవా, కల్తీయా తేల్చే ఎరువుల నియంత్రణ కేంద్రం కొత్తపల్లిలో ఉంది. గతంలో ఆదృశ్య శక్తులు సదరు పరీక్ష కేంద్రానికి మోకాలడ్డగా సదరు వ్యక్తులే కల్తీ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.కోట్లలో దందా సాగుతుండగా వ్యవసాయ అధికారులు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. శాంపిళ్ల సేకరణ నామమాత్రమేనా.? సీజన్కు 500 వరకు శాంపిళ్లను సేకరించాల్సి ఉండగా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మాత్రమే పరీక్ష కేంద్రాలున్నాయి. గతంలో హైదరాబాద్, వరంగల్కు శాంపిళ్లను పంపేవారు. ఇప్పుడు జిల్లాలోనే కేంద్రం ఉన్నా నామమాత్రంగా శాంపిళ్లను సేకరిస్తున్నారు. సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు..? మొగ్ధుంపూర్లో వెలుగుచూసిన నకిలీ ఎరువుల బా గోతం నిశబ్దంగా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో లైసెన్స్ సస్పెండ్ అయిన వ్యక్తి ఈ తతంగాన్ని నడుపుతున్నారని వ్యవసాయశాఖ చెబుతుండగా సూత్రదారులెవరు, పాత్రదారులెవరో తేల్చాల్సిన యంత్రాంగం మొద్దునిద్ర నటించడం ఆశ్చర్యకర పరిణామం. రైతులు ఎక్కడ కొనుగోలు చేశారు, విక్రయించిన వ్యక్తి ఎక్కడ నుంచి ఎరువులను తెచ్చారు, అసలు నకిలీ ఎరువు ఎక్కడ తయారవుతుంది. ఎవరెవరి పాత్ర ఎంత, అధికారు ల ప్రమేయం ఏమైనా ఉందా, ఇన్నాళ్లు దందా సాగుతుందంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు.. తదితర కోణాల్లో కూపీ లాగాల్సిందిపోయి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకోవడం గమనార్హం.గత నెల 9న మొగ్ధుంపూర్లో వ్యవసాయశాఖ అధికారి సత్యం తనిఖీలు చేసి కోరమాండల్ పేరిట ఉన్న నకిలీ 28.28.0 ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని శాంపిళ్లను సేకరించారు. నకిలీవని ఫర్టిలైజర్ కంట్రోల్ తేల్చడంతో కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెలరోజులైనా సదరు కేసు పురోగతి లేదు. ఫర్టిలైజర్ నిర్వాహకుడు తాను విక్రయించ లేదంటున్నాడని, కేసును పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. -
● ఆరెపల్లిలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ ● స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేత
కరీంనగర్రూరల్: కార్పోరేషన్ విలీన గ్రామాల్లో ప్రభుత్వస్థలాలను అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. ఆరెపల్లిలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే షెడ్డు నిర్మాణం చేపట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయగా కొందరు కార్పొరేటర్ భర్తను బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ఆరెపల్లిలోని సర్వేనంబరు120 లోని ప్రభుత్వస్థలంలో గత బీఆర్ఎస్ హ యాంలో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించారు. లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. మిగిలిన ప్రభుత్వస్థలంలో ఓ వ్యక్తి మూడు రోజుల నుంచి షెడ్డు నిర్మాణం చేపట్టాడు. వరుసగా వచ్చిన మూడు సెలవు రోజులను సద్వినియోగం చేసుకుని, రాత్రివేళల్లో పనులు కొనసాగించా డు. ప్రశ్నించిన స్థానికులను ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిందని బెదిరింపులకు గురిచేయడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశా రు. సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ అధికారులు షెడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనకు పట్టా ఇచ్చిందని సదరు వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు ప్రభుత్వస్థలంలో అక్రమ నిర్మాణంగా గుర్తించి జేసీబీతో షెడ్డుగోడలను కూల్చివేయించారు. ఈ వ్యవహారంలో కొందరు ఆక్రమణదారుడికి మద్దతుగా 1వ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ భర్త జితేందర్ను బెదిరింపులకు గురిచేశారు. విలీన గ్రామాల్లో విలువైన ప్రభుత్వస్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.రాత్రికి రాత్రే షెడ్డు నిర్మాణం -
పంద్రాగస్టుకూ పాత దుస్తులేనా?
కరీంనగర్టౌన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా జిల్లాలో ఒక్క విద్యార్థికి కూడా కొత్త యూనిఫాం అందలేదు. పంద్రాగస్టు వేడుకలకు పాత దుస్తులతోనే హాజరు కావాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల ప్రణాళిక లోపం, వస్త్రం సరఫరాలో జాప్యం, కుట్టించే ప్రక్రియలో నిర్లక్ష్యంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. కలెక్టర్ ఆదేశించినా పంద్రాగస్టు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జెండా పండుగలోపు విద్యార్థులకు యూని ఫాం అందించాలని ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం పుంజుకోలేదు. మరో నాలుగు రోజుల్లో పంద్రాగస్టు వేడుకలు ఉండగా.. యూని ఫాం ఎప్పుడు కుడతారు..? ఎప్పుడు విద్యార్థులకు అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కొక్కరికి రెండు జతలు ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు, 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, బాలికలకు రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాల్సిన దుస్తులు రెండు నెలలు గడిచినా అందకపోవడంతో విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. 74 వేలకుపైగా దుస్తులు జిల్లాలో 616 ప్రభుత్వ పాఠశాలల్లో 37,227 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున 74,446 దుస్తులు అవసరం. ప్రభుత్వం వస్త్రాన్ని సరఫరా చేసి, మహిళా సంఘాలు, ఐకేపీ, ఎన్జీవోల ద్వారా కుట్టించే బాధ్యతను అప్పగించింది. పంద్రాగస్టు నాటికై నా కొత్త దుస్తులు అందుతాయా? లేక గతేడాది దుస్తులతోనే జెండా పండుగకు హాజరు కావాల్సి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యావ్యవస్థకు నిర్దేశం ‘చదువుల చిలకమ్మ’
కరీంనగర్ కల్చరల్: ‘చదువుల చిలకమ్మ’ నవల నేటి విద్యా వ్యవస్థకు ఎంతో అవసరమ ని, ఒక తరాన్ని మార్చగలిగే అక్షర రూపమని ప్రముఖ కవి సాదనాల వెంకటస్వామి నాయు డు అన్నారు. భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన సోమవారం కరీంనగర్ ఫిల్మ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కోట లక్ష్మణ్ రచించిన ‘చదువుల చిలకమ్మ’ నవలను ఆవిష్కరించారు. సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పుస్తకం పాఠశాల విద్యలో మార్పులకు దోహదపడుతుందన్నారు. ఉదయ సాహితీ అధ్యక్షు డు ఎర్రం రాజారెడ్డి ఒత్తిడి లేని విద్య, స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యసన ప్రాధాన్యాన్ని వివరించారు. స్తంభంకాడి గంగాధర్, నడిమెట్ల రామయ్య, అన్నమరాజు శ్రీధర్రావు, కాసం రాజమౌళి, వెల్ముల జయపాల్రెడ్డి, సీహెచ్.రమేశ్, సంగోజు శ్రీనివాస్, కనపర్తి రాజశేఖర్, రాము ఇటిక్యాల్, కోడూరి రవి, కసిరెడ్డి జలంధర్రెడ్డి, జనగాని యుగంధర్, బి.శ్రీనివాస్, ఎం.సాంబమూర్తి, మాసం సీమ, డి.శంకరయ్య, ఖాలీద్ పాల్గొన్నారు.నారాయణపూర్ ప్రజలకు న్యాయం చేయాలిగంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్తో నష్టపోతున్న గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మైత్రీ గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని, 13మంది గ్రామస్తులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్ష సోమవారం రెండోరోజు కొనసాగింది. రవిశంకర్తో పాటు పలువురు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ముందు తాను గెలిచిన తరువాత నెలరోజుల్లో నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నా రు. కొన్ని ఇళ్లను ముంపు కింద తీసుకొని మిగితా వారికి అన్యాయం చేయొద్దన్నారు. రైల్వే గేటు వద్ద ఇరుక్కుపోయిన లారీగంగాధర: కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర మండలం మంగపేట రైల్వేస్టేషన్ సమీపంలోని టి 29 గేటు వద్ద సోమవారం ఉదయం భారీ లారీ ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ గేటు వద్ద తరచూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు పేర్కొంటున్నారు. గేటు మొరాయించడం, భారీ వాహనాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యలతో ట్రాఫిక్జామై అంబులెన్సు వచ్చినప్పు డు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని, బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. -
ముగిసింది సర్
కరీంనగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువు ముగిసింది. బూత్స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి పత్రాలు సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. సేకరించిన ఓటర్ల వివరాలను అర్ధరాత్రి వరకు బీఎల్వోలు ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 10,89, 090 మంది ఓటర్లు ఉండగా, అందులో వందశాతం ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఓటర్లకు పంపిణీ చేశారు. చివరిరోజు డిజిటలైజేషన్తో బిజీబిజీ ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్ ఫామ్స్ను అన్ని వివరాలతో పూర్తిచేసి బీఎల్వోలకు అందజేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో నివాసం ఉంటున్నవారు బోనాల పండుగ సందర్భంగా స్వస్థలాలకు రావడంతో తమఓటు వివరాలను నమోదు చేసుకున్నారు. చివరిరోజు కూడా బీఎల్వోలకు పెద్దసంఖ్యలో ఎన్యూమరేషన్ పత్రాలు అందాయి. ఒకవైపు ఫామ్స్ సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం సమీపిస్తుండడంతో చివరిరోజు రాత్రివరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించారు. 46 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను తొలుత జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎ న్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈకాలంలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించి డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు సోమవారం తెరపడింది. ఈనెల 17న డ్రాఫ్ట్ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు తదుపరిదశపై దృష్టి సారించనున్నారు. ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఓటర్లు ఈ జాబితాలో తమపేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీచేసి అక్టోబర్ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తిచేసిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక ఓటర్లంతా డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యే రోజును దృష్టిలో పెట్టుకుని తమపేరు, వివరాలను మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాగా సోమవారం సెలవు రోజు కావడంతో వివరాల నమోదులో ఆలస్యమైందని.. మంగళవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
● జిల్లాలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై కలెక్టర్ సమీక్ష
కరీంనగర్ అర్బన్: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రామిశ్రా కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. చొప్పదండి, కరీంనగర్, మానకొండూర్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్ల లొకేషన్లలో అవసరమైన మార్పులపై చర్చించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 1200 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నట్లయితే మరో పోలింగ్ స్టేషన్ పరిధిలో చేరుస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల పరిశీలన అనంతరం తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో జల కుమారి, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావం ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో సుమారు 3.44లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని, ఇప్పటివరకు 2.86లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, 2.21 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారని పేర్కొన్నారు. మిగతా సాగు భూముల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, తృణ ధాన్యాలు వంటివి సాగు చేయాలన్నారు.ఏం చేద్దాం.. ఎలా చేద్దాం -
ట్రాక్టర్.. ఫికర్
కరీంనగర్టౌన్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీలకు అందించిన ట్రాక్టర్ల నిర్వహ ణ పాలకులకు భారంగా మారింది. నిధుల కొరతతో పాలకులు సతమతమవుతుండగా.. ట్రాక్టర్ కిస్తీలు, డీజిల్, మరమ్మతులు, సిబ్బంది వేతనాలు అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లకు బీమా రెన్యూవల్ కాకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. నెలకు రూ.43 వేల భారం జిల్లాలోని 318 గ్రామపంచాయతీలున్నాయి. గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ, నర్సరీలకు నీటి సరఫరా, మొక్కలకు నీరు పట్టడం తదితర పనుల కోసం గత ప్రభుత్వం ట్రాక్టర్లు అందించింది. వాహన రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిందేనని అప్పుటి సర్పంచ్లపై ఒత్తిడి చేయడంతో కొత్త మంది చేయించారు. మరికొందరు విముఖత చూపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన కొత్త సర్పంచ్లు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారిందని వాపోతున్నారు. నిర్వహణ ఖర్చులు పంచాయతీలపైనే పడుతున్నాయని సతమతవుతున్నారు. చిన్న పంచాయతీల్లో ఒక్క ట్రాక్టర్ నిర్వహణకు నెలకు సుమారు రూ.43 వేల వరకు ఖర్చవుతున్నట్లు చెబు తున్నారు. ట్రాక్టర్ కిస్తీకి రూ.16 వేలు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు రూ.17వేలు, మరమ్మతులకు రూ.2,500, డీజిల్కు రూ.8 వేల వరకు ఖర్చవుతోందని పేర్కొంటున్నారు. చిన్న పంచాయతీలకు వచ్చే నిధుల్లో సగానికిపైగా ట్రాక్టర్ నిర్వహణకే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాల్లోనూ పరిస్థితి అదే విధంగా ఉంది.కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్లు పూర్తికాలేదని, మరికొన్ని వాహనాలకు బీమా గడువు ముగిసినా రెన్యూవల్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల కొరత, పాలకవర్గాలు లేకపోవడం తదితర కారణాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్, బీమా లేకుండా ట్రాక్టర్ నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు జిల్లాలోని అన్ని పంచాయతీల ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్, బీమా వివరాలను పరిశీలించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని సర్పంచ్లు కోరుతున్నారు. పంచాయితీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు వాణిజ్య విభాగం కిందికి వస్తాయి. ప్రతి మూడు నెలలకోసారి ట్రాక్టర్ ఇంజిన్కు రూ 400(వాహన జీవీడబ్యూపై ఆధారపడి ధర మారుతోంది) ట్రాలీకి రూ 770, ట్యాంకర్కు రూ.770 చొప్పున పంచాయతీలు పన్నులు చెల్లించాలి. ఏడాది బీమా ప్రీమియం రూ.13 వేల నుంచి రూ.15వేల వరకు కట్టాలి. వ్యవసాయ ఆధారిత ట్రాక్టర్లయితే మూడు నెలల పన్నులు ఉండవు. బీమా ప్రిమియం ఏడాదికి రూ.11 వేల ఉంటుంది. ఇలాంటి నిబంధనలు ఏ గ్రామ పంచాయితీలోనూ అమలు కావడం లేదని తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాద కారకులు వీరే..
జ్యోతినగర్: రోడ్డు ప్రమాదానికి కారణం కావడంతోపాటు ఒకరు మృతి చెందిన ఘటనకు సంబంధించిన వ్యక్తులను గుర్తుపట్టాలని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు ఒక ఫొటో విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన కోండ్ర లింగమూర్తి(42) మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదనికి కారణమైన వ్యక్తులు టీవీఎస్ రైడర్ రెడ్ కలర్ ద్విచక్ర వాహనంపై పరారయ్యారని, వీరిని గుర్తిసే తగిన బహుమతి ఉంటుందని, సమాచారం అందించిన వారివివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు. గుర్తించినవారు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్ : 871265 6526, 87125 38620 నంబరులో సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కనిపిస్తే సమాచారం అందించండి ఫొటో విడుదల చేసిన పోలీసులు -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఓ ఆసుపత్రిలో రాజలక్ష్మి ఒకే కాన్సులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఇద్దరు పాపలు ఉన్నారు. వివరాలు.. మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి, నరేందర్ దంపతులు. తొలిసారి గర్భం దాల్చిన రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో సోమవారం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రసవం చేయగా, ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. శిశువుల బరువు తక్కువగా ఉండడంతో పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు జన్మించడంతో రాజలక్ష్మి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పొలంలోనే పోయిన ప్రాణం
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రైతు కొండ రాజయ్యగౌడ్(65) సోమవారం తన పొలం పనులు చేస్తుండగానే హఠాత్తుగా కుప్పకూలాడు. అక్కడే పనిచేస్తున్న రైతులు, కూలీలు వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. మృతుడికి భార్య మల్లమ్మ, కుమారుడు వెంకటస్వామి, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరూ వివాహితులే. వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు, ముదిరాజ్ సంఘం నా యకుడు పిట్ల ముత్యం(56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. తన పొలంలో ఆదివారం పొద్దా ంత పొలం పనులు చేసి వచ్చాడు. సోమవారం ఉదయం సైతం వరినాట్లు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపే ప్రా ణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య దేవలక్ష్మి, ఇద్దరు కుమారులు ప్రశాంత్, ప్రేమ్చంద్ ఉన్నారు. వేములవాడ: పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన రిటైర్డ్ ఏఎస్సై సగ్గు భిక్షపతి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఐదు నెలల క్రితం ఏఎస్సైగా ఉద్యోగ విరమణ పొందారు. సోమవారం చాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భిక్షపతి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
