breaking news
Karimnagar District News
-
కారుణ్యమా.. కనికరించవా?
● 11 నెలలుగా నిలిచిన నియామకాలు ● ఆందోళనలో సింగరేణి కార్మికులు గోదావరిఖని: కారుణ్య నియామకాలు లేక కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతీనెల చేపట్టాల్సిన మెడికల్ బోర్డులు పత్తాలేకుండా పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు సాధించిన యువతకు సీఎం రేవంత్రెడ్డితో నియామక పత్రాలు ఇప్పించింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్టిఫికెట్లు అందజేయడం ద్వారా సీఎం పునరుద్ఘాటించినట్లయ్యింది. కొద్దినెలల పాటు మెడికల్ బోర్డు సజావుగానే సాగినా.. గతేడాది మార్చిలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 11 నెలలుగా కార్మికులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. కార్మికులకు నిరాశ.. తమ జీవితాన్ని సింగరేణికి అర్పించి ఆ తర్వాత తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తామని ఆశపడిన కార్మికులకు మెడికల్ బోర్డులేక నిరాశేమిగులుతోంది. సర్వీస్కు రెండేళ్ల ముందు మెడికల్బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీనెలలో రెండుసార్లు జరగాల్సి మెడికల్ బోర్డు ఇప్పటివరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో తమ పిల్లల వయసు పెరిగిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 18ఏళ్ల క్రితం అంకురార్పణ సింగరేణిలో 2018 మార్చి 9న కారుణ్య నియామకాల పేరిట మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేశారు. ఏప్రిల్లో మెడికల్బోర్డు ఏర్పాటు చేశారు. 18ఏళ్లపాటు రెగ్యులర్గా ఈ ప్రక్రియ సాగింది. గతేడాది నిలిచిపోవడంతో సుమారు 2వేల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. హయ్యర్ సెంటర్ బోర్డుతో కానరాని ఫలితం సింగరేణిలో అనారోగ్య సమస్యలతో మెడికల్బోర్డుకు దరఖాస్తు చేసుకున్న 55 మందిని హయ్యర్ మెడికల్ బోర్డుకు రెఫరల్ చేశారు. వీరి రిపోర్టుల ప్రకారం హయ్యర్ మెడికల్ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. 55 మందిలో ఒకరు గైర్హాజర్ కాగా ఐదుగురినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. మిగతా వారిని ఫిట్ఫర్ సేమ్జాబ్, సర్ఫేస్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేశారు. అడ్వయిజరీ బోర్డులోనూ అన్యాయమే విధి నిర్వహణలో అనారోగ్య సమస్యలతో మెడికల్బోర్డుకు దరఖాస్తు చేసుకున్న 229 మందికి అన్యాయం జరిగిందని వాపోతున్నారు. అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించడం కష్టమని సింగరేణి డాక్టర్లు నిర్ధారించగా మెడికల్బోర్డుకు పంపించారు. వీరిలో కేవలం 24మందినే మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి మిగతా వారిని ఫిట్ఫర్ సేమ్ జాబ్, సర్ఫేస్లో ఉద్యోగాలు చేయాలని బోర్డు సభ్యులు సూచించారు. ఇక కారుణ్య నియామకాలు ఉండవా? సింగరేణిలో కారుణ్య నియామకాలు ఉండవా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 7వేలమంది అదనంగా ఉన్నారని యాజమాన్యం చెప్పడాన్ని బట్టిచూస్తే వీటికి కావాలనే బ్రేక్వేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ తీసుకుని కారుణ్య నియామక ప్రక్రియ కొనసాగించాలని యువత కోరుతోంది. ఏడాది నియామకాలు 2018(ఏప్రిల్) 1,663 2019 2,998 2020 1,661 2021 2,111 2022 1,326 2023 1,060 2024 1,304 2025 377 -
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
మల్లాపూర్: ఆనారోగ్యంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్లూరి నీల(60) భర్త బాలయ్య తొమ్మిదేళ్ల క్రితమే మృతి చెందాడు. కొడుకు, కూతురుకు వివాహాలయ్యాయి. కొడుకు రమేశ్ ఉపాధి నిమిత్తం మూడేళ్ల నుంచి కోరుట్లలో నివాసం ఉంటున్నాడు. నీల గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. మూడు నెలల క్రితం ఇంట్లోజారి పడిపోవడంతో ఎడమ చేయి విరిగింది. అనారోగ్య సమస్యలతో పాటు ఒంటరితనంతో మానసికంగా బాధపడుతూ.. గ్రామశివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై అనిల్, సిబ్బందితో ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి కుమార్తె చింతల రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పురుగుల మందుతాగి..జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి చిన్నరాజం(80) బుధవారం ఉదయం పురుగుల మందుతాగగా, చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. చిన్నరాజం తొమ్మిదేళ్ల నుంచి కడుపు నొప్పి, నరాల సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోచేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఆరెపల్లి భీమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఉరివేసుకుని వివాహిత..వేములవాడ: వేములవాడ పట్టణంలోని కోరుట్లరోడ్ ప్రాంతానికి చెందిన వెంగళ దివ్య(32) ఉరఫ్ రోహిణి బుధవారం ఇంట్లోనే ఉరివేసుకుంది. పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన దివ్యను పదేళ్ల క్రితం వేములవాడకు చెందిన దినేశ్కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి బొంగు రాజగంగు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల గొడవలు జరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. -
అన్నా.. నేను చనిపోతున్నా..
కరీంనగర్రూరల్: ‘అన్నా అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నా.. నేను చనిపోతున్నా’ అంటూ ఓ వివాహిత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తీగలగుట్టపల్లిలో చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన లింగంపల్లి మమత(29), తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేశ్ 14 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో నివాసం ఉండేవారు. నరేశ్ సింగరేణి వన్ ఇంకై ్లన్లో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే వీరు గంగానగర్లోని అద్దె ఇంట్లోకి మారారు. వివాహమైన నెలరోజుల నుంచి మమత భర్త నరేశ్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవిత కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. మమత విషయాన్ని తన సోదరుడు మహేశ్కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో నస్పూర్కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లింది. మరునాటి రోజు ఉదయం గోదావరిఖనిలోని గంగానగర్ ఇంటి యజమాని మమతకు ఫోన్చేసి నరేశ్ మెట్లవద్ద పడి ఉన్నాడని చెప్పాడు. నరేశ్ను సింగరేణి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి మమత చికిత్స అందిస్తోంది. మంగళవారం ఆస్పత్రి వద్ద మమత, తన సోదరుడు మహేశ్ను నరేశ్ తల్లిదండ్రులు దూషించారు. దీంతో అక్కడి నుంచి మమత వెళ్లిపోయిది. మధ్యాహ్నం మహేశ్కు ఫోన్చేసి అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తాను చనిపోతున్నానని చెప్పింది. మహేశ్ డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వగా, పోలీసులు లొకేషన్ ట్రేస్ చేశారు. తీగలగుట్టపల్లిలోని హనుమాన్నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు, మహేశ్ అక్కడికి చేరుకోగా.. మమత అప్పటికే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ ఆఫీసర్ సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పరిశీలించారు. మమత తండ్రి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేశ్తో పాటు అత్తింటివారిపై బుధవారం క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో ఘటన -
మహిళ కడుపులోంచి ఆరు కిలోల కణితి తొలగింపు
కోరుట్ల: పట్టణా నికి చెందిన 48 ఏ ళ్ల మహిళ కడుపులోంచి 6కిలోల క ణితిని వైద్యులు బుధవారం శస్త్రచి కిత్స చేసి తొలగించారు. మహిళ కడుపు ఉబ్బసం, నొప్పితో స్థానిక వా సుదేవ ఆస్పత్రిలో చేరింది. వైద్యుడు పసునూరి మ నోజ్ కుమార్ పరీక్షలు చేసి, కడుపులో కణితి పెరుగుతున్నట్లు గుర్తించాడు. మహిళ అంగీకారంతో శస్త్రచిక్సిత ద్వారా తొలగించారు. వైద్యులు పసునూరి విజయశ్రీ, ప్రియాంక రాజేశ్ పాల్గొన్నారు. కత్తితో దాడి.. కేసు నమోదుజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లిలో మంగళవారం అర్ధరాత్రి ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు సోమన్పల్లికి చెందిన సాన రాకేశ్కు వివాహమై కూతురు ఉంది. అయినా ఓ వివాహితను ఇటీవల ప్రేమపేరుతో తీసుకొచ్చి, పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నా డు. విషయం తెలిసి వివాహిత బంధువులు స్వా మి, సత్తన్నతోపాటు, మరికొందరు సోమన్పల్లికి వ చ్చి సాన రాకేశ్పై దాడిచేసి వివాహితను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రాకేశ్ ఇంట్లో ఉన్న కత్తితో స్వామి, సత్తన్నలపై దాడిచేశాడు. స్థానికులు 108లో జగిత్యాల, ఆ తర్వాత కరీంనగర్కు తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
జిమ్నాస్టిక్స్ పోటీలు
