Karimnagar District News
-
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఆందోళనకరస్థాయికి చేరాయి. ఫ్యాన్లు, కూలర్లు గిర్రున తిరుగుతున్నా తట్టుకోలేని వేడి మనిషిని ఆగం చేస్తోంది. జిల్లా ఆసుపత్రిలోని బర్నింగ్ విభాగంలో కాలిన గాయాలతో అడ్మిట్ అయినవారికి చికిత్స అందిస్తుండగా సదరు విభాగంలో ఏసీ తప్పనిసరి. ఉన్న ఒక్క ఏసీ అలంకారప్రాయంగా మారగా బాధితులు అటు ఎండవేడి ఇటు కాలిన గాయాలతో ఏర్పడే మంటకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీ స్థానంలో కూలర్ ఏర్పాటు చేయగా గాలి ఒత్తిడికి కాలిన గాయాలు మరింత మండుతున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న డ్రగ్స్, ఆల్కహాల్, మాదకద్రవ్యాల వల్ల తీవ్రమైన మత్తుకు గురైన వారికి అత్యవసర వైద్య సాయం అందించే ప్రత్యేక విభాగం ఒక్క పేషెంటు లేక ఖాళీగా ఉంది. అయినప్పటికీ ఆ వార్డులో అన్ని లైట్లు వేసి ఉండగా వార్డు దగదగలాడుతోంది. ఫలితంగా సర్కారుకు విద్యుత్ ఖర్చు వృథా అవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
జిల్లాసభను విజయవంతం చేయండి
కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 22న శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే జిల్లాస్థాయి సభను విజయవంతం చే యాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. జిల్లాస్థాయి సభ నిర్వహణపై వివిధశాఖల జిల్లా అధికా రులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగ తి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం నుంచి జిల్లాస్థాయిలో వివిధశాఖల ద్వారా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, వాటన్నింటినీ డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలన్నారు. ప్రతీశాఖకు సంబంధించిన ప్రగతిపై పది నిమిషాల సమాచారం సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, సన్న రకం వరికి బో నస్, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాలు సభలో వివరించాలని తెలిపారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సభను విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
జీవన శైలి కరువు.. మాతృత్వం బరువు
కరీంనగర్: ఒకప్పుడు పెళ్లయిన కొద్ది కాలానికే సహజంగా గర్భం దాల్చేవారు. ఇప్పుడు మారిన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆలస్య వివాహాలు, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, నిద్రలేమితో మాతృత్వం చాలా మందికి సవాలుగా మారుతోంది. కొద్దిరోజులు వేచిచూసి చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో గతంలో హైదరాబాద్కే పరిమితమైన ఫెర్టిలిటీ చికిత్సలు ఇప్పుడు జిల్లాకేంద్రానికే చేరాయి. ఐవీఎఫ్, ఐయూఐ, టెస్ట్ట్యూబ్ బేబీ చికిత్సలకు నగరంలో ప్రత్యేక కేంద్రాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే పది వరకు సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. ఐవీఎఫ్ నడుస్తున్నప్పటికీ సరోగసీ అనుమతులు ఎవరికీ లేదు. సరోగసీ నిబంధనలు కఠినంగా ఉండడంతో వైద్యులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఐవీఎఫ్పై పెరుగుతున్న ఆసక్తి సహజ గర్భధారణ కష్టమవుతున్న కొందరు దంపతుల్లో ఐవీఎఫ్పై ఆసక్తి పెరుగుతోంది. పెళ్లయిన రెండు, మూడేళ్లలో సహజంగా గర్భం రాలేదంటే ఐవీఎఫ్ను ఎంచుకుంటున్నారు. ఐవీఎఫ్ చికిత్స పొందుతున్న అందరికీ సత్ఫలితాలు ఇస్తుందా అంటే అది వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుందని, కొందరికి ఏడాదిలో సక్సెస్ అయితే మరికొందరికి రెండు మూడేళ్లు పడుతుందని వైద్యులు చె బుతున్నారు. కరీంనగర్లో మధ్యతరగతి, ఉద్యోగ దంపతుల్లో ఫెర్టిలిటీ సేవలపై డిమాండ్ పెరుగుతోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఐవీఎఫ్ సైకిల్కే రూ.లక్షల్లో ఖర్చవుతుండటంతో ‘ మాతృత్వం’ ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఒక్కో సెంటర్లో ఐవీఎఫ్కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షలు, ఐయూఐకు రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఐవీ ఎఫ్కు డిమాండ్ పెరగడంతో మోసాలూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఐవీఎఫ్ కేంద్రాల పర్యవేక్షణను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. ఇటీవల ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ప్రారంభమైంది. ప్రభుత్వ ఫెర్టిలిటీ సెంటర్పై ఆశ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఉచిత ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది. జిల్లాస్థాయిలోనూ ఫెర్టిలిటీ సేవలు విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, కరీంనగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక ఫెర్టిలిటీ సెంటర్ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. -
గిరిజన యువతి ఆత్మహత్య
ధర్మపురి: జీవితంపై విరక్తితో గిరిజన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోదరనక్కలచెరువు గూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గూడెంకు చెందిన మారినేని లచ్చయ్యకు ముగ్గురు కూతుళ్లు. రెండో కూతురు రమ్య(21) ఇంటర్ మధ్యలో ఆపేసి ఇంటివద్దనే ఉంటోంది. మనస్తాపంతో బుధవారం ఎవరూ లేని సమయంలో ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుంది. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మాయమాటలు చెప్పి.. పింఛన్ కాజేసి..జమ్మికుంట: మాయమాటలు చెప్పి వృద్ధురాలి పింఛన్ డబ్బులను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన రామంచ అయిలమ్మ అనే వృద్ధురాలు బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఓ బ్యాంక్కు పింఛన్ డబ్బులు విడిపించుకునేందుకు వచ్చింది. 2 నెలల పింఛన్ రూ.4వేలు విడిపించుకొని బయటకు రాగా.. అక్కడే ఉన్న ఓ గుర్తుతెలియని దుండగుడు పింఛన్ రూ.6వేలు రావాల్సింది, బ్యాంక్వాళ్లు తక్కువ ఇచ్చారంటూ మాయమాటలతో బురడి కొట్టించాడు. 2 నెలల పింఛన్ డబ్బులు తీసుకొని బ్యాంక్ వద్దకు తీసుకొచ్చి పాస్బుక్ జిరాక్స్ తీసుకురమ్మని చెప్పి రూ.4వేలతో ఉడాయించాడు. మోసపోయానని తెలుసుకున్న అయిలమ్మ బోరున విలపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. -
తోటకు నీరుపెట్టేందుకు వెళ్లి..
● విద్యుత్ వైరు తగిలి రైతు మృతి ధర్మపురి: తోట రక్షణగా ఏర్పాటు చేసిన కరెంట్ వైరే రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన ధర్మపురి సమీపంలోని కొరండ్లపల్లెలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన కటుకం శంకర్ (54) తనుకున్న భూమిలో పెసర, బీర, మిరప సాగు చేస్తున్నాడు. పందులు, ఇతర వన్యప్రాణులు రాకుండా రక్షణగా కంచె ఏర్పాటు చేశాడు. బుధవారం మధ్యాహ్నం తోటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. కంచెకు 11 కేవీ మెయిన్ వైరు తగులుకుని ఉంది. దీనిని గమనించని శంకర్ నీరు పారిస్తుండగా.. కంచెకున్న విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. శంకర్ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోటవద్దకెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. ఎస్సై మహేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శంకర్ వ్యవసాయపనులతోపాటు బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. గ్రామంలో బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కొలపూరి సురేశ్ (39) గుండెపోటుతోనే చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. సురేశ్ తండ్రి రాజయ్య, ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. రాజయ్య పెద్ద కుమారుడు సురేష్ మంగళవారం సాయంత్రం పొలం వద్ద కొంతసేపు ఉంటానని, ఆవు పాలు పితికి తీసుకొస్తానని తండ్రికి చెప్పాడు. సురేశ్ అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి ఇంటికి చేరుకున్నాడని తండ్రి భావించాడు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా సురేష్ విగతజీవిగా కనిపించాడు. నుదిటిపై, కుడి కాలి వేళ్ల వద్ద గాయాలు కనిపించడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఇందులో అక్కడి వైద్యులు గుండెపోటు కారణంగానే సురేశ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి .. రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో బుధవారం రైలు ఢీకొని వ్యక్తి(55) మృతి చెందాడు. ఒకటో నంబరు ప్లాట్ఫారం దిగి రెండోనంబరు ప్లాట్ఫారంపైకి పట్టాలపైనుంచి వెళ్తుండగా రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది. వ్యక్తి శరీరం రెండు ముక్కలైంది. నల్లనిప్యాంట్, తెల్లని బనియన్ ధరించి ఉన్నాడు. ఈనెల 18న తీసుకున్న ఝార్సీగూడ–సికింద్రాబాద్ రైలు టికెట్ లభ్యమైంది. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి తెలిపారు. మృతుడి బంధువులు 99493 04574, 87126 58604 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
అరుస్తూ.. కరుస్తూ..
నెల 2023–24 2024–25 2025–26 ఏప్రిల్ 192 205 315 మే 114 207 316 జూన్ 154 232 238 జూలై 194 196 361 ఆగస్టు 158 192 252 సెప్టెంబర్ 164 175 307 అక్టోబర్ 175 221 481 నవంబర్ 210 233 1,295 డిసెంబర్ 193 221 585 జనవరి 229 250 467 ఫిబ్రవరి 165 217 475 మార్చి 265 263 473 మొత్తం 2,213 2,612 5,565కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ని 66 డివిజన్లలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. వాకింగ్కు వెళ్లే వృద్ధులు, మహిళలు, బస్స్టాండ్, పార్క్లు, వీధుల్లో తిరిగే చిన్నారులపై ఎప్పుడు ఏ వైపు నుంచి కుక్కలు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముకరాంపుర, విద్యానగర్, జ్యోతినగర్, భగత్ నగర్, కాశ్మీర్ గడ్డ, హౌ సింగ్బోర్డుకాలనీ, మారుతినగర్, లక్ష్మినగర్, రేకుర్తి, తీగలగుట్టపల్లి, హనుమాన్నగర్, వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతూ కాలనీవాసులను హడలెత్తిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా బైక్లపై వెళ్లే వారి వెంటపడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిలిచిన స్టెరిలైజేషన్ కుక్కల సంతానోత్పత్తిని నివారించేందుకు గతంలో నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రిలో ఏబీసీ నిర్వహించారు. కుక్కలకు ఇక్కడే శస్త్ర చికిత్స చేసేవాళ్లు. ఏబీసీలో వసతులు లేవని, జంతుప్రేమికులు కోర్టును ఆశ్రయించడంతో కుక్కల శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలలుగా నగరంలో కుక్కలకు స్టెరిలైజ్ చేయడం లేదు. దీనితో మరింత రెచ్చిపోతున్నాయి. నగరంలో కుక్క కాటు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో కుక్కల సంతానోత్పత్తి నివారించి, తీవ్రత తగ్గించేందుకు స్టెరిలైజేషన్ చేపడుతుంటారు. ఏయే ప్రాంతంలో కుక్కలను తీసుకొచ్చి స్టెరిలైజ్ చేస్తారో తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడుతుంటారు. హాస్పిటల్స్, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద పట్టుకున్న కుక్కలకు స్టెరిలైజ్ చేసిన అనంతరం ఏబీసీ సెంటర్లోనే ఉంచాలని, వాటిని వదిలిపెట్టొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై జంతుప్రేమికులు కోర్టును ఆశ్రయించగా, కుక్కల విషయంలో కరుణ కాదు.. అవసరమైతే కారుణ్య మరణాలు చేయాలని సుప్రీం తాజాగా ఆదేశించింది. నగరంలో పిచ్చికుక్కలను గుర్తిస్తే వైద్యుల నిర్ధారణ తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంపాల్సి ఉంటుంది. కుక్కలను నియంత్రించాలి నగరంలో కుక్కల బెడద తీవ్రమవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి కాలుబయట పెడితే చాలు కుక్క లు వెంటపడుతుండడం తంతుగా మారింది. త్వరగా ఏబీసీ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించి, కుక్కల బెడదను తగ్గించాలని నగరవాసులు కోరుతున్నారు. కరెంట్ లేక.. ప్రారంభానికి నోచుకోక నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బొమ్మకల్లో ఏబీసీ సెంటర్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణం పూర్తయింది. భవనంలో 38 కెనెల్స్ నిర్మించగా (కుక్కలను నిలిపే), మరో 62 కెనెల్స్ నిర్మించాలని ఇటీవల కౌన్సిల్ తీర్మానించింది. అయితే భవనానికి విద్యుత్కనెక్షన్ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. -
పుష్కర స్నానం.. పుణ్యక్షేత్రాల దర్శనం
మంథని: త్రివేణి సంగమ క్షేత్రంలో గురువారం నుంచి 12 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం విలసిల్లనుంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి గతేడాది ఆదిపుష్కరాలు నిర్వహించారు. నేటినుంచి జరిగే అంత్యపుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈమేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరస్నానం తర్వాత కాళేశ్వరముక్తీశ్వర స్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడనున్నాయి. మంత్రి దంపతులతో తొలుత అంత్యపుష్కర స్నానం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు అంత్యపుష్కర స్నానాలకు పండితులు ముహూర్తం నిర్ణయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ దంపతులతో అంత్యపుష్కరాలను వేదపండితుల ప్రత్యేక పూజల నడుమ ప్రారంభించనున్నారు. గవర్నర్ శివప్రతాప్ సుక్లా, కంచి ఫిఠాధిపతులు శ్రీవిజయోద్రసరస్వతీతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. టెంపుల్ టౌన్గా మంత్రపురి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకుపైగా మహోన్నత చరిత్ర కలిగిన మంథని ఆలయాలకు నిలయమై టెంపుల్ టౌన్గా ప్రసిద్ధి కెక్కింది. ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ, సిద్ధి, బుద్ధి సహిత వినాయకుని గుడిఉత్తర ముఖంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఏకై క పశ్చిమ ముఖశివలింగం ఇక్కడే దర్శనమిస్తుది. 13 హనుమాన్ దేవాలయాలతో పాటు మంథనిలో అన్నిదేవతల దేవాలయాలు పురాణకాలంలోనే నిర్మించారు. నూతనంగా అయ్యప్ప దేవాలయం, అందులో సరస్వతీ, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలనూ నిర్మించారు. గోదావరి తీరంలో వెలసిన గౌతమేశ్వర దేవాలయం నుంచి సోమసూత్రం ప్రకారం ప్రమిదగణాలు.. పట్టణ ప్రారంభంలో కాలభైరవుడితో మరో దేవతామూర్తిని ఏర్పాటు చేశారు. సూర్య, చంద్రలతోపాటు పది చేతులతో కూడిన భగీరథ అమ్మవారు, కాసికాదేవి.. ఇలా పట్టణం నలుదిక్కులా వాస్తుతో నిర్మిత మైంది. వీటితోపాటు కనకాపరమేశ్వరి, షిరిడీసాయి, అయ్యప్ప, రేణుకా ఎల్లమ్మ, భలవీర హనుమాన్, నాగదేవత, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి పట్టణంలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర– ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకేపీఠంపై రెండు శివలింగాలు(శివుడు, యముడు) కొలువై ఉన్నాడు. ఒకే పానవట్టంపై రెండువేర్వేరు శివలింగాలు ఉన్న ఏకై క దేవాలయం ఇదే. భక్తులు సంప్రదాయకంగా ముక్తీశ్వర(శివ) లింగం ఆశీర్వాదం కోరడానికి ముందు కాళేశ్వర(యమ) లింగానికి ప్రార్థనలు సమర్పిస్తారు. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికరంద్రాలు ఉంటాయి. స్వామివార్లకు అభిషేకం సమయంలో పోసిననీరు ఈ రంధ్రాల్లోకి ఇంకి సంగమంలోని భూగర్భ నదులలోకి రహస్యంగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి క్షేత్రంలో పార్వతీదేవీ, సరస్వతీ ఆలయంతోపాటు మరిన్ని మహిమగల ఆలయాలు కొలువై ఉన్నాయి. కాళేశ్వరంలో నేటినుంచి జూన్ ఒకటి వరకు అంత్యపుష్కరాలు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు మంత్రి శ్రీధర్బాబు దంపతులతో ప్రారంభం -
తల్లడిల్లిన కన్నపేగు
జగిత్యాలక్రైం/మేడిపల్లి: ఒకే ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో కన్నపేగులు తల్లడిల్లాయి. దేవునికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన రెండు కుటుంబాల్లోని చిన్నారులు కోనేరులో మునిగి చనిపోవడం విషాదం నింపింది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడికి బంధువులు వందలాదిగా తరలివచ్చారు. అయ్యో బిడ్డలారా.. అప్పుడే మీకు నూరేళ్లు నిండాయా.. అంటూ రోదించడంతో ఆస్పత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ శేఖర్, భార్గవి దంపతులు. శేఖర్ డిష్ కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వారికి షార్వింద్ (6) కుమారుడు. భార్గవి మళ్లీ గర్భం దాల్చడంతో శివారులోని శివగంగ వద్ద మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు. కార్యక్రమానికి రావాలని జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన భార్గవి అక్క భారతి, బావ భూషణంను కూడా ఆహ్వానించారు. దీంతో వారు కుమారుడు మన్విత్, కూతురు మనస్వినితో కలిసి శివగంగ వద్దకు చేరుకున్నారు. పెద్దలందరూ మొక్కులు చెల్లించి వంట చేసే ప్రయత్నంలో ఉండగా.. ముగ్గురు చిన్నారులు కోనేరు వద్ద ఆడుకుంటూ నీటిలో మునిగిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో కోనేరు వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాల వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. బిడ్డలారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. బంధువుల రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి అప్పటి దాకా కళ్లముందే ఆటలు కోనేరులో మునిగి ముగ్గురి మృతి రెండు కుటుంబాల్లో తీరని విషాదం -
బంగారం దుకాణాల్లో పోలీసుల తనిఖీలు
కరీంనగర్ క్రైం: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా బుధవారం సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పలు బంగారు ఆభరణాల దుకాణాలు, లాడ్జీలు, బస చేసే హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బంగారం దుకాణాల్లో అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ ద్వారాల వద్ద డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, లోపలికి వచ్చే వారిని తనిఖీ చేయడానికి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లను ఉపయోగించాలన్నారు. పలుచోట్ల ఎమర్జెన్సీ అలారమ్స్ అమర్చాలని, వాటిని నొక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందేలా అనుసంధానం చేయాలన్నారు. హోటళ్లలో రూంలు అద్దెకు ఇచ్చే సమయంలో కస్టమర్ల నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు సేకరించాలన్నారు. వారిచ్చే ఫోన్ నంబర్లను సరి చూసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. భద్రతా ప్రమాణాల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్, వాసాల సతీశ్, సీఐ రాంచందర్రావు పాల్గొన్నారు. అర్హులైన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలికరీంనగర్: 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. విద్యానగర్ అర్బన్ హెల్త్ సెంటర్, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, రికా ర్డుల నిర్వహణ, హాజరు రిజిస్టరు, ఎన్సీడీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్, ఓపీ రిజిస్టర్, సిబ్బంది పనితీరును పరిశీలించారు. డాక్టర్లు సనా జవేరియా, నాజియా ఫాతిమా, సాహితీ పాల్గొన్నారు. రూ.50 కోట్ల పనుల్లో కదలికకరీంనగర్ కార్పొరేషన్: ఇటీవల చర్చనీయాంశంగా మారిన రూ.50 కోట్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (యూఐఎఫ్డీ) నిధులతో చేపడుతున్న పనులకు మోక్షం లభిస్తోంది. 87 పనులకు సంబంధించిన ఆన్లైన్ టెండర్ ప్రక్రియ ను అధికారులు చేపట్టగా, 86 పనులకు కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేశారు. ఒక పనికి ఎవ రూ ముందుకురాలేదు. గత సంవత్సరం ప్రత్యేక అధికారి పాలనలో నగరపాలకసంస్థకు వచ్చిన రూ.50 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించడం, టెండర్ దశకు చేరడం తెలిసిందే. ఆ తరువాత కొత్త పాలకవర్గం ఏర్పడడంతో రూ.50 కోట్ల టెండర్ ప్రక్రియను నిలిపివేసి, నగరవ్యాప్తంగా పనులను విభజించి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపించారు. కౌన్సిల్ ప్రతిపాదనలకు సీడీఎంఏ అంగీకరించడంతో, టెండర్ ప్రక్రియను నిర్వహించారు. ఆన్లైన్ టెండర్లో బిడ్ దాఖ లు గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 87 పనుల్లో 86 పనులకు బిడ్స్ దాఖలైనట్లు సమాచారం. ఇందులో 18 పనులకు తీవ్రమైన పోటీ ఏర్పడిందని తెలిసింది. కాగా వారం రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తి చేస్తామని, ఆ తరువాత డివిజన్లలో అభివృద్ధి పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. -
రంగుల మాలలు
తామర పూలను తెస్తాం తనివితీరా మాల కడతాం తల్లిదండ్రుల మెడలో వేస్తాం ! గులాబీ పూలను తెస్తాం గుత్తులు గుత్తుల మాల కడతాం గురువు గారి మెడలో వేస్తాం ! చామంతి పూలను తెస్తాం చకచకా మాల కడతాం చదువులమ్మ మెడలో వేస్తాం ! మందార పూలను తెస్తాం మెలికలేసి మాల కడతాం మహనీయుల మెడలో వేస్తాం ! బంతిపూలను తెస్తాం బొద్దుబొద్దుగా మాల కడతాం భరతమాత మెడలో వేస్తాం ! నందివర్ధన పూలను తెస్తాం నిగనిగలాడే మాల కడతాం నింగి నేలకు చుట్టేస్తాం !!! బోనగిరి పాండురంగ తొర్రూరు టౌన్, జిల్లా: మహబూబాబాద్ -
సెలవు రోజు
ఆ రోజు సెలవు ముందు రోజు అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దామని అనుకున్నాం. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో చోటికి వెళ్దామని చెప్పారు. అప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముళ్లు జూ పార్క్కు వెళ్దామన్నాం. అప్పుడు మా నాన్న జూపార్క్ కన్నా సినిమాకు పోదాం అన్నారు. మా తాతయ్య బాగోతానికి వెళ్దామాన్నారు. మా నాయనమ్మ అందరం కలిసి దేవాలయానికి వెళ్దామన్నారు. అప్పుడు మా నాన్న.. సరే మీరు అన్నట్లు సెలవు రోజు అంటే రేపు అందరం జూపార్క్, సినిమాకు వెళ్దాం. వచ్చే వారం బాగోతానికి వెళ్దామన్నారు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి జూపార్కు, సినిమాకు రెడీ అయ్యాం. ఇంకా వారం రోజులైతే నాకు, మా చెల్లికి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. మన ఊరి గ్రామస్తుడు ముద్దసాని మోహన్రెడ్డి మొదటి మరియు రెండో వ్యక్తికి రూ.20వేలు ప్రోత్సాహకంగా ఇస్తాడు అని నాన్న అన్నారు. ఈసారి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులైతే అందరం కలిసి కొత్త స్థలానికి వెళ్దామన్నారు. జూ పార్కు మరియు సినిమాకు వెళ్లి వచ్చాము వచ్చిన తర్వాత ఇక వారం రోజులు పరీక్షలకు విలువి ఉన్నాయని చదివాము మొదటిరోజు తెలుగు రెండవ రోజు హిందీ మూడవరోజు ఆంగ్లం నాలుగో రోజు గణితం ఐదవ రోజు భౌతిక శాస్త్రం ఆరవ రోజు జీవశాస్త్రం ఏడవ రోజు సోషల్ పరీక్షలు జరుగుతాయి మేము నేను మా చెల్లి ఇద్దరం ఈసారి ఉత్తీర్ణులమవుదామని అనుకున్నాం. ఉత్తీర్ణులమైతే ఈసారి మా అమ్మ, నాన్న పేరు, మా ఊరి పేరు దక్కించిన వాళ్లమవుతామని ఆశతో చాలా కష్టపడి చదివాను. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్న, అమ్మ కష్టపడితే కానీ మేము తినలేము. ఈ ఉన్న వారం రోజుల్లో మేము బాగా చదివినాము. పరీక్షలు రాసినాము. తర్వాత చాలా భయపడ్డాం. పదో తరగతిలో పాస్ అవుతామో.. లేదోనని ఆందోళన ఉంది. అటు తల్లిదండ్రుల కష్టం.. ఇటు ఉపాధ్యాయులు నాపట్ల ఇచ్చే చదువు ఈ రెండింటిని ఆలోచించుకుంటే నాకు చాలా ఆందోళన వేసింది. కొన్ని రోజులకు రిజల్ట్ ప్రకటించారు. నేను, మా చెల్లి ఇద్దరం అత్యున్నత మార్కులతో నిలిచాం. నేను మొదటి స్థానం, మా చెల్లి రెండో స్థానంలో నిలిచింది. మా గ్రామస్తుడు, దాత మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రోత్సాహక డబ్బులు, ప్రశంసలు పొందాం. మా గ్రామస్తులు అభినందించారు. మా అమ్మ, నాన్న, ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జిల్లా మొత్తంలో మా ఊరి బడే ప్రథమ స్థానంలో నిలిచింది. అందరం కలిసి గోల్కొండ కోటకి వెళ్లాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఎవరు చూసినా కరీంనగర్లో పదో తరగతిలో ఉత్తీర్ణత మార్కులు వచ్చిన వారు మీరే కదా అన్నారు. అప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాను. వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... – ఎన్.శ్రీకర్, గ్రామం: ఊటూరు మండలం: మానకొండూర్ -
బన్నీ వేసవి యాత్ర –13 పరమపద సోపానం – తాతయ్య పాఠం
బయట వర్షం. ఆటలు బంద్. రామ్, బన్నీ బోర్ అని చెప్పారు. తాతయ్య పాత పెట్టెలోంచి పరమపద సోపానం బోర్డు తీశాడు. ‘ఇది పాము నిచ్చెన ఆటరా. కానీ దీంట్లో లెక్కలు కూడా ఉన్నాయి’ అన్నాడు తాతయ్య. పాచిక వేసి వచ్చిన నంబర్ను పాత గడితో కూడిక చేయమన్నాడు. బన్నీ 5 వేశాడు. 10వ గడిలో ఉన్నాడు. ‘10 + 5 ఎంత?’ అడిగాడు తాత. బన్నీ వేళ్లతో లెక్కపెట్టి ‘15’ అని చెప్పాడు. సరైన గడికి వెళ్లాడు. రామ్ 6 వేశాడు. 22వ గడి. పాము నోట్లో పడ్డాడు. 22 + 6 = 28. కిందకు జారాడు. చుక్క నిచ్చెన ఎక్కింది. ‘నిచ్చెన మంచి పని, పాము తప్పు పని రా’ అని తాత చెప్పాడు. ఆట అయ్యేసరికి బన్నీకి 2 అంకెల కూడికలు వచ్చేశాయి. స్వప్న ఫస్ట్ వచ్చింది. తాతయ్య నవ్వాడు: ‘చూశారా, ఆటలోనే లెక్కలు నేర్చుకున్నారు. ఇదే మన పాత స్కూల్.’ పిల్లలకి మాట: ఆడుతూ నేర్చుకుంటే పాఠం త్వరగా బుర్రకెక్కుతుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ.
● కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్,స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. -
14మంది కోడి పందెం రాయుళ్ల అరెస్ట్
సుల్తానాబాద్రూరల్: కోడి పందెం ఆడుతున్న 14మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఎలిగేడు మండలం శివపల్లి శివారుల్లోని బోడగుట్ట వద్ద రాహస్యంగా కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేశారు. దుగ్యాల కార్తీక్రావు(శివపల్లి), గడ్డం రాజేశ్(ఇందారం), ఒజ్జ శంకర్(శివపల్లి), బత్తుల రాజు(పెద్దపల్లి), సల్లూరి పవన్(మందమర్రి), పొట్లపల్లి మనోహర్, ఎండీ.రహీం(గోదావరిఖని), వెన్న రవీందర్(ఇందారం), వెల్పుల సతీశ్(ఇందారం), పులి నాగరాజు(పెద్దపల్లి), కొల్లూరి మహేశ్(రామగిరి), ఎండీ సమాద్(జైపూర్), సింగరపు అఖిల్వర్మ(పెద్దపల్లి)ను అరెస్టు చేసి 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, కారు రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పెటీ, అర్గనైజిడ్ క్రైం, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టూ యానిమల్స్ యాక్ట్ 1960, తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 కింద కేసు నమోదు చేశారు. పందెం రాయుళ్లను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు రంజిత్రావు, ప్రవీణ్, ఎస్సైలు చంద్రకుమార్, సనత్రెడ్డి, శ్రీధర్, నరేశ్, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
పాముకాటుతో మహిళ మృతి
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం వెన్నంపల్లికి చెందిన పూసాల వజ్రమ్మ(69) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వజ్రమ్మ తన ఇంట్లో పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. పాము కరిచినచోట పసుపు రాసుకుంది. ఈవిషయాన్ని పక్కింటి వారికి చెప్పగా పెద్దపల్లిలో వడ్రంగి పనిచేస్తున్న ఆమె కుమారుడు రమణాచారికి సమాచారం అందించారు. చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. వడ దెబ్బతో రైతు..సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 8వ వార్డు పెద్దూరుకు చెందిన రైతు రాచర్ల రవి (49) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. రవి తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి ఒక్కసారిగా ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కౌన్సిలర్లు, గ్రామస్తులు కోరారు. చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్తో.. కోరుట్లరూరల్: కరెంట్ పెట్టి.. చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని కల్లూర్ శివారు చెరువు మత్తడి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాదాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల మోహన్ (48) మంగళవారం సాయంత్రం విద్యుత్ తీగను చెరువులో వేసి చేపలు పడుతున్నాడు. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్సర్క్యూట్తో లారీ దగ్ధంజగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ బైపాస్రోడ్ నర్సింగాపూర్ వద్ద షార్ట్సర్క్యూట్తో లారీ దగ్ధమైంది. టీఆర్నగర్ గ్రామానికి చెందిన సంపంగి రవీందర్కు చెందిన లారీ జగిత్యాల నుంచి టీఆర్నగర్కు వెళ్తుండగా.. నర్సింగాపూర్ శివారులో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకుని మంటలు ఆర్పేశారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్ తెలిపారు. మొగ్ధుంపూర్లో అగ్నిప్రమాదంకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ధాన్యం ట్రాక్టర్కు తృటిలో ముప్పు తప్పింది. పోచమ్మగుడి ప్రాంతంలోని వరికొయ్యలకు మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించా డు. మంటలు పుట్నాల మిల్లు, రైసుమిల్లు ప్రాంతాలకు విస్తరించాయి. పుట్నాల మిల్లు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్లు కాలిపోగా మంటలు సమీపంలోని రైసుమిల్లు వద్ద నిలిపిన ధాన్యం ట్రాక్టర్ల వద్దకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైసుమిల్లు యజమాని వెంకటేశ్వర్లు హమాలీలతో నీళ్లు పోయించి, మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్లో ఫైరింజన్ అందుబాటులో లేకపోవడంతో చొప్పదండి నుంచి వచ్చిన ఫైరింజన్తో పొలాల్లో వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. రైతులకు చెందిన విద్యుత్మోటార్లు, వైర్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. -
అద్దెకారులో తిరుగుతూ చోరీలు
పెద్దపల్లిరూరల్: కారుడ్రైవర్గా పనిచేస్తే వచ్చే వేతనం ఎటూ సరిపోవడం లేదు. తక్కువ సమయంలోనే ఆర్థికంగా ఎదగాలన్న దురాశతో ఓ కారును అద్దెకు తీసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డ ఊరడి జనార్దన్ను పెద్దపల్లిరూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్కుమార్, పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేశ్తో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్ కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోవడం లేదని, తక్కువ సమయంలో ఎక్కువమొత్తంలో సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితుడు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్తో జతకట్టాడు. ఇందరూ కలిసి అపహరించిన సొత్తును పంచుకున్నారు. వీరితో వెంకటేశ్ సోదరుడు తమ్మిశెట్టి మణికంఠ కూడా చేతులు కలపడంతో ముగ్గురు కలిసి పొద్దంతా కారులో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. 2025 సెప్టెంబర్లో నల్గొండలో ఓ కారు అద్దెకు తీసుకుని వరంగల్, కరీంనగర్ మీదుగా పెద్దపల్లికి చేరుకున్నారు. సుల్తానాబాద్ శివారులో ఓ ఇంటి ముందు ఉంచిన స్కూటీని అపహరించి పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చేరుకున్నారు. సెప్టెంబర్ 15న రాత్రి ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం గుంటూరు మీదుగా గోవాకు పారిపోయారు. అక్కడ కొంత బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా చేశారు. రెండు తులాల బంగారు గొలుసును తమ వద్దనే ఉంచుకున్నారు. మరోసారి పెద్దపల్లి ప్రాంతంలోనే దొంగతనం చేయాలనే ఆలోచనతో ఊరడి జనార్దన్ వచ్చి.. కూనారం రైల్వేగేటు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడ్డట్టు తేలింది. నిందితుడి నుంచి రెడ్కలర్ బలెనో కారు, 20గ్రాముల బంగారుగొలుసు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా దొంగను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం సీపీ, పెద్దపల్లి డీసీపీ, ఏసీపీలు అభినందించారు. తాళం వేసిన ఇళ్లు టార్గెట్ అనుమానంతో అదుపులోకి దొంగతనాలు చేసినట్లు విచారణలో వెలుగులోకి నిందితుడి వివరాలు వెల్లడించిన సీఐ ప్రవీణ్కుమార్ -
ధర్మపురిలో విజయలక్ష్మి లాడ్జి సీజ్
ధర్మపురి: నిబంధనలు పాటించనందుకు ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిని సీజ్ చేసినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పీఎంజే జువెల్లరీ షాపులో ఇటీవల ఆరుగురు వ్యక్తులు చొరబడి బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులు ఈ లాడ్జిలోనే బస చేసి రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్థానిక ఎస్సై మహేశ్ విజయలక్ష్మి లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. యజమాని గుండయ్యను విచారించారు. రికార్డులు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, నిబంధనలు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాలతో.. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి సూచనలతో లాడ్జిని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ట్రేడ్లైసెన్స్ లేకుండా గెస్ట్హౌజ్లు నిర్వహించడం.. గదుల కోసం వచ్చిన వారి నుంచి ఆధార్కార్డులు, వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించామన్నారు. నిబంధనలు పాటించని లాడ్జిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి సూచించామన్నారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ మీటర్లను ఉపయోగిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఏఈకి సూచించామన్నారు. మున్సిపల్ మేనేజర్ గంగాధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. -
సలుపుతున్న రాచపుండు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ శివారులోని సదాశివపల్లిలో రెండు దశాబ్దాలుగా కేన్సర్ భయాందోళనకు గురిచేస్తోంది. పదేళ్ల వ్యవధిలో గ్రామంలో 25 మందికిపైగా కేన్సర్తో మృతి చెందిన ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రైస్ మిల్లుల కారణంగా గాలి, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతుచిక్కని మరణాలపై ‘సాక్షి’లో ‘సదాశివపల్లికి ఏమైంది?’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ స్పందించింది. డీఎంహెచ్వో వెంకటరమణ హుటాహుటిన వైద్యశిభిరం ఏర్పాట్లు చేశారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హౌజింగ్బోర్డు పరిధిలోని సదాశివపల్లిలో కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రారంభ దశలోనే కేన్సర్ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, అందుకే స్క్రీనింగ్ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. సలుపుతున్న రాచపుండు సదాశివపల్లిని కేన్సర్ రూపంలో రాచపుండు సలుపుతోంది. ఇప్పటికే 25 మంది వరకు మృత్యువాతపడగా, వైద్యశిబిరంలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. పరీక్షల్లో 27 మందికి బీపీ, 14 మందికి షుగర్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. గ్రామ ప్రజలందరికీ సమగ్ర పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశముందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. 14ఏళ్లు నిండిన బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందించారు. కేన్సర్ నివారణ చర్యలు, జీవనశైలి మార్పులు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డాక్టర్లు ఉమాశ్రీ, విప్లవశ్రీ, రాజ్కుమార్, పోచయ్య, జీవన్రెడ్డి పాల్గొన్నారు. అనుమానితులందరికీ వైద్య పరీక్షలు సదాశివపల్లిలో అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టాం. మంగళవారం నిర్వహించిన వైద్య శిభిరంలో ఇద్దరికి కేన్సర్ నిర్ధారణ అయింది. పరీక్షలు రెగ్యులర్గా నిర్వహించి ఇంకా ఎవరికై నా వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తాం. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలు చేపడతాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో -
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026
కరీంనగర్: ఊపిరాడనివ్వని ఉక్కపోత.. మాడు పగిలేలా దంచి కొడుతున్న ఎండలు.. చెవుల్లో నిప్పులు పోసినట్లు వీచే వేడిగాలులు.. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి తేడా లేకుండా కొద్దిరోజులుగా వేడెక్కుతున్న వాతావరణం ప్రతీ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం పది గంటలకే ఎండ దంచి కొడుతుండగా.. మధ్యాహ్నం అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తోంది. సాయంత్రం వేడిగాలులు వీస్తుండగా.. పగలూ రాత్రి లేకుండా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు బేజారు అవుతున్నారు. ఉదయం, సాయత్రం పనులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్– 2 డిపో నుంచి ఈనెల 30న మైసూర్, ఊటీ విహారయాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామ ని డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. 30న మధ్యాహ్నం 3గంటలకు కరీంనగర్ బస్స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరుతుందన్నారు. 31న మైసూర్ చేరుకుంటుందన్నారు. మైసూర్ ప్యా లెస్, చాముండే ఆలయం, బృందావన్ గార్డెన్ సందర్శన తువాత రాత్రి బస అక్కడే ఉంటుందన్నారు. 1న ఉదయం 4గంటలకు మైసూర్ నుంచి బస్సు బయల్దేరి ఊటీ చేరుకుంటుందన్నారు. ఊటీలోని వివిధ ప్రదేశాల సందర్శన అనంతరం 3వ తేదీన ఊటీ నుంచి బయల్దేరి బెంగళూరు చేరుకుంటుందన్నారు. అక్కడ బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ప్యాలెస్ సందర్శన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 4వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని వివరించారు. ఈ విహారయాత్రకు పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు టికెట్ చార్జి ఉంటుందని, ప్రయాణంలో భోజనం, దర్శనాల టికెట్ ఖర్చులు ప్రయాణికులే భరించాలని సూచించారు. వివరాలకు 7382847727, 7382850708, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.చిన్న పిల్లలతో భిక్షాటన చేయించొద్దువిద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ బస్టాండ్ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్నారనే సమాచారంతో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్లైన్ 1098 బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో చైల్డ్ హెల్ప్లైన్ 1098 స్టిక్కర్లు అతికించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. చైల్డ్ హెల్ప్లైన్ 1098 జిల్లా కోఆర్డి నేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ బస్టాండ్ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్న వారి గురించి విచారించినట్లు తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం, తప్పిపోయిన పిల్లలు కనిపించడం, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు లేదా ప్రేమపేరుతో ఇంటి నుంచి వచ్చి ఒంటరిగా ఉన్న పిల్లలు కనిపిస్తే చైల్డ్ హె ల్ప్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ బృంద సభ్యులు సుందరగిరి సాయికిరణ్ గౌడ్, ఎడ్ల ప్రియాంక పాల్గొన్నారు. పెట్రో ధరలు తగ్గించాలి కరీంనగర్ కార్పొరేషన్: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్తో కలిసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో లీటరు పెటోల్, డీజిల్పై రూ.4 చొప్పున భారం వేసి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని విమర్శించారు. ఒక్కసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, విడతల వారీగా పెంచుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించే సత్తా కేంద్రానికి లేదన్నారు. ధరలు పెరిగాయంటూ భవిష్యత్లో ప్రజలను గంజినీళ్లు తాగుమని ప్రధాని చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు తాజొద్దీన్, పిట్టల రవీందర్, మల్లికార్జున రాజేందర్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, వరాల నర్సింగం పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనంసప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుందని డీఐఈవో వి.ఆంజనేయరావు తెలిపారు. కరీంనగర్లోని డాక్టర్స్ స్ట్రీట్లోని బాలికల జూనియర్ కళాశాలలో తొలి సెషన్లో భాగంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉత్తర్వులు అందిన అధ్యాపకులను స్పాట్ కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేయాలని సూచించారు.మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా తెలంగాణచౌక్ ప్రాంతంఉక్కపోత..ఉక్కిరిబిక్కిరికరీంనగర్లోనే అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో ప్రజలు ఉష్ణతాపాన్ని భరించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాకు వాతావారణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే 44 డిగ్రీల సెల్సియస్కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెల 25 వరకు జిల్లాలో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లా అంతటా 43 డిగ్రీలపైనే కరీంనగర్ సిటీతో పాటు హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్లో గరిష్టంగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం కరీంనగర్లో గరిష్టంగా 44 డిగ్రీలు, హుజూరాబాద్లో 43.5 డిగ్రీలు, చొప్పదండిలో 43 డిగ్రీలు, మానకొండూర్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్లో రోజంతా రద్దీగా ఉండే తెలంగాణచౌక్, టవర్సర్కిల్, బస్టాండ్ ఏరియా, కమాన్రోడ్ ప్రాంతాలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమవుతున్న జనం భానుడి తాపంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు మినహాయించి బయట పనులకు వెళ్లినవారు 11 గంటలలోపు ఇళ్లకు చేరుకుంటున్నారు. గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత పెరగడం, గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లోనూ వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. రాబోయే 4 రోజుల్లో 45 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. జనగణనకు ‘సన్’స్ట్రోక్కరీంనగర్రూరల్: జనగణనకు వేసవికాలం ఎండలు అడ్డంకిగా మారాయి. ఎండ తీవ్రతకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10గంటల్లోపే గృహాల వివరాలను మొబైల్యాప్లో నమోదు చేస్తున్నారు. ఎండ వేడికి నెమ్మదిగా పనిచేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నెల 15నుంచి ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లోని ఇంటింటికి తిరుగుతూ 33 అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఆందోళనచెందుతున్నారు. ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి 10గంటలవరకు మాత్రమే తమ బ్లాక్లోని ఇళ్ల వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. పురుష ఎన్యుమరేటర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలను నమోదు చేస్తున్నప్పటికీ మహిళలు ఉదయంపూట మాత్రమే పనిచేస్తున్నారు. ఎండప్రభావంతో కేవలం రోజుకు 20 గృహాల నుంచి 25 గృహాల వివరాలను యాప్లో నమోదు చేయాల్సి వస్తోందని ఎన్యుమరేటర్లు పేర్కొంటున్నారు. కరీంనగర్ అర్బన్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో బ్యాంకు అనుసంధాన రుణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇకపై రుణాల మంజూరులో సభ్యుల పనితీరును ప్రామాణికంగా భావించా లని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మహిళా సంఘాల పనితీరు ఆధారంగా మార్కులు కేటా యించే పద్ధతిని తీసుకువచ్చింది. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అందుకోసం సెర్ఫ్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గతానికి భిన్నంగా మార్కుల కేటాయింపు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు గతాని కి భిన్నంగా మార్కులు కేటాయిస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు సభ్యులు ఉంటే సమావేశానికి ఒకరు హాజరై ఇద్దరి సంతకాలు చేసేవారు. ప్రస్తుతం అలా కుదరదు. పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, అప్పులు వసూలు, రుణాల చెల్లింపులు తదితర సనులన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. సమావేశ చిత్రాలను ప్రత్యేక పోర్టల్లో ఆప్లోడ్ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యురాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. జిల్లాలో 74.7 శాతం సంఘాలు మిగిలిన సంఘాలు కూడా పనితీరును మెరుగుపరుచుకొని ‘ఏ’ గ్రేడు సాధించేలా సీసీలు, మండల సమాఖ్య అధికారులు చొరవ చూపుతున్నారు. జిల్లాలో అత్యధిక సంఘాలు ‘ఏ’ గేడులో ఉన్నాయని, మిగితావాటిని మొదటి గ్రేడు కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వివరించారు. కొలమానం ఇలా జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 12,468 ఉండగా 1,36,536 మంది సభ్యులున్నారు. గ్రేడింగ్ విధానంలో మహిళా సంఘాలకు ఎనిమిది అంశాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘం 75శాతానికి పైగా లక్ష్యాలు సాధిస్తే ‘ఏ’ గ్రేడ్, 70–75కు ‘బీ’, 60–70కు ‘సీ’, 60శాతం కన్నా తక్కువ సాధిస్తే ‘డీ’, అంతకంటే దయనీయంగా ఉంటే ‘ఈ’ గ్రేడ్గా నిర్ణయిస్తారు. ఇప్పటివరకు గ్రామైఖ్య సంఘాలకు మాత్రమే గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. ఏ, బీ, సీ గ్రేడింగ్లో ఉన్న గ్రామైఖ్య సంఘాలకే సీ్త్ర నిధి రుణాలు కేటాయిస్తున్నారు. గ్రేడింగ్లో వెనకబడితే బ్యాంకు, సీ్త్ర నిధి రుణాలు పొందడం కష్టంగా మారనుంది. పెరగనున్న అధికారుల పర్యవేక్షణ గ్రేడింగ్ విధానం అమలులోకి రావడంతో మహిళా సంఘాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగనుంది. ఇప్పటికే సమావేశాలకు సంబంధించి ఆక్షాంశ, రేఖాంశాలతో కూడిన లైవ్ ఫోటో తప్పనిసరి చేశారు. రుణ వాయిదాల రికవరీపై ప్రత్యేక దృిష్టి సారిస్తున్నారు. తరచూ సమావేశాల నిర్వహణతో రుణాల చెల్లింపులో వెనుకబడిన సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రేడింగ్లో ఎప్పుడు ముందుండేలా సంఘాల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సమీక్షలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.జూలైలో ఉపాధ్యాయ బదిలీలుకరీంనగర్ టౌన్: ఉపాధ్యాయులకు జూలైలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉంటాయని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్రెడ్డి అధ్యక్షతన పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 139 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 70 మంది మండల టాపర్లను మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా, ఎంఈవోలుగా పదోన్నతులు రానున్నాయని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్రెడ్డి, అబ్దుల్ జమీల్, శ్రీకాంత్రావు, లక్ష్మీనారాయణ, జాలి మహేందర్రెడ్డి, జాలి రాఘవరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బాల్రెడ్డి పాల్గొన్నారు.44 డిగ్రీలు 43 డిగ్రీలుచొప్పదండి :ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల్లోగా పనులు చూసుకోవాలి. బయటకు వెళ్లాలంటే గొడుగులు, టోపీలు, తెల్లని వదులైన దుస్తులు ధరించాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బ వస్తే సమీప వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ -
హోటళ్లు, లాడ్జీలపై నిఘా పెంచాం
కరీంనగర్క్రైం: నగరంలో ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దోపిడీని దృష్టిలో పెట్టుకొని కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ గౌస్ ఆలం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేసినట్లు విచారణలో తేలిందన్నారు. హోటల్, లాడ్జీల్లో రూంలు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను పోలీసులకు చేరవేయాలన్నారు. ప్రతీ లాడ్జీ, హోటల్పై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్రావు, సృజన్రెడ్డి, తిరుమల్ పాల్గొన్నారు. చెక్పోస్టుల తనిఖీ బక్రీద్ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరి కట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సీపీ గౌస్ ఆలం మంగళవారం తనిఖీ చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం తుర్కాసినగర్, చొప్పదండి మండలంలోని ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తనిఖీ రిజిష్టర్లను పరిశీలించి, ప్రతీ వాహనం వివరాలను నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, రూరల్ ఏసీపీ విజయకుమార్, సీఐలు బిల్లా కోటేశ్వర్, ప్రదీప్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. సీపీకి అభినందనలు పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసును 11 రోజుల్లో ఛేదించిన సీపీ గౌస్ ఆలం, పోలీసు బృందానికి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తాడిజెర్రి సర్పంచ్ రామిడి రాజిరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. -
లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
కరీంనగర్/కరీంనగర్ అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైద్య బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైతే పోలీసుశాఖ సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ భ్రూణహత్యలను పూర్తిగా నివారించడంతో పాటు ఆడపిల్లల విషయంలో వివక్షను తగ్గించి, మహిళల హక్కులను పరిరక్షించే దిశగా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. డీసీపీ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పీసీపీఎన్డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, ప్రకృతి, ప్రశాంతి, భువన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరలించిన ధాన్యం మిల్లుల్లో సత్వరమే అన్లోడింగ్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో కె.మహేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల డీఎం రజనీకాంత్, సహకార అధికారి రామానుజచార్యులు, డీఆర్డీవో గీత పాల్గొన్నారు. -
బలహీనవర్గాల సంక్షేమానికి కృషి
కరీంనగర్కార్పొరేషన్: బలహీనవర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం నగరంలోని ఇందిరాభవన్లో రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి అభినందన సభకు హాజరై మాట్లాడారు. కులం, మతం కన్నా విద్యతోనే పురోగతి ఉంటుందని, అందుకే ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కుల సంఘాలకు హైదరాబాద్లో కేటాయించిన స్థలాల్లో త్వరలోనే మహాత్మా జ్యోతి బాపూలే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ, మున్నూరుకాపుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడిన బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడికి పదవి రావడం సంతోషకరమన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో కులం కాలమ్ను చేర్చాలన్నారు. చైర్మన్గా నియమితులైన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన శ్రీరాంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. క్రియాశీలకంగా వ్యవహరించండి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. సగం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కరీంనగర్అర్బన్: జిల్లాలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సీజన్లో 3.61 టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ, 50శాతం కొనుగోళ్లు చేసి రాష్ట్రస్థాయిలో ముందున్నామన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
తెలుసుకునేలోపే అయిపోయింది
మా అమ్మ సుశీల గృహిణి. వ్యవసాయం, ఇల్లు తప్ప మరే వ్యాపకాలు లేవు. ఇటీవల అకస్మాత్తుగా అమ్మ అనారోగ్యం పాలయ్యారు. వైద్యపరీక్షల్లో ఆమెకు కేన్సర్ అని తెలుసుకుని అవాక్కయ్యాం. అది కూడా ఫోర్త్ స్టేజ్ కావడంతో ఏమీ చేయలేకపోయాం. తక్కువ వ్యవధిలోనే అమ్మను కోల్పోయాం. మా అమ్మకు కేన్సర్ ఎలా సోకింది? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. – నల్ల శ్రవణ్రెడ్డి మా నాన్న ప్రతాపరెడ్డి. స్థానిక మిల్లులో ఆపరేటర్గా పనిచేసేవారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం కల్లు కూడా తాగే వారు కాదు. మంచి ఆరోగ్యంగా ఉండేవారు. కానీ, అకస్మాత్తుగా ఆయనకు కేన్సర్ అని తెలిసి ఆశ్చర్యపోయాం. చికిత్స జరుగతుండగానే ఆయన మరణించారు. స్థానికంగా కాలుష్యం వల్ల కూడా ఆయనకు కేన్సర్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం. – అన్నాడి కృష్ణారెడ్డి -
బది‘లీలలు’..పైరవీలు
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సాధారణ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు శాఖల్లో ఇష్టారీతిగా వసూళ్ల దందా సాగుతోందని, ఇందులో ద్వితీయ శ్రేణి నేతలు రంగప్రవేశం చేశారని సమాచారం. ఇటీవల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పలువురు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జిల్లా, మల్టీజోన్ పరిధిలో బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికివారు పైరవీలకు తెరలేపారు. కొందరు మంత్రుల సహకారం కోరుతున్నారు. మరికొందరు అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాగా, ఎక్కడైనా పని చేస్తామనుకునేవారు వీరి నిర్వాకాన్ని చూసి నిర్ఘాంతపోతున్నారు. ఈ నెల 1నుంచి 7 వరకు ఉద్యోగులు/ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాను రూపొందించారు. ఈ నెల 15వరకు ఉద్యోగుల ఆప్షన్లతో కూడిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. కదపకుంటే కాసులే కాసులు కలెక్టరేట్లో అక్కడక్కడే పనిచేసే ఉద్యోగులతోపాటు అధికారులూ ఉన్నారు. వారిలో సింహభా గం ఇక్కడి నుంచి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. అదే క్రమంలో తమకున్న పలుకుబడిని విని యోగిస్తున్నారు. బదిలీల నిబంధనల్లో 40శాతం మించకుండా ఉండరాదన్న కారణాన్ని బూచిగా చూపి సీటు కదలకుండా పావులు కదుపుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రెజరీ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలో ఎక్కువగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బదిలీ తప్పనిసరి అయ్యే ఉద్యోగుల జాబితా నుంచి వెసులుబాటు కల్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుకూల పోస్టుకు పైరవీలు విద్య, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగులు మినహా మిగిలిన 40కి పైగా ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఈ క్రమంలో అనుకూల ప్రాంతంలో పోస్టింగ్ కోసం పలుకుబడి, రాజకీయ నేపథ్యం, మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, రాజకీయ నేతలను కలుస్తూ ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కీలక స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈలు, ఏవోలు, ఏపీవోలతోపాటు ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హులు. నాలుగేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. 2027 మే 31కి ముందుగా రిటైర్డ్ అయ్యేవారికి బదిలీ ఉండదు. ఎక్కువమంది ఒకే చోట కోరితే స్పౌజ్ కేటగిరితో పాటు 70శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేడర్ వారీగా బదిలీల బాధ్యతలు బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టీజోన్, జోనల్, జిల్లా కేడర్గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పోస్టులకు శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనున్నారు. హెచ్వోడీ కన్వీనర్గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే మల్టీజోనల్, జోనల్ స్థాయి పోస్టుల బదిలీలకు హెచ్వోడీ చైర్మన్గా, కార్యదర్శి సూచించినవారు సభ్యులుగా, హెచ్వోడీ సూచించినవారు కన్వీసర్గా వ్యవహరించనున్నారు. జిల్లా కేడర్ పోస్టులకు కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్, డీఆర్వో సభ్యులుగా.. శాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. -
బండి భగీరథ్పై కఠిన చర్యలు తీసుకోవాలి
కరీంనగర్టౌన్: మైనర్ బాలిక విషయంలో అరెస్ట్ అయిన బండి భగీరథ్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడి ఫ్లెక్సీ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్, నారదాసు లక్ష్మణ్రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్కుమార్, రవీందర్రెడ్డి, అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో ధరలు తగ్గించాలి
కరీంనగర్కార్పొరేషన్: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సోమవారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని డీసీసీ కార్యాలయం నుంచి పద్మనగర్ డెయిరీ పెట్రోల్ బంక్ వరకు ప్రదర్శనగా వచ్చి నిరసన తెలిపారు. సామాన్య ప్రజలపై కేంద్రం భారం మోపిందని జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అన్నారు. గాజుల సుకన్య, వంగల కల్యాణి, రజితా రెడ్డి, కవ్వ పద్మ పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటించాలి కరీంనగర్టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని సుభాష్నగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టిస్తున్నదని, పీఆర్సీ కోసం మరో పోరాటం చేయక తప్పదని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉమ్మడి జిల్లా నాయకులు భూక్య రాజేశ్నాయక్, క్రాంతికుమార్, ధర్మాజీ, చాందిని, గుండారపు పోతన్న, గంగన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు. 20న మెడికల్ షాపులు బంద్కరీంనగర్: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ–ఫార్మసీ విధానాలు, తదితర అంశాలపై నిరసనగా ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ చేయనున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మునీందర్ తెలిపారు. సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ–ఫార్మసీలకు సంబంధించిన నోటిఫికేషన్ వల్ల చిన్న మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కరోనా సమయంలో తీసుకొచ్చిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మెడికల్ షాప్ల యజమానులు పాల్గొన్నారు. కళాకారులకు సంక్షేమ పథకాలు అందించాలి కరీంనగర్టౌన్: రాష్ట్రంలోని అన్నిరంగాల కళాకారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు, పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు వరుకోలు సదానందం కోరారు. సోమవారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజానాట్య మండలి మహాసభలు ఈనెల 25,26వ తేదీల్లో హైదారాబాద్లో జరుగుతాయని, కళాకారులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షురాలు కోమల, సహాయ కార్యదర్శులు మంజుల, సదానందం, కోశాధికారి రాజమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు రవి, సముద్రాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభంకరీంనగర్: రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ను కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చిత్రా మిశ్రా సోమవారం ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు (క్రిమినల్ కేసులు లేనివారు) రెడ్ క్రాస్ సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. సభ్యత్వం కోసం దరఖాస్తు ఫాం, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు ప్రతిని సమర్పించి రూ.1,100 శాశ్వత సభ్యత్వ ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 15 నుంచి జూన్ 15 వరకు రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం మినహా) రెడ్ క్రాస్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చైర్మన్ పి.కేశవరెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏమైంది..?
సదాశివపల్లికిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: అది దాదాపు రెండువేల జనాభా గల కరీంనగర్ శివారులోని చిన్న గ్రామం. తీగల వంతెనను ఆనుకుని చూసేందుకు అందంగా కనిపిస్తుంది ఈ గ్రామం. ఇటీవలే దీన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రస్తుతం గ్రామంలో అంతుచిక్కని మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దకాలంలో సుమారు 25 మంది వరకు అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. వారంతా అకాల మరణం చెందారని, ఇందుకు కేన్సరే కారణమన్నది మిగిలిన గ్రామస్తుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. ఆకస్మిక మరణాలకు కేన్సర్ కారణమని తెలిసినప్పటి నుంచి గ్రామంలో విద్యావంతులు, కాస్త స్థితిమంతులు ముందు జాగ్రత్తగా స్క్రీనింగ్ పరీక్షలకు సిద్ధమవుతుండడం గమనార్హం. అసలేం జరుగుతోంది? సదాశివపల్లి కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. ఈ ఊరు ఇటు మానకొండూరుకు చెరువుకు, అటు కరీంనగర్ను ఆనుకుని ప్రవహిస్తున్న మానేరువాగుకు మధ్యలో ఉంటుంది. ఈ అనుకూలత కారణంగా దశాబ్దాల క్రితం ఇక్కడ అనేక రైస్మిల్లులు స్థాపించారు. రైస్మిల్లుల కారణంగా ఇక్కడ గాలి, భూగర్భజలాలు కలుషితమై ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంట కోతలు పూర్తయి.. వరి మిల్లుల్లో ఆడించే సమయంలో వరి పొట్టు, బూడిద, ఇతర దుర్వాసనలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వేసవిలో పారా బాయిల్డ్ రైస్ మిల్లలు నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా గ్రామంలో అనారోగ్యంతో చనిపోతున్న పలువురు వ్యక్తుల మరణాలపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. వీరంతా కేన్సర్లతో మరణిస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే, ఒకే గ్రామంలో 25 మంది వరకు కేన్సర్తో మరణించడం, మరో 20 మంది వరకు కేన్సర్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారన్న వార్త కలవరపాటుకు గురిచేస్తుంది. శాసీ్త్రయత ఎక్కడ? చిన్న గ్రామంలో ఇంత మంది కేన్సర్బారిన పడ్డారన్న విషయం ఆందోళనకరం. కానీ, మరణించిన వారికి కేన్సర్ ఎందుకు వచ్చింది? మిగిలిన వారికి ఎలా సోకింది? అన్న విషయం వీరెవరికీ అంతు చిక్కడం లేదు. కేన్సర్ మహమ్మారి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దానికి స్థానికంగా కాలుష్యం ఒక కారణం మాత్రమే. ఆ కాలుష్యమే బాధితులకు కేన్సర్ రావడానికి కారణంగా నిలిచిందా? అన్న ప్రశ్నకు వైద్యారోగ్య శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. దీనికి శాసీ్త్రయంగా వైద్య పరీక్షలు జరిపితే గానీ, అసలు లోపం ఎక్కడుంది? ఏ కారణం వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారన్న విషయంపై స్పష్టత రాదు. దీనిపై డీఎంహెచ్వో వెంకటరమణను వివరణ కోరగా.. త్వరలో వైద్యపరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని వెల్లడించారు. -
అమ్మా.. ఆవేదన ఆలకించరూ..
