breaking news
Karimnagar District News
-
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో బాధిత కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. ఈసందర్భంగా మోహన్ చిన్న కూతురు అశ్విని తన మరణానంతరం దేహదానం చేసేందుకు అంగీకారం తెలుపగా, పలువురు ఆమెను అభినందించారు. ఈసందర్భంగా అశ్విని మాట్లాడుతూ, తన తండ్రి చెప్పిన విధంగా మనిషి మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేహదానం చేసేందుకు ముందుకొచ్చానని పేర్కొన్నారు. -
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’. అని అంటున్నాడు కోరుట్లకు చెందిన రిటైర్డ్ టీచర్ వోటారికారి చిన్నరాజన్న. మరణానంతరం అవయవదానం చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి అంగీకారపత్రం తీసుకున్నారు. అవయవదాతలు పునర్జన్మ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. – చిన్నరాజన్న -
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం ● బాలుడి అద్భుత ప్రదర్శన ● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన కరీంనగర్కల్చరల్: కరీంనగర్కు చెందిన కనపర్తి మనవేంద్ర రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లు, వాటి అటామిక్, మాస్ నంబర్లను 40 సెకన్లలోనే కంఠస్థంగా చెప్పి శ్రీఅమేజింగ్ మైండ్ ప్రెజంటేషన్ ఇన్ కెమిస్ట్రీశ్రీ రికార్డు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన యూఎస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావడం విశేషం. నగరంలోని ఫిలింభవన్లో శుక్రవారం కనుపర్తి మనవేంద్రను సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న మనవేంద్ర.. వివేకానంద స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డాక్టర్ వేణుకుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్స్ ద్వారా శిక్షణ పొందాడు. గతంలోనే ఈ బుడతడు జాతీయస్థాయి మెమొరీ చాంపియన్షిప్ సాధించాడని ట్రైనర్ వేణుకుమార్ గుర్తుచేశారు. ఈ ఘనతకు గుర్తింపుగా శ్రీసూపర్ మెమొరీ చాంప్శ్రీ అవార్డు పొందిన మనవేంద్రను తల్లిదండ్రులు శతి – మురళి అభినందించారు. విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్న డాక్టర్ వేణుకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్లు తిరుపతి, హరీశ్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మద్దిమల్ల గ్రామానికి చెందిన మాజోజు స్వరూప తండాలోని అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. నిత్యం అక్కడికి వెళ్లి వస్తుంటుంది. ఈనెల 8న విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్పై ఎక్కించుకున్న వ్యక్తి మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బండి పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుమారుడు విష్ణుసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ మృతి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ దహన సంస్కారాల కోసం రూ.20వేల చెక్కును అందజేశారు. అఽఘాయిత్యాలు నిలువరించాలి ఐసీడీఎస్ కార్యకర్తలపై అఽఘాయిత్యాలను ప్రభుత్వం నిలువరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత కోరారు. మద్దిమల్లతండా అంగన్వాడీ టీచర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, కాంగ్రెస్ కార్యకర్త కల్లూరి చందన, అంగన్వాడీ టీచర్లు శాంత, సరోజన, మంజుల, అన్నపూర్ణ, వనజ, శోభ తదితరులు పాల్గొన్నారు. కన్నీరుపెట్టుకున్న అంగన్వాడీలు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ -
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ర్యాష్గా లారీ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్కుమార్ తీర్పు వెల్లడించారు. అనంతరం డ్రంకెన్డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారితో ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్కు 20 రోజుల జైలు 24 మందికి జరిమానా -
ధన్యజీవులు
కోల్సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు. వేలల్లో అవయవ దానాలు సదాశయ ఫౌండేషన్ సంస్థ ద్వారా నేత్ర, అవయవ, శరీర, చర్మదానాలతోపాటు, సమాజహితానికి తోడ్పడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 నేత్రదానాలు, 90 వరకు అవయవ, 150 వరకు దేహదానాలు చేయగా, 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో సుమారు 50,000 మందికి పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపడం గమనార్హం. అవయవదాతలకు గౌరవం దక్కాలి మరణాంతరం నేత్ర, అవయవ, దేహదానాలు చేస్తున్న దాతలకు గౌరవం కల్పించాలని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కొంతకాలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవయవదానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని, అవయవ దానం చేసిన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా అందించాలని కోరుతున్నారు. ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ అరుదైన త్యాగానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు సతీమణి, తండ్రిని దేహదానానికి ఒప్పించి తమ అభ్యర్థన పత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. రఘునందన్ స్ఫూర్తిగా మరి కొంత మంది దేహ, అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో దేహదానానికి సంబంధించిన ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్న తొలి కుటుంబం రఘునందన్దే కావడం విశేషం. -
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఓదెల గ్రామానికి చెందిన అయిలు మల్లేశ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, అతడి కళ్లను భార్య రాధిక, కుటుంబసభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. అలాగే ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామస్తులంతా అవయవదానానికి ముందుకొచ్చి జిల్లా కలెక్టర్కు అంగీకారపత్రం అందజేశారు. -
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రైస్మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని 5 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్సాదేశాల మేరకు అధికారులు గురువారం పట్టుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్ రైస్మిల్లుల్లోని ధాన్యం ప రిశీలించి విచారణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ, రెండు రైస్మిల్లులకు 2023–2024 సంవత్సరంలో యాసంగి ధాన్యం సీఎంఆర్ కోసం కేటాయించగా సాయి మహాలక్ష్మీ మిల్లులో 61, 65,305 క్వింటాళ్లు, సౌభాగ్యలక్ష్మీ మిల్లులో 10,800 క్వింటాళ్ల ధాన్యంలో వ్యత్యాసం వచ్చిందన్నారు. దీని విలువ(ఎకానమిక్ కాస్ట్) ప్రకారం సుమారు రూ.18.71కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని మారుతిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. లారీల్లో ధాన్యం ఎక్కడికి తరలించారనే దానిపైనా లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్వో తెలిపారు. ధాన్యం తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది విచారణ చేపట్టిన జిల్లా సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు -
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్లోని టవర్సర్కిల్లో వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమే అన్నారు. పార్టీలకు అతీతంగా ఈనెల 15న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్ప ప్రకాశ్, తమ్మన్నగారి సంగన్నచ సిద్దగోని శ్రీనివాస్, వల్లూరి వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పాఠశాల, ఉన్నతవిద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్(కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో మద్రాస్ ఐఐటీ ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి పది రకాల కోర్సులు 8 వారాల వ్యవధితో నామమాత్రపు రుసుంతో అందించనున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు ఈ కోర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇల్లంతకుంటలో మూడు హైస్కూళ్లు ఎంపిక -
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.బతుకుపోరులో ఆగిన గుండె తంగళ్లపల్లి(సిరిసిల్ల): పశువులను మేతకు తీసుకెళ్లిన రైతు గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో శుక్రవారం చో టుచేసుకుంది. రైతు అనవేని దేవయ్య(55) ఈనెల 6న పశువులను మేపేందు కు గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవయ్యను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్టంట్ వేశారు. కానీ దేవయ్య కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయబావిలో పడి.. శంకరపట్నం(మానకొండూర్): లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపురెడ్డి(55) బంధువులు వ్యవసాయబావి పూడిక తీస్తుండగా వెళ్లి పక్కనే ఉన్న మరోబావి లో అదుపు తప్పి పడిపోయా డు. క్రేన్ పనులు, సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో బాపురెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నీటిగుంతలోపడి.. ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన రైతు దాసరి మురళి(50) ప్రమాదవశాత్తు గుంతలోపడి మృతిచెందాడు. పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం మురళి సైకిల్పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనున్న నీటిగుంతలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. -
అమ్మ, అక్క పార్థివదేహాలు
నేత్ర, అవయవదానంతోపాటు దేహదానంపై కాళోజీ నారాయణరావు మరణించినప్పుడు అవగాహన వచ్చింది. దీంతో 2003లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి నా శరీరాన్ని దానం చేస్తానని రాసి ఇచ్చాను. మా అమ్మ, అక్క కూడా ముందుకు వచ్చారు. అమ్మ 2014లో మరణించగా కరీంనగర్లోని చల్మెడ మెడికల్ కాలేజీకి, అక్క 2023లో మరణిస్తే వరంగల్ మెడికల్ కాలేజీకి వారిద్దరి దేహాలను దానం చేశాం. నా నిర్ణయాన్ని గౌరవించి నా భార్య నిర్మల కూడా దేహదానానికి అంగీకారాన్ని తెలిపింది. – సురేశ్బాబు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిఖని అవగాహన పెరిగింది నేత్ర, అవయ, దేహదానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుంది. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి నా సోదరుడు అశోక్కుమార్. 2006లో హార్ట్ ఎటాక్తో మరణించగా, ఆయన ఆశయం మేరకు నేత్రదానంతోపాటు, పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశాం. మాది సంప్రదాయ వైష్ణవ కుటుంబం. మా కుటుంబం సానుకూలంగా ఉన్నా బంధువర్గం నిరాకరించి గొడవకు దిగారు. తమ్ముడి ఆశయం నెరవేర్చడానికి అందరూ అంగీకరించేలా నచ్చజెప్పి చేశాం. – టి.శ్రవణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి
సింగరేణి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పు అవయవదానంతో ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని బయాలజీ టీచ్చర్ చెప్పిన మాటలు, టీచర్ కూడా అవయవదానానికి అంగీకరించడం నాకు స్ఫూర్తిని చ్చాయి. ఇటీవలే నాకు 18 ఏళ్లు నిండాయి. ఈనెల 4న సింగరేణి స్కూల్ టీచర్ శశికళ సమక్షంలో నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్కు రాసి ఇచ్చాను. మా అమ్మ కూడా నా నిర్ణయాన్ని మెచ్చుకుంది. నాతోపాటు అమ్మ కూడా అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపింది. – శివగణేశ్, డీఎంఎల్టీ స్టూడెంట్, గోదావరిఖని అమ్మ నేత్రాలను.. రామగుండం మేయర్ పదవిలో ఉన్నప్పుడు అవయదానాలపై చాలా అవగాహన సదస్సుల్లో అతిథిగా పాల్గొన్నాను. మరణించిన వారి నేత్రాలు, అవయవాలను దానం చేసినట్లు సదస్సుల్లో కుటుంబ సభ్యులు చెబుతుంటే చాలా ప్రేరణ కలిగింది. అప్పుడే నా మరణాంతరం అవయవదానం చేస్తానని అంగీకారపత్రాలపై సంతకాలు చేసిన. మా అమ్మ మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయించా. నేత్ర, అవయదానాలకు సెలబ్రెటీలు, అన్నివర్గాల యువత ముందుకు రావాలి. – కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు -
ధన్యజీవులు!
● అపురూప త్యాగం దేహదానం ● వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకం ● అవయవదానంతో పునర్జన్మ ● నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవగాహనమనం మరణించినా.. బతకవచ్చు. మన కళ్లు ఈలోకాన్ని చూస్తాయి. మన గుండె లబ్డబ్ అంటూ కొట్టుకుంటోంది. మన ఊపిరితిత్తులు శ్వాసను అందిస్తాయి. కిడ్నీలు శుద్ధి చేస్తూనే ఉంటాయి.. ఇదంతా శరీరంలోని అవయవ దానంతోనే సాధ్యమవుతుంది. కేవలం అవగాహన లేక అనేక మరణాలు మట్టిపాలు, నిప్పుపాలు చేస్తున్నారు. ఇంకొకరికి దానం చేస్తే, వారి ఆయుష్షు పెంచవచ్చు. బ్రెయిన్డెడ్తో అవయవ దానం చేస్తే కనీసం ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచవచ్చు. మళ్లీ మన కళ్లు ఈ లోకాన్ని చూడొచ్చు. దేహదానం చేస్తే.. మెడికో స్టూడెంట్స్కు పాఠ్యపుస్తకం కావచ్చు. వారి పరిశోధనకు దోహదపడవచ్చు. ఈ దానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అవగాహన పెరుగుతోంది. దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.‘భగవంతుడి కోసం కళ్లు పెకిలించి ఇచ్చిన భక్త కన్నప్ప... గురు దక్షిణ కోసం బొటనవేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడు... దానంగా తొడకోసిచ్చిన శిబిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లయితే... ప్రస్తుత సమాజంతో లక్షలు, కోట్లున్నా కొనలేని.. కొనడానికి విలువకట్టలేని తమ నేత్రాలు, అవయవాలు, పార్థీవ దేహాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు వ్యక్తులు ధన్యజీవులు’.. పరోపకారమే ఇదమ్ శరీరమ్.. అని సంపూర్తిగా నమ్మి తాము పుట్టిందే పరులకు ఉపకారం చేయడానికనుకొని మనసా.. వాచా.. కర్మ.. అని ఆచరించేవారు జీవించినంత కాలం ఇతరులకు సేవచేయాలని కోరుకోవడం సాధారణమైన విషయం. జీవం పోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడడమే గొప్ప విషయం.స్ఫూర్తి -
యూరియా.. మాయ!
● అన్నదాతతో వ్యాపారుల ఆటలు ● కృత్రిమ కొరత సృష్టిస్తూ.. పొటాష్ అంటగడుతూ.. ● ఆపై అధిక ధరలకు విక్రయం ● తనిఖీల్లో వెలుగు చూడకపోవడం విచిత్రం కరీంనగర్ అర్బన్ ●: అన్నదాతతో ఆటలాడుతున్నారు వ్యాపారులు. నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అధికారగణం నామమాత్రానికే పరిమితమవుతుండటంతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎరువుల కొరత లేకుండా నిర్ణీత ధరకే రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అవసరం లేని ఎరువులను అంటగడుతూ రైతును పీల్చిపిప్పిచేస్తుండగా వ్యవసాయ శాఖ పట్టించుకోవడంలేదు. ఇక యూరియా కొరతతో రైతాంగం అల్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు కిమ్మనకపోవడం ఆందోళనకర పరిణామం. ఇదిలాఉంటే వ్యవసాయ అధికారుల్లో ఒకరు తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. కింది నుంచి పైస్థాయి వరకంటూ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోయారు. ఆర్గానిక్ పోటాష్తో ముడిపెడుతూ దోపిడీ ఎరువులను మార్క్ఫెడ్ సంస్థ ద్వారా 60 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా మరో 40 శాతం విక్రయాలు చేపట్టాలి. కాగా అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారి ఒప్పందంతో విక్రయాల శాతం మరోరకంగా ఉందన్న ఆరోపణలున్నాయి. కరీంనగర్ పట్టణంలోని చేపల మార్కెట్, గాంధీ ఏరియాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలతో పాటు కరీంనగర్ రూరల్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాలతో పాటు దాదాపు జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానాపాట్లు పడుతున్నారు. బస్తా యూరియా ధర రూ.266.50 కాగా సొసైటీల్లో కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాను రూ.310కి విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పలు సొసైటీలు, ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారీతిగా విక్రయాలు చేస్తుండటం గమనార్హం. కృత్రిమ కొరత సృష్టిస్తూ రూ.330 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మరికొన్ని రోజులైతే అసలు యూరియానే దొరకదంటూ మాటల గారడీతో సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా ఇవ్వాలంటే ఆర్గానిక్ పొటాష్ను కొనాల్సిందేనని ముడిపెడుతున్నారు. 20కిలోల బస్తా ధర రూ.1400లు కాగా దాంతో ముడిపెడుతుండటం శోచనీయం. ఆదేశాల అమలేది? ఎకరాకు బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంచేయగా అంతకుమించి ఇస్తే డీలర్ల డీలర్షిప్ రద్దు చేస్తామని ప్రకటించింది. కానీ.. ఆచరణలో మాత్రం విరుద్ధ పరిస్థితని తెలుస్తోంది. యూరియా విక్రయాలపై నిఘాను తీవ్రతరం చేశామని వ్యవసాయ శాఖ బీరాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అన్నదాతకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి వ్యవసాయ డివిజన్లు ఉండగా సదరు స్థాయిలో ఏడీఏలు ఉన్నారు. కరీంనగర్లో చొప్పదండి ఏడీఏ, హుజూరాబాద్లో మానకొండూరు ఏడీఏ, మానకొండూరులో హుజూరాబాద్ ఏడీఏ, చొప్పదండిలో కరీంనగర్ ఏడీఏలు తనిఖీలు చేస్తుండగా యూరియా బస్తాల విక్రయాల్లో దోపిడీ వీరికి కనిపించలేదా..నన్నది అనుమానాస్పద ప్రశ్న. తనిఖీల పేరుతో స్టేటస్లు, గ్రూప్ల్లో హడావుడి తప్ప నోటీసులిచ్చిన దుకాణాలెన్ని, ఏ ఏ దుకాణాలపై చర్యలు తీసుకున్నారో..నన్నది శేషప్రశ్న. ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజు తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని డీలరు ఓ రైతుకు ఒకే పట్టాదారు పాసుపుస్తకంపై 50 బస్తాలను అమ్మినట్లు అధికారులు గుర్తించగా సదరు డీలర్పై అవ్యాజ ప్రేమ కనబర్చడం అధికారులకే చెల్లు. బ్లాక్ మార్కెట్కు యూరియా పంట ఎంత వరకు సాగైంది.. ఇప్పటివరకు ఎంత విక్రయాలు జరిగాయో ఆయా ప్రాంతాలను బట్టి పరిశీలిస్తే స్పష్టమవనుండగా ఆ దిశగా చర్యల్లేవు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడమే తప్ప సదరు తనిఖీలతో రైతులకు ప్రయోజనం సున్నా. యూరియా వివిధ రకాల పంటలకు వినియోగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పౌల్ట్రీ, డెయిరీ ఫాంలలో యూరియాను ఉపయోగిస్తున్నారు. పేరొందిన డెయిరీలు కూడా పెద్దమొత్తంలో యూరియాను నిల్వచేస్తున్నాయి. లిక్కర్లోనూ యూరియా విచ్చలవిడిగా వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సదరు కంపెనీల యాజమాన్యాలు అడ్డదారిలో యూరియాను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నాయి. అయితే ఈ–పోస్ ద్వారా యూరియా విక్రయాలు జరుగుతుండగా ఎక్కువగా ఎవరు తీసుకున్నారు? సదరు రైతు సాగు చేసిన భూమి ఎంత, ఇంట్లో ఉన్నదెంతననే కోణంలో అధికారులు విచారణ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి.వానాకాలం సీజన్లో నెలల వారీగా అవసరమిలాజిల్లాకు యూరియా అవసరం: 43,254 మెట్రిక్ టన్నులు జిల్లాలో ఉన్న యూరియా: 24,493మె.టలుసరిపడా యూరియా ఏది? యూరియా రైతులకు దొరకడం లేదు. అవసరం లేని ఎరువులను అంటగడుతున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో ఎరువులను సరఫరా చేయాల్సిందిపోయి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. – గూడూరి మల్లారెడ్డి, రైతు, హూజూరాబాద్ ఎక్కువ ధరకు అమ్ముతున్రు.. యూరియా బస్తా ధర రూ.266.50 అని ప్రభుత్వం చెబుతున్నా.. వ్యాపారులు మాత్రం రూ.300లకుపైగా విక్రయిస్తున్నారు. ఇదేంటంటే మార్కెట్లో యూరియా లేదంటున్రు. వర్షాలు లేక ఇబ్బందిపడుతుంటే ఇదెక్కడి గోస. – ముత్యంరెడ్డి, రైతు, కరీంనగర్ రూరల్జూన్: 5,190 మె.ట, జూలై: 12,976 ఆగస్టు: 15,139, సెప్టెంబర్: 8,651 -
డ్రగ్ మాఫియాపై కొరడా
● వేణు ఏజెన్సీపై కేసు.. యజమాని రిమాండ్ కరీంనగర్టౌన్: కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా నడుస్తున్న డ్రగ్ మాఫియాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నకిలీ మందులు అమ్ముతున్న వేణు ఏజెన్సీ ఆథరైజ్డ్ డీలర్షిప్ను సన్ఫార్మా ఇప్పటికే రద్దు చేయగా, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సీరియస్గా తీసుకొని వేణు ఏజెన్సీ యజమానినిపై కేసుపెట్టారు. కోర్టులో వేణుకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే కరీంనగర్కు చెందిన వేణు మెడికల్ ఏజెన్సీస్ పక్షవాతం వచ్చిన పేషెంట్లకు వాడే లివిపిల్–500 అనే మెడిసిన్ను ప్రముఖ సన్ఫార్మా కంపెనీ తయారు చేస్తుండగా, ఆ కంపెనీ నుంచి డీలర్షిప్ హక్కును పొందింది. కొంతకాలంగా వేణు ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ సంపాదన కోసం అధికారుల కళ్లుగప్పి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందులను తీసుకొచ్చి రిటైల్ వ్యాపారులకు ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడడం, ఈ మందులను సన్ఫార్మా నకిలీవిగా గుర్తించడంతో అధికార యంత్రాంగం కదిలింది. నకిలీ మందులను బీహార్ నుంచి తెప్పించినట్లు విచారణలో తేటతెల్లమైంది. ఈ విషయం బయటపడిన నాటి నుంచి వేణు ఏజెన్సీ యజమాని పరారీలో ఉండగా, శుక్రవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపర్చారు. నకిలీకి అడ్డుకట్ట పడేనా..? కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మందుల దందా పూర్తిగా కమీషన్ల మీదే నడుస్తోంది. అడ్డగోలుగా కమీషన్లకు అలవాటు పడిన మందుల మాఫియా అసలును పోలిన నకిలీ మందులతో మార్కెట్ను ముంచెత్తుతున్నారు. ఈ మందులు వాడిన పేషెంట్ల రోగాలు తగ్గడం దేవుడెరుగు.. ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. ఇలాంటి మందులు అన్ని బ్రాండ్లలోకి విస్తరించినట్లు తెలుస్తోంది. లివిపిల్–500 మెడిసిన్ నకిలీగా బయటపడడంతో మిగతా మందులపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. నకిలీ మందులపై జరుగుతున్న దాడులతోనైనా కల్తీమయంగా మారిన కరీంనగర్ డ్రగ్ మార్కెట్లో నకిలీ మందులకు అడ్డుకట్ట పడేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై డ్రగ్ కంట్రోల్ అథారిటీకి చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్, అడిషనల్ డైరెక్టర్లను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. జనన రేటు తగ్గడం ఆందోళనకరం కరీంనగర్టౌన్: దేశంలో జనన రేటు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కరీంనగర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో బెస్ట్ సర్జన్లుగా డాక్టర్ మహమ్మద్ అలీమ్, డాక్టర్ నిక్కత్ పర్వీన్, డాక్టర్ శ్రీకాంత్రెడ్డిని సత్కరించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ సీ్త్రవిద్యలో అభివృద్ధి, వివాహ వయస్సు పెరగడం, అందుబాటులో ఉన్న గర్భ నిరోధక సాధనాలు, జీవన వ్యయం పెరుగుదల, వృత్తి, కెరీర్పై దృష్టి సారించడంతోనే జనన రేటు తగ్గుతుందన్నారు. వైద్యులు సుధ, రవీందర్రెడ్డి, ఉమాశ్రీ, సాజిదా, విప్లవశ్రీ, సనజవేరియా, రాజగోపాల్, విమల, స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పత్తి మార్కెట్కు రెండు రోజుల సెలవు జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్కు శని, ఆదివారం సెలవులు ఉంటాయని ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికిందని వారు వివరించారు. -
అభివృద్ధి పేరుతో ఆర్థిక విధ్వంసం
● సుడా చైర్మన్ నరేందర్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో అభివృద్ధి పేరిట ఆర్థిక విధ్వంసం చేశారని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ధ్వజమెత్తారు. అసూయ, అధికారం పోయిందనే బాధతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు పట్టించుకోవడం లేదని గంగుల విమర్శించడాన్ని తప్పుబట్టారు. గతంలో నాణ్యత లేకుండా పనులు జరిగాయని, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, సాంకేతిక సమస్య కారణంగా జాప్యం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు ఇస్తామన్నారు. పదేండ్లలో కేవలం 640 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి, అవికూడా పూర్తి చేయలేకపోయారన్నారు. పాత మున్సిపల్గెస్ట్ హౌజ్లో చేపట్టిన భవన నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేయడంతో అసాంఘీకకార్యకలాపాలకు వేదికగా మారిందన్నారు.రూ.78 లక్షలతో ఆ భవన ని ర్మాణాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సొంత ఖర్చులతో సైకిళ్లు ఇవ్వనప్పుడు అవి బర్త్డే గిఫ్ట్లు ఎలా అవుతాయన్నారు. తన ప్రచారం కోసం రెండు వేల మందిని పిలిచి ఇవ్వడంతో ఓ విద్యార్థి సైకిల్ నుంచి పడి గాయాలపాలయ్యాడన్నారు. సమావేశంలో ఎండీ. తాజ్, బానోతు శ్రవణ్నాయక్, కొరివి అరుణ్కుమార్, దన్నసింగ్, సుదర్శన్తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీ స్ఫూర్తితో..