కరీంనగర్ వేదికగా● 20 నుంచి 22 వరకు నిర్వహణ ● 16 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక కరీంనగర్స్పోర్ట్స్: జిమ్నాస్టిక్స్ కేవలం శారీరక వ్యాయామమే కాదు క్రమశిక్షణ, సమతుల్యత, ధైర్యం, ఏకాగ్రతల సమ్మేళనం. చిన్నవయసులోనే క్రీడాకారుల్లో ప్రతిభ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికల విభాగాల్లో జరుగనున్న పోటీలు భవిష్యత్ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు బాటలు వేయనున్నాయి. ఈనెల 20 నుంచి 22 వరకు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల వేదికగా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహిస్తారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని పరీక్షించే ఈ పోటీలు భవిష్యత్ జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసే దిశగా కీలకంగా మారనున్నాయి. మరోసారి అవకాశం.. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నిలయమైన కరీంనగర్ జిల్లా.. మరోసారి క్రీడా ప్రపంచంలో తన ప్రత్యేకత చాటుకోబోతోంది. రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల నిర్వహణకు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల సిద్ధమవుతోంది. సీఎం కప్–2025 సెకండ్ ఎడిషన్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు ఈసారి కరీంనగర్ ఆతిథ్యమివ్వనుండగా గతేడాది జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఈసారి జిమ్నాస్టిక్స్ పోటీలతో సరికొత్త క్రీడావాతావరణం సృష్టించబోతోంది. ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్లో పోటీలు రెండు విభాగాల్లో చేపట్టే పోటీలు ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ పద్ధతిన ఉంటాయి. బాలురకు ఫ్లోర్ ఎక్సర్సైజ్, పామ్మాల్, రింగ్స్, టేబుల్వాల్ట్, పార్లర్బార్, హారిజంటల్ బార్, బాలికలకు టేబుల్ వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్, అన్విన్ బార్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంశాల్లో పోటీలు ఉంటాయి. 250 మంది క్రీడాకారులు.. 72 పతకాలు రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్లు, మేనేజర్లు, రెఫరీలు హాజరుకానున్నారు. అండర్ – 12 బాలికలు, అండర్ – 14 బాలబాలికలు, అండర్ – 15 బాలికలు, అండర్ – 17 బాలురకు పోటీలు ఉంటాయి. 24 బంగారు, 24 రజత, 24 కాంస్య పతకాలకు పోటీలు జరుగనున్నాయి. -
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ‘చలో సెక్రటేరియల్’
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న చలో సెక్రటేరియల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ధామన్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరిగిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో చలో సెక్రటేరియల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ వెంటనే ప్రారంభించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర నాయకులు కాళిదాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎంపీరెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి రమణారావు, ఏఐటీయూసీ నాయకులు టేకుమల్ల సమ్మయ్య, కొంరయ్య, మనోహర్, జీపీసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే సామగ్రి చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రైల్వే సామగ్రి చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేసినట్లు సీఐ చటర్జీ బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వెంకిపల్లికి చెందిన బండి కుమార్, బండి సతీశ్ జనవరి 26న హసన్పర్తి రైల్వే స్టేషన్ వద్ద రూ.20,000 విలువైన ఎఫ్డీఎంఎస్ బాక్స్లు, 45 కాపర్ స్ట్రిప్స్ ఎత్తుకెళ్లారు. అలాగే, ఈ నెల 13,14వ తేదీల్లో బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ ఆర్వోబీ వద్ద రూ.10 వేల విలువైన ట్రాన్స్ఫార్మర్ కాయల్, రూ.7 వేల విలువైన కాపర్ పట్టీలను అపహరించారు. అనంతరం ఈ సామగ్రిని హైదరాబాద్ బేగంబజార్లో ఎం.డి.యూనిస్ ఖాన్కు విక్రయించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టి మంగళవారం అర్ధరాత్రి బిజిగిరి షరీఫ్ సిగ్నల్ సమీపంలో నిందితులను పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో రైల్వే సామగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే, కొనుగోలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. సీఐబీ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ బీఎన్.సింగ్, ఏఎస్సై రాంబాబు, హెడ్కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుల్ మనోజ్ పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ -
గేటు పడింది.. అంబులెన్స్ ఆగింది
రైల్వే గేటు వద్ద ఆగిన అంబులెన్స్కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిలో గంగాధర మండలం మంగపేట సమీపంలోని రైల్వే గేటు వాహనదారులకు సంకటంగా మారింది. గేటు పడితే అరగంటకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని అంబులెన్స్లో జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ తీసుకెళ్తున్నారు. మంగపేట వద్ద రైలు గేటు పడింది. దీంతో అంబులెన్సు అరగంటపాటు అక్కడే ఆగింది. ప్రతిరోజు పదికి పైగా రైళ్లు ఈ లైన్లో రాకపోకలు సాగిస్తుంటాయని, వాహనదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. – గంగాధర -
యువకుడి అదృశ్యం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్లూరు గ్రామానికి చెందిన బాదె సంతోష్(25)ఈనెల 15న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రివరకూ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. బంధువులు, ఇరుగుపొరుగు వారు, తెలిసిన వారిఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ తెలియరాలేదు. ఈమేరకు అతడి బావ మంగ వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఆచూకి తెలిసిన వారు 87126 56520 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని సీఐ ప్రసాద్రావు సూచించారు. మోసం చేసిన కేసులో ఐదేళ్ల జైలు గోదావరిఖనిటౌన్: ఓ మహిళను మోసం చేసి గర్భవతిని చేయడంతోపాటు బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులను కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పుచెప్పినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. రామగుండం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గోదావరిఖని అడ్డగుట్టపల్లికి చెందిన ముత్యాల సుదర్శన్కు 2008లో పరిచయం ఏర్పడింది. 2010లో ఆమెను పెళ్లి చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని కొన్ని డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో తనకు సంబంధం లేదని తప్పించుకున్నాడు. అంతేకాదు.. ఆమెతోపాటు ఆమె తమ్ముడిని, తల్లిని కులం పేరుతో దూషించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్నాక నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి అదనంగా రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు వివరించారు. -
కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బె దిరింపు కలకలం రేపింది. ఆర్డీఎక్స్ బాంబులు అ మర్చినట్లు జిల్లా జడ్జి అధికారిక మెయిల్ ఐడీకి మె యిల్ వచ్చింది. ఉదయం 09.05 గంటలకు జిల్లా జడ్జి మెయిల్కు (సున్నియా దాసన్ ఔట్ లుక్ డాట్ కాం) పేరిట మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12.05 గంటలకు 12 ఆర్డీఎక్స్ బాంబులు పేలడాని కి అమర్చబడ్డాయని, మధ్యాహ్నం ఇస్లామిక్ ప్రార్థనకు ముందు అందరూ కోర్టు సముదాయాన్ని ఖాళీ చేయండని మెయిల్ పంపారు. అప్రమత్తమైన సి బ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వ చ్చి డాగ్స్క్వాడ్, బాంబుస్క్వాడ్తో తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అధికారులు, న్యాయవాదులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి తనిఖీ చేసి, లేదని తేల్చిన పోలీసులు -
గృహ ప్రవేశాలకు సిద్ధం చేయండి
కరీంనగర్ అర్బన్/తిమ్మాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో పనులు మార్చి 31లోగా పూర్తిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు, కోతిరాంపూర్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు. పలు అంశాలపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, ఇటుక, సిమెంటు, కొంత చౌకధరల్లో లభించేలా అధికారులు డీలర్లు నిర్వాహకులతో మాట్లాడాలని ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రోగ్రెస్ చాలా బాగుందని అభినందించారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ఆలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్తో సమీక్షించారు. హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ నరసింహచారి, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే ఇసుక తీయండి
కరీంనగర్ అర్బన్: నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ ఇసుక తీయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. నదులపై చెక్ డ్యాములు నిర్మించిన చోట భద్రత దృష్ట్యా డ్యాముకు ఎగువన, దిగువన 300 మీటర్ల వరకు ఇసుక తోడడం నిషేధమని, అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా పరిధిలోని నదీప్రవాహాలకు సంబంధించి సరిహద్దులను పక్కాగా గుర్తించి రికార్డు చేయాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, టీజీఎండీసీ, పోలీస్ అధికారులు సమన్వయంతో ఇసుక రీచ్లను తనిఖీ చేయాలన్నారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ పోర్టల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కేటాయింపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రౌండ్ వాటర్ డీడీ శ్యాంప్రసాద్ నాయక్, డీపీవో జగదీశ్వర్, జిల్లా జియాలజిస్ట్ ప్రసన్న, డీఈఈ రాజేందర్, డిప్యూటీ డీఈ వేణుగోపాల్, మైన్స్ ఏడీ రాఘవరెడ్డి, టీజీఎండీసీ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ రవి, ఆర్వో కనకజ్యోతి పాల్గొన్నారు. -
ఆదర్శ నగరంగా కరీంనగర్
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం నగరంలోని 66వ డివిజన్లో రూ.13.5లక్షలతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతతో పని చేస్తామన్నారు. డివిజన్ల సమస్యల పరిష్కారానికి వారంలో ఒకరోజు డివిజన్లో పర్యటిస్తానని వెల్లడించారు. నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నామని, గతం కన్నా మెరుగైన స్థితికి నగరాన్ని చేరుస్తామన్నారు. 66 డివిజన్లలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని, రోడ్లు, డ్రైనేజీల సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని అన్నారు. విలీన గ్రామాల సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వేసవి దృష్ట్యా ఏ డివిజన్లోనూ తాగునీటి కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు వంగల పవన్, గుగ్గిలపు మంజుల రమేశ్, సోమిడి వేణుప్రసాద్, బండ రమణారెడ్డి, కేపీ చంద్ర, తాటి ప్రభావతి, స్థానికులు భగవాన్ కార్వా, విక్కీ, డి.రమేశ్, పి.శ్రీనివాస్, జ్యోతి, రవి, సురేశ్, చిన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
జైలుదిద్దిన జీవితాలు!