కరీంనగర్ అర్బన్: ‘ప్రతీ సోమవారం కలెక్టరేట్కు వస్తున్నాం.. పోతున్నాం.. సమస్యలు మాత్రమే అలాగే ఉంటున్నయ్.. మండుటెండలో మాకిదేం బాధమ్మా’.. అంటూ వృద్ధులు, అర్జీదారులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో గోడు వెల్లబోసుకున్నారు. తమ పిల్లలు పట్టించుకోవడం లేదని నాలుగువారాలుగా ప్రజావాణికి వస్తున్నామని, అయినా సాంత్వన కరవైందని వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ కాగా కలెక్టర్కు వివరిస్తూ పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, కుమారుల నిరాదరణ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన అర్జీలు రాగా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..జవాబుదారిగా ఉండాల్సిన సర్పంచ్ అసభ్యకరంగా మాట్లాడుతోంది. గ్రామంలో జరిగిన అక్రమాలపై పలువురు ఫిర్యాదు చేస్తే ఇటీవల జరిగిన సమావేశఽంలో తీవ్ర పరుష పదజాలంతో దూషించింది. దళిత సర్పంచినంటూ ఇబ్బందికరంగా మాట్లాడుతుండగా పరిపాలన ఇబ్బందిగా మారింది. ఎవరూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చెప్పుతో కొడతానంటున్నారు. ఇదేం పద్ధతి. – చింతల శ్రీధర్రెడ్డి, ఉపసర్పంచ్, లింగాపూర్, శంకరపట్నంమరిది కొడుకు వెంకటేశ్కు ఇంట్లో ఆశ్రయమిచ్చాను. నా భర్త చనిపోయాక అతని పేరున ఉన్న డబ్బులు తీసుకునేందుకు నామిని సంతకం కావాలని చెప్పి నాతో బాండ్ పేపర్పై వేలిముద్రలు తీసుకున్నాడు. తీరా అది వేరేవారితో చదివిస్తే దత్తత అని రాయించుకున్నట్లు తెలిసింది. ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఒత్తిడి చేస్తూ, మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాతో పాటు నా భూమి కొనుగోలు చేసిన ముస్కు లక్ష్మి, వేల్పుల శ్రీనివాస్ కుటుంబాలకు కూడా ప్రాణహాని ఉంది. పోలీసు రక్షణ కల్పించి అతడిని వెంటనే నా ఇంటి నుంచి ఖాళీ చేయించండి. – వేల్పుల రాధమ్మ, ఉప్పరమల్యాల, గంగాధర రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. రోజువారీగా లేబర్ అడ్డాకు వెళ్లి పనులు వెతుక్కుంటాం. ఉండటానికి ఇల్లు లేదు. కిరాయి ఇళ్లలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తే మాకు ఇదివరకే బంగ్లా, కార్లు ఉన్నాయని ఆన్లైన్లో చూపిస్తుందట. ఇదెక్కడి అన్యాయం. అన్ని ఉన్నాయని నమోదు చేసిన అధికారులెవరూ.? అవెక్కడున్నాయో అధికారులే చూపించాలి. – రాజమణి, పద్మ, చల్లా పద్మ, చింతకుంట, కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువలో పోయిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సర్వే నంబర్ 543/ఎ లోని భూమిలో రైస్మిల్లు నిర్మించారు. ఉన్న కొద్దిపాటి భూమికి మరింత భూమిని కలిపి రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. అంతా తెలిసి కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు.? అక్రమ నిర్మాణాలు జరిగినా మిన్నకుండటమేంటీ.? – రాజిరెడ్డి, ముగ్ధంపూర్, కరీంనగర్రూరల్జీవో 81ను అమలు చేయకుండా నాన్చడం తగదు. 61 ఏళ్లు నిండినవారి వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. గత ప్రభుత్వం 81,85 జీవోలను జారీ చేయగా తహసీల్దార్ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించారు. కానీ నేటికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి న్యాయం చేయాలి. – తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా జేఏసీ -
సముద్రజీవుల పొడుపు కథలు
6. స్వాతి చినుకులై నోరు తెరిచి ఎదురుచూసే సముద్ర జీవి ముత్యమంటి బిడ్డను కని కడుపులోనే దాచుకునే జీవి 4. నీలంగా ఉంటాను నీళ్లల్లో ఉంటాను కెల్లా పెద్ద జంతువును నేనెవరో చెప్పండి? 1. పేరు గుర్రమే కానీ పరుగెత్తలేదు ఉండేది సముద్రమే కానీ చేపకాదు 2. మెదడు లేదు కళ్లు లేవు కానీ ఐదు చేతులుంటాయి నీటిలో మెరిసే నక్షత్రం 5. ఎనిమిది కాళ్లుంటాయి కానీ సాలీడు కాదు నీళ్లలో నివాసముంటుంది కానీ చేప కాదు జవాబులు: 1.సీహార్స్, 2.స్టార్ఫిష్, 3.మొసలి, 4.నీలి తిమింగలం 5. ఆక్టోపస్, 6. ఆల్చిప్ప 3. నీళ్లలో ఉంటే ఏనుగునైనా పట్టేస్తుంది ఒడ్డున పడేస్తే విలవిలలాడుతుంది రంపం లాంటి పళ్లు నోట్లో ఉంటాయి డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
ఆరోగ్య రక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ అండ
కరీంనగర్: మనిషి ఒక్కసారి తీవ్ర అనారోగ్యం పాలైతే అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా వైద్యానికే ఖర్చవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మానసిక ప్రశాంతతతో జీవించవచ్చని కరీంనగర్ మెడికవర్ వైద్యులు తెలిపారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో హెల్త్ సెక్టార్ ఉద్యోగులు, ప్రజలకు హెల్త్టాక్, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అతనికి అవసరమైన వైద్యాన్ని సమయానికి అందించేందుకు ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఆందోళన చెందడం కంటే ముందుగానే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఉత్తమమని సూచించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి వైద పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు రవికుమార్, లోకేశ్, రాకేశ్, ఉపేందర్రెడ్డి, తాహా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు కుమార్ గోపు, కడార్ల శ్రీనివాస్, మాదాసు సాగర్, హరీశ్, మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
కరీంనగర్రూరల్: పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. కరీంనగర్రూరల్ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గోపాల్పూర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తూరి చందు ఇసుక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకుని పంచనామా చేస్తుండగా, సుల్తానాబాద్ మండలం గొల్ల పల్లికి చెందిన గున్నాల హరీశ్(31) ఇసుక ట్రాక్టర్ను యూటర్న్ చేసుకుని దుర్శేడ్ మీదుగా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్ హెడ్లైట్లను ఆర్పేసి వేగంగా పోతున్న క్రమంలో దుర్శేడ్ శివారులో నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. డ్రైవర్ ఎగిరి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వెంటనే హరీశ్ను అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ వివాహం చేసుకున్న హరీశ్కు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. న్యాయం చేయాలంటూ రాస్తారోకో హరీశ్ మృతిచెందాడనే సమాచారంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులతో చర్చలు విఫలం కావడంతో న్యాయం చేయాలంటూ మంచిర్యాల చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. హరీశ్ మృతికి కారణమైన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా హరీశ్ ట్రా క్టర్పై ఇప్పటికే రెండు కేసులున్నాయని, మరోసారి పోలీసులు పట్టుకుంటే సీజ్ చేస్తారనే భయంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
చెట్టమ్మ
పచ్చని తల్లిరా మన చెట్టు మూగజీవాలకు నీడపట్టు పక్షి పిల్లలకు గూడుకట్టు స్వచ్ఛమైన గాలిని వీచిపెట్టు బాటసారులకు విశ్రాంతి గట్టు ! ఆరోగ్యానికి పండ్లు కోసిపెట్టు అనారోగ్యానికి మందు రాసిపెట్టు విస్తారమైన వర్షాలను రాబట్టు కరువు కాటకాలను పోగొట్టు గొడ్డలితో నరికితే పగబట్టు ! ప్రేమతో సాకితే ప్రాణభిక్ష పెట్టు మొక్కలు నాటుటకు నడుంకట్టు హరిత సేవకు శ్రీకారం చుట్టు ప్రకృతి సంపదకు హారతి పట్టు చెట్టమ్మకు చెయ్యెత్తి జైకొట్టు !!! బోనగిరి. పాండురంగ తొర్రూరు టౌన్ జిల్లా: మహబూబాబాద్ -
ఎండాకాలం.. బండి పైలం
Heat Waveకరీంనగర్/జ్యోతినగర్: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకే కాకుండా వాహనాల భద్రతకూ సవాలుగా మారుతున్నాయి. మనిషి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఎంత జాగ్రత్త తీసుకుంటారో, వాహనాలు, ఎలక్ట్ట్రానిక్ పరికరాలను కాపాడుకునేందుకు అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. వాహనాలను ఎండలో గంటల తరబడి పార్కింగ్ చేయడం వల్ల పెట్రోల్ ఆవిరైపోవడం, ఇంజిన్ వేడెక్కడం, టైర్లలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వాహనాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ● వాహనాలను ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు చెట్ల నీడ లేదా షెడ్లలో నిలపాలి. వాహన రేడియేటర్లో నీటి స్థాయిని తరచూ పరిశీలించాలి. టైర్లలో గాలి ఒత్తిడి సరిగా ఉందో లేదో చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయిలను నిరంతరం పరిశీలించాలి. ప్రయాణానికి ముందు బ్రేకులు, బ్యాటరీ పరిస్థితిని తనిఖీ చేయాలి. పెట్రోల్, డీజిల్ను కాకుండా రాత్రి, సాయంత్రం సమయాల్లో నింపడం మంచిది. ● గ్యాస్ కిట్లతో నడిచే వాహనాలను మరింత జాగ్రత్తగా ఉపయోగించాలి. అధిక వేడి సమయంలో దీర్ఘకాల ప్రయాణాలు తగ్గించడం మంచిది. వాహనాల్లో ఏసీ నిల్వ ఉండేందుకు అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఉపయోగించడం ప్రయోజనకరం. ● వేసవిలో మొబైల్ ఫోన్లు త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం, పేలుడు ప్రమాదం కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లను ఎండలో ఉంచొద్దు. చార్జింగ్ సమయంలో ఫోన్ను ఉపయోగించకూడదు. లోకేషన్, బ్లూటూత్, హాట్స్పాట్ వంటి అవసరం లేని ఫీచర్లను ఆఫ్ చేయాలి. నకిలీ చార్జర్లు, లోకల్ బ్యాటరీలను ఉపయోగించొద్దు. ● ల్యాప్టాప్లు ఎక్కువ వేడితో స్లో కావడం, హ్యాంగ్ అవ్వడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ల్యాప్టాప్ను బెడ్, దుప్పట్లపై కాకుండా గాలి వెళ్లే స్థలంలో ఉపయోగించాలి. కూలింగ్ ప్యాడ్ ఉపయోగించడం మంచిది. ఎక్కువసేపు చార్జింగ్లో ఉంచకుండా జాగ్రత్తపడాలి. ● పవర్ బ్యాంకులు, బ్లూటూత్ ఇయర్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి పరికరాలను అధిక వేడి నుంచి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో పార్కింగ్తో అగ్ని ప్రమాదాల భయం పెట్రోల్ ఆవిరి, ఇంజిన్ వేడి, టైర్ల పేలుళ్లకు అవకాశం అధిక వేడితో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లకు ముప్పు జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు వేసవిలో వాహనాలను నీడలో ఉంచాలి. ఇంజిన్ ఆయిల్ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తే మార్గమధ్యలో బండికి కాస్త విరామం ఇవ్వాలి. ద్విచక్రవాహనంలో పెట్రోలు ట్యాంకు ఫుల్గా ఉంచరాదు. – సత్యం, బైక్ మెకానిక్, ఎఫ్సీఐ క్రాస్ రోడ్, ఎన్టీపీసీ ల్యాప్ట్యాపులకు కూలింగ్ ప్యాడ్లను ఉపయోగించాలి. చల్లని ప్రదేశంలో వాడాలి. ఎక్కువ సమయం చార్జింగ్లో ఉండకుండా జాగ్రత్త పడాలి. డేటాను ప్యాకప్ చేసుకోవాలి. – కూర మహేశ్వర్రెడ్డి, విజన్ టెక్నాలజి, ఎన్టీపీసీ -
గుండెపోటుతో ఉపాధిహామీ కూలీ మృతి
ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తిలో సోమవారం గుండెపోటుతో ఉపాధి కూలీ అంకతి మల్లవ్వ (56) మృతి చెందారు. గ్రామశివారులో కొత్త రాముని గుండ్లవద్ద కంటూరు కందకాలు తవ్వేందుకు వెళ్లిన ఆమె పనులు చేస్తుండగానే చాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయింది. తోటి కూలీలు మెట్పల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారు రాజీవ్ రహదారిపై సోమవారం ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొని జుపక రాహుల్(27)అనే సెంట్రింగ్ వర్కర్ మృతి చెందాడు. ఎస్సై వేణుగోపాల్ కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన రాహుల్ కాట్నపల్లిలోని అత్తగాంటికి వెళ్లి తిరిగి సుద్దాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి బాబు(1) ఉన్నాడు. -
బీ కేర్ఫుల్
కరీంనగర్స్పోర్ట్స్: వేసవి సెలవుల నేపథ్యంలో మైదానాల్లో చిన్నారుల సందడి నెలకొంది. ఈనెల 1 నుంచి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఏడాది భానుడు భగ్గుమంటున్నాడు. శిక్షణ శిబిరాల్లో చిన్నారులు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. శిక్షణకు ముందే తగినంత నీరు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఉన్న పండ్లు తినాలి. ప్రాక్టీస్ మధ్యలో ఎలక్ట్రోలైట్ పౌడర్ వాడాలి. ఖాళీ కడుపుతో ఎండలో క్రీడలు ఆడకూడదు. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, మజ్జిగ తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్ల రసాలు తాగాలి. లేత రంగు దుస్తులు ధరించాలి. తలకు క్యాప్ ధరించడం మర్చిపోవద్దు. శిక్షణ తర్వాత వెంటనే చన్నీళ్లతో స్నానం చేయొద్దు. ఉదయం 9 గంటలలోపు శిక్షణ కార్యక్రమాలు ముగించాలి. సాయంత్రం 5 గంటల తర్వాతే మైదానంలో దిగాలి. నీడ ఉన్న ప్రదేశాల్లో వార్మప్ చేయాలి. శిక్షణ మధ్యలో విరామ సమయాన్ని పెంచాలి. ఎండ ఎక్కువగా ఉంటే ఇండోర్ గేమ్స్పై దృష్టి పెట్టాలి. గాలి సరిగ్గా ఆడని ప్రదేశాల్లో సాధన చేయొవద్దు. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే శిక్షణ ఆపేయాలి.కోచ్ సూచనలు తప్పకుండా పాటించాలి. కంటినిండా నిద్ర (కనీసం 8 గంటలు) ఉండాలి. ● భగ్గుమంటున్న ఎండలు ● క్రీడా శిక్షణ శిబిరాల్లో జాగ్రత్తలు తప్పనిసరి ● కోచ్లు, డాక్టర్ల సలహాలు పాటించాలంటున్న నిపుణులు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులు, క్రీడాకారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తరచూ నీరు, ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవాలి. అధిక ఎండలో ఎక్కువసేపు సాధన చేయడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మూత్రం ముదురురంగులో వస్తుంటే మీ శరీరంలో నీరు తగ్గిందని అర్థం. వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. – డాక్టర్ వివేక్రావు, పిల్లల వైద్య నిపుణుడు మైదానంలో ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టుగా శరీరానికి ఇంధనం అందించాలి. వేసవిలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తింటే త్వరగా అలసిపోతారు. ప్రతి క్రీడాకారుడు తమ వెంట వాటర్ బాటిల్తో పాటు నిమ్మరసం లేదా గ్లూకోజ్ నీటిని తప్పనిసరిగా ఉంచుకోవాలి. శిక్షణకు ముందు, మధ్యలోతర్వాత కూడా నీరు తాగుతూ ఉండాలి. – వేల్పుల సురేందర్, ఫిజికల్ డైరెక్టర్ -
రవాణాపై భారం
ఇప్పటికే రవాణా రంగం కుదేలవుతోంది. గిట్టుబాటు కాకున్నా ఈఎంఐలు కట్టేందుకై నా ట్రాక్టర్ నడపాల్సి వస్తోంది. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరతో రవాణా ఖర్చు మరింత పెంచాల్సి వస్తోంది. రైతుల ధాన్యం, మక్కలను మార్కెట్కు తరలించాలంటే ఇంతకుముందు దూరాన్ని బట్టి రూ.1500 తీసుకునేది. ఇప్పుడు రూ.1700 తీసుకోవాల్సి వస్తోంది. – రాజు, ట్రాక్టర్ యజమాని ధరల స్థిరీకరణ ఉండాలి ధరల స్థిరీకరణ ఉండేలా ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగగానే ఇతర రంగాలపై పెను భారం పడుతోంది. సదరు రంగాలపై పక్కాగా పర్యవేక్షణ చేసి ఽవినియోగదారులకు ప్రయోజనం కలిగేలా చూడాలి. ధరలు పెంచడం కాకుండా ప్రభుత్వాలు తీసుకునే ట్యాక్స్లు తగ్గించుకుంటే మంచిది. – పత్తెం శ్రీనివాస్, ఉపాధ్యాయుడు -
యూసీఎఫ్ ప్రతిపాదనలు తనిఖీ
కరీంనగర్ కార్పొరేషన్: అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్)లో కరీంనగర్ నగరపాలకసంస్థను చేర్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అధికారి చేపట్టిన నగర పర్యటన ఆదివారంతో ముగిసింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నగరంలోని యూసీఎఫ్ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నగరపాలకసంస్థ సర్వసభ్యసమావేశం రూపొందించిన మూడుప్రాజెక్ట్లకు సంబంధించిన రూ.895 కోట్ల ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించారు. వీటిపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు నివేదిక అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా యూసీఎఫ్లో కరీంనగర్ను చేర్చే అంశాన్ని మంత్రిత్వశాఖ వెల్లడించనుంది. రెండో రోజు పర్యటన యూసీఎఫ్ ప్రతిపాదనలను ఫీల్డ్ లెవెల్లో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారి దీపు టాం కరీంనగర్కు వచ్చారు. శనివారం రాత్రి నగరానికి వచ్చిన ఆయనకు మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రపుల్దేశాయ్ స్వాగతం పలికారు. మొదటి రోజు డంప్యర్డ్తో పాటు, అధికారులతో చర్చించి, ఆదివారం రేకుర్తి, తీగులగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డంప్యార్డ్తో పాటు, బల్దియా కౌన్సిల్ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్ట్ల ప్రతిపాదనల వివరాలు తెలుసుకున్నారు. రోడ్లు, నాలాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. స్కైవాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, మోడల్ రోడ్స్, మోడల్ జంక్షన్ తదితర ప్రతిపాదిత సైట్లు తనిఖీ చేసి తిరిగి ఢిల్లీకి వెళ్లారు. వారం లోగా స్పష్టత దేశవ్యాప్తంగా నగరాల్లో అమలు చేయనున్న అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించింది. పథకంలో చేరిన నగరాలకు నేరుగా 25శాతం వాటాను విడుదల చేస్తుంది. మిగతా 25శాతం రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలకసంస్థ భరించాల్సి ఉంటుంది. 50 శాతం బ్యాంక్ రుణాలు, బాండ్ల విక్రయం, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో నగరపాలక సంస్థ అధిక భారాన్ని మోయాల్సి ఉన్నప్పటికీ పథకంలో ఎంపికై తే నగరం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్ యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ను చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ను యూసీఎఫ్లో చేర్చేందుకు సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి రెండు రోజుల పాటు నగరంలో క్షేత్రస్థాయి తనిఖీచేసి వెళ్లారు. ప్రక్రియ పూర్తయినందున మరోవారం రోజుల్లో యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ను చేర్చడంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ స్కీంలో కరీంనగర్ను ఎంపిక చేస్తే స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ తరువాత ఆ స్థాయిలో నిధులతో నగరం స్వరూపం మారనుంది. -
అకాడమ్మీల దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాడమీల పేరుతో ఇంటర్ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీ అంటూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహిస్తున్న బన్సాల్ క్లాసెస్, ఆకాశ్ ఇనిస్టిట్యూట్కు అనుమతి లేదని, ఐఐటీ, నీట్, ఎప్సెట్ అకాడమీలు ఇంటర్ బోర్డు పరిధిలోకి రావని, వాటిలో విద్యార్థులు ప్రవేశాలు పొంది మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని డీఐఈవో ఆంజనేయరావు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
టీచర్ పాత్ర అనిర్వచనీయం
కరీంనగర్ టౌన్: విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీ యమని అదనపు కలెక్టర్, డీఈవో అశ్వినీ తా నాజీ వాకడే అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివా రం విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వ హించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచినవారిని ప్రశంసాపత్రాలు, నగదు బహుమతితో సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశ్వినీ తావాజీ వాకడే మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత గురువుస్థానం గొప్పదన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత విద్యను అభ్యసించి ఆదర్శప్రాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, విద్యార్థులకు సదుపాయాలు, నాణ్యమైన బోధన అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఐఈవో వి.ఆంజనేయరావు, విద్యాశాఖ ఏడీ మాధవి, సెక్టోరల్ అధికారులు మిల్కురి శ్రీనివాస్, అశోక్రెడ్డి, దాసి శ్రీనివాస్, ఉమారాణి, మహేందర్, రవీందర్, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య పాల్గొన్నారు. ఫాల్కన్ అథ్లెట్ల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్స్పోర్ట్స్: ఫాల్కన్ అథ్లెటిక్స్ క్లబ్ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 40ఏళ్ల క్రితం అథ్లెటిక్స్ కోచ్ స్వర్గీయ కిషోర్కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఏర్పాటు చేసుకున్న ఈ క్లబ్ సభ్యులంతా ఒకచోట కలుసుకుని, ఆనందంగా గడిపారు. జిల్లాకేంద్రంలోని వీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో క్లబ్ సభ్యులు 60మంది పాల్గొన్నారు. మొదట క్లబ్ సభ్యులుగా ఉండి మరణించిన క్రీడాకారులకు సంతాపం తెలిపారు. పలువురిని సత్కరించా రు. సభ్యులందరూ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్ర,జాతీయస్థాయిలో ప్రతిభ చాటే వారికి ప్రోత్సాహకాన్ని అందించాలని తీర్మానించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సా రంగపాణి, జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, సుమన్ కల్యాణ్, రిటైర్డ్ ఎస్పీ మురళి, వరంగల్ రేంజ్ ఏసీపీ నరేందర్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్, రిటైర్డ్ ఎస్సై నందెల్లి శేఖర్, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, సర్పంచ్ కర్పూజ తిరుపతి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్, టీజీపెట రాష్ట్ర కార్యదర్శి నాగరాజుగౌడ్ పాల్గొన్నారు. ఉన్నతస్థాయికి చేరుకోవాలి కరీంనగర్ సిటీ: విద్యార్థులు తమ ప్రతిభను అ భివద్ధి చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలి పారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. వివిధ కార్యక్రమాలపై నివేదికను కామర్స్ విభాగ అధ్యాపకురాలు, కమిటీ సభ్యురాలు జె.స్వప్న సమర్పించారు. సిటీలో పవర్కట్ కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు ఏబీ స్విచ్ల మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్కాలనీ, ఉజ్వల పార్కు ఫీడర్ల పరిధిలోని సప్తగిరి కాలనీ, కొత్త పీహెచ్సీ సెంటర్, ప్రభుత్వ హైస్కూల్ లైన్ నుంచి బైపాస్ రోడ్, సప్తగిరిహిల్స్ రోడ్డు నంబర్ 3,4,5, జానకీ వీధి రోడ్ నంబర్ 1,2,3, ఏవోస్ కాలనీ రోడ్ నంబర్ 1,2,3,4, రామచంద్రాపూర్కాలనీ రోడ్ నంబర్10.13.16.18,20, బైపాస్ రోడ్ హెచ్పీ గ్యాస్ గోదాం, వెంకటాద్రికాలనీ, శ్రద్ధ ఇన్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం, డిమార్ట్, బైపాస్, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం. లావణ్య తెలిపారు. -
ఇంధన భారం రూ.8.60కోట్లు
కరీంనగర్ అర్బన్: గ్యాస్ ధర గుదిబండగా మారగా, పెట్రోల్, డీజిల్ ధరలు గుబులు రేపుతున్నా యి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కేంద్రం ధరలు పెంచడంతో సామాన్యుడి బడ్జెట్ అందనంత ఎత్తుకు చేరుతోంది. పెరిగిన ఇంధన ధరలతో జిల్లా వినియోగదారులపై నెలకు రూ.8.60కోట్ల భారం పడుతోంది. వాహనమెక్కాలంటే తడుముకోవాల్సిందే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.107.55 ఉండగా శుక్రవారం పెరిగిన ధరతో 110.97కు చేరింది. డీజిల్ లీటరు ధర రూ.95.78 నుంచి రూ.99.06కు చేరింది. దీంతో లక్షల వాహనాలకు ఇంధన భారం తడిసిమోపెడవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ.55 ఉండగా ఏటేటా పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం. నెలకు రూ.8.60 కోట్ల భారం పెట్రోల్, డీజిల్ ధరల మోతతో జిల్లాపై నెలకు రూ.8.60కోట్ల భారం పడుతోంది. జిల్లాలో 83 పెట్రోల్ బంకులుండగా 5లక్షల ద్విచక్ర వాహనాలు, 2లక్షల మూడు, నాలుగు చక్రాల వాహనాలున్నాయని సమాచారం. రోజుకు 3.60లక్షల లీటర్లు పెట్రోల్ వినియోగమవుతుండగా నిత్యం రూ.10.80లక్షల భారం పడుతుండగా నెలకు రూ.3.24కోట్ల భారం పడుతోంది. నిత్యం డీజిల్ వినియోగం 6లక్షల లీటర్లు కాగా రూ.18లక్షల భారం పడుతుండగా నెలకు రూ.5.40కోట్ల భారం పడుతోంది. రెండూ కలిపి నెలకు మొత్తంగా రూ.8.60 కోట్ల భారం పడుతోంది. అన్ని వర్గాలపై ప్రభావం జిల్లాలో వరి కోతలు సాగుతుండగా ఽట్రాక్టర్లు, లారీల ద్వారా ధాన్యం రవాణా చేస్తుండగా రైతులకు అదనపు భారం పడుతోంది. కూరగాయలతో పాటు వాణిజ్యరంగాలపై భారమే. మరో పక్షం రోజులైతే వానాకాలం సాగు ప్రారంభం కానుండగా దుక్కులు దున్నడం, నారుమళ్లు దున్నడం, ఎరువు రవాణా వంటి వాటిపై అదనపు వ్యయం తప్పదంటున్నారు అన్నదాతలు. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు పెరగగా మరింత పెరిగే అవకాశఽముందని వ్యాపారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్రోల్ బంకులు: 83ద్విచక్ర వాహనాలు: 5లక్షలు మూడు, నాలుగు చక్రాల వాహనాలు: 2లక్షలు రోజుకు పెట్రోల్ వినియోగం: 3.60లక్షల లీటర్లు డీజిల్ వాడకం: 6లక్షల లీటర్లు పెరిగిన ధరతో లీటర్ పెట్రోల్ రూ.110.97డీజిల్ రూ.99.06జిల్లాలో ఇంధన విక్రయాలు -
● బస్తాలు తరలించరు.. గన్నీలు ఇవ్వరు ● మక్కల కొనుగోళ్లలో ఇదేం నిర్లక్ష్యం?