బెదిరింపులకు పాల్పడితే కేసులు
వేములవాడ: అక్రమ వసూళ్లు, బెదిరింపులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తామని రాజన్నసిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే హెచ్చరించారు. ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే వెంటనే 112కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సోమవారం విలేకరులతో వివరాలు వెల్లడించారు. స్టోన్ క్రషర్ నిర్వాహకుడు నీలం గురువయ్య, రైస్మిల్ నిర్వాహకుడు బండ మల్లేశంయాదవ్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిని సోమవారం రిమాండ్కు తరలించారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్కు చెందిన దండు వినోద్కుమార్, నాంపల్లికి చెందిన పెద్దిగారి అమరగొండ అజయ్ కలిసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందులో భాగంగా అగ్రహారం శివారులో స్టోన్క్రషర్ నిర్వహిస్తున్న నీలం గురువయ్యకు ఈనెల 9న ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. గురువయ్యను అగ్రహారం గుట్టల వద్దకు తీసుకెళ్లారు. వ్యాపారానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేయకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భయాందోళన చెందిన గురువయ్య ఏటీఎం నుంచి రూ.50వేలు డ్రా చేసి వారికి ఇచ్చాడు. అనంతరం వీరిద్దరు వేములవాడరూరల్ మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకుడు బండ మల్లేశంను రైస్మిల్కు సంబంధించిన విషయంలో రూ.10లక్షలు డిమాండ్ చేశారు. వెంటనే మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులని ఆదివారం రాత్రి సాయినగర్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.50వేలు నగదు, రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఎవరైనా డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్స్టేషన్లో సంప్రదించాలని, లేదా 112లో సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. డబ్బు వసూలుకు దిగిన ఇద్దరి అరెస్టు ఎస్పీ మహేశ్ బీ గీతే -
బీమా చెక్కు అందజేత
విద్యానగర్(కరీంనగర్)/కోరుట్ల: : కోరుట్ల డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.మదార్ గతేడాది జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స సమయంలో ఒకకాలును తొలగించారు. అతడికి యూనియన్ బ్యాంక్లో సూపర్ సాలరీ అకౌంట్ ఉన్నందున ఆర్టీసీ యాజయాన్యం బ్యాంక్ ద్వారా రూ.50 లక్షల బీమా చెక్కు మంజూరు చేసింది. సోమవారం ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి హైదరాబాద్ బస్ భవన్లో చెక్కు అందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) సీహెచ్. వెంకన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ) కె. రాజశేఖర్, ఫైనాన్సియల్ అడ్వైజర్ విజయ పుష్ప, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు, కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్, బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సత్యనారాయణ బాబ్లీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రంజన్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాలకు చెందిన గెరిగంటి శ్రీహరి(45)ఒమన్లో పది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా అతని మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. పదేళ్లుగా ఒమన్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. కంపెనీ జీతాల విషయంలో ఇబ్బందులు పెట్టడంతో అత్యవసర సెలవుపై స్వదేశానికి వచ్చి మూడు నెలల క్రితం ఒమన్కు వెళ్లాడు. గతంలో పనిచేసిన కంపెనీకి సమాచారం ఇవ్వకుండా మరో కంపెనీలో పనిచేశాడు. ఈక్రమంలో గత నెల 29న గుండెపోటుతో మృతిచెందాడు. చట్టవిరుద్ధంగా వేరే కంపెనీలో పనిచేయడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు పాలాజీ శ్రీనివాస్, దేవరాజులకు తెలపడంతో వారు భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. శ్రీహరి మృతదేహం ఇంటికి వచ్చే చర్యలు తీసుకున్నారు. ఆస్తి కోసం వేధింపులు.. మహిళ బలవన్మరణం మెట్పల్లి: ఆస్తికోసం వేధించడంతో భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్పల్లిలో జరిగింది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. కా మారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన వీరమణి(40)కి భర్త, కుమారుడు ఉండగా.. వారు కొంతకాలం క్రితం మృతిచెందారు. ఒంటరి గా ఉంటున్న ఆమెను తన సోదరి అయిన మెట్పల్లి లోని గాజులపేటలో నివాసముంటున్న జక్కం గంగమణి–రాజు దంపతులు చేరదీశారు. అనంతరం వీరమణికి ఆస్తి ఉండడంతో దానిని తామే దక్కించుకోవాలన్న ఉద్దేశంతో రాజు ఆమెను నమ్మించి వివా హం చేసుకున్నాడు. తర్వాత రాజు, గంగమణి కలి సి ఆస్తిని తమకు రాసివ్వాలని వేధిస్తూ వస్తున్నారు. 8న గొడవ కాగా.. వీరమణి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఆమె అచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం శివారులోని జక్కం రాజుకు చెందిన వ్యవసాయ బావిలో మహిళ శవం కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. వారు అక్కడకు మృతదేహాన్ని పరిశీలించి వీరమణిగా గుర్తించారు. మృతురాలి సోదరుడు బాలరాజు ఫిర్యాదు మేరకు మృతికి కారుకులైన రాజు, గంగమణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వ్యవసాయ మార్కెట్ వ్యాపారి మృతి
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో అడ్తి, ఖరీదు దారుగా వ్యవహరిస్తున్న వ్యాపారి పాపునుక భిక్షపతి (70) సోమవారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మృతిపై మార్కెట్ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, అడ్తి, ఖరీదుదారుల సంఘం అధ్యక్షుడు చిక్కుల భూమయ్య సంతాపం తెలిపారు. ఈ మేరకు మంగళవారం మార్కెట్యార్డులో క్రయవిక్రయాలు నిలిపివేసి, సెలవుగా ప్రకటిస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్యకరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన గొర్రె మధు(35) కడుపునొప్పి భరించలేక సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మధు కొంతకాలంగా మద్యానికి బానిస కాగా కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్నాడు. సోదరుడు మనోహర్తో కలిసి కూలీపనులకు వెళ్లిన మధు కడుపునొప్పి ఉందంటూ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో సీలింగ్ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా సోదరుడితో కలిసి ఉంటున్నాడని, మృతుడికి ఇంకా వివాహం కాలేదని తెలిపారు. మనోహర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. అరటిపండ్ల వ్యాపారి..కరీంనగర్ క్రైం: దీర్ఘకాలంగా నరాల వ్యాధితో బాధపడుతూ, మనస్తాపానికి గురైన అరటిపండ్ల వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీనగర్కాలనీకి చెందిన గాజ యాదయ్య(57) అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. లపు ఆస్పత్రులు తిరిగినా వ్యాధి నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యంగంగాధర: మండలంలోని గర్శకుర్తి గ్రామానికి చెందిన శ్రీపతి లక్ష్మి (65) అదృశ్యమైంది. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు కేసు నమోదు చేసారు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. లక్ష్మి కేన్సర్తో బాధపడుతోంది. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తెల్లవారినా రాలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతకగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వెంకటేశంను యజమానే హతమార్చాడు