కటకటాల్లోకి వెళ్లాం.. కటిక చీకటి చూశాం.. జీవితం ముగిసిపోయిందని కుంగిపోలేదు. చేసిన తప్పును తెలుసుకున్నారు. పరివర్తన చెందాలనుకున్నారు. శిక్ష అనంతరం ఆదర్శంగా బతకాలనుకున్నారు. ఖైదీల ఆశయానికి జైలు అధికారులు ఊతం ఇచ్చారు. చిన్నపాటి సాయాన్ని పట్టుకొని అంధకారంలో నుంచే ఉపాధి వెలుగులు వెతుక్కున్నారు. శిక్షకాలం పూర్తయిన తర్వాత సమాజంలోకి అడుగుపెట్టిన వారు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ గౌరవప్రదంగా బతుకుతున్నారు. కరీంనగర్ జైలు నుంచి విడుదలైన 30 మంది ఖైదీలు జైలు పెట్రోల్బంకులో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్నారు.కరీంనగర్క్రైం: జైలుకు వెళ్లిన తర్వాత సమాజం, కుటుంబాలకు దూరమైన వారు బయటకు వచ్చాక జీవితం ఎలా ఉంటుందోనన్న భయంతో ఉంటారు. కానీ జైళ్లలో ఖైదీలుగా ఉన్న సమయంలో వారిలో పరివర్తన కనిపించింది. చేసిన తప్పును తెలుసుకున్నారు. ఇక జీవితంలో ఎలాంటి పొరపాటు చేయబోమని వారు మనసులో ప్రతిజ్ఞబూనారు. జైలులో ఉన్న సమయంలో కౌన్సెలింగ్, వృత్తి నైపుణ్య శిక్షణ వారిలో మార్పునకు నాంది పలికింది. బయటకు వచ్చిన తర్వాత అనుమానాల గాలులు ఎదురైనా, తడబడకుండా ముందుకు సాగుతున్నారు. సమాజం చేయూతనిస్తే నేరజీవితం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కలుగుతుంది. శిక్షతోనే కథ ముగియదని అవకాశం ఇస్తే కొత్త జీవితాలు ప్రారంభమవుతాయని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. 30 మందికి కొత్త జీవితాలు వివిధ కేసుల్లో శిక్షకాలం పూర్తయిన 30 మంది ఖైదీలు కరీంనగర్ జైలు నుంచి విడదలయ్యారు. వీరిలో 22 మంది కరీంనగర్ జైలు ప్రాంగణంలోని పెట్రోల్బంక్లో, మిగతా 8 మంది బొమ్మకల్ జైలుబంకులో పనిచేస్తున్నారు. ఇలా నెలకు రూ.16,500 వరకు ఆదాయం పొందుతున్నారు.ఖైదీల ఉపాధికి జైళ్లశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జైలులోని ఖైదీలకు పెట్రోల్బంకులో పనిచేయడం, బెంచీల తయారీ, అగరబత్తుల తయారీతోపాటు వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నాము. జైలు పెట్రోల్బంకు 2017లో ప్రారంభించాం. 30 మంది విడుదలైన ఖైదీలకు బంకులో ఉపాధి కల్పించాం. జైలు శిక్ష అనంతరం విడుదలైన వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – విజయ్ధేని, కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ -
బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు
మానకొండూర్: బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన ఉక్కుపాదాన్ని మోపుతుందని, పిల్లల రక్షణకు చట్టమే ఒక అజేయమైన కవచమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాశ్ స్పష్టం చేశారు. బుధవారం మానకొండూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహమనే మహమ్మారి ఆడపిల్లల భవిష్యత్తును చిదిమేస్తుందన్నారు. 2006 బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనతోపాటు నేటి తరాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల ముప్పు నుంచి ఎలా బయటపడాలో వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి కిరణ్కుమార్, ప్యానల్ అడ్వకేట్లు యూవీఆర్ కృష్ణ, బలుసుల శాంతికుమార్, తిరుమణి అశ్విని, జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది దుంపేటి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీకి ప్రత్యేక క్యాంపులుకరీంనగర్ అర్బన్: రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కోరారు. జిల్లాలో 2,09,450 రైతులకు గానూ 1,21,814 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారని వివరించారు. మిగిలిన 87,636 రైతులు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకునేందుకు ఈనెల 19 నుంచి ప్రత్యేక క్యాంపుల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులు, మీసేవ సెంటర్ల ద్వారా నమోదు చేస్తారని తెలిపారు. జిల్లాలోని రైతులు 28 లోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. అధిక ధరలు వసూలు చేయొద్దుచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో గల ఎరువుల పంపిణీ డీలర్లు యూరియా బస్తాకు ప్రభుత్వ రేటు రూ.267కన్నా ఎక్కువ వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి మల్లేశం అన్నారు. ఈనెల 16న ‘సాక్షి’లో ‘యూరియా యాప్ తిప్పలు’ అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన ఏవో ప్రైవేటు, ప్రభుత్వ ఎరువుల డీలర్లు స్టాక్ వచ్చిన వెంటనే ఆన్లైన్లో పెట్టినా, ఏ ఒక్క రైతు నుంచి రూ.267 కన్నా ఎక్కువగా తీసుకుంటే 21రోజుల పాటు సేల్స్ను నిలిపివేస్తామని హెచ్చరించారు. దళితులకు వడ్డీ లేని రుణాలివ్వాలికరీంనగర్ టౌన్: ప్రభుత్వం దళితులకు వడ్డీ లేని రుణాలివ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవుని సతీశ్మాదిగ ప్రభుత్వాలనికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహంలో దళిత సంఘాల నాయకులతో మేధోమథన సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ దళితులను, వారి భవిష్యత్తును నిలువునా ముంచిందని ఆరోపించారు. దళిత బంధు పేరుతో ఇంటికి రూ.10లక్షలిస్తామని చెప్పి ఊరికొకరికిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. దళిత ఆర్థిక అభివృద్ధి మండలి కరీంనగర్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా సముద్రాల లక్ష్మణ్ను నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు గొర్రె రాజన్న, పూసపాటి శ్రీనివాస్, మహంకాళి రామచందర్, సారస్వ, రూప, డీసీసీ కార్యదర్శి లక్ష్మణ్, సత్యరాజు వర్మ, సిరిసిల్ల రాజు, కొత్తూరు రమేశ్ పాల్గొన్నారు. -
ఐఎన్టీయూసీ రాష్ట్రకమిటీలో చోటు
జ్యోతినగర్(రామగుండం): ఐఎన్టీయూసీ రాష్ట్ర కమిటీలో రామగుండంలోని ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతానికి పెద్దపీట వేస్తూ పలు పదవులను కేటాయించారు యూనియన్ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి. బుధవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయన పలువురిని నియమించారు. ఇందులో పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి అధిక ప్రాధాన్యం కల్పించారు. కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడిగా గుర్తింపు పొందిన బాబర్ సలీంపాషాను ఏపీ–తెలంగాణ రాష్ట్ర చీఫ్ పాధ్యక్షుడిగా నియమించారు. కార్యదర్శులుగా వేముల కృష్ణయ్య, సందినేని గోపాల్రావు, భూమల్ల చందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బొద్దున రాజేశం, పెద్దపల్లి సతీశ్ యాదవ్, జమీల్ను నియమించారు. కాగా, సంజీవరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఏపీ – తెలంగాణ చీఫ్ ఉపాధ్యక్షుడిగా బాబర్ సలీంపాషా -
నిరాశ్రయులకు చేయూత
కరీంనగర్: దైవ దర్శనానికి వెళ్లి నగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ దృష్టికి రాగా.. ఆయన వెంటనే తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని కరీంనగర్కు రప్పించే ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని రాంనగర్కు చెందిన ఓ కుటుంబం తమిళనాడులోని కాంచీపురం వెళ్లింది. దైవ దర్శనం అనంతరం మంగళవారం రాత్రి ఆలయం చెంత నిద్రించగా.. వారి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో బోరుమన్న ఆ కుటుంబీకులు స్థానికులకు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక బధిరుడు ఉండగా.. మరో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయానికి అక్కడి ఆలయ సిబ్బంది సమాచారమివ్వడంతో.. కేంద్ర మంత్రి సూచనతో వారిని క్షేమంగా కరీంనగర్ రప్పించే ఏర్పాట్లు కార్యాలయ సిబ్బంది చేశారు. వారికి అక్కడ భోజన వసతి కల్పించడంతోపాటు కరీంనగర్ వచ్చేందుకు వీలుగా రైలు టికెట్లు బుక్ చేయించారు. ప్రయాణ ఖర్చులను అందించారు. -
దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి
మాచారెడ్డి/ ఎల్లారెడ్డిపేట: దైవ దర్శనానికి వచ్చిన భక్తుడు ఒక రు ప్రమాదవశాత్తు కోనేరు బా విలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మినర్సింహస్వామి ఆలయ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై అనిల్ కథనం ప్రకారం వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన పందిర్ల సురేశ్గౌడ్(45) తరచూ లక్ష్మినర్సింహస్వామి ఆలయానికి వచ్చి వెళ్తుంటాడు. మంగళవారం దైవదర్శనానికి వచ్చి కాళ్లు, చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతిచెందినట్టు వివరించారు. ఈమేరకు బుధవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిజగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వకులభరణం నర్సింహస్వామి (68) మృతిచెందాడు. వెల్గటూర్లోని హనుమాన్ ఆలయ ప్రధాన పూజారి వకులభరణం నర్సింహస్వామి భార్య రమాదేవితో కలిసి బుధవారం పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరిగి బైక్పై వెళ్తుండగా పెంబట్ల శివారులో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రమాదేవికి స్వల్పగాయాలయ్యాయి. మృతుడి కుమారుడు సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సారంగాపూర్ ఎస్సై గీత తెలిపారు. -
ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
పెగడపల్లి: అనారోగ్యంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నందగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కపల్లి మల్లేశం, రామలక్ష్మి దంపతులకు కుమారుడు మల్లికార్జున్, కూతురు రమ్య ఉన్నారు. రమ్య కరీంనగర్లో పదో తరగతి చదువుతోంది. పదిరోజుల క్రితం ఇంటికొచ్చింది. మల్లేశం ఒగ్గుకథ చెప్పేందుకు కొమురవెళ్లి వెళ్లాడు. తల్లి ఆరుబయట బీడీలు చుడుతోంది. ఆమె లోపలికి వెళ్లేసరికి రమ్య (15) ఉరేసుకుని కనిపించింది. ఆమె కిడ్నీలో రాళ్లు వచ్చాయని, కడుపునొప్పితో బాధపడుతోందని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్య సమస్యలతో వృద్ధుడు..వీర్నపల్లి: మండలంలోని కంచర్లలో మంగళవారం అనారోగ్య సమస్యలతో గొళ్లెం వెంకటి (85) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. బాధలు భరించలేక మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య శివవ్వ, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆరుగురు పిల్లలకు పెద్దదిక్కుగా ఉన్న వెంకటి మరణంతో కంచర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకేసులో జీవిత ఖైదు సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన వృద్ధురాలు చంద్రమ్మను హత్యచేసి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన అదే గ్రామానికి చెందిన కోదాటి సంపత్రావు(38)కు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి సునీత మంగళవారం తీర్పు వెలువరించారని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. చోరీలు చేస్తూ జులాయిగా తిరిగే సంపత్రావు.. 2019లో తన ఇంటిఎదుట ఒంటరిగా ఉంటున్న చంద్రమ్మ ఇంట్లోకి చొరబడి బంగారం గొలుసు చోరీచేశాడన్నారు. అంతటితో ఆగకుండా పీటతో తలపై బాది వృద్ధురాలిని హత్య చేశారని పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సాక్ష్యాధారాలు, సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టామని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పు వెలువరించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కార్పొరేట్ వల!
కరీంనగర్టౌన్: పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా, అప్పుడే కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్ల హడావుడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 14,670 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో ఇంటర్ ప్రవేశాలకు కార్పొరేట్, చిన్నాచితకా ప్రైవే టు కాలేజీలు విద్యార్థులను చేర్పించుకునేందుకు అప్పుడే వేట మొదలుపెట్టాయి. కళాశాలల్లో పని చేసే లెక్చరర్లకు, ఇతర సిబ్బందికి కమీషన్ల ఆశ చూ పి అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టాయి. ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజులో రాయితీ అంటూ ఆశ చూపడం, తమ కాలేజీల్లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్ లాంటి కోచింగ్లు, హాస్టల్ వసతి అని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. డబ్బులిచ్చి డేటా సేకరణ పదోతరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల డే టాను ఆయా స్కూళ్ల నుంచి సేకరించిన కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ అడ్మిషన్ల కోసం ముంద స్తు చర్యలు చేపట్టాయి. అడ్మిషన్లు చేయించిన ఏజెంట్లకు కమీషన్, వేతనాలు చెల్లిస్తుండడంతో డబ్బుకు ఆశపడి వారు విద్యార్థులను ఆయా కళాశాలల్లో చే ర్పించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. విద్యార్థులకు లేదంటే వారి తల్లిదండ్రులకు ఏజెంట్లు ఫోన్ చేసి, ఇంటర్లో కోరిన కోర్సులో సీటు ఇప్పిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. పదో తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్ తీసుకుంటే తక్కువ ఫీజు ఉంటందని ఆ తర్వాత ఫీజులు పెరుగుతాయని, ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోకుంటే తర్వాత కోరిన బ్రాంచ్లో సీటు దొరకదని బెదరగొడుతున్నారు. దీంతో ఫలితాలు వచ్చాక ఎలాగో కార్పొరేట్ కళాశాలలోనే చేర్పిస్తాం కదా అనే ఉద్దేశంతో అడ్మిషన్ ఆఫర్ల వలలో తల్లిదండ్రులు చిక్కుతున్నారు. రంగంలోకి లెక్చరర్లు, పీఆర్వోలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యం ఫోన్లు రావడంతో ఇదేం మోతరా బాబు అంటూ వాపోతున్నారు. ఎవరైనా తల్లిదండ్రులు పరీక్షల ఫలితాలు రాకముందే ఎలా చేర్పించాలంటూ ప్రశ్నిస్తే.. ‘మీ పిల్లలు బాగానే చదువుతారు’ అని తమకు సమాచారం ఉందని, తప్పకుండా పాస్ అవుతారని చెబుతూ అవసరమైతే స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులతో మాట్లాడిస్తున్నారు. ఒకవేళ పాస్ కాకుంటే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామంటూ హామీలిస్తున్నారు. ఇలా ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎల్ఐసీ ఏజెంట్లు, ఉపాధ్యాయులు, ఆర్ఎంపీ డాక్టర్లను రంగంలోకి దించి ఒక్క విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే పదిశాతం డబ్బు ముట్టజెప్పేందుకు పీఆర్వోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అప్రమత్తతే ముఖ్యం తల్లిదండ్రులు తొందర పడి పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరని పేర్కొంటున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించే ముందు విద్యార్థుల అభిప్రాయాలతో పాటు ఆ కాలేజీలో విద్యాబోధన చేస్తున్న వారి ఆనుభవం, అక్కడి సీనియర్, పూర్వవిద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. హాస్టల్లో ఉంచితే వసతులపై ఆరా తీసిన తర్వాతే అడ్మిషన్కు మొగ్గు చూపాలి. తమ విద్యవ్యాపారం కోసం నిత్యం పుస్తకమే ప్రపంచంగా మార్చే కళాశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో చేర్పిస్తే విద్యార్థి తీవ్ర ఒత్తిడికి గురై ఇబ్బందులు ఎద్కురొనే పరిస్థితులు లేకపోలేదు. అందుకని తొందరపాటు చర్యలతో కార్పొరేట్ మాయలో పడి విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు కలగకుండా తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. -
ఘనంగా కేసీఆర్ బర్త్డే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో 72 కేజీల భారీ కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా పూలు, పండ్ల మొక్కలను పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు గుగ్గిళ్ల జయశ్రీ, వాల రమణరావు, కంసాల శ్రీనివాస్, చిట్టీ రాజేందర్రావు, సంపత్రావు, నాయిం, రేణుక, సూర్యశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్టౌన్ -
రాజీనామాకు సిద్ధపడ్డ ‘వాసాల’!