కరీంనగర్ అర్బన్: ఆరుగాలం కష్టించిన అన్నదాత కు మార్కెట్లోనూ నిత్య రణరంగమే అవుతోంది. పంట పండించడం ఒక ఎత్తయితే పంటను విక్రయించడం మరో ఎత్తవుతోంది. అధికారుల ప్రణా ళిక లేమి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో పక్షం రోజులుగా పంటను విక్రయించేందుకు పడిగాపులు కాస్తుండటం అన్నదాత వంతవుతోంది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో డీసీఎంఎస్ మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. ఎటూ చూసిన మక్కల కుప్పలే మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లను పర్యవేక్షిస్తుండగా అధికారులు నిర్వహణను గాలికొదిలేశారు. మక్కల కుప్పలతో మార్కెట్ నిండిపోగా గన్నీలు ఇచ్చింది లేదు.. కాంటా పెట్టింది లేదు. పెడితే తరలించేదే ఉండదు. కరీంనగర్ రూరల్ మండలంతో పాటు తిమ్మాపూర్, కొత్తపల్లి మండలాల రైతులు మక్కలను ఎక్కువ మొత్తంలో తీసుకురాగా కొనుగోళ్లు జాప్యం అవుతున్నాయి. ఇవేం నిబంధనలు మక్కల కొనుగోళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలు విధించడం రైతులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. ఎకరానికి 40క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా మారింది. ఇక విక్రయించే వారిలో కౌలు రైతులుండగా అసలు రైతులు హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉంటుండగా వేలిముద్ర వేసేందుకు రావడం కష్టమే. పలువురి వేలిముద్రలు రాకపోగా ఐరిస్ వంటి ఆప్షన్ లేదు. ఇక ప్రధానంగా పంటల వివరాల నమోదులో అప్పటి ఏఈవోలు సరిగా వివరాలు నమోదు చేయలేదని స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా మక్కల కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సన్న స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కొనుగోలు చేసిన పంటను తక్షణమే తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
నేటి నుంచి ధర్మవరం – నాందేడ్ రైలు
రామగుండం: ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ఆదివారం నుంచి క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీచేసింది. నాందేడ్ – ధర్మవరం(17635) ప్రతీ శుక్రవారం రాత్రి 10.00గంటలకు పెద్దపల్లికి చేరుకుని 20 నిమిషాలపాటు ఆగుతుంది. ధర్మవరం–నాందేడ్(17636) పెద్దపల్లికి ప్రతీ ఆదివారం అర్ధరాత్రి 11.55 గంటలకు చేరుకుంటుంది. ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంటలో హాల్టింగ్ కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని కదిరి లక్ష్మీనర్సింహస్వామి, తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళి, బాసర శ్రీజ్ఞాన సరస్వతీ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈరైలు సౌకర్యవంతంగా ఉంటుంది. -
అంత్య పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
విద్యానగర్(కరీంనగర్): సరస్వతి నది అంత్య పుష్కరాలకు భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు సూచించారు. శనివారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ మాసానికి సంబంధించి అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ని బస్స్టేషన్లలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు ఎం.శ్రీనివాస్, ఐ.మిజయమాధురి, ఎం.నాగభూషణం, ఎన్.వెంకన్న, వి.రవీంద్రనాఽఽథ్, వి.శ్రవణ్కుమార్, కె.కల్పన, ఎన్.మనోహర్, ఎం.సరస్వతి, ఎ.ప్రకాశ్రావు, బి.శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ కార్యాలయం సూపర్వైజర్లు ఎం.స్రవంతి, ఎన్.జ్యోత్స్న పాల్గొన్నారు. -
వసూళ్ల గ్యాంగ్ అరెస్ట్
కరీంనగర్ రూరల్: జల్సాలకు అలవాటు పడి, గ్యాంగ్గా ఏర్పడి చంపుతామంటూ బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్న ముగ్గురిని కరీంనగర్రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు.. వావిలాలపల్లికి చెందిన పుతుంపరంబిల్ రోహన్(19) ఈ నెల 13న తీగలగుట్టపల్లిలో బాక్స్ క్రికెట్ ఆడేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. కిరాణం వద్ద నిల్చున్న రోహన్ వద్దకు కరీంనగర్లోని దుర్గమ్మగడ్డకు చెందిన దావ దర్శన్, గాంధీనగర్కు చెందిన కాసారపు రోహిత్కుమార్ అలియాస్ రిషి వచ్చి కొంతదూరం తీసుకెళ్లారు. అతనిపై దాడి చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్న క్రమంలో మరో వ్యక్తి కొనగాని మధు వచ్చి బావిలో తోసి చంపేస్తామంటూ బెదిరించాడు. రోహన్ తన వద్ద ఉన్న ఐఫోన్ ఇవ్వడంతో విడిచిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం బొమ్మకల్ బైపాస్రోడ్డులో నిందితులను అరెస్టు చేశారు. వారినుంచి స్విఫ్ట్ డిజైర్ కారు, ఐఫోన్తో పాటు మూడు సెల్ఫోన్లు, రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దావ దర్శన్పై కరీంనగర్ త్రీటౌన్లో మూడు కేసులు, రోహిత్కుమార్పై కరీంనగర్ టూ టౌన్లో పోక్సో కేసు, మధుపై 1టౌన్లో గంజాయి కేసు ఇప్పటికే ఉందని సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. -
బన్నీ వేసవి యాత్ర–9
మధ్యాహ్నం అయ్యింది. ఆకాశంలో నల్ల మబ్బులు. గాలి వీచింది. ‘టప టప’ వాన మొదలైంది. వెంటనే ‘టప్’ అని కరెంట్ పోయింది. ఇల్లంతా చీకటి. బన్నీకి భయం. ‘ఇప్పుడు ఏం చేద్దాం?’ అన్నాడు. తాతయ్య నవ్వాడు. ‘ఆట ఆడదాం.’ నానమ్మ లాంతరు వెలిగించింది. చిన్న వెలుగు వచ్చింది. అందరూ లాంతరు చుట్టూ కూర్చున్నారు. తాతయ్య నేల మీద గుంటలు చేశాడు. చిన్న చిన్న గుంటలు. ఒక పెద్ద డబ్బాలో చింత గింజలు తెచ్చాడు. ‘ఇవి వామన గుంటలు’ అన్నాడు తాతయ్య. ‘మన తాతల ఆట. ఫోన్ లేదు, బ్యాటరీ లేదు.’ రామ్, చుక్క, స్వప్న, బన్నీ కూర్చున్నారు. తాతయ్య ఆట నేర్పాడు. గింజలు ఏరుకోవాలి. లెక్క పెట్టాలి. బన్నీ మొదటి సారి ఆడాడు. ఓడిపోయాడు. తాతయ్య అన్నాడు, ‘ఓడితే శిక్ష ఉంది.’ బన్నీకి భయం. తాతయ్య నవ్వాడు. ‘శిక్ష ఏంటంటే... ఒక పొడుపు కథ చెప్పాలి.’ తాతయ్య అడిగాడు, ‘అరచేతిలో వైకుంఠం ఏమిటి?’ బన్నీ ఆలోచించాడు. తెలియలేదు. చుక్క చెవిలో చెప్పింది, ‘దీపం!’ బన్నీ ‘దీపం!’ అన్నాడు. అందరూ నవ్వారు. చప్పట్లు కొట్టారు. బయట వాన. లోపల నవ్వు. పిల్లలకి మాట: ఓడిపోతే ఏడవకూడదు. గెలిస్తే పొగరు వద్దు. ఆడితే సంతోషం వెలగాలి. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
రండి.. నేర్చుకుందాం
సప్తగిరికాలనీ(కరీంనగర్): శోధిస్తే సాధించనిది అంటూ ఏమీ ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఏదో ఒక నైపుణ్య సాధనకు అభ్యాసమే మందు. పది, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటే చక్కటి భవిత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిభ, నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే ఉపయోగకరం ఉంటుందంటున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలుగుతారని, బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయని సలహాలిస్తున్నారు. వేసవి సెలవులను వినోదానికే పరిమితం చేయకుండా, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలంటున్నారు. ● పదోతగతి తర్వాత ప్రతిభ ఆధారంగా తీసుకునే కోర్సులు, ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన స్టెప్పై కసరత్తు చేయాలి. ఉపాధి చూపే కోర్సులు, పలువురి అభిప్రాయాలు తీసుకొని ముందడుగు వేయాలి. ● నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సెలవు రోజుల్లో ప్రధాన పట్టణాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు, డిజిటల్ స్కిల్స్పై దృష్టి పెట్టాలి. ● ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. సెలవులు ముగిసేలోగా పట్టు సాధిస్తే భవిష్యత్లో ఉపాధికి డోకా ఉండదు. ● విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావ వ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం, భాషా నైపుణ్యంతో వివరించగలగడం, అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి సెలవుల్లో శిక్షణ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తుంటారు. వాటిలో చేరి సాధన చేయవచ్చు. ● నిర్మాణరంగం శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనులకు డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు దొరుకుతాయి. ● మహిళలు మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఒక లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కొచ్చు. ● సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్లో సీటు సాధించే అవకాశముంటుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారు ఆ దిశగా కసరత్తు ప్రారంభించాలి. ఈ కోర్సులకు ప్రభుత్వపరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో వెసులుబాటు ఉంటుంది. ● పరీక్షలు ముగిశాక పుస్తకాలతో పనేమీ లేదని సెల్ఫోన్లో చిట్చాట్లు, టీవీతో ఎంజాయ్ చేద్దామనుకుంటే భవితను నాశనం చేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా ఫోన్తో కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఫోన్లో విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. వినియోగించుకోవాలి. విద్యార్థులు సెలవులను సరిగ్గా వినియోగించుకోవాలి. అకాడమిక్ చదువులతో పాటు నైపుణ్యాలపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే సరైన కోర్సు ఎంపిక చాలా ముఖ్యం. ఉన్నత విద్యకు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం. డిగ్రీలో చేరాలనే వారికి ఎస్సారార్లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ, ప్రిన్సిపాల్, ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల, కరీంనగర్ 03. లోపలికి ఎవరడుగు పెట్టినా కొరుకుతాయి చీల్చుతాయి కుక్కలు మాత్రం కాదు ముప్పై రెండు ఉంటాయి ముళ్లు మాత్రం కాదు 04. ప్రాణవాయువును పీల్చుకుంటుంది వాసనలను చక్కగా చెపుతుంది దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది 05. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది ఇంత గారాబమైతే ఎలాగమ్మా! 01. ఇదో మెత్తని మాంసం ముద్ద తీపి కారమంటూ రుచులను విడమరిచి మరీ చెప్తుంది 32 రౌడీల మధ్య నివసిస్తుంది 02. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ తాను నోరిప్పి ఒక్కమాట మాట్లాడదు అంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా రింగులు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది. జవాబులు 01. నాలుక 02. చెవి 03. పళ్లు 04. ముక్కు 05. నోరుపొడుపు కథలుడాక్టర్ కందేపి రాణీప్రసాద్ – రచయిత్రి, పిల్లల వైద్యనిపుణులు – సిరిసిల్ల, రాజన్నసిరిసిల్ల పిల్లలు మీరూ పంపండి...వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని నిపుణుల సలహా అదనపు కోర్సులపై ఇంటర్, టెన్త్ విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచన ఉన్నత లక్ష్యాలకు మార్గాలను అన్వేషించాలని పిలుపు నేటి ప్రపంచంలో నైపుణ్యాలే విజయానికి కీలకం. కేవలం మార్కులు కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ రెండింటితో పాటు విద్యార్థులు బహుముఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ బలంగా ఉంటుంది. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. లైబ్రరీలో వార్తాపత్రికలు, పుస్తకాలు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలపై అధ్యయనం చేయాలి. – వి.అంజనేయరావు, ఇంటర్ విద్యాధికారి, కరీంనగర్ పరీక్షల తర్వాత సమయం వృథా చేయకూడదు. చిన్న చిన్న నైపుణ్యాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారుతాయి. విద్యార్థులు తమ ఆసక్తులను గుర్తించాలి. గురువుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం ఖాయం. పాలిటెక్నిక్లో ఎన్నో కోర్సులు భవిష్యత్కు దిక్చూసిగా ఉన్నాయి. – డి.శోభారాణి, ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ మహిళా కళాశాల, కరీంనగర్ పిల్లలు సెలవులను సృజనా త్మకంగా వినియోగించాలి. ఫోన్, టీవీకి పరిమితం కా కుండా కొత్త విషయాలు నే ర్చుకోవాలి. నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం. భవిష్యత్కు ఉపయోగపడే కోర్సులు ఎంచుకోవాలి. తల్లిదండ్రులుగా మేము కూడా మార్గదర్శకత్వం ఇస్తాం. – మట్ట అంజిరెడ్డి, పేరెంట్ ఇంటర్ పూర్తయ్యాక నా లక్ష్యంపై మరింత స్పష్టత వ చ్చింది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించా ను. ఇటీవలే నీట్ రాశాను. ఇప్పుడు అదనంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలనుకొంటున్నాను. భ విష్యత్తులో మంచి స్థానం సంపాదించాలనుకుంటున్నాను. – సిరి కార్తీక పరీక్షలు పూర్తయ్యాయి. రిజల్ట్స్ వచ్చాయి. 562 మార్కులు సాధించాను. ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాను. కానీ భవిష్యత్ కోసం ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాను. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటాను. సెలవుల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోని ముందుకు వెళ్లాలనేది నా లక్ష్యం. – ఎల్.హన్సినిరెడ్డి, విద్యార్థిని -
శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు
భీమన్న ఆలయంలోని శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు నగరేశ్వరస్వామి ఆలయంలో చండీ హోమం నిర్వహిస్తున్న అర్చకులు, హాజరైన భక్తులు వేములవాడ: శని అమావాస్య, శని జయంతి సందర్భంగా శనివారం వేములవాడలోని వివిధ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి, అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం భీమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శనివారం అమావాస్య ప్రభావంతో భీమన్న దర్శనాలకు భక్తులు పెద్దగా రాలేదు. నిత్య చండీ హోమం నగరేశ్వరస్వామి ఆలయంలో నిత్య చండీ హోమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు హోమాలు నిర్వహిస్తారని, ఈ హోమానికి రూ.1516గా టికెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ఒక టికెట్పై ఇద్దరిని కూర్చోబెడతారని పేర్కొన్నారు. -
విద్యుత్ పొదుపుగా వాడాలి
కొత్తపల్లి: వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడవచ్చు. రోజూ ఒక్క యూనిట్ ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినవారమవుతాం. విద్యుత్ ఆదాకు నాణ్యమైన ఐఎస్ఐ మార్కుగల, స్టార్ రేటేడ్ పరికరాలను ఉపయోగించాలి. విద్యుత్ కుక్కర్లకు బదులు ప్రెషర్ కుక్కర్లు వినియోగించాలి. వేసవికాలంలో ఏసీల వినియోగం పెరిగింది. 25 డిగ్రీల సెంటిగ్రేడ్కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయడం, ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవాలి. – కె.ఉపేందర్, డీఈ (టెక్నికల్), కరీంనగర్ సర్కిల్ -
అమ్మకాలు పెరిగాయి
ఈ సమ్మర్లో స్పోర్ట్స్ సామగ్రి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ కిట్స్కు డిమాండ్ ఉంది. చిన్నారులు ఎక్కువగా తక్కువ ధరలో ఉండే కిట్స్ కొంటున్నారు. ప్రతీ రోజు షాపులో రద్దీ కనిపిస్తోంది. గతేడాది కంటే ఈసారి వ్యాపారం బాగుంది. – నాగిరెడ్డి సిధారెడ్డి, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు సమ్మర్ క్యాంప్స్తో అమ్మకాలు పెరిగాయి. క్యాంప్కు వచ్చే పిల్ల లు కిట్ కొంటున్నారు. స్విమ్మింగ్, క్యారమ్, చెస్, కరాటే స్పోర్ట్స్ కిట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా క్వాలిటీ వస్తువులే కొంటున్నారు. ఈ సీజన్ బిజినెస్ బిజీగా ఉంటుంది. – బుర్ర పవన్, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు -
చివరి ఉత్తరం
● రాజమహేంద్రవరం గోదావరి గట్టుమీద పాత పోస్టాఫీసు ఉంది. అక్కడ రామయ్య తాత 40 ఏళ్లు పోస్ట్మ్యాన్గా పనిచేశాడు. రిటైర్ అయ్యాక కూడా ప్రతీ రోజు ఉదయం ఆ పోస్టాఫీసు మెట్ల మీద కూర్చుని గోదావరి చూసేవాడు. ● ఒకరోజు ఉదయం తాత చేతిలో పసుపు పచ్చని పాత కవరు పడింది. చిరునామా మసకబారింది. ‘కమల, శారద నిలయం, రాజమహేంద్రవరం’ అని మాత్రమే కనిపించింది. పంపిన వాడి పేరు ‘మోహన్, ముంబాయి’. తేదీ 1987. ● తాతకు గుర్తు వచ్చింది. మోహన్, కమల కాలేజీ ప్రేమ. మోహన్ ముంబాయి ఉద్యోగానికి వెళ్లాడు. కమల తండ్రి పెళ్లి కుదిర్చేశాడు. ఆ తర్వాత వాళ్లు కనిపించలేదు. ● తాత వెంటనే శారద నిలయం వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ 70 ఏళ్ల కమల అమ్మమ్మ ఒంటరిగా ఉంది. తాత ఆ కవరు చేతిలో పెట్టాడు. ఆమె చేతులు వణికాయి. ● ‘ఇది మోహన్ చివరి ఉత్తరం. నా పెళ్లి తర్వాత నేను తిరిగి రాయలేదు. వాడు ఇంకో పెళ్లి చేసుకోలేదట. రెండేళ్ల క్రితం పోయాడని తెలిసింది’ అని కళ్లు తుడుచుకుంది. ● కవరు తెరిచింది. లోపల చిన్న కాగితం. ‘కమల, నీకు కోపమొచ్చినా నేను వేచి ఉంటా. గోదావరి ఆగుతుందా? నా ప్రేమ కూడా ఆగదు. – మోహన్’ ● కమల అమ్మమ్మ ఆ ఉత్తరం గుండెలకు హత్తుకుంది. 37 ఏళ్ల తర్వాత చేరిన మాటలు, గోదావరి గాలి మోసుకొచ్చిన జ్ఞాపకం. ● ఆ రోజు తాత ఇంటికి నడుస్తూ అనుకున్నాడు, ‘ఒక ఉత్తరం ఆలస్యమైనా, ప్రేమ ఆలస్యం కాదు’. నీతి: మాటలు, భావాలు సమయానికి చేరకపోయినా వాటి విలువ తగ్గదు. నీతి కథఎన్. శ్రీకర్ గ్రామం: ఊటురు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
గంజాయి రవాణా కేసులో ఐదుగురి అరెస్టు
జ్యోతినగర్: గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తేన్నారనే సమాచారంతో ఎస్సై ఆధ్వర్వంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగాఅం గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాలోని చిత్రగొండలో కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. ఈమేరకు మల్కాన్గిరి జిల్లాకు చెందిన రాజేశ్కుమార్ నాయక్, ఎస్.బషీర్, చైతన్య మాడి, గౌతమ్ రాయ్, సిద్ధార్థ రంజన్ దాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 12 కేజీల గంజాయితో పాటు కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాదారులను చాకచక్యంతో పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నారు. 12 కేజీల గంజాయి, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి -
క్రికెట్ కిట్ కొన్నాను
సమ్మర్ హాలీడేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి నేను క్రికెట్ బ్యాట్, బాల్, కిట్ కొన్నాను. మా ఫ్రెండ్స్తో ప్రతి రోజు ఆడుకుంటున్నాను. టీవీ, మొబైల్ కంటే గ్రౌండ్లో ఆడటం బాగుంటుంది. ఈవినింగ్ క్రికెట్లో కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. – హర్ష నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్లో పేరెంట్స్ కొత్త రాకెట్ కొనిపెట్టారు. మా కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి ఆడుతున్నాం. ఇలా ఆడడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. స్కూల్ మొదలయ్యాక కూడా ఈవినింగ్ ఆడుతాం. – ఆవంతిక -
చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణం ఇందిరానగర్కు చెందిన హమలీ కార్మికుడు సందెళ్ల శేఖర్ (27) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శేఖర్ తోటి హమాలీలతో కలిసి శుక్రవారం రాయికల్ పెద్ద చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు శేఖర్ మద్యం మత్తులో చెరువులోకి వెళ్లగా ఈత వచ్చినప్పటికీ ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవేందర్నాయక్ తెలిపారు. -
పొడుపు కథలు
01. వీరు అవిభక్త కవలలు గాలి ప్రాణస్నేహితురాలు స్నేహితురాలు దగ్గరగా వచ్చిందా ఉబ్బితబ్బిబ్బవుతారు కాస్త దూరంగా జరిగిందా చప్పగా చప్పబడిపోతారు కాసేపు కనిపించనేలేదనుకో ప్రాణాలే విడుస్తారు 02. చిక్కుడు గింజలాంటి ఆకారం చెట్టు మీద కాదు శరీరంలో వడపొయ్యటమే పని తేనీటిని కాదు.. రక్తాన్ని మలినాలను బయట పారేస్తుంది ఇంటి నుంచి కాదు వంటి నుంచి జవాబులు: 01. ఊపిరితిత్తులు 02. కిడ్ని 03. లివర్03. అత్యంత పెద్ద గ్రంథి ఆహార ధాన్యాల గిడ్డంగి రసాయన ప్రయోగశాల ఎవరో చెప్పుకోండి! డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రచయిత్రి, సిరిసిల్ల -
బన్నీ వేసవి యాత్ర–8
పాలు తాగాక తాతయ్య బయటకు వెళ్లి, ‘బన్నీ రారా’ అని పిలిచాడు. బన్నీ వెళ్లాడు. చుక్క, రామ్ కూడా వచ్చారు. పొలం గట్టు. కింద నీళ్లు. నీళ్లలో బురద. పచ్చగా వరి నాట్లు. తాతయ్య చెప్పాడు, ‘ఇదే మన పొలం. ఇక్కడే అన్నం పుడుతుంది.’ బన్నీకి ఆశ్చర్యం. ‘బియ్యం షాప్ నుండి తెస్తారు కదా తాతయ్యా?’ తాతయ్య నవ్వాడు. ‘లేదు రా. మొదట ఇక్కడే. ఈ బురదలో వంగి పని చేస్తేనే, మనం తలెత్తుకు తినగలం.’ బన్నీకి వివరంగా తాతయ్య చెప్పాడు. బన్నీ గట్టు మీద నడుస్తున్నాడు. అడుగు జారింది. ‘భళ్లున’ బురదలో పడ్డాడు. కాలు మోకాలు వరకు దిగింది. బన్నీకి భయం వేసింది . ‘అమ్మా !’ అని అరిచాడు. చుక్క పరిగెత్తుకు వచ్చింది. ‘భయం వద్దు బన్నీ’ అంది. చెయ్యి ఇచ్చింది. బన్నీ చుక్క చెయ్యి పట్టుకున్నాడు. చుక్క గట్టిగా లాగింది. రామ్ కూడా సాయం చేశాడు. బన్నీ బయటికి వచ్చాడు. కాలు అంతా బురద. కానీ మనసులో నవ్వు. చుక్క అంది, ‘చూశావా? ఆపదలో ఉన్నవాడికి చెయ్యి అందించడమే స్నేహం.’ తాతయ్య బన్నీ తల నిమిరాడు. ‘ఇప్పుడు తెలిసిందా? అన్నం విలువ.’ కష్టపడితేనే పంటలు పండుతాయి. ఆ పంట నుండే తిండి గింజలు వస్తాయి. పిల్లలకి మాట: కష్టం తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది. స్నేహం అంటే కష్టంలో చెయ్యి అందించడం. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
నా విహార యాత్ర
నా పేరు సాత్విక్. నేను సచ్ దేవా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇటీవల నేను వైజాగ్, అరకు లోయలను సందర్శించాను. ఈ యాత్ర నాకు ఎంతో ఆనందం, కొత్త అనుభవాలను ఇచ్చింది. మొదట మేము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వెళ్లాం. అక్కడ సముద్రపు అలలు, కెరటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సముద్ర తీరంలో నీళ్లలో ఆడుతూ చాలా సరదాగా గడిపాను. అక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తర్వాత మేము అరకు లోయను సందర్శించాం. అరకు లోయలోని పచ్చని కొండలు, చల్లని వాతావరణం ఎంతో అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా కొండలపైకి వెళ్లి కిందికి చూస్తే మేఘాలు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చినట్టుగా కనిపించాయి. ఆ దృశ్యం నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే గిరిజన గ్రామదర్శిని ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అక్కడి గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ చాలా ఆకట్టుకుంది. నేను కూడా వారిలా అలంకరించుకొని ఫొటోలు దిగాను. ఆ అనుభవం చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది. మేము ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఉడెన్ బ్రిడ్జ్, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించాం. ఈ పర్యటన ద్వారా నాకు ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, కొత్త ప్రాంతాల విశేషాలు తెలుసుకున్నాను. ఈ యాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. –పేరు: కె. సాత్విక్ పాఠశాల: సచిదేవా స్కూల్. ఊరు: గోదావరిఖని , జిల్లా: పెద్దపల్లి -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ.
● కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్,స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. -
యూసీఎఫ్కు ఓకే!
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: నగరపాలకసంస్థను అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గతంలో స్మార్ట్సిటీ కింద ఎంపికై న కరీంనగర్ వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చెందడం తెలిసిందే. మరోసారి అదే స్థాయిలో యూసీఎఫ్ కింద నిధులు వరద రానుంది. ఈ పథకంలో ఎంపిక కోసం ఇటీవల కౌన్సిల్ తీర్మాణం చేసి పంపించగా, క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శనివారం కేంద్ర అధికారుల బృందం నగరానికి రానుంది. నేడు కేంద్ర అధికారుల బృందం రాక.. యూసీఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.895 కోట్ల మూడు ప్రాజెక్ట్లకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అంగీకరించినట్లు సమాచారం. మూడు ప్రాజెక్ట్ల్లో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.65 కోట్లు ఉన్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు శనివారం కేంద్ర అధికారుల బృందం కరీంనగర్ కు రానుంది. నగరంలో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు. ఫలిస్తున్న ‘బండి’ కృషి యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ను చేర్చడంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి ఫలిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలకవర్గం ఏర్పడ్డాక యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. -
పెట్రోమంటపై వినూత్న నిరసన
కరీంనగర్ టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చిందని, పెంచిన ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గీతా భవన్ చౌరస్తాలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే సర్కారు గ్యాస్, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచిందన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, జి.రాజేశం, తిప్పారపు సురేశ్, రాయికంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పైసలు కొట్టు.. కొలువు పట్టు!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో వివిధ ‘ఖాళీ’ల భర్తీ కొంతమంది అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఖాళీని కొత్త వారితో భర్తీ చేసినా, ఉన్నవారికి ‘అప్పగించినా’.. ఆ పోస్టుకు తగినట్లుగా రేటు పలకాల్సిందే. ఇలా కనిష్టంగా రూ.50 వేలు... గరిష్టంగా రూ.2 లక్షలు చేతులు మారుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు తమకు లేని అధికారాలతో బల్దియాపై పెత్తనం సాగిస్తున్న తీరు, అక్రమాలకు బాటలు వేస్తోంది. లేబర్ టు జవాన్.. రూ.50 వేలు? నగరపాలకసంస్థలోని 66 డివిజన్లలో పారిశుధ్య పనులను శానిటేషన్ జవాన్లు పర్యవేక్షిస్తుంటారు. తమకు కేటాయించిన డివిజన్లలో కార్మికుల హాజరు తీసుకోవడం, కార్మికులతో వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేయించడం వీరి విధి. 66 డివిజన్లకు గానూ 52 డివిజన్లకే జవాన్లు ఉన్నారు. మిగితా డివిజన్లలో ఇన్చార్జీలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి డివిజన్కు ఒక జవాన్ ఉండాలనే ఆదేశాలతో ఆరుగురు పారిశుధ్య కార్మికులను అప్గ్రేడ్ చేస్తూ జవాన్లుగా నియమించారు. ఇందులో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము చీపురు, తట్ట పట్టిన చోటే పర్యవేక్షించే అవకాశం రావడంతో రేటు గట్టిగానే పలికినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని, ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా ఈ ‘డీల్’ కుదిరినట్లు సమాచారం. మరో ఏడుగురు కార్మికులను జవాన్లుగా అప్గ్రేడ్ చేసేందుకు సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా ఒకరిద్దరు అధికారులు బేరసారాలు కొనసాగిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గతంలోనూ అంతే వివిధ కారణాలతో వారధికి సరెండర్ చేయడంతో ఏర్పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలోనూ ఒకరిద్దరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఇప్పటికే అధికంగా ఉన్నందున కొత్తగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఖాళీలు ఏర్పడ్డాయనే సాకుతో ‘నియామకాల దందా’కు తెరతీసినట్లు, ఈ వ్యవహారంలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు చేతులు మా రినట్లు సమాచారం. కారణం ఏదైనా ఖాళీల భర్తీ పేరిట కొత్త, పాత వాళ్లతో సాగుతున్న ఈ వసూళ్ల దందాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టి విచారణ జరిపించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.‘నగరంలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి డివిజన్కు ఒక జవాన్ ఉండాలి. ఒక్కో జవాన్కు రెండు డివిజన్ల బాధ్యతలు ఉంటే పర్యవేక్షణ కష్టంగా మారుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. జవాన్ ఖాళీలు భర్తీ చేయాలి’.. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు పాలకవర్గ సభ్యుల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. దీంతో ప్రతి డివిజన్కు శానిటేషన్ జవాన్ ఉండేలా మేయర్, కమిషనర్లు చర్యలకు పూనుకున్నారు. ఇదే అదనుగా జవాన్ల ఖాళీలను భర్తీ చేసే సాకుతో పారిశుధ్య విభాగానికి చెందిన అధికారులు అక్రమ వసూళ్ల దందాకు తెరలేపారు’.‘నగరపాలకసంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను గతంలో వివిధ కారణాలతో వారధికి సరెండర్ చేశారు. దీంతో పలుశాఖల్లో ఖాళీలు ఏర్పడి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొద్ది నెలల క్రితం తీసుకొన్నారు. ఈ ‘ఖాళీ’ లను భర్తీ చేసే క్రమంలోనూ పారిశుధ్య విభాగ అధికారులు ఒకరిద్దరు వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులున్నాయి. చర్యలు తీసుకోవాలి నగరపాలకసంస్థలో కొద్దిరోజులుగా నియామకాల పేరిట జరుగుతున్న పారిశుధ్య అధికారుల అక్రమ కలెక్షన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎలాంటి ప్రామాణికత లేకుండానే పారిశుధ్య కార్మికులను జవాన్లుగా నియమిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పేరిట జవాన్లను నియమిస్తూ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించి, కొంతమంది అధికారులు రూ.లక్షలు దండుకొంటున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – గుగ్గిళ్లపు రమేశ్, మాజీ డిప్యూటీ మేయర్ -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
జమ్మికుంట: మక్కల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులను కలిసి కొనుగోళ్ల ప్రక్రియ, గన్నీబ్యాగుల కొరత, రవాణా ప్రక్రియపై ఆరా తీశారు. అధికారులు కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. లోడ్ చేసిన బస్తాలను వెంటనే గోదా ముకు తరలించి, నిల్వ చేయాలన్నారు. మార్కె ట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న, హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, డీఎంవో మహ్మద్ షాబోద్దీన్, తాహసీల్దార్ వెంకట్రెడ్డి, టౌన్ సీఐ రామకృష్ణ, మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి రాజా, సెంటర్ ఇన్చార్జి ఎగిత అశోక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ రైతు దగా ప్రభుత్వంకరీంనగర్ అర్బన్: చెప్పేదొకటి.. చేసేదొకటన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. రైతు ప్రభుత్వమని సుద్దులు పలికే పాలకులు 20రోజులుగా మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన ఎందుకు నిలవడం లే దని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో అసౌకర్యాలతో పాటు దొంగల బెడద ఉందని, తాగునీరు, నీడ లేదని ఆరోపించారు. మార్క్ఫెడ్తో పాటు వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడే ప్రమాదం ఉందని, మక్కలను వెంటనే కాంటా పెట్టి గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాం సుందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి నాయక్, సుంకిశాల సంపత్ రావు, పాల్గొన్నారు. వేగవంతంగా కొనుగోళ్లుకరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మా ర్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగానే కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదని, వరి, మొక్కజొన్న కొనుగోళ్లు యథావిధిగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డును పరిశీలించి పారిశుధ్య నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెట్ యార్డ్ మొత్తం క్లీనింగ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. చివరి గింజ వరకూ వరి, మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నగర అభివృద్ధే లక్ష్యంకరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రెండవ డివిజన్ చంద్రపురికాలనీలో రూ.15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. 13, 44వ డివిజన్ల పరిధి సప్తగిరికాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన కమ్యునిటీ హాల్ను ప్రారంభించారు. త్వరలోనే ప్రతి డివిజన్ను రూ.10 లక్షల సాధారణ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేటర్లు చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, తెల్ల లక్ష్మి రమేశ్ పాల్గొన్నారు. -
బక్రీద్ బందోబస్తు కట్టుదిట్టం
కరీంనగర్క్రైం: బక్రీద్ సందర్భంగా కరీంనగర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పండగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అడ్డుకునేందుకు నగర సరిహద్దులు, ప్రధాన రహదారుల వద్ద ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. సీపీ గౌస్ ఆలం గురువారం అర్ధరాత్రి తరువాత మొగ్ధుంపూర్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న రక్షణ పరికరాలపై ఆరా తీశారు. శనివారం వరకు ప్రతి చెక్పోస్టు వద్ద అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆరు చెక్పోస్టులు జిల్లా పరిధిలోని కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్, కొత్తపల్లి మండలం చింతకుంట, చొప్పదండి మండలం ఆర్నకొండ, తిమ్మాపూర్ మండలం రేణికుంట, హజూరాబాద్ మండలం పరకాల ఎక్స్రోడ్డు, గంగాధర మండలం తుర్కసినగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్పోస్టులో మూడు టార్చ్లైట్లు, ఎల్ఈడీ బాటన్లు, అత్యవసర విజిల్స్ అందుబాటులో ఉండాలని సీపీ స్పష్టం చేశారు. రాత్రివేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించాలని సూచించారు. చెక్పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనం, వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనుమానాస్పద వాహనాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిష్టర్లు నిర్వహించాలని, సమాచార మార్పిడికి ప్రత్యేక కమ్యూనికేషన్ బేస్సెట్లు ఏర్పాటు చేయాలన్నారు. బక్రీద్ సమయంలో అక్రమ రవాణా, నిబంధనల ఉల్లంఘనలు, అనుమానాస్పద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ ప్రత్యేక తనిఖీల ఉద్దేశమని సీపీ తెలిపారు. -
జాతీయ క్రీడల్లో ‘ఖాకీ’ సత్తా
హుజూరాబాద్: అఖిల భారత పోలీస్ క్రీడాపోటీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి సత్తాచాటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈనెల 9 నుంచి 13 వరకు జరిగిన పోటీల్లో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో నాలుగు పతకాలు సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో జరిగిన హోరాహోరీ పోటీల్లో ఏసీపీ మాధవి తన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఆకట్టుకున్నారు. విధుల్లో తీరికలేని అధికారిణిగా సేవలందిస్తూనే క్రీడల్లోనూ రాణించడం విశేషంగా మారింది. టేబుల్ టెన్నిస్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం, జీవో 40ప్లస్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం సాధించారు. ఎన్జీవో మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం కై వసం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఒకే జాతీయ పోటీల్లో రెండు విభిన్న క్రీడల్లో పతకాలు సాధించడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. పతకాలు సాధించిన ఏసీపీ మాధవిని సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. సహచర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
పుస్తకం.. మంచి నేస్తం
కరీంనగర్ కల్చరల్: గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞానాన్ని పంచే నిలయాలని కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీవో మహేశ్వర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత ఫోన్లకే పరిమితం కాకుండా పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రంథాల యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పలు పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. -
ఆ నాటి ఆటలే బాగుండే..