సిరిసిల్లటౌన్: యజమానే యముడయ్యాడు. తరుచూ పని మానేస్తుంటే తొలగిస్తామని చెప్తే మృతుడి భార్య వచ్చి గొడవ చేస్తుండడంంతో వర్కర్పై కక్షపెంచుకున్నాడు. హత్య చేస్తే కేసు మున్సిపల్ వైస్చైర్మన్పైకి పోతుందని భావించి మద్యంలో రసాయనం కలిపి అంతమొందించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిస్టరీగా ఉంటున్న వైపని కార్మికుడు వెంగల వెంకటేశం మృతిలో కీలక నిందితుడిని సిరిసిల్ల డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తారకరామానగర్కు చెందిన వెంగల వెంకటేశం(50) బి.వై.నగర్కు చెందిన కుసుమ గణేశ్ వద్ద వైపని కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వెంకటేశం తరచూ పనికి రాకుండా ఉండడం, పని మధ్యలో చెప్పకుండా వెళ్లిపోయేవాడు. ఇలాంటి సమయంలో పనిలోంచి తొలగిస్తానని గణేష్ హెచ్చరించినప్పుడల్లా వెంకటేశం భార్య వచ్చి గొడవకు దిగేది. ఈనేపథ్యంలో వెంకటేశంపై గణేశ్ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల సిరిసిల్ల మున్సిపల్ వైస్చైర్మన్ దార్ల సందీప్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు రూ.లక్ష డిమాండ్ చేశారన్న ఆరోపణలు వెంకటేశం, అతని భార్య సులోచన చేయగా కేసు నమోదైంది. వెంకటేశంను హత్య చేస్తే, నేరం దార్ల సందీప్పైకి పోతుందని గణేష్ భావించాడు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో దార్ల సందీప్కు పోటీగా బరిలో నిలిచి ఓడిపోయిన మార్గం లక్ష్మణ్తో గణేశ్ స్నేహం ఉంది. సందీప్ పదవి కోల్పోతే లక్ష్మణ్కు ఎవరూ పోటీ ఉండరని, వెంకటేశంతో తనకున్న సమస్య తీరుతుందని భావించాడు. ఈనేపథ్యంలో ఈనెల 6న గణేశ్, వెంకటేశంను మద్యం తాగడానికి రగుడు సమీపంలోని గుట్టకు తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం కొని వెంకటేశం తాగే మద్యంసీసాలో నైట్రాప్(డైయింగ్ రసాయనం)కలిపి ఉంచాడు. దానిని వెంకటేశంతో తాగించి ఏమి ఎరుగనట్లు ఇంటికొచ్చేశాడు. పట్టిచ్చిన సూసైడ్నోట్ మృతుడి భార్య సులోచన ఫిర్యాదుతో ఈనెల 6న సిరిసిల్ల ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరీక్షించారు. మృతుడు, నిందితుడు ఇద్దరు కలిసి వెళ్లడాన్ని గమనించి విచారణ చేపట్టారు. గణేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంకటేశంను నైట్రాప్ తాగించి చంపినాక అతని జేబులో గణేశ్ సూసైడ్నోట్ను ఉంచాడు. అస్సలు రాయడం రాని వెంకటేశం సూసైడ్నోట్ ఎలా రాస్తాడని పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సంఘటనలో అధికార పార్టీ నేత మార్గం లక్ష్మణ్, పోసు రమేశ్, పసునూరి సూర్యప్రకాశ్తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని హత్యకేసులో వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బి.రవి, ఎన్.శ్రీనివాస్లను అభినందించారు. మద్యంలో నైట్రాప్ తాగించిన గణేశ్ మరో నలుగురిపై సాగుతున్న దర్యాప్తు హత్య కేసులో నిందితుడు రిమాండ్ వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి -
రాజన్న గర్భగుడిని టచ్ చేస్తే ఊరుకోం
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి ఏం జరుగుతుందో.. ఎవరికి అనుమతి ఇవ్వడం లేదని.. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం గుడిని నిర్మిస్తున్నామంటూనే.. ఆగమాగం చేస్తున్నారన్నారు. వేములవాడలోని పద్మశాలీ భవనంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధి పేరుతో గర్భగుడిని టచ్చేస్తే శ్రావణమాసంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల సందర్భంగా ప్రవర్పాయింట్ ప్రజంటేషన్లో చెప్పింది వేరని.. ఇప్పుడు చేస్తుంది వేరన్నారు. అభివృద్ధికి తాము అడ్డుకాదని, మొదట్లో చెప్పిన ప్రకారం పనులు చేయాలని కోరారు. రాజన్న ఆలయ విస్తరణ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాపెల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, కుమ్మరి శంకర్, మైలారం శ్రీనివాస్, కొండ్లెపు ముత్యం, సంటి మహేశ్, రాహుల్, పిన్నింటి హన్మండ్లు, సగ్గు శేఖర్ తదితరులు ఉన్నారు. శ్రావణమాసంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ -
పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు
కరీంనగర్టౌన్: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తూ విడతల వారీగా వసతుల కల్పనకు రూ.కోటి వరకు నిధులు వెచ్చించనున్నారు. పాఠశాలల అభివద్ధికి ఈ పథకాన్ని 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ కింద 60 పాఠశాలలను ఎంపిక చేశారు. తాజాగా ఉన్నత తరగతుల విద్యార్థులుకు ప్రయోగాత్మక బోధన చేపట్టి సైన్స్, గణితం పాఠ్యంశాలపై పట్టు సాధించి సామర్థాన్ని పెంచేందుకు సైన్స్ కిట్లు అందజేసేందుకు ఉమ్మడి జిల్లాకు రూ.24లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పాఠశాలలలో గణిత, సైన్స్ టీచర్లు, సీనియర్ ఉఫాధ్యాయులు, పాఠశాల కమిటీ ప్రతినిధితో ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా పాఠశాలస్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యమే లక్ష్యంగా పీఎంశ్రీ పాఠశాలలు.. పీఎంశ్రీ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతారు. విద్యార్థులకు కార్పొరేట్స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆధునిక సాంకేతిక వనరులు సమకూర్చుతారు. విద్యార్థులకు మానసిక స్వేచ్ఛను కల్పించి వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇస్తారు. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు మూల్యాంకన చేసి విద్యార్థుల స్థాయిని పరిశీలిస్తారు. తద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం సులభతరమవుతుంది. ఉమ్మడి జిల్లాలో 60 స్కూళ్లకు రూ.24 లక్షలు విడుదల నిధుల విడుదల ఇలా.. జిల్లా పాఠశాలలు నిధులు(రూ.లల్లో) కరీంనగర్ 20 8,00,000 పెద్దపల్లి 13 5,20,000 రాజన్నసిరిసిల్ల 11 4,40,000 జగిత్యాల 16 6,40,000 మొత్తం 60 24,00,000 -
పెద్దాస్పత్రిలో మెనో!
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందని ద్రాక్షగా మారుతోంది. నాసిరకమైన ఆహారం వడ్డిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎంసీహెచ్, జీజీహెచ్, క్రిటికల్ కేర్లో కలుపుకొని సుమారు 550 పడకలున్నాయి. ఇన్ పేషెంట్లకు ప్రతిరోజు భోజనం పెట్టాల్సిన డైట్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేషెంట్లు, గర్భిణులు, బాలింతలు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. రుచి పచీ లేని భోజనం తినలేక ఇంటినుండే టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ప్రోటీన్లకు కత్తెర.. లాభాలే లక్ష్యం శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలకు, పాలు ఇవ్వాల్సిన బాలింతలకు హైప్రోటీన్ ఆహారం అత్యంత అవసరం. ప్రభుత్వం ప్రతీ పూట ఇద్దరు వ్యక్తులకు సరిపడా బలాన్నిచ్చే తిండితో పాటు రెండు గుడ్లు, పల్లిపట్టీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా, సగానికి కోత పెడుతున్నారు. వార్డుకో న్యాయం, మనిషికో తీరుగా వ్యవహరిస్తూ గుడ్డును పక్కదారి పట్టిస్తున్నారు. పాలు నీళ్లకన్నా పలుచగా, పప్పు నీళ్ల రసంగా మారిపోయాయి. ఇక టిఫిన్ అంటే రోజు ఉప్మా తప్ప వేరే కనబడదు. నాణ్యత లేని ముతక బియ్యం వండటంతో ఆ అన్నం మింగలేక, గొంతు దిగక ఆకలితో అల్లలాడుతున్నారు. ఆసుపత్రి భోజనం ఇలాగేనా క్యాంటీన్ నిర్వాహకులు శుభ్రతను మర్చిపోయారు. రుచి లేని వంటకాలతో కనీస పోషకాలు దక్కక రోగుల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతోంది. ఆసుపత్రి బయట దాతలు చేసే అన్నదానంలో ఉన్న శుచి కూడా ఈ సర్కారు బువ్వలో కనిపించడం లేదని రోగుల బంధువులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పర్యవేక్షణ కరువు పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నా యి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏ రోజు ఏం పెడతారో తెలిపే ‘మెనూ బోర్డు’ కూడా ప్రదర్శించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారు లు స్పందించి ప్రతిరోజూ ఆహార నాణ్యతను తనిఖీ చేసి, నాసిరకం వంటలు వడ్డిస్తున్న కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉచితంగా మద్యం ఇవ్వలేదని దౌర్జన్యం
పెద్దపల్లి: తమకు ఉచితంగా మద్యం ఇవ్వలేదనే ఆగ్రహంతో ముగ్గురు వైన్స్షాప్లోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారు. ఆస్తులను ధ్వంసం చేసి, నిర్వాహకులను హత్య చేస్తామని బెదిరించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా హన్మంతునిపేటలో చోటుచేసుకుంది. వైన్స్షాప్ నిర్వాహకుడు విద్యాసాగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈనెల 8న రాత్రి సుమారు 7.30 నుంచి 8 గంటల మధ్య సురభి కిరణ్రావు, శ్రీనివాస్రావు, పోలసాని సుధాకర్రావు హన్మంతునిపేటలోని లక్ష్మీగణపతి వైన్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. తమకు ఉచితంగా మద్యం ఇవ్వాలని డిమాండ్ చేయగా నిర్వాహకులు నిరాకరించారు. దీంతో విద్యాసాగర్తోపాటు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ హత్య చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా గ్రిల్ ధ్వంసం చేశారు. మద్యం బాటిళ్లు పగులగొట్టట్టారు. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారు. దీంతో తనకు పెద్దఎత్తున ఆస్తినష్టం వాటిల్లిందని విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్రావు గతంలోనూ ఇదేవిధంగా ఇబ్బందులకు గురిచేసినా.. సమస్యను పెద్దది చేయకుండా వదిలేశామని, ఈసారి ఆస్తినష్టం వాటిల్లడంతోపాటు ప్రాణహాని కలిగించేలా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలనిపోలీసులను కోరారు. -