కరీంనగర్ : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన వాసాల రమేశ్కు మేయర్ పీఠం దక్కినట్లే దక్కి చిక్కకుండా పోయింది. బీజేపీ కార్పొరేటర్లు, మద్దతు పలికిన స్వతంత్ర కార్పొరేటర్లు ఏకగ్రీవంగా రమేశ్ పేరును ప్రతిపాదించినా.. చివరినిమిషంలో చేజారినట్లు సమాచారం. కరీంనగర్ ప్రాంతంలో సీనియర్ నేత అయిన వాసాల రమేశ్ ఈసారి మేయర్ రేసులో బీజేపీ నుంచి ముందు వరుసలో ఉన్నారు. ఈయన కొత్తపల్లి సర్పంచ్గా, కరీంనగర్ ఎంపీపీగా వివిధ పదవులు నిర్వర్తించారు. 2019లో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ కావడమే తరువాయి అన్న సందర్భంలో, రాత్రికి రాత్రే ఆయన పదవి చేజారిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన రమేశ్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కొత్తపల్లి నగరపాలకసంస్థలో విలీనం కావడం, మేయర్ బీసీ జనరల్కు రిజర్వ్ అవడం, బీజేపీకి అధిక అవకాశం ఉండడంతో రమేశ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఫలితాల అనంతరం కార్పొరేటర్ల క్యాంప్లోనూ రమేశ్ పేరునే ఎక్కువమంది కార్పొరేటర్లు ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ.. రాత్రికి రాత్రే అనూహ్యంగా రమేశ్కు మేయర్ రాకుండా పోయిందని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. రాజీనామాకు సిద్ధం మేయర్ వ్యవహారంలో తీవ్ర మనస్థాపానికి గురైన రమేశ్ తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. మంగళవారం పద్మశాలి సంఘం నేతలు ఆయనతో భేటీ అయ్యారు. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించగా, సంఘం నేతలు వారించినట్లు సమాచారం.కరీంనగర్: బీజేపీ మెజారిటీ 30 స్థానాలు గెలిచినా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 స్థానాలను గెలిచి పీఠం దక్కించుకునేందుకు నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. మిగతా పార్టీల్లో గెలిచిన సభ్యులను ఎన్నో ప్రలోభాలకు గురి చేసి బీజేపీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ప్రజలంతా చూశారన్నారు. మేయర్తో సహా పాలకవర్గం మొత్తం ప్రజల సేవలో ఉంటామని స్పష్టంచేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీజేపీ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజీవ్పార్కు, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, పెద్దపోల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏఈ స్నేహ తివారి తెలిపారు. క్షేత్రస్థాయి పాఠాలు ముఖ్యంకరీంనగర్ అర్బన్: పశువైద్యాధికారులకు తరగతి గది పాఠాలతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులు ముఖ్యమని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్థక శిక్షణ కేంద్రంలో నూతన పశువైద్యాధికారులకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కళాశాల విద్యకు అదనంగా క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అవసరముంటుందని వివరించారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన పశువైద్యాధికారులకు మూడో విడత శిక్షణనిస్తున్నామని వెల్లడించారు. సహాయ సంచాలకులు డా.ఎ.వినోద్కుమార్, జిల్లా పశువైద్య శాల సహాయ సంచాలకులు డా.రామస్వామి, జిల్లా కార్యాలయ పర్యవేక్షకులు గూడ ప్రభాకర్రెడ్డి, శిక్షణ కేంద్రం అధ్యాపక సిబ్బంది డా.ఎం.కోటేశ్వర్రావు, డా.దివ్య, డా.సాయిచైతన్య పాల్గొన్నారు. -
పెద్దపులి దాడిలో మూడు లేగ దూడల మృతి
ఇల్లంతకుంట: మండలంలోని పెద్ద లింగాపురంలో సోమవారం రాత్రి మూడు లేగదూడలను పెద్దపులి దాడిచేసి చంపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రైతులు గుర్రాల మల్లయ్య, మంగళం సుధాకర్లకు పాడి పశువులను తమ వ్యవసాయ పొలాల వద్ద కట్టివేశారు. వీరి పొలాలు తిప్పాపురం గుట్టల సమీప ప్రాంతంలో ఉండటంతో మల్లయ్య కట్టివేసిన నాలుగు పశువుల్లో మూడింటిపై పెద్దపులి దాడి చేసి రెండింటిని చంపగా ఒకదానిని గాయపర్చింది. అదేవిధంగా సుధాకర్ నాలుగు పశువులను కట్టివేయగా ఒక లేగ దూడపై దాడి చేసి చంపింది. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న రైతులు జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన ప్రాంతంలో వివరాలు సేకరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి వచ్చిన సిబ్బంది కూడా పెద్దపులి ఆనవాళ్ల సేకరణలో పాల్గొని ధ్రువీకరించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను అమర్చారు. పరిసర ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళ పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. మరణించిన పశువులను పోస్టుమార్టం చేయగా, గాయపడ్డ లేగ దూడకు గాలిపెల్లి పశువైద్యాధికారి ఇందిర వైద్య చికిత్స చేశారు. -
హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల బైపాస్రోడ్లోని సాయిరాంనగర్ వద్ద ఈనెల 15న బోరె విశ్వనాథ్ (30) హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో వారిని అరెస్ట్ చూపారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్, ఇదే మండలం ఒడ్డెరకాలనీకి చెందిన ఆలకుంట లక్ష్మీ సాయిరాంనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. లక్ష్మీకి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ విశ్వనాథ్తో ఉంటుండడంతో ఆమె భర్త ఆలకుంట గంగాధర్, అతడి బావమరిది బోదాసు తిరుపతి లక్ష్మీపై కక్ష పెంచుకున్నారు. ఆదివారం విశ్వనాథ్, లక్ష్మీ సాయిరాంనగర్లో నడుచుకుంటూ వెళ్తుండగా గంగాధర్, తిరుపతి వారిని వెంబడించారు. విశ్వనాథ్పై కట్టెలతో దాడి చేయగా అక్కడికక్కడే చనిపోయాడు. లక్ష్మీపైనా దాడిచేయడంతో తప్పించుకుని పారిపోయింది. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు లింగంపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నారన్న సమాచారంతో వెళ్లి పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సుప్రియ, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
వేధించిన కొడుకు.. కడతేర్చిన తండ్రి
మానకొండూర్: వేధించిన కుమారుడిని ఓ తండ్రి కడతేర్చిన హృదయవిదారక ఘటన మానకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. సీఐ సంజీవ్ తెలిపిన వివరాలు.. మానకొండూర్కు చెందిన పురం లక్ష్మి, కనుకయ్య దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. చిన్న కుమారుడు శ్రీనివాస్ (35) మినహా అందరికీ వివాహాలు అయ్యాయి. ఏడేళ్ల క్రితంరోడ్డు ప్రమాదంలో లక్ష్మి చనిపోయింది. దీంతో శ్రీనివాస్, కనుకయ్య కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనేపథ్యంలో తండ్రిని శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అనంతరం శ్రీనివాస్ నిద్రపోయాడు. ఈక్రమంలో కొడుకు వేధింపులు భరించలేక మంగళవారం వేకువజామున బండరాయితో తలపై కొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే మరో కుమారుడికి విషయాన్ని తెలిపాడు. ఉదయం కనుకయ్య పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఘటన స్థలాన్ని ఏసీపీ విజయ్కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మద్యం తాగి నిత్యం గొడవలు తలపై బండతో మోది హత్య -
జవాబుదారీతనమే ఆర్టీఐ లక్ష్యం
రాజన్నా.. శరణుశరణు!జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్లోని శ్రీదుబ్బరాజేశ్వరస్వామి ఆలయం భక్తజన సందోహంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో అనూష, ఆలయ ఫౌండర్ చైర్మన్ పొరండ్ల శంకరయ్య, సర్పంచులు ఆకుల రమేశ్, కొలపాక రాధ పాల్గొన్నారు. – జగిత్యాలరూరల్ కరీంనగర్ అర్బన్: అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం దోహదపడుతుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు భోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ.శ్రీనివాసరావు, మోసినాపర్వీన్, దేశాల బోపాల్ తెలిపారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. 2025 మే 14న కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకున్న సమయంలో 17,808 రెండో అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని, 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాల్లో పర్యటించి 9వేల అప్పీళ్లు పరిష్కరించామని, ఇంత త్వరగా పరిష్కరించడం దేశంలోనే మొదటిసారని పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని, సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో పర్యటించి వీలైనంత త్వరగా పెండింగ్ కేసులు పరిష్కరిస్తామన్నారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. పీఐవోలు, అప్పిలేట్ అధికారులకు అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టంపై వివరించారు. దరఖాస్తుదారు కోరిన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. సెక్షన్ 20ప్రకారం దరఖాస్తుదారునికి ఎలాంటి ప్రత్యుత్తరమూ ఇవ్వకుంటే సంబంధిత అధికారికి రోజుకు రూ.250 అపరాధ రుసుం, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తుదారుడు కమిషన్కు ఫిర్యాదు చేస్తే అధికారులే కమిషన్ ముందు హాజరుకావాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, సంస్థలో ఆర్టీఐ కోసం ఒక రోజు కేటాయించి దరఖాస్తులన్నిటినీ పరిష్కరించాలని, కార్యాలయాల్లో ఫోర్ 4(1)బీ సమాచారం ఎప్పుడూ ప్రదర్శించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్వినితానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు. -