మా నాన్న చిన్ననాటి కాలంలో ఊరు మొత్తం పది టీవీలే ఉండేవి. వేసవి కాలం వచ్చిందంటే ఉదయాన్నే నిద్రలేవగానే వరికోసిన మడికట్లలో తొమ్మిదింటి వరకు క్రికెట్ ఆడేవారు. ఇంటికి వచ్చి అన్నం తిని చేనుల వద్దకు వెళ్లేవారు.. ఈత పళ్లు, తాటి ముంజలు, పులిచింతకాలు తెంపుకుని పంచుకునే వారు. దగ్గర్లో ఉన్న బావుల్లో ఈత కొట్టేవారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్లీ అన్నం తిని చింతచెట్ల కింద ఆడుకునేవారు. ఎండ చల్లబడగానే.. మళ్లీ మడికట్లకు చేరుకునేవారు. సాయంత్రం సూర్యుడు వెళ్లిపోయే వరకు క్రికెట్ ఆడుకుని వచ్చేవారు. రాత్రికి మా నానమ్మ.. చేసిచ్చే చిరుతిండి తినుకుంటూ టీవీ చూసేవారమని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. కానీ.. ఇప్పుడు ఆ ఆటలు కనిపించడం లేదు. అలాంటి స్నేహితులు దొరకడం లేదు. నాన్న ఉద్యోగం, మా చదువుల కోసం సిటీకొచ్చి పడ్డాం.. ఇరుకు గదుల్లో ఉంటూ పంజరంలో పక్షిలా బతుకుతున్నాం. ఎండాకాలం అని మా మమ్మీ ఉదయం తొమ్మిదైనా నిద్ర లేవనివ్వడం లేదు. నిద్రలేచి స్నానం చేసిన తరువాత టిఫిన్ తిని టీవీ చూడడం, మళ్లీ చదువుకోవడం పొద్దంతా ఇంట్లో టీవీలో కార్టూన్లు చూడడం వరకే సరిపోతుంది. బయటికి వెళ్దామంటే అమ్మ ఎండ అంటుంది. గంటో అరగంటో ఆడితేనే అలిసిపోతున్నాం. ఎంతైనా మా నాన్న వాళ్ల చిన్నతనం నాటి రోజులే బాగుంటే.. ఆ ఆటలే మంచిగుండే. – ఎ.అద్వైత్, రెండో తరగతి, హనుమాన్నగర్, కరీంనగర్ -
నేడు తండ్రి.. నాడు తల్లి మృతి
● అనాథలైన పిల్లలు ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదంలో తండ్రి బుధవారం మృతిచెందగా.. నాలుగేళ్ల క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎరవెల్లి పరుశురాం(43) హనుమాన్ మాల ధరించి విరమణ కోసం బుధవారం కొండగట్టుకు వెళ్లాడు. మాల విరమణ అనంతరం కారులో ధర్మపురి దర్శనానికి వెళ్లగా.. వెల్గటూరు మండలం చర్లపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లీదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు అనాథలయ్యారు. పెద్దకూతురు ఇటీవల 10వ తరగతి పాసైంది. -
ప్రియుడే హంతకుడు
● దూరం పెడుతోందని అంతం చేశాడు ● వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ ● వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పాలకుర్తి: పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. తనను దూరం పెడుతోందని ప్రియుడే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బసంత్నగర్ పోలీస్స్టేషన్లో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ గురువారం వెల్లడించారు. గ్రామానికి చెందిన బౌతు సుమలత తండ్రి పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. అతనికి సేవలు చేస్తూ సుమలత జీవనం సాగిస్తోంది. కొన్నేళ్ల క్రితం గ్రామానికి చెందిన వేల్పుల స్వామితో సుమలతకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పలుమార్లు తన తల్లిని కొట్టడంతో పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సుమలత తనను పెళ్లి చేసుకోవాలంటే తాగుడు మానేయ్యాలని ఆంక్షలు విధించింది. దీనికి తోడు స్వామి సెల్ నంబరును బ్లాక్లిస్టులో పెట్టింది. మాట్లాడడం మానేసింది. దీంతో సుమలతపై స్వామి కోపం పెంచుకున్నాడు. ఇంకెవరికో దగ్గరవుతున్నదనే అనుమానం పెంచుకున్నాడు. సుమలతను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 12వ తేదీ రాత్రి 11.40 గంటల ప్రాంతంలో తన ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న సుమలత మెడపై గొడ్డలితో ఎడమ వైపు దారుణంగా నరికి చంపాడు. గ్రామ శివారులోని వాగులో గొడ్డలి పడేసి పారిపోయాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై శ్రీధర్ దర్యాప్తు నిర్వహించారు. స్వామిని ఈసాలతక్కళ్లపల్లి సమక్క– సారలమ్మ గద్దెల వద్ద అదుపులోకి తీసకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. -
చెప్పుకోండి చూద్దాం
01. నల్లని పాయ కలిగిన జీవనది? 02. శివుడు తలపై పెట్టుకున్న నది దేవత? 03. రాతి గుండ్లకు కమ్మలు పెట్టే నది ? 04. బంగారు వదనం కలిగిన నది? 05. పనికి ‘నాగా’ పెట్టే నది? 06. నంద అలిగి కూర్చుంది ఏ నదిలో? 07. ‘తుంగ’కు జాగ్రత్త చెప్పే నది? 08. వరి పంటను ‘గోదా’ లోకి దింపే నది? 09. నీరు కడుపులో పెట్టుకుని మూసేసే నది? 10. కళ్ళున్న నది ఏమిటి?01. కృష్ణవేణి 02. గంగోత్రి 03. గుండ్లకమ్మ 04. స్వర్ణముఖి 05. నాగావళి 06. అలకనంద 07. తుంగభద్ర 08. గోదావరి, 09.మూసి, 10. నేత్రావతి. – డాక్టర్ కందేపి రాణీప్రసాద్, వైద్యురాలు, రచయిత్రి, సిరిసిల్ల -
అమ్మ ప్రేమ
అమ్మ మొదటి దైవమురా నేస్తమా అమ్మ ప్రేమ వర్ణించలేము తమ్ముడా భూదేవికి ఉన్నంత ఓర్పు రా ఈ జగతిలో అమ్మ ప్రేమ వర్ణించలేమురా మనను నవమాసాలు కనిపెంచేనుర కంటికిరెప్పలా కపాడెనుర మనకు మొదటి గురువు అమ్మే నేస్తమా ఈ ప్రపంచంలో దొరకదు అమ్మ ప్రేమ తన సుఖాన్నీ కోరుకోదు అమ్మ తన పిల్లలను సుఖంగా చూసుకుంటోంది అమ్మ ప్రయోజకున్ని చేయలనుకుంటుంది అమ్మ తనకు ఆహారం లేకపోయినా నేస్తమా మనకోసం తపన పడుతుంది నేస్తమా కంటికి కనురెప్పలాగా అమ్మ మనల్ని నిత్యము కాపాడుతుంది అమ్మ అమ్మ లేకుంటే మనం లేము తమ్మ ఈ జగతికి మూలాధారం అమ్మ అమ్మ ప్రేమ వెల కట్టలేని ప్రేమ అమ్మను బాగా చూసుకో తమ్మా చిన్నపుడు నిన్ను ఎత్తుకుంది అమ్మ నీవు అనాఽథగా విడిచిపెట్టకు తమ్మ నీవు అమ్మను విడిచిపెట్టకు తమ్ముడా నక్క శ్రీకర్, గ్రామం: ఊటూర్, మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
విద్యుత్షాక్తో కౌలురైతు మృతి
బోయినపల్లి(చొప్పదండి): కౌలుకు తీసుకునన్న మామిడితోటలో విద్యుత్ వైరు తొలగించే క్రమంలో షాక్కు గురై కౌలురైతు గన్నెబోయిన చంద్రయ్య(49) గురువారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన చంద్రయ్య బోయినపల్లి మండలం కోరెం శివారులో మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. మామిడితోటలో వేసిన కరెంటువైర్ను తొలగించే క్రమంలో చేతికి చుట్టుకుంటూ తీసుకెళ్తుండగా మధ్యలో ఉన్న జాయింట్ వద్ద విద్యుత్ ప్రవహించి షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. -
పిల్లలను ప్రోత్సహించాలి
సెలవుల సమయంలో చదువుతోపాటు కొత్త వ్యాపకాల వైపు పిల్లలను మళ్లించాలి. వేసవి శిక్షణ శిబిరాల్లోనూ పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్స్.. ఇలా పిల్ల ల అభిరుచికి అనుగుణమైన అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. – లీనా ప్రియదర్శిని. ప్రిన్సిపాల్ సెయింట్పాల్స్ హైస్కూల్ నాకు నటన అంటే చాలా ఇష్టం. పైగా అందరిలో మనకు ఒక గుర్తింపు ఉండాలంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సినిమా, టీవీ చానెళ్లలో నటించాలన్నదే నా కోరిక. అందుకే నటనలో శిక్షణ పొందుతున్నాను. – ఎస్.మాన్విత, 6వ తరగతి -
మేము గీసిన బొమ్మలు
పేరు : మొగిలి సౌధామిని 8వ తరగతి గ్రామం: ముత్తారం జిల్లా: పెద్దపల్లిపేరు: స్రవిష్ట గంగుల పాఠశాల: సెయింట్ జాన్స్ హైస్కూల్ 7వ తరగతి కరీంనగర్పేరు: డి. జాయ్ నిర్వేద్ 4వ తరగతి గ్రామం: ఎఫ్సీఐ, ఎలకలపల్లి గేట్ రామగుండం జిల్లా: పెద్దపల్లి పేరు: టేకుమట్ల చరిష్మా ఏడో తరగతి, గ్రామం: పాతర్లపాడు మండలం: చింతకాని జిల్లా: ఖమ్మంపేరు: బుర్ర భవానిఆల్ఫ్రెడ్ నోబెల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ తరగతి: 9వ తరగతి గ్రామం: కరీంపేట, మండలం: శంకరపట్నం జిల్లా: కరీంనగర్ పేరు: సంగుల మోక్ష తరగతి: 4వ తరగతి వేములవాడ జిల్లా: రాజన్నసిరిసిల్ల పేరు: తడుక శ్రేయాన్షి తరగతి: 2వ తరగతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రామం: కనగర్తి, కోనరావుపేట జిల్లా: రాజన్నసిరిసిల్ల పేరు: విహాన్ దవాల్జీ తరగతి: యూకేజీ స్వస్థలం: సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల -
నేటితరం అభీష్టం ప్రకారం
మన జీవితంలో సినిమా, సోషల్ మీడియా భాగమై పోయింది. స్టేజీషోలు, టీవీషోల్లో పాల్గొనాలని తమలోని నటనను పదుగురికి చూపించాలని పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తి, అభీష్టం మేరకు సినిమాకు సంబంధించిన వివిధ అంశాలలో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 30 మంది చిన్నారులు మా ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారు. – అనసూరి భూనాథాచారి, మాస్క్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, రోల్ ప్లే ఇన్స్ట్రక్టర్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హుజూరాబాద్: పట్టణంలోని సబ్స్టేషన్ ఎదురుగా కరీంనగర్ ప్రధాన రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి సదానందం, రమేశ్ బైక్పై వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదానందం చికిత్స పొందుతూ మృతి చెందాడని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మానేరులో మునిగి బాలిక మృతితిమ్మాపూర్: మానేరు రిజర్వాయర్ వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎల్ఎండీ పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్కు చెందిన షషాబ్ మోహల్లా (పండ్ల వ్యాపారి) తమ్ముడు పర్వేజ్ ఖాన్, అతని భార్య, పిల్లలు, షషాబ్మోహల్లా కూతురు బమెమా ఐరా ఖాన్ (14) ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం 4:30 గంటలకు మానేరు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో పిల్లలు, కుమార్తె నీటిలో దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. గమనించిన పర్వేజ్ ఖాన్ నీటిలోకి దూకాడు. చేపలు పడుతున్న వారి సహాయంతో కుమార్తెలను రక్షించాడు. అయితే అప్పటికే షషాబ్ మోహు కుమార్తె ఐరా ఖాన్ నీటిలో మునిగి చనిపోయింది. సాయంత్రం 6 గంటలకు జాలరులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు. -
అయ్యో దేవుడా..
● నాలుగేళ్లలో తల్లిదండ్రుల మృతి ● ఒంటరైన కూతుళ్లు ముస్తాబాద్(సిరిసిల్ల): చేయిపట్టి నడిపించే నాన్న దూరమయ్యాడు. అన్నీ తానై పెంచిన తల్లి కానరాని లోకాలు వెళ్లింది. నాలుగేళ్ల వ్యవధిలో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మిగిలారు. మేము ఏం పాపం చేశాం దేవుడా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆలనపాలన చూసుకునే తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిన ఆడపిల్లల అంతులేని కథ పలువురి హృదయాలను కదిలిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన పుట్ట రజిత(38) గుండెపోటుతో బుధవారం మృతిచెందింది. రజిత భర్త బాలరాజు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లు సాయిప్రియ, సాయిప్రసన్న దిక్కులేని పక్షులయ్యారు. నాలుగేళ్ల క్రితం బాలరాజు మృతిచెందినప్పటి నుంచి తల్లి రజిత బీడీలు చుడుతూ పిల్లలను పోషించింది. ఆమె కూడా ఏడాది క్రితం గుండెజబ్బుకు గురైంది. కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. రెక్కాడితే కాని డొక్కాడని రజిత బాధను దిగమింగుకుని జబ్బును భరించింది. తాను ఉన్నంతకాలం పిల్ల లను పోషించుకుంది. వ్యాధి ముదరడంతో రజిత ప్రాణాలు కోల్పోయింది. అన్నీ తానై ఉంటుందనుకున్న అమ్మ కూడా మృతిచెందడంతో సాయిప్రియ, సాయిప్రసన్నల రోదనలు మిన్నంటాయి. గురువారం జరిగిన అంత్యక్రియలలో పెద్ద కూతురు సాయిప్రియ తల్లి చితికి కొరివిపెట్టింది. ఒంటరై అనాథలుగా మిగిలిన సాయిప్రియ, సాయిప్రసన్నలను ప్రభుత్వం, మానవతావాదులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బన్నీ వేసవి యాత్ర–7
ఉదయం అయ్యింది. కొక్కొరోకో అని కోడి కూసింది. బన్నీకి మెలకువ వచ్చింది. పక్కన చూశాడు. రామ్, చుక్క, స్వప్న లేచారు. అందరూ శుభోదయం చెప్పుకున్నారు. నానమ్మ దగ్గరకు వచ్చింది. చేతిలో ఒక పుల్ల. ఇది వేప పుల్ల రా బన్నీ అంది. దీంతో పళ్ళు తోము.్ఙ అన్నది. బన్నీ మొహం చిట్లించాడు. కోల్గేట్ లేదా? అన్నాడు. తాతయ్య నవ్వాడు. ఇదే మన పాత పేస్ట్ రా. పంటికి బలం. అన్నాడు. బన్నీ వేప పుల్లతో పళ్ళు తోమాడు. కొంచెం చేదు. కానీ ఫ్రెష్గా ఉంది. తర్వాత తాతయ్య బన్నీని కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఆవు. పేరు లక్ష్మి. ఇది మన లక్ష్మ్ఙి అన్నాడు తాతయ్య. తాతయ్య పాలు పితికాడు. బన్నీ చూస్తూ ఉన్నాడు. నానమ్మ పాలను వేడి చేసి, ఒక గ్లాసులో పోసి బన్నీకి ఇచ్చింది. బన్నీ తాగాడు. చక్కెర వెయ్యలేదు. అయినా తియ్యగా ఉన్నాయి. ‘ఎందుకు నానమ్మా?’ అన్నాడు బన్నీ. నానమ్మ నవ్వింది. ‘ప్రేమ కలిపానురా కన్నయ్యా... అందుకే తియ్యగా ఉన్నాయి’. అన్నది. బన్నీకి ఆశ్చర్యం. ప్రేమకి రుచి ఉంటుందా? పిల్లలకి మాట: పాలు ప్యాకెట్లో రావు. ఆవు, గేదెల నుంచి వస్తాయి. ప్రేమతో రుచి పెరుగుతుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
ధాన్యం అన్ లోడింగ్కు ఏర్పాట్లు
చొప్పదండి: కొనుగోలు కేంద్రాలకు ఇన్చార్జీలను నియమించి తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, ఆర్నకొండ కొనుగోలు కేంద్రం, గంగాధర మండలం మధురానగర్ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌస్ ఆలంతో కలిసి గురువారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లారీలు సమకూర్చాలని అధికారులను ఆమె ఆదేశించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ చేయాలని సూచించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరమైతె ట్రాక్టర్లను వినియోగించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఎస్వో నర్సింగరావు, డీఎం రజనీకాంత్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు దొరికారు.. పరారీలో పది మంది!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురినే పట్టుకోగలిగారు. ఈ దోపిడీలో మొత్తం 13 మంది పాల్గొనగా.. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. బిహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలు నుంచే ఈ ఆపరేషన్ను నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపిస్తూ గురువారం సీపీ గౌస్ ఆలం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరా సింగ్, బిహార్కు చెందిన రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్లు, వీరికి సిమ్కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ఖాన్ అలియాస్ మహబూబ్ఖాన్ను అరెస్ట్ చేయగా, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టూ టౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసులో రూ.82.02 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో జువెల్లరీ షాప్ సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం●: పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ వెనుక బిహార్లోని కరుడుగట్టిన నేరగాడు సుభోద్సింగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలులో నుంచే తన అనుచరులకు ఆదేశాలిస్తూ దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ ముఠా 20కి పైగా దోపిడీలకు పాల్పడినట్లు, 400 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. సుభోద్సింగ్ ఆదేశాలతో ప్రధాన నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరాసింగ్, రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్ తదితరులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరికి కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ షాప్ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. రెక్కీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగానే పారిపోయారు. నకిలీ ఆధార్కార్డులు, తెలంగాణ, ఒడిషా ఫేక్ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జీలలో బస చేస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ఈక్రమంలో సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీల్లో బసచేశారు. వీరంతా ఒకరికితో మరొకరికి పరిచయం లేదు. అందరికీ ఇచ్చిన నకిలీ గుర్తింపుకార్డుల పేర్లతోనే పిలుచుకున్నారు. దోపిడీ చేసిన బంగారాన్ని ఇప్పటికే కరిగించి నేపాల్ చేర్చినట్లు అనుమానిస్తున్నారు. కేసు వివరాలు చంద్రాపూర్ అడవుల్లో తుపాకులు పోలీసుల విచారణలో నిందితుల నేరపద్ధతి సంచలనంగా మారింది. ఝార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఒక్కో సిమ్కార్డును రూ.10వేల చొప్పున కొనుగోలు చేసినట్లు తేలింది. దోపిడీకి ముందు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాల నుంచి రైలులో చంద్రపూర్ సమీపానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, 60 బుల్లెట్లతో 12 మ్యాగ్జిన్లు తీసుకుని తిరిగి ధర్మపురికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 3న ధర్మపురి నుంచి వచ్చి జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి, నలుగురు సిబ్బందిని కాల్చి ముందుగానే రెక్కి చూసి మెయిన్ రోడ్లపై కాకుండా గ్రామాల్లోని కాలువలు, చిన్న రోడ్ల ద్వారా ధర్మపురి చేసుకున్నారు. ధర్మపురి వద్ద పల్సర్ను వదిలేసి, ముగ్గురు దొంగలు కాలినడకన గోదావరినది దాటి మంచిర్యాల వద్ద రైలెక్కి పారిపోయారు. అపాచీ మీదున్న ఇద్దరు దొంగలు ఆభరణాలతో అడవి మార్గంలో వెళ్లి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్ అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కీలక నిందితులైన గ్యాంగ్ లీడర్ సుభోద్సింగ్తోపాటు రాధేమిశ్రా అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, మిశ్రా తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జ్యువెల్లరీ షాపులు, బ్యాంకులు, లాడ్జీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాణ్యమైన పానిక్ బటన్లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఐపీఎస్ అధికారి సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్కుమార్తోపాటు పలువురు సీఐలు పాల్గొన్నారు. దోపిడీ జరిగింది: మే 3, 2026దోపిడీకి పాల్పడింది: సుబోధ్ ముఠా, బిహార్ ఎత్తుకెళ్లిన నగల విలువ : రూ.82,02,000దోపిడీలో పాల్గొంది: 13 మందికిపైగా చిక్కిన నిందితులు: ముగ్గురు పరారీలో ఉన్నవారు: దాదాపు 10 మంది వాడిన ఆయుధాలు: 6 పిస్టళ్లు, 12 మేగ్జిన్లు, 60 బుల్లెట్లు రికవరీ అయిన సొత్తు : ఏమీ లేదు స్వాధీనం చేసుకున్నవి: రూ.51వేల నగదు, పల్సర్, హెల్మెట్, సెల్ఫోన్లు 2, సిమ్కార్డులు 2, నకిలీ ఆధార్కార్డు. గాలించిన రాష్ట్రాలు: బిహార్, పశ్చిమ బెంగాల్ పాల్గొన్న సిబ్బంది: 132 మంది కరీంనగర్ సిబ్బంది, 24 మంది ఎస్పీలు -
కాంగ్రెస్ ఎస్సీ సెల్లో సంస్థాగత సందడి
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. గురువారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడు కొరివి అరుణ్కుమార్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. జిల్లా అధ్యక్ష స్థానానికి 20 దరఖాస్తులు పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తులు సేకరించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొరివి అరుణ్కుమార్ను ఇటీవల నియమించారు. ఈ క్రమంలో గురువారం డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పదవులకు ఆశావాహుల నుంచి దర ఖాస్తులు స్వీకరించారు.మొదటి రోజు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షస్థానానికి 20 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నగర అధ్యక్ష స్థానానికి పది మంది దరఖాస్తు చేసుకొన్నారు. అలాగే మండల అధ్యక్ష పదవికి పది దర ఖాస్తులు వచ్చాయి. కష్టపడ్డ కార్యకర్తలతోనే కమిటీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కమిటీల్లో గుర్తింపు ఉంటుందని ఎస్సీ సెల్ ఉమ్మడి జిల్లా పరిశీలకుడు కొరివి అరుణ్కుమార్ తెలిపారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి నేతృత్వంలో వినూత్న తరహాలో కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ల అనుమతితో డీసీసీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుందన్నారు. -
సంక్షిప్తం
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపించాలికరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ చిత్రామిశ్రకు లేఖ రాశారు. నగరంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. అర్హత లేని డాక్టర్లు, సిబ్బందిని తక్కువ జీతాలకు పెట్టుకుని వారితో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని ఆరోపించారు. చిన్న జ్వరం వచ్చి చికిత్స కోసం డాక్టర్ను సంప్రదిస్తే అనవసర పరీక్షలు రాసి రూ.లక్షల్లో బిల్లులు వేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. భగీరథ్ను ఎందుకు అరెస్టు చేయరు? కరీంనగర్ టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ.. ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లో గురువారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీల సమావేశం జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసి, అతనికి తప్పించుకునే అవకాశం కల్పించిందని ప్రజలు భావిస్తున్నరని ఆరోపించారు. భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా కోసం దరఖాస్తు చేస్తే సీపీ నిరాకరించారని తెలిపారు. ధర్నా కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. వర్సిటీని అభివృద్ధి చేస్తాంకరీంనగర్ సిటీ: ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని వీసీ ఉమేశ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వారోత్సవాల సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రస్టుకు అధ్యక్షుడిగా వీసీ వ్యవహరిస్తారన్నారు. ట్రస్ట్ సెక్రటరీ రిజిస్టార్ సతీశ్కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి, జాయింట్ సెక్రటరీ దీపిక, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తాం: మెప్మా పీడీకరీంనగర్ కార్పొరేషన్: మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడమే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లక్ష్యమని పీడీ స్వరూపరాణి అన్నారు. సీఓలు, ఆర్పీలు, టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్)తో గురువారం సమీక్షించారు. వార్డుస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను ఆర్పీలు, సీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వద్దని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులుకరీంనగర్ టౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్లో ప్రవేశానికి షెడ్యూల్డు కుల విద్యార్థ్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు తెలిపారు. దరఖాస్తులను జూన్ 6వ తేదీ సాయంత్రం 5గంటల లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
రూ. 42 లక్షలు!