కోల్సిటీ(రామగుండం): స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప కవి కాళోజీ నారాయణరావు తన మరణానంతరం శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. వారే నాకు స్ఫూర్తి. నాతోపాటు నా భార్య కూడా మా మరణాంతరం మెడికల్ కాలేజీలకు మా శరీరాలను దానం చేస్తామని ప్రకటించాం. కాల్చడమో, పూడ్చడమో చేయకుండా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం పార్థివ దేహాలను దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. గత నెల 15న మా ఇద్దరి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇంట్లో పెద్ద సభ ఏర్పాటు చేసి, అందరికీ నేత్ర, అవయవ, దేహదానంపై అవగాహన కల్పించాం. – ఎల్.రాజయ్య, రిటైర్డ్ ఎంఈవో, గోదావరిఖని అమ్మ కళ్లను దానం చేశాం ధర్మపురి: మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం. అమ్మ చెలుముల చిన్నలక్ష్మి గుండె సమస్యతో బాధపడుతూ 2016లో మృతి చెందింది. ఆమె కళ్లను సజీవంగా ఉంచడం కోసం మృతిచెందిన కొద్ది నిమిషాల్లోనే లయన్స్క్లబ్ వారికి దానం చేసినం. దేశంలో కళ్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడతాయి. అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది. – చిలుముల లక్ష్మణ్ -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
కరీంనగర్: మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లని, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. జిల్లా కేంద్రంలో ని కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవా రం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ‘ఆరోగ్య మహిళ’ ఉచిత వైద్య పరీక్షలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు నెలలకోసారి చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ఏడాదిలో 13 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించినట్లు తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్ స్కూల్లో చేరి పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏడాదిగా నిర్వహిస్తున్న శుక్రవారం సభ ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుతున్నామని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్, సీడీపీవో సబిత పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం
● కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కన్నెపల్లి నుంచి నీరు లిప్ట్ చేసి మధ్యమానేరు, ఎల్ఎండీ, వరదకాలువల్లో నింపాలన్నారు. జిల్లా సమస్యలపై ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పక్షపాత ధోరణితో ఉన్నారని, కరీంనగర్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. బండ ప్రకాశ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్ పాల్గొన్నారు. హవ్వా.. ఇదేం చోద్యం!● ఫోర్లైన్ మంజూరైనా మొక్కలు నాటిస్తున్న అధికారులు చిగురుమామిడి: తొలగిస్తారని తెలిసినా.. మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు సంబంధిత అధికారులు. హుస్నాబాద్ నుంచి చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, సుందరగిరి, చిగురుమామిడి, సీతారాంపూర్, చిన్నముల్కనూర్ ద్వారా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వరకు ఫోర్లైన్ మంజూరైంది. మొదటి విడతగా రూ.80కోట్లు మంజూరు చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నా యి. ఈ విషయం తెలిసినా చిగురుమామిడిలో ప్రధాన రహదారికి ఇరువైపులా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఈజీఎ స్ కూలీలు గుంతలు తీస్తున్నారు. వారంరోజులుగా గుంతలు తీస్తుండగా ఇదెక్కడి చోద్యమ ని మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రు. రోడ్డు పనులు ప్రారంభం అయితే నాటిన మొక్కలు తొలగించరా అని ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలికరీంనగర్టౌన్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేస్తున్న దాడులతో ఆగమైపోతున్నామని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో గురువారం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక చికిత్స చేస్తున్న ఆర్ఎంపీలను దొంగలు, నకిలీ వైద్యులని భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులు పెడతామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమకు ప్రాథమిక చికిత్స అందించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్ఎంపీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అద్యక్షుడు డి.మనోహర్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు రవీందర్రెడ్డి, శ్రీనివాసమూర్తి, రాజేశ్వర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్ పాల్గొన్నారు. 12న ఆన్లైన్ స్క్రీనింగ్కరీంనగర్: రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సివిల్స్కు హైదరాబాద్లో 9 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాకు చెందిన అభ్యర్థులకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 12న ఉదయం 12 గంటల నుంచి 2గంటల వరకు నిర్వహించబడునని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరుకాగలరని పేర్కొన్నారు. వివరాలకు 0878– 2268686, కరీంనగర్లోని సీబీ స్టడీసర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
ఫైనాన్స్ కార్యాలయాలపై పోలీసుల దాడులు
● 10 మందిపై కేసు.. రూ.60 లక్షల పత్రాలు స్వాధీనం సిరిసిల్లక్రైం/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆఫీస్లు, ఇళ్లపై జిల్లా పోలీసులు గురువారం దాడులు చేశారు. 20 బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న పది మందిపై కేసులు నమోదుకాగా రూ.60లక్షల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అప్పు ఇవ్వడానికి తాకట్టు పెట్టుకున్న నాలుగు బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతితో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని, అనుమతి లేకున్నా అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం నడిపే వారి వివరాలు తెలపాలని కోరారు. సిరిసిల్లకు చెందిన నల్ల ప్రదీప్, దూస శ్రీనివాస్, దుబాల మొండయ్య, ఉషాకోయిలా మనోహర్, ఎనగందుల శ్రీహరి, ఒడ్నాల ఆంజనేయులు, బోయినపల్లికి చెందిన మేడిశెట్టి పురుషోత్తం, తాళ్లపల్లికి చెందిన గొర్ల రాములు, మల్లారెడ్డిపేటకు చెందిన బొందుగుల జగదీశ్వర్, దండవేని అశోక్లపై కేసులు నమోదు చేశారు. -
భయపెటిన్రు
ఉపగ్రహం పడుతోందని చెప్పినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఉంది. అప్పుడు రేడియో వార్తలు వినేటోళ్లం. అందరూ కోళ్లు, గొర్రెలు కోసుకొని తినుకుంటనే.. చనిపోతమని భయపడేటోళ్లు. జూలై 11న ఉపగ్రహం గండం గడిచిందని వార్త వచ్చిన రోజు నాకు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిండు, అందరిని బతికించిండు అని అందరూ సంబర పడ్డరు. – కందుల చంద్రమ్మ, మంగళపల్లిపేరులో ప్రత్యేకత ఉంది స్కైలాబ్ ఉపగ్రహం సముద్రంలో పడిపోయి గండం గడిచిపోయిన రోజు నేను పుట్టానట. దాంతో మా అమ్మానాన్న, మేనమామలు నా పేరు స్కైలాబ్ అని పెట్టడంతో, ఊహ తెలిశాక పేరులో ప్రత్యేకత ఉందని అర్థమైంది. నా పేరు వినగానే అప్పటి తరానికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. – స్కైలాబ్ గౌడ్, చొప్పదండి -
ప్రభంజనం
● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా ● జననాలు పెరగుతుండగా.. తగ్గుతున్న మరణాలు ● భయపెడుతున్న పట్టణీకరణ సమస్య నేడు ప్రపంచ జనాభా దినోత్సవంసాక్షి,పెద్దపల్లి ●: దేశ ప్రగతికి, పతనానికి ప్రధాన కారణమైన జనాభా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతున్న అతిపెద్ద సమస్య. జనాభా తగ్గుదలపై ప్రభుత్వాలు ఆందోళన చెందుతుండగా, మారిన జీవనశైలితో పిల్లలను కనేందుకు ఆసక్తిచూపని దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేయగా, నేడు వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనాభా పెరుగుదల కనిపిస్తుండగా, మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. పెరిగిన జనాభా విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోతుండడంతో పల్లె చిన్నబోతుంది. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హారామ్యలు వెలుస్తున్నాయి. కరీంగనర్, రామగుండం కార్పొరేషన్తో సహా జిల్లాకేంద్రాలుగా మారిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతుండటం పట్టణాలకు వలసపోతున్న జనాభాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నియంత్రణతో అడ్డుకట్ట జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయినా 1952 నుంచి 1975 ఎమెర్జెన్సీ కాలం వరకు విపరీతంగా పెరిగింది. ఎమర్జెన్సీ తర్వాత 1976లో ప్రకటించిన జాతీయ జనాభా విధానం అనుగుణంగా వివాహ వయస్సు పెంచడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, మహిళ అక్షరాస్యత పెంపుతో జనాభా తగ్గుదల నమోదైంది. అయితే ఇటీవల కరోనా సమయం అనంతరం జనాభా స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. పట్ణణీకరణే ప్రధాన సమస్య జిల్లాల విస్తరణ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఉఫాది, సౌకర్యవంతమైన జీవనం కోరుతూ ప్రజలు నగరం బాట పడుతున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాల్లోనూ పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ప్రభుత్వ వైద్యం, విద్యా సదుపాయాలను మెరుగుపరుస్తుండడం, కొత్త కట్టడాల నిర్మాణం పెరుగుతుండడంతో వివిధ వర్గాలకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల్లో జనాభా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో జనాభా ఒత్తిడి పెరుగుతుంది. ఆయా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారుతుంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వసతుల కల్పనపై ప్రత్యేక చొరవ చూపిస్తేనే సమస్యలు తీరనున్నాయి. -
పిచ్చికుక్కల దాడిలో 12 మందికి గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చందుర్తిలో గురువారం 12 మందిపై దాడి చేయగా ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. చందుర్తికి చెందిన పోతురాజు తిరుపతి, పోంశెట్టి లక్ష్మి, జైనభీ, భారతి, మర్రి మల్లయ్య, ఎన్నం రవి, వై.రామయ్య, ఆశిరెడ్డిపల్లికి చెందిన భసూరి బ్రహ్మచారి, మల్యాలకు చెందిన ఎన్.శేషాద్రి, రామన్నపేటకు చెందిన లక్ష్మీరాజం, లింగంపేటకు చెంందిన తిరుమల మోహినయ్య, కమటం హిమబిందులపై దాడిచేశాయి. జైనభీ, లక్ష్మీరాజం, పోంశెట్టి లక్ష్మి, పోతురాజు తిరుపతి, భసూరి బ్రహ్మచారిలకు తీవ్ర గాయాలు కావడంతో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చందుర్తి పీహెచ్సీ వైద్యాధికారి సురేష్కుమార్ తెలిపారు. -
ఓ వైపు భయం.. మరో వైపు దావత్లు
● స్కైలాబ్ ఉపగ్రహం నేలకూలి 46 ఏళ్లు ● జ్ఞాపకాల యాదిలో అప్పటి తరం చొప్పదండి: ఉపద్రవం ముంచుకొస్తోందని ఒకవైపు ఆందోళన, ఎలాగూ మరణిస్తున్నామనే భావనలో జల్సాలు చేసుకోవడం మరోవైపు వెరసి, జన జీవనాన్ని అతలాకుతలం చేసిన శ్రీస్కైలాబ్శ్రీ ఘటనకు 46 ఏళ్లు నిండాయి. స్కైలాబ్ అనే ఉపగ్రహం దారితప్పి భూమండలంపై కూలిపోతోందని, అది దేశంలో పడితే మరణాలు తప్పవనే ప్రచారంతో 1979 జూలైలో అప్పటి జన జీవనమే అదుపుతప్పింది. శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఉప గ్రహమైన స్కైలాబ్ కూలిపోతుందని అప్పట్లో రేడియోలలో ప్రచారం జరిగింది. దీంతో ధనిక, పేద లేకుండా గ్రామాల్లో భయాందోళనలతో గడిపారు. మేకలు, కోళ్లు, గొర్రెలను కోసుకొని తిని ఎలాగు చనిపోతున్నామని పండుగ చేసుకున్నారు. తమకున్న వస్తువులను తక్కువ ధరలకే అమ్ముకుని మరీ జల్సాలు చేశారు. శాస్త్రవేత్తలు ఎట్టకేలకు స్కైలాబ్ను సముద్రంలో కుప్పకూల్చేలా విజయం సాధించారు. ఉపగ్రహంతో ఉపద్రవం లేదనే రేడియో వార్తలు రావడంతో మళ్లీ కొద్ది రోజుల పాటు ప్రజలు ఉత్సవాలు జరుపుకున్నారు. స్కైలాబ్ సముద్ర మట్టమైన రోజు పుట్టిన పిల్లలకు గుర్తుగా అదేపేరు పెట్టడం గమనార్హం. జూలై 11కు స్కైలాబ్ పడి 46 ఏళ్లు గడిచినా అప్పటి జ్ఞాపకాలు మాత్రం పలువురి మదిలో ఇంకా పదిలంగానే ఉన్నాయి. -
రేపటి నుంచి ఆల్ ఇండియా చెస్ టోర్నీ
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా జీనీయస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 3వ ఆల్ ఇండియా చెస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, కోచ్ కంకటి అనూప్కుమార్ పేర్కొన్నారు. గురువారం డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్తో కలిసి పోటీల వివరాలు వెల్లడించారు. ఈ నెల 12,13 తేదీల్లో కరీంనగర్లోని వీ కన్వెన్సన్లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉచిత వసతి భోజన, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు పోటీలను స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు సుమారు రూ.లక్షకు పైగా నగదు బహుమతులతో పాటు ట్రోపీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనుకయ్య, కో ఆర్డినేటర్లు సృజన్కుమార్, సతీశ్ బాబు, పెటా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీధర్గౌడ్, దారం శ్రీనివాస్రెడ్డి, శివకృష్ణ, మైపాల్, రమ్య పాల్గొన్నారు. హాజరుకానున్న 1000 మంది క్రీడాకారులు జీనీయస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
● డీఎంహెచ్వో వెంకటరమణ కరీంనగర్టౌన్: సాధారణ ప్రసవాల కోసం గర్భిణులను ప్రోత్సహించాల ని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం ఆశా ఫెసిలిటేటర్స్, మహిళా సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. సిజేరియన్తో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలను తెలియజేయాలన్నారు. ప్రపంచ జనా భా దినోత్సవం సందర్భంగా జూలై 14, 17తేదీల్లో కరీంనగర్, హుజూ రాబాద్, జమ్మికుంట ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలకు అర్హత కలిగిన దంపతులను తరలించాలన్నారు. డాక్టర్లు ఉమాశ్రీ, సన జవేరియా, విమల, స్వామి, రామనాథం, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ దొంగలించిన ఇద్దరుని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధి ంచిన వివరాలను సీఐ జాన్రెడ్డి వెల్లడించారు. ఈ యన కథనం ప్రకారం.. నగరంలోని మారుతినగర్ కు చెందిన స్వరూప ఇంట్లో నిద్రిస్తోంది. బుధవార ం వేకువజామున నగరానికి చెందిన చింతకింద స దాశివ, టేకుమల్ల నాగరాజు మహిళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె మెడలోంచి 42 గ్రాముల బంగారు గొ లుసు అపహరించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నాగరాజును గర్రెపల్లి సమీపంలో, సదాశివను హౌజింగ్బోర్డుకాలనీలో అరెస్టు చేసి, చై న్, బైకు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో ఒంటరిగా నివసించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మారుతినగర్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారం చోరీచేసిన ఘటనను గుర్తుచేశారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా దాచుకోవాలని సూచించారు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎటైనా వెళ్తే స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ
● ఇద్దరు యువకుల దుర్మరణం ● రేణికుంట వద్ద ఘటన తిమ్మాపూర్: రాజీవ్ రహదారి గురువారం వేకువజామున నెత్తురొడింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్గౌడ్ వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన కోడూరి భానుప్రసాద్(19) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బామండ్ల నరేశ్(17)తో కలిసి బుధవారం రాత్రి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై కరీంనగర్ వెళ్లారు. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఇద్దరూ కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భానుప్రసాద్ తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో పదేళ్ల జైలుకరీంనగర్క్రైం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన అక్కినపల్లి వంశీధర్కు పదేళ్ల జైలుశిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కరీంనగర్ వన్టౌన్ పరిధిలో నివసించే మహిళ కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. జూన్ 29, 2020న 9వ తరగతి చదువుతున్న తన రెండో కూతురు కనిపించకపోవడంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల తరువాత కరీంనగర్ బస్టాండ్కు వచ్చి తల్లికి ఫోన్ చేసింది. తనకు రేకుర్తికి చెందిన ఆటోడ్రైవర్ అక్కినపల్లి వంశీధర్ పరిచయం అయ్యాడని, మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అడగగా.. అతడికి అంతకుముందే పెళ్లయిందని బెదిరించి కరీంనగర్ బస్స్టేషన్లో వదిలి వెళ్లాడని సదరు బాలిక తల్లికి వివరించింది. దాంతో బాలిక తల్లి వంశీధర్పై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ విజయ్కుమార్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ వేశారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంజాల కుమారస్వామి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడు అక్కినపల్లి వంశీధర్కు జైలుశిక్ష, జరిమానా విధించారు. కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్పల్లికు చెందిన శ్రీనివాస్తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు శ్రీనివాస్కు ఈనెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పొలంలో కుప్పకూలిన రైతుఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లిలో పొలంలో పని చేస్తుండగా ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. గ్రామానికి చెందిన కనుకుల నరసింహారెడ్డి(70) గురువారం తన వ్యవసాయ బావి వద్ద పొలంపనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమీప రైతులు గమనించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజన, కొడుకు, కూతురు ఉన్నారు. -
ఆరుగురు పిల్లలతో ఆనందంగా..
కోల్సిటీ(రామగుండం): మాది పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామం. 1987లో నాకు పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగం రావడంతో, భార్య లక్ష్మితో గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియాకు వలసొచ్చినం. అప్పటికే మాకు నలుగురు కొడుకులు రాజు, సదానందం, మల్లేశ్, ప్రదీన్తోపాటు కూతురు విజయ ఉన్నారు. గోదావరిఖనికి వచ్చాక చిన్న కొడుకు శ్రీనివాస్ పుట్టాడు. ఆరుగురు పిల్లలను చదివించి ఏ కష్టం రాకుండా పెద్దవాళ్లను చేశాం. 2020లో రిటైర్డ్ అయ్యాను. చిన్న కొడుకు తప్ప, అందరికీ పెళ్లిల్లు చేశాం. కోడళ్లు, అల్లుడు, మనమలు, మనమరాళ్లతో సందడిగా ఉంటుంది. ఇల్లు సరిపోకపోవడంతో దగ్గర్లోనే పిల్లలందరూ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ, ఏ పండుగైనా, వేడుకలైనా కలిసి చేసుకుంటాం. కలిసి వంటలు చేసుకొని సంబరంగా కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా గడుతున్నాం. – దుడపాక నర్సయ్య, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని -
శేఖర్రావుకు డాక్టరేట్ పురస్కారం
కరీంనగర్: 30 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తిగా, కరోనా కాలం నుంచి వారు చేస్తున్న సేవలను గుర్తించి హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ప్రముఖ విద్యావేత్త, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావుకు గురువారం డాక్టరేట్ పురస్కారం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పాఠశాలలో పని చేసే బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా సమయంలో యాజమాన్యాల సహకారంతో ఎంతోకాలం నిత్యావసర సరుకులు అందించి ఆదుకున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కూడా సఫలీకృతులయ్యారు. ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య గంభీరావుపేట(సిరిసిల్ల): ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్మాలలో గురువారం జరిగింది. నర్మాలకు చెందిన లోకం శ్రీకాంత్(25) హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి గ్రామ శివారులోని వరి పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
కరీంనగర్కల్చరల్: వ్యాస, గురుపౌర్ణమి సందర్భంగా గురువారం పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ గురువులను ఘనంగా సత్కరించారు. నగరంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. సాయినగర్ విజయగణపతి సాయిబాబా ఆలయంలో మంగళాస్నానాభిషేకాలు, పుష్పార్చనలు, విశేషాలంకరణాలు నిర్వహించారు. ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి 24 గంటల అఖండనామం కీర్తనలు ఆరంభించారు. డాక్టర్ ప్రదీప్ కుమార్, కాంచన ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, ఆలయ చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య, ధర్మకర్తలు అయిందాల లక్ష్మయ్య, ఈవో ఎండపల్లి మారుతి పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అక్రమ నిర్మాణాలపై నగరపాలకసంస్థ దృష్టి సారించింది. క మిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణా ళిక విభాగం అధికారులు అనుమతి లేని నిర్మాణాలపై చర్యల కు పూనుకున్నారు. అందిన ఫిర్యాదుల మేరకు నగరంలోని ప లు అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు, గురువా రం మరో రెండు కూల్చివేతలు చేపట్టారు. ఆరెపల్లిలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన ప్రహరి, షెడ్ను జేసీబీతో తొలగి ంచారు. బ్యాంక్కాలనీలో డెడ్ఎండ్ స్ట్రీట్లో వేసిన టిన్షెడ్ను తొలగించారు. పట్టణ ప్రణాళిక విభాగం ఇన్చార్జి డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్లు తేజస్విని, సంధ్య పాల్గొన్నారు. 5 ట్రాక్టర్లు, జేసీబీ పట్టివేత సిరిసిల్లక్రైం: నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మట్టిని తవ్వి సరఫరా చేస్తున్న వాహనాలను జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబద్ మండలం చిప్పలపల్లి శివారులో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాలతో దాడులు చేశారు. ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. -
14 మంది ట్రాన్స్కో సిబ్బందికి షోకాజ్ నోటీసులు?
కోరుట్ల: జూన్ 15న.. కోరుట్ల–మెట్పల్లి రోడ్లో గణపతి విగ్రహం తరలింపు సందర్భంగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందడం.. మరో తొమ్మిది మంది గాయపడిన ఘటనను ట్రాన్స్కో సీఎండీ కార్యాలయం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. షాక్కు కారణమైన స్తంభాలు, వైర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. వల్లంపల్లి 33/11 కేవీ విద్యుత్ లైన్ వేలాడుతోందని, దీన్ని సరిచేయాల్సిన అవసరముందని, మరికొన్ని లైన్లు కూడా సరిచేయాలని రెండేళ్ల క్రితమే అప్పటి ఆ ఏరియా లైన్మెన్ పైస్థాయి అధికారులకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక ట్రాన్స్కో అధికారులు ఎవరూ దృష్టి పెట్టకపోవడం.. వల్లంపల్లి లైన్ క్రమంగా మరింత కిందికి జారి గణపతి విగ్రహం తరలింపు సందర్భంగా ప్రమాదానికి కారణమైంది. ఆ ప్రమాదం ఎలా జరిగింది..? ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారు..? దీనికి ఎవరెవరు బాధ్యులు..? అనే విషయంలో ట్రాన్స్కో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. మంగళవారం కోరుట్ల ఏడీఈ స్థాయి అధికారి ఒకరు, ఆరుగురు లైన్మెన్లు, మరో ఏడుగురు జూనియర్ లైన్మెన్లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ప్రమాద సంఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న సిబ్బంది ఇచ్చే వివరణ ప్రకారం ప్రమాద సంఘటనకు బాధ్యులపై ట్రాన్స్కో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు. కోరుట్లలో కరెంట్ షాక్ ఘటనపై.. వివరణ కోరిన సీఎండీ కార్యాలయం -
యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంగెపు చందుకుమార్ (22) కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒంటరితనంతో మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుని సోదరుడు సంగెపు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఈదులపూర్ గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తోట శ్రీకాంత్(30) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వగ్రామం కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట. ముత్తారం వైపు నుంచి తన బైక్పై జాఫర్ఖాన్పేట వెళ్తున్న శ్రీకాంత్ను పెద్దపల్లి నుంచి అడవిశ్రీరాంపూర్ వైపు బైక్పై వెళ్తున్న వారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శ్రీజ, ఏడాదిన్నర వయసుగల బాబు ప్రణీత్, తల్లిదండ్రులు అనసూర్య, గట్టయ్య ఉన్నారు. శ్రీకాంత్ మృతితో జాఫర్ఖాన్పేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాలక్రైం: జగిత్యాలలోని పురాణిపేటలో తాళం వేసిన ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. రాయికల్ మండలం దావన్పల్లికి చెందిన బానోవత్ సంతోష్ పురాణిపేటలో అద్దెకుంటాడు. ఇంటి వద్ద పండుగ ఉండటంతో ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని సామగ్రి చిందరవందరగా పడి ఉంది. బీరువాలో ఉన్న 4 గ్రాముల బంగారం, 7 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ కరీంనగర్క్రైం: ఒక మహిళ మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు గొలుసు దొంగిలించాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని మారుతీనగర్కు చెందిన స్వరూప, ఆమె సోదరి అంజలి ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. అంజలి బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆటోలో మార్కెట్ వెళ్లింది. తర్వాత గుర్తుతెలియని వ్యక్తి వారి ఇంట్లోకి ప్రవేశించి స్వరూప మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకొని వెళ్తుండగా.. అప్రమత్తమైన స్వరూప అతడిని వెంబడించగా ఇంటి గేటు నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం బృందాలుగా ఏర్పడిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
యూరియా కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం
గోదావరిఖని/ఫెర్టిలైజర్సిటీ: తెలంగాణ రాష్ట్రానికి యూరి యా కేటా యింపులో కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. ఈమేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఆయన ఒకలేఖ రాశారు. తెలంగాణకు అవసరమైన యూరియా మొత్తాన్ని కేటాయించకుండా, రాజకీయ ప్రేరణతో ఇతర రాష్ట్రాలకు మళ్లించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కోత విధిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆ యూరియా మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతేడాది 60 వేల టన్నుల యూరియా కేటాయించగా, ఈసారి కేవలం 30వేల టన్నులే కేటాయించి అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి చేసిన యూరియా కూడా తెలంగాణకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. గతేడాది స్థాయి లో యూరియా కేటాయింపులను వెంటనే పునరుద్ధరించాలని, ఆర్ఎఫ్సీఎల్లో తయారైన యూరి యాను తొలుత తెలంగాణకే కేటాయించాలని, రాజకీయ ప్రేరణకన్నా.. రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ -
ధర్నాలో పాల్గొని.. తిరుగు ప్రయాణంలో గుండెపోటుకు గురై..
ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి గ్రామ పంచాయతీ పంప్ ఆ పరేటర్, పంచాయతీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఆ కుల రాజయ్య(52) బుధవారం గుండెపోటుతో హ ఠాన్మరణం చెందారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ధర్మారం తహసీల్దార్ కార్యాల యం ఎదుట పంచా యతీ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. అనంతరం తన ఇంటికి వెళ్లేందుకు కార్మికులతో కలిసి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెంటనే తన శరీరం అదుపు తప్పుతుందని చెప్పడంతో తోటికార్మికుడు రాగుల మల్లేశం బైక్పై ఆస్పతికి త రలిస్తుండగా మార్గమధ్యంలోనే కిందపడిపోయా రు. గమనించిన లయన్స్క్లబ్ మాజీ అధ్యక్షుడు తల మక్కి రవీందర్శెట్టి వెంటనే డాక్టర్ను పిలిపించి ప రీక్షించగా గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. ఆ వైద్యుడు సీపీఆర్ చేశాక అంబులెన్స్లో కరీంనగ ర్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. రాజయ్య మృతితో కార్మికుల్లో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పంచాయతీ కార్మిక సంఘం నేత మృతి -
పేదింటి బిడ్డకు బంగారు పతకం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పేదింటి బిడ్డను కాకతీయ యూనివర్సిటీ బంగారు పతకంతో సత్కరించింది. మండలం కేంద్రానికి చెందిన వొడ్నాల రాజయ్య– సరోజన దంపతుల ఏకై క కుమారుడు శివలింగం కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్ 2015–17 బ్యాచ్ (ఫైనాన్షియల్ అకౌంటెంట్)లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణ్దేవ్వర్మ, వైస్చాన్స్లర్ ప్రతాపరెడ్డి ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. తల్లిదండ్రు లు కడుపేదరికంలోనివారు. అంతేకాదు.. శివలింగం చిన్న తనంలోనే ఆయన తండ్రి అనారోగ్యంతో చనిపోయా డు. తల్లి టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషించి చదివించింది. తన తల్లి ప్రోత్సాహం, ఉపాధ్యా యుల మార్గదర్శనంలో బంగారు పతకం సాధించానని శివలింగం తెలిపాడు. పేదకుటుంబం నుంచి వచ్చి న తాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పేద, మధ్యతరగతి విద్యార్థులకు భోజనం అందజేస్తామని అన్నాడు. తల్లి కష్టంతో చదువుకొని కేయూలో టాపర్గా నిలిచి.. ఎంకామ్లో విద్యార్థి ప్రతిభ -
ఇసుక టిప్పర్ పట్టివేత
వేములవాడఅర్బన్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకుని వేములవాడ ఆర్టీసీ బస్సు డిపోకు తరలించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నాంపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై బుధవారం తనిఖీలు చేస్తుండగా టిప్పర్ నంబర్ప్లేట్ మార్చి ఇసుక తరలిస్తున్న వాహనం పట్టుబడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వీణవంక మండలం కొండపాక ఇసుక రీచ్ నుంచి టీజీ 23 టీ 1225పై అనుమతి ఉంది. పోలీసుల తనిఖీల్లో టిప్పర్ నంబర్, ఇంజన్ చాసిస్ నంబర్కు తేడా ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇసుక అక్రమ రవాణా జరుగగా పోలీసు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల నిరసన
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వరంగ సంస్థలతోపాటు విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం కరీంనగర్లోని టీజీఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ని రసన తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. కొంతకాలంగా ఉత్తరప్రదేశ్లోని రెండు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేట్పరం చేయడానికి నిర్ణ యం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించా రు. జేఏసీ నాయకులు ఎన్.అంజయ్య, సీహెచ్.భాస్కర్, కె.శ్రీనివాస్, సీహెచ్.సంపత్కుమార్, ఎం.రమేశ్, వి.కిరణ్కుమార్, జి.శ్రీనివాస్, సంతోష్, ఆకుల వీరయ్య, శ్యామయ్య, రఘు, శ్రీనివాస్, కె.రాజు, షరీఫ్, మల్లేశం, సంపత్, మోయిన్పాషా, శ్రీమతి పాల్గొన్నారు. ప్రైవేటీకరించొద్దని డిమాండ్ -
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు
జమ్మికుంట: జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కడంతో నలుగురు యువకులు కటకటాలపాలయ్యారు. బుధవారం జమ్మికుంట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాధవి వివరాలు వెల్లడించారు. కమలాపూర్ మండలం బీంపల్లి చెందిన మహమ్మద్ అప్రీద్, వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన పాశం తరుణ్, గోదావరిఖని విఠల్నగర్కు చెందిన జంగం శశిప్రీతం, కరీంనగర్ పట్టణంలోని కిసాన్నగర్కు చెందిన బండి పూర్ణచందర్కుమార్ నలుగురు జులాయిగా తిరుగుతూ ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఏపీలోని సీలేరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారు. జమ్మికుంట శివారులోని ఎఫ్సీఐ సమీపంలో చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు జరిపేందుకు వెళ్తుండగా మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారినుంచి 15 కిలోల గంజాయి (రూ.3లక్షల75వేలు) రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అప్రీద్, శశిప్రీతం, పూర్ణచందర్ కుమార్పై కరీంనగర్లోని పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో టౌన్ సీఐ రామకృష్ట, ఎస్సై సతీశ్, హెడ్ కానిస్టేబుల్ ఎండీ యాకూబ్, కానిస్టేబుళ్లు, అబ్దుల్ ఖదీర్, రాజేందర్ ఉన్నారు. 15 కిలోల గంజాయి , రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం -
తేలని బకాయిల రికవరీ !