ఒక్క కరీంనగర్కే ఇంత ఆర్భాటమా?
కరీంనగర్టౌన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించింది గుండు సున్నా అని, ఒక్క కరీంనగర్ మేయర్ పీఠం బోటాబోటీ మెజార్టీతో కై వసం చేసుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. మంగళవారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రమంత్రి సంజయ్ మొన్నటి ఫలితాల్లో ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు 39 శాతం ఓట్లు పడ్డాయని, బీఆర్ఎస్కు 29 శాతం ఉందని, బీజేపీకి కేవలం 15 శాతం ఓట్లు నమోదయ్యాయని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా నిధులు తేవడంలో ఘోర వైఫల్యం చెందిన బండి ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. నాయకులు చల్లా హరిశంకర్, పొన్నం అనిల్కుమర్, చీటి రాజేందర్రావు, జక్కని ఉమాపతి, రవినాయక్, గంటల రేణుక, రవివర్మ, కంజర్ల రేణుక తదితరులు పాల్గొన్నారు. -
మండెపల్లి శివారులో అగ్నిప్రమాదం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి గ్రామశివారులోని నర్సరీ ప్రాంతంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సిరిసిల్ల అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని శివారులో వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేసి అదుపులోకి తీసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి మృతికరీంనగర్రూరల్: కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఈ నెల 10న శరీరంపై కాలిన గాయాలతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అదేరోజు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 15న రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు, ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేందర్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్ క్రాస్రోడ్డు సమీపంలో కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగిడి రాజు(34) అనే వ్యక్తి మృతి చెందారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రాజు ద్విచక్రవాహనంపై సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా రాచర్ల గొల్లపల్లి నుంచి సిరిసిల్ల వెళ్తున్న కారును మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాడు. ఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం, కారు నుజ్జునుజ్జయ్యాయి. అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. 23 వారాలకు జన్మించిన శిశువులను కాపాడొచ్చు కరీంనగర్: 23 వారాల్లో జన్మించిన శిశువులను కాపాడే అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందని హైటెక్సిటీ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆస్పత్రి పిల్లల వైద్య నిపుణులు నియోనాటలిస్టు డాక్టర్ రవీందర్రెడ్డి, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మ ధుమోహన్, గైనకాలజిస్టు డాక్టర్ భార్గవి తెలిపారు. నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు ఆధునిక పరికరాలతో చేపట్టే చికిత్స విధానంపై మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. 23–24 వారాల్లో జన్మించిన శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమన్నారు. హైటెక్సిటీ మెడికవర్ ఉమెన్ – చైల్డ్ హాస్పిటల్లో అత్యాధునిక ఎన్ఐసీయూ సదుపాయాలు, 24 గంటల నీయోనేటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ, ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. హైరిస్క్ గర్భధారణలు, నవజాత శిశువుల సమస్యలను తొలిదశలోనే గుర్తించి సరైన కేంద్రాలకు రిఫర్ చేస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, కోట కర్నాకర్, హెచ్ఆర్ మేనేజర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు
కరీంనగర్ అర్బన్/కొత్తపల్లి(కరీంనగర్): ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువులు అందుతున్నాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కొత్తపల్లి మండలం చింతకుంట, మల్కాపూర్ డీసీఎంఎస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణం, గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, నిల్వల రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా కోసం వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. యాప్లో యూరియా తీసుకునే పద్ధతి బాగుందని, వ్యయప్రయాసలు తగ్గాయని, ఎరువుల కొనుగోలు కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం తప్పిందని రైతులు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూమి విస్తీర్ణాన్ని బట్టి యూరియా కోటాను యాప్ నిర్ణయిస్తోందని చెప్పారు. దీంతో ఎరువుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పెరిగిందన్నారు. డీఏవో భాగ్యలక్ష్మి, మార్క్ఫెడ్ డీఎం గౌరీనాగేశ్వరరావు, సహాయ సంచాలకులు రణధీర్, ఏఈవో రాజేంద్రప్రసాద్, ఎంఏవో సంతోష్ పాల్గొన్నారు. సర్వేయర్లకు లైసెన్స్లు అందజేతప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం–2025లో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే సీఎం లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్లు జారీ చేయగా జిల్లాకు చెందిన 136మందికి అందజేశారు. మంగళవారం 41 మంది అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి లైసెన్స్లు అందజేశారు. -
తీర్థయాత్రలకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీలు
కరీంనగర్రూరల్: తీర్ధయాత్రలకు వెళ్లే భక్తులు కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోందని ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21 నుంచి మే 21వ తేదీ వరకు 4 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా హైదరాబాద్ నుంచి వర్తింపజేస్తామన్నారు. ● జ్యోతిర్లింగంతో (ఎస్సీజెడ్బీజీఎ–53): తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు యాత్ర మార్చి 21న ప్రారంభమై 28 వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి సాధారణ టికెట్ రూ.14,700, 3 ఏసీ రూ.22,300 ఉంటే.. 2 ఏసీ రూ.28,700గా నిర్ణయించారు. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా సాగుతుంది. ● సప్తజ్యోతిర్లింగ దర్శన్యాత్ర (ఎస్సీజెడ్బీజీ–55): ఉజ్జయిని(మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్), ద్వారక(నాగేశ్వర్), సోమనాథ్(సోమ్నాథ్), పుణే(భీమశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్(గ్రీష్ణేశ్వర్). ఈయాత్ర ఏప్రిల్ 14 నుంచి 24 వరకు సాగుతుంది. సాధారణ టికెట్ రూ.17,600 కాగా 3, ఏసీ రూ.26,700గా, 2 ఏసీ రూ.34,600గా నిర్ణయించారు. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగా యాత్ర సాగుతుంది. ● అయోధ్య–కాశీ: బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర : పూరి, కోణార్క్, బైద్యనాథ్ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్. ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు సాగుతుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్ రూ.16,700 కాగా, 3 ఏసీ రూ.26,100 కాగా, 2 ఏసీ రూ.34,100గా ఉంటుంది. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా రైలు వెళ్తుంది. ● హరిద్వార్ – మాతావైష్ణోదేవి–రిషికేశ్: మధుర, బృందావనం, మాతావైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్. మే 12 నుంచి మే 21 వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి సాధారణ టికెట్ రూ.16,500 కాగా, 3 ఏసీ రూ.25,700, 2 ఏసీ రూ. 33,400గా ఉంటుంది. సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్హర్షా, వార్ధా, నాగ్పూర్ మీదుగా సాగుతుంది. ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్ రైలు, బస్సు, హోటల్.. అన్ని భోజనాలు(ఉదయం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కార్ట్ సేవలతో సందర్శన స్థలాలు, (అదనపు ఖర్చు లేదు). ప్రయాణ బీమా ఉంటుంది. రైల్వేస్టేషన్ నుంచి ఆలయాల వరకు ఉచితం. ప్రతీ రైలులో 705 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతీ 70 మందికి ఇద్దరు కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉండి సౌకర్యాలు కల్పిస్తారు. సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుంది. వివరాలకు 97013 60701, 92810 30727, 928103 0759 నంబర్లలో సంప్రదించండి. ఆన్లైన్లో ((www.irctcoturirm.com)) వైబ్సైట్ను సంప్రదించాలి. టూరిజం మానిటర్స్ ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మేయర్కు టీఎన్జీవోల సన్మానం
కరీంనగర్అర్బన్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావును టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. వారి కార్యాలయాల్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోల సంఘం 2026 డైరీని అందజేశారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సంగెం లక్షణ్రావు, రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్రెడ్డి, రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్కుమార్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేశ్ భరద్వాజ్, రూరల్ అధ్యక్షులు కోడూరి వాస్త్తవిక్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, నాయకులు శ్రీనివాస్, అశోక్, ముత్తయ్య, మల్క రాజేశ్వరరావు, పాల్గొన్నారు. -
ఫుట్బాల్ విజేత వరంగల్
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అబ్దుల్ కలాం స్డేడియంలో కాలనీ ఫుట్క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 16 జట్లు హాజరయ్యాయి. ఫైనల్కు చేరిన హుజూరాబాద్ జట్టుపై వరంగల్ జట్టు రెండు గోల్స్ తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలిచిన వరంగల్ ఫుట్బాల్ జట్టు క్రీడాకారులకు నిర్వాహకులు కప్పుతోపాటు రూ.2వేల నగదు బహుమతి అందజేశారు. రన్నర్గా నిలిచిన హుజూరాబాద్ జట్టుకు కప్పు అందించారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు ఉదయ్కుమార్, అబ్దుల్ రహీం, సునీల్ పృథ్వీ, ఆశీష్ కుమార్, అభిషేక్, శివ, నాగేంద్ర, శ్రీనాథ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారవేత్త జువ్వాడి రాజేశ్వరరావు మృతి
● హైదరాబాద్లో స్థిరపడిన కుటుంబం ● అక్కడే అంత్యక్రియలు పూర్తి ● తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో ఆయన పేరు ప్రస్తావన బుగ్గారం: బుగ్గారం మండలం మద్దునూర్కు చెందిన వ్యాపారవేత్త జువ్వాడి రాజేశ్వరరావు(99) మృతి చెందారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ముందు గ్రామాల్లో కొనసాగిన దొరల పాలనలో ఈయన చివరి పాలకుడు. జమీందార్ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటుతోపాటు మావోయిస్టుల దాడులు తీవ్రమవడంతో 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. కుటుంబంతో అక్కడే స్థిరపడ్డారు. పలు వ్యాపారాల్లో ఖ్యాతి గడించిన ఆయన చనిపోగా.. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో రాజేశ్వరరావు పేరు ప్రస్తావనలో ఉంది. ఇదే గ్రామంలో భూస్వాముల పటేల్గా వ్యవహరించిన నారాయణరావు పీజెంట్(రైతుకూలీలు) కార్యకర్తల చేతిలో హత్యకు గురవడం రైతు ఉద్యమంలో సంచలనం సృష్టించింది. జగిత్యాల జైత్రయాత్రకు ముందు ఈ జిల్లాలో మావోయిస్టు ఉద్యమం పుట్టుకకు తొలిబీజం ఇక్కడే పడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. -
యువకుడి మృతిపై అనుమానాలు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ): బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న ఓ యువకుడు మృతిచెందడంతో మృతుని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మల్లెవేణి మహేశ్(35) ఆదివారం కోనరావుపేటలోని తన సోదరి ఇంటికెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరిన మహేశ్ రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు రాత్రి పూట వెతుకుతుండగా నిజామాబాద్ గ్రామ ఎల్లమ్మ ఆలయ సమీపంలో పొలంలో పడి మృతిచెందినట్లు గుర్తించారు. మహేశ్ తన బైక్తో చెట్టును ఢీకొని పొలంలో పడడంతో మృతిచెందాడని భావిస్తున్నారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్రెడ్డి సోమవారం పంచనామా చేసి మృతదేహాన్ని సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహేశ్ మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మహేశ్కు భార్య లావణ్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని మల్కాపూర్కు చెందిన జంగ వెంకటయ్య (60) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు.. వెంకటయ్య సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కొత్తపల్లికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఫోర్ నేషన్ టోర్నీలో టీమిండియాకు స్వర్ణం వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ క్రీడా వేదికపై తన ప్రతిభను చాటాడు. ఈ నెల 14, 15వ తేదీల్లో దుబాయి వేదికగా నిర్వహించిన ఫోర్ నేషన్ సెస్టోబాల్ చాంపియన్షిప్లో భారత్ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇందులో క్రీడాకారునిగా చెక్కపల్లికి చెందిన ఎడపెల్లి అనిల్ తన ప్రతిభను చూపారు. జట్టు కెప్టెన్గా వ్యవహరించి స్వర్ణ పతకాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్లో భారత జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఫైనల్లో స్వర్ణ పతకాన్ని సాధించింది. -
వెళ్లొస్తం రాజన్నా
వెళ్తూ.. రాజన్నకు మొక్కుతున్న భక్తులుముల్లెమూటలతో వెళ్తున్న భక్తులు ● ముగిసిన రాజన్న మహాజాతర ● బద్దిపోచమ్మకు బోనం మొక్కులు ● తిరుగుబాట పట్టిన భక్తులు ● రూ.కోటికిపైగా ఆదాయం వేములవాడ: మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజులపాటు కొనసాగిన శివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు సోమవారం మధ్యాహ్నం నుంచి తిరిగి ఇంటిబాట పట్టారు. ఆర్టీసీ అధికారులు గుడి చెరువు కట్ట కింద నుంచి బస్సులను నడిపారు. బద్దిపోచమ్మకు బోనం మహాశివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు సోమవారం ఉదయం నుంచే బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తూ భక్తులు బోనాలతో తరలివచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా శివార్చన మహాశివరాత్రి జాతర సందర్భంగా రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో గుడి చెరువు ఖాళీ స్థలంలో నిర్వహించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుడి చెరువు ఖాళీ ప్రదేశంలో దాదాపు 40 వేలకు పైగా భక్తులు కూర్చుని కార్యక్రమాలు తిలకిస్తూ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జాగరణ మొక్కులు చెల్లించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ శివస్తోత్రం గానం చేయడం ఆకట్టుకుంది. జాతర బందోబస్తుకు వచ్చిన ఇతర జిల్లాల పోలీసులను ఎస్పీ మహేశ్ బీ గీతే సోమవారం మధ్యాహ్నం రిలీవ్ చేశారు. మూడు రోజులపాటు జరిగిన మహాజాతర సక్సెస్ కావడంతో కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఏఎస్పీ రుత్విక్సాయి, ఆర్డీవో రాధాభాయి, ఆలయ ఈవో రమాదేవి, సీఐ వీరప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.కోటికిపైగా ఆదాయం రాజన్న మహాజాతర సందర్భంగా ఆది, సోమవారాల్లో దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారు. రెండు రోజుల్లో రూ.కోటికిపైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు నిర్వాహకులతో బాలికల జట్లు వేములవాడ: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం నుంచి వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల బాలుర, బాలికల జట్లు సోమవారం చేరుకున్నాయి. పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, ఉపాధ్యక్షుడు కోళ్ల శ్రీనివాస్, పీఈటీలు, పీడీలు క్రీడాకారులకు ఏర్పాట్లు చూశారు. -