40 రోజులుకొత్తపల్లి మండలంలోని అక్రమ దందాలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సోహం సునీల్ దూకుడు పెంచారు. కొత్తపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా మార్చి 16న బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అక్రమ దందాలపై విరుచుపడుతున్నారు. 40 రోజుల్లో.. రూ.42,83,542 అపరాధ రుసుం ప్రభుత్వ ఖాతాలో జమ చేయించారు. మారువేషంలో సామాన్యుడిలా..ద్విచక్ర వాహనంపై రహస్యంగా తనిఖీలు చేపడుతూ గ్రానైట్, మట్టి, ఇసుక, మార్బుల్, బెల్టుషాపు వ్యాపారుల పాలిట సింహ స్వప్నంలా తయారయ్యారు. ఓ వైపు స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరికి సమయం కేటాయిస్తూనే అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఇలాంటి అధికారి ఇలాగే కొనసాగితే అక్రమ దందాలు మూతపడటంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే అవకాశముంది.సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్)●: కొత్తపల్లి పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోగా బాధ్యతలు చేపట్టిన సోహం సునీల్ తనదైన శైలిలో అక్రమ దందాలపై కొరడా ఝళిపించారు. కొత్తపల్లి మండలంలోని అక్రమ దందాలపై దాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు గ్రానైట్.. మరోవైపు మట్టి.. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించారు. శిక్షణ కాలంలో భాగంగా సుమారు 40 రోజుల్లోనే రూ.42,83,542 అపరాధ రుసుంను ప్రభుత్వ ఖాతాలో జమ చేయించి ప్రత్యేకతను చాటారు. ఓవర్ లోడ్, అనుమతి లేకుండా, ఇన్సూరెన్స్ తదితర అనుమతులు లేకుండా నడుస్తున్న 26 గ్రానైట్ వాహనాల నుంచి రూ.38,16,427, ఏడు ఇసుక వాహనాల నుంచి రూ.38,765, మూడు మార్బుల్ వాహనాల నుంచి రూ.2,95,234, 8 మట్టి వాహనాల నుంచి రూ.1,33,116 వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరింది. కేవలం పోలీస్శాఖ పరిధిలోని అంశంలోనే ఇంత ఆదాయం వచ్చిందంటే మిగిలిన సంబంధిత శాఖలు ఏంచేస్తున్నాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్, బద్ధిపల్లి, ఎలగందుల, శ్రీరాములపల్లి, ఖాజీపూర్, కమాన్పూర్, నాగులమల్యాల గ్రామాల్లోని ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అనుమతుల్లేకుండా..పన్నులు చెల్లించకుండా..ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ.. ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ చూర్ణం (స్లర్రీ) పోస్తూ.. అక్రమ రవాణాకు పాల్పడుతూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక గ్రామస్థాయి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ పైస్థాయి అధికారుల నుంచి స్పందన రాకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెల్లో గ్రానైట్ అఘాయిత్యాలు యథేచ్ఛగా సాగుతున్నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
విద్యతోనే భవిష్యత్
● ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ టౌన్: ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక నిధులు వెచ్చిస్తోందని, విద్యాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల కార్పొరేటర్లు, సర్పంచులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్, డైట్ ప్రిన్సిపాల్, ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్, డీఈవో శ్రీరాం మొండయ్య, ఎంఈవోలు ఆనందం, భద్రయ్య, వాసవి, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, జీసీడీవో ఉమ, ఆర్పీలు గాజుల రవీందర్, కేఎస్.అనంతాచార్య పాల్గొన్నారు. -
జనగణన పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి కరీంనగర్ కార్పొరేషన్: జనగణనను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి సూచించారు. నగరంలోని కాశ్మీర్గడ్డ, చైతన్యపురి, రాంనగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. హౌస్లిస్ట్ బ్లాక్ బౌండరీలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. నెంబరింగ్, డిజిటల్ మ్యాపింగ్పై ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల పనితీరు పరిశీలించారు. ప్రతీ ఇంటి సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలన్నారు. స్వీయ గణన చేసుకున్న వాళ్లు ఎన్యుమరేటర్లకు ఐడీని చూపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్, టీపీబీవో ఖాదర్ మొహియొద్దిన్, ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన డీఆర్డీవోకరీంనగర్ అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా ఎం.గీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల రోజుల క్రితమే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లాకు బదిలీ అయ్యారు. కానీ.. బాధ్యతలు చేపట్టలేదు. దీంతో గత డీఆర్డీవో శ్రీధర్ ఆ పదవీలో కొనసాగారు. తాజాగా గీత బాధ్యతలు స్వీకరించి కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ధాన్యం రవాణాకు స్పెషల్ టీంలుకరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ట్యాగ్డ్ రైస్మిల్లులకు రవాణా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. మండలస్థాయిలో మొబైల్ టీంలను ఏర్పాటు చేయగా తహసీల్దార్ టీం లీడర్గా వ్యవహరిస్తారని వివరించారు. కరీంనగర్ రూరల్, చొప్పదండి, గంగాధర, రామడుగు, గన్నేరువరం, చిగురుమామిడి, కొత్తపల్లి మండలాల్లో ధాన్యం ఎక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా ప్రత్యేక టీంలు పనిచేస్తాయని వెల్లడించారు. వీరిపై పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ అధికారి ఉంటారని, టీంలలో సివిల్ సప్లయ్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు ఉంటాయన్నారు. ఇంటర్ ఫలితాల్లో నవోదయ వందశాతం ఉత్తీర్ణతచొప్పదండి: సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. విద్యాలయానికి చెందిన హనుమాండ్ల అక్షర 94.4 శాతం మార్కులు సాధించి విద్యాలయంలో మొదటి స్థానంలో నిలిచింది. చెక్కల రాజు 92.6 శాతంతో రెండో స్థానం, దొంత జశ్వంత్ 90.2 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
కాలుష్య వైపరీత్యం
ప్రకృతిలో ఎన్నో మార్పులు చేర్పులు వనరులను నాశనంచేసే రసాయనాలు పట్టణంలో కలదు కాలుష్యం పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ఎక్కడ చూసినా కాలుష్యమయం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రకృతిని నాశనం చేసే ఎక్కడ చూసినా కాలుష్యం నీరు తాగుదామన్న చెడు రసాయనాలు మురికి నీళ్లు తాగి మురికి తిండి తిని మానవులు రోగాల బారిన పడుతున్నారు. కెమికల్ ఉన్న ఆహారం తిని మానవులు ఆయుష్షు తగ్గిపోతుంది ఎవరిని చూసినా బీపీ, షుగర్లు ఎవరిని చూసినా ఊపిరితిత్తుల సమస్యలు ఎవరిని చూసినా కిడ్నీ సమస్యలు నియంత్రించాలి ఈ వైపరీత్యం తగ్గించాలి ఈ వైపరీత్యం పెంచాలి మానవ వనరులు తగ్గించాలి ఈ వైపరీత్యం అరికట్టాలి ఈ రసాయనాలు నియంత్రించాలి ఈ వైపరీత్యం పేరు: కుమ్మరికుంట ఆరాధ్య తరగతి: 6వ తరగతి పాఠశాల: పీఎంశ్రీ మోడల్ స్కూల్ ఊరు: గోదావరిఖని జిల్లా: పెద్దపల్లి ఎన్.శ్రీకర్ గ్రామం: ఊటూరు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
అమ్మాయిలు.. నాంచాక్
● ఆత్మరక్షణ విద్యలో అమ్మాయిలు అదుర్స్ ● కర్ర, నాంచాక్లో శిక్షణ ● ధైర్యసాహసాల విద్యపై ఆసక్తివేములవాడ: అమ్మాయిలే కదా.. అని అనుకోవద్దంటున్నారు ఈ చిచ్చరపిడుగులు. వారు కర్రసాము చేస్తే ఎదురుగా ఎవరూ ఉన్న బేజార్ కావాల్సిందే. వారు నాంచాక్ పడితే ఎంతటి వారైనా జీ హుజూర్ అనాల్సిందే. ఇదంతా వేములవాడ మున్సిపల్ పార్క్లో నిత్యం ఉదయం కనిపించే బాలికల గురించే. వారు కొన్నాళ్లుగా కోచ్ ఎంఏ మన్నాన్ సమక్షంలో కర్ర, నాంచక్ వంటి ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణకు యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బాలికలు ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యలో శిక్షణ తీసుకుంటున్నారు. నాంచాక్ నైపుణ్యానికి మరో పేరు కరాటే విద్యలో భాగంగా వినియోగించే శస్త్రాయుధాలలో నాంచాక్కు ప్రత్యేక స్థానం. రెండు చిన్న ఐరన్ పైపులకు మధ్యలో గొలుసుతో కలిపి ఉంటుంది. చూసేందుకు సాధారణంగా కనిపించినా నిపుణుల చేతిలో పడితే శత్రువులకు భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. దాడిచేయడం, ఆత్మరక్షణకు నాంచాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాంచాక్ను సాధనతో శరీర నియంత్రణ, వేగం, స మతుల్యత పెరుగుతాయి. ఇది కేవలం దెబ్బ కొట్టే ఆయుధమే కాదు, ఒక నృత్యకళా రూపంగా కూడా చెప్పుకుంటారు. పోటీలు, ప్రదర్శనలు, ఆత్మరక్షణలో తమకు కొత్త శక్తిని అందిపుచ్చుకుంటున్నారు. -
డాక్టర్.. నిఖిత
● మల్యాల మండలంలో మొదటి దళిత డాక్టర్ ● నిఖిత వైద్య విద్యకు ‘సాక్షి’ దాతల తోడ్పాటుమల్యాల: నిరుపేద దళిత కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి ఎదిగారు మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బెక్కం నిఖిత. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఎంబీబీఎస్ సీటు సాధించారు. బెక్కం గంగయ్య, పద్మ ఏకై క కూతురు నిఖిత సిరిసిల్లలోని బోనాల రెసిడెన్షియల్లో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్ గౌలిదొడ్డి రెసిడెన్షియల్లో ఇంటర్ పూర్తి చేసి.. నీట్లో ర్యాంకుతో ఎంబీబీఎస్లో సీటు సాధించారు. అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ 2020 డిసెంబర్ 10న ‘సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువు’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన దాతలు ఎంబీబీఎస్ విద్యకు తోడ్పాటు అందించారు. నిఖిత విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా అందుకున్నారు. తమ కూతురు డాక్టర్ కావడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తన కల సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించిన అందరికీ నిఖిత కృతజ్ఞతలు తెలిపారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ జయకేతనం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులతో జయకేతనం ఎగురవేసినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఏడుగురు విద్యార్థులు 460పైగా, 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీసీఎం విభాగంలో వి.శ్రేయాస్రెడ్డి 475 మార్కులతో పాఠశాల టాపర్గా నిలవగా, జి.చైత్ర 471 మార్కులు, ఎన్.రత్నప్రకాశ్ 469, బి.లిఖిత్ సాయి 461, ఐశ్వర్య 458, హర్షఫ్ అర్మాన్ 456, వి.సాయి హర్షిత్ 456, బి.రోహిత్, ఎన్.కావ్య, జె.సరయు 450 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా పీసీబీ విభాగంలో డి.రుత్విక్ 476 మార్కులతో పాఠశాల టాపర్గా, పి.శృత్విక 472, డి.శ్రేయన్ష్ 462 సాధించగా మిగిలిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు వివరించారు. అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. -
బక్రీద్కు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, ముస్లిం మత పెద్దలతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముస్లింలు బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈద్గాల వద్ద అవసరమైన వసతులు కల్పించడంతో పాటు నమాజ్ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. సీపీ గౌస్ఆలం మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. అత్యుత్తమ సేవలకు కేరాఫ్గా సర్కారు ఆస్పత్రి అత్యుత్తమ సేవలకు కేరాఫ్ అడ్రస్గా ప్రభుత్వ ఆసుపత్రులు నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రభుత్వ హాస్పిటళ్ల బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలతో వైద్య శాఖ మరింత అనుసంధానం కావాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అత్యుత్తమ వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలవాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్వో వెంకటరమణ, కేశవరెడ్డి పాల్గొన్నారు. -
ఐక్యమత్యమే ఉద్యోగుల బలం
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్ :విధుల్లో విరా మం లేకుండా గడపడమే కాకుండా వీలుచిక్కినప్పుడల్లా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి అన్నా రు. ఉద్యోగుల మధ్య ఆత్మీయ అనుబంధం పెంపొందించుకోవాలని అన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీవోల కమ్యూనిటీ హాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేది పంచాయతీ కార్యదర్శులేనన్నారు. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్యం, పల్లె ప్రకృతి వనం వంటి అనేక బాధ్యతలను కార్యదర్శులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రొబేషన్, రెగ్యులరైజేషన్, పెండింగ్ బిల్లులు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ మాట్లాడుతూ, అన్ని శాఖల పనులు నిర్వహించడంతో ఒత్తిడి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ప్రజల ఆదరణ, గౌరవం పంచాయతీ కార్యదర్శులకే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రతీ నాలుగో శనివారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశఽం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, టీఎన్జీవోల కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, సుస్మిత, గోదావరి అజయ్, రాకేశ్, రేవంత్ రెడ్డి, కిరణ్, వాహజ్, మధుమిత, కార్తీక్, మహేందర్ రావు పాల్గొన్నారు. -
బ్లడ్ కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: బ్లడ్ కేన్సర్ చికిత్స రంగంలో ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వైద్య పద్ధతులతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనో థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం కేన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతోందన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. -
బన్నీ వేసవి యాత్ర–6
రాత్రి 8 అయ్యింది. బస్ ఆగింది. బన్నీ దిగాడు. ఎదురుగా ఒక పెద్ద ఇల్లు. మట్టి గోడలు. గూనపెంకుల ఇల్లు. ముందు అరుగు. అరుగు మీద తాతయ్య. పక్కన నానమ్మ. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ... నవ్వుతున్నారు. ‘రా కన్నయ్య‘ అంది నానమ్మ. బన్నీని దగ్గరకు తీసుకుంది. తల నిమిరింది. తాతయ్య చెయ్యి పట్టుకున్నాడు. ‘ఇది నీ ఇల్లు రా బన్నీ‘ అన్నాడు. ఇంట్లో నుంచి పిల్లలు వచ్చారు. చాలా మంది. ముగ్గురు అత్తయ్యలు, మామయ్యలు. బాబాయ్, పిన్ని మరియు ఆరుగురు పిల్లలు. చుక్క, స్వప్న, రామ్ కూడా ఉన్నారు. ‘హాయ్ బన్నీ!‘ అన్నారు. బన్నీ ఆశ్చర్యపోయాడు. మేము కూడా వచ్చాము అన్నారు. అందరూ నవ్వుకున్నారు. నానమ్మ ఒక పళ్లెం తెచ్చింది. పళ్లెంలో గారెలు. బెల్లం గారెలు. ‘తినరా‘ అంది. బన్నీ ఒక గారె తిన్నాడు. తియ్యగా ఉంది. వేడిగా ఉంది. అమ్మ చేసినట్టే ఉంది. తాతయ్య అన్నాడు, ‘బన్నీ, ఇక్కడ అందరం ఒకే ఇంట్లో ఉంటాం. అందరం కలిసి తింటాం. కలిసి నవ్వుతాం. ఇది మన ఉమ్మడి కుటుంబం.‘ బన్నీ చుట్టూ చూశాడు. అందరి మొహాల్లో నవ్వు. బన్నీకి కూడా నవ్వు వచ్చింది. భయం పోయింది. పిల్లలకి మాట: ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు. ప్రేమతో ఉన్న మనుషులు.డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా గోంగూర పాపహలో పిల్లలూ! గోంగూరతో పప్పు వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. కానీ.. అమ్మాయిని తయారు చేయవచ్చా? చేయవచ్చు! చూడండి. ఈ గోంగూరమ్మాయి బాగుందా? నేను మా కుండిలో గోంగూర చెట్టును పెట్టుకున్నాను. అందుకే ఈ గోంగూరను తేత ఆకుల్ని తీసుకున్నాను. దీని ని ’రెడ్ సోరెల్’ అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, విటమినే ’ఎ’ ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు కూ డా ఉంటాయి. గోంగూరలో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలుంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తినే పెంపొందిస్తుంది. -
బేకరీల్లో నాసిరకం పదార్థాలు
కరీంనగర్ అర్బన్: నగరంలోని ఫాస్డ్ఫుడ్, బేకరీలలో నాసిరకం ఆహార పదార్థాలు వాడుతున్న ఆహారభద్రత అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్రైస్ ఏదైనా నాసిరకమేనని, పురుగులు పట్టిన గుడ్లను వాడుతున్నారని స్పష్టమైంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, తెలంగాణచౌక్, కమాన్ ఏరియాల్లో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. పలు దుకాణాలు చెల్లుబాటయ్యే ఫుడ్లైసెన్స్ లేకపోవడంతో నోటీసులు జారీచేశారు. నాణ్యత లేని టీ పొడి, నూనెలు వాడుతున్నట్లు తేలింది. ఎస్ఎఫ్ఎస్ బేకరీలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు, జ్యూస్ తయారీలో ఉపయోగిస్తున్న దెబ్బతిన్న ద్రాక్షపండ్లను గుర్తించి పారబోశారు. బస్స్టాండ్ కాంప్లెక్స్లోని కింగ్స్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీలో కుళ్లిపోయిన, దెబ్బతిన్న గుడ్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సెంటర్ను మూసివేశారు. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): వృద్ధాప్యం.. అనారోగ్యం..ఒంటరితనం భరించలేని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సోల నర్సయ్య(80) భార్య నలభై ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి నర్సయ్య ఒంటరిగా ఉంటున్నాడు. గుడిసెలో దుర్భర జీవితం గడుపుతున్న నర్సయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరి జీవితం ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతిగోదావరిఖనిటౌన్: కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వస్తున్న కరీంనగర్–2 డిపో బస్సులో మహారాష్ట్ర సిరొంచకు చెందిన అబ్ధుల్ రజాక్ కరీంనగర్లో గోదావరిఖనికి టికెట్ తీసుకున్నాడు. స్టాఫ్ వద్ద దిగకపోవడంతో కండక్టర్ గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇతడు మార్గమధ్యలో చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గంగాధర: మండలంలోని మప్పిడినర్సింహులపల్లి జీపీ పరిధి పెండలోనిపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముత్యాల హేమలత ఈ నెల 11న ఇంటికి తాళం వేసిన బంధువుల దగ్గరికి వెళ్లిది. బుధవారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని ముప్పై తులాల వెండి, ఐదు గ్రాముల బంగారం, రూ.ఏడువేలు దొంగలు ఎత్తుకెళ్లారని, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింతపెగడపల్లి: మండలంలోని మద్దులపల్లిలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న ఆర్ఐ జమున, చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ శ్రావణ్, బాలల పరిరక్షణ సమితి ఔట్రిచ్ శ్రీవాణి, అంగన్వాడీ టీచర్లు శోభ, శైలజా, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లారు. ఆధార్కార్డు, పుట్టిన తేదీ, పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో వివాహం చేస్తే అనర్థాలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు దాటే వరకూ వివాహం చేయబోమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు. రేబిస్తో చిన్నారి మృతికోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన బాలులు రేబిస్తో బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన లోకుర్తి రాజు–మమతల కొడుకు లోకుర్తి నిశాంత్(11) ఇటీవల 5వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నాడు. ఏప్రిల్ 23న గ్రామంలో ఓ పిచ్చికుక్క కరవడంతో తలకు, తొంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వ్యాక్సిన్లు ఇప్పించారు. వారం రోజుల తర్వాత తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్కు తీసుకెళ్లారు. రేబిస్తో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు నిర్ధారించిన వైద్యులు హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. వారం రోజులుగా నిశాంత్ హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
విద్యార్థులకు ఉపాధి కల్పించేలా కోర్సులు
కరీంనగర్ సిటీ: సాధారణ డిగ్రీ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏఈడీపీ కోర్సులు రూపొందించబడ్డాయని కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచ్లు, కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులకు వర్క్షాప్ నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి ఉన్నత విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎఈడీపీ (అప్రెంటిస్షిప్ ఇన్బిడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) కోర్సుల ప్రాముఖ్యతను వివరించారు. సాధారణ డిగ్రీ విద్యతో పాటు నైపుణ్యాభివద్ధి ఎంతో అవసరమన్నారు. ఈ కోర్సుల ద్వారా డిగ్రీ చదువుతున్న సమయంలోనే పరిశ్రమలు, సంస్థలు, సేవా రంగాలలో ప్రాక్టికల్ శిక్షణ పొందే అవకాశముంటుందన్నారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ లేదా స్కాలర్షిప్ లభించడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సర్పంచ్లు, కార్పొరేటర్లు గ్రామస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
మానకొండూర్: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల వివరాలు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం వరంగల్ జిల్లాలో బుధవారం జరిగిన వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తున్నా రు. మండలంలోని ఖాదర్గూడెం శివారులో బోధన్ డిపోకు చెందిన బస్సు వరంగల్ వైపు వెళ్తూ కారును ఢీకొట్టింది. కారు డ్రైవర్ ఖలీద్, పెద్దపల్లికి చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందారు. సుమతి(65), ఉమ(36), వెంకటవరప్రసాద్ అలియాస్ శ్రీధర్(52) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజు భార్య సుమతి పరిస్థితి విషమంగా ఉంది. రాంగ్రూట్లో ప్రయాణం చెంజర్ల శివారులో కారు డ్రైవర్ రాంగ్రూట్లో వెళ్లడంతో ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ ఖలీద్ సీటులోనే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ శ్రీలత 108 వాహనంలో క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అతి కష్టంమీద బయటకు తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆసిఫాబాద్కు చెందిన వెంకట వరప్రసాద్ అలియాస్ శ్రీధర్ భార్య ఉమ ఉద్యోగిని కావడంతో మంచిర్యాలలో ఉంటున్నారు. శ్రీధర్ బావ రాజు, సోదరి సుమతిని పెద్దపల్లిలో దింపి వెళ్లాలని కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖలీద్ మృతదేహంరాజు మృతదేహం -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
చిగురుమామిడి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చిగురుమామిడి మండలం నవాబుపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అధికారులు అలసత్వం వీడాలని, పంచాయతీకార్యదర్శులు, ఏఈవోలు సమన్వయం చేసుకోవాలన్నారు. తూకం వేసిన తరువాత లారీలను మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేకంగా ఎంవీఐ అధికారిని నియమించినట్లు తెలిపారు. అనంతరం నవాబుపేట్లో బోదాసు లలిత–రవి దంపతుల ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరయ్యారు. సర్పంచ్ గూల్ల రజితరాజు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ పాల్గొన్నారు. -
ఆ సెల్ఫోనే పట్టించింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎంత పెద్ద క్రిమినల్ అయినా.. ఏదో ఒక క్లూ వదిలేస్తాడు.. అదే దొంగలను చిక్కేలా చేస్తుంది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో ఇదే తరహాలో దొరికిపోయారు. ఈనెల 3వ తేదీన పీఎంజేలో దోపిడీ చేసి, నలుగురు సిబ్బందిని తుపాకులతో కాల్చిన అనంతరం ధర్మపురి మీదుగా పారిపోయిన దొంగలు తాము వినియోగించిన ఒక సెల్ఫోన్ను మద్దునూరు వద్ద పగలగొట్టి వెళ్లిపోయారు. స్థానికులు ఆ సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. ఆ సెల్ఫోన్లో లభించిన డేటా ద్వారా దొంగల సమాచారం లభించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి బిహార్లో ఒకరిని, బెంగాల్లో మరొకరిని పట్టుకున్నారు. నిందితులంతా స్మార్ట్ఫోన్ల నుంచి ఎన్క్రిప్టెడ్యాప్స్ ద్వారా సంభాషించుకోవడం గమనార్హం. పోలీసులు డేటా రీట్రైవ్ చేయడం ద్వారా కీలక సమాచారం లభించింది. సినీ తరహాలో దోపిడీ ఈ మొత్తం చోరీకి బిహార్ జైలు వేదికగా ప్రణాళిక జరిగింది. దేశంలోని పలు బంగారం సంస్థలే టార్గెట్గా చోరీలు చేసే సుబోధ్ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 70 మందికిపైగా ప్రైవేటు సైన్యంతో ఆరు రాష్ట్రాల్లో ఇతని నెట్వర్క్ విస్తరించి ఉంది. సినీ తరహాలో దో పిడీలు చేయడం వీరి ప్రత్యేకత. కరీంనగర్ దోపిడీ కోసం ఆరుగురు ఒకరితో మరొకరికి పరిచయం లేనివారిని ఎంచుకున్నారు. కేవలం దోపిడీ మాత్రమే వీరి పని. ఆ తరువాత బంగారం తరలించేందుకు ఒక గ్యాంగ్, విక్రయానికి మరోగ్యాంగ్, ఆ డబ్బు తరలించేందుకు ఇంకో గ్యాంగ్ పనిచేస్తాయి. ఒకవేళ పోలీసులకు నిందితులు చిక్కినా పూర్తిస్థాయి సమాచారం దొరకక కేసు జాప్యం అవుతుంది. ఈలోపు బంగారం విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఈ దోపిడీలో పాల్గొన్న వారికి రూ.5లక్షలు ఇస్తామని ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రెస్మీట్.. ధర్మపురి వద్ద విడిపోయిన దొంగలు... వేర్వేరుగా బెంగాల్, బిహార్, రాజస్థాన్, ముంబై వైపు పారిపోయారు. ఈ నేపథ్యంలో చోరీ చేసిన సొత్తు రికవరీ చేయడం, మిగిలిన ముగ్గురు దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. అయితే, నిందితులు సొత్తు ఎక్కడ విక్రయించారు? అన్న విషయంలోనూ పోలీసులు పలు కీలక ఆధారాలు సంపాదించారు. సుబోధ్ గ్యాంగ్ ఇప్పటి వరకూ 30 కిలోల వరకు బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్ వద్ద దొంగ బంగారం కొనే వ్యాపారుల జాబితా కూడా కరీంనగర్ పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిపార్ట్మెంట్ ధీమాగా ఉంది. త్వరలోనే నిందితులందరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
మెరుగైన విధానాలతో వ్యాపారాభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: మెరుగైన విధానాలు, నాణ్యతతో కూడిన వ్యాపారాలతో వీధి వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపరాణి అన్నారు. మంగళవారం కళాభారతిలో వీధి వ్యాపారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం ఉపాధి, పట్టణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో వీధి వ్యాపారులు, స్వయం సహాయక బృందాల పారిశ్రామికవేత్తల కృషి అభినందనీయమన్నారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, వ్యాపార నిర్వహణ, వినియోగదారుల సేవ, స్వయం ఉపాధి కార్యకలాపాల ద్వారా జీవనోపాధిని బలోపేతం చేసుకునే అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, మెప్మా ఇన్చార్జీ డీఎంసీ మల్లీశ్వరి, టీఎంసీ మానస, సీఓలు పద్మ, స్వప్న, తిరుపతి, మంజుల, దీప తదితరులు పాల్గొన్నారు. -
రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ
భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు అంజన్న ఆలయంజయంతి సందర్భంగా విశేష అలంకరణలో కొండ గట్టు అంజన్న స్వామినగరంలోని టవర్లో ఏక్తాయాత్రహిందూ ఏక్తాయాత్రతో కాషాయమయమైన కరీంనగర్ సిటీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి సందర్భంగా ఆలయం కిక్కిరిసిపోయింది. మంగళవారం వేకువజామున మూడు గంటలకు స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. విశేష అభిషేకం, అర్చనలు చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. హోమం, మహాపూర్ణాహుతి, ఊయల సేవ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల జై హనుమాన్.. జై శ్రీరాం నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. ఇరుముడులతో పాదయాత్ర వేలాదిమంది స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఉత్సవాలను కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో అంజనారెడ్డి వారి వెంట ఉన్నారు. లక్షలాది మంది భక్తుల రాకతో స్వామివారి కోనేరు కాషాయమయమైంది. మాల విరమణ చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.కరీంనగర్: కరీంనగర్ నగరం కాషాయమయమైంది. ‘రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి’ నినాదాలతో మార్మోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నేతృత్వంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర వైశ్య భవన్ నుంచి ప్రారంభమై టవర్, కమాన్, వన్టౌన్, అమరవీరుల స్తూపం మీదుగా తిరిగి వైశ్య భవన్ వరకు వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా హనుమాన్ భక్తులు, ప్రజలు తరలివచ్చారు. యాత్రలో శ్రీరాముడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతీస్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి యాత్రలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. యాత్రకు 400 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
సెన్సెస్ షురూ..!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలో జనగణన 2027 ప్రారంభమైంది. ఇప్పటివరకు స్వీయ గణనకు అవకాశం కల్పించిన ప్రభుత్వం, 11వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన మొదలు పెట్టడం తెలిసిందే. నగరంలో బ్లాక్లవారీగా ముందుగా కుటుంబాల సంఖ్య ఆధారంగా ఇళ్లకు నంబరింగ్ (సెన్సెస్ హౌస్ నంబరింగ్) చేస్తున్నారు. 14వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి కుటుంబాలవారీగా జనగణన చేపట్టనున్నారు. 666 బ్లాక్లు 2027 జనగణన తొలిదశను విజయవంతంగా పూర్తి చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్లాక్ల వారీగా గణనను విభజించారు. నగరపాలకసంస్థలో 66 డివిజన్లు ఉండగా, 666 బ్లాక్లుగా విభజించారు. 180 నుంచి 200 ఇళ్లకు ఒక బ్లాక్గా పరిగణిస్తారు. ప్రతి బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 666 బ్లాక్లకు 666 మంది ఎన్యుమరేటర్లను, పర్యవేక్షించేందుకు 111 మంది సూపర్వైజర్లను నియమించారు. 14 నుంచి ‘ఇంటి లెక్కలు’ జనగణన మొదటి దశ ప్రారంభం కావడంతో ఎన్యుమరేటర్లు కుటుంబాలవారీగా ఇళ్లకు నంబరింగ్ వేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనే లెక్కల ఆధారంగా ఆ ఇంటి గోడ లేదంటే తలుపులకు చాక్పీస్లు, స్టిక్కర్లతో నంబర్ వేస్తున్నారు. బుధవారం వరకు హౌస్నంబరింగ్ను పూర్తి చేయనున్నారు. 14వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వారీగా జనగణనను చేపడుతారు. ప్రభుత్వం రూపొందించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నారు. ఇప్పటికే స్వీయ గణనను నమోదు చేసుకుంటే, ఆ ఐడీ ఆధారంగా జనగణన ఎన్యుమరేటర్ పూర్తి చేయనున్నారు. ప్రజలు సహకరించాలి : ప్రఫుల్దేశాయ్ జన గణనలో భాగంగా ప్రజలు తమ వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కోరారు. నగరంలో జనగణన ప్రక్రియలో భాగంగా సెన్సెస్ హౌసెస్ నంబరింగ్ సాగుతున్న తరుణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 2027 జనాభా లెక్కలకు నగర ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని అన్నారు. సర్వే సమయంలో ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు.డివిజన్లు 66 బ్లాక్లు 666 (180 నుంచి 200 ఇండ్లకు ఒక బ్లాక్) ఎన్యుమరేటర్లు 666 సూపర్వైజర్లు 111 -
గడువు ముగిసింది.. గుబులు పట్టుకుంది
మండలాల వారీగా ఈకేవైసీ నమోదు వివరాలుకరీంనగర్రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలకు ఈకేవైసీ నమోదు గుబులు పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి విధించిన గడువు ఈ నెల 10తో ముగిసింది. జిల్లాలో పూర్తిస్థాయిలో కూలీల ఈకేవైసీ నమోదు పూర్తికాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో అక్రమాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలని గతేడాది ఏప్రిల్లో ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశాల్లో కూలీల నమోదు, వేతనాల చెల్లింపులకు ఈకేవైసీని ప్రామాణికంగా పరిగణిస్తామని ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియను చేపట్టారు. ముగిసిన గడువుతో ఆందోళన జిల్లాలో ఉపాధి కూలీలు 1,07,667 మంది ఉండగా 1,03,877 మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 3,790 మంది నమోదు పూర్తి చేయాల్సి ఉంది. రామడుగు, తిమ్మాపూర్ మండలాలు 98శాతం నమోదుతో మొదటిస్ధానంలో ఉన్నాయి. కూలీ ఆధార్కార్డు వివరాలతోపాటు ఫొటో, ఐరిస్లను సెల్ఫోన్లో నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ 96శాతం పూర్తికాగా వందశాతం నమోదు పూర్తికాకపోవడం గమనార్హం. ఈకేవైసీ నమోదుకు కొంతమంది కూలీలు అందుబాటులో లేకపోవడం, ఆధార్కార్డులోని వివరాలు, ఫొటో మ్యాచింగ్ కాకపోవడం, ఐరిస్లో మార్పులు తదితర కారణాలతో వందశాతం నమోదు కాలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 10తో పూర్తయిందని, నమోదు ప్రక్రియ గడువు పొడిగిస్తారా లేదా అనే సమాచారం ఇంకా రాలేదని తెలిపారు.మండలం కూలీలు ఈకేవైసీ మిగిలినవారు జమ్మికుంట 7,578 7,228 350 కరీంనగర్రూరల్ 3,872 3,697 175 ఇల్లంతకుంట 7,596 7,262 334 మానకొండూరు 10,097 9,669 428 గన్నేరువరం 5,359 5,145 214 చొప్పదండి 5,883 5,652 231 సైదాపూర్ 9,142 8,819 323 వీణవంక 10,757 10,380 377 హుజూరాబాద్ 7,004 6,774 230 శంకరపట్నం 9,587 9,287 300 కొత్తపల్లి 2,317 2,247 70 చిగురుమామిడి 6,803 6,603 200 గంగాధర 8,553 8,316 237 రామడుగు 6,856 6,685 171 తిమ్మాపూర్ 6,263 6,113 150 -
భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..?