మత్తుపై యువ‘కలం’
కరీంనగర్ కల్చరల్: మత్తు మహమ్మారిపై యువ కలం గళమెత్తుతోంది. గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా అక్షరాలే ఆయుధాలయ్యాయి. మాదకద్రవ్యాల మాయలో చిక్కుకుని భవిష్యత్ను నాశనం చేసుకుంటున్న యువతను మేల్కొలిపేందుకు పలువురు యువ కవులు తమ కవిత్వంతో గళమెత్తారు. ‘మత్తుకు దూరంగా ఉండాలి.. మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం మనమంతా ఒక్కటవ్వాలి’ అంటూ సందేశమిచ్చారు. ‘యుద్ధం మొదలైంది’ అంటూ కవితల రూపంలో తిరుగుబాటును ప్రకటించారు. ఆదివారం తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కవి సమ్మేళనంలో పలువురు యువ కవులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను కవితల రూపంలో వినిపించారు. మత్తు పదార్థాలు వ్యక్తినే కాదు.. కుటుంబాన్ని, సమాజాన్ని ఛిద్రం చేస్తాయని హెచ్చరిస్తూ, వాటి నిర్మూలన కోసం సమాజంతో కలిసి తామూ ముందుండి పోరాడతామని తమ కవితల రూపంలో చాటిచెప్పారు.యువత మేలుకో. లే లేచి నిలబడు. నీ శక్తిని వృథా చేసుకోకు మత్తుపై యుద్ధం చేయి. మత్తు కాదు. ఇది మరణపు విత్తనం గంజాయి కాదు.. ఇది భవిష్యత్తు శవపేటిక నీ రక్తంలో ఉరకలెత్తే స్వప్నాలు సాకారం కావాల్చి కానీ.. మత్తు విషపు కోరల్లో బందీ అవకు.. ప్రతి పాఠశాలలో చైతన్య దీపం వెలిగిద్దాం ప్రతి యువకుడి హృదయంలో ధైర్యాన్ని నాటుదాం – మహాంకాళి సుగుణ, బెజ్జంకి, యువ రచయిత్రికళ్లు తెరువు యువకా.. నీ కలలను మింగేస్తున్న మత్తును వదిలేయ్! నీ చేతిలో పుస్తకం ఉండాలి.. సిరంజి కాదు.. మైదానంలో ఆడాలి.. చీకటి అడ్డాల్లో కాదు.. అమ్మ కన్నీటిని చూడు.. నాన్న ఆశలను గుర్తుచేసుకో.. రేపటి భారతాన్ని నిర్మించే చేతులు ఈ రోజు చెడిపోకూడదు..లేచి నిలబడు యువభారతమా. – మాసం సీమ, కరీంనగర్ గంజాయి, డ్రగ్స్కు వ్యతిరేకంగా కవితలతో చైతన్య సందేశం -
మళ్లీ మొరాయించిన అంబులెన్స్
● నడిరోడ్డుపై ఆగిపోయిన 108 వాహనం ● అధ్వానంగా నిర్వహణ ● రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో 108 వాహనాల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో వరుసగా జరిగిన ఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్తండాకు చెందిన ఓ మహిళా పేషెంట్ను శుక్రవారం 108 అంబులెన్స్లో తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొరాయించగా.. వీర్నపల్లి నుంచి మరో వాహనాన్ని తెప్పించి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఆదివారం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన దస్తగిరిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలిస్తుండగా సముద్రలింగాపూర్ నుంచి మొరాయిస్తూ వ చ్చిన అంబులెన్స్ ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారుకు చేరుకోగానే నిలిచిపోయింది. దీంతో మరో వాహనాన్ని తెప్పించి నడిరోడ్డుపైనే ఆ వాహనంలోకి పేషెంట్ను మార్చాల్సి వచ్చింది. -
కొడుకును హత్య చేయబోయిన తండ్రి రిమాండ్
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో శనివారం కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించిన తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. కోనరావుపేట పోలీస్స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మల్కపేటలో గుడిపేట రాఘవులు తన కొడుకు రాజేందర్పై గొడ్డలితో దాడి చేసి హత్యకు ప్రయత్నించాడు. రాజేందర్ ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రాఘవులును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఎస్సై ప్రశాంత్రెడ్డి, కానిస్టేబుళ్లు జగన్, విశాల్రాజు, మనోజ్ తదితరులు ఉన్నారు. -
ఉన్నట్లా.. లేనట్లా?
కరీంనగర్టౌన్: నియోజకవర్గ అభివృద్ధి ఫండ్(సీడీఎఫ్) ఉన్నట్లా.. లేనట్లా.. అనే సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకిచ్చిన హమీలు అమలు చేయలేకపోతున్నారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కరీంనగర్, హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. చొప్పదండి, మానకొండూర్ నుంచి మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో రూ.5కోట్ల చొప్పున మంజూరు చేయగా.. రెండేళ్లుగా ఎలాంటి నిధులు రాకపోవడంతో మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇన్చార్జి మంత్రుల ద్వారా ఇతర నిధులు పొందుతూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీల పేరిట ఇతర నిధులు విడుదల చేస్తుండటంతో వివాదాస్పదం అవుతోంది. ఏటా పెరుగుతున్న సీడీఎఫ్ నిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ (సీడీఎఫ్) ఏటా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. సీడీఎఫ్ నిధులు మంజూరు 2010 నుంచి ప్రారంభమైంది. మొదట్లో రూ.కోటి ఉండగా తర్వాత రూ.3 కోట్లకు పెంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.10 కోట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.5 కోట్ల చొప్పున మంజూరయ్యాయి. నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. మరిన్ని నిధులు మంజూరైతే ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వచ్చే అర్జీలు పరిష్కారమయ్యే అవకాశం ఉండేది. సకాలంలో నిధులు వస్తేనే ఊరట నియోజకవర్గ అభివృద్ధి నిధులు సకాలంలో మంజూరైతేనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఊరట కలుగనుంది. గ్రామాలు, పట్టణాల్లో బోర్లు వేయించడం, స్కూళ్లలో అదనపు తరగతి గది, టాయిలెట్ల నిర్మాణం, సీసీ రోడ్ల పనులు చేపట్టవచ్చు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎలక్ట్రిక్ దహనవాటిక, ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల ఏర్పాటు, ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, చెక్డ్యామ్లు, కాలువలు, కమ్యూనిటి హాళ్లు, బస్లాండ్ల నిర్మాణం వంటి 98 రకాల అభివృద్ధి పనులకు ఖర్చు చేయవచ్చు.ఈ నిధుల ఖర్చుకు సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కలెక్టర్ ఆమోదంతో నిధుల మంజూరు జరిగేది. ఈసారి కలెక్టర్తో పాటు ఇన్చార్జీ మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. -
అమరుడి కుటుంబానికి అందని సాయం
బోయినపల్లి(చొప్పదండి): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర సైనికుడి కుటుంబం ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురుచూస్తోంది. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన పబ్బాల్ల అనిల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన హామీలు ఇప్పటి అమలు కాలేదు. మూడేళ్లుగా ఎక్స్గ్రేషియా కోసం సైనికుడి భార్య అధికారుల చుట్టూ తిరుగుతోంది. అధికారులు జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వ్యాఖ్యానించడం వైరల్గా మారింది. మల్కాపూర్కు చెందిన పబ్బాల లక్ష్మి –మల్లయ్యల కుమారుడు అని పదిహేనేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. జమ్మూకాశ్మీర్లో విధి నిర్వహణలో ఉండగా 2023 మే 4న హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడయ్యాడు. అనిల్కు భార్య సౌజన్య, కొడుకులు అయాన్, అరయ్. అనిల్ మరణాన్ని యుద్ధ సమయంలో ప్రాణనష్టంగా ప్రభుత్వం గుర్తించిందని ఆయన సతీమణి సౌజన్య పేర్కొంది. ఎదురుచూపులే.. ఎక్స్గ్రేషియా, సేన మెడల్కు సంబంధించిన నగదు పురస్కారం మూడేళ్లుగా అందలేదని అనిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం విషయంలోనూ తుది పరిష్కారం లభించలేదన్నారు. పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ భార్య ఇద్దరు పిల్లలను చూసుకుంటూ మల్కాపూర్లోనే నివసిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆమె కోరుతోంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఎక్స్గ్రేషియా, సేన మెడల్ నగదు పురస్కారం, వ్యవసాయ భూమి, ఇంటి స్థలం అందించాలని కోరుతుంది. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వ్యాఖ్యలు వైరల్ దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన అనిల్ సతీమణి సౌజన్య ఎక్స్గ్రేషియా కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తోందని ఈ విషయంలో అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తానని చెపుతున్నారు. ఆయన మాటలు సైతం అధికారులు వింటున్నారో.. లేదోనని పేర్కొన్నారు. అనిల్ అమరుడైన సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు శ్రద్ధాంజలి ఘటించి దేశభక్తిని ప్రకటించారు. అమరుడైన సైనిక కుటుంబానికి సాయం చేయాలని మెసేజ్ చేస్తే పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. వ్యవసాయభూమి, ఇంటి స్థలం కోసం ఎదురుచూపు జమ్మూకాశ్మీర్లో అమరుడైన సైనికుడు అనిల్ జీవోల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు -
సౌకర్యాలెన్నీ.. లేనివెన్ని!