● విచారణలో బయటపడి మూడు నెలలు ● సీఈవో స్వాహా చేసిన సొమ్ము రూ.1.03కోట్లు ● పాలకవర్గం రికవరీ చేయాల్సిన సొమ్ము రూ.65లక్షలు ● బకాయిల వసూళ్లపై అధికారుల ఉదాసీనత చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి, అక్రమాలు విచారణలో బయటపడి మూడు నెలలు గడుస్తున్నా రికవరీకి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రైతుల పేరిట పంట రుణాలను తీసుకుని స్వాహా చేసిన సీఈవో గంగారెడ్డిని 8 నెలల క్రితమే సస్పెన్షన్ చేసి, రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. 51 విచారణలో సొసైటీకి సంబంధించిన రూ.1.68 కోట్లు పక్కదారి పట్టాయని విచారణలో తేలింది. ఇందులో రూ.1.03 కోట్లు సస్పెన్షన్కు గురైనా సీఈవో గంగారెడ్డి స్వాహా చేశాడని తేలింది. అంతేకాకుండా మరో రూ.65లక్షలను సొసైటీలో వ్యక్తిగత రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బకాయిలను 2008 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం సభ్యులు వసూలు చేయించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి సమాచారం తమ వద్ద లేదని ఈనెల 4న సహకార సంఘం అధికారి వివరణ ఇచ్చినట్లు పాలకవర్గం సభ్యులు ప్రచారం చేస్తున్నారు. కానీ సహకార సంఘం అధికారులు మాత్రం విచారణ కొనసాగుతోందని తెలుపుతున్నారు. స్వాహా సొమ్మును, బకాయిపడ్డ డబ్బుల వసూలుకు సహకార అధికారులు పాలకవర్గం సభ్యులకు నోటీసులు జారీ చేస్తూ జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రుణగ్రహీతలకు పోలీసుల పిలుపు చందుర్తి సహకార సంఘంలో వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణం తీసుకుని ఏళ్లుగా చెల్లించకుండా బకాయిపడడానికి కారణాలను తెలుసుకునేందుకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణకు రంగం సిద్ధ చేస్తున్నారు. రైతులకు తెలియకుండా సస్పెన్షన్కు గురైన సీఈవో తీసుకున్న రుణాలపై ఆరా తీసేందుకు పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. ఆడిట్ అధికారులు చర్యలేవి ? సహకార సంఘంలోని ఆదాయ, వ్యయాలను ఏటా ఆడిట్ చేసి నివేదికలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలు చెప్పాలని డిమాండ్ ఉంది. అవినీతి, అక్రమాల వెనుక సీఈవోతోపాటు ఆడిట్ అధికారులను విస్మరించడం వెనుక అనుమానాలకు దారితీస్తున్నాయి. సుమారు 13 ఏళ్లుగా కొనసాగుతున్న అవినీతి, అక్రమాల తంతును ఆడిట్ అధికారులు ఎందుకు బహిర్గతం చేయలేకపోయారన్న సందేహాలు సభ్యులకు, పాలకవర్గ సభ్యుల్లో తలెత్తుతున్నాయి. ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పాలకవర్గం సభ్యులకు జిల్లా సహకార సంఘం అధికారి రెండు పర్యాయాలు నోటీసులు జారీచేయడం విమర్శలకు తావిస్తోంది. బకాయి వసూళ్లకు భయమెందుకు? సహకార సంఘంలో ఏళ్ల తరబడి బకాయిలు ఉంటే సహకార సంఘం చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేయకుండా పాలకవర్గం సభ్యులు నోటీసులు ఇస్తూ జాప్యం చేయడం వెనుక ఉద్దేశ్యమేమిటన్న ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు బకాయిలు చెల్లించకుంటే గతంలో ఇంటి తలుపులు తీసిన సంఘటనలు ఉన్నాయి. బకాయిపడ్డ వీరిపై చర్యలు తీసుకోకపోవడానికి ఏ సహకార సంఘం చట్టం అడ్డు వచ్చిందని సభ్యులు, అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది 51 విచారణతోపాటు వ్యక్తిగత విచారణ కొనసాగుతోంది. అవినీతి, అక్రమాలతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టేదే లేదు. అంతేకాకుండా వ్యకిగత, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారిని పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారి విచారణ అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నాం. సహకార చట్టం ప్రకారం చర్యలు తప్పవు. – రామకృష్ణ, జిల్లా సహకార సంఘం అధికారి -
పచ్చిరొట్ట.. చేనుకు పుష్టి
జగిత్యాలఅగ్రికల్చర్: భూమికి కావాల్సిన పోషకాలు అందించేందుకు రైతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను ఎంచుకుంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచన మేరకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను చల్లి.. పూతదశకు చేరుకున్న తర్వాత కేజీవీల్స్ ట్రాక్టర్స్తో కలియ దున్నుతున్నారు. ఇలా దాదాపు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు తగ్గించుకుంటున్నారు. దొరకని సేంద్రియ ఎరువులు జగిత్యాల జిల్లాలో వరిని దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. వరికి అవసరమైన పోషకాలు అందిచేందుకు కోళ్లఎరువు లేదా పశువుల ఎరువు వేయాల్సి ఉంది. అయితే కోళ్ల ఎరువు లారీ లోడ్ ధర రూ.28వేలకు చేరింది. పశువుల ఎరువుకు రూ.25వేలు పలుకుతోంది. పైగా రైతులందరికీ సరిపడా లభ్యం కావడం లేదు. గొర్రెలమందను ఒక్కరోజు పెట్టించాలంటే దాదాపు రూ.రెండుమూడువేలు తీసుకుంటున్నారు. ఇలా పంటకు వచ్చే ఆదాయం కంటే.. ఖర్చే ఎక్కువ అవుతోంది. దీంతో రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. పచ్చిరొట్ట పైర్లతో భూమికి బలం తక్కువ ఖర్చు.. తక్కువ సమయంలో భూమిలో ఉండే పంటలకు ఎరువుగా ఉపయోగపడే పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర వేయడం వైపు రైతులు దృష్టి పెట్టారు. ఈ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తుండడంతో రైతులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. తొలకరి వర్షాలు పడగానే జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట విత్తనాలు వేసిన రైతులు, ప్రస్తుతం పూతదశలో ఉన్న జనుము, జీలుగను పొలంలోనే కేజీవీల్స్తో దున్నేస్తున్నారు. దున్నిన తర్వాత ఎకరాకు 25కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేస్తే నీటిలో కలిసిపోతుంది. మరోసారి ట్రాక్టర్తో దున్ని నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 15 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రైతులు వరి నాటు వేసే పొలంలో వేశారు. ఎరువుల ఖర్చు తగ్గించుకుంటున్న రైతులు పచ్చిరొట్ట పంటలతో ఎకరాకు 8నుంచి9 టన్నుల పచ్చిరొట్ట లభ్యమవుతుంది. దీనివల్ల భూమి బలంగా తయారవడమే కాకుండా ప్రధాన పోషకాలైన నత్రజని అధికంగా.. భాస్వరం, పోటాషియం మోస్తరుగా అందుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చిరొట్ట వేసిన భూమిలో కొందరు రైతులు రసాయన ఎరువులను తక్కువగా వినియోగిస్తున్నారు. చేను ఏపుగా పెరగడం ద్వారా మరికొందరు రైతులు అసలే వేయడమే లేదు. పచ్చిరొట్ట పదార్థంలో ఉండే ఎంజైములు మట్టిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఇనుము మొదలైన పోషకాలతో దిగుబడి గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పూత దశలో కేజీవీల్స్తో దున్నుతున్న రైతులు తగ్గనున్న రసాయన ఎరువుల ఖర్చు పచ్చిరొట్ట ఏటా వేస్తా ఏటా వరి సాగు చేసే పొలాల్లో జీలుగ చల్లుతాను. పూత దశకు వచ్చిన తర్వాత ట్రాక్టర్తో కలియదున్నుతాను. రసాయన ఎరువులను సిఫారసు చేసిన దానికంటే తక్కువగా వేస్తాను. పంట దిగుబడి కూడా అధికంగా పెరుగుతోంది. – ఏలేటి జలేందర్, ఇటిక్యాల, రాయికల్ పూత దశలో దున్నితే లాభం వరి పండించే భూముల్లో ఎక్కువగా పచ్చిరొట్ట సాగు చేయడం మంచి పరిణా మం. జీలుగ, జనుమును పూతదశ వచ్చిన తర్వాత భూమిలోనే కలియదున్నితే బలంగా తయారవుతుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. – భాస్కర్, వ్యవసాయాధికారి, జగిత్యాల -
అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ
కరీంనగర్టౌన్: మోదీ గిఫ్ట్గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో టెన్త్ విద్యార్థులకు చేపట్టిన సైకిళ్లను పంపిణీ అట్టహాసంగా జరిగింది. మొత్తం 20వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశలవారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మోదీ కిట్స్ను అందజేస్తానని హామీ ఇచ్చారు. నేను ఎంపీగా గెలిచానంటే అందులో 50 శాతం ఓట్లు పిల్లలు తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ఒట్టు వేయించుకొని గెలిపించారని అన్నారు. నామీద ఇంత అభిమానం కురిపిస్తున్న పిల్లల రుణం తీర్చుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టానని స్పష్టం చేశారు. అందరికీ ఆదర్శం: టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మా అందరికీ ఆదర్శం. ఇతర ప్రజాప్రతినిధులు కూడా స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనను తీసుకొచ్చారు. పేదరికం నుంచి వచ్చిన మోదీ చాయ్ అమ్ముతూ ప్రధానిగా ఎదిగారు. బండి సంజయ్ కూడా సామాన్య కుంటుంబం నుంచి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. క్రెడిట్ అంతా కేంద్ర మంత్రిదే: కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులందరికీ 20వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ అంతా కేంద్ర మంత్రిదే. పిల్లలకు మొదటి ఆస్తి సైకిల్. నాకు కూడా చిన్నప్పుడు సైకిలే నా ఆస్తి. ఆటోలు, బైకులు, కార్లపై స్కూల్కు వెళ్లి ట్రాఫిక్కు కారణం కంటే.. సైకిల్పై స్కూల్కు వెళ్లడమే మంచిది. దీనివల్ల ఎవరిపై ఆధారపడకుండా సమయానికి స్కూల్కెళ్లి వచ్చే అవకాశముంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్ అలవాటు చేయాలి. తద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ప్రతీక సైకిల్. మీరంతా బాగా చదివి టెన్త్ క్లాస్ ఫలితాల్లో అగ్రగామిగా నిలవాలి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: సీపీ గౌస్ ఆలం ఇది చాలా గ్రాండ్ ప్రోగ్రాం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రతిపాదన చేశారు. ఇంత తొందరగా కార్యరూపం దాల్చేలా చేయడం చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రికి అభినందనలు చెబుతున్నా. నాకు సైకిల్ చాలా ఇష్టం. సైకిల్పై జాగ్రత్తగా వెళ్లాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే ప్రమాదముంది. చిన్న ఆలోచనకు కార్యరూపం: మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలనే ఆలోచనను బండి సంజయ్ తొలుత మాతో పంచుకున్నారు. ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. అది కేంద్ర మంత్రికే చెల్లింది. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులుంటాయనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భారం కాకుండా ఉండేలా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. ఇందులో భాగస్వాములం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్ త్వరలో విద్యార్థులందరికీ మోదీ కిట్స్ ఇస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ప్రతీక సైకిల్: కలెక్టర్ పమేలా సత్పతి బండికి ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు అంబేడ్కర్ స్టేడియం నుంచి ప్రతిమ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ ర్యాలీలో జై బండి సంజయన్న అంటూ నినదించిన విద్యార్థులుశుభాకాంక్షలు చెప్పిన విద్యార్థులు ఈనెల 11న బండి సంజయ్ పుట్టిన రోజును పురస్కరించుకొని విద్యార్థులు బండికి ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. సైకిళ్ల పంపిణీ అనంతరం అంబేడ్కర్ స్టేడియం నుంచి ప్రతిమ చౌరస్తా వరకు విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జై బండి సంజయన్న అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి.శంకర్, యాదగిరి సునీల్రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, ఆర్డీవో మహేశ్వర్, డీఈవో మొండయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అమ్మవారికి బెండకాయల మాల
కరీంనగర్ నగునూర్లోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారిని బెండ కాయల మాలలతో అలంకరించారు. ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. – విద్యానగర్(కరీంనగర్) కంట్రోల్ రూం త్వరగా పూర్తి చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూం భవన నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. రూ.16.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవనంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలు సమకూర్చాలని చెప్పారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయంలోని చివరి అంతస్తులో కమాండ్ కంట్రోల్రూం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. 350 సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ను కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారన్నారు. నగరపాలకసంస్థ, పోలీస్ అధికారులు సమన్వయంతో కంట్రోల్ రూం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో న గరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీ మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లు లచ్చిరెడ్డి, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్ స్టేషన్లు ● కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా కరీంనగర్ సర్కిల్ పరిధిలో 16 కొత్త సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. విద్యుత్ డిమాండుకనుగుణంగా అవసరమున్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజీ సమస్య ఉండకపోగా, విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధికనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ల రాకతో రైతులు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని తెలిపా రు. పొడవాటి ఫీడర్లుండవని, ఫీడర్ నష్టాలు త గ్గుతాయన్నారు. ఉన్న సబ్ స్టేషన్లపై లోడ్ భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయ సరఫరా అందించగలుగుతామని చెప్పారు. నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఈ నూతన సబ్ స్టేషన్లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సబ్ స్టేషన్లతో నూతన వ్యవసాయ కనెక్షన్లు త్వరితగతిన మంజూరయ్యే అవకాశముంటుందన్నారు. సాగు, గృహ, వాణిజ్య అవసరాల కోసం, విని యోగదారులకు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి కొత్త సబ్ స్టేషన్లు ప్రధాన భూమిక పోషిస్తాయని స్పష్టం చేశారు. ఇందులో స్కాడ అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్న ట్లు, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని, విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందన్నారు. -
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ గీతాభవన్ ఫీడర్ పరిధిలోని మార్క్ఫెడ్, ప్రగతినగర్, రాంనగర్, మంకమ్మతోట లేబర్అడ్డ, రాజీవ్పార్కు, పద్మనగర్ పారమిత స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. కొత్తపల్లిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందు గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ కొత్తపల్లి టౌన్ ఫీడర్ పరిధిలోని కొత్తపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు. -
వేతనాలు మహాప్రభో
● 4 నెలలుగా వేతనాలకు దూరం ● ఉపాధి ఉద్యోగుల పడిగాపులు ● పని దినాల కుదింపుతో కూలీల ఆందోళనఉపాధిహామీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు: 350 ఏపీవోలు: 16, టెక్నికల్ అసిస్టెంట్లు: 38 ఫీల్డ్ అసిస్టెంట్లు: 270 ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు: 06 కంప్యూటర్ ఆపరేటర్లు: 20 ఉపాధి కూలీలు: 2,96,756కరీంనగర్ అర్బన్ ●: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 4 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చులు, మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆపరేటర్ నుంచి ఏపీవో వరకు.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజినీరింగ్ కన్సల్టెంట్), టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 16, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు 274 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే 4 నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్ సాఫ్ట్వేర్లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2.01కోట్ల వేతనాలు పెండింగ్ ఉపాధిహామీలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50 వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు రూ.50.25 లక్షల చొప్పున నాలుగు నెలలకుగా ను రూ.2.01 కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నా యి. విధుల్లో మాత్రం తగ్గని లక్ష్యాలు వేతనాలు పెండింగ్లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న లక్ష్యాలు ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్ ఆసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజనతండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి. ఆందోళనలో కూలీలు ఆర్థిక సంవత్సరానికి గానూ ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలు పూర్తయ్యాయి. ఈ 3 నెలల్లోనే కూలీలకు 35లక్షల పని దినాలు పూర్తి చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. ఇంకా 14.93లక్షల పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగతా 8 నెలలు కూలీలకు సరిపడా పనుల కల్పన గగనంగా మారే అవకాశముంది. పని దినాలు తక్కువగా ఉన్నందున అధికారులు తీసుకునే చర్యలపైనే కూలీలకు ఉపాధి అవకాశాలుండనున్నాయి. వన మహోత్సవానికి సంబంధించి కూడా గతంలో ఉన్న లక్ష్యానికన్నా తక్కువగా నిర్దేశించారు. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, మళ్లీ నర్సరీల నిర్వహణ వంటి పనుల్లో కూలీలకు పని లభిస్తుండగా.. పని దినాలను కుదించడం ఆందోళనకర పరిణామం. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలతోపాటు ఉపాధి కూలీలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అధికారులు వివరించారు. -
కోకొల్లలు!
క్రిప్టో పాపాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన మెటా క్రిప్టో దందా రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఇందులో జరుగుతున్న మోసాలపై బాధితులు నగరంలోని పలు ఠాణాల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాపాల పుట్ట ఆలస్యంగా బద్దలవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు.. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్ది చెప్పారు. ఇక మొత్తం వ్యవహారంలో నగరంలోని ఓ టింబర్ డిపో యజమాని, ఓ మొబైల్ షాప్ ఓనర్, ఓ మాజీ కార్పొరేటర్ ముగ్గురు అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి లోకేశ్ ఏపీకి చెందినవాడని కొందరు, ఆయన పూర్వీకులు సిద్దిపేటకు చెందినవారని మరికొందరు బాధితులు చెబుతున్నారు. వీరంతా పథకం ప్రకారం అమాయక ప్రజలకు డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపించి.. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఇపుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. -
● మెటా ఫండ్తో మొదలై మెటాప్రో అవతారం ● ఎదురు తిరిగిన బాధితులకు చెల్లని చెక్కులు జారీ ● సాక్షికి చెక్కులు, ఫ్రాంసరీ నోట్లు పంపుతున్న బాధితులు ● టింబర్ డిపో, మొబైల్ షాప్ యజమానులు, మాజీ కార్పొరేటర్ కీలకం ● అరబ్ షేక్లు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లను చూప
బాధితులు ముందుకు రావాలి లోకేశ్ను పదేపదే కరీంనగర్కు తీసుకువచ్చి.. మొబైల్ షాప్ యజమాని, టింబర్ డిపో ఓనర్లు రూ.కోట్లల్లో వసూలు చేశారు. ఇందుకోసం జ్యోతినగర్లోని ఓల్డ్ డీఐజీ కార్యాలయంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే మెటా క్రిప్టో ఆపరేట్ చేస్తున్నారు. పేరుకు క్రిప్టో కరెన్సీ అని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది మల్టీ లెవల్ మార్కెటంగ్ తరహాలోనే తమను మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధితులు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. తమకు నిందితులు ఇచ్చిన ఫ్రాంసరీ నోట్లు, చెల్లని చెక్కులు తదితరాలను ‘సాక్షి’కి పంపుతున్నారు. నేరుగా సీపీకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీపీ గౌస్ ఆలం కూడా సీరియస్గానే ఉన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే... తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని భరోసా ఇస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గోడిశెల గట్టయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గట్టయ్యకు ఇద్దరు కొడుకులు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. భార్యకు లోకజ్థానం తక్కువ. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆదివారం ఉదయ క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు అతడిని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరిన ఆయన సాయంత్రం సమయంలో మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో స్తానికులు గమనించి మంటలు ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు గట్టయ్యను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ముగిసిన పోలీస్ డ్యూటీమీట్
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా జరిగిన రాజన్న జోన్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇందులో ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని వరంగల్లో జరగనున్న రాష్ట్రస్థాయి డ్యూటీమీట్కు పంపించనున్నారు. విజేతలకు సీపీ గౌస్ ఆలం పతకాలు అందించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలోని ఫోరెన్సిక్ సైన్స్ రాతపరీక్షలో గంగాధర ఎస్సై వంశీకృష్ణ బంగారుపతకం సాధించారు. క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ చట్టాలు విభాగంలో సిద్దిపేట కమిషనరేట్లోని రాయపోల్ ఎస్సై రఘుపతి, మెడికల్ లీగల్ టెస్ట్లో చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.ప్రదీప్ కుమార్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పరీక్షలో కామారెడ్డి ఎస్సై ఆంజనేయులు, ఫింగర్ ప్రింట్ సైన్స్లో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన ఎస్సై యూనస్, క్రైంసీన్ ఫొటోగ్రఫీ పరీక్షలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సై ఆంజనేయులు, పోలీస్ పోట్రైట్ పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రసన్న కుమార్ బంగారు పతకం సాధించారు. యాంటీ సాబెటేజ్ చెక్లోని గ్రౌండ్సర్చ్లో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన కానిస్టేబుళ్లు వి.సంతోష్, వి.వెంకటేశ్, రూంసెర్చ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.శ్రవణ్ కుమార్, జి.కిరణ్కుమార్, వెహికల్సెర్చ్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, ఎం.శంకర్ బంగారు పతకం సాధించారు. యాక్సెస్ కంట్రోల్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.దుర్గాప్రసాద్, కె.సిద్ధిరాములు, డాగ్స్క్వాడ్ కాంపిటీషన్లోని ట్రాకింగ్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ జి.శంకర్, నార్కోటిక్ విభాగంలో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ పి.అజయ్, ఎక్స్ప్లోజివ్లో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన డాగ్ హ్యాండ్లర్ పి.వెంకటేశ్ బంగారు పతకం, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఎస్.సతీశ్కుమార్, ఆఫీస్ ఆటోమేషన్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ యూ.భాస్కర్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ జి.సంతోష్ కుమార్ బంగారు పతకం పొందారు. పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన ఎం.శ్రీధర్గౌడ్, వీడియోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్కు బంగారు పతకాలు వచ్చాయి. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు. విజేతలకు పతకాలు అందించిన సీపీ గౌస్ ఆలం -
ముగిసిన డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన
కరీంనగర్ కల్చరల్: ప్రతీగ్రామంలో ఒక ఆలయానికి నిత్యం దీపదూపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో 2007లో వైఎస్సార్ హయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీడీఎన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ మే1న నోటిపికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 317 దరఖాస్తులు రాగా.. ఎంపిక పరిశీలన ఇటీవలే ముగిసింది. ప్రతి తీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీతో చర్చించి, సభ్యులతో సంతకాలు చేయించి, ఆమోదం పొందిన తరువాత జాబితాను దేవాదాయశాఖ కమిషన్ కార్యాలయానికి పంపించనున్నారు. ఉమ్మడి జిల్లా దేవాయశాఖ సహాయ కమిషనర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సీనియర్ ఈవోలు, రెగ్యులర్ అర్చకుల నుంచి ఒకరు, డీడీఎన్ అర్చకుల నుంచి ఇద్దరు కమిటీగా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణం చేపట్టి 15ఏళ్లు పూర్తయ్యిందా..? డీడీఎన్ నిబంధనల మేరకు ఉన్నాయా అని పరిశీలించారు. ‘డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన ముగిసింది. ప్రతీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సంతకాల స్వీకరణ తరువాత జాబితా దేవాదాయ కమిషనర్కు పంపిస్తాం’ అని దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాక కమిషనర్ నాయిని సుప్రియ వివరించారు. ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ దరఖాస్తుల వివరాలు జిల్లా ప్రస్తుత వచ్చిన ఆలయాలు దరఖాస్తులు కరీంనగర్ 256 100 పెద్దపల్లి 153 69 రాజన్న సిరిసిల్ల 167 42 జగిత్యాల 322 106 మొత్తం 898 317 -
‘ఎల్లంపల్లి’పైనే ఆశలు
● వరదనీటిని ఒడిసి పట్టుకుంటేనే ప్రయోజనం ● రెండేళ్లుగా నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతలు రామగుండం: దశాబ్దకాలంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు క్రమంగా పెరుగుతున్న నీటి వినియోగం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా అనతికాలంలోనే నీటి నిల్వలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రెండేళ్లుగా కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వివిధ అవసరాలకు ఎల్లంపల్లి జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరే క్రమంలోనే ఎల్లంపల్లికి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపుకునేలా నీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలతో పని లేకుండానే గతేడాది అధికారులు ప్రత్యేక చొరవతో వరద నీరు సముద్రంలో కలవకుండా ఏడాది మొత్తం అప్రమత్తంగా ముందస్తు ప్రణాళికతో అన్ని అవసరాలను ఎల్లంపల్లితోనే పూర్తి చేసుకోవడం గమనార్హం. ప్రాజెక్టు వివరాలు.. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 148.00 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు. నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల మేరకు 8.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ఇదే రోజు గతేడాది కేవలం 4.80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో నింపుకునే రిజర్వాయర్లు ● లోయర్ మానేర్ డ్యాం 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రిజర్వాయర్ను ఏటా ఎల్లంపల్లి జలాలతో నింపుకోవడం జరుగుతోంది. ● రంగనాయకసాగర్ రిజర్వాయర్ మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.5 టీఎంసీలు నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 9.68 లక్షల ఎకరాలు, సరస్వతీ కెనాల్ 34వేల ఎకరాలు, లక్ష్మి కెనాల్ నుంచి 21వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. వీటితో పాటు ఇతరత్రా తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ● మిడ్మానేర్ రిజర్వాయర్కు 27.55 టీఎంసీల సామర్థ్యం ఉంది. ● కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు 15 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ● కొమురవెల్లి మల్లన్నసాగర్ 50 టీఎంసీల వరద నీటిని ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపుకునే సామర్థ్యం కలిగి ఉంది. -
మరణించినా.. నలుగురికి చూపునిచ్చారు
కోల్సిటీ(రామగుండం): రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. వారి నేత్రాలను దానం చేసి, నలుగురికి చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచాయి వారి కుటుంబాలు. గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ సమీపంలోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కడారి చంద్రయ్య(61), ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు.. చంద్రయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. అలాగే స్థానిక విలేజ్ రామగుండానికి చెందిన అంబాడి రాజశేఖర్(55) ఈనెల 7న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలుదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీజీహెచ్లో టెక్నీషియన్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసుతోపాటు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి కళ్లు దానం చేసిన రెండు కుటుంబాలు అభినందించిన సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ -
శ్మశానవాటికలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా?
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ స్థలం కేటాయింపు వివాదాస్పదమైంది. శ్మశానవాటిక కోసం వినియోగించుకుంటున్న స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం చదును పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సరికాదన్నారు. పనులను నిలిపివేయించిన గ్రామస్తులు.. ఆ తర్వాత కలెక్టరేట్కు తరలివెళ్లారు. అడిషనల్ కలెక్టర్ వేణును కలిసి వినతిపత్రం అందజేశారు. శ్మశానవాటికలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని వారు కోరారు. రాఘవాపూర్లో గ్రామస్తుల నిరసన స్థలం మార్చాలని అధికారులకు ఫిర్యాదు -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చీర్లవంచలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. చీర్లవంచకు చెందిన గంగు శ్రీనివాస్ (22) మద్యానికి బానిసై ఏ పని చేయక తిరుగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లి గ్రామానికి చెందిన కాటిపల్లి అమృతమ్మ(70) అనారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. అమృతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మంగళవారం చుట్టుపక్కల వెతుకుతుండగా.. గ్రామశివారులోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం లభించింది. తనతల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అమృతమ్మ కొడుకు రవీందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 15 కిలోల గంజాయి స్వాధీనంజమ్మికుంట: జమ్మికుంటలోని ఎఫ్సీఐ సమీపంలో కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం 15కిలోల గంజాయిని పట్టుకున్నారు. కరీంనగర్కు చెందిన ముగ్గురు యువకులు, కమాలాపూర్ మండలం భీంపల్లికి చెందిన ఓ యువకుడు అంధ్రప్రదేశ్లోని సీలేరు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. రైలుమార్గం ద్వారా వస్తున్నారని తెలుసుకుని ముగ్గురిని ఎఫ్సీఐ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై టౌన్ సీఐ రామకృష్ణను సంప్రదించగా, గంజాయి పట్టుకున్నది నిజమేనని, విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు. -
మీ సేవ.. మరింత చేరువ
కరీంనగర్ అర్బన్: కాగిత రహిత పాలనగా సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలకు వేదికవుతోంది. ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందిస్తుండగా రెండు నెలల క్రితం తొమ్మిది రకాల సేవలను పొందుపర్చారు. తాజాగా మరో రెండు రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పురపాలిక, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పించింది. పౌరుల పేరు మార్పిడి, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్ క్యాండిడేట్, స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్, మార్కెట్ విలువ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్–1(బి) సర్టిఫైడ్ కాపీలు పొందొచ్చు. అప్లికేషన్ కాగితాలతో కార్యాలయాలకు వెళ్లకుండా మీ సేవలోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు వివరించారు. ● వివాహ ధ్రువపత్రం పొందడం తేలిక వివాహమైన నూతన దంపతులకు వివాహ ధ్రువపత్రం తప్పనిసరి. సదరు ఎలా పొందాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఏజెంట్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తుండేవారు. బ్రోకర్లు వేలకు వేలు దండుకుని ఇబ్బందులకు గురిచేస్తుండగా పలువురు అన్ని పత్రాలకు తామే బాధ్యులమంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రయాస లేకుండా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్నవారు మీ సేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దళారులకు అస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ● కావాల్సినవి ఏంటంటే.. వధూవరులిద్దరి ఆధార్ కార్డులు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు పత్రాలు. వయసు రుజువు కోసం పదో తరగతి మెమో. రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలు. ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాల జిరాక్స్ ప్రతులు. ● మార్కెట్ విలువ పత్రాలు పొందొచ్చు గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ శాఖలో మ్యానువల్గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవ ద్వారా అందించనున్నారు. ● త్వరలో ఇసుక బుకింగ్ కూడా.. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు ‘మీ సేవ’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ–సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తెప్పించుకునే వెసులుబాటు కల్పించనుంది. కొత్తగా మరో రెండు సేవలు -
35 ఏళ్లుగా సాయి సేవలో..
● ట్రస్ట్, దాతల సహకారంతో అభివృద్ధి వేములవాడ: పట్టణంలోని మార్కండేయనగర్లో 1990 లో నిర్మించిన సాయిబాబా ఆలయానికి 35 ఏళ్లుగా సేవలందిస్తూ భక్తులు, స్థానికుల మన్ననలు పొందుతున్నా రు. ట్రస్టీలు, దాతల సహకారంతో 35 ఏళ్లు పూర్తిచేసుకు ని రూ.3 కోట్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టీలు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1990లో బాబా గుడి పునాది మార్కండేయనగర్లో 1990లో అప్పటి సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి ఆధ్వర్యంలో పాలకమండలి లేఅవుట్ స్థలాన్ని సాయిబాబా సంస్థాన్కు అప్పగించింది. షిరిడీ సాయిబాబా సేవాసంస్థాన్ ట్రస్ట్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అప్పటి వార్డు సభ్యుడు వారాల దేవయ్యను ఎన్నుకున్నారు. 1993లో ఆలయ నిర్మాణం పూర్తయింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం ఇరుకుగా మారింది. దీంతో దాతల సహకారం, ట్రస్టీల ప్రోత్సాహంతో ఇప్పటివరకు రూ.3 కోట్లు ఖర్చుచేసి 2011లో నూతన భవనం నిర్మించుకున్నారు. ట్రస్టీల సేవానిరతి ఎలాంటి పారితోషికం లేకుండా 35 ఏళ్లుగా ఆలయంలో ఉచితంగా భక్తులకు సేవలందిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారాల దేవయ్య, ట్రస్టీలుగా గంప రాజేందర్, కూర రమేశ్, కోనమ్మగారి నాగరాజు, బండారి కుమార్, రైకనపాట శ్రీనివాస్, గంప గౌరిశంకర్, నాగుల యాదగిరి, ఎంబేరి నర్సయ్య, పీచర రవీందర్రావు, టి. కృష్ణస్వామి, తొగరి వెంకటేశ్ కొనసాగుతున్నారు. ట్రస్టీలు చేస్తున్న సేవలు గుర్తించిన పలు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్లో వేములవాడ సాయిబాబా ఆలయం నుంచి వారాల దేవయ్యను ఎంపిక చేశారు. -
మరోచోట ఏర్పాటు చేయాలి
శ్మశానవాటిక స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పా టు చేయడం సరికాదు. ప్లాంట్ ఏర్పాటు పనుల్లో శవాల ఎముకలు బయటపడ్డాయి. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. మరోచోట ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. – మర్కు లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత ఉన్నతాధికారులు చొరవ చూపాలి శ్మశానవాటిక స్థలాన్ని చదును చేసే పనులు విరమించుకోవాలి. అంత్యక్రియలు జరిపేందుకు వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలనే యోచన సరికాదు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. – తాడిచెట్టి శ్రీకాంత్, రాఘవాపూర్ ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు కొందరు గ్రామస్తులు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. శ్మశానవాటికలో కాకుండా రెవెన్యూ అధికారులు నిర్ధారించిన హద్దుల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీమాల, జిల్లా సహకారశాఖ అధికారి -
గొప్పనేత వైఎస్సార్
● మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాల టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప నేత అని మాజీ మంత్రి జీవన్రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాతో వైఎస్సార్కు ఎనలేని మమకారం ఉందని, అందుకే జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నాచుపల్లిలో జెఎన్టీయూ, కోరుట్లలో వెటర్నరీ కళాశాల, జగిత్యాలలో పండ్ల మార్కెట్ ఆయన చలవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
● కలెక్టర్ పమేలా సత్పతిమానకొండూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 35మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం అభినందనీయం అన్నారు. అ నంతరం విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. రెండోతరగతి విద్యార్థినిని ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠం చదివించారు. ఎంపీడీవో వరలక్ష్మి, తాహసీల్దార్ విజయ్కుమార్, ఎంఈవో మధుసూదనాచారి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతీ ఇల్లు సందర్శించాలిచొప్పదండి: కొత్త ఓటర్ల నమోదు సందర్భంగా బూత్స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతీఇంటిని సందర్శించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా ఓటర్ల నమోదు, తొలగింపు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎంపీడీవో వేణుగోపాల్రావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో రాజగోపాల్రెడ్డి, ఎలక్షన్ డీటీ మనోజ్ పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి చొప్పదండి, చిట్యాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేశారు. -
ఇప్పట్లో అయ్యేనా!
● రెండేళ్లుగా సా..గుతున్న కశ్మీర్గడ్డ రైతు బజార్ పనులు ● రోడ్లపై వ్యాపారాలతో ప్రజల ఇక్కట్లుకరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని కశ్మీర్గడ్డలో చేపట్టిన సమీకృత మార్కెట్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లు దాటినా సగం పనులు కూడా కాలేదు. దశాబ్దాలుగా ఆదరణ ఉన్న కశ్మీర్గడ్డ రైతుబజార్ మళ్లీ అందుబాటులోకి రావడానికి మరెన్ని సంవత్సరాలు పడుతుందోనని ఈ ప్రాంత వాసులు, చిరువ్యాపారులు బేజారవుతున్నారు. రూ.10 కోట్లతో నిర్మాణం నగరంలో పద్మనగర్, కశ్మీర్గడ్డ మార్కెట్ నిర్మాణాలను స్మార్ట్సిటీ నిధులతో చేపట్టారు. పద్మనగర్ మార్కెట్ పూర్తి కాగా, నగరానికి దూరంగా ఉండడంతో డిమాండ్ తక్కువగా ఉంది. కశ్మీర్గడ్డ రైతు బజార్ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రూ.10 కోట్ల నిధులతో కశ్మీర్గడ్డలోని రైతు బజార్ స్థానంలో వెజ్,నాన్వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టారు. రెండేళ్లయినా.. కశ్మీర్గడ్డ రైతుబజార్కు డిమాండ్ అధికంగా ఉంటుంది. టవర్సర్కిల్ సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్తో పాటు నగరంలో ఉన్న పు రాతన మార్కెట్ ఇది. అశోక్నగర్లో రైతు బజార్ నిర్మాణానికి ముందు ఇవే రెండు పెద్ద మార్కెట్లు అందుబాటులో ఉండేవి. కొత్త మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత రైతుబజార్ను పూర్తిగా తొలగించారు. ఆ స్థలంలో కొత్తగా సమీకృత మార్కెట్ నిర్మాణానికి 2023 జూన్ 21వ తేదీన శంకుస్థాపన చేశారు. కారణాలేవైనా పనులు మాత్రం ఇప్పటివరకు సగం కూడా చేయలేదు. రోడ్లపైనే విక్రయాలు పాత రైతుబజార్ను తొలగించి కొత్త మార్కెట్ను నిర్మిస్తుండడంతో వ్యాపారులు రోడ్లపై చేరారు. ఒక వైపు రోడ్డుపై తాత్కాలికంగా కూరగాయల వ్యాపారులకు ఏర్పాట్లు చేయగా, మరో వైపు రోడ్డుపైన కూడా వ్యాపారం కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కశ్మీర్గడ్డ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. -
చెరగని ముద్ర వైఎస్సార్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతిని డీసీసీ కార్యాలయంలో ఘనం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సారెస్పీ వరదకాలువ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను తీసుకొచ్చిన అభివృద్ధి ప్రదాత అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 56 మండలాలకు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశారన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్బన్ బ్యాంక్చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి, నాయకులు ముల్కల ప్రవీణ్, వెన్న రాజ మల్లయ్య, పడిశెట్టి భూమయ్య, దిండిగాల మధు, చింతల కిషన్, వంగల విద్యాసాగర్, మాదాసు శ్రీనివాస్, మహిళా నాయకురాలు చెర్ల పద్మ పాల్గొన్నారు.● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాజశేఖరరెడ్డి జయంతి -
సాలె గూడు!