కరీంనగర్ టౌన్: పోక్సోకేసు నమోదైన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ డం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్లో మాట్లాడుతూ భగీరథ్ పరారీలో ఉన్నడని చెబుతుంటే, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, ఐబీ, స్పెషల్ బ్రాంచ్లు ఏం చేస్తున్నాయని నిలదీశారు. సాధారణ వ్యక్తిపై ఇలాంటి కేసు నమోదైతే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కావడంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 19 ప్రకా రం సమాచారం దాచిపెట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ కేసులో బండి సంజయ్, ఆయన పీఆర్వోపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికకు రూ.50 వేలు ఇచ్చి నట్లు నగరంలోని టూ టౌన్లో ఫిర్యాదు చేయ డం ద్వారా అసలు కేసును మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బండి సంజయ్ మాటపై నిలబడాలంటే, ముందుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.ఉచిత పీజీ ఎంట్రెన్స్ కోచింగ్కరీంనగర్ సిటీ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఎస్సారార్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉచిత ఎంకాం పీజీ ఎంట్రెన్స్ కోచింగ్ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 40రోజుల పాటు కొనసాగనుంది. ఆన్లైన్ విధానంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, కామర్స్ నిపుణులు విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు అవసరమైన పరిజ్ఞానం, మోడల్ పరీక్షలు, ప్రశ్నాపత్ర విశ్లేషణ, సమయ నిర్వహణ, పరీక్ష వ్యూహాలపై సమగ్ర శిక్షణ అందిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. కన్వీనర్ బూర్ల నరేశ్, వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్ , కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, కో–కన్వీనర్ అర్జున్ పాల్గొన్నారు. 16న జాబ్మేళాసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16వ తేదీ కరీంనగర్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ నివాబూపాలో 25 ఖాళీల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, 25ఏళ్లు పైబడి ఉండాలని తెలిపారు. వేతనం నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఈ సేవ కేంద్రం పైఅంతస్తుకు రావాలని, బయోడేటాతో పాటు విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 99082 30384, 99633 57250 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనుమతి లేని అకాడమీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దుసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఐ ఈవో ఆంజనేయరావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కొన్ని అకాడమీ లు, కోచింగ్ సెంటర్లు తమకు ఇంటర్ బోర్డు అనుమతి ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ, విద్యార్థులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆకాశ్, బన్సల్క్లాసెస్ వంటి సంస్థలు అకాడమీలు మాత్రమేనని, గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డు కళాశాలలు కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఐఐటీ, నీట్, ఏప్సెట్ అకాడమీలూ ఇంటర్ బోర్డు కిందికి రావన్నారు. అడ్మిషన్ తీసుకునే ముందు కళాశాల పేరు, అనుమతి పొందిన చిరునామా, గ్రూపులు, అర్హత గల అధ్యాపకులు, ల్యాబ్ సౌకర్యాలను స్వయంగా తనిఖీ చేయాలని, ప్రతి కళాశాల ఎదుట వివరాలతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అనుమతి లేని సంస్థల్లో చేరి విద్యార్థులు తమ భవి ష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. -
దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం
కరీంనగర్ టౌన్: దళిత క్రెస్తవులకు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని ఎమ్మార్పీస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రిస్టియన్ పాస్టర్స్ ఫెలోషిప్ సంస్థ కరీంనగర్లోని ఇందిరా భవన్లో ‘దళిత క్రైస్తవులు .. రాజ్యాంగ హక్కులు, సామాజిక హోదా’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోకి ఇస్లాం ప్రవేశించకముందు ఉన్న కులవిక్షను క్రైస్తవం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడపై కత్తిలాగా వేలాడుతున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25కు ఇవి పూర్తి వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిక్కు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగా దళిత క్రైస్తవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1947 నుంచి 1977 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. తాను ఏ పార్టీ వాడిని కాదని, తన ఒంటిపై కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని తీర్పు చెబితే అన్నిరాజకీయ పార్టీలు మౌనం వహించాయని విమర్శించారు. న్యాయం, ధర్మం దళిత క్రైస్తవుల పక్షాన ఉందని, శక్తిమంతమైన ఉద్యమాన్ని నడిపి ప్రజా మద్దతు సమీకరిద్దామని ఆయన కోరారు. పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాఘవా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎలీషా, గంగరాజు, బెన్ని, మోజెశ్బాబురావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు
సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12నుంచి జూన్ వరకు ఉమ్మడి జిల్లా క్రికెట్ సెలెక్షన్స్కు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు డీసీసీ చైర్మన్ వంకాయల కార్తీక్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బాలబాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించేలా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డు వైట్ డ్రెస్తో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. -
పాత ఆటలు... భలే సరదాలు
వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలున్న రోజుల్లోనే పిల్లలు ఫోన్లు వదలడం లేదు. ఇక సెలవుల్లో మన మాట వింటారా? ఆ ఫోన్లకే అతుక్కుపోతారు అంటూ తల్లిదండ్రులు బాధపడొద్దు. మీరు కూడా ఖాళీ సమయం చూసుకుని పిల్లలతో ఈ పాత ఆటలు ఆడించండి. మీరు చిన్నతనంలో ఆడుకునే ఉంటారు. వారూ వాటిని వదిలి పెట్టరు. గడులాట: క్లాసురూంలో ఖాళీ పీరియడ్ వచ్చిందంటే చాలు నోట్ పుస్తకాలు తీసుకొని దానిలో గడులాట ఆడేవారు. ఒకరు ఒక గీత గీయాలి. వేరొకరు దానికి ఆనించి మరో గీతగీయాలి. ఇలా నాలుగు గీతలు గీస్తే ఒక గడిలా తయారవుతుంది. చివరి గీత ఎవరు గీస్తే గడిలా తయారవుతుందో వారిదే ఆ గడి అన్నమాట. ఆ గడిలో వారి పేరు మొదటి అక్షరం రాసుకుంటారు. అలా పేజీ అంతా అయ్యాక లెక్కిస్తే ఎవరికి ఎక్కువ గడులొస్తే వారు గెలిచినట్టు. చిట్ల పొట్లకాయ ఆట: ఇది దాదాపు దాగుడుమూతల్లానే ఉంటుంది. ఒక మూలవైపుగా ఒకమ్మాయిని కూర్చోమంటారు. మిగిలిన వాళ్ళలో ఒకరు వెళ్ళి కూర్చున్న అమ్మాయి కళ్ళు మూస్తారు. అప్పుడు ఎవరు కళ్ళు మూశారో చెప్పాలి. కళ్ళు మూసిన అమ్మాయి పేరు కనుక్కుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరల ఆడతారు. పేరు కనుక్కోలేకపోతే మొదట అమ్మాయికే కళ్లు మూయాలి. చిట్ల పొట్లకాయ–సీమనెల్లి కాయ గోడ పుచ్చకాయ–గొట్టినెల్లి కాయ అత్తకు పెడితే అల్లం–అల్లుడు తింటే బెల్లం కొత్త కుండల్లోని కోడళ్లారా–పాలపిడతలోని పాపల్లారా! అంటూ ఈ ఆట ఆడుతూ పాట పాడతారు. ఇప్పటి పిల్లలు అంత్యాక్షరి ఆడుకున్నట్లుగా మా కాలంలో ఈ ఆట ఆడేవారు. ఆటలో పాల్గొనే వాళ్లంతా తలా ఒక పుస్తకం, పెన్నుతీసుకొని ఒక పేజీలో పేరు, ఊరు అని పైన రాస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక్కరు ఒక అక్షరం పేరు చెబుతారు. ఆ అక్షరంతో వచ్చే పేరు, ఊరు పేరు రాయాలి. ఎదుటి వాళ్లకు రాని విధంగా ఉండేలా కష్టమైన అక్షరాలు ఇస్తారు. దానికి వాళ్లు పేరు, ఊరు పేరు రాయాలి. ఇప్పటిలా దీవీలు లేవు కాబట్టి. ఊర్ల పేర్లు చాలామందికి తెలియవు. అట్లాస్లో చూడటమే తప్ప విడిగా తెలియదు. అప్పట్లో మేము ఎవ్వరికీ తెలియని వికారాబాద్ పేరును తెగ రాసేవాళ్లం. ఇలా ఎవరికీ తెలియనివి రాసినపుడు పక్క ఫ్రెండ్స్ ఒప్పుకునే వాళ్లు కాదు. ఇంకా కొంత మంది ఊరు, పేరుతో పాటు ఆట, పండు, తినే వస్తువు అని ఇలా నచ్చినట్టుగా పెట్టుకునే వాళ్లు.. ఎన్ని గంటలైనా ఆడుకునే వాళ్లం. ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆటఇది. ఒక తాడును తీసుకొని ఎగరేస్తూ రెండు కాళ్లకింద నుంచి తీసుకెళ్తారు. ఎగురుతూ ఆడే ఈ ఆట వ్యాయామానికీ ఉపయోగ పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, పెద్ద వాళ్లయ్యాక కూడా అంతే సరదాగా ఆడుకోవచ్చు. ఒంటి కాలితో, రెండు కాళ్లతో ఆడే స్కిప్పింగ్ ఎక్కడా తడబడకుండా వంద వరకూ ఆడేవాళ్లం అలుపు లేకుండా. ఈ రోజుల్లో ఇవేవీ లేవు. రచన: డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రాజన్నసిరిసిల్ల -
శవమై కనిపించిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి
శంకరపట్నం: ఇంటి నుంచి వెళ్లిన సింగరేణీ రిటైర్డ్ ఉద్యోగి మాతంగి కొంరయ్య(75) మండలంలోని కాచాపూర్ గ్రామశివారులో శవమై కనిపించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొంరయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. కుటుంబంతో కలిసి అత్తగారి ఊరు ముత్తారంలో నివాసం ఉంటున్నాడు. కొంరయ్య పెద్ద కుమారుడు ఆనంద్ ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో అదే బెంగతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం గొర్రెల కాపరులకు కాచాపూర్ శివారులో శవమై కనిపించాడు. కొడుకుపై బెంగతోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. -
తండ్రి దినకర్మ రోజే తనయుడి ఆత్మహత్య
● దుమాలలో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ ఆటో డ్రైవర్ తండ్రి దినకర్మ రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో మంగళవారం విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. దుమాలకు చెందిన పాముల భాస్కర్గౌడ్(43) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదురోజుల క్రితం తన తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి దినకర్మ సోమవారం జరిపించారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్గౌడ్కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ శరవిందు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఉరేసుకుని మహిళ..జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్వాడకు చెందిన సాయిని అంజవ్వ (51) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంజవ్వకు సారంగాపూర్ మండలం రేచపల్లిలో కొంత భూమి ఉంది. వారి సమీప బంధువులతో వివాదం కొనసాగుతోంది. భూమి పోతుందని మనస్తాపానికి గురైన అంజవ్వ ఇంట్లోనే ఉరేసుకుంది. అంజవ్వ కూతురు సాయిని సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఏఎస్సై అజిజోద్దీన్ తెలిపారు. మానకొండూర్: మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు సీతాల రమేశ్ (38) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. రమేశ్కు ఆరేళ్ల క్రితం వివాహమైంది, భార్యతో విడాకుల కేసు కొనసాగుతోంది. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో రమేశ్ ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు..● చెప్పుతో కొడతానన్న మహిళా సర్పంచ్ ● సోషల్ మీడియాలో ఆడియో వైరల్ శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలో చెట్ల నరికివేతపై ఓ వ్యక్తి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ మరో వ్యక్తి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిని ఆశ్రయించాడు. దీంతో విచారణ నిమిత్తం అధికారులు తరచూ గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ‘కావాలనే కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని, వారిని చెప్పుతో కొడతా’ అంటూ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై వార్డు సభ్యులు సమావేశం అయ్యారు. శ్రీఎవరిని చెప్పుతో కొడతారంటూ’ సర్పంచ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిజాయతీ ఫలం
ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ఒక రోజు పాఠశాలకు వెళ్తూ రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. రాము ఆ పర్సును తీసుకుని ఇంటికి వెళ్లకుండా నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లాడు. గ్రామ పెద్ద ఆ పర్సు ఎవరిదో తెలుసుకోవడానికి గ్రామంలో ప్రకటించాడు. కొంతసేపటికి ఒక వృద్ధుడు వచ్చి అది తనదేనని చెప్పాడు. అతను చాలా ఆందోళనలో ఉన్నాడు, ఎందుకంటే ఆ డబ్బుతో తన కుమార్తె చదువు ఫీజు చెల్లించాల్సి ఉంది. రాము పర్సును అతనికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో రామును ఆశీర్వదించి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కానీ రాము శ్ఙ్రీనిజాయితీకి బహుమతి అవసరం లేదుశ్రీశ్రీ అన్నాడు. రాము మంచితనాన్ని చూసి గ్రామస్థులందరూ అతన్ని ప్రశంసించారు. అప్పటి నుండి గ్రామంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పేరు: నక్క శ్రీకర్, గ్రామం: ఊటూరు, మండలం: మానకొండూర్, జిల్లా: కరీంనగర్ -
సుల్తానాబాద్ ‘అల్ఫోర్స్’కు సీబీఎస్ఈ గుర్తింపు
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని అల్ఫోర్స్కు సీబీఎస్ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి అన్నారు. అల్ఫోర్స్కు సీబీఎస్ఈ గుర్తింపు రావడంతో సుల్తానాబాద్లోని అల్ఫోర్స్ హైస్కూల్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లుగా అన్నివర్గాల విద్యార్థులకు తమ సంస్థ విద్యా సేవలు అందిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, బోధన సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని గుర్తింపు ఇచ్చారని అన్నారు. విద్యార్థులకు ప్రాథమికదశ నుంచే నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. సీబీఎస్ఈ గుర్తింపు ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయని, ఐఐటీ, నీట్లో సులభంగా సీట్లు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. పాఠశాల సీబీఎస్ఈ గుర్తింపు నంబర్ 3630668గా ఉందని ఆయన చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల సిబ్బంది నరేందర్రెడ్డిని సన్మానించారు. -
బన్నీ వేసవి యాత్ర–5 రామ్ డాన్స్
సాయంత్రం అయ్యింది. బస్ ఒక ఊర్లో ఆగింది. ఇది బస్ స్టాండ్. అక్కడ చాలా మంది. మధ్యలో ఒక అబ్బాయి. పేరు రామ్. వయసు 11. పక్కన ఒక తాత డప్పు కొడుతున్నాడు. ‘డమ్ డమ్’ అని శబ్దం. రామ్ డాన్స్ చేస్తున్నాడు. గెంతుతున్నాడు. తిరుగుతున్నాడు. అందరూ చూస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. రామ్ బన్నీని చూశాడు. ‘ఏయ్ బాబూ! రా!’ అన్నాడు. ‘నాకు డాన్స్ రాదు’ అన్నాడు బన్నీ. సిగ్గు పడ్డాడు. రామ్ నవ్వాడు. బన్నీ చెయ్యి పట్టుకున్నాడు. మధ్యలోకి లాగాడు. ‘డాన్స్ రాకున్నా పర్లేదు. చిన్నగా మొదలు పెట్టు. ఆనందం చాలు’ అన్నాడు రామ్. బన్నీ రెండు గెంతులు గెంతాడు. చెయ్యి ఊపాడు. కాలు కదిపాడు. తప్పు అయ్యింది. అయినా పర్లేదు. అందరూ ‘భలే!’ అన్నారు. చప్పట్లు కొట్టారు. బన్నీకి నవ్వు వచ్చింది. గుండె హాయిగా ఉంది. బస్ ‘పాం పాం’ అని అరిచింది. బన్నీ బస్ ఎక్కాడు. రామ్ చెయ్యి ఊపాడు. ‘బై!’ అన్నాడు. పిల్లలకి మాట: డాన్స్ రావాల్సిన పని లేదు. మనసులో ఆనందం ఉంటే చాలు. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్సిటీ(రామగుండం)తూకంలో దోపిడీ తగదుకరీంనగర్అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ తూకం వేయడం, తరుగు పేరిట మిల్లర్లు దోచుకోవడం వంటి చర్యలను తక్షణమే నియంత్రించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రామిశ్రాను కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు, స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ వివరించారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోండి రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేసి, కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లు, రవాణా దా రుల సమన్వయంతోనే కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలమన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఎక్కువమంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోళ్లను నిరంత రం పర్యవేక్షించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పౌరసరఫర ాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజచారి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు –2026 ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని సోమవారం పీఎం శ్రీ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చెస్, క్యారమ్ ఆటలాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఎంఈఓ తుమ్మ ఆనందం, ఈఈ అశోక్కుమార్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏఏపీసీ చైర్పర్సన్ సుగుణ, హెచ్ఎం కన్నం రమేశ్, ఐఈఆర్పీ దీప్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం ఎలగందుల మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంపును ఎంఈవో ప్రారంభించారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండికరీంనగర్: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఆధ్వర్యంలో క రీంనగర్లోని వైశ్యభవన్ నుంచి నిర్వహించే ‘హిందూ ఏక్తాయాత్ర’ను విజయవంతం చే యాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఏక్తాయాత్ర ఏర్పాట్లను కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలతో కలిసి పరిశీలించి మాట్లాడారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు 12 ఏళ్లుగా లక్షలాది మందితో జరిగే యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. హిందూ సమాజం తరలిరావాలని కోరారు. భగీరథ్పై చర్యలు తీసుకోండివిద్యానగర్(కరీంనగర్): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ లైంగిక దాడి చేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదు చేసినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం వివిధ సంఘాలు, పార్టీలు నగరంలో నిరసన తెలిపాయి. భగీరత్ను పోక్సో కేసులో అరెస్ట్ చేయాలని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మచ్చ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, నాయకులు పాల్గొన్నారు. రాజకీయ అక్రమ సంబంధం వల్లే భగీరత్ను అరెస్ట్ చేయడం లేదని బీఎస్పీ జోన్ ఇన్చార్జి నిషాని రామచంద్రం ఆరోపించారు. నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు అయినందుకే పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. మాతంగి అశోక్, పల్లె ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానంసప్తగిరికాలనీ(కరీంనగర్): హైదరాబాద్లోని బేగంపేట, రామాంతాపూర్ పబ్లిక్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశానికి అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6 సీట్లలో ఎరుకల వారికి 3, లంబాడ వారికి 2, ఇతరులకు 1 సీటు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 1 జూన్ 2019 నుంచి 31 మే 2020 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించరాదని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 12 నుంచి 18 వరకు కలెక్టరేట్లోని గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉండదని, దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఈనెల 22న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండదని, మరిన్ని వివరాలకు 95026 64044 నంబరులో సంప్రదించాలని కోరారు. -
ప్రజావాణి.. వినతుల బాణి
కరీంనగర్అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాస్థాయిలో కలెక్టర్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో కుందారపు మహేశ్వర్ వినతులను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపగా, ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మొత్తం 129 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కాగా, అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని ఆదేశించారు. కరీంనగర్ రెవెన్యూ డివిజన్కు 40, హుజురాబాద్ డివిజన్కు 16 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్లోనే.. మొత్తం అర్జీలు: 129 మునిసిపల్ కార్పొరేషన్: 23 ఎస్సీ వెల్ఫేర్: 11, హౌజింగ్: 11 సీపీ ఆఫీస్: 06, వారధి: 06 -
పడుతున్నారు..!
రాష్ట్రాలను జల్లెడకరీంనగర్క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహర్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నింది తులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్వి చ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్ర మే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్యవధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్టగా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
యానిమల్ హౌస్తో పరిశోధనలకు ఆస్కారం
కరీంనగర్సిటీ: శాతవాహన ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో సోమవారం ‘యానిమల్ హౌస్’ను వీసీ ఉమేశ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతువులకు ఆశ్రయం కల్పించి, వాటి సంరక్షణ, ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ చేయడానికి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, కొత్త పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయి సదస్సులలో పాల్గొనడానికి అధ్యాపకులకు ఉపయోగపడుతుందన్నారు. రిజిస్ట్రార్ సతీశ్కుమార్ మాట్లాడుతూ, పరిశోధనలో భాగంగా ఫార్మ కాలేజీకి జంతుశాల వెన్నెముక వంటిదని, పరిశోధనలతో మరింత ముందుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శ్రీశైలం, సీడీసీ డీన్ డా.జాఫర్, డా. శ్రీవాణి, డా. నజీముద్దీన్మున్వర్, అధ్యాపకులు డా.క్రాంతి, డా.అనిల్ డా.భాగ్యలక్ష్మి, డా.శ్రీవిద్య, డా. అశ్విని, డా.అర్చన తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టంతో నర్సింగ్ వృత్తి..
4చాలా ఇష్టంతోనే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న. 2011లో ఏఎన్ఎం చేశాను. నర్సింగ్ చదవాలని పట్టుదలతో డిగ్రీ వదిలేసి, జీఎన్ఎం కోర్సు పూర్తి చేశా. కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో నర్సింగ్ ఆఫీసర్గా ఐదేళ్లుగా పని చేస్తున్న. – స్రవంతి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని చాలా సంతృప్తిగా ఉంది మాది ఖమ్మం. నాన్న సలహాతో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి వచ్చాక రోగులకు సేవలందించడం చాలా సంతృప్తిగా ఉంది. మా కజిన్స్ కూడా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. ఇలా నాకు నర్సింగ్ సేవలపై ఇంట్రెస్ట్ కలిగింది. – కె.సరిత, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని -
వేసవిలో చిన్నారులు భధ్రం
సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు ●ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వేసవిలో పిల్లల్లో డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులు, చర్మసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ గమనిస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. డ్రాయింగ్, సంగీతం, నృత్యం, యోగా వంటి శిక్షణ తరగతులకు పంపించాలి. రోజూ కొంతసమయం చదువుకు కేటాయించేలా ప్రోత్సహించాలి. ఇంటిపనుల్లో చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమశిక్షణ పెంపొందించాలి. పెద్దలతో సమయం గడిపేలా చేసి కుటుంబ విలువలను తెలియజేయాలి. మొక్కలు నాటడం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా శారీరక–మానసిక వికాసం కలిగించాలి. జ్యోతినగర్: వేసవి సెలవుల్లో పిల్లలు అధిక సమయం ఇంట్లోనే గడపడం, బయట ఆటలపై ఆసక్తి చూపడం సహజం. మండుతున్న ఎండలు వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులను పిల్లల భవిష్యత్కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సలహాలిస్తున్నారు. -
మద్యం తాగించి.. కత్తితో పొడిచి..
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ(28)ని పథకం ప్రకారం హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు వంశీ గతనెల 29 నుంచి కనిపిండచం లేదని ఫిర్యాదు చేయగా ఈనెల 1న మిస్సింగ్ కేసు నమోదైంది. సీడీఆర్, మొబైల్ కాల్స్పై దృష్టి సారించిన పోలీసులు.. వంశీ స్నేహితురాలు అలేఖ్య, ఆ మె భర్త నీలం నవీన్, నవీన్ స్నేహితుడు బుర్ర భా స్కర్పై దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత సా యంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. వంశీని హత్య చేశామని అంగీకరించారు. ప్రాణం తీసిన గెట్టూగెదర్.. వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య, నీలం నవీన్ను ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో టెన్త్క్లాస్ గెట్టుగెదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతస్నేహితులు కలిశారు. ఈక్రమంలోనే వంశీ.. అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్చేస్తూ, మెసేజ్లు పంపిస్తూ ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి మూడుసార్లు గొడవకు కూడా దిగాడు. భర్త నవీన్, స్నేహితుడు భాస్కర్ మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. వంశీ తనను వేధిస్తున్నాడని అలేఖ్య తన భర్తకు తెలిపింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని నవీన్, భాస్కర్ పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్చేసి వంశీని హైదరాబాద్ రప్పించారు. గతనెల 30న వంశీ తొలుత అలేఖ్య నివాసానికి వెళ్లగా.. ముగ్గురూ కలిసి కారులో భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటకిఏ నవీన్ డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో భాస్కర్ వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో చాతి, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఫోన్ద్వారా నవీన్కు భార్య సమాచారం అందించింది. నవీన్ చేరుకొని భాస్కర్తో కలిసి గదిలోని రక్తపు మరకలను లైజాల్తో శుభ్రపర్చారు. భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్, మ్యాట్లో చుట్టి కారులో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్క లోయలో పడవేశారు. పోలీసు విచారణలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి కారు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలేఖ్య, నవీన్, భాస్కర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివాహితను వేధిస్తున్నాడని వంశీ హత్య వివరాలు వెల్లడించిన ఏసీపీ రమేశ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ -
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. తమ మంచి మాటలతో రోగులకు ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు వైద్య సేవలందిస్తున్నాను. – శోభ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ రోగులను కాపాడడంలోనే సంతృప్తి రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మా ట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్ని స్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. ఈ వృత్తిలోకి వచ్చేవారందరూ మదర్ ఆఫ్ నర్సింగ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకోవాలి. – దీవెన, నర్సింగ్ ఆఫీసర్, కరీంనగర్ నర్స్ పాత్ర గొప్పది రోగులకు ప్రత్యక్షంగా సేవలందించడం ఒక్క నర్సింగ్ ఆఫీసర్లకే దక్కుతుంది. న ర్సింగ్ ఆఫీసర్ల పాత్ర గొప్పది. 22 ఏళ్లుగా నర్సింగ్ పని చేస్తున్న. మా పిన్ని జానకి ఏఎన్ఎంగా పని చేశారు. ఆమె సేవలకు స్ఫూర్తి పొంది నర్సింగ్ విభాగాన్ని ఎంచుకున్న. ఆస్పత్రుల్లో డాక్టర్లతోపాటు నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. – జమున,నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2, పెద్దపల్లి -
లైఫ్ డో‘నర్స్’
ఏ ఉద్యోగమైనా ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహిస్తుంటారు. కానీ, నర్సులు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా సేవా భావంతో పనిచేస్తారు. కోవిడ్ సమయంలో మొక్కవోని ధైర్యంతో వారు సేవలు అందించిన రోజులను చూశాం. అన్నీ మూతపడ్డా ఆసుపత్రులు మాత్రం ఎళ్లవేళలా తెరిచే ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలందిస్తూనే ఉంటారు. రోగమేదైనా నర్సులు మాత్రం రోగులను అక్కున చేర్చుకొని వైద్యాన్ని అందిస్తారు. సడలని సంకల్పంతో విధులు నిర్వహిస్తారు. వైద్యుల తర్వాత నర్సులదే కీలకపాత్ర వైద్య సేవల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నర్సులే. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వు, ఆత్మీయ స్పర్శతో రోగులకు సేవలందిస్తుంటారు. డాక్టర్ రౌండ్స్లో భాగంగా వార్డుకు వచ్చి రోగిని పరీక్షించి ఏయే మందులు వాడాలో కేస్షీట్పై రాసి వెళ్లిపోతారు. డాక్టర్ పేర్కొన్నట్లు రోగికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఇండెంట్ రాసుకొని మెడికల్ స్టోర్స్ నుంచి తెప్పించి వాడుతారు. ఏమైనా వైద్య పరీక్షలు అవసరమైతే నాల్గో తరగతి ఉద్యోగుల సాయంతో చేయిస్తారు. 24 గటలు అందుబాటులో ఉంటూ పేషెంట్కు వ్యాధి తగ్గే వరకు సేవలందిస్తారు. సేవలకు సలాం ప్రమాదాల్లో గాయపడినవారు, మందు తాగి ఆస్పత్రి పాలైనవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు, డెంగీ, మలేరియా వంటి జబ్బున పడినవారు మాత్రమే కాకుండా అనేక మంది చీము, నెత్తురుతో కలిసిన గాయాలతో ఆస్పత్రులకు వస్తుంటారు. వీరందరినీ పరీక్షించి మందులు రాసేది డాక్టర్. ఆపరేషన్లు చేసేది డాక్టర్. అయితే ఆ తర్వాత కోలుకోవడంలో, డ్రెస్సింగ్ చేసి గాయాలు మాన్పించడంలో ప్రధాన భూమిక పోషించేది నర్సులే. నర్సింగ్ కోర్సులపై ఆసక్తి నర్సింగ్ కోర్సులపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్స్టిట్యూట్లు కూడా పోటీ పడుతున్నాయి.కరీంనగర్/కోల్సిటీ(రామగుండం):ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడితే.. ఒక నర్సు తన సేవలతో రోగి ప్రాణానికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ఎంతో మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చి తమలోని సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంకితభావం, నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఆమె పుట్టిన రోజున ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. -
పాపం పసివాడు
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ గుర్తు తెలియని మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందగా, తన నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. సుమారు 28 ఏళ్ల వయస్సుగల మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో శనివారం జమ్మికుంట రైల్వే స్టేషన్కు వచ్చింది. అంతలోనే ఎమైందో ఎమో కానీ, రైల్వే బుకింగ్ హాల్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన రైల్వే బుకింగ్ ఉద్యోగి 108 అంబులెన్స్కు సమచారమిచ్చాడు. వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు, వివరాలు లేవు. బ్లూ కలర్ డిజైన్ హాఫ్ ప్యాంట్, పింక్ బ్లూ, పసుపు డిజైన్ టాప్ ధరించి ఉంది. చేతిపై ‘సమ్మక్క, సలీమ్, అమ్మ’అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. కాగా, చికిత్స సమయంలో తల్లి వద్దే ఉన్న కుమారుడిని ఆమె మృతిచెందడంతో ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది చైల్డ్ హోంకు పంపించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. మృతురాలి వివరాలు తెలిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి అనాథ అయిన నాలుగేళ్ల కుమారుడు -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి(వట్టిమల్ల) లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గొల్లపల్లికి చెందిన గోపు లచ్చయ్య(65) ఆదివారం బంధువుల వివాహానికి వెళ్లి వచ్చి, సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే వేములవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రైల్వే ఉద్యోగిపై కోతుల దాడి ● తలకు, ముక్కు, కన్నుకు తీవ్రగాయాలు రామగుండం: పెద్దపల్లి జి ల్లా రామగుండం రైల్వేక్వార్టర్లలో కోతులు బీభత్సం సృష్సిఉ్తన్నాయి. ఈ నేప థ్యంలోనే స్థానిక రైల్వే సీ అండ్ డబ్ల్యూ సహాయకు డు రవికిషన్ విధులు ముగించుకుని ఆదివారం రాత్రి తన క్వార్టర్కు చేరుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్రూమ్కు వెళ్లేందుకు డోర్ తీసి బయటకు రాగానే కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేసేందుకు య త్నించాయి. వాటిని తప్పించు కునేందుకు రవి కిషన్ ఇంట్లోకి పరుగెత్తినా వెంటాడి దాడి చేశా యి. ఘటనలో ముఖం, ము క్కు, కంటిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో స్థానికు లు భయాందోళనలకు గురవుతున్నారు. భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాళ్ల రాజు(34) తన భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రాజుకు భార్య రజిత, ఇద్దరు కొడుకులున్నారు. రాజు మద్యానికి బానిస కావడంతో భార్యతో రోజూ గొడవలు జరిగేవి. విసుగు చెందిన భార్య ఆర్నెల్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. తన ఇంటికి రావాలని ఎంతపిలిచినా రాలేదు. మరింత మద్యానికి బానిసైన రాజు.. మనస్థాపంతో ఆదివారం మద్యం తాగాడు. ఆ మత్తులో తాను ఉరివేసుకుని చనిపోతున్నని తన చిన్నఅక్కకు ఫోన్ చేసి చెప్పాడు. భయపడిన ఆమె వెంటనే ఇంటిపక్కన ఉన్న బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లిచూసేసరికే ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. అక్క లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతివీణవంక: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూలం వెంకటమ్మ(70) వడదెబ్బకు గురై మృతి చెందింది. వెంకటమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. సోమవారం పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కాసుపత్రులు..!