కరీంనగర్ అర్బన్: గ్రామ, పట్టణాల వివరాలను సమగ్ర సమాచారంతో డీసీహెచ్బీ(డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్) రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర గణాంకశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. విలేజ్, టౌన్ డైరెక్టరీలను వేర్వేరుగా రూపొందించనుండగా నేటి నుంచి సర్వే ప్రారంభమై వచ్చే నెల 10వరకు కొనసాగనుంది. గ్రామాల్లో రెవెన్యూ గ్రామం వారీగా, పట్టణాల్లో వార్డు వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రధానంగా 8అంశాలపై సమగ్ర సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వగా మున్సిపల్, మండలాల వారీగా డిస్ట్రిక్ట్ ఆడిషనల్ సెన్సెస్ ఆఫీసర్ వెల్ది కిషన్రావు ఆధ్వర్యంలో నె ల రోజుల పాటు జరిగే సర్వేలో గ్రామ, పట్టణస్థా యి అధికారులు కీలక భూమిక పోషించనున్నారు. మండలాలకు తహసీల్దార్.. మున్సిపల్కు కమిషనర్ సర్వేను పర్యవేక్షణ చేసేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ గ్రామ పంచాయతీ కేంద్రంగా జీపీవో లేదా కార్యదర్శి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించనున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, మున్సిపల్లో మున్సిపల్ కమిషనర్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా ఆడిషనల్ సెన్సెస్ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో, ఎస్వో వ్యవహరించనున్నారు. నెల రోజుల పాటు జరిగే ప్రక్రియలో ర్యాండమ్ వెరిఫికేషన్ చేయనున్నారు. గ్రామాలకు విలేజ్ రిజిష్టర్, పట్టణాలకు టౌన్ రిజిష్టర్లో వివరాలను నమోదు చేయనున్నారు. అభివృద్ధి ప్రణాళికలకు దోహదం ప్రతి జనగణన సందర్భంగా ఈ ప్రక్రియ చేపడుతుంటారు. 2011లో జనగణన జరగగా అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ తేడా స్పష్టమవనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న కనీస సౌకర్యాలు, సదుపాయాలు, విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయ, వృత్తి పనులు, టెక్నాలజీ, తదితర వివరాల సేకరణలో ఇది ఎంతో కీలకం. ఈ డిజిటల్ నమోదు ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామం, పట్టణంలో వార్డు వారీగా సమస్త సమాచారం అందుబాటులో ఉండనుంది. వివరాల నమోదు పూర్తయిన తరువాత సకల సమాచారంతో డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్ విడుదల కానుంది.జిల్లా జనాభా: 10,49,140గ్రామ పంచాయతీలు: 318రెవెన్యూ గ్రామాలు: 195నగరపాలక సంస్థ: 01(కరీంనగర్) మున్సిపాలిటీలు: 3(హుజూరాబాద్, జమ్మికుంట,చొప్పదండి) సాగుదారులు: 78,516వ్యవసాయ కూలీలు: 1,86,363కుటీర పరిశ్రమలు: 61,869ఇతర రంగాలు: 1,80,347 -
మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
కరీంనగర్ కల్చరల్: మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని మేయ ర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన యువ కవి సమ్మేళనం‘యుద్ధం మొదలైంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను కవితల ద్వారా యువ కవులు ఎత్తిచూపడం అభినందనీయమన్నారు. ఎస్యూ రిజిస్ట్రార్ పి.సతీశ్ కుమార్ మాట్లాడుతూ యువ సాహిత్యం కొత్త ఆలోచనలకు వారధిగా నిలుస్తోందన్నారు. ప లువురు యువ కవులు మాదకద్రవ్యాల వ్యతి రేక సందేశంతో కూడిన కవితలు వినిపించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు కొత్త అనిల్కుమార్, కవులు దొమ్మటి శంకర్, కాండూరి వెంకటేశ్వర్లు, బీవీఎన్ స్వామి, కేఎస్.అనంతాచార్య, మాధవ్, నీలగిరి అనిత, సాయి చరణ్, శ్రీకర్, అనిల్, సుగుణ, అనుష, బొమ్మకంటి కిషన్, ఉపేంద్ర పాల్గొన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి కరీంనగర్: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపుని చ్చారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం నగరంలో సమావేశం అయ్యా రు. సోమవారం నుంచి ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివా స్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బాస సత్యనారాయణ రావు, కన్నబోయిన ఓదెలు, నాగేశ్వర్రెడ్డి, ప్రవీణ్ రావు పాల్గొన్నారు. ప్రభుత్వం గాడి తప్పకుండా సీఎం జాగ్రత్తగా ఉండాలి చిగురుమామిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాడితప్పకుండా సీఎం రేవంత్రెడ్డి జాగ్రత్త పడాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి సూచించారు. చిగురుమామిడి మండలం రేకొండ, చిగురుమామిడి, పీచుపల్లి, చిన్నముల్కనూర్, సీతారాంపూర్, లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్, రామంచ, ముదిమానిక్యం గ్రామాల్లో ఆదివారం సీపీఐ ప్రచార జాత నిర్వహించారు. చాడ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తాత్సారం చేస్తోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగిరి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం విద్యానగర్(కరీంనగర్): దేశాన్ని పట్టి పీడిస్తు న్న కులమనే అతిపెద్ద జబ్బును అంతం చేయ డం ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు అన్నారు. ఆదివారం కరీంనగర్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో 78ఏళ్ల స్వాతంత్య్రం సామాజిక న్యాయం అనే అంశంపై సె మినార్ నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్, జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్, గాజుల కనకరాజు, గోవర్ధన్, విజయ, సుకోసి శ్రీకాంత్, కదాసి కుమార్, సదానందం, సంకీర్త్ పాల్గొన్నారు. -
దర్యాప్తు పెరిగింది.. కేసులు తగ్గాయి
కరీంనగర్క్రైౖం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026 జనవరి నుంచి జూన్ వరకు నమోదైన నేరాల గణాంకాలు ఆసక్తికర చిత్రాన్ని ఆవిష్కరించాయి. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు పెరగగా.. పెండింగ్ కేసులు తగ్గడం పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. 2025 తొలి ఆరు నెలల్లో కమిషనరేట్ వ్యాప్తంగా 3,654 కేసులు నమోదు కాగా, 2026లో అదే కాలంలో 3,806కేసులు నమోదయ్యాయి. అంటే 152 కేసులు ఎక్కువ నమోదు కాగా.. దర్యాప్తులో ఉన్న కేసులు 3,186 నుంచి 3,102కు తగ్గి 84 కేసుల తగ్గుదల నమోదు కావడం గమనార్హం. దర్యాప్తులో రూరల్ డివిజన్ టాప్ కేసులో దర్యాప్తులో కరీంనగర్ రూరల్ డివిజన్ టాప్లో నిలిచింది. 2025లో జూన్ వరకు 1,626 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 1,725 ఫిర్యాదులు వచ్చాయి. గతేడాది పెండింగ్ కేసులు ఉండగా.. 1,541.. ఈ సారి 1,325కు తగ్గాయి. మొత్తంగా 216 కేసుల తగ్గుదల నమోదైంది. కరీంనగర్ టౌన్ డివిజన్లో గతేడాది జూన్ వరకు 1,091 కేసులు నమోదు కాగా.. ఈఏడాది 1,103కి పెరిగాయి. దర్యాప్తు పెండింగ్ కేసులు గతేడాది 1,077 ఉండగా.. ఈ ఏడాది 1,091కి పెరిగాయి. ఇందుకు కారణం నగరంలో నేరాల ఒత్తిడి, విచారణ భారంగా పోలీసులు భావిస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్లో రిపోర్టింగ్ కేసులు 937 నుంచి 978కు పెరిగాయి. దర్యాప్తులో ఉన్న కేసుల సంఖ్య 568 నుంచి 686కు పెరిగి ఏకంగా 118 కేసుల పెరుగుదల నమోదైంది. పోలీసు స్టేషన్ వారీగా.. గతేడాది మొదటి ఆరు నెలలు, ఈ ఏడాది జూన్ వరకు దర్యాప్తులో ఉన్న కేసులు, అత్యధికంగా తగ్గిన స్టేషన్లను పరిశీలిస్తే.. కరీంనగర్ వన్టౌన్ 117, కరీంనగర్ రూరల్ 101, మాననకొండూరు 84, చొప్పదండి 60, ఎల్ఎండీకాలనీ 26 కేసులు తగ్గాయి. ఈ స్టేషన్లలో పాత కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దర్యాప్తులో ఉన్న కేసులు భారీగా పెరిగిన స్టేషన్లు పరిశీలించగా.. కొత్తపల్లి 80, ఉమెన్ పోలీస్స్టేషన్ 58, కరీంనగర్ 3 టౌన్ 41, జమ్మికుంట 41, కరీంనగర్ 