దురాశల‘మెటా’లో నిలువుదోపిడీకి గురైన ఒకే సామాజిక వర్గం ● కొందరు ఫిర్యాదు చేసినా నమోదవని కేసులు ● బాధితుల్లో పోలీసులు, రెవెన్యూ, టీచర్లే అధికం ● గుండె, పక్షవాతం, బీపీ బారిన పడుతున్న వైనం ● ప్రజల నుంచి రూ.100 కోట్లకు పైగానే వసూలు ● ఘటనపై కరీంనగర్ సీపీ, నిఘా వర్గాల ఆరా -
వామ్మో.. సెల్యులైటిస్
కరీంనగర్టౌన్: జిల్లా ప్రజలను సెల్యులైటిస్ వ్యాధి భయపెడుతోంది. గతేడాది ఇదే సీజన్లో ప్రారంభమైన ఈ వ్యాధి బాధితులను ప్రాణాపాయ స్థితివరకు తీసుకెళ్లింది. మళ్లీ ప్రస్తుత సీజన్లో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలంలో వ్యాపించే ఈ వ్యాధి ఎన్నడూ లేనంతగా నెల రోజులుగా విజృంభిస్తోంది. సెల్యులైటిస్ సాధారణ బాక్టీరియల్ చర్మ ఇన్ఫెక్షనే అయినప్పటికీ వ్యాధి తీవ్రతతో ప్ర మాదకరంగా మారుతుంది. ఎక్కువగా కాళ్లపై కనిపిస్తుంది. చికిత్స నిర్లక్ష్యం చేస్తే అన్ని శరీర భాగా లకు సోకే ప్రమాదముంది. వ్యాధి వ్యాపిస్తే చర్మం ఎరుపు, వాపు, వెచ్చగా, నొప్పిగా ఉంటుంది. జ్వరం, వాపు, తీవ్రమైతే చర్మం మీద చీము వస్తుంది. పుండు, గాట్లు పడినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. మెల్లగా రక్తనాళాల్లోనికి చేరుతుంది. ఒక దశలో ఇన్ఫెక్షన్ సోకిన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీర్ఘకాలిక చర్మవ్యాధులు, బోదకాలు, వెరికోస్వెయిన్స్, మధుమేహం, హెచ్ఐవీతో బాధపడేవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవీ కారణాలు బాక్టీరియా (స్టెఫిలోకాకస్, స్ట్రెప్టోకోకస్) చర్మంలోనికి పుండు లేదా పగుళ్ల ద్వారా ప్రవేశించినప్పుడు సెల్యులైటిస్ ఏర్పడుతుంది. ఇందులో రెండు దశలు ఉన్నాయి. ఇది ప్రారంభమైన తర్వాత శరీరంలోని ఏ భాగానికై నా వ్యాపించవచ్చు. చర్మం ఎర్రగా మారడం, ఉబ్బడం, దురుద, పుండుగా మారుతుంది. రెండోదశలో ఇన్ఫెక్షన్గా మారితే చీము వస్తుంది. జిల్లాలో దోమలు పెరగడంతో ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పెద్ద ఎత్తున సెల్యులైటిస్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దోమ కాటుకు గురైన వ్యక్తులు ఆ ప్రాంతంలో దురదగా అనిపించి గోకడం ద్వారా గాట్లు, పుండు పడిన ప్రాంతం నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సెల్యులైటిస్ సంభవిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమా దం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, గాట్లు, పుండు పడిన చోట మందులు వాడడం చేయాలి. మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ పొందేందుకు నెట్, రిపెలెంట్స్ వాడా లి. కాళ్లు తడి కాకుండా కాపాడితే వ్యాధి సోకదు.చికిత్స తీసుకోవాలి సెల్యులైటిస్ ప్రమాదకరంగా మారుతోంది. దోమలు కుట్టి దురుద వచ్చిన ప్రాంతంలో గోకినప్పుడు, చర్మం మీద పగుళ్లు, పుండ్లు ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా చర్మం లోపలకు వెళ్లే అవకాశముంది. మధుమేహం ఉన్న రోగిలో సెల్యులైటిస్ గ్యాంగ్రీన్కు దారితీస్తుంది, ఇది ఒక అవయవాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా కాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్లు ఉబ్బడం, నొప్పి, బొబ్బలు రావడం, జ్వరం వంటి సెల్యులైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. లేని పక్షంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. – డాక్టర్ దిలీప్రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీవర్షాకాలంలో జాగ్రత్త వర్షాకాలం ప్రారంభం కావడంతో తడి వాతావరణం, దోమలవ్యాప్తితో చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో గాట్లు, పుండు పడిన చోట బాక్టీరియా (స్టెఫిలోకాకస్, స్ట్రెప్టోకోకస్) చర్మం లోపలకు ప్రవేశించి సెల్యులైటిస్ను కలిగిస్తుంది. మధుమేహం, హెచ్ఐవీ, బోదకాలు, వెరికోస్ వెయిన్స్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. – డాక్టర్ అబ్దుల్ వారిస్ ఉస్మాని (తాహా), జనరల్ అండ్ లాప్రొస్కోపిక్ సర్జన్ -
పోలీసుల ప్రతిభ గుర్తించడానికే పోటీలు
● సీపీ గౌస్ ఆలం ● పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభంకరీంనగర్క్రైం: పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంచడం కోసం పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సోమవారం కమి షనరేట్ కేంద్రంగా రాజన్న జోన్–3 స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాసీ్త్రయత కోసం డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, విజయ్ కుమార్, వాసాల సతీశ్, వేణుగోపాల్, యాదగిరి స్వామి, రంగనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సమరానికి బీజేపీ సై
● కేంద్రమంత్రి బండి సంజయ్ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చర్యలు లేవా? గ్రామ ఽశివారులోని సర్వే నంబర్ 399లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఇదంతా జరిగింది. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదు చేస్తే ఇప్పటికి చర్యలు లేవు. 27 నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా తీసుకుంటలేరు. – ఆకుల రాజేశ్వర్రావు, గట్టుదుద్దెనపల్లి, మానకొండూరుకరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కమల దళం సై అంటోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం సాయంత్రం కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో వాతావారణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో, పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకని పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు. మిగిలిన వారంతా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రచారం చేయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులివ్వకుండా స్థానిక సంస్థలను ఏ విధంగా నీరుగార్చింది? అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులివ్వకుండా ద్రోహం చేసిందనే విషయంతో పాటు 19 నెలల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకుండా, కనీస అభివృద్ధి పనులు చేయకుండా ఏ విధంగా నష్టం చేకూరుస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు సహా శ్మశానవాటికల నిర్మాణం వరకు కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికీ, గల్లీగల్లీకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో విజయాలు సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు, పార్లమెంట్కన్వీనర్ ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కరీంనగర్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా వి ద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షులు అంగిడి దేవేందర్, జీవన్, తాత్విక్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్నకు మొక్కులు
వేములవాడ: రాజన్నను సోమవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముసురును సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, జయకుమారి, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. 25 రోజుల్లో రూ.2 కోట్ల ఆదాయం రాజన్నకు 25 రోజుల్లో హుండీల ద్వారా రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో రాధాబాయి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య సోమవారం హుండీలలోని కట్నాలు, కానులను ఆలయ అధికారులు, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు లెక్కించారు. రూ.1,99,84,960 నగదు, మిశ్రమ బంగారం 188 గ్రాములు, మిశ్రమ వెండి 14.300 కిలోలు సమకూరినట్లు ఈవో తెలిపారు. ఆలయ ఎస్పీఎఫ్ ఏఎస్సై మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
ప్రత్యేక రైలుకు స్పందన కరువు
కరీంనగర్రూరల్: కరీంనగర్–తిరుపతి ప్రత్యేక రైలుకు ప్రయాణికులు కరువయ్యారు. వారానికి ఒకరోజు నడిచే ఈ ప్రత్యేక రైలు పూర్తిగా త్రీ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లు ఉండటంతో పాటు ప్రయాణ సమయం, హాల్టింగులు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఆసక్తి చూపడంలేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ఈనెల 6నుంచి తిరుపతి–కరీంనగర్ ప్రత్యేక రైలును నడిపిప్తోంది. తిరుపతిలో ప్రతీ ఆదివారం రాత్రి7.45గంటలకు బయల్ధేరి మరుసటిరోజు సోమవారం ఉదయం7.18గంటలకు కరీంనగర్కు చేరుకుంటుంది. మొత్తం తిరుపతి నుంచి 4ట్రిప్పులు, కరీంనగర్ నుంచి 4ట్రిప్పులు నడిపించనున్నారు. సాధారణంగా తిరుపతి వెళ్లే రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నెలరోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే ప్రక్రియతో పాటు తత్కాల్ సౌకర్యం ఉంటుంది. మొత్తం ఏసీ కంపార్ట్మెంట్లుండగా జనరల్ కంపార్ట్మెంట్లు లేకపోవడంతో పాటు అనువుగాని సమయంలో నడిపిస్తున్న ప్రత్యేక రైలుకు ప్రయాఱికుల ఆదరణ కరువైంది. ఈ ప్రత్యేక రైలును రెగ్యులర్ రైలు తరహాలో అన్ని కంపార్ట్మెంట్లతో నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. త్రీ టైర్ ఏసీ బోగీలకే పరిమితం జనరల్ ప్రయాణికులకు నిరాశ -
పదిగంటల జీవో సంగతి తేల్చాలి
జ్యోతినగర్(రామగుండం): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పది గంటల జీవో విడుదల సంగతిని తెలియజేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద మాట్లాడారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా పది గంటల జీవో ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానంపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో కాపీలను దహ నం చేశారు. నాయకులు రెడపాక లక్ష్మణ్, పుల్లూరి నాగభూషణం, రాజమల్లయ్య, చింతల సత్యం, దగ్గుల సత్యం, కడారి సునీల్, సీహెచ్.ఉపేందర్, తోకల రమేశ్, కె.విశ్వనాథ్, ముద్దసాని దామోదర్రెడ్డి, జయసింహ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రోజు బాధేసింది.. ఈరోజు ఆనందంగా ఉంది
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలో ఇన్నాళ్లు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా భావించానని, చాలామంది తమను హకీంపేటకు మార్చాలని దరఖాస్తులు వచ్చాయని కానీ 200 ఎకరాల్లో ఉన్న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కంటే కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్ చాలా బాగుందని సంబురపడ్డారు క్రీడా మంత్రి వాకటి శ్రీహరి. సోమవారం కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డిలతో కలిసి పర్యటించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు శాట్స్ ఎండీ, చైర్మన్లతో కలిసి ఒక రోజు ఉదయాన్నే వెళ్లానని కానీ నేను అనుకున్నట్లుగా అక్కడ వసతులు లేవని తినకుండానే తిరిగొచ్చామన్నారు. కరీంనగర్కు వచ్చే ముందు హకీంపేటలోనే ఏమీ లేవు ఇక కరీంనగర్ ఎలా ఉంటుందో అనుకొని వచ్చానని కానీ ఇక్కడి వసతులు, వాతావరణం, సౌకర్యాలు చూసి మనసు ఉల్లాసమైందన్నారు. నాకు ఆరోజు బాధేసిందని..కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగ ఆయాన కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ను చూసి మురిసిపోయారు. ప్రపంచం గర్వపడేలా క్రీడల్లో రాణించాలని చిన్నారులకు సూచించారు. క్రీడా వసతులపై శాట్స్ ఎండీ ఆరా కరీంనగర్లో క్రీడా శాఖ మంత్రి పర్యటన సందర్బగా రాష్ట్ర క్రీడా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి కూడా వచ్చారు. మంత్రి ఇతర కార్యక్రమాలకు వెళ్లగా ఆమె ప్రాంతీయ క్రీడా పాఠశాలను పరిశీలించి క్రీడా వసతులపై ఆరా తీశారు. కాసేపు శాట్స్, క్రీడా శాఖ, ఒలింపిక్, క్రీడాపాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్, జూడో, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో శాట్ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డీవైస్వో శ్రీనివాస్ గౌడ్, డీఈవో శ్రీరామ్ మొండయ్య, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలపై మంత్రి వాకటి శ్రీహరి -
తండ్రి సాయంతో కొడుకు చోరీ
మంథని: మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సోమవారం మంథని పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. గత 18న బిట్టుపల్లికి చెందిన కందుకూరి లక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ధర్మారం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు రాయినేని అనిల్, రాయినేని మల్లయ్య.. లక్ష్మి ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఘటనా స్థలంలో అంబర్ ప్యాకెట్ను గుర్తించారు. ఈ క్రమంలో మలయ్య, అనిల్పై అనుమానంతో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. అలాగే మంథని మండలం పుట్టపాకలో ట్రాక్టర్, సుందిళ్ల పంపుహౌస్లో ఇనుపరాడ్స్, మంథని పెట్రోల్బంకు వద్ద బైక్, వాసవీనగర్లోని ఓ ఇంట్లో దొంగతనం, ముత్తారం మండలంలో వడ్ల చోరీ, రామగిరి మండలంలో రెండు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్లెల్లో స్పెషల్డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మంథని, రామగిరి, ముత్తారం ఎస్సైలు పాల్గొన్నారు. -
అడవంతా పండుగ..
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవాని అమ్మవారి వేడుకలకు తండాలు ముస్తాబయ్యాయి. అడవి బిడ్డల ప్రత్యేక పండుగగా శీత్లా భవానిని వేడుకుంటారు. వర్షాకాలం ఆరంభమై పెద్దపూసల కార్తీలో గిరిజన తండాలో శీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. జూలై తొలి, రెండో మంగళవారాల్లో సంప్రదాయ బద్ధంగా పండుగ జరుపుకుంటారు. తండాల పోలిమేర్ల వద్ద శీత్లా భవానిని ప్రతిష్టించి యువతులు బోనాలు ఎత్తుకుని అక్కడికి చేరుకుంటారు. కోళ్లు, మేకలు, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పశువులన్నింటినీ ఒక చోట చేర్చి బలి ఇచ్చిన మేక పేగు మీదుగా వాటిని దాటిస్తారు. బావి నుంచి తెచ్చిన నీటిని వాటిపై చల్లుతారు. ఆ కారణంగానే దీనికి దాటుడు పండుగగా పేరొచ్చింది. గిరిజన యువతుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 126 తండాల్లో ఒకే రోజు మంగళవారం పండుగ నిర్వహించాలని జిల్లా బంజారా సేవా సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు.. శీత్లా భవాని వేడుకలను పురస్కరించుకుని ఉదయమే గిరిజనులు నైవేద్యాలతో ఊరేగింపుగా అటవీ ప్రాంతానికి తరలివెళ్తారు. అక్కడ తమ దేవతలైన శీత్లా భవాని, తుల్జా భవాని, మసూరి భవాని, అంబ భవాని, దుర్గా భవాని, మాతలకు మొక్కులు చెల్లించుకుంటారు. పిల్లపాపలు, పశు సంపద బాగుండాలని, పంటలు సంమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురువాలని పూజలు చేస్తారు. అనంతరం గిరిజన మహిళల నృత్యాలు ఉంటాయి. శీత్లా భవాని తల్లిని ప్రధాన దేవతగా కొలుస్తారు. పెళ్లికాని యువతులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంచి వరుడు దొరకాలని వేడుకుంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ కోసం సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడినవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. నేడు శీత్లా భవాని వేడుకలకు తండాలు ముస్తాబు నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు తరలనున్న గిరిజనులు కోరికలు నెరవేరుతాయి శీత్లాభవాని అమ్మవారిని కొ లిస్తే కోరికలు నెరవేరుతా యి. పశుసంపద, పంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పండగ రోజు అమ్మవా రిని కొలుస్తాం. పిండి నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకుంటాం. ఏటా ఇదే మాసంలో పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. – అజ్మీరా రజిత, మాజీ సర్పంచ్, బుగ్గారాజేశ్వర తండా -
సెలవు ప్రకటించాలి
ఏటా జూలై రెండో మంగళవారం శీత్లా పండుగ జరుపుకుంటాం. అమ్మవారలకు సంప్రదాయ వేశధారణలో మొక్కులు చెల్లించుకుంటాం. శీత్లాభవాని వేడుకలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతున్నాం. – గుగులోత్ కళావతి, మాజీ జెడ్పీటీసీ, వీర్నపల్లి రాష్ట్ర పండుగగా గుర్తించాలి శీత్లాభవాని పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి బడ్జెట్ కేటాయించాలి. గోర్ బంజారాల పండుగలను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం గుర్తించాలి. – గూగులోత్ రవిలాల్నాయక్, మద్దిమల్ల ఒకే రోజు జరుపుకోవాలని.. జిల్లాలోని అన్ని మండలాల్లో గల తండాల్లో ఒకే రోజు శీత్లా భవాని వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాం. గతంలో రెండు వారాల పాటు పండుగను జరుపుకునేవారు. ఈసారి ఈనెల 8న అన్ని తండాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని సూచించాం. – గుగులోతు సురేశ్నాయక్, బంజారాసేవా సంఘం జిల్లా అధ్యక్షులు -
ప్రమాణాలు పాటించకనే కాళేశ్వరం కుంగుబాటు
శంకరపట్నం(మానకొండూర్): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడంతోనే కుంగిపోయిందని, బాధ్యులపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సోమవారం ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. అవినీతి పాల్పడిన నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంకుశపాలనను అంతం చేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి అంబేడ్కర్ సుజల స్రవంతి అని నామకరణం చేయాలన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కోదండరాంకు జిల్లా కన్వీనర్ మోరె గణేశ్ నాగలిని బహూకరించారు. రాష్ట్ర ప్రధన కార్యదర్శులు ముక్కెర రాజు, అరికెల్ల స్రవంతి, ధర్మార్జున్, మండల అధ్యక్షుడు రమేశ్, శ్రీనివాస్, సతీశ్, భానుకిరణ్, సాయిరాం, అరుణ్, రాజేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం -
చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!?
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితక్షి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా వాస్తవం కాదని నిర్ధారించుకున్నారు. తోటికోడలు పెత్తనం సహించలేకే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్యలో ఒక్కరే ఉన్నారా..? లేక మరెవరైనా పాలుపంచుకున్నారా..? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇంటి పెత్తనంపై ఈర్ష్య..? కోరుట్లలోని ఆదర్శనగర్కు చెందిన ఆకుల మదన్మోహన్కు ఇద్దరు కుమారులు. రాము, లక్ష్మన్ కవలలతోపాటు ఓ కూతురు ఉన్నారు. రాముకు నవీనతో.. లక్ష్మణ్కు మమతతో గతంలోనే వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితక్షి (6) ఉన్నారు. లక్ష్మణ్ మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మదన్మోహన్ ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఏడాది క్రితం కుమారులిద్దరినీ తన వెంట తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నవీన, మమత అత్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన మమత నాలుగు నెలల క్రితం ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడి రూ.18 లక్షలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్స్టేషన్లో సైబర్క్రైం కేసు నమోదైంది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా ఉంచాలని అనుకు న్నా.. సాధ్యంకాలేదు. పైగా కుటుంబంలో కొద్ది కాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో నవీనకు గుర్తింపు ఎక్కువగా ఇస్తున్నారని మదనపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవీనాపై ద్వేషం, ఈర్ష్య పెంచుకున్నట్లు తెలిసింది. అంతా పథకం ప్రకారమే.. కక్ష పెంచుకున్న మమత.. నవీన కూడా తనలాగే బాధపడాలని భావించి అదునుకోసం కొద్దికాలంగా ఎదురుచూసినట్లు సమాచారం. శనివారం ఉదయం వేదాంశ్, హితక్షిని స్కూల్కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి కరీంనగర్కు షాపింగ్ కోసమని వెళ్లడంతో ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉన్నారు. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్ను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేట్, బాత్రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత హితక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసినట్లు, కట్టర్తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు వాషింగ్ మిషన్లో వేసి దుస్తులు మార్చుకుని.. అందరితోపాటు హితక్షి కోసం వెతికినట్లు సమాచారం. హితక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆసుపత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం. కీలకంగా మారిన డాగ్స్క్వాడ్ శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హితక్షి కనిపించకపోవడంతో సుమారు గంటన్నర పాటు వెతికిన నవీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 9 గంటల సమయంలో సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని బాత్రూంలో హితక్షి మృతదేహం లభ్యమైంది. రాత్రి పది గంటల సమయంలో ఎస్పీ అశోక్కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ సాయంతో విచారణ జరిపారు. మొదటగా బాలిక మృతదేహం దొరికిన వ్యక్తిని అనుమానించిన పోలీసులు.. అతను వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉన్నానని చెప్పడంతో వీడియోకాల్ సాయంతో ధ్రువీకరించుకున్నారు. ఇంట్లో ఏమైనా కుటుంబకలహాలు ఉన్నాయా..? అనే విషయంపై దృష్టి సారించిన పోలీసులు అదే రాత్రి డాగ్ స్క్వాడ్ను రప్పించారు. ఆ డాగ్ బాలిక మృతదేహం దొరికిన ఇంటి నుంచి మళ్లీ బాలిక ఉండే ఇంటికి వెళ్లి ఆగిపోయినట్లు సమాచారం. దీంతో బాలికను ఇంట్లోని వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. పట్టించిన సీసీ కెమెరా.. డాగ్ స్క్వాడ్ చిన్నారి ఇంటి గేటు వద్ద ఆగిపోవడంతో పోలీసులు.. ఇంటి ముందున్న సీసీ కెమెరాను పరిశీలించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పెద్దపులుల వేషధారులు ఆడుతుండగా.. మమత వాటిని చూసేందుకు తన ఇద్దరు కూతుళ్లతోపాటు వేదాంశ్, హితక్షిని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అరగంట తర్వాత ముగ్గురు పిల్లలు మాత్రమే ఇంటికి చేరుకున్నారు. తరువాత 15 నిమిషాలకు మమత హడావుడిగా ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో మమత వెంట హితక్షి లేకపోవడంతో పోలీసులు ఆమెను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. బాలిక హత్యలో మమతతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మాత్రమే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం హితక్షి తాత మదన్మోహన్, తండ్రి రాములు సౌదీ నుంచి ఇంటికి చేరుకోగా.. అంత్యక్రియలు పూర్తి చేశారు. మలుపు తిరిగిన బాలిక హత్య కేసు.. పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు తోటికోడలు పెత్తనంపై ఈర్ష్య, ద్వేషమే కారణమా..? కొంత కాలంగా ఇంట్లో గొడవలు లోతుగా విచారణ చేపడుతున్న పోలీసులు -
చేపల వేటపై నిషేధం
● పునరుత్పత్తి దశ కావడంతో నిర్ణయం ● జూలై, ఆగస్టులో చేపలు పడితే చర్యలు ● రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర చేప పిల్లల ఉత్పత్తి జగిత్యాలఅగ్రికల్చర్: జలాశయాలు, చెరువులు, కుంటలు, వరదకాలువ, గోదావరి పరీవాహక ప్రాంత జలాశయాల్లో జూలై, ఆగస్టు నెలల్లో చేపలు పట్టకుండా మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీ చేసింది. మత్స్యశాఖ ఆదేశాలు ఉల్లంఘించి చేపలు పడితే, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ రెండు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి, చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి బ్యాక్ వాటర్, గోదావరి నదిలో, వరదకాలువలో చేపలవేటపై పూర్తిస్థాయి మానిటరింగ్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. నిషేధం ఎందుకంటే వర్షాకాలంలో ఇబ్బడి, ముబ్బడిగా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్ బలంగా అభివృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టులో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆడ చేపలు ఎగ్ రిలీజ్ చేస్తే, మగ చేపలు స్పెర్మ్ను రిలీజ్ చేస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటం, ఆ నీరుతో పాటు చెత్త, చెదారం కొట్టుకుని వచ్చి నీళ్లపై తేలుతూ ఉంటాయి. ఈ సమయంలో చెత్త, చెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి, 2–3 రోజుల్లోనే గుడ్ల నుండి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టులో 3నుంచి 5 సార్లు జరుగుతుంది. రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర పిల్లలు రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర పిల్లలు బయటకు వస్తాయి. అందులో 10శాతం బతికినా.. పదివేల చేపలు ఉత్పత్తి అవుతాయి. దాదాపు టన్ను నుంచి టన్నున్నర చేపల ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. వర్షాకాలంలో చేపలు వేటగాళ్లకు తొందరగా చిక్కుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్కచేపను కోల్పోయిన, దాని నుంచి వచ్చే లక్ష చేప పిల్లలను కోల్పోయినట్లే. ఈ మేరకు చేపల సంఖ్యను పెంచేందుకు మత్స్యశాఖ స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. జిల్లాలో నెలకు 100– 150 టన్నుల చేపల ఉత్పత్తి జిల్లాలోని అన్ని జలాశయాల్లో నెలకు 100నుంచి 150 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. 696 చెరువులు, కుంటలు ఉండగా, వాటి పరిధిలో 18,336 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి ఉంది. జిల్లాలో మొత్తం 254 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, వాటిలో 18,500 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులు, కుంటల్లోని చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి గత కొన్నేళ్లుగా జిల్లాలోని చెరువుల్ల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదిలారు. ఈ పథకం పెద్దగా ఉపయోగపడలేదు. చేప పిల్లలను వదిలే సమయం అంటూ లేకుండా వదలడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడం, వాతావరణం సహకరించక కొన్ని చేప పిల్లలు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా, అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా, చెరువుల్లోని చేపలతోనే లక్షలు, కోట్లు చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క చేపను పట్టినా పునరుత్పత్తిని దెబ్బతీసినట్లే ఈ రెండు నెలల్లో ఒక్కచేపను పట్టినా లక్షల చేపలను పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. కాబ ట్టి జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. ఎవరైనా చేపలు పడితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. – అరుణ్కుమార్, మత్స్యశాఖ నిపుణుడు, జగిత్యాల రెండునెలల పాటు నిషేధం జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని జలాశయాల్లో చేపల వేటను నిషేధించడమైంది. మత్స్యకారుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిషేధాజ్ఞలు జారీ చేయడమైంది. చేపలు పట్టడం వల్ల పునరుత్పత్తి ప్రక్రియ నిలిచిపోతుంది. – శ్రీనివాస్, మత్స్యశాఖాధికారి, జగిత్యాల -
అప్పుల బాధతో దినసరి కూలీ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లికి చెందిన దినసరి కూలి కుమ్మరి పోచయ్య(65) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పోచయ్యకు ఒక్కగానొక్క కూతురు చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతుండగా.. పలు ఆస్పత్రుల్లో చూపించేందుకు రూ.2లక్షల వరకు వెచ్చించాడు. కుటుంబ పోషణ, కూతురుకు వైద్యం అందించేందుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతునికి భార్య రాజవ్వ, కుమార్తె తిరుమల ఉన్నారు. ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్షాక్తో వ్యక్తి మృతికరీంనగర్ క్రైం: భవన నిర్మాణ పనులు చేస్తున్న ఓ కూలీ కరెంట్షాక్తో మృతి చెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం మధ్యప్రదేశ్కు చెందిన సునీల్ విశ్వకర్మ(29) భవన నిర్మాణ కూలీ పనులు చేసేందుకు కరీంనగర్కు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం నగరంలోని చైతన్యపురిలో ఒక భవనంలో పనిచేస్తుండగా ఇనుప చువ్వలను కట్చేసే క్రమంలో కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయాడు. తోటి కార్మికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయంపై అతని భార్య పూజ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైందవ సంస్కృతిని ఇతర దేశాలూ ఆచరిస్తున్నాయి వేములవాడ: హైందవ సంస్కృతిని ప్రపంచ దేశాలు సైతం ఆచరిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. నాలుగు రోజులుగా రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న చతుర్వే స్మార్త పరీక్షలు ఆదివారం ముగిశాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన పండితులు, విద్యార్థులనుద్దేశించి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. చతుర్వేద స్మార్త పరీక్షల్లో ఉతీర్ణత సాధించిన 157 మంది వేద పండిత విద్యార్థులకు పట్టాల పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. రూ.76కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేదపండితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈవో రధాభాయి, ఏఈవో శ్రీనివాస్, అశోక్కుమార్, జయకుమారి పాల్గొన్నారు. -
కథలాపూర్లో ఒకరిపై హత్యాయత్నం
కథలాపూర్: మండలకేంద్రంలో ఓ వ్యవసాయ భూమికి వెళ్లే దారి విషయంలో ఆదివారం వివాదం చోటుచేసుకుని హత్యాయత్నానికి దారితీసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తిక్క మల్లేశ్, తిక్క రాహుల్ మధ్య కొంతకాలంగా దారి విషయంలో వివాదం నడుస్తోంది. ఆదివారం ఉదయం మల్లేశ్ పొలం వద్దకు వెళ్లగా.. అక్కడే రాహుల్, కోరుట్లకు చెందిన ఆదిత్య ఉన్నారు. దారి విషయంలో మరోసారి వివాదం జరిగింది. దీంతో మల్లేశ్పై రాహుల్, ఆదిత్య కలిసి కట్టెలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మల్లేశ్ను చికిత్స నిమిత్తం కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాహుల్, ఆదిత్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. -
‘చిరు’సాయం భవితకు నవోదయం
● సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ● అనాథ పిల్లలకు కొండంత అండ ● ఈనెల 31వరకు ఆపరేషన్ ముస్కాన్ కరీంనగర్: చిన్నారుల సంరక్షణలో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, కార్మిక శాఖ సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో ఏటా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహిస్తున్నారు. అనాథలకు కొండంత అండగా భరోసా ఇస్తున్న ఆపరేషన్ స్మైల్, అపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఎవరెవరిని సంరక్షిస్తారంటే భిక్షాటన చేసే, తప్పిపోయిన చిన్నారులు, బస్టాండ్లోని బాలలు, వీధి, అనాథ, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, చెత్త సేకరించే వారు, మతి స్థిమితం లేని వారు, బాల్య వివాహాలు అడ్డుకోవడం, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే విభాగాల్లో చిన్నారులను గుర్తించి సంరక్షిస్తారు. సందర్భానుసారంగా ఆయా వాటిల్లో యజమానులు, నిర్వాహకులపై పోలీసు, కార్మిక శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అనాథ బాలల సంరక్షణలో భాగంగా సీడబ్ల్యూసీ (బాలల సంక్షేమ సమితి) ఎదుట హాజరుపర్చుతారు. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతారు. శాఖల సమన్వయంతో రెండు బృందాలు ఏర్పాటు ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్లకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కాని స్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్ను నియమించారు. ఈ కమిటీలు జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, ఇతర శాఖల సమన్వ యంతో నెలపాటు వ్యాపార సంస్థలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు.. ఇలా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారు. బిచ్చగాళ్లుగా మారిన వారిని, వీధి బాలలు, బాల కార్మికులు, డ్రాపౌట్లు, వేధింపులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు. ఐదేళ్లలో 479 మందికి విముక్తి చిన్నారులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే మొదట సదరు యజమానికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తారు. బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, బడుల్లో చేర్పించడం, అనాథలైతే.. చైల్డ్ హోంలో చేర్పించడం, ఇతర రాష్ట్రాల వారుంటే అక్కడి సిబ్బందితో మాట్లాడి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం, బాల్య వివాహాలు ఆపడం వంటివి చేస్తుంటారు. ఐదేళ్లల్లో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహించగా 479మంది బాల కార్మికులు, ఇతరులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడాది ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ 2021 244 45 2022 58 31 2023 17 07 2024 19 25 2025 33 ముస్కాన్ ప్రారంభమైంది ఈనెల 31వరకు కార్యక్రమం ఈనెల అఖరు వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ము స్కాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి ఏడాది ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి బాల కార్మికులను గుర్తిస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, వారి తల్లిదండ్రులకు అప్పగించడం, పనిలో పె ట్టుకునే యాజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. – సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి, కరీంనగర్ -
ఎస్సై వేధించాడని ఆత్మహత్యాయత్నం