జిల్లా వివరాలు ప్రైవేటు ఆస్పత్రులు 286 ప్రైవేటు క్లినిక్లు 222రోగనిర్ధారణ కేంద్రాలు 58 కరీంనగర్: కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కమీషన్ల దందా నడుస్తోంది. ప్రాణాల కన్నా కమీ షన్లే లక్ష్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు రోగుల రక్తం తాగుతున్నాయి. సాధారణ జ్వరంతో వెళ్లినా అవసరం లేని వైద్య పరీక్షలు చేయించి రూ.వేలల్లో గుంజుతున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల మధ్య ఉన్న ఒప్పందంతో అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పీడిస్తున్నారని పలువురు సీనియర్ వైద్యులే వాపోతున్నారు. కొంత మంది రోగి ముఖం చూడకుండానే వైద్య పరీక్షలు రాస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో అసిస్టెంట్లే జూ నియర్ డాక్టర్ పేరిట అవసరం లేకున్నా వివిధ రకాల టెస్టులు రాసి పేదలను దోచుకుంటున్నారు. ఎమ్మారై, సిటీస్కాన్లో సగానికి పైగా వైద్యులకే ఆస్పత్రుల నిర్వాహకులు తాము రాసిచ్చిన ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్కే వెళ్లాలని ఒత్తిడి చేస్తుండగా.. ఎమ్మారై, సిటీస్కాన్ లాంటి వైద్య పరీక్షలకు డయాగ్నోస్టిక్ సెంటర్లు రోగుల వద్ద నుంచి వసూలు చేసే ఫీజులో సగానికి పైగా వైద్యులకే అందజేస్తున్నామని స్కాన్ సెంటర్ల నిర్వాహకులే చెబుతున్నారు. సిటీస్కాన్కు రూ.3 వేలు నుంచి రూ.6 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఎమ్మారైకి రూ.5 వేల నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇతర ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్తే సరిగా లేవని తిప్పి పంపడం సర్వసాధారణమైంది. స్కానింగ్ ఫీజు ఆస్పత్రిలోనే వసూలు స్కానింగ్ సెంటర్లో చెల్లించాల్సిన డబ్బులు కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులే వసూలు చేస్తున్నారు. కమీ షన్ తీసుకుని మిగతావి అప్పగిస్తున్నారు. ఇలా చే యడం వల్ల తాము సూచించిన స్కానింగ్ సెంటర్ కు పేషెంట్ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. ఇక ల్యాబ్ల్లో చేసే వివిధ రకాల రక్త పరీక్షలకు వసూలు చేసే ఫీజులో 40 నుంచి 60శాతం వరకు వైద్యులకు ముట్టచెబుతున్నారు. సాయంత్రానికి కమీషన్ పంపించకుంటే మరునాడు తమ స్కానింగ్ సెంటర్ లేదా ల్యాబ్కు రోగులను పంపటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కమీషన్ల దందా బహిరంగమే అయినా యంత్రాంగం నియంత్రణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కలెక్టర్ దృష్టి సారించాలి -
నేపాలీ ముఠా కోసమే సోదాలు..?
● రైళ్లలో ఆకస్మిక సోదాలతో ప్రయాణికుల బెంబేలు ● లక్నో, గోరఖ్పూర్ రైళ్లపైనే ప్రత్యేక నిఘా రామగుండం: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఇటీవల ఓ మాజీ డీజీ సతీమణిని ఇంట్లోనే మట్టుబెట్టిన నేపాలీ గ్యాంగ్పైనే పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. రామగుండం రైల్వే స్టేషన్తోపాటు రైళ్లలో పోలీసుల ఆకస్మిక సోదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తోందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆదివారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐలు కొదురుపాక రాజేంద్రప్రసాద్, లింగమయ్య, ఎస్సై క్రాంతికుమార్ తదితరులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్తో గోరఖ్పూర్ రైలులో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ప్రధానంగా నేపాల్ రాష్ట్రానికి సమీపంలో ఉన్న లక్నో, గోరఖ్పూర్ రైళ్లలో ఎక్కువగా నేపాల్ రాష్ట్రానికి చెందిన వారు కూడా ప్రయాణిస్తుండడంతో.. వారి కదలికలు, లగేజీపై ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ రాష్ట్రానికి చెందిన వేలాది మంది రోహింగ్యాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు సమాచారమందడంతో వారిపై కూడా నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటికే తమ కాలనీల్లో అద్దెకు దిగే ఇళ్లలో అనుమానితులను గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఓవైపు చోరీ నిందితులు, మరోవైపు దేశ ద్రోహులను పట్టుకునేందుకు రైళ్లలో నిఘా వ్యవస్థను పెంచినట్లు స్పష్టమవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం
వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆరెపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన వంశీ(19), కేసీఆర్నగర్కు చెందిన నవీన్ కరీంనగర్ నుంచి కారులో వస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులో లారీని ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ నవీన్ను వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ధర్మపురిలో..ధర్మపురి: ధర్మపురిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తోగిటి వాసు(32) ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లి తిరిగి వస్తున్నాడు. పట్టణ శివారులో ట్రాక్టర్ బైక్ను ఢీకొనడంతో వాసుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాక్టర్ డ్రైవర్ పబ్బతి జగదీష్గా గుర్తించారు. వాసు ధర్మపురిలో ఓ జువెల్లరీ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి గతంలోనే మృతిచెందాడు. తల్లి వరలక్ష్మిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కొడుకు మృతి వార్త తెలియగా తల్లి గుండెలవిసేలా రోదించింది. వాసు చిన్నాన్న వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శతాధిక వృద్ధురాలు మృతికథలాపూర్(వేములవాడ): సిరికొండ గ్రామానికి చెందిన చిలుక రాజుబాయి(105) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉండగా.. 60 మంది వరకు మనుమలు, మనుమరాళ్లున్నట్లు బంధువులు పేర్కొన్నారు. రాజుబాయి వందేళ్ల వయస్సులోనూ తన పని తాను చేసుకునేదని, మనుమలు, మనుమరాళ్లకు పురాతన కథలు చెప్తూ ఆనందంగా గడిపేదన్నారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా.. ఆదివారం మృతిచెందిందని తెలిపారు. -
అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం
స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు మల్యాల: మల్యాల మండలం కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలంలోని శ్రీసీతారాముల ఆలయం నుంచి ఆలయ ఈవో దామోదర్ పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వాటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించి.. వైజంక్షన్ నుంచి మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాల మధ్య శోభాయాత్రగా అంజన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తరలివస్తున్న భక్తులు.. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సుమారు 3 నుండి 4లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో అధికారులు ఆలయంలో లడ్డూ, ప్రసాదాలు, తాగునీటి వసతులు కల్పించారు. -
కంచర్లలో చిరుత కలకలం
● దాడిలో గేదె మృతి వీర్నపల్లి: కంచర్ల గ్రామంలో చిరుత పులి దాడి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం రాత్రి గ్రామానికి చెందిన రైతు, మంత్రి శ్రీనివాస్కు చెందిన పాడి గేదైపె చిరుత దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, బాధితుడి వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే శ్రీనివాస్కు చెందిన గేదె తోటి గేదెలతో మేతకెళ్లగా.. అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం తన గేదె కోసం అడవిలో గాలించగా.. గేదె చిరుత దాడిలో అక్కడికక్కడే మృతిచెందడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం నుంచి సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. గ్రామ సమీపంలోనే చిరుత సంచరిస్తుండడంతో కంచర్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. పెద్దమ్మ ఆలయంలో చోరీమల్లాపూర్: సిరిపూర్ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ప్రతి ఏటా ముదిరాజ్ కులస్తులతోపాటు ఇతర భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఆలయ గర్భగుడి తాళం పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, ముక్కెర, బొట్టు, వెండి మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఎస్సై అనిల్ స్థానిక ప్రజాప్రతినిధులతో వెళ్లి విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ ఫుటేజీ చూడగా.. దుండగుడు ఆభరణాలను దొంగిలిస్తున్న దృశ్యం రికార్డయింది. ముదిరాజ్ కులస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. -
మెడిటేషన్, జాతీయ గీతాలాపన
ప్రతీ సబ్జెక్టుల్లో ఉత్తమ అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నాం. నాలుగేళ్లుగా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం. పోటీపరీక్షల్లో రాణించేలా విద్యార్థులకు మెరుగైన మెటీరియల్తోపాటు మెడిటేషన్ చేయిస్తున్నాం. ప్రతీరోజు శిక్షణ తర్వాత జాతీయ గీతాలాపన చేయిస్తున్నాం. పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగావకాశాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – గోశికొండ బాలరాజు, సత్యసాయి సమితి జిల్లా యువజన సమన్వయకర్త -
నా బాల్యం
కథల పుస్తకాలు చదివేవాడిని సిరిసిల్ల: వేసవి సెలవులు వస్తున్నాయంటే ఎంతో సంతోషంగా ఉండేదని రాజన్నసిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. ఎండాకాలం సెలవుల్లో తన చిన్నతనంలో ఎలా గడిపేవారో వివరించారు. ఆయన మాటల్లోనే.. బాల్యం .. నిజంగానే అమూల్యమైనది. తిరిగిరాని గొప్ప వరం. వేసవి సెలవులు వస్తే.. చాలు మా ఊరిలోని పెద్దవాగులో ఈతకొడుతూ.. ఈతకాయలు.. తాటి ముంజలు తింటూ ఎంజాయ్ చేస్తూ గడిపే వాడిని. మాది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వెల్గ టూర్. నాన్న గడ్డం రాంరెడ్డి ప్రభుత్వ టీచర్, అమ్మ పద్మ. మా అమ్మమ్మ ఊరు కమ్మర్పల్లి మండలం నాగాపూర్. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడిని. ఈ రోజుల్లో లాగా మాకు సెల్ఫోన్లు, టీవీలు అందుబాటులో లేవు. నిజానికి మా నాన్న బాలమిత్ర, బాలజ్యోతి చందమామ వంటి పుస్తకాలు తెప్పించి చదివించేవారు. వేసవి సెలవుల్లోనూ క్రికెట్ వంటి ఆటలతోపాటు కథల పుస్తకాలు బాగా చదివే వాడిని. ఇప్పటికీ నాపై ఆ ప్రభావం ఉంటుంది. వేసవి సెలవులు వస్తున్నాయంటేనే ఎంతో సంతోషంగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
● గాడిదల గండి వద్ద యువకుడి మృతదేహం లభ్యం ● కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాల ఆందోళన యైటింక్లయిన్కాలనీ/మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ(29) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 29న కనిపించకుండా పోయిన వంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో ఆదివారం మంథని మండలం గాడిదల గండి వద్ద పొదల్లో లభ్యమైంది. వంశీ కనిపించడం లేదని ఈనెల 1న గోదావరిఖని టూటౌన్ పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాలు గాడిదల గండి వద్ద మంథని ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. వంశీ చిన్ననాటి స్నేహితురాలు అలేఖ్యతోపాటు నవీన్, భాస్కర్కు ఎక్కువగా కాల్ చేశాడని తెలిపారు. అలేఖ్యకు వంశీతో ఉన్న గొడవల కారణంగా హైదరాబాద్కు పిలిపించి శంషాబాద్లో భాస్కర్ అనే వ్యక్తి గదిలో హత్య చేసినట్లు తెలిపారు. శవాన్ని చాపలో చుట్టి గాడిదల గండి వద్ద పడేసినట్లు పేర్కొన్నారు. విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘ఆది’ ఔదార్యం
● తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడి తరలింపు వేములవాడ: భగవంతరావునగర్కు చెందిన ఊరడి భూమయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పట్టణంలోని పెద్దమ్మ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వేములవాడ రూరల్ పరిధిలో తన పర్యటన ముగించుకొని వేములవాడ వస్తున్న క్రమంలో ఇది చూసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమయ్యను పరామర్శించి రోడ్డు ప్రమాద వివరాలడిగి తెలుసుకున్నారు. వెంటనే తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
ఆడపిల్ల పుట్టిన ఇంటికి రూ.10 వేలు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నిక ల సమయంలో తన డివిజన్లోని దంపతులకు ఆడపిల్ల పుడితే రూ.10వేలు అందిస్తానని ఇచ్చిన హామీని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ నెరవేర్చా రు. డివిజన్కు చెందిన పైండ్ల రవళి, ప్రశాంత్ దంపతులకు ఆడపిల్ల జన్మించగా ఆ మొత్తాన్ని ఆదివారం అందించారు. రవీందర్ సింగ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ పుట్టిన ఇంట్లో ఆనందం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు. సభకు తరలిన బీజేపీ శ్రేణులు కరీంనగర్: సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. కరీంనగర్ నుంచి వెళ్లిన వాహనాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లానుంచి 120 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు దాదాపు 500 సొంత వాహనాల్లో సభకు తరలి వెళ్లారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, సీనియర్ నాయకుడు గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూముల అనిల్ పాల్గొన్నారు. నైపుణ్యం పెంచుకోవాలి కరీంనగర్ టౌన్: కళాకారులు శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉ పాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జానపదం, యక్షగాన, బుర్రకథ, ఒగ్గుకథ, వీధి బాగోతం కళాకారుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, వారికి గుర్తింపు కార్డులతో పాటు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు ఈనెల 25, 26వ తేదీల్లో హైదారాబాద్లో జరగనున్నాయని, విజయవంతం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు కవ్వంపల్లి స్వామి, అందె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
సర్కారుకు ఆదాయం.. సామాన్యులపై భారం
కరీంనగర్క్రైం: భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను 50శాతం నుంచి 100 శాతం వరకు పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ఈనెల 8న చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ ఆడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అధికారులు వీసీలో సమీక్షించారు. ఈ నెల 13లోపు నివేదిక పంపాలని ఆదేశించారు. జిల్లాల నుంచి నివేదిక రాగానే జూన్ 1వ తేదీ నుంచే కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. ఎక్కడ ఎంత వరకు? ప్రస్తుత మార్కెట్ విలువ, వాస్తవ మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసముందని ప్రభుత్వం భావిస్తోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పట్టణ విస్తరణ, కొత్త లేఅవుట్లు, కమర్షియల్ నిర్మాణాలు, రహదారి అభివృద్ధితో భూముల అసలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొత్త విలువలు నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ పరిసర ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ధరల విలువలు పెంచుతున్నట్లు తెలిసింది. రేకుర్తి, పద్మనగర్, చింతకుంట, అలుగునూర్, హౌసింగ్బోర్డు, బొమ్మకల్, నగునూరుతో తదితర ప్రాంతాల్లో భారీగా పెంపు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెలకు రూ.20 కోట్ల వరకు ఆదా యముంటుంది. మార్కెట్ ధర పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.10 లక్షల మార్కెట్ విలువ ఉన్న స్థలం కొత్త ధర ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.20 లక్షలకు చేరితే, రిజిస్ట్రేషన్ ఖర్చు రెట్టింపవుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్శాఖకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కాగా.. మధ్యతరగతి, చిన్న స్థలాలు కొనుగోలు చేసేవారు పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వృద్ధే లక్ష్యమా? భూముల మార్కెట్ విలువల పెంపు వెనుక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఉద్దేశమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్శాఖ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం గత కొంతకాలంగా కీలక వనరుగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో భూముల అసలు ధరలు ఎక్కువగా, ప్రభుత్వ విలువ తక్కువగా ఉండటంతో భారీగా ఆదాయం కోల్పోతున్నామన్న అభిప్రాయమున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుత మార్కెట్ ధరకు దగ్గరగా ప్రభుత్వ విలువలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములపైనా ప్రభావం వ్యవసాయ భూముల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ధరల పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. హైవేలకు సమీ పంలో ఉన్న భూములు, త్వరలో మున్సిపల్ పరిధి లోకి వచ్చే గ్రామాలు, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రభా విత ప్రాంతాల్లో గణనీయమైన పెంపు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అధికారులు ప్రాథమిక అంచనాలు, మార్కెట్ సర్వే, రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుండగా, పెంపు శాతం, అమలు తేదీపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
వాతావరణం జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఉక్కపోత ఉంటుంది. వడగాలులు వీస్తాయి.
నేటి నుంచి పీఎంశ్రీ స్కూళ్లలో క్రీడా శిబిరాలుకరీంనగర్స్పోర్ట్స్: విద్యార్థుల వేసవి సెలవులను విజ్ఞానదాయకంగా మార్చేందుకు పీఎంశ్రీ పాఠశాలల్లో నేటి నుంచి ఈ నెల 25 వరకు సమ్మర్ క్యాంప్లు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ పాఠశాలల్లో విజ్ఞాన, క్రీడా శిబిరాల కోసం ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.50వేలు కేటాయించింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న 17 పాఠశాలలకు రూ.8లక్షలు, జగిత్యాలలోని 15 పాఠశాలలకు రూ. 7.5లక్షలు, రాజన్న సిరిసిల్లలోని 9 పాఠశాలలకు రూ.4.5లక్షలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని 8 పాఠశాలలకు రూ.4లక్షలు కేటా యించారు. పీఎంశ్రీతో పాటు సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ ఈ క్యాంప్ల్లో అవకాశం కల్పించనున్నారు. -
ఇసుక.. ఇక చౌక
కొత్తపల్లి(కరీంనగర్): ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, సామాన్యులకు తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్ను తీసుకువచ్చింది. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 24 గంటల్లోపు ఇంటికే ఇసుక సరఫరా అవుతుంది. ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం వల్ల అక్రమ రవాణాను గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్ లేని వారు పంచాయతీ కార్యదర్శి ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ శివారుల్లోని మానేరు వాగులో రీచ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందిరమ్మ ఇళ్లకు.. ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ రీచ్ల్లో ఇసుక తీసుకునేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. చాలాచోట్ల ఇందిరమ్మ ఇళ్లు ఇసుక లేక నిలి చిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఎంపిక చేసిన రీచ్ల్లో ఇసుక తవ్వుకునే అవకాశమి చ్చింది. వినియోగదారులు gmiv. cgg. gov. in వెబ్సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా.. ఇసుక నూతన విధానాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైల ట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ జిల్లాల్లో ఫలితాలను బట్టి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ జరగడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం వల్ల విని యోగదారులపై అదనపు ఆర్థిక భారం పడదు. ఇసుక లోడ్తో బయలుదేరిన ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుతారు. దీంతో వాహనం ఏ మార్గంలో వెళుతోంది..? ఎక్కడ ఆగుతోంది అనే వివరాలను అధికారులు పర్యవేక్షించవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి రెవెన్యూ, పోలీస్, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017లో పెద్దపల్లి జిల్లాలో ‘స్యాండ్ టాక్సీ’ పేరుతో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టినా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని జోడించి మరింత పకడ్బందీగా దీనిని అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
1,893 బ్లాకులు.. 1,967 ఎన్యుమరేటర్లు
కరీంనగర్ అర్బన్: జనగణన– 2027 ప్రక్రియ తొలి దశ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణనివ్వగా, యాప్ వివరాలు అప్లోడ్ చేశారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయి గృహాన్ని జియోట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోగా, హెచ్తో ప్రారంభమయ్యే 11అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీని భద్రపరిచారు. ఎన్యుమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేసుకోనుండగా , ఐడీ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ద్వారా కుటుంబ వివరాలను ధ్రువీకరిస్తారు. జనగణన ప్రక్రియ కాగిత రహితమే కా గా.. సాంకేతికతతో డిజిటల్ గణన చేయనున్నారు. జూన్ 10వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో)లో భాగంగా బ్లాకులవారీగా ఇళ్లకు నంబర్లు కేటాయించనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9నుంచి 25వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉండనుంది. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. జిల్లాస్థాయిలో ముఖ్య గణాంక అధికారిగా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నోడల్ అధికారిగా వ్యవహరించనుండగా మండలస్థాయిలో చార్జ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అర్బన్లో మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారు. జిల్లాలోని 16 మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1,227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించగా 1,234 మంది ఎన్యుమరేటర్లు, 215 మంది సూపర్వైజర్లను నియమించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 666 బ్లాకులుగా విభజించగా 733 మంది ఎన్యుమరేటర్లు, 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహించనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్, ఒక్కో ఎన్యుమరేటర్ సుమారు 200 ఇళ్ల వివరాలు సేకరిస్తారు.2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 10,05,711 నివాసాలు 2,58,485 కుటుంబాలు 2,90,657 కుటుంబ యజమాని పేరు, కుటుంబంలోని ఒకరి మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి. ఆ నంబర్తో ఒక కుటుంబం వివరాల నమోదుకు మాత్రమే అవకాశముంటుంది. మొబైల్ నంబరుతో పాటు ఈ మెయిల్కు ఐడీ నంబరు వస్తుంది. పిన్కోడ్, గ్రామం/నగరం, ప్రాంతం, స్థానిక ల్యాండ్ మార్క్, భవనం నంబరు, నివాసయోగ్య స్థితి, వసతులు, మతం, షెడ్యూల్ కులాలు, తాగునీటి వసతి, గృహ వినియోగం, ఇంధనం తదితర వివరాలను చెప్పాల్సి ఉంటుంది. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో... ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగా -
నాణ్యమైన సేవలందించడానికే
నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా విద్యుత్ సంస్థ పనిచేస్తోంది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ సంస్థ ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులోకి తెచ్చిన ఏఐ ‘వాట్సాప్ చాట్ బాట్‘ కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు, వినియోగదారులకు అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచారాన్ని పొందవచ్చు. విద్యుత్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని అవాంతరాలు లేని విద్యుత్ను పొందాలి. – రాపెల్లి రవీందర్, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
బీఆర్ఎస్ బంద్ ప్రశాంతం
కమలాకర్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుషాప్ మూసివేయిస్తున్న బీఆర్ఎస్ నాయకులుటవర్ సర్కిల్లో సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణకరీంనగర్టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ చేపట్టిన కరీంనగర్ బంద్ ప్రశాంతంగా సాగింది. పోలీసులు ముందస్తుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మానకొండూర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, రసమయి బాలకిషన్, చొప్పదండిలో సుంకె రవిశంకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రవీందర్ సింగ్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గంగుల ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గంగుల బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో రోడ్డెక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. పలువురు కార్యకర్తలు కోర్టు చౌరస్తాలో బీజెపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజంతా హైరానా బంద్లో పాల్గొనవద్దని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలకు పిలుపునివ్వడం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బంద్ జరిగి తీరుతుందని ప్రజలు సహకరించాలని కోరడంతో నగరంలో హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో ప్రజలు హైరానా పడ్డారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ప్రతినిధులపై దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి బంద్ను విఫలం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించినా ప్రజలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. గుగ్గిళ్ల జయశ్రీ, తిరుపతినాయక్, బోనాల శ్రీకాంత్, జమీలోద్దీన్, గందె మాధవి, ఎడ్ల అశోక్, మైకెల్ శ్రీనివాస్, సోహన్ సింగ్, లక్ష్మయ్య, శ్యాంసుందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, దిండిగాల మహేశ్, పావని, రుద్ర రాధ, గంటల రేణుక పాల్గొన్నారు. -
హలో.. టీజీఎన్పీడీసీఎల్
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు పారదర్శక విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇప్పటికే విద్యుత్ యాప్ ద్వారా సేవలందిస్తున్న సంస్థ మరింత వేగవంతంగా వినియోగదారులను చేరుకునేందుకు ‘వాట్సాప్ చాట్ బాట్‘ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐని జోడిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ ఫీచర్ సేవలందించనుంది. ఎంచుకున్న భాషలో వినియోగదారుడి ప్రశ్నను ఏఐలో విశ్లేషించి సమాచారం ఇవ్వనుంది. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచిన విద్యుత్ సంస్థ కొత్తగా ఏఐ ఆధారిత వాట్సాప్ ఫీచర్ను 24/7 వినియోగంలోకి తెచ్చింది. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో గల 70.39 లక్షల వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు విద్యుత్ సంస్థ సిద్ధమైంది. 8712481489 వాట్సాప్ నంబర్ ద్వారా సేవలు మొదటగా వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్లో 8712481489 సంప్రదించి అవరమైన సేవలను సులభంగా పొందవచ్చు. వినియోగదారుడి ప్రస్తుత బిల్లు మొత్తం, చెల్లింపు తేదీ వివరాలు, చెల్లించిన బిల్లు వివరాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషలో ఫిర్యాదు చేస్తే టికెట్ ఇస్తుంది. ఈ టికెట్ ఆధారంగా ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఉంటున్న ప్రాంతంలోని ప్రస్తుత అంతరాయ స్థితులను తెలుసుకోవచ్చు. చాట్బాట్కు సమాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుని ఏజెంట్కు తరలించి సమస్య పరిష్కరించబడుతుంది. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
బీఆర్ఎస్, బీజేపీ బల నిరూపణకు అల్లర్లు
ముత్తారం: బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో శనివారం మంత్రి ఇందిరమ్మ గృహప్రవేశం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను హింసాత్మకం చేస్తున్నారని విమర్శించారు. గూండాయిజం, రౌడీయిజంతో కొట్లాడుకుంటూ ప్రశాంతతను దెబ్బతీశారని ఆరోపించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ మిత్ర పక్షంగా ఉంటూ అధికారం లేకపోవడంతో అల్లర్లు సృష్టిస్తోందని, కేటీఆర్ పేదలకు గూడు ఇవ్వలేక మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
11 నుంచి ప్రత్యేక విద్యా వారోత్సవాలు
కరీంనగర్టౌన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు జిల్లాలో ప్రత్యేక విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదుశాతం పెంచడం లక్ష్యంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 11న ఫౌండేషన్ డే, సమ్మర్ క్యాంప్, 12న ఎస్సెస్సీ రిమీడియల్ క్యాంపుల ప్రారంభం, ఇంటర్ రిమీడియల్ క్యాంపుల ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13న పాఠశాల విద్యా అభివృద్ధిపై సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో వర్క్షాప్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్చ నిర్వహించాలన్నారు. 14న జయశంకర్ బడిబాట కార్యక్రమంతో పాటు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 15న లైబ్రరీ డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 16న ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డే కళావైభవం పేరుతో జిల్లావ్యాప్తంగా నిర్వహించాలి. చిత్రలేఖనం, హస్తకళలు, నృత్యం, సంగీతం, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయాలి. 17న విద్యా విజయోత్సవం కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
మాటలు.. మంటలు.. దాడులు!
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ టౌన్: కేటీఆర్పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలు, దానిని ఖండిస్తూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి చేసిన ప్రతివిమర్శలు భౌతికదాడులకు దారితీశాయి. గురువారం ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండిపై కౌశిక్ చేసిన వివాదాస్పద విమర్శలతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కర్రలతో ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడికి దిగారు. గన్మన్లు కౌశిక్ను లోపల గదికి తరలించి ఆయనపై దాడిని తప్పించారు. కౌశిక్ చిక్కకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయం ఫర్నిచర్ను అక్కడే ఉన్న పాడి కారును బీజేపీ నేతలు ధ్వంసంచేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకురాలు పావనిగౌడ్ ఇంటి మీద దాడిచేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలను అడ్డగించిన బీజేపీ నాయకులు సంపత్గౌడ్ అనే బీఆర్ఎస్ నాయకుడి తలపగులగొట్టారు. అనంతరం పాడికౌశిక్ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు పలువురు బీజేపీ నాయకులు హుజూరాబాద్ తరలేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. మరోవైపు హుజూరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. మొత్తానికి ఇటు కరీంనగర్లో అటు హుజూరాబాద్లో పోలీసుల అప్రమత్తతో ఉద్రిక్త పరిస్థితులను నివారించగలిగారు. ఇంకోవైపు పాడి కౌశిక్పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు సోమిరెడ్డి వేణు ప్రసాద్, కొలిపాక చంద్రమౌళి, కామారపు విశ్వ ప్రసాద్, కనుకయ్య పెద్దపెల్లి జితేందర్ రెడ్డి, శ్రీలేఖ, ఊస కోయిల రమేశ్, వెన్న ఆనందం కోరారు. ఘటనపై ఎవరేమన్నారంటే.. లా అండ్ ఆర్డర్ ఉందా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడినైన తనను చంపేయత్నం జరిగింది. అసలు కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఉన్నాయా? ఈ విషయంలో సీఎం, బండి ఒక్కటయ్యారు. ఎమ్మెల్యేపైనే దాడులు చేస్తే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? దాడులకు భయపడం. నోటికివచ్చినట్లు తిట్టి ఇదేంటని అడిగితే దాడులు చేస్తారా? ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల నిరసనకేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. డ్రగ్స్ టెస్టుకు సంజయ్ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటీఆర్ భయపడుతున్నారని కౌశిక్ మాటల ద్వారా అర్థం అవుతుంది. – ప్రవీణ్రావు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్‘మిస్టర్ కౌశిక్ రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మానుకోకపోతే ఇదేవిధంగా దాడులు కొనసాగుతాయి. తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, డీసీసీ ప్రెసిడెంట్ కరీంనగర్కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా దాడులు చేయించడం సిగ్గుచేటు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి తెగబడి, ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు, కారు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. – జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
బీజేపీ, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్
● డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్న కేటీఆర్ ● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో రహస్య ఒప్పందాలు చేసుకొని బహిరంగంగా కొట్టుకొన్నట్లు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మండిపడ్డారు. గురువారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ మేయర్, కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకోవడం అందరికీ తెలిసిందేనన్నారు. అవసరమైనప్పుడు సహకరించుకుంటూ.. మరోవైపు తిట్టుకుంటూ.. పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రజాపాలనను అపవాదుకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మత్తులో ఉండి కేటీఆర్ ఇంకా తానే రాజనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. జువెల్లరీ షాప్లో జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. కౌశిక్రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, కాంతాల జగన్రెడ్డి, పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్, ఎండీ తాజొద్దీన్, కొరివి అరుణ్కుమార్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.కరీంనగర్ నుంచి విహార యాత్రకు బస్సులువిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్–2 డిపో నుంచి మైసూర్ మీదుగా ఊటి విహార యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని డిపో–2 మేనేజర్ ఎం.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న మైసూర్లో మైసూర్ ప్యాలెస్, చాముండే టెంపుల్, బృందావన్ గార్డెన్ మొదలగు ప్రదేశాలు చూసి అదేరోజు మైసూర్లో బస చేసి 17న ఉదయం 4 గంటలకు మైసూర్ నుంచి బయలుదేరి ఊటి వెళ్తుందన్నారు. ఊటిలో రెండు రోజులపాటు బస చేసి ఊటిలోని వివిధ ప్రదేశాలు సందర్శించి 18న రాత్రి డిన్నర్ తరువాత బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ప్యాలెస్ సందర్శన అనంతరం బెంగళూరు నుంచి బయలుదేరి 21న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500 టికెట్ ఉంటుందని, భోజనం ఖర్చులు, దర్శనం టికెట్ చార్జీలు ప్రయాణికులే భరించాలని పేర్కొన్నారు. వివరాలకు 7382847727, 7382850707, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సోలార్ విద్యుత్ కేంద్రాలతో ప్రయోజనం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ కరీంనగర్రూరల్: రైతులు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవ డం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ అన్నారు. గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా దుర్శేడ్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకంలో సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించిందన్నారు. సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యుత్ను విక్రయించడం ద్వారా ఆదాయం పొందొచ్చని తెలిపారు. డీఈ రాజం, ఏఈ ప్రదీప్రెడ్డి, ఏవో సత్యం, ఏఈవో స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆగ్రహం
గంగాధర: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకుందామంటే జరుగుతున్న జాప్యం, అధిక తూకం, మిల్లుకు వెళ్లిన తరువాత మరోసారి కోతలు విధించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదన్నారు. కేంద్రం ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు రెండు లారీలు మాత్రమే తూకం వేశారని అన్నారు. సంచికి 41 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా.. 42.200 కిలోల తూకం వేస్తున్నారని, మిల్లుకు వెళ్లిన తరువాత మరో కిలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో రైతులు ఆందోళన విరమించారు. మంగపేట రైతులు.. ధాన్యం తూకం వేయడంలో జాప్యం జరుగుతోందని, కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలు కరువయ్యాయని మంగపేట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని, తూకం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలోని మంగపేట స్టేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ రజిత సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