2 టౌన్ 32, సైదాపూర్ 31, హుజూరాబాద్ టౌన్ 28, ఇల్లందకుంటలో 24 కేసులు పెరిగాయి. ఈ ఆరు మాసాల్లో కరీంనగర్ 1టౌన్లో 403, కొత్తపల్లి 405, కరీంనగర్ 2టౌన్ 373, జమ్మికుంట 264, మనకొండూరు 244 కేసులు పెరిగాయి. హుజూరాబాద్ డివిజన్, కొత్తపల్లి, ఉమెన్ పోలీస్స్టేషన్, 2 టౌన్, 3 టౌన్, జమ్మికుంట వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న దర్యాప్తు పెండింగ్ కేసులు భవిష్యత్తులో ప్రత్యేక కార్యాచరణ అవసరాన్ని సూచిస్తున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బందెల రమేశ్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్ నర్సింగాపూర్లోని గంగారెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యజమాని నుంచి రమేశ్కు రూ.500 రావాల్సి ఉంది. ఈ క్రమంలో రమేశ్ తమను బూతులు తిడుతూ మెసేజ్లు పోస్ట్ చేస్తున్నాడంటూ యజమానితోపాటు మరోవ్యక్తి వచ్చి రమేశ్పై దాడికి దిగారు. రమేశ్కు చికిత్స అందించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. రమేశ్ ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. రమేశ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యజమాని గంగారెడ్డితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డివైడర్ను ఢీకొని వ్యక్తి దుర్మరణంజగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్రోడ్డులో డివైడర్ను ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాకేంద్రంలోని అశోక్నగర్కు చెందిన కాశిపాక గంగాధర్ స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం గంగాధర్ ఆయన తాత దీకొండ పోశయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై కొత్త బస్టాండ్కు వెళ్లి.. బైపాస్ రోడ్డు మీదుగా వస్తున్నారు. ద్విచక్రవాహ నం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో గంగాధర్, పోశయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇద్దరినీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంగాధర్ మృతిచెందాడు. పోచయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గంగాధర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం దత్తోజీపల్లి శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మయ్య(70) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆకుల లక్ష్మయ్య ఆదివారం సాయంత్రం రామడుగు నుంచి గుమ్లాపూర్కు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. దత్తోజీపల్లి శివారులో వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. తల బండరాయికి తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ముంపు గ్రామంగా ప్రకటించాలిగంగాధర: గంగాధర మండలం నారాయణపూర్ను రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామంలోని 13మందిపై అక్రమంగా నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ కేసులు ఎత్తి వేయాలని ఆదివారం మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ.. రిజర్వాయర్ పనులు పూర్తి కాక ముందే చెరువు నిండితే ఊరుమొత్తం జాలు వారుతుందన్నారు. ఇప్పటికే ఇళ్లలోకి నీటితో పా టు, పాములు, తేళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు కట్ట తెగి ఊళ్లోకి నీరు చేరిందన్నారు. సమస్య పరిష్కారానికి ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఏళ్లకాలంగా విన్నవిస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మొదట్లో 11ఇళ్లు, ఇప్పు డు దాదాపు ముప్పై ఇళ్లను ముంపుకింద తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. -
వెంకటేశం మృతిపై వీడని మిస్టరీ
సిరిసిల్లటౌన్: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు. ఆ కుటుంబపెద్ద వెంగళ వెంకటేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో.. భార్య, కూతురు రోడ్డున పడ్డారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో విరాళాలు సేకరించారు. గురువారం మిస్సయిన ఇంటి పెద్ద కోసం భార్య, కూతురు ఏడ్చి..ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. శనివారం మృతిచెంది కనిపించడంతో వారి రోదనకు అంతులేకుండా పోయింది. వారి దీనస్థితిని చూసి స్థానికులు చలించిపోతున్నారు. సిరిసిల్ల పట్టణంలో వైపని కార్మికుడు వెంకటేశం మృతితో భార్య సులోచన, కూతురు ప్రసన్న ఒంటరిగువ్వలయ్యారు. ఆవేదన వారి మాటల్లోనే.. బిడ్డ లేకుండా ఏ గుడికీ పోడు ఐదు రోజుల కింద మా ఆయన పనిచేసే కుసుమ గణేష్తో పోయిండు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. అదేరోజు మా బిడ్డ ఫోన్ చేసి అడిగితే చెప్పలేదు. గుడికి కొబ్బరికాయలు కొట్టపోయిండని చెబుతుండు. వారం కిందే మా బిడ్డతో కలిసి ముగ్గురం పోయి అదే గుడిలో కొబ్బరికాయలు కొట్టి వచ్చినం. మళ్లీ అదే గుడికి గణేష్తో ఎందుకు పోయిండు..? ఆ విషయం ఆయన ఎందుకు దాసిపెట్టిండు..? మాకు అనుమానంగానే ఉంది. మున్సిపల్ వైస్చైర్మన్ సందీప్తో గొడవైనప్పటి నుంచి గణేశ్ పని ఇచ్చుడు బంద్ చేసిండు. మా ఆయన కనిపించకుండా పోయినసంది ఇంటి చుట్టూ కొత్త మనుషులు తిరుగుతుండ్రు. ఆయన చనిపోయిన చోట డబ్బాలున్నాయి. శరీరంపై గాయాలున్నాయి. ఆయనను చిత్రహింసలు పెట్టి సంపిండ్రు. రాత్రి వేళ అంత్యక్రియలు వెంకటేశం కుటుంబాన్ని శనివారం రాత్రి కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ ఆడెపు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, అధికార ప్రతినిధి వైద్య శివప్రసాద్ పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీల ముఖ్య నేతల నుంచి స్పందన సరిగ్గా లేదన్న విషయం కూడా రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు యెల్లె లక్ష్మీనారాయణ, చొప్పదండి ప్రకాశ్, మార్గం లక్ష్మణ్, బీజేపీ నాయకుడు దుమాల శ్రీకాంత్ రూ.5వేలు చొప్పున సాయం అందించారు. న్యాయం జరగాలన్న డిమాండ్తో వివిధ పార్టీల నేతలు ఆందోళనకు ప్రయత్నించగా ఆర్డీవో శ్రీధర్బాబు, టౌన్ సీఐ శ్రీనివాస్ వారించి పంపించారు. పొద్దంతా రాజకీయ నాయకుల పరామర్శలతో రద్దీగా మారిన వెంకటేశం ఇల్లు.. అంత్యక్రియల సమయంలో ఎవరూ లేకపోవడం చర్చనీయాంశమైంది. రాత్రి 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించగా.. తండ్రి చితికి కూతురు ప్రసన్న నిప్పుపెట్టారు. పోలీసుల విచారణ వెంకటేశం మృతి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. వెంకటేశం హత్యపై సామాజిక మాధ్యమాల్లో రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టినట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టుతో వెంకటేశం మరణంపై స్పష్టత వస్తుంది. కుటుంబ పెద్ద మృతితో అంతులేని విషాదం రాత్రికి రాత్రే అంత్యక్రియలు రోడ్డునపడిన తల్లీకూతురు -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఎన్టీపీసీ లేబర్గేట్ వద్ద రహదారి పక్కన ఆగింది. అదేసమయంలో పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వేగంగా వస్తున్న ఆటో ఆగిఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ షబ్బీర్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహానందు, చందు, మల్లవ్వ, గట్టమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకోగానే డ్రైవర్ చక్రపాణికి ఫిట్స్ వచ్చాయి. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దింపిన తర్వాత అతను అక్కడే నేలపైన కొంత సేపు సేదతీరారు. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సిరిసిల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్కు ఫిట్స్ బస్సును రోడ్డు పక్కన నిలిపిన డ్రైవర్ ప్రయాణికులు సురక్షితం -
గుడిలో నిద్రకు వెళ్లి అనంతలోకాలకు..