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్స్టేషన్ ఎస్సై లక్ష్మణ్ వేధించాడని ఆరోపిస్తూ మండలంలోని మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాములు చిన్న కుమారుడు సాగర్ను ఇదే గ్రామానికి చెందిన 8 మంది 2021 జూలై 7న హత్య చేశారు. ఈ కేసులో ఇదే గ్రామానికి చెందిన పోలవేణి రామయ్యతో పాటు అతడి కుటుంబసభ్యులు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ప్రసుత్తం కోర్టులో ట్రయల్కు వచ్చింది. ఈక్రమంలో రాములు రాజీపడితే పోలవేని రామయ్య రూ.22 లక్షలు ఇచ్చేందుకు గ్రామ పెద్దమనుషుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు ప్రకారం శిక్షపడితే నిందితులకు ఆ డబ్బులు రాములు వాపస్ ఇవ్వాలని పెద్దల సమక్షంలో దాదాపు ఎడు నెలల క్రితం ఒప్పందం జరిగింది. కాగా, అదే రోజు ధర్మారం గ్రామీణ బ్యాంకులో మృతుడి తండ్రి రాములు సోదరుడు మల్లేశంతో పాటు హత్య కేసులో నిందుతుల తరఫున మరో వ్యక్తి పేరిట జాయింట్ అకౌంట్లో రూ.22లక్షలు జమచేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో నిందితులకు సానుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒప్పందం ఉండగా, సాక్ష్యులతో పాటు తండ్రి సైతం నిందితులకు సానుకూలంగా చెప్పినట్లు సమాచారం. కానీ, మృతుడి తల్లి మాత్రం తన కుమారుడిని గ్రామానికి చెందిన రామయ్య, అతడి కుటుంబసభ్యులే హత్య చేశారని కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. మృతుడి తల్లి తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఇవ్వాలని నిందితులకు సంబంధించిన పెద్దమనుషులు రాములు సోదరుడు మల్లేశంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పినా పెద్దమనుషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని శనివారం రాములు పోలీస్స్టేషన్లో ఎస్సైని కలిసి వివరించాడు. ఈ విషయంలో డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై వేధించడంతో మనస్తాపానికి గురైన రాములు ఆదివారం మధ్యాహ్నం 100 నంబర్కు ఫోన్ చేసి తాను ఎస్సై వేధింపులకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు. పొలం వద్ద పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి అపస్మారక స్థితిలో పడిఉన్న రాములును కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రాములును వేధించలేదు: ఎస్సై లక్ష్మణ్ హత్యకేసులో రాజీ కుదుర్చుకున్న విషయంలో బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఇవ్వాలని పెద్దమనుషులు ఒత్తిడి తెస్తున్నారని, వారిని స్టేషన్కు పిలిపించాలని రాములు శనివారం స్టేషన్ వచ్చినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అయితే హత్య కేసులో రాజీ కుదుర్చుకోవడం నేరమని, తాను ఎవరినీ పిలిపించనని రాములకు చెప్పి పంపించినట్లు పేర్కొన్నారు. అతడిని వేధించినట్లు ఆరోపించడం సరికాదన్నారు. కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు -
ఆధునిక హంగులు.. సౌకర్యాలు
● సింగరేణిలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం క్వార్టర్లు ● అధికారులకు 143, కార్మికులకు 860 క్వార్టర్లు ● 1,003 క్వార్టర్లకు రూ.450 కోట్లు కేటాయింపు గోదావరిఖని(రామగుండం): సంస్థవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆధునిక హంగులతో క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీప్లస్ వన్ పద్ధతిలో అధికారులకు ట్రిపుల్ బెడ్రూం, కార్మికులకు డబుల్ బెడ్రూం నిర్మించనున్నారు. ఈమేరకు సింగరేణి బోర్డు ఆమోదం పొందింది. అధికారులు, ఉద్యోగుల 1,003 క్వార్టర్ల నిర్మాణానికి రూ.450కోట్లు కేటాయించింది. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూర్ ప్రాంతాల్లో క్వార్టర్లను నిర్మించనుంది. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం 50 ఏళ్ల క్రితం టీవన్టైపు, డీ టైపు పేరుతో పైకప్పు సిమెంట్ రేకులతో క్వార్టర్లను నిర్మించింది. సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురాతన క్వార్టర్లు కార్మికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఐటీ ఇంజినీర్లు, పలు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి విద్యను అభ్యసించిన కార్మికుల పిల్లలు ఇక్కడకు వస్తే ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో క్వార్టర్ పక్కనున్న స్థలంలో షెడ్డు, అదనపు నిర్మాణం చేపట్టినా ఏమూలకూ సరిపోవడం లేదు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు సంస్థలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి వాటిస్థానంలో నూతనంగా క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఆధునిక పద్ధతిలో విశాలంగా.. సింగరేణిలో అధికారులకు మిలీనియం ఏబ్లాక్ పద్ధతిలో 35 క్వార్టర్లు, మిలీనియం బీబ్లాక్ విధానంలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్ కోసం మిలీనియం సీబ్లాక్ పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్మెన్ల కోసం మిలీనియం డీబ్లాక్ 560 క్వార్టర్లు నిర్మించనున్నారు. గతంలో నిర్మించిన ఎండీటైపు క్వార్టర్ల మాదిరిగా ప్రతీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. క్వార్టర్ల కోసం యాజమాన్యం టెండర్ ప్రక్రియ సిద్ధం చేసింది. త్వరలో టెండర్ల ద్వారా క్వార్టర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు కేటాయించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, హంగులతో కార్మికులకు డబుల్ బెడ్రూం, అధికారులకు ట్రిపుల్ బెడ్రూంలు నిర్మించేందుకు నిర్ణయించాం. జీప్లస్ వన్ విధానంలో నిర్మాణాలు కొనసాగుతాయి. రూ.450కోట్లు వెచ్చించేందుకు బోర్డు అనుమతి లభించింది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి ప్రాంతం అధికారులు కార్మికులు వ్యయం (రూ.కోట్లలో) గోదావరిఖని 36 282 133 శ్రీరాంపూర్ 39 410 193 భూపాలపల్లి 22 60 45 మణుగూరు 46 108 79 -
తల్లీ, కొడుకుల ఆదర్శ నిర్ణయం
● మరణానంతరం నేత్ర, అవయవాల దానంకు అంగీకారం ● కూతురు పుట్టిన రోజున స్ఫూర్తిదాయకమైన సందేశం కోల్సిటీ(రామగుండం): ‘అమ్మా... నేను చనిపోయాక నేత్ర, అవయదానం చేయ్యాలని నిర్ణయించుకున్న...’ అని కొడుకు తన మనసులోని మాటను తల్లికి చెబితే... ఇదేం పిచ్చి ఆలోచన అంటూ వద్దని వారించలేదు తల్లి. మంచి నిర్ణయం బిడ్డాని భుజం తట్టింది. నేను కూడా నీలెక్కనే నేత్ర, అవయదానం చేస్తానంటూ తల్లి కూడా ముందుకు వచ్చింది. తనకు పాఠాలు చెప్పిన టీచ్చర్ సమక్షంలో ఆ ఆదర్శ కొడుకు, తన తల్లితో కలిసి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్కు సమర్పించారు. గోదావరిఖని పవర్హౌజ్ కాలనీలో నివాసం ఉంటున్న కాంపెల్లి స్వామి, జయ దంపతుల కుమారుడు శివగణేశ్. డిప్లామోఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) కోర్సు చేస్తున్నాడు. మరణానంతరం మనిషి నేత్రాలు, అవయవాలను దానం చేస్తే పలువురికి పునఃర్జన్మ ఇవ్వొచ్చని భావించాడు. విషయాన్ని తనకు చదువు చెప్పిన టీచర్ శశికళకు తెలిపాడు. తన సోదరి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా శనివారం శివగణేశ్ తన తల్లితో కలిసి నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. వారి నివాసంలోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేసి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూరికి శశికళ టీచర్ సమక్షంలో సమర్పించారు. వారికి ఆర్గాన్ డోనర్కార్డులతోపాటు అభినందన పత్రాలను అందజేశారు. తల్లీ, కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లప్ప, సారయ్య, కోశాధికారి రాజేందర్ అభినందించారు. -
అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్ కలిసిమెలిసి ఉండేవాళ్లం మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి. – లద్దునూరి తిరుపతి, నారాయణపూర్ ఎవరి పనిలో వారు బిజీ ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. – ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
కరీంనగర్: కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పరులు విదేశాల్లో డ్యాన్స్లు చేస్తుంటే మోదీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పుతుందని, సమాజం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాల్సి అవసరముందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈనెల 15లోపు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అను‘బంధం’ దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు. కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం.. ప్రెషర్ కుక్కర్లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పెనవేసుకునే ఉమ్మడి బంధం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు మారిన పరిస్థితుల్లో చిన్నకుటుంబాలుగా జీవనం రక్తసంబంధీకుల మధ్య అడ్డుగోడలు ఉద్యోగం, ఉపాధి వేటలో ఇతర ప్రాంతాలకు.. గతాలను నెమరువేసుకుంటున్న నాటితరం -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర
కరీంనగర్: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేవేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని గణేశ్నగర్లో గల బద్దం ఎల్లారెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ బకాయిల విడుదలపై పూటకో మాట మాట్లాడుతూ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరావు, వెంకటేష్, మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జమ్మికుంట: మున్సిపల్ పరిధి ఫ్లైఒవర్ బ్రిడ్జిపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్(27) మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి బైక్పై వస్తున్నాడు. మున్సిపల్ పరిధి కొత్తపల్లి ఫ్లైఒవర్ దిగువకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న రామన్నపల్లి గ్రామానికి చెందిన పురెల్ల మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్తో ఢీకొట్టాడు. డివైడర్పై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన నందయ్య (68) ఒంటరి తనం భరించలేక గతనెల 27న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని రూరల్ ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. నీటి సంపులో పడి బాలుడు..వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్ఠాణాలోని లింగంపల్లి రవి–స్వప్న దంపతుల కుమారుడు లింగంపల్లి రిషి(6) శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి మృతి చెందాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో రిషి ఇంటి వద్దే ఉన్నాడు. ఈక్రమంలో ఆడుకుంటూ వీరి ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న గుర్రం బాలకిషన్ ఇంటి వద్ద గల నీటి సంపులో పడి మృతిచెందాడు. విద్యుత్షాక్తో రైతు..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింతల రమేశ్ (49)అనే రైతు శనివారం పొలంమడికి నీరు పెట్టేందుకు ఉపక్రమిస్తుండగా విద్యుత్షాక్తో అక్కడికక్కడే మరణించాడు. పొలం దున్నేందుకు వీలుగా మడిలో నీరు నింపేందుకు విద్యుత్ మోటారును ఆన్చేసే సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు రూరల్ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సంధ్య, కుమారులు ప్రశాంత్, పవన్కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం
సిరిసిల్లటౌన్: సీనియర్ పాత్రికేయుడు గర్దాస్ ప్రసాద్(43) శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. వివిధ సంస్థల్లో పదేళ్లుగా పనిచేసిన ఆయన సిరిసిల్ల నియోజకవర్గం టీవీ 9 కంట్రిబ్యూటర్గా నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఉదయం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనలతో కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రసాద్కు భార్య రేవతి, కూతుళ్లు సంజన(19), సిరిచందన(16), కొడుకు శివేంద్ర(11) ఉన్నారు. సంతాపాలు..ఆర్థిక సాయం ప్రసాద్ మృతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సంతాపం ప్రకటించారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ చేతలు మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ రూ.25వేలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ రూ.10వేలు అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు రూ.50వేల ఆర్థికసాయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు, కార్యదర్శి ఆకుల జయంత్కుమార్, ఆడెపు మహేందర్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టి.వి.నారాయణ, వూరడి మల్లికార్జున్, ప్రెస్క్లబ్ కార్యవర్గం, పాత్రికేయులు నివాళి అర్పించారు. -
ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ
రాయికల్: పట్టణంలోని కేశవనగర్కు చెందిన వెల్మ రాధ ముఖంపై పౌడర్ చల్లి నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కేశవనగర్కు చెందిన రాధ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి రాధ వద్దకు వచ్చి ముఖంపై పౌడర్ చల్లారు. ఆ మత్తులో రెండు తులాల కడెం, రెండున్నర తులాల చైన్ ఆగంతులకు ఇచ్చేసింది. కాసేపటికి తేరుకున్న బాధితురాలు లబోదిబోమంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుదీర్రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యరామడుగు: దేశరాజ్పల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం దేశరాజ్పల్లి గ్రామానికి చెందిన బోడిగె నర్సయ్య(60) అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సయ్య కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వెలిచాలలోని అనాథ ఆశ్రమంలో జీవనం సాగించినట్లు చెప్పారు. ఇటీవల గ్రామానికి వచ్చిన నర్సయ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ శనివారం గ్రామ శివారులో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైనేజీ నీటి మళ్లింపునకు చర్యలు చేపట్టండి
● ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశంకొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్–సిరిసిల్ల ప్రధా న రహదారిపై కొత్తపల్లి మండలం బావుపేట వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రయాణం.. ప్రమాదకరం.. రోడ్డుపై నిలుస్తున్న మురుగు నీరు అనే శీర్షికన శనివారం సాక్షిలో ప్రచరితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. బావుపేటలోని రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీటిని పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా నిర్మించిన డ్రైనేజీ మ్యాపును చూశారు.తాత్కాలికంగా నాలా ఏర్పాటు చేసి నిల్వ ఉన్న నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ డీఈ, ఎంపీడీవోను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం రూ.90లక్షలతో డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రోడ్లు భవనాల శాఖ డీఈ కిరణ్, కొత్తపల్లి తహసీల్దార్ ఆర్.వెంకటలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో.. కరీంనగర్–వేములవాడ ప్రధాన రహదారి బావుపేట వద్ద నిలిచిన డ్రైనేజీ నీటి మళ్లింపు తాత్కాలిక చర్యలు ప్రారంభమయ్యాయి. మురుగు నీటి మళ్లింపును వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించిన సందర్భంగా గ్రామస్తుల సహకారంతో కచ్చా కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో కొంతమంది స్వార్థం కోసం అడ్డుకోగా.. ప్రస్తుతం వారిపై ప్రజలు, ప్రయాణికులు తిరగబడే సమ యం ఆసన్నమవడంతో తాత్కాలిక పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో కచ్చా కాలువ ద్వారా మురుగు నీటి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. -
బైపాస్ పనుల్లో కదలిక!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అనిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ విషయంలో శుభవార్త. ఇప్పటికే పూర్తయిన ఈ రైల్వేలైన్ను కాజీపేట– బల్లార్ష ప్రధాన లైన్తో కనెక్ట్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇంటర్లాకింగ్ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సింది. మే నెలాఖరు నాటికి బైపాస్ రైల్వేలైన్ అందుబాటులోకి రావాల్సింది. ఆ సమయంలో కరీంనగర్–తిరుపతి రైలుకు పెద్దపల్లి స్టాప్ కూడా ఎత్తేశారు. ఇక రైలు పెద్దపల్లికి వెళ్లకుండా నేరుగా.. బైపాస్ మీదుగా జమ్మికుంట వైపు వెళ్లేది. కానీ.. అప్పు డు ఎదురైన పలు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. కానీ... ప్రధాన లైన్కు 1.78 కి.మీల పొడవైన పెద్దపల్లి బైపాస్ లైన్ను కలపడం అంత సులువేం కాదు. ఢిల్లీ మార్గం కావడంతో అనేక రైళ్లను గంటలపాటు నిలపాల్సి ఉంటుంది. చాలా రైళ్లను దారి మళ్లించాల్సి ఉంటుంది. వేలాది కుటుంబాల ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అధికారులు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైళ్ల రద్దీ తక్కువ ఉన్న రోజున కనీసం 2 నుంచి 3 గంటల్లో ప్రధాన మార్గాన్ని బైపాస్ మార్గంతో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిని ఆమోదిస్తూ.. సికింద్రాబాద్లోని దక్షిణమధ్య రైల్వే కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈనెల 7వ తేదీ దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన ఉంది. ఆయన పర్యటన అనంతరం బైపాస్ మార్గం అనుసంధానం షెడ్యూల్పై స్పష్టత రానుంది. ఆర్వోబీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పుకున్నా.. ఆ మేరకు పురోగతి కనిపించడం లేదు. ఈ మధ్య పిల్లర్ల పనుల్లో వేగంపెంచారు. ఇపుడున్న రైల్వే గేటు ప్రాంతంలో పిల్లర్లు నిర్మించాల్సిన నేపథ్యంలో రైల్వేగేటును పక్కకు మార్చారు. చొప్పదండికి వెళ్లే క్రమంలో కుడివైపునకు తిరిగే క్రమంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. చొప్పదండి నుంచి కరీంనగర్కు వచ్చే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అపోలో వరకు, అటు తీగలగుట్టపల్లి అమ్మగుడి వరకు వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు గేట్లు పడటం, ఈ కష్టాలకు వానలు తోడవటంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. స్కూలు బస్సులు, చిరువ్యాపారులతోపాటు ముఖ్యంగా అంబులెన్స్లో వచ్చే అత్యవసర రోగులు ఈ మార్గంలో రెట్టింపైన ట్రాఫిక్ కష్టాలతో అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే స్టేషన్కు అవతల నుంచి కిసాన్ నగర్ మీదుగా రైల్వే అండర్పాస్ మార్గం ఉంది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా, ఇతర ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు నెలల నుంచి సాగుతున్న పనులు రేపు కాజీపేట–బల్లార్ష మార్గంలో జీఎం పర్యటన? ఇంటర్లాకింగ్ పనులకు ఇంకా విడుదల కాని షెడ్యూల్ కొనసాగుతున్న కరీంనగర్ ఆర్వోబీ పనులు నరకం చూస్తున్నామని ప్రజల ఆవేదన కిసాన్నగర్ మార్గాన్ని అభివృద్ధి చేయాలి మేంచిరు వ్యాపారులం. రోజులో కనీసం నాలుగైదుసార్లు రైల్వేగేటు దాటాల్సి ఉంటుంది. ఆర్వోబీ పనుల ఆలస్యంతో మాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం పనులు వేగంగా చేయాలి. స్టేషన్ పక్కన ఉన్న అండర్పాస్ల మార్గం అభివృద్ధిచేసి ప్రచారం కల్పిస్తే.. ట్రాఫిక్ భారం కాస్త తగ్గుతుంది. అలాగే అంబులెన్స్లకు ఇబ్బందులు తప్పించినవారవుతారు. – లక్ష్మణ్, చంద్రాపూర్ కాలనీ -
ఎల్ఎండీలోని జెట్ స్కి స్కూటర్ తరలింపు
● అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులుకరీంనగర్: కరీంనగర్ ఎల్ఎండీలోని జెట్ స్కి స్కూటర్ను శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలిస్తుండగా బీఆర్ఎస్ నగరశాఖ అడ్డుకుంది. నాయకులు లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు జెట్ స్కి స్కూటర్ను తిరిగి మానేరు నదిలో యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వందల కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. మానేరు డ్యామ్లో రెండు జెట్ స్కి స్కూటర్లు, స్క్రూఈజ్ బోట్ను కొనుగోలు చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచారన్నారు. ప్రస్తుతం మానేరులో నీటి నిలువ డెడ్ స్టోరేజీకి చేరిందని, ప్రభుత్వం స్పందించి డ్యాంను నీటితో నింపాలన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, ఏవీ రమణ, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మైనార్టీ శాఖ అధ్యక్షుడు మీర్ షాకత్ అలీ, ప్రధాన కార్యదర్శి వాజిద్ హుస్సేన్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు చేతి చంద్రశేఖర్, ఆరె రవి, జల్లోజి శ్రీనివాస్, నారదాసు వసంతరావు, నదీం, ఒడ్నాల రాజు, పటేల్ సుధీర్ రెడ్డి, కొత్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జై జగన్నాథ
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025భజనలు, కోలాటాలు, నృత్యాలు, భక్తి పారవశ్యం నడుమ సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ రథయాత్ర నగర పురవీధుల్లో శనివారం వైభవంగా సాగింది. జగన్నాథ రథయాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్లోని రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంపూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. వందలాది మంది రథాన్ని లాగగా.. యాత్ర రాంనగర్, మంకమ్మతోట, తెలంగాణచౌక్, బస్టాండ్, వన్టౌన్ పోలీస్స్టేషన్, కమాన్, శాస్త్రిరోడ్, టవర్, రాజీవ్చౌక్ మీదుగా వైశ్యభవన్కు చేరుకుంది. ఇస్కాన్ నరహరి ప్రభుదాస్, యాత్ర కమిటీ సభ్యులు కన్నకృష్ట, తుమ్మల రమేశ్రెడ్డి, ఎల్.భాస్కర్రెడ్డి, బుర్ర మధుసూన్రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్రెడ్డి, జానార్దన్రెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్ కల్చరల్న్యూస్రీల్ -
బల్దియా కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్
● పన్నులు చెల్లించాలంటూ ఫోన్లు ● వాట్సప్ ద్వారా పేటీఎం స్కానర్ ● నమ్మొద్దంటూ కమిషనర్ విజ్ఞప్తికరీంనగర్ కార్పొరేషన్: ‘మున్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నా.. మీ ట్యాక్స్ పెండింగ్లో ఉంది. స్కానర్ పంపిస్తున్నా.. కట్టండి’. ‘హే బాబు.. పంపించుకోలేదంటా ఇంకా.. పంపించండి.. ఇంకోసారి ఇలా అయితే కేసేస్తా చెబుతున్నా.’ ‘రూ.2,100 పంపించండి.. మీకోసం చేస్తున్నా, మీటింగ్ వెళ్లేదుంది’..అంటూ కరీంనగర్ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ పేరిట ఫేక్కాల్స్ వచ్చాయి. రెండు రోజులుగా నగరంలోని పలువురి ఫోన్లకు 91210 97923 నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. తాను కమిషనర్ ప్రఫుల్దేశాయ్ని మాట్లాడుతున్నానంటూ చెబుతూ, ట్యాక్స్ కట్టాల్సి ఉంది.. చెల్లించండంటూ వాట్సప్ ద్వారా స్కానర్ పంపించారు. ఫోన్ నంబర్ డీపీ, ట్రూకాలర్లోనూ ‘మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ కార్పొరేషన్ ఆఫీస్ తెలంగాణ కరీంనగర్’ అని ఉంది. కాగా, కాల్స్ చేసిన వ్యక్తి కమిషనర్ వాయిస్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయడం గమనార్హం. కాల్స్ను నమ్మిన ఓవ్యక్తి రూ.500 పంపి, తనకు ట్రేడ్ లైసెన్స్ రావడం లేదంటూ అధికారుల వద్దకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫేక్ కాల్స్ నమ్మొద్దు: ప్రఫుల్దేశాయ్ కమిషనర్ను మాట్లాడుతున్నానంటూ వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మొద్దు. ఎలాంటి పన్నులు బకాయి ఉన్నా నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రంలో, బిల్ కలెక్షన్ డివైస్ యంత్రాలతో మీ వద్దకు వచ్చే వార్డు ఆఫీసర్లకు (రెవెన్యూ బిల్ కలెక్టర్లు) మాత్రమే చెల్లించాలి. మీ సేవా కేంద్రంలో, మీ మొబైల్ ఫోన్ ఆన్లైన్ యాప్ ద్వారా ఇంటి నంబర్, పీటీఐఎన్ నంబర్తో వివరాలను పరిశీలించిన తర్వాతే పే మెంట్ చేయాలి. ఫేక్ ఫోన్ కాల్స్పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. -
స్మార్ట్బిన్ దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి
● లోకాయుక్తను ఆశ్రయించిన సామాజిక కార్యకర్త సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్సిటీగా ఏర్పడిన తర్వాత చెత్త సేకరణకు అండర్గ్రౌండ్ స్మార్ట్బిన్లను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్బిన్ల ఏర్పాటుకు సుమారు రూ.1.07 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ స్మార్ట్ బిన్లను ఇన్స్టాల్ చేసే పని పూర్తికాకముందే మున్సిపల్ అధికారుల సహకారంలో సంబంధిత కాంట్రాక్టర్ బిల్లులు పొందారని సామాజిక కార్యకర్త ఒకరు లోకాయుక్తను ఆశ్రయించారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్మార్ట్బిన్ల నిర్వహణ లేకపోవడంతో కేవలం కమిషన్లు పొందేందుకే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుందని పే ర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన లోకా యుక్త ఈ విషయంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సీడీఎంఏను ఆదేశించడంతో పాటు ఈ కేసును ఈనెల 24కు వాయిదా వేసింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి ● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం రెవెన్యూ, నగరపాలకసంస్థ రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఫుట్ పాత్, అక్రమ కట్టడాలు, తదితర అంశాలపై చర్చించారు. సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు అందించాలన్నారు. విలీన డివిజన్లలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా క్షేత్రస్థాయి సర్వే ద్వారా గుర్తించాలన్నారు. నగరంలో ఎక్కడ ఫుట్ పాత్, రోడ్డు ఆక్రమణలు ఉన్నా వెంటనే డీఆర్ఎఫ్ సాయంతో తొలగించాలని సూచించారు. రీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, నగరపాలక డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, ఇన్చార్జీ డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, తహసీల్దార్ రాజేశ్, టీపీఎస్లు తేజస్విని, సంధ్య, ఆర్వో భూమానందం పాల్గొన్నారు. మెడికల్ రిప్ల సమ్మెకు ఐఎంఏ మద్దతుకరీంనగర్టౌన్: రేపటి నుంచి(సోమవారం) నుంచి ప్రారంభించనున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ల సార్వత్రిక సమ్మెకు కరీంనగర్ ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) మద్దతు తెలిపిందని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ కార్యదర్శి మిరుపాల అంజయ్య తెలిపారు. శనివారం ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎనమల్ల నరేశ్, డాక్టర్ నవీన్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ... నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు నియంత్రించి, ఔషధాలు , పరికరాలపై జీఎస్టీని ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రవేశాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ రిప్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హరీశ్, సహాయ కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు. సమాజాన్ని చదివిన కవి భరద్వాజ కరీంనగర్కల్చరల్: సమాజాన్ని చదివిన కవి రావూరి భరద్వాజ అని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రవిచంద్ర కొనియాడారు. శనివారం డాక్టర్ రావూరి భరద్వాజ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు మధ్యలో ఆపేసిన భరద్వాజ.. గ్రంథాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి రచయితగా ఎదిగారన్నారు. ప్రముఖ కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు రచన ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు భరద్వాజ అ న్నారు. లక్ష్మీగౌతం వందన, సయ్యద్ ము జాఫర్, చెన్న అనిల్కుమార్, అన్నవరం దేవేందర్, నాగభూషణం, అంజయ్య, తంగెడ అశోక్రావు, సురే్శ్ దామెరకుంట శంకరయ్య, ని ర్మల, పీఎస్ రవీంద్ర, గజేందర్రెడ్డి, ప్రభాకర్, జితేందర్, మహేందర్ రాజు తదితరులున్నారు. -
నియోజకవర్గాన్ని నంబర్వన్గా తీర్చిదిద్దుతా
● ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్జమ్మికుంట రూరల్/వీణవంక: ఆరేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి అభివృద్ధికి రూ.20వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశానని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిని అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దుతానని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం గండ్రపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.78లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, మండల అధ్యక్షుడు సంపత్రావు, బీఆర్ఎస్ పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, తహసీల్దార్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలకతీతంగా పని చేస్తా వీణవంకలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.1.56కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయ పార్టీలకతీతంగా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పని చేస్తున్నానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్రావు, బీజేపీ మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్గౌడ్, జిల్లా కార్యదర్శి నరసింహారాజు, గొట్టిముక్కుల సంపత్రావు, దేవేందర్రావు, సమ్మిరెడ్డి, ఆదిరెడ్డి తదితరులున్నారు. -
ప్రయాణం.. ప్రమాదకరం!
కొత్తపల్లి ●: ఫోర్లేన్ రోడ్డుపై ప్రయాణం అంటే సాఫీగా సాగిపోతుందని అనుకుంటాం. కానీ కరీంనగర్–సిరిసిల్ల రహదారిపై అది అంత ఈజీ కాదు. కరీంనగర్ శివారు తర్వాత ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల బురదనీరు, సమీపంలోని నివాసాల నుంచి వచ్చే బురదనీటితో ఈ రోడ్డు పాడైపోయింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద ఈ ప్రధాన రహదారిపై నిలిచిన మురికి, వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు ధ్వంసమైంది. పొద్దంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండగా.. రాత్రి వేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతా అస్తవ్యస్తం ● పద్మనగర్, ఒడ్యారం మధ్య రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బావుపేట పరిధిలో రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన డ్రెయినేజీ అస్తవ్యస్తంగా వదిలేయడంతో సమస్య ఉత్పన్నమైంది. ● స్థానిక ఎన్టీఆర్ తమిళకాలనీ నుంచి వస్తున్న మురికినీటికి తోడు గ్రానైట్ బురదనీరు డ్రెయినేజీల్లో నిండుకుంటోంది. గ్రానైట్ కట్టింగ్ మిషన్ల నుంచి వస్తున్న బురదనీటితోనే సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ మురికినీటికి మళ్లింపు లేకపోవడంతో రోడ్డుపైకి చేరి కుంటలా తయారవుతుంది. పారిశ్రామిక ప్రాంతం బావుపేట నుంచి కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి తదితర ప్రాంతాలతోపాటు అటు వైపు నుంచి బావుపేటకు వచ్చే వాహనాల తాకిడితో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిష్కారమేది? గత నెలలో కలెక్టర్ ఆదేశాలతో కరీంనగర్ ఆర్డీవో, ఆర్అండ్బీ అధికారులు వచ్చి తాత్కాలికంగా మురికినీటి మళ్లింపు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షానికి తోడు మురికినీరు వచ్చి చేరుతుండటంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. రహదారి నిర్మాణ సమయంలో పట్టా భూముల్లోంచి డ్రెయినేజీ నిర్మించొద్దంటూ స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో డ్రెయినేజీ ఆగిపోయింది. డ్రెయినేజీ నిర్మాణమే పరిష్కారం బావుపేట వద్ద నిలిచిన మురికి నీటి మళ్లింపునకు డ్రెయినేజీ నిర్మాణమే పరిష్కారమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రోడ్డుపై నిలుస్తున్న మురుగునీరు, గ్రానైట్ బురద కరీంనగర్–సిరిసిల్ల రోడ్డుపై భారీ గుంతలు బావుపేట వద్ద డేంజర్ స్పాట్లురూ.90 లక్షలతో ప్రతిపాదనలు కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో భాగంగా బావుపేటలో నిలిచిన మురికినీటి మళ్లింపునకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. 750 మీటర్ల డ్రెయినేజీ నిర్మాణానికి రూ.90లక్షల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వ అనుమతి రాగానే పనులు చేపడతాం. రహదారి నిర్మాణంలో భాగంగా మురికినీటిని మళ్లించే చర్యలకు పట్టాదారులు అడ్డు చెప్పడంతోనే సమస్య ఏర్పడింది. ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రహదారులకు వారే సహకరించకపోతే మేము చేసేదేముంది. అయినప్పటికీ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – నర్సింహాచారి, ఈఈ ఆర్ అండ్ బీశాశ్వత పరిష్కారం చూపాలి కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారి బావుపేట వద్ద నిలుస్తున్న నీటితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాత్కాలికంగా మురికినీటి మళ్లింపు పనులతో సమస్య పరిష్కారం కాదు. స్థానికుల సహకారంతో చేపడుతున్న చర్యలతో ఫలితాలివ్వడంలేదు. అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన డ్రెయినేజీ నీటిమళ్లింపు చర్యలు చేపట్టాలి. ప్రతీ రోజు వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరగడం బాధాకరం. – రెడ్డవేణి మధు, ఏఎంసీ మాజీ చైర్మన్ -
దేశ నలుమూలల నుంచి హాజరు
దేశ నలుమూలల నుంచి వేదపండితులు, వేద విద్యార్థులు వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే ఈ స్మార్త పరీక్షలకు హాజరుకావడం విశేషం. ఇందుకు ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, ఎమ్మెల్యే, ఆలయ ఈవోలకు అభినందనలు. చాలా మంది హాజరు కావడం గొప్ప విషయం. – తారకరామ కుమారశర్మ, తిరుమల తిరుపతి వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు, యజుర్వేద విభాగం ఇన్చార్జిసంతోషంగా ఉంది ఈ స్మార్త పరీక్షలు వేద గ్రంథాల అధ్యయనం, ధర్మశాస్త్ర అంశాలపై ప్రావీణ్యాన్ని అంచనా వేస్తున్నాయి. అభ్యర్థులూ, పరీక్షకులూ సంప్రదాయ దుస్తుల్లో పరీక్షలలో పాల్గొనడం విశేషం. వేద విద్యార్ధులకు ఇది ఎంతో ప్రాముఖ్యత గల అవకాశం. వీరందరికీ ఆలయం ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించాం. – రాధాభాయి, ఆలయ ఈవో -
ప్రైవేట్ పాఠశాల బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
సైదాపూర్: ప్రైవేట్ వద్దు.. గవర్నమెంట్ బడి ముద్దు అంటూ గ్రామానికి వచ్చిన ప్రైవేట్ బడి బస్సులను శుక్రవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దుద్దెనపల్లిలో బొమ్మనపల్లి, హుజూరాబాద్, తుమ్మనపల్లి నుంచి వచ్చిన ప్రైవేట్ బడి బస్సులను మాజీ ఎంపీటీసీ చాడ చైతన్య, కొండాల్రెడ్డి, చిన్న వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామ మహిళలు అడ్డుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల మాయాజాలంలో ప్రభుత్వ బడులు మూతపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాలమైన పాఠశాల తరగతి గదులు, మైదానం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులుండగా.. రూ.లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ బడికి పంపాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రైవేట్ బస్సులు గ్రామానికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రైవేట్ బడికి వెళ్తున్న విద్యార్థులను సర్కార్ బడిలో చేర్పించారు. -
వీళ్లు నరుకుతున్రు!
వాళ్లు నాటుతున్రు..● అడ్డొస్తున్నాయని రోడ్ల వెంట చెట్ల తొలగింపు ● కరీంనగర్ సిటీలో వ్యాపారుల చర్యలుకరీంనగర్ కార్పొరేషన్ ●: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో చేపడుతున్న వనమహోత్సవం కొంతమంది వ్యాపారుల కారణంగా లక్ష్యానికి దూరమవుతోంది. తమ వ్యాపారాలు స్పష్టంగా కనిపించాలనే నెపంతో దుకాణాల ఎదురుగా ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెట్లను తొలగిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలు వ్యాపారులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. తమకున్న పలుకుబడిని ఉపయోగించి అధికారులపై ఒత్తిళ్లు పెంచడం ద్వారా చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. కనిపించాలని... కరీంనగర్ సిటీ శరవేగంగా విస్తరిస్తుండడం, అభివృద్ధి పనులు భారీగా పెరుగుతున్న క్రమంలో పచ్చదనం కనుమరుగవవుతోంది. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో రోడ్లను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా అప్పటికే ఉన్న భారీ చెట్లను తొలగించాల్సి వస్తోంది. దీంతో ఎదురయ్యే పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు, రోడ్ల వెంట మళ్లీ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడాన్ని బల్దియా చేపడుతోంది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర రోడ్లకు ఇరువైపులా, మీడియన్స్ల్లో చెట్లు పెంచుతున్నారు. అయితే రోడ్లకు ఇరువైపులా పెరుగుతున్న చెట్లను కొంతమంది వ్యాపారులు తొలగిస్తుండడం వివాదాస్పదమవుతోంది. దుకాణాలు స్పష్టంగా కనిపించాలనే నెపంతో, రోడ్లపై నగరపాలక సంస్థ నాటిన చెట్లను కొట్టేస్తున్నారు. మరికొందరు కొమ్మలను కట్చేస్తున్నారు. హెచ్చరికలు బేఖాతరు రోడ్ల పక్కనున్న చెట్లను తొలగిస్తే చర్యలు తీసుకుంటామనే అధికారుల హెచ్చరికలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. గతంలో గాంధీరోడ్లోని ఓ దుకాణ నిర్వాహకులు తమ ముందున్న చెట్టును జేసీబీతో పూర్తిగా తొలగించారు. రోడ్డుపై చెట్టున్న జాడ కూడా లేకుండా మాయంచేశారు. ఇటీవల కలెక్టరేట్ రోడ్డులోని ఓ వ్యాపారి తన షాప్ ముందున్న రెండు చెట్లను కొట్టేశారు. రాంనగర్లోని ఓ వ్యాపారి తన షాప్ ముందున్న చెట్టు కొమ్మలు పూర్తిగా తొలగించారు. కాగా చెట్లను కొడితే రూ.5 వేలు జరిమానా, కేసు కూడా నమోదు అవుతుందని చెబు తున్నా.. వ్యాపారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. పైగా తమకున్న రాజకీయ, ఇతర త్రా పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. మున్సి పల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప.. నగరంలోని చెట్లకు రక్షణ ఉండదని పలువురు పేర్కొంటున్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
● ఇందిరమ్మ ఇండ్ల ఇసుక పక్కదారి ● 13 ట్రాక్టర్లపై కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులోని మానేరువాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలించడానికి వాగులోకి దిగిన ట్రాక్టర్లపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఇందిరమ్మ ఇండ్లకు వెంకటాపూర్ నుంచి ఇసుకను తరలించడానికి 33 ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. అయితే ఉదయం 7 గంటలకే 13 ట్రాక్టర్లను వాగులోకి తీసుకెళ్లి ఇసుకను నింపుతుండగా.. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పోలీసుల సహకారంతో ట్రాక్టర్లను సీజ్ చేశా రు. అధికారుల రాకను ముందే తెలుసుకున్న కొంద రు ట్రాక్టర్లతోపాటు పరారయ్యారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ ఇసుకను పక్కదారి పట్టించడానికి ట్రాక్టర్ల యాజమానులు సమ యం కంటే ముందే వాగులోకి దిగడంతో పట్టుకున్నామన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్ప డితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
జీడీకే–11 గనిలో కార్మికుడికి గాయాలు
గోదావరిఖని(రామగుండం): రామగుండం డివిజన్–1 పరిధి జీడీకే–11గనిలో జరిగిన ప్రమాదంలో జి.శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్కు గాయాలయ్యాయి. గనిలోని 15లెవల్ 15రేస్లో బ్లాస్టింగ్ కోసం నలుగురు కార్మికులు సపోర్టింగ్ కోసం డ్రిల్లింగ్ చేస్తుండగా ఈప్రమాదం జరిగింది. పైకప్పు సపోర్టింగ్ చేసిన తర్వాతే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా సేఫ్టీ సరిగా పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. నలుగురు పనిచేస్తున్న ప్రాంతంలో పైకప్పు కూలడంతో ముగ్గురు దూరం పరుగెత్తి ప్రమాదం నుంచి తప్పించుకోగా యాక్టింగ్ కోల్కట్టర్ శ్రీకాంత్పై బొగ్గు పెళ్లలు మెడపై పడడంతో గాయాలయ్యాయి. ఇతన్ని హుటాహుటిన గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోశం ఆసుపత్రికి చేరుకుని కార్మికున్ని పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మైన్స్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో సేఫ్టీ గురించి మాట్లాడినా.. యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
స్వచ్ఛతపై సర్వే షురూ
కరీంనగర్రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్– 2025లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితిని పరిశీ లించేందుకు శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు జిల్లాకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సంస్థ నుంచి సూపర్వైజర్లు జి.సురేశ్, పి.మధుకర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్లు రాణి, రజిత, అనూష, శిరీషా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. పారిశుధ్య నిర్వహణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీధర్, డీపీవో జగదీశ్వర్ ఉన్నారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు కరీంనగర్ మండలం ఎలబోతారం గ్రామంలో పర్యటించారు. చెత్తసేకరణ, పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. శనివారం జిల్లాలో ఎంపిక చేసిన మరో గ్రామంలో పర్యటించనున్నారు. జిల్లాలో 20 గ్రామాల్లో సర్వే జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలుండగా కేంద్రబృందం ఎంపిక చేసుకున్న 20 గ్రామాల్లో సర్వే చేస్తోంది. దాదాపు 20రోజుల పాటు ఆయా గ్రామాల్లో సర్వే కొనసాగుతుంది. సంబంధిత గ్రామాల అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పర్యటిస్తారు. గ్రామంలో 16నివాసా గృహాలను సందర్శించి యజమానుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. 16 నివాసాల్లో ఎస్సీ–3, ఎస్టీ–3, ఇతర కుటుంబాలు–8, స్థానిక అధికారులు నిర్ణయించిన ఇళ్లు–2 ఉంటాయి. ఆయా గ్రామాల్లో సర్వే పూర్తయిన అనంతరం కేంద్రానికి బృందం సభ్యులు నివేదిక అందిస్తారు. దీని ఆధారంగా జిల్లాకు స్కోర్, ర్యాంకు ప్రకటిస్తారు. మొత్తం1,000 మార్కుల విభజన ఇలా ● కేంద్ర బృందం నాలుగు రకాల అంశాలను విభజించి 1000 మార్కులు కేటాయిస్తోంది. సేవాస్థాయి పురోగతికి 240 మార్కులుంటాయి. ఘన, ద్రవ పదార్థాల నిర్వహణ, ఓడీఎఫ్ ప్లస్ ధ్రువీకరణ పత్రం, గ్రామసభ తీర్మాణం, ఆన్లైన్లో నమోదు చేసి ఉండాలి. ● గ్రామాల్లో స్వచ్ఛత స్థితి ప్రత్యక్ష పరిశీలనకు 540మార్కులు కేటాయించారు. ఇందులో మరుగుదొడ్ల వినియోగం, మల వ్యర్థాల నిర్వహణ, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత అంశాలున్నాయి. గ్రామస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్ల వినియోగం, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛతపై అవగాహన, గోడ చిత్రాలు, కరపత్రాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండాలి. ● వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ప్రత్యక్ష పరిశీలనకు 120 మార్కులు కేటాయించారు. దీనిలో ప్లాస్టిక్, మల వ్యర్థాల నిర్వహణకేంద్రం, కంపోస్టుషెడ్ నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం తదితర అంశాలున్నాయి. ● ప్రజాభిప్రాయ సేకరణకు 100 మార్కులున్నాయి. ఇళ్లలో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా లేవా, బహిరంగ మలవిసర్జన చేసే ప్రాంతాలున్నాయా, మరుగుదొడ్డి నుంచి వచ్చే మలాన్ని మురికికాలువల్లో కలుపుతున్నారా, ఘన వ్యర్ధాల రవాణాకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇంటింటి నుంచిచెత్త సేకరణ జరుగుతుందా లేదా, ఐదేళ్లలో గ్రామంలో పారిశుధ్య పరిస్థితుల్లో మార్పులేమైనా వచ్చాయా, లేదా, భవిష్యత్తులో కార్యక్రమాల నిర్వహణపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. కలెక్టర్ను కలిసిన కేంద్ర బృందం జిల్లాలోని 20 గ్రామాల్లో పర్యటన -
మొదటిసారి స్మార్త పరీక్షలు
వేద విద్యా పరంపరకు ప్రాచూర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో స్మార్తపరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నిర్వహిస్తోంది. నాలుగు వేదశాఖల ఆధారంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వేద విద్యార్థులు, గురువులు, పండితులు ఈ పరీక్షల కోసం వేములవాడకు విచ్చేశారు. – డాక్టర్ ముష్టివెంకటనాగశర్మ, తిరుపతి వేంకటేశ్వరస్వామి విశ్వవిద్యాలయం, స్మార్త విభాగం ఇన్చార్జి -
మాయమాటలు చెప్పి బంగారంతో ఉడాయించి
వీర్నపల్లి(సిరిసిల్ల): గుర్తుతెలియని బిచ్చగాడు మహిళకు మాయమాటలు చెప్పి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన వీర్నపల్లి మండలం అడవిపదిరలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన చింతల్ఠాణం లక్ష్మి శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఓ బిచ్చగాడు వచ్చి.. నీ కొడుకుకు ప్రాణగండం ఉందని భయభ్రాంతులకు గురిచేశాడు. అంతేకాకుండా ఇంట్లో నుంచి బియ్యం తీసుకొచ్చి ఇస్తే మంచిగా చేస్తానని నమ్మబలికాడు. భయాందోళనకు గురైన లక్ష్మి కొంత బియ్యాన్ని తీసుకొచ్చి ఆ బిచ్చగాడు చేతిలో పెట్టింది. అంతలోనే ఏదో ఏదో రసాయనంతో కూడుకున్న బొట్టును ఆమె నుదుట పెట్టడంతో.. బిచ్చగాడు ఏం చెబితే అది చేసింది. తన కూతురు పావుతులం బంగారాన్ని ఆ బియ్యంలో వేయమని, గంట తర్వాత ఆ బియ్యానిచూడాలని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. కొంత సమయం తర్వాత అనుమానం వచ్చిన లక్ష్మి ఆ బియ్యంలో బంగారం కోసం వెతకగా దొరక్కపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో కొత్త వారు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
వేదపరీక్షలు.. జ్ఞాన వేదికలు
వేములవాడ: ప్రాచీన భారతీయ విద్యా సంప్రదాయానికి జీవం పోసేలా వేదాల్లో నిపుణులైన పండితుల స్మార్త పరీక్షలు వేములవాడ రాజన్న క్షేత్రంలో రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పేర్కొన్నారు. శుక్రవారం నాలుగు వేదాలకు సంబంధించిన ఈ స్మార్తపరీక్షల కోసం దేశం నలుమూలల నుంచి వేదపండితులు, విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ శిష్టాచారాలను అనుసరించి, వేదభాష్యాలు, స్మృతిగ్రంథాలు, ధర్మశాస్త్ర అంశాల్లో శిక్షణ పొందిన వేదవిద్యార్థుల ప్రావీణ్యాన్ని పరీక్షించేలా ఈ కార్యక్రమం కొనసాగింది. వేద భాష్య పండితులు, అధ్యాపకులు సమగ్రంగా పరీక్షించి విద్యార్థుల విజ్ఞానాన్ని అంచనా వేస్తున్నారు. వేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో స్ఫూర్తిదాయక వేదికను రాజన్న ఆలయంలో ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలకు ప్రాచీన భారతీయ విజ్ఞాన సంపదను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని ఓపెన్స్లాబ్లో ఏర్పాటు చేసిన పరీక్షా మండపంలో వేదవిద్యార్థులు గురువుల సమక్షంలో తమ జ్ఞానాన్ని ప్రదర్శించారు. వేములవాడలో స్మార్తపరీక్షలు హాజరైన పండితులు, అభ్యర్థులు -
కూలీల ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● ముగ్గురికి తీవ్ర, ఆరుగురికి స్వల్పగాయాలుముత్తారం(మంథని): మండలంలోని మైదంబండ ప్రధాన రోడ్డుపై శుక్రవారం ప్రైవేట్ స్కూల్బస్సు కూలీల ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని కేసనపల్లికి చెందిన సిద్ధి ఉమా, సాగర్ల కీర్తన, కందుల అఖిల, కలవేన కోమల, కొండవేన ఉమ, మానస, మల్లేశ్వరి, చొప్పరి రాధ పోతారానికి చెందిన గాడిచర్ల శంకర్ ఆటోలో రామగిరి మండలం సెవెన్ ఎల్బీ గనిలో మొక్కలు నాటడానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో మైదంబండ వద్ద కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను రామగిరి మండలం సెంటనరీకాలనీలోని ప్రగతి హైస్కూల్కు చెందిన బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. బస్ డ్రైవర్ పరార్ అయ్యాడు. కూలీలు గాయలు కావడంతో స్థానికులు ప్రైవేటు వాహనాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ శంకర్, కూలీలు ఉమా, కీర్తనకు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్సై నరేశ్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లారీ ఢీకొని యువకుడు మృతి
ఓదెల: మండలంలోని మల్లికార్జునస్వామి ఆలయ సమీపంలో లారీ ఢీకొని రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు (40 ) మృతిచెందాడు. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు.. రాజు కావేరి సీడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓదెల నుంచి పెగడపల్లికి బైక్పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుడికి భార్య శీరిష, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. -
నకిలీ డ్రగ్స్ దందా!
● కరీంనగర్లో జోరుగా నకిలీ మందుల విక్రయాలు ● ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ ఏజెన్సీలు ● వేణు ఏజెన్సీ డీలర్షిప్ రద్దు చేసిన సన్ఫార్మా ● అధికారుల ఉదాసీనతతో పేట్రేగుతున్న మాఫియాకరీంనగర్టౌన్: కరీంనగర్ కేంద్రంగా డ్రగ్ మా ఫియా విచ్చలవిడిగా దందా సాగిస్తోంది. అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. బహిరంగంగానే నకిలీ మందులను రోగులకు అంటగడుతూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ మాఫియా అధి కారుల కళ్లుగప్పి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందులను తీసుకువచ్చి రిటైల్ వ్యాపారులకు ఇస్తూ రోగులు ప్రాణాపాయ స్థితికి వెళ్లేందుకు కారణమవుతున్నారు. ఈ మందులతో రోగా లు పోవడం దేవుడెరుగు కొత్త రోగాలు వస్తుండడం, ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మందులు నకిలీవో... అసలువో.. అవి రాస్తే ఏం జరుగుతుందో తెలియక డాక్టర్ల పరిస్థితి అగమ్యగోచంగా తయారవుతోంది. అధికారుల ఉదాసీనతతోనే డ్రగ్ మాఫియా పేట్రేగిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ కంపెనీ పేరుతో.. కరీంనగర్కు చెందిన వేణు మెడికల్ ఏజెన్సీస్ పక్షవాతం వచ్చిన పేషెంట్లకు వాడే లివిపిల్–500 మెడిసిన్ను ప్రముఖ సన్ఫార్మా కంపెనీ తయారు చేస్తుండగా, ఆ కంపెనీ నుంచి డీలర్షిప్ హక్కును పొందింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన సద రు ఏజెన్సీ నిర్వాహకులు సన్ ఫార్మా నుంచి మందులు తెప్పించకుండా అధిక కమిషన్ల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పిస్తున్నట్లు గత ఏప్రిల్ నెలలో డ్రగ్ అధికారుల విచారణలో తేలింది. ఈ విషయమై సన్ ఫార్మా కంపెనీకి సమాచారాన్ని అందించడంతో నకిలీదని కంపెనీ ల్యాబ్ రిపోర్టుతో కరీంనగర్ డ్రగ్ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్కు నివేదిక ఇచ్చారు. సన్ఫార్మా పంపిణీ చేసిన బ్యాచ్ నంబర్కు వేణు ఏజెన్సీలో ఉన్న మందులకు సంబంధం లేకపోకపోవడంతో నకిలీ మందులుగా గుర్తించి సన్ఫార్మా డీలర్షిప్ను రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. నకిలీ మందుల మూలాలపై దృష్టి వేణు ఏజెన్సీ ద్వారా సరఫరా అవుతున్న లివిపిల్–500 నకిలీ మెడిసిన్ ఎవరు సరఫరా చేస్తున్నారనే విషయమై డ్రగ్ కంట్రోల్ అఽథారిటీ ద్వారా ఆరా తీస్తున్నాం. నకిలీ మందులు తయారు చేసే వారితో పాటు వాటిని తెప్పించి విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మందుల సరఫరాపై ఉపేక్షించేది లేదు. – కార్తీక్ భరద్వాజ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ మందులు ఎక్కడెక్కడికి వెళ్లాయి పక్షవాతం వచ్చిన రోగులకు వాడే లివిపిల్–500 నకిలీ మందులను సరఫరా చేస్తున్న వేణు ఏజెన్సీ ఈ మందులను ఎక్కడెక్కడి రిటైల్ మందుల షాపులకు పంపిణీ చేసిందనే విషయంపై డ్రగ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక వేళ రోగులకు చేరితే రోగం తగ్గకపోగా మరింత ముదిరే ప్రమాదముండడంతో లివిపిల్–500 నకిలీ మెడిసిన్ నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్ అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడే తూతూ మంత్రంగా తని ఖీలు చేస్తుండడం, మిగతా సమయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. ఇది ఒక్క వేణు ఏజెన్సీకి సంబంధించన విషయమే. ఇలాంటి నకిలీ మందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలు నగరంలో ఉన్నాయని వాటిపై దృష్టిసారించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సీనియర్ సిటిజన్లే టార్గెట్
● రెచ్చిపోతున్న సైబర్నేరగాళ్లు ● సీబీఐ పేరుతో వీడియోకాల్స్ బెదిరింపులు ● యువతుల పేర్లతో సొమ్ము దోచుకుంటున్న వైనం ● భారీగా మోసపోతున్న బాధితులు‘మంచిర్యాల జిల్లా లక్షటిపేట్కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ను సైబర్నేరగాళ్లు భారీగా మోసం చేశారు. మీ అమ్మాయి ఓ కేసులో పట్టుబడిందని సీబీఐ పేరుతో వీడియోకాల్స్ చేసి సీబీఐ లోగోతో వార్ రూం సృష్టించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మీరు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లవద్దు. మీపై సీబీఐ నిఘా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ డ్రెస్లో కన్పించి నమ్మేలా చేశారు. భారీ మొత్తం అకౌంట్లో వేయాలని, లేకుంటే కుటుంబం మొత్తం కేసులో ఇరుక్కుంటారని చెప్పి రూ.1.70కోట్లు దండుకున్నారు. మొత్తం చెల్లించాక బాధితుడు మోసపోయామని గ్రహించి రామగుండం సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించారు’. ‘స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా లాభం వస్తుందని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ముందుగా రూ.10వేలు లాభం చూపించారు. తర్వాత వాట్సాప్లో లింక్లు ఇచ్చి దాన్ని క్లిక్ చేయమని లాభాలు చూపిస్తూ రూ.1.40కోట్ల వరకు మోసం చేశారు. తాను పెద్దమొత్తంలో మోసపోయాయని భావించి బాధితుడు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు’. గోదావరిఖని(రామగుండం): అమాయకత్వం, అత్యధిక డబ్బు సంపాదించాలనే ఆశ పెద్ద మొత్తంలో నష్టపోయేలా చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి లావాదేవీలు, ఇతర వ్యాపకాలను గమనించి వారి కుటుంబ సభ్యుల ఫొటోలు సేకరించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. రామగుండం సైబర్క్రైం పోలీస్స్టేషన్ పరిధిలోని లక్షట్టిపేట్కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ భారీగా నష్టపోయాడు. బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి శ్రీమీ అమ్మాయి ఓ కేసులో చిక్కుకుందని ఆమె ఫొటోలను వాట్సప్లో షేర్ చేసి వారం నుంచి నెలరోజుల పాటు సీబీఐ ఆఫీసర్ల మాదిరిగా వీడియోకాల్లో మాట్లాడుతూ, ఐపీఎస్ ఆఫీసర్ దుస్తుల్లో బెదిరించి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలాంటి కొత్తరకం సైబర్ మోసాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. వాట్సప్లో లింక్లు ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసి అందులో డబ్బులు వేయాలని సూచిస్తున్నారు. ముందుగా పెట్టిన పెట్టుబడికి రూ.10వేల వరకు లాభం చూపించి తర్వాత మోసానికి పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల సెల్ఫోన్ నంబర్లు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అలాగే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నారు. క్రిఫ్టోలో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తున్నాయని వారి అకౌంట్లో చిన్న పాటి లాభాలు చూపిస్తున్నారు. తర్వాత ఒక్కో వ్యక్తి నుంచి రూ.40లక్షల నుంచి రూ.2కోట్లవరకు మోసం చేశారు. దీంతో పాటు మ్యారేజ్బ్యూరో పేరుతో తాము పెళ్లికాని యువతిని అని పరిచయం చేసుకుని కొన్నాళ్లపాటు చాటింగ్ చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్యాప్ ఇచ్చి తాను విదేశాల్లో ఉన్నానని ఈ–మార్కెటింగ్ చేస్తున్నానని ఇందులో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశచూపిస్తున్నారు. వారి మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టి పెద్దమొత్తంలో మోసపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. డబ్బులు ఊరికేరావని గమనించాలి ఆన్లైన్లో డబ్బులు ఊరికే రావన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. ఆన్లైన్ లింక్లను క్లిక్చేసి మోసపోవద్దు. దీనివల్ల అకౌంట్ డిటేయిల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయి. ఇటీవల కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. ఢిల్లీ సీబీఐ ఆఫీసర్లమని చెప్పి వీడియో కాల్స్ ద్వారా బెదిరిస్తూ భారీగా సొమ్ము డిమాండ్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ప్రజలు భయపడి మోసపోవద్దు. ఏవైనా అనుమానాలుంటే వెంటనే సైబర్ క్రైం పోలీసులు లేదా 1930 నంబర్ను సంప్రదించాలి. – వెంకటరమణ, ఏసీపీ, సైబర్క్రైం, రామగుండం -
కూరగాయల సాగుకు అనువైన పరిస్థితులు
జగిత్యాలఅగ్రికల్చర్: కూరగాయల సాగుకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ జిల్లాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో గురువారం జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు, డ్రిప్ కంపెనీలు, ఆయిల్ పాం కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ రెండు జిల్లాల్లో ఎర్రనేలలు ఎక్కువగా ఉండటంతో కూరగాయలతోపాటు పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. మామిడి తోటలకు జగిత్యాల జిల్లా హబ్గా ఉన్నందున మామిడిలో దిగుబడి పెంచేలా కృషి చేయాలని కోరారు. రెండు జిల్లాల్లో అరటి తోటల విస్తీర్ణం పడిపోయిందని, ఆ వైపు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున.. వరి సాగు చేసే రైతుల దృష్టిని మరల్చేందుకు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రిప్ పరికరాలను సబ్సిడీపై మరింత ఎక్కువ మంది రైతులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఉద్యానశాఖ పథకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఉద్యానశాఖాధికారులు శ్యాంప్రసాద్, జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
స్తంభాలపై అల్లుకున్న ప్రమాదం
సిరిసిల్లఅర్బన్: ఇంటర్నెట్ వైర్లు.. డిష్వైర్లు కరెంట్ స్తంభాలపై వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో కరెంట్ స్తంభాలపై ప్రమాదకరంగా వివిధ రకాల తీగలు వెళ్తున్నాయి. విద్యుత్ స్తంభాలపై చిందరవందరగ వెళ్తుండడంతో షార్ట్సర్క్యూట్ జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా సెస్ అధికారులు కరెంటు స్తంభాలపై ఏర్పాటు చేసిన వైర్లను సరిచేసి జరుగకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రమాదాలు ఇలా.. ● జిల్లా కేంద్రంలోని గణేష్నగర్లో ఓ విద్యుత్ స్తంభంపై డిష్కేబుల్ వైర్లు, నెట్ కేబుల్వైర్లు, విద్యుత్తు వైర్లు తగిలి షార్ట్సర్కూట్తో విద్యుత్తు స్తంభంపై ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డిష్వైర్లతోనే షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ● గీతానగర్ స్కూల్ ప్రహరీని ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న మీటర్బాక్స్కు డిష్, ఇంటర్నెట్కు సంబంఽధించిన వైర్లు తగిలి షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగాయి. ● సిరిసిల్ల పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీ విద్యుత్ తీగలకు తగిలి మంటలు చెలరేగాయి. ● జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద గల ఎస్బీఐ బ్యాంకు ఎదుట గల ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై లూజువైర్లు తగిలి నిప్పురవ్వలు పడి ట్రాన్స్ఫార్మర్పై ఉన్న చెత్త,చెదారానికి అంటుకొని ఒక్కసారిగా మంటలు లేచాయి. ఇంటర్నెట్, డిష్కేబుళ్లతో షార్ట్సర్క్యూట్ చెలరేగుతున్న మంటలు భయాందోళనలో స్థానికులు పోల్ రెంటల్ చార్జీలు వసూలు చేస్తాం సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను కేబుల్ ఆపరేటర్లు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. తీగలను గుర్తించి వారి నుంచి ఎన్పీడీసీఎల్ నింబంధనల ప్రకారం పోల్ రెంటల్ చార్జీలను వసూలు చేయాలని 10 రోజుల క్రితమే నిర్ణయించాం. కేబుల్ ఆపరేటర్లతో కూడా చర్చించాం. విద్యుత్పోల్పై చిందరవందరగా వైర్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – రామసుబ్బారెడ్డి, సెస్ ఏడీఏ -
విశిష్ట సేవలకు అరుదైన గౌరవం
సిరిసిల్ల: మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపు.. వ్యాపారాల్లో రాణించేలా శిక్షణ.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేలా జావాబుదారీతనం పెంపొందించడంలో ఇల్లంతకుంట మండల సమాఖ్య కృషి ఎనలేనిది. ఏళ్లుగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల సమాఖ్య ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో ఈ అవార్డు అందుకోనుంది. ఈమేరకు గురువారం ఆహ్వానం అందింది. 46 వీవోలు.. 1103 సంఘాలు ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య పరిధిలో 46 విలేజ్ ఆర్గనైజేషన్(వీవో)లు ఉండగా 1,103 స్వయం సహాయక సంఘాలు 11వేలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ఆర్థికంగా అండగా.. నిలుస్తూ.. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తుంది. గత ఐదేళ్లకు పైగా స్వయం సహాయక సంఘాలకు(ఎస్హెచ్జీ)ల సభ్యులకు రుణాలు అందించడం వాటిని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించేలా చూడడం, సభ్యులకు బీమా కల్పించడం, వివిధ వ్యాపారాల్లో రాణించేలా నిరంతరం శిక్షణ, సలహాలు ఇస్తుంది. సామాజికంగా అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, నీటి వనరుల సంరక్షణ ప్లాస్టిక్ వినియోగించొద్దని, సైబర్ మోసాలకు గురి కావద్దని అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు జీవనోపాధి పెంచే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇల్లంతకుంట మండల సమాఖ్య చేస్తున్న సామాజిక, ఆర్థిక సేవలను గుర్తిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేశారు. 22 క్లస్టర్ లెవల్ ఫెడరేషన్లలో ఎంపిక దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందిస్తున్న మండల సమాఖ్యలకు అవార్డులు అందించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మండల సమాఖ్యల పనితీరును పరిశీలిస్తారు. దీన్దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మండల సమాఖ్యలను గుర్తించి ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డు–2024 ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు దేశవ్యాప్తంగా 22 మహిళా సంఘాలను ఎంపిక చేసింది. అవార్డులకు దేశంలోని ఆరు రీజియన్ల పరిధిలో 22 క్లస్టర్ లెవల్ ఫెడరేషన్లు(సీఎల్ఎఫ్)లు ఎంపికవగా.. సదరన్ రీజియన్ కింద రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య రెండో స్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద నిర్వహించే అవార్డుల ప్రదాన ఉత్సవానికి ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య బాధ్యులను ఆహ్వానించారు. ఈమేరకు ఢిల్లీకి వెళ్లి అవార్డును అందుకోనున్నారు. అభినందించిన కలెక్టర్ ఇల్లంతకుంట మండలం ఆదర్శ మహిళా సమాఖ్య ఉత్తమ సేవలందించి జాతీయస్థాయి అవార్డుకు ఎంపికవడంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా గురువారం అభినందనలు తెలిపారు. డీఆర్డీవో శేషాద్రి, మండల సమాఖ్య బాధ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇల్లంతకుంట మండల సమాఖ్యను ఆదర్శంగా తీసుకుని మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇల్లంతకుంట మండల సమాఖ్యకు జాతీయ అవార్డు ఆగస్టు 15న ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డు ప్రదానం అభినందించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
స్మార్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● హాజరైన తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామీ వేములవాడ: నాలుగు వేదాలు చదివే పాఠశాల వేములవాడలోనే ఉండటం, వేదపండితులకు జాతీయస్థాయిలో స్మార్థ పరీక్షలు రాజన్న సన్నిధిలో నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేదాలను ఇతర దేశాలు ఆచరిస్తున్నాయన్నారు. రాజన్న ఆశీస్సులతో ఆలయ విస్తరణ, అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చేస్తున్నారన్నారు. రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న స్మార్థ పరీక్షల ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. ఆలయాన్ని 4 ఎకరాల్లో విస్తరిస్తున్నామని, అభివృద్ధికి మొదటి దశలో రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు గోషాలలో వేములవాడలో ఒకటి ఉందన్నారు. సువిశాలమైన గోశాల నిర్మాణానికి 40 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ రాజన్న ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ప్రాచీన ప్రాముఖ్యత గల ఆలయమన్నారు. ఆలయ విస్తరణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ఈవో రాధాభాయి, అర్చకులు పూర్ణకుంభ కలశంతో ఘనస్వాగతం పలికారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
గంగాధర: కరీంనగర్– జగిత్యాల ప్రధా న రహదారిలో గతనెల 30న ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆయన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వేముల రవి(42) గత నెల 30న తన తమ్ముడు, కొడుకుతో కలిసి కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మధురానగర్ శివారులో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. బైక్పై ఉన్న ముగ్గురు కింద పడగా వెనుకాల కూర్చున్న వేముల రవికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వేముల లచ్చయ్య ఫిర్యాదుతో బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. గడ్డి మందు తాగి వివాహిత..ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తిప్పాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఐశ్వర్య అలియాస్ శైలజ బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐశ్వర్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం మరణించింది. మృతురాలికి భర్త లక్ష్మణ్, కొడుకు ఆర్యన్(2) ఉన్నారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరితనం భరించలేక ఆత్మహత్యఇల్లంతకుంట(మానకొండూర్): ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బుధవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లంతకుంట ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని గాలిపల్లికి చెందిన దండు శ్రీనివాస్(40) గత పదమూడేళ్లుగా చీర్లవంచలోని తన అక్క వద్ద ఉంటున్నాడు. ఒంటరితనంతో ఏమి చేయాలో తోచక రెండు రోజుల క్రితం తన స్వగ్రామం గాలిపల్లిలో ఉన్న తన అన్న ఎల్ల య్య ఇంటికి వచ్చాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని అన్న ఎల్లయ్య ఫిర్యాదుతో ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వివాహిత..ధర్మపురి: ఇంట్లో జరిగిన చిన్న గొడవకు మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన సమ్మయ్యతో బోయినపల్లి మండలం విలాసాగర్కు చెందిన శ్రీవాణితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు అజయ్, కూతురు అక్షిత ఉన్నారు. సమయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో తన పిల్లలతో గొడవ పడింది. క్షణికావేశంలో ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకుంది. పిల్లలు కొద్దిసేపటికి గమనించి గట్టిగా అరవడంతో ఇంటి పక్కనున్న బంధువులు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి శ్రీవాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీవాణి తండ్రి సంపంగి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జల్సాల కోసం చోరీలు