గోదావరిఖని: బంధువు చనిపోతే దశదినకర్మ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రకు వెళ్లాడు. రాత్రి నిద్రలోనే అనంత లోకాలకు చేరుకోవడం విషాదం నింపింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కృష్ణానగర్ చెందిన దాసరి సదానందం(45) ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సమీప బంధువు మృతి చెందింది. దశదినకర్మ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో నిద్రించేందుకు ఈనెల 7న రాత్రి గోదావరిఖనిలోని కోదండరామాలయం వెళ్లాడు. రాత్రి నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున గుడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సదానందం నిద్రలేపేందుకు యత్నించారు. ఎంతపిలిచినా చలనం లేకుండా పోయింది. దీంతో కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని 108అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య దాసరి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. మంథనిరూరల్: బంధువు చనిపోతే దశదిన కర్మ అనంతరం గుడిలో నిద్ర చేసేందుకు వెళ్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిన ఘటనతో స్వగ్రామం మంథని మండలం పోతారంలో విషాదం నెలకొంది. పోతారం గ్రామానికి చెందిన దాసరి నదానందం గోదావరిఖనిలోని కృష్ణానగర్లో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాల వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటి పోయాయి. బంధువు చనిపోతే గుడికి నిద్రకు పోయి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్వంతమయ్యారు. స్వగ్రామమైన పోతారంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆమె కళ్లు సజీవం
ధర్మపురి: కూతురు చనిపోయిన దుఃఖాన్ని దిగమించుకుని ఆమె కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకుంది తల్లి. ఈ సంఘటన మండలంలోని కమలాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవునూరి లక్ష్మణ్, గంగమ్మ దంపతుల కూతురు లావణ్య (21) మూడురోజుల క్రితం తన బంధువుల ఇంటికి అన్న, వదినలతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తిమ్మాపూర్, మద్దునూర్ మధ్య డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న లావణ్య, ఆమె అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. లావణ్యను చికిత్స నిమిత్తం 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయింది. తన కూతురు కళ్లు సజీవంగా ఉండాలని, మరో ఇద్దరికి చూపునివ్వాలని పెద్ద మనసుతో తల్లి గంగా సోదరులు ఆవునూరి మహేష్, శ్రీనివాస్, ప్రదీప్ హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైధ్యులు శ్రీనివాస్కు లావణ్య కళ్లను అందించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నోజి రాజేంద్రప్రసాద్, మల్లేష్, నరేష్ తదితరులున్నారు. ఫేక్ సర్టిఫికెట్ల కలకలం ● ఆరుగురు లెక్చరర్లకు నోటీస్లు ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లలో కొంతమందికి ఇంటర్మీడియట్బోర్డు అధికారులు నోటీసులు జారీచేశారు. 2023లో ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో కొంతమంది లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఇంటర్బోర్డు అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కాకుండా ఇతర రాష్ట్రాలలో పీజీ చదివి లెక్చరర్లుగా నియామకమైన వారి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలకు వెళ్లి సర్టిఫికెట్లపై ఆరా తీశారు. ఈనేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పలు కళాశాలల్లో పనిచేస్తున్న ఆరుగురు లెక్చరర్లకు ఇంటర్బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలకు ప్రభుత్వం నడుం బిగించింది. కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, ఇల్లంతకుంట కళాశాలల్లో పనిచేస్తున్న వారికి నోటీసులు జారీ కావడం చర్చకు దారితీసింది. వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదంకరీంనగర్ క్రైం: కరీంనగర్ రాజీవ్చౌక్లోని అస్లాం మసీదు ఎదురుగా ఉన్న పల్లవి క్లాత్స్టోర్లో శనివారం వేకువజామున స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ విజ్ఞత మృతి ● ఆస్పత్రిలోనే భర్త వసంత్ యైటింక్లయిన్కాలనీ: వంటగ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యావనవేని విజ్ఞత(27) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి మహాకవి పోతనకాలనీలోని నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు యాదనవేని వసంత్ – విజ్ఞత దంపతులు ఈనెల 2న గ్యాస్స్టౌవ్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. 80శాతం కాలిన గాయలతో విజ్ఞత, 60 శాతం కాలిన గాయాలతో వసంత్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజ్ఞత చనిపోయింది. వసంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దంపతుల ఇద్దరు పిల్లలు బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారు. దీంతో పోతనకాలనీలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. విజ్ఞత తల్లిగారి గ్రామమైన బెల్లంపల్లిలోని బుచ్చంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మద్యం మత్తులో కొడుకుపై దాడి
కోనరావుపేట(వేములవాడ): తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం ముదిరి.. గొడ్డలితో దాడికి దారితీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన గుడిపేట రాఘవులు, రాజేందర్(36) తండ్రీకొడుకులు. గల్ఫ్కు వెళ్లిన రాజేందర్ ఏడాది క్రితం ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం రాజేందర్ దాడి చేయడంతో తండ్రి రాఘవులు చేయి విరిగింది. ఇటీవల కొడుకును హత్య చేసేందుకు తండ్రి బండరాయితో ప్రయత్నించగా రాజేందర్కు గాయాలయ్యాయి. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరి మధ్య ఇంట్లోనే వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన రాఘవులు ఇంట్లోనే మంచంపై పడుకుని ఉన్న రాజేందర్పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో రాజేందర్ మెడపై, చెవిబాగంలో గాయాలయ్యాయి. వెంటనే గమనించిన గ్రామస్తులు సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం -
మహిళపై లైంగికదాడిలో రౌడీషీటర్లు!
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఈనెల 3న నిజామాబాద్కు చెందిన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో రౌడీషీటర్లు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఉండగా.. వీరికి మరో ఇద్దరు సహకరించారు. రౌడీషీటర్లలో ఒకరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడిగా చెప్పుకుంటూ పలు భూ సెటిల్మెంట్లు, పలు పంచాయితీలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఏ–1 నిందితుడు, రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్పై మల్యాల పోలీస్స్టేషన్లో 13 కేసులు, మరోచోట మరో కేసు నమోదైంది. రాజారం గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్పై ఇప్పటికే 9 కేసులున్నాయి. అలాగే గుర్రం అంజయ్యపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఇది రెండో కేసు. అలాగే ఏ–3, ధరూర్ గ్రామానికి చెందిన మర్రవేని మల్లేశ్పై గతంలో రెండు కేసులు నమోదు కాగా, మరో కేసు నమోదైంది. మహిళను రౌడీషీటర్ నరేశ్ పథకం ప్రకారమే రప్పించి శ్రీకాంత్కు సమాచారం అందించి.. లైంగికదాడికి పాల్పడి.. వీడియో చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు. రౌడీషీటర్ల హంగామా.. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్లలో ఒకరు ఎమ్మెల్యే అనుచరుడిగా మండలంలో చలామణి అవుతున్నాడు. పలువురు యువకులను వెంటేసుకుని నిత్యం రాజారం, టీఆర్నగర్, నూకపల్లి, మల్యాల, ముత్యంపేట, కొండగట్టు తదితర ప్రాంతాల్లో భూ సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏదైనా గొడవలు జరిగితే తన వద్దనున్న గ్యాంగ్ను తెప్పించి దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దికాలంగా కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రేమికులు, స్నేహితులు, కొంతమంది మహిళలను వీడియోలు చిత్రీకరించి భయబ్రాంతులకు గురిచేసి నగదుతోపాటు, బంగారు ఆభరణాలు కూడా బలవంతంగా లాక్కున్నాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని చూసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు మండలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. పథకం ప్రకారమే వీడియో చిత్రీకరణ నిందితుల్లో ఒకరు అధికారి పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు మహిళపై అత్యాచార కేసులో ఉన్న రౌడీషీటర్లపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేపట్టి పీడీయాక్ట్ ఓపెన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతుంది. నేర చరిత్ర ఉన్న వారిపై కూడా పోలీసు శాఖ వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతోంది. – అశోక్కుమార్, జగిత్యాల ఎస్పీ -
భర్తపై మొదటి భార్య బంధువుల దాడి
వేములవాడ: భార్య, పిల్లలను కాదని రెండో భార్యతో కాపురం చేస్తున్నాడని మొదటి భార్య బంధువులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వేములవాడలోని న్యూఅర్బన్కాలనీలో ఉంటున్న వావిలాల శంకర్ ఆటో డ్రైవర్. శంకర్కు భార్య, పిల్లలు ఉన్నారు. మరో మహిళను రెండో పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం మొదటి భార్య బంధువులు శంకర్ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో మాటమాట పెరిగి దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే పోలీసుల అక్కడికి చేరుకుని శంకర్ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శంకర్ మాట్లాడుతూ తాను ఇంట్లో ఉండగా కత్తులు, కర్రలతో వచ్చి దాడి చేశారన్నారు. మొదటి భార్య బంధువులు మాత్రం తాము ఏమీ అనకుండానే గోడకు ఉన్న గ్లాస్ అద్దానికి తలబాదుకుని తనకుతానే తల పగులగొట్టుకున్నాడని వెల్లడిస్తున్నారు. ఇరుపక్షాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
కరుడుగట్టిన ‘థార్ గ్యాంగ్’ పట్టివేత
కొత్తపల్లి(కరీంనగర్): కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని శనివారం కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా తాండా తాలూకాకు చెందిన కరుడుగట్టిన నలుగురు సభ్యుల ముఠా (థార్ గ్యాంగ్) ఇటీవల కరీంనగర్కు చేరుకుంది. కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రేకుర్తి, మల్కాపూర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. రేకుర్తి కంటి ఆసుపత్రి కమాన్ సమీపంలో సర్దు(25), సర్దార్(29)ను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే సుత్తె, పానను స్వాధీనం చేసుకున్నారు. గతేడాడాది సంక్రాంతి సమయంలో చింతకుంట ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. మళ్లీ దొంగతనాలకు పాల్పడేందుకు కరీంనగర్కు వచ్చినట్లు విచారణలో తేలింది. నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు పరారైనట్లు, అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కోరుట్లరూరల్: పట్టణంలోని ఎన్హెచ్ 63పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోరుట్లకు చెందిన మహమ్మద్ ఖాసీం (37) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. విలాసాగర్ గ్రామానికి చెందిన దూలపల్లి శంకర్ తన టాటా ఏస్ వాహనంపై మెట్పల్లి నుంచి కోరుట్లకు వస్తున్నాడు. మొహమ్మద్ ఖాసీం తన ఎలక్ట్రిక్ స్కూటర్పై కోరుట్ల వైపు నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్నాడు. టాటా ఏస్ వా హనం వేగంగా వచ్చి ఖాసీం బైక్ను ఢీకొట్టింది. ఈ ఘ టనలో ఖాసీంకు తీవ్ర గా యాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చె ందాడు. ఖాసీం భార్య అనీ షాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