● పోలీసులకు చిక్కిన ముఠా ● వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ పెద్దపల్లిరూరల్: జల్సాగా జీవితం గడిపేందుకు సులువుగా సొమ్ము సంపాదించాలని చోరీలకు పాల్పడిన సద్దాం అలీతో పాటు అతడికి సహకరించిన అన్న అన్వర్ అలీ, తల్లి సలీమా, బంధువు మహమ్మద్ సలాంపై కేసు నమోదు చేశామని ఏసీపీ కృష్ణ తెలిపారు. నిందితుడి తల్లి సలీమా పరారీలో ఉండగా సద్దాం, అన్వర్, సలాంను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. గురువారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన సద్దాం అలీ 25 మే 2025 రోజున పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్లో నివాసముండే కొట్టె శ్రీవిద్య ఇంట్లోకి చొరబడి 58 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,260 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.30వేల నగదు ఎత్తుకెళ్లాడు. అదే రోజున గండు అనూష ఇంట్లో 8గ్రాముల బంగారు, 300 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.10వేల నగదు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంగా ఏర్పడి పెద్దపల్లితో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు గాలిస్తున్నారని గ్రహించిన సద్దాం, అతడి తల్లి, సోదరుడు మంచిర్యాలకు మకాం మార్చారు. దొంగిలించిన సొత్తును మంచిర్యాలకు చెందిన బంధువు మహమ్మద్ సలాం సాయంతో అమ్మేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. పరారీలో ఉన్న నిందితుడి తల్లి సలీమా కోసం గాలిస్తున్నట్టు ఏసీపీ పేర్కొన్నారు. చాకచక్యంగా దొంగలముఠాను పట్టుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, మల్లేశ్, రమేశ్, నరేశ్కుమార్, సనత్రెడ్డి, ఏఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్ ప్రభాకర్, రాజు, శరత్, వెంకటేశ్, శ్రీనివాస్, అనిల్ సతీశ్ను డీసీపీ కరుణాకర్, ఏసీపీ అభినందించారు. -
కూలీగా మారిన కళాకారుడు
జూలపల్లి(పెద్దపల్లి): తెలంగాణ ఉద్యమంలో ఆటాపాటలతో ఉద్యమకారులను ఉర్రూతలూగించిన కోనరావుపేటకు చెందిన కళాకారుడు మల్లారపు అనిల్ ఉపాధి కరువై కూలీగా మారాడు. మిలియన్ మార్చ్లోనూ కాళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రత్యేక వేతనంతో కళాకారులను నియమించగా.. ఇందులో అనిల్కు స్థానం లభించలేదు. సంక్షేమ పథకాల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో అప్పటి కలెక్టర్ శ్రీదేవసేన ప్రశంసాపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు, సంక్షేమ పథకాల ప్రచారంలో తనదైన ముద్ర వేస్తున్న అనిల్కు సాంస్కృతిక శాఖ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంటర్వ్యూకు పిలిచినా.. కొందరు ఉద్యమ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక ఉద్యోగావకాశాలు కల్పించింది. కానీ, అనిల్కు అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 జనవరి 13న ఇంటర్వ్యూలకు పిలిచి, పాటలు పాడించింది. ఆ తర్వాత కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పటికై నా తనకు ప్రోత్సాహం అందించాలని అనిల్ కోరుతున్నాడు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన దరిమిలా.. ప్రభుత్వం వేలాది మంది లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు విడుదల చేయగానే.. ఇంటి నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం... ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. అందులోనూ కట్రౌతు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, స్టీలు టన్నుకు రూ.2000, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం రూ.200 చొప్పున ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికాదు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపైనా తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు ధరాభారం పడుతోంది. సిమెంట్ ధరలు పెరుగుతాయని అని ప్రచారం ఊపందుకుంది. దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది.జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 2,04,504 8,219 8,219 742 129 జగిత్యాల 1,99,965 7,601 7,601 209 30 పెద్దపల్లి 1,63,000 9,421 6,018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7,826 7,826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1,810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2,700 రూ. 3,900 రూ.1,200 కంకర(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 ఐరన్(టన్ను) రూ. 55,000 రూ. 57,000 రూ. 2,000 ఇసుక(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 మొరం(ట్రిప్పు) రూ. 1,000 రూ. 1,200 రూ. 200 -
విపత్తులో ‘ఆపద మిత్ర’ ముందుండాలి
కరీంనగర్ అర్బన్: ప్రకతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో ప్రజలను రక్షించేందుకు ‘ఆపద మిత్ర’ వలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్సీసీ వలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం బీసీ స్టడీ సర్కిల్లో ఆమె ప్రారంభించారు. అవగాహన లేకపోవడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎదుర్కునేందుకు మొదటిదఫాలో గ్రామాల్లో, పట్టణాల్లో పని చేసే ప్రభుత్వరంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలిపారు. రెండో విడతలో డిగ్రీ, ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫైర్, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ, సైబర్ తదితర అధికా రుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క కాటు, అగ్నిప్రమా దం, సీపీఆర్, షాట్ సర్క్యూట్, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణను ఇవ్వనున్నామని అన్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు శిక్షణ తీసుకున్న వారు ప్రమాదాల నివారణకు ముందుంటారన్నా రు. నైపుణ్యాలతో కూడిన శిక్షణతో తమను రక్షించుకోవడంతో పాటు పదిమంది ప్రాణాలు కాపాడగలరని పేర్కొన్నారు. శిక్షణకు హాజరైన వారు నేర్చుకున్న నైపుణ్యాలను, మెలకువలను మరో పదిమందికి నేర్పించాలని సూచించారు. ఆపద ఎప్పుడైనా రావొచ్చని.. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. డీఆర్వో వెంకటేశ్వ ర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను త్వరగా పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో చేపట్టిన 34 ప్రాజెక్టుల పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిజిటల్ లైబ్రరీ భవనం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనం, బాలసదన్ భవనంతో పాటు ఇతర పనులను వేగవంతం చేయాలన్నారు. పూర్తయిన ప్రాజెక్టుల్లో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈలు లచ్చిరెడ్డి, ఓంప్రకాశ్, అయ్యూబ్ ఖాన్, ఏఈలు సతీశ్, గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అక్రమాలపై విచారణ జరిపించాలి● సుడా చైర్మన్ నరేందర్రెడ్డి కరీంనగర్కార్పొరేషన్: నగరంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పేరిట గత పాలకులు పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంచనాలు పెంచి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, చేసిన పనుల్లోనూ నాణ్యత లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ తాజ్, కట్ల సతీశ్, చర్ల పద్మ, కొరివి అరుణ్కుమార్, శ్రవణ్నాయక్, దన్నాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ల పరిశీలనకరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం గురువారం స్లాట్ బుక్ చేసుకున్న 626 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డి.శోభారాణి తెలిపారు. మూడో రోజు ఎప్సెట్ కౌన్సెలింగ్ సజావుగా సాగినట్లు ఆమె వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బహిరంగప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బహిరంగ మద్యసేవనంపై ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌస్ఆలం ప్రకటించారు. దీంతో పాటు డీజేలపై, డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత ఏసీ పీల నుంచి అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడని సూచించారు. విద్యాసంస్థల బంద్ విజయవంతం కరీంనగర్: పెండింగ్లో ఉన్న ఫీజుబకాయిలు, స్కాలర్షిప్ విడుదల చేయాలని జార్జ్రెడ్డి పీడీఎస్యూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన డిగ్రీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కోర్సు విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్ తెలిపారు. నాలుగేళ్ల నుంచి విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రూ.8వేల కోట్ల ఫీజుబకాయిలు పెండింగ్లో ఉంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. విద్యార్థులు పైచదువులకు వెళ్లాలంటే వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా యా జమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నరేశ్, రత్న, ప్రకాశ్, రవీందర్, నాగరాజు, సు ధాకర్, సందీప్, రాకేశ్, శ్రీమాన్ పాల్గొన్నారు. -
ఎకరాకు ఒకటే బస్తా
● యూరియాపై నియంత్రణ ● బ్లాక్మార్కెట్కు తరలకుండా చర్యలు ● ఏడీఏలకు పర్యవేక్షణ బాధ్యతలు ● ఆందోళనలో జిల్లా రైతులుకరీంనగర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం యూరియా వినియోగం తగ్గించడంతోపాటు బ్లాక్మార్కెట్కు తరలిపోకుండా చర్యలు చేపట్టింది. రైతులు విచ్చలవిడిగా పంట పొలాల్లో యూరియాను వాడడంతో పలు సమస్యలేర్పడుతున్నాయి. దిగుబడి పెంచేందుకు ఉపయోగిస్తున్న యూరియా పంటల ఉత్పత్తులపై ప్రభావం చూపుతోంది. యూరియా వాడకం తగ్గించాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పరిస్థితి మారలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం యూరియా వాడకం తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది. ఈ వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు ఒకటే బస్తాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకటి కన్నా ఎక్కువ బస్తాలు పంపిణీ చేస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఏడీఏలకు పర్యవేక్షణ బాధ్యత జిల్లాలో యూరియా అమ్మకాలను పర్యవేక్షించే బాధ్యతను నలుగురు ఏడీఏలకు అప్పగించారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి ఏడీఏల ఆధ్వర్యంలో నాలుగు తనీఖీ బృందాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ డివిజన్లో చొప్పదండి ఏడీఏ, హుజూరాబాద్లో మానకొండూరు ఏడీఏ, మానకొండూరులో హుజురాబాద్ ఏడీఏ, చొప్పదండిలో కరీంనగర్ ఏడీఏకు తనిఖీ బాధ్యతలు అప్పగించారు. వీరు సంబంధిత ఏవోలతో కలిసి ఆయా డివిజన్లలోని ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజు తనిఖీ చేస్తున్నారు. ఈ పాస్ మెషిన్లు పరిశీలించి ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలిస్తున్నారు. ఇటీవల కరీంనగర్రూరల్ మండల పరిధిలోని డీలరు ఓ రైతుకు ఒకే పట్టాదారు పాసుపుస్తకంపై 50 బస్తాలను అమ్మినట్లు అధికారులు గుర్తించారు. తనకు సమాచారం లేకపోవడంతో యూరియా అమ్మానని, మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటానని సదరు డీలరు చెప్పడంతో అధికారులు విడిచిపెట్టారు. పక్కదారి పట్టకుండా ఉండేందుకే యూరియా బ్లాక్మార్కెట్కు తరలకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు పంటల దిగుబడి పెంచేందుకు యూరియాను వినియోగిస్తుండగా అక్రమార్కులు పౌల్ట్రీ, డెయిరీ ఫామ్స్ల్లో ఉపయోగిస్తున్నారు. యూరియాతో లిక్కర్ తయారు చేసే అవకాశముండటంతో కంపెనీల యాజమాన్యాలు అడ్డదారిలో సేకరిస్తున్నాయి. కొంతమంది దళారులు రైతులు పేరిట యూరియాను పెద్దమొత్తంలో సేకరించి బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎకరాకు ఒటే బస్తా ఇవ్వాలనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. ఎకరానికి ఒక బస్తా సరిపోదని, కనీసం రెండు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు. -
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
జమ్మికుంట: పట్టణంలోని ఆర్వోబీ కింద స్థలాల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ రెండోరోజు కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ ఎండీ.అయాజ్ ఆధ్వర్యంలో పలు దుకాణాలను, టేలాలను తొలగించారు. జమ్మికుంట పట్టణం వ్యాపారకేంద్రంగా కొనసాగుతోందని, చుట్టు పక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిపోతుంటారని కమిషనర్ తెలిపారు. వారి వాహనాలను నిలిపేందుకు ఆర్వోబీ కింద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిజమైన చిరువ్యాపారులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, టీపీవో శ్రీధర్, టీపీటీవో దీపిక, శానిటరీ ఇన్స్స్పెక్టర్ మహేశ్, సదానందం, ఏఈ నరేశ్, ఆర్ఐ భాస్కర్, ఎన్వీరాల్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్రూరల్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. ఎస్ఐ లక్ష్మారెడ్డి విచారణ జరపగా.. కరీంనగర్కు చెందిన మర్రి దీక్షిత్, సిద్ధార్థ, శశిధర్గా గుర్తించారు. ఎస్ఐ ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా.. గంజాయి ప్యాకెట్లు లభించాయి. రూరల్ స్టేషన్కు ముగ్గురు యువకులను తరలించి విచారణ చేపట్టారు. మర్రి దీక్షిత్ కొంతకాలంగా ఆంధ్రా నుంచి గంజాయి అక్రమంగా తెప్పిస్తూ ఇతరులకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు యువకుల నుంచి ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
కొడిమ్యాల/మల్యాల: వారిద్దరూ స్నేహితులు. ఒకరు ముంబయిలో ఉంటూ వంట పనులకు వెళ్తున్నాడు. మరొకరు స్థానికంగా ఉంటూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ముంబయి నుంచి స్నేహితుడు రావడంతో ఇద్దరూ కలిసి బైక్పై వేములవాడ వెళ్లేందుకు బయల్దేరారు. ఇంతలోనే వారిని విధి వెక్కిరించింది. బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది. మృతులిద్దరిది మల్యాల మండలకేంద్రం. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ సోమయ్య, లత దంపతుల కుమారుడు గణేశ్.. దయాల మల్లేశం కుమారుడు రాజ్కుమార్ స్నేహితులు. గణేశ్ తండ్రి సోమయ్య ఇరవై ఏళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి లత గణేశ్ను పోషిస్తుండగా ఆయన ఆమెకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రాజ్కుమార్ తల్లి గతంలోనే చనిపోయింది. మల్లేశం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రాజ్కుమార్ కొన్నాళ్లుగా ముంబయిలో ఉంటూ అక్కడే వంట పనులకు వెళ్తున్నాడు. ఓ కేసు నిమిత్తం రాజ్కుమార్ రెండు రోజుల క్రితం మల్యాలకు వచ్చాడు. స్నేహితుడైన గణేశ్తో సరదాగా గడిపారు. గణేశ్ మంగళవారం పులి వేషంవేసి వేశాడు. బుధవారం ఇద్దరూ కలిసి వేములవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండలం నల్లగొండ శివారుకు చేరుకోగానే వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో దయ్యాల రాజ్ కుమార్ (25), జడ గణేశ్ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు కొడిమ్యాల పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. స్నేహితులిద్దరూ ఒకేసారి ప్రాణాలు విడవడంతో మల్యాలలో విషాదం చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు
ఫెర్టీలైజర్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమినగర్ రైల్వేగేట్ వద్ద ఇద్దరు యువకులను లోకో పైలెట్లు కాపాడారు. మూసి ఉన్న రైలు గేట్ దాటేందుకు యువకులు ప్రయత్నం చేయగా.. స్కూటీ పట్టాల కంకరలో కూరుకుపోయింది. అప్పటికే సింగరేణి బొగ్గులోడ్తో గూడ్స్రైలు వేగంగా దూసుకు వస్తోంది. అయితే, ట్రాక్పై ఉన్న యువకులను గుర్తించిన లోకో పైలెట్ సీహెచ్ రవి, అసిస్టెంట్ లోకో పైలెట్ దీపక్ కుమార్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును ఆపారు. దీంతో గేట్ వద్ద ఉన్నవారు ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సాయంతో ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టేశారు. ప్రమాదం జరగకుండా చాకచక్యంగా వ్యవహరించిన లోకో పైలెట్లను స్థానికులు అభినందించారు. -
యువకుడు అదృశ్యం
కరీంనగర్క్రైం: నగరంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన ఒక యువకుడు అదృశ్యమైనట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన మర్రిబోయిన అనిల్(25) గత నెల 26న బయటకు వెళ్లివస్తానని చెప్పి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతికోరుట్లరూరల్: పట్టణ శివారు అయోధ్యపట్నం ప్రాంతానికి చెందిన కొరిమె లక్ష్మణ్ (57) గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన భార్య రాజవ్వ జాతీయ రహదారి పక్కన స్వీట్కార్న్ విక్రయిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇంటికి వస్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం లక్ష్మణ్ను ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలు ఇంట్లో చోరీజమ్మికుంటరూరల్: జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. సైదాబాద్ గ్రామానికి చెందిన వేముల సత్యనారాయణ బుధవారం జమ్మికుంట వెళ్లాడు. అతని భార్య సుజాత ఇంటికి తాళంవేసి వనభోజనాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని రెండు తులాల బంగారం, 12తులాల వెండి, రూ.26వేల నగదు అపహరణకు గురయ్యాయి. టౌన్ సీఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. స్వగ్రామానికి చేరిన మృతదేహంజగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన రేవెళ్ల రవీందర్ (57) ఇటీవల గుండెపోటుతో ఇజ్రాయిల్లో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
దేహదానానికి ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం
సిరిసిల్లకల్చరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ కుటుంబం దేహదానానికి అంగీకరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తమ దేహాలను ఇచ్చేందుకు అంగీకరిస్తూ అర్జీ పెట్టుకున్నారు. అభ్యర్థనను అంగీకరిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ బుధవారం సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్ రఘునందన్తోపాటు అతని సతీమణి, తండ్రిని సైతం దేహదానానికి ఒప్పించారు. జిల్లాలో దేహదానానికి ముందుకొచ్చిన మొదటి వ్యక్తి ప్రిన్సిపాల్ విజయ రఘునందన్. అతనితోపాటు తన కుటుంబంలోని మరో ఇద్దరిని ఒప్పించడం అభినందించాల్సిన విషయం. మెడికల్ కాలేజీకి ఇచ్చేందుకు అంగీకారం -
ఆరునెలల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
కాల్వ శ్రీరాంపూర్(పెద్దపల్లి): ఇద్దరు అన్నదమ్మలు ఏడాది వ్యవధిలోనే వేర్వేరు కారణాలతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన తూండ్ల రాజు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో పది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది వ్యవధిలోనే ఇద్దరు కుమారులు వేర్వేరు కారణాలతో మృతిచెందడంతో తల్లిదండ్రులు దేవమ్మ –మధునయ్య కన్నీటి పర్యంతమయ్యారు. దినసరి కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు.. వచ్చే ఆదాయంతోనే ఇద్దరు కుమారులను పెంచి పోషించి ప్రయోజకులను చేశారు. మలిదశలో తమ బాగోగు చూస్తారనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడం తల్లిదండ్రులకు శోకం మిగిల్చినట్లయ్యింది. కాగా, రాజుకు భార్య రేవతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు కాల్వశ్రీరాంపూర్లో విషాదం -
రైల్వే సేవలన్నీ ఒకేయాప్లో..
● ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రైల్వన్ యాప్ రామగుండం: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకేయాప్ను డిజైన్ చేసిన రైల్వే.. ఈనెల ఒకటో తేదీన అమలులోకి తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొచ్చిన ఈయాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సెస్ చేసే వీలుంటుంది. ప్రయాణికులకు అందే సేవలు.. ● టికెట్ బుకింగ్, రిజర్వ్డ్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ల బుకింగ్ ● ప్లాన్ మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులు, కోటాలో టికెట్ల బుకింగ్ ● అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం... ● రైలు స్థితి, ప్లాట్ఫారం నంబర్, ఆలస్యం తదితర వివరాలు ● కోచ్ పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్ రిఫండ్.. ● ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్థితిగతులు.. టికెట్ పీఎన్ఆర్ నంబర్ ద్వారా సీటు కన్షర్మేషన్ స్టేటస్.. రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్డరింగ్.. ● ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం.. రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడం యాప్ను ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ● అండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. https://play.google.com/store/apps/details?=org.cris.aikyam IOS యాపిల్ యాప్ స్టోర్ నుంచి అయితే.. https://apps.apple.com/in/app/railone/id6473384334ఉపయోగించే విధానం.. ● యాప్ను డౌన్లోడ్ చేశాక రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి ● కొత్త వినియోగదారులు మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా రిజిష్టర్ చేసుకోవాలి ● mPI N లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ చేయవచ్చు. ● ‘ప్లాన్ మై జర్నీ’ లేదా ‘మై బుకింగ్స్’ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. ● ఒకేయాప్లో ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు ● బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజీలు ఆదా చేసుకోవచ్చు ● సరళమైన ఇంటర్సేఫ్, సింగిల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం ● డిసెంబర్ 2025 నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్ బుకింగ్స్, 40 లక్షల ఎంకై ్వరీలను నిర్వహించగల సామర్ధ్యం. -
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
గోదావరిఖని: కాళేశ్వరం జోన్స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరంజోన్లోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కోరుట్లరూరల్: అనారోగ్యంతో బాధపడుతూ.. కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన మైలారం గోపాల్ (53) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ యూ సుఫ్నగర్ పంచాయతీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవలే గుండెకు స్టంట్ వేశారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఊరు శివారులో ఉరేసుకున్నాడు. అటువైపు వెళ్లిన వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చా రు. గోపాల్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య గౌతమి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పురుగుల మందు తాగి వలసజీవి.. ధర్మపురి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వలస జీవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం తీగలధర్మారానికి చెందిన అలకుంట రాజశేఖర్కు ఎనిమిదేళ్ల క్రితం పట్టణానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వారికి ఓ కుమారుడు సంతానం. రాజశేఖర్ కొన్నాళ్లుగా దుబాయి వెళ్లి వస్తున్నాడు. జ్యోతి పుట్టింటి వద్ద ఉంటోంది. స్వగ్రామంలోనే కలిసి ఉందామని, త్వరగా ఇంటికి రావాలని జ్యోతి రాజశేఖర్ను పలుమార్లు ఫోన్లో కోరుతోంది. ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం రాజ శేఖర్ స్వగ్రామానికి వచ్చాడు. నెల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోగా.. జ్యోతి పుట్టింటికి వెల్లింది. కాపురానికి రావాలని రాజశేఖర్ పలుమార్లు కోరినా ఆమె నిరాకరించింది. మనస్తాపానికి గురైన రాజశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగాడు. బంధువులు జగి త్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని పోలీ సులు తెలిపారు. మృతుడి తల్లి శంకరమ్మ ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కట్టలేదని భార్య..జూలపల్లి(పెద్దపల్లి): ఇల్లు కట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మెండె రజిత(35) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. జూలపల్లికి చెందిన మెండె రజిత – చిన్నరాజయ్య భార్యాభర్తలు. తాము నివాసం ఉండే ఇల్లు పాతది కావడంతో కొత్తది నిర్మించాలని కొంతకాలంగా రజిత తన భర్తను కోరుతూ వస్తోంది. ఆయన ఎంతకూ ఆమె మాట వినలేదు. కొత్త ఇల్లు కట్టలేదు. మనస్తాపం చెందిన ఆమె.. జూన్ 26న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రుద్రంగి గుట్టల్లో మృతదేహం? రుద్రంగి(వేములవాడ): హాస్టల్ వెనుక మా మిడితోట పక్కన గల అడవిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహం కోసం పోలీసులు గుట్టల్లో గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై రుద్రంగి ఎస్సై శ్రీనివాస్ను వివరణ కోరగా గొర్లకాపరులు చూసి గ్రామస్తులకు చెప్పడంతో ఈ చర్చ మొదలైనట్లు తెలిపారు. అనుమానిత స్థలంలో గాలించినట్లు పేర్కొన్నారు. మృతదేహం దొరకలేదని, గురువారం సైతం గాలిస్తామని చెప్పారు. -
వరదకు దారేది?
● కబ్జా కోరల్లో మత్తడి కాల్వలు ● నిర్జీవమైపోతున్న సిరిసిల్ల చెరువులు ● జలవనరులనూ వదలని కబ్జాదారులు ● పరాధీనంలో రూ.కోట్లు విలువైన ఆస్తులు ● పట్టింపులేని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సిరిసిల్లటౌన్: కబ్జాకు కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. అధికారుల పట్టింపులేమి తనం అక్రమార్కులకు కలసొస్తుంది. సిరిసిల్లలో నిబంధనలను అతిక్రమించి మత్తడికాల్వలు కబ్జాకు గురయ్యాయి. పట్టణ నడిబొడ్డున పారే చెరువుల మత్తడి(వ్యవసాయ) కాలువలు ఇప్పుడూ పరాధీనమయ్యాయి. సంబంధిత శాఖలు అటువైపు చూడకపోవడంతో చెరువులు జీవం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఏళ్ల తరబడిగా చెరువుల కాల్వలు(నాలాలు) దురాక్రమణ పాలైన తీరుపై సాక్షి ప్రత్యేక కథనం. ● సిరిసిల్ల చుట్టూ గొలుసు చెరువులు పూర్వీకులు వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం సిరిసిల్ల చుట్టూ తొమ్మిది చెరువులు గొలుసుకట్టు పద్ధతిలో నిర్మించారు. వర్షాలతో ఒక చెరువు నిండాక దాని కింద చెరువుకు నీరుపోయేలా తవ్వించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఇందులో రాయినిచెరువు, తుమ్మలకుంటలను నివాస స్థలాలుగా అభివృద్ధి చేయగా వాటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పట్టణానికి ఇరువైపులా ఉన్న కొత్తచెరువు, కార్గిల్లేక్ చెరువులు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి నీటిపారుదల, మున్సిపల్శాఖల ఆధీనంలో ఉన్నాయి. అర్జున్కుంట, ఈదులచెరువు, దేవునికుంట, మైసమ్మకుంట, దామెరకుంట రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్నాయి. కొత్తచెరువు, కార్గిల్లేక్ స్థలాలు, మత్తడికాల్వలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారు. కానీ చర్యలు తీసుకోవడంలో కినుక వహించడం విమర్శలకు తావిస్తోంది. ● నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఒకప్పుడు ఊరి శివారులో ఉండే రాయినిచెరువు, తుమ్మలకుంట స్థలాల్లో పట్టణం విస్తరించింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకే వరద పోటెత్తుతోంది. పై నుంచి వచ్చే వరదనీరు ఆయా ప్రాంతాల్లో నిలువకుండా వరదకాల్వలు లేకపోవడంతో వర్షాకాలంలో ముంపుకు గురువుతున్నాయి. ఇక చెరువుకట్టలను ఆనుకుని ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదన్న నిబంధనలకు భిన్నంగా పరిస్థితి ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈదులచెరువు, అర్జునకుంట, దేవునికుంట, మైసమ్మకుంట, దామరకుంటలను రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొత్తచెరువు, కార్గిల్లేక్ల కాల్వలు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ లెవల్ స్థలాలు కబ్జాకు గురవడంపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల చెరువులు, కాల్వలకు 30 ఫీట్ల దూరంలోపే నిర్మాణాలు జరుగుతున్నాయని వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ● కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కార్గిల్లేక్, రాయినిచెరువు, తుమ్మలకుంట, కొత్తచెరువుల మత్తడికాల్వలు అన్యాక్రాంతమయ్యాయి. వీటి విలువు వందల కోట్లలోనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. ఒక్కో కాలువ 33 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ల పొడవుగా ఉండేవాటి విస్తీర్ణం వందల ఎకరాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పట్టణంలో సగటున గజానికి రూ.30వేలకు తక్కువ లేదు. అందుకే అక్రమార్కులు అధికారులను మచ్చిక చేసుకుని తతంగం నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కాల్వల నుంచి గొలుసుకట్టు దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను కూడా అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్లలో చెరువుల వివరాలు చెరువు సర్వేనంబర్ విస్తీర్ణం కాలువ (ఎకరాల్లో) (కి.మీ) కొత్తచెరువు 1471 85.05 4 రాయినిచెరువు 703 152.10 3 ఈదులచెరువు 991 77.29 1.5 అర్జునకుంట 757 22.36 1 దేవునికుంట 1121 9.28 1.5 మైసమ్మకుంట 1294 11.02 1 దామరకుంట 232, 233 7.38 2 తుమ్మలకుంట 142, 143 29.23 2 వర్ధనికుంట – – – కాల్వను సరిగ్గా నిర్మించలేదు వెంకంపేట, పద్మనగర్ ప్రాంతాలు లోతట్టుగా ఉంటాయి. వర్షాలు పడితే బోనాల తదితర చెరువుల నుంచి మత్తడికాల్వలు సిరిసిల్లకు ప్రవహిస్తాయి. పైనుంచి వచ్చే వరదనీరు వెళ్లేందుకు బస్టాండు ప్రాంతంలో కాల్వ నిర్మించినా లాభం లేదు. పెద్దవర్షం పడితే చాలు నాలాలు నిండి నీరంతా షాపుల్లోకి, రోడ్డుపైకి వస్తుంది. ఏళ్లసంది సమస్యను ఇప్పుడైనా పరిష్కరించాలి. – చిక్కుడు శ్రీనివాస్, వెంకంపేట -
జగిత్యాలలో కాసం ఫ్యాషన్స్ ప్రారంభం
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 18వ స్టోర్ను సినీ నటి, యాంకర్ అనసూయ ప్రారంభించారు. ఆధునాతన కలెక్షన్స్తో నిత్యం నూతన వైరెటీలతో కాసం పేరుగాంచిందని తెలిపారు. జగిత్యాలలో ఈ స్టోర్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇది జగిత్యాల జిల్లావాసులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నిర్వాహకులు మల్లికార్జున్, కేదరినాథ్, శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 18 స్టోర్లను ప్రారంభించామన్నారు. షాపింగ్మాల్ ఎదుట సందడి యాంకర్ అనసూయ జగిత్యాలకు రావడంతో షాపింగ్మాల్వద్ద సందడి నెలకొంది. అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో షాపింగ్ మాల్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఆటపాటలతో సందడి చేసిన అనసూయ -
ఇందిరమ్మకు బలం లేదని..
● ముందుకు సాగని ఇళ్ల గ్రౌండింగ్ ● ముహూర్తాల కోసం ఆగుతున్న లబ్ధిదారులు ● ఇళ్ల నిర్మాణం కోసం అధికారుల ఒత్తిడిచొప్పదండి: ‘నా పేరు మీద బలం లేదట సార్. ఈ నెలాఖరుకు శ్రావణం వస్తుంది. అప్పుడే ఇళ్లు మొదలుపెడుతా. నాలుగు రోజులు ఓపిక పట్టండి సార్’.. అంటూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అధికారులను వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మార్కింగ్ ప్రక్రియ వేగం పుంజుకున్నా.. ఆశించినస్థాయిలో గ్రౌండింగ్ కావడం లేదు. నలుబై రోజుల క్రితమే ప్రొసీడింగ్లు అందించే ప్రక్రియ చేపట్టినా ఇంకా బేసిమెంట్స్థాయికి నిర్మాణాలు చేరడం లేదు. ముహూర్తాలు లేవని.. ఇంటి నిర్మాణానికి ముహూర్తాలు చూడటం సాధారణ విషయమే. మే నెలాఖరులో ప్రొసీడింగ్ అందించే ప్రక్రియ చేపట్టడంతో జూన్ మొదటివారంలో చాలా మంది లబ్ధిదారులు ముగ్గుపోసి మార్కింగ్ ప్రక్రియ ప్రారంభించారు. నెలరోజుల్లో జిల్లావ్యాప్తంగా 8,219 మందిలో 62శాతం మంది మార్కింగ్ పూర్తి చేశారు. మరో మూడు వేల మంది ప్రస్తుతం ఆషాఢం కావడంతో ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా మానకొండూరు మండలానికి 852 ఇల్లు మంజూరు చేశారు. 423 ఇళ్లకు ముగ్గుపోశారు. బేసిమెంట్ లెవల్, రూఫ్ లెవల్, స్లాబల్ లెవల్లో 30 ఇండ్లే ఉండటం గమనార్హం. చొప్పదండి పట్టణంలో 110మందిని ఎంపిక చేయగా.. 84మంది మార్కింగ్ చేశారు. ముగ్గురు మాత్రమే బేసిమెంట్ స్థాయికి వచ్చారు. శ్రావణంలో ఇంటినిర్మాణం ప్రారంభిస్తామని చాలామంది చెబుతున్నారు. పిల్లర్లకే రూ.లక్షన్నర ఫిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. స్థలనాణ్యత, పునాది గట్టిగా ఉండాలనే భావనతో చాలామంది బేస్మెంట్కు బదులు ఫిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొదటి బిల్లు రావాలంటే లబ్ధిదారులు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. మరికొందరు కంపౌండ్, మొరంతో కలిపి రూ.రెండు లక్షల వరకు వెచ్చిస్తున్నారు. శ్రావణం వస్తోంది శ్రావణ మాసం సమీపిస్తుండటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో కార్యదర్శుల సూచన మేరకు ఇంటి మార్కింగ్ చేసుకొని వదిలేసిన వారు జూలై 27నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో యాభై నుంచి 70 శాతం వరకు అధికారుల ద్వారా మార్కింగ్ ప్రక్రియ పూర్తయినా వివిధదశల్లో ఉన్న ఇళ్లనిర్మాణం 15శాతం కూడా దాటలేదు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మంజూరైనవి 8,219 మార్క్ అవుట్ చేసినవి 5,089 గ్రౌండింగ్ అయినవి 742 గ్రౌండింగ్ అయిన వాటిలో బేసిమెంట్స్థాయి 511 రూఫ్ లెవల్ 128 రూఫ్ కంప్లీటెడ్ 103మార్కింగ్ పూర్తి చేస్తున్నాం ప్రొసీడింగ్ అందుకున్న లబ్ధిదారుల ఇండ్ల స్థలాలలో మార్కింగ్ చేసే ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. లబ్ధిదారులు ఉత్సాహంగానే పనులు ప్రారంభిస్తున్నారు. జూన్ మొదటి వారంలోనే మెజారిటీ ఇళ్లకు మార్కింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే బేసిమెంట్ ప్రక్రియకు వస్తున్నాయి. ఫాలోఅప్ చేస్తున్నాం. – వేణుగోపాల్, ఎంపీడీవో, చొప్పదండి -
గీత దాటిన బల్దియా!
కార్పొరేషన్ కహానీ–3సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కన్నా అక్రమాలే అధికం. కాంట్రాక్టర్లంటే అమితమైన అభిమానం ప్రదర్శించడం, ఒకే కంపెనీకి, కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం ఇక్కడ సాధారణ విషయం. కిందిస్థాయి సిబ్బంది గురించి పక్కనపెడితే, మున్సిపల్ కమిషనర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. నిధుల దుర్వినియోగం విషయంలో చిన్నా చితకా అధికారుల మీద కాదు.. సాక్షాత్తూ మున్సిపల్ కమిషనర్ మీదే పోలీసు కేసు నమోదు అవడంతో కరీంనగర్ బల్దియా అవినీతికి పరాకాష్టగా నిలిచింది. గతేడాది నమోదైన కేసులో పురోగతి కోసం మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెంటబడటం మరోసారి చర్చానీయాంశంగా మారింది. తన పరిధి కాకున్నా.. సమీప విలీన గ్రామాల్లోకి చొచ్చుకెళ్లి మరీ రూ.కోట్లు ఖర్చు పెట్టడం కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, అధికారులకే చెల్లింది. గీత దాటిన అధికారులు.. కరీంనగర్ స్మార్ట్సిటీ పనులు నగరంలోనే జరగాలి. స్మార్ట్సిటీ మిషన్ కింద కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్సీసీఎల్)ను అనే స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ను ఒక పర్యాటక, వాణిజ్య నగరంగా తీర్చిదిద్దడం దీని ఉద్దేశం. నగరంలోని 50 డివిజన్లలో కాకుండా పరిధిదాటి.. స్మార్ట్సిటీ నిధులను వెచ్చించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వాస్తవానికి బొమ్మకల్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీ. ఈ ఏడాది ఆరంభంలోనే దాన్ని బల్దియాలో ప్రభుత్వం విలీనం చేసింది. 2022లో బొమ్మకల్ జంక్షన్ పనులను బల్దియా చేపట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నిధుల దుర్వినియోగమేనని వన్టౌన్లో కేసు (ఎఫ్ఐఆర్ 480/2024) నమోదు చేశారు. అందులో ఏ–1గా అప్పటి మున్సిపల్ కమిషనర్, ఏ–2 సూపరింటెండెంట్ ఇంజినీర్, ఏ–3గ్రా ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను చేర్చారు. అయినప్పటికీ.. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దాంతోపాటు బొమ్మకల్ వరాహ స్వామి టెంపుల్ నుంచి లారీ అసోసియేషన్ వరకు స్మార్ట్సిటీ నిధులతో రోడ్లు, డ్రెయిన్, కల్వర్టులు నిర్మించారు. రేకుర్తిలోనూ స్మార్ట్సిటీ నిధులతో పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, బ్యూటిఫికేషన్, హైమాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. బొమ్మకల్, రేకుర్తిల్లోనూ స్మార్ట్సిటీ పనులు పరిధి కాకున్నా హద్దుమీరి నిర్వహణ కరీంనగర్ కార్పొరేషన్ సొమ్ము రూ.కోట్లు పక్కదారి నిధుల దుర్వినియోగం కేసులో ఏ–1గా మున్సిపల్ కమిషనర్ ముందుకు సాగని పోలీసుల దర్యాప్తురూ.కోట్లాది నిధులు పక్కదారి.. బొమ్మకల్, రేకుర్తిలో రూ.కోట్లాది స్మార్ట్సిటీ నిధులు వెచ్చించి అనేక పనులు చేశారు. ఈ విషయంలో వన్టౌన్లో కేసు నమోదు అయిన సమయంలో పలువురు కార్పొరేటర్లు మరిన్ని ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లతో వారిని నిలువరించగలిగారు. అదే సమయంలో గ్రామ పంచాయతీగా ఉన్న బొమ్మకల్లో వికలాంగుల పార్కు కోసం దాదాపుగా రూ.4 కోట్ల వరకు విలువైన పనులకు పరిపాలన అనుమతి, టెండరు ఖరారు కూడా చేశారు. ఆఖరు నిమిషంలో ఆ టెండరు రద్దు అయింది. లేకపోతే.. పార్కు పనులు కూడా బొమ్మకల్లో నిర్వహించేవారే. -
కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి
కరీంనగర్: కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కష్టపడి చదువుకుని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలో కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన ఏడుగురు పిల్లల్లో నలుగురికి 18ఏళ్లు నిండాయి. వీరితో కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం కలెక్టరేట్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బాల బాలికలకు పీఎంకేర్ ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. 18ఏళ్లు నిండేసరికి రూ.10 లక్షలు వారిఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. సదరు పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నామని అన్నారు. కష్టపడి చదివి జీవితంలో నిలదొక్కుకోవాలని సూచించారు. ఏం చదువుకోవాలన్నా ప్రభుత్వసంస్థల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు బ్యాంకు పాస్బుక్, ఆరోగ్యకార్డులు అందజేశారు. అనంతరం పిల్లలతో కలిసి ఓ హోటల్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీడబ్ల్యూవో సబిత, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి చొప్పదండి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని గుమ్లాపూర్లో ఇందిరమ్మ ఇండ్లనిర్మాణం పరిశీలించారు. లబ్ధిదారుతో మాట్లాడారు. బేస్మెంట్ పూర్తి చేసి మొదటి బిల్లు తీసుకోవాలని సూచించారు. గ్రామ శివారులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఎంపీవో రాజగోపాల్, హౌజింగ్ ఏఈ సుప్రియ, మోహన్రెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
అభ్యాసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన
కరీంనగర్: అభ్యాసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన సాగాలని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. బుధవారం సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 9,10వ తరగతుల్లో జరుగుతున్న జీవశాస్త్ర, గణితశాస్త్ర బోధనాభ్యాసన ప్రక్రియలను పరిశీలించారు. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యాయులతో సమావేశమై అభ్యసన సామర్థ్యాల సాధన దిశగా విద్యాబోధన సాగాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త మిల్కూరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఎం.రాజేందర్ పాల్గొన్నారు. -
శాకాంబరీగా అమ్మవారు
కరీంనగర్రూరల్: దుర్శేడ్లో శ్రీవిశ్వంభరీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ మరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ప్రశాంత్శర్మ, శ్రీనివాస్శర్మ, విశాల్శర్మ మరకత లింగానికి విశేష అభిషేకం చేశారు. భక్తులు సమర్పించిన 108 రకాల పండ్లు, కూరగాయలు, పూలతో రాజరాజేశ్వరిదేవిని అలంకరించారు. స్వామివారు, అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నందాల తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్రావు, సాయిని తిరుపతి, గౌడ నర్సయ్య పాల్గొన్నారు. -
భూములకు భద్రత
● త్వరలో రంగంలోకి లైసెన్స్డ్ సర్వేయర్లు ● రెండు, మూడు రోజుల్లో జీపీవోల నియామకం కరీంనగర్ అర్బన్: పట్టా, ప్రభుత్వ భూములకు భద్రతతో పాటు హద్దుల బెంగ త్వరలోనే తీరనుంది. భూ రికార్డుల పారదర్శకతతో పాటు పర్యవేక్షణ పక్కాగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణనిస్తుండగా గ్రామ పాలన అధికారుల నియామకానికి శరవేగంగా కసరత్తు జరుగుతోంది. మొత్తంగా భూములను వివాదరహితంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండు రకాల చర్యలు చేపట్టేలా భూ భారతి చట్టంలో మార్గనిర్దేశం చేసింది. మొదట క్రయ విక్రయాలకు సర్వే మ్యాప్ను తప్పనిసరి చేయనుండగా తదుపరి శాశ్వత భూధార్ నంబర్లు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో జీపీవోల నియామకం గ్రామ పాలన అధికారులను నియమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆప్షన్లు తీసుకుని పరీక్షలు నిర్వహించగా పక్షం రోజుల క్రితం ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 191 మంది పరీక్షకు హాజరవగా 163 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 318 గ్రామ పంచాయతీలుండగా 163 మందిని నియమిస్తే మిగతా 155మందిని ఎవరిని నియమిస్తారన్నది తెలియడం లేదు. కాగా జీపీవోల నియామకం ప్రక్రియ ఈ నెల 4వరకు పూర్తవనుందని పక్కా సమాచారం. భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించగా వేల సంఖ్యలో అర్జీలు రాగా వాటి పరిష్కారంలో జీపీవోల సహకారముంటేనే నిర్ణీత సమయంలోగా పూర్తవనుంది. పక్షం రోజుల్లో లైసెన్స్డ్ సర్వేయర్లు లైసెన్స్డ్ సర్వేయర్లను జూన్ 27నుంచి శిక్షణ ప్రక్రియ మొదలైంది. 50 రోజుల శిక్షణలో భాగంగా రెండు బ్యాచ్లుగా జిల్లాకేంద్రంలో శిక్షణనిస్తున్నారు. సాగు, ప్రభుత్వ భూములకు హద్దుల గొడవ ఉండకుండా ఉండాలనే సదుద్దేశంతో లైసెన్స్డ్ సర్వేయర్లను తెరపైకి తెచ్చారు. 300మందికి శిక్షణనిస్తుండగా జిల్లాలో 318 గ్రామాలున్నాయి. ప్రభుత్వ సర్వేయర్లు 20మంది ఉండగా భూ కొలతలకు ఇబ్బంది ఉండదిక. భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రిజిస్ట్రేషన్ల సమయంలో భూనక్షా(పటం) సమర్పించాలనే నిబంధన త్వరలోనే అమలవనుంది. సర్వేతోనే భూధార్ భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూ ధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావి స్తే టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహశీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దుల్లేని భూమి గా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూదార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తోంది. ఈ రెవెన్యూ రికార్డు ల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో నే పూర్తవుతుంది. కానీ, రెండో ప్రక్రియ మాత్రం లైసెన్సుడ్ సర్వేయర్లు, సర్వేయర్లు, తహసీల్దార్ల విధుల్లో భాగం. రికార్డుల వెరిఫికేషన్ కోసం జీపీవోలు కూడా పని చేయాల్సి ఉంటుంది.భూ రికార్డుల నవీకరణలో తేలిన గణాంకాలు సాగు విస్తీర్ణం: 3,33,450 ఎకరాలు వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు ప్రభుత్వ భూమి: 40,366 వక్ఫ్ భూములు: 517 ఎకరాలు అటవీ భూములు: 1,748 ఎకరాలు ఖాతాల సంఖ్య: 1,92,687 మొత్తం సర్వేనంబర్లు: 3,51,545జిల్లాలో గ్రామాలు: 318 రెవెన్యూ గ్రామాలు: 205 జీపీవో పరీక్షలో ఉత్తీర్ణులైనవారు: 163 శిక్షణ పొందుతున్న లైసెన్స్డ్ సర్వేయర్లు: 300 -
ఆధా(ర్)రం లేక.. అక్షరానికి దూరం
‘సారూ.. మేము గుడిసెలో పుట్టాం. మా తల్లిదండ్రులకు సదువు రాదు. మేమన్నా సదువుకుందామంటే ఆధార్కార్డు లేదని సర్కారు బడిలోకి రానిస్తలేరు. ఏదన్నా పని చేసుకుందానుకుంటే బాలకార్మికులంటుర్రు. గిదెక్కడి అన్యాయం. సారూ మాకు ఆధా(ర్)రం చూపండి’ అంటూ.. కనిపించిన వారినల్లా ఈ చిన్నారులు ప్రాధేయపడుతున్నారు. జిల్లాకేంద్రంలోని ఆరెపల్లి శివారులోని శ్రీరాజరాజేశ్వరకాలనీకి చెందిన చిన్నారులు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు లేక చదువుకు దూరం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వీరికి స్థిర నివాసం లేకపోవడమే అని చెబుతున్నారు. కలెక్టర్ను కలిసినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కరీంనగర్క్రైం: నగరంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతామని సీపీ గౌస్ ఆలం అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్తో కలిసి నగరంలోని వివిధ బ్లాక్స్పాట్లను గుర్తించారు. పద్మనగర్ బైపాస్, రాంనగర్, టూ టౌన్ పోలీస్స్టేషన్, మంచిర్యాల చౌరస్తా, గాంధీరోడ్డు, నాఖాచౌరస్తా, కేబుల్ బ్రిడ్జి, బైపాస్ రోడ్డులోని మలుపులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ఆలం మాట్లాడుతూ.. నగరపాలక పరిధి లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించామని తెలిపా రు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. అవసరమైన చోట్ల ఐలాండ్లు, యూటర్న్లు, యూటర్న్ల కుదింపు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. -
ఆర్వోబీ ఆక్రమణపై కొరడా
● ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన కమిషనర్ అయాజ్ జమ్మికుంట: పట్టణంలోని ఆర్వోబీ కింద పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించినవారికిపై బుధవారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. మే 26న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పార్కింగ్ పరిషాన్’ కథనానికి స్పందించారు. కమిషనర్ ఎండీ అయాజ్ పర్యవేక్షణలో సిబ్బంది ఆర్వోబీని ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారుల సామగ్రిని తొలగించారు. నెలరోజులుగా మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారుల వివరాలు సేకరించారు. నిర్వహణ లేని వాటిని గుర్తించి, పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్ల అధారంగా అక్రమణలు తొలగించారు. నిజమైన వ్యాపారులు బ్రిడ్జి కింద రోడ్డుకు ఆరుఫీట్ల దూరంలో బిజినెస్ చేసుకోవాలని సూచించారు. ఆర్వోబీ కింద డబ్బాలు వేసుకొని నిజ మైన ఉపాధి పొందే వారికి న్యాయం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. టీపీవో శ్రీధర్, ఏఈ నరేశ్, శానిటరీఇన్స్పెక్టర్ మహేశ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కరీంనగర్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. పోలీస్ గార్డులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కే.మహేశ్వర్, వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య పాల్గొన్నారు. ఇండోర్ తరహాలో డంప్యార్డు సమస్య పరిష్కారం కరీంనగర్ కార్పొరేషన్: సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ డంప్యార్డు సమస్యల పరిష్కారంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఇండోర్ తరహాలో కరీంనగర్ డంప్యార్డు సమస్యను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. బుధవారం నగరంలోని డంప్యార్డును కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. డంప్యార్డుతో నగరంలోని చాలా డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఇండోర్లో గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నరహరి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లానని తెలిపారు. త్వరలోనే నరహరి కరీంనగర్కు వచ్చి సమస్య పరిష్కారానికి మార్గదర్శనం చేస్తానని తెలిపారు. నాయకులు వైద్యుల అంజన్కుమార్, కట్ల సతీశ్, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, గంట శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆహార నాణ్యతపై నజర్ కరీంనగర్ అర్బన్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించింది. వారికి అందించే ఆహార నాణ్యతను పక్కాగా పర్యవేక్షించాలని ఫుడ్సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో అందించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడంతో పాటు పరీక్ష చేయాలని ఆదేశించింది. ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ అంకిత్రెడ్డి, గెజిటెడ్ ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ రోహిత్రెడ్డి నేతత్వంలో బుధవారం పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా పరీక్షించారు. ప్రతి శనివారం హాస్టళ్ల తీరుపై నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నారు. అన్ని హాస్టళ్లను తనిఖీ చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. -
ఖర్గే సభకు తరలిరావాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఈ నెల 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే బహిరంగసభకు కరీంనగర్ నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సమన్వయకర్త ఫక్రుద్దీన్ కోరారు. ఇందిరాభవన్లో మంగళవారం జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖర్గే సభను విజయవంతం చేసేందుకు పార్టీ బాధ్యులు, కార్యకర్తలు, ఇటీవల పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీఒక్కరు తరలిరావాలన్నారు. త్వరలో మై నార్టీలకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ నా యకులకు ఇందిరమ్మఇళ్ల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడికి ఇల్లు ఇస్తే, జీర్ణించుకోలేని మాజీ ఎమ్మె ల్యే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నా రు. కాగా సమావేశం జరుగుతుండగా, కొంతమంది కరీంనగర్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి లేరని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ నిలదీసే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, పీసీసీ ప్రధానకార్యదర్శి ఆడెం రాజు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్కుమార్ కర్ర సత్యప్రసన్నరెడ్డి పాల్గొన్నారు. వనమహోత్సవానికి సిద్ధం కండి జమ్మికుంట రూరల్: వనమహోత్సవంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే వనమహోత్సవం, వెబ్సైట్లో మార్పులపై జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రతీ ఒక్కరు చేరుకోవాలన్నారు. ఏడీపీ కృష్ణ, ఎంపీడీవోలు భీమేశ్, శ్రీధర్, పుల్లుయ్య, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ పాఠశాల సందర్శన జమ్మికుంట: పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలను జిల్లా మలేరియా అధికారి ఉమాశ్రీరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో చందు మంగళవారం సందర్శించారు. వసతి గృహంలోని వాటర్ప్లాంట్, వంటగదిని పరిశీలించారు. వాటర్ ప్లాంట్ లీకేజీ లేకుండా, వంటగదిలోకి ఈగలు, దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బయటి నుంచి తినుబండారాలు తీసుకురావొద్దన్నారు. విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. వర్షాకాలంలో వ్యాపించే డెంగీ, మలేరియా, చికెన్గున్యా, మెదడువాపు, అతిసారం, టైఫాయిడ్, జాండీస్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 32 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జ్వరంతో బాధపడుతున్న నలుగురి రక్త నమూనాలు సేకరించారు. ప్రిన్సిపాల్ లచ్చయ్య, డాక్టర్లు రాజేశ్, మహోన్నత పటేల్ పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు 11 కేవీ చెర్లభూత్కుర్ ఫీడర్, ఇరుకుల్ల ఫీడర్లో చెర్లభూత్కూర్, ఇరుకుల్ల, మొగ్దుంపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ క్రిస్టియన్ కాలనీ ఫీడర్, 11కేవీ సివిల్ ఆసుపత్రి ఫీడర్ 33/11 కేవీ ఎస్ఎస్ వావిలాలపల్లిలో ఫీడర్లో సవరన్ స్ట్రీట్ ఏరియా, ఎస్వీజేసీ కళాశాల, రామాలయం, ప్రశాంత్నగర్, రాణి ఆసుపత్రి, జానకి చికెన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. -
పైసా లేకుండా వైద్య సేవలు
మానకొండూర్: ప్రభుత్వాస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లేబర్రూం, మెడికల్ స్టోర్ పరిశీలించారు. రిజిస్టర్లు తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 100శాతం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ సేవల ప్రగతిని తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో బీపీ, షుగర్కు మందులు అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు. మండలకేంద్రంలోని భవత కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగ విద్యార్థులతో ఆటలు ఆడారు. కేంద్రానికి ఏమైన అవసరాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కేంద్రం ఆవరణలో మొక్క నాటారు. తరువాత గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇల్లు వేగంగా పూర్తి చేయాలని, దశలవారీగా సొమ్ము జమ చేయిస్తామని సూచించారు. నర్సరీని పరిశీలించి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పండ్లు, పూలమొక్కలు పెంచాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, మండల విద్యాధికారి మధుసూదనాచా రి, భవిత కేంద్రం సిబ్బంది ఉమ, రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విస్తృత ప్రచారం చేయాలి కలెక్టర్ పమేలా సత్పతి -
కళాసిల్క్ చేనేత హస్తకళకు ఆదరణ
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా అంబేద్కర్భవన్ సాయినగర్–8వ క్రాస్రోడ్డులో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ ప్రదర్శనకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్, పోచంపల్లి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చుడీదార్స్, షూటింగ్స్ షర్టింగ్స్, జ్యువెల్లరీ, బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వహకుడు వినోద్ జైన్ తెలిపారు. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్కవర్లు, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ కర్టన్స్, స్టోన్ జ్యువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్స్, బంజారా, కోల్కతా బ్యాగులు, ఒడిశా పెయింటింగ్స్, మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరీ, రాజస్థాన్ కోటా బాందేజన్, బ్లాక్ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నోవి డ్రెస్ మెటీరియల్స్ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
కొసరి కొసరి వడ్డింపు
కార్పొరేషన్ కహానీ–2● గత కమిషనర్ హయాంలో కాంట్రాక్టర్లపై దయ ● టెండరు లేకుండా పనులు.. అంతకు ముందే బిల్లులు ● సమాచార హక్కుతో నిలిచిన రూ.40లక్షల చెల్లింపులు ● గరుడ జంక్షన్పై మరోసారి స.హ.చట్టం దరఖాస్తు ● అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీకి మాజీ మేయర్ ఫిర్యాదు ● కొత్త కమిషనర్ ప్రఫుల్ దేశాయ్పై గంపెడాశలతో సిబ్బందిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో మొన్నటి వరకు పరిపాలన అస్తవ్యస్తంగా సాగింది. గత కమిషనర్ హయాంలో తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు బల్దియా పరువును పెనం నుంచి పొయ్యిలో పడేశాయి. మరికొన్ని ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూన్నే ఉన్నాయి. అక్రమాలకు అవినీతికి బల్దియా అడ్డాగా మారిందన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాక్షాత్తూ తాజా మాజీ కార్పొరేటర్లే బల్దియాలో అవినీతి జరిగిందని సమాచార హక్కు కింద దరఖాస్తులు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండడం బల్దియా దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వచ్చీరాగానే ఎంబీ మాయం ఘటనలో ఏఈ గఫూర్ను సస్పెండ్ చేయడంతో మరిన్ని అవినీతి వ్యవహారాలకు చరమగీతం పాడతారని బల్దియా సిబ్బంది, నగరపౌరులు గంపెడాశలతో ఉన్నారు. ఆర్టీఐ దరఖాస్తుతో నిలిచిన రూ.40 లక్షల చెల్లింపులు ఇటీవల బొమ్మకల్ ఫ్లై ఓవర్ సుందరీకరణ పనులు చేయకముందే కాంట్రాక్టర్కు రూ.40లక్షలు చెల్లించేందుకు కమిషనర్ చెక్కుసిద్ధం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ చెక్కు పాస్ కాకుండా ఒక సహచట్టం (ఆర్టీఐ) దరఖాస్తు కావడం గమనార్హం. పనులు చేయకుండానే చెక్కులు ఎలా కాంట్రాక్టరుకు ఇస్తున్నారని సిక్వాడీకి చెందిన ఓ పౌరుడు దరఖాస్తు చేయగానే.. విషయం బయటికి పొక్కిందన్న ఆందోళనలో రూ.40 లక్షల చెక్కు జారీ నిలిపివేశారు. అప్పటి వరకు మార్చి 31 గడువు ముగుస్తుందన్న తొందరలో చెక్కు సిద్ధం చేశామంటూ సమర్థించుకున్న కమిషనర్ తరువాత మాత్రం పేమెంట్ వోచర్లు, ఎంబీ రికార్డులు అసలు ప్రిపేర్ చేయలేదని ఆర్టీఐకి లిఖిత పూర్వకంగా సమాధానమివ్వడం గమనార్హం. మాజీ కార్పొరేటర్ల పోరాటం గత కమిషనర్ హయాంలో జరిగిన అవినీతిపై పలువురు కార్పొరేటర్లు బహిరంగ పోరుకు దిగారు. పద్మనగర్ గరుడ జంక్షన్లో రూ.కోటి అంచనాతో ప్రారంభించిన పనులను అదనంగా రూ.80లక్షలకు అదే కాంట్రాక్టర్కు ఎలా అప్పగిస్తారని సమాచార హక్కు ద్వారా బల్దియా కమిషనర్ను కోరడం కలకలం రేపుతోంది. ఈ పనులకు సంబంధించి వర్క్స్లిప్, డ్రాయింగ్ సమర్పించాలని దరఖాస్తులో కమిషనర్ను కోరడం గమనార్హం. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. బొమ్మకల్ ప్రాంతం 2022లో కరీంనగర్ స్మార్ట్సిటీలో భాగమే కానప్పుడు అక్కడ స్మార్ట్సిటీ నిధులతో పనులు ఎలా చేస్తారు అని నిలదీస్తున్నారు. ఈ నిధుల దుర్వినియోగంలో కేసు నమోదైందని, కరీంనగర్ స్మార్ట్సిటీ కమిషనర్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, కరీంనగర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రతినిధి, తదితరులు అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలంను మంగళవారం కోరారు.ప్రఫుల్ దేశాయ్పై ఆశలున్నాయి జిల్లాలో నిజాయితీగా పనిచేసే ఐఏఎస్లు కానరావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్లు ప్రజాసమస్యలపై వేగంగా స్పందిస్తుంటే కరీంనగర్లో ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరం. బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్పై చాలా ఆశలు ఉన్నాయి. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారిగా మంచి పేరుంది. బల్దియాలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కోడై కూస్తున్న నేపథ్యంలో కమిషనర్ అక్రమార్కులైన అధికారులు, గుత్తేదారులపై కొరఢా ఝుళిపిస్తారని ఆశిస్తున్నాం. – ఆమెర్, కాంగ్రెస్ నేత -
జాతీయ పోటీలకు మాధవి
కరీంనగర్స్పోర్ట్స్: గుజరాత్ ఈ నెల 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్బాల్ సీనియర్ మహిళల చాంపియన్ షిప్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారిణి మాధవి ఎంపికై నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర్రావు, బసరవేణి లక్ష్మణ్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా మంద్రమర్రిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయపోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. మాధవి ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా కొనసాగుతున్నారు. మాధవిని తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, నమిలికొండ ప్రభాకర్, కోచ్ మూల వెంకటేశ్ అభినందించారు. తైక్వాండో పోటీల్లో ప్రతిభచొప్పదండి: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొన్న మండలంలోని రుక్మాపూర్ మాడల్ స్కూల్ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. పదోతరగతి విద్యార్థి శ్రీగాధ స్పందన గోల్డ్ మెడల్ సాధించగా, జునగారి రాంచరణ్ రెండు విభాగాల్లో గోల్డ్, బ్రౌంజ్ మెడల్ సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నిమ్మల సుధాకర్ అభినందించారు. -
ఒక్క ఇల్లూ రాకపాయే
● నగరంలో జాడ లేని ‘ఇందిరమ్మ’ ● కమిటీలు లేక నిలిచిన ఎంపిక ● లబ్ధిదారులుగా మారని అర్హులు ● త్వరలో ప్రకటిస్తామన్న డీసీసీ ప్రెసిడెంట్కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రమంతా ఇందిరమ్మ ఇండ్ల హడావుడి కొనసాగుతుండగా, నగరంలో ఆ జాడే లేకుండా పోయింది. ఇప్పటివరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు అర్హుల జాబితా సిద్ధం చేసి ఉంచినా, కమిటీలు లేక అధికారిక ముద్ర పడడం లేదు. కాంగ్రెస్ అంతర్గత విభేదాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా, త్వరలో కమిటీలు వేసి, ఇండ్లు ఇస్తామని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. అర్హుల జాబితా రెడీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అర్హుల జాబితాను నగరపాలకసంస్థ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. నగరంలోని 66 డివిజన్ల నుంచి 40,773 దరఖాస్తులు వచ్చాయి. 12,491 దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించారు. ఎల్–2లో (స్థలం, ఇళ్లు లేని) 25,978దరఖాస్తులు ఉండగా, ఎల్–1లో (స్థలం ఉండి, ఇళ్లు లేని) 2,304 దరఖాస్తులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎల్–1 దరఖాస్తుదారులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం తెలిసిందే. నగరానికి మొదటివిడతలో 1,737 ఇండ్లు మంజూరయ్యాయి. విచారణ చేసిన నగరపాలకసంస్థ అధికారులు 1,567 మందిని అర్హులుగా గుర్తించి కలెక్టర్కు జాబితా పంపించారు. ఇంకా 170మంది అర్హులను గుర్తించాల్సి ఉంది. చేతులు కలవక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై దృష్టి సారించడం తెలిసిందే. దరఖాస్తుదారుల్లో అర్హులను అధికారులు గుర్తిస్తే, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఇందిరమ్మ కమిటీలు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందించారు. డివిజన్లవారీగా ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా, ఆ కమిటీలు ఇన్చార్జీ మంత్రి ద్వారా అధికారులకు జాబితాను అందిచాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల మూలంగా కమిటీల ఏర్పాటు ఇప్పటివరకు జరగలేదు. జిల్లా ఇన్చార్జీ మంత్రిగా ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్న సమయంలో, కరీంనగర్ నుంచి అప్పటి నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ద్వారా రెండు జాబితాలు వేర్వేరుగా వెళ్లాయి. దీంతో ఏ జాబితా ఆమోదించాలో తెలియని పరిస్థితిల్లో ఆమోద ముద్ర పడలేదు. అప్పటి నుంచి పరిస్థితిలో మార్పు లేదు. ఇందిరమ్మ జాడ లేని కరీంనగర్ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మొదటి విడుత ఇందిరమ్మ ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి, రూ.లక్ష కూడా ఖాతాల్లో పడే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్లో మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కాగితాలను దాటి రావడం లేదు. అధికారులు జాబితా రూపొందించినా, కేవలం ఇందిరమ్మ కమిటీలు లేకపోవడంతో అర్హులు లబ్ధిదారులుగా మారడం లేదు. దీంతో కమిటీలతో సంబంధం లేకుండా ఉన్నతాధికారులే నేరుగా లబ్ధిదారులను ఎంపిక చేసే అంశంపైనా దృష్టిపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో కమిటీలు కరీంనగర్లో త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటవుతాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్ నుంచి రెండు జాబితాలు పంపించడం వాస్తవమేనని అంగీకరించారు. ఇన్చార్జిఇ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అనారోగ్య, ఇతరత్రా సమస్యల వల్ల పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారన్నారు. తన మానకొండూరు నియోజకవర్గంలోకి వచ్చే సదాశివపల్లి, అలుగునూరులో ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేసి, నగరంలోనూ ఇండ్లు ఇస్తామని పేర్కొన్నారు.నగరపాలకసంస్థలో డివిజన్లు 66 మంజూరైన ఇండ్లు 1,737 ఎంపిక చేసిన అర్హులు 1,567