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల: రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ముఖ్యంగా ధర్మపురి, కోటిలింగాల ఆలయాలకు ప్రాధాన్యం ఇచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని అంచనా వేసుకుని వసతులు కల్పించాలని సూచించారు. 2027 జూలైలో పుష్కరాలు ఉంటాయని, ఆమేరకు పుష్కరఘాట్లను ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఒకేరోజు రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చినా పుష్కరఘాట్ల వద్ద ఇబ్బంది రానీయొద్దన్నారు. పార్కింగ్, తాగునీరు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ -
ఇది మంచి నిర్ణయం
మా అక్కపల్లిలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయించరాదన్న నిర్ణయం చేయడం చాలా మంచిది. బెల్టుషాపుల్లోనే మందు అమ్ముతుండడంతో పొద్దగాల లేస్తనే చాయి తాగకముందే మందు తాగేందుకు వెళ్తున్నారు. దీని ద్వారా చాలా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. బెల్టుషాపులు బంద్ చేస్తే గ్రామం బాగుపడుతుంది. – భానుచందర్, యువకుడు, అక్కపల్లి గ్రామంలో బెల్టుషాపులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు కూడా అతివేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతాయనే భయం కూడా ఉండేది. దీంతో గ్రామస్తుల సహకారంతో గ్రామంలో బెల్టుషాపులు, ఇసుక రవాణా చేయొద్దని తీర్మానించాం. తీర్మానం ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని నిర్ణయించాం. – మాదాసు స్రవంతి, సర్పంచ్, అక్కపల్లి -
‘బెల్టు’పై సమరం
● గ్రామాల్లో మత్తుకు చెక్ పెట్టేలా తీర్మానాలు ● బెల్ట్షాపుల బంద్కు నిర్ణయం ● అమ్మితే జరిమానా.. పట్టిస్తే నజరానా ● నూతన పాలకవర్గాలతో గ్రామాల్లో మార్పు ● యువత, గ్రామ భవిష్యత్ దృష్ట్యా నిర్ణయాలు ● అభినందిస్తున్న మహిళలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై పారుతుంది. తెల్లవారుజాము నుంచే బెల్టుషాపుల్లో మందుబాబుల అలజడి మొదలవుతుంది. రాత్రి పొద్దుపోయే వరకు మద్యం మత్తులోనే తూగుతున్నారు. ఈ మత్తులోనే గొడవలకు దిగుతున్నారు. దాడులకు దిగుతూ కేసుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పాలకవర్గాలు మద్యం మత్తుకు చెక్ పెట్టేందుకు ముందుకొచ్చాయి. గ్రామాల్లో బెల్ట్షాపులు నిర్వహించొద్దని తీర్మానించి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి గ్రామాలపై ప్రత్యేక కథనం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా గ్రామాల్లోని బెల్టుషాపుల్లో బూతుపురాణాలు, దాడులు చేసుకోవడం నిత్యకృత్యమయ్యాయి. సమీ పంలోని గృహాలవారు వీరి మాటలు వినలేక ఇ బ్బంది పడుతున్నారు. రాత్రి వేళ పెద్ద పెద్ద అరుపులు.. కేకలు వినిపిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. మరికొన్ని గ్రామాల్లోనైతే రోడ్డుపైకి వచ్చి మూత్ర విసర్జన చేస్తుండడంతో సమీప ఇళ్లల్లో ఉండే మహిళలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్లో ఇటీవల ఓ బెల్టుషాపులో చిన్న బాలు అనే యువకుడు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేశపెరుమాండ్ల ఆలయం పరిసరాల్లో కొందరు యువకులు మద్యం మత్తులో పరస్పరం దాడులకు తెగబడ్డట్లు సమాచారం. పచ్చని పల్లెల్లో బెల్టుషాపులు చిచ్చుపెడుతుండడంతో నూతన పా లకవర్గాలు ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే గ్రామస్తుల సహకారంతో బెల్టుషాపులు నిర్వహించొద్దని తీర్మానాలు చేస్తున్నారు. అమ్మితే జరిమానా.. సమాచారం ఇస్తే నజరానా గ్రామాల్లో మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా విధిస్తామని గ్రామసభల్లో తీర్మానించారు. అంతేకాకుండా మద్యం విక్రయిస్తుండగా చూసి సమాచారం ఇచ్చిన వారికి రూ.25వేలు వరకు నజరానా ఇస్తామని ప్రకటించారు. దీని ద్వారా గ్రామాల్లో సంపూర్ణంగా మద్యం విక్రయాలు అరికట్టాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. తాజాగా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి, తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి, ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించొద్దని నిర్ణయం తీసుకున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ‘అల్ఫోర్స్’ ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): జాతీయస్థాయిలో నిర్వహించిన ఐఐటీ జేఈఈ మెయిన్స్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు చవట లక్ష్మీహాసిని, వూట్కూరి శ్రేయాన్స్రెడ్డి అత్యున్నత పర్సంటైల్ సాధించారు. ఎన్టీఏ సోమవారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో లక్ష్మీహాసిని 99.94 పర్సంటైల్, శ్రేయాన్స్రెడ్డి 99.83 పర్సంటైల్ సాధించారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్లో ప్రస్తుతం సాధించిన పర్సంటైల్ సంతృప్తికరమే అయినప్పటికీ 100 శాతం పర్సంటైల్ లక్ష్యంగా మరింత సాధన చేస్తా. జాతీయస్థాయి పరీక్షల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు బోధించిన విషయాలను సమగ్రంగా సాధన చేస్తూ విశ్లేషణాత్మకంగా విషయాలపై పట్టు సాధించా. రానున్న రోజుల్లో నిర్వహించే రెండో దశ పరీక్షలో జాతీయస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా. – చవట లక్ష్మీహాసిని (99.94 పర్సంటైల్) చక్కటి ప్రణాళిక, అధ్యాపకుల అత్యుత్తమ బోధన ద్వారా ఈ విజయం సాధించా. రెండో దశలోనూ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుని నా లక్ష్యాన్ని సాధిస్తా. ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా సన్నద్ధం అవుతున్న. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై దృష్టి సారించి ప్రాక్టీస్ చేశా. వివిధ రకాల పరీక్షలు సైతం రాస్తూ విజయం సాధిస్తున్నా. – వూట్కూరి శ్రేయాన్స్రెడ్డి (99.83 పర్సంటైల్) -
బల్దియా వద్ద భద్రత
కరీంనగర్క్రైం: కరీంనగర్ బల్దియా పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోమవారం పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సీసీ గౌస్ ఆలం భద్రతను సమీక్షించారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇప్పటికే భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇవి ఈనెల 16 ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. భద్రతా కారణాల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే మార్గాల వద్ద పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. కరీంనగర్క్రైం: హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన న్యాయవాది మొహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ దారుణ హత్యకు నిరసనగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాధులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరుణ్కుమార్ మాట్లాడుతూ, దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా న్యాయవాదుల భద్రతకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు పెంచాల ప్రభాకర్రావు, కొరివి వేణుగోపాల్, లక్ష్మణ్రావు, పి.రంగయ్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాక్షేత్రంలో ఉండి ఉద్యమిస్తేనే రానున్న ఎన్నికల్లో ప్రజలు గుర్తిస్తారని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, అందుకు గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండలాల్లో గతంలో చేసిన అభివృద్ధిని ప్ర జలకు వివరించాలని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సూచించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, జాగీరు సత్యనారాయణ, నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరంలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. 11 కేవీ కాపువాడ ఫీడర్ పరిధిలోని కాపువాడ, మారుతినగర్, అశోక్నగర్, అహ్మద్పుర, మీర ఆస్పత్రి, పాతబజార్, గౌరీశంకర్ కాంప్లెక్స్, బొమ్మకల్ రోడ్, వెంకటసాయి రోడ్, ఎన్ఎన్ గార్డెన్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు ఫీడర్ పరిధి కమాన్ మెయిన్రోడ్, గణేశ్నగర్, కిశోర్ ఆటోస్టోర్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ శివనగర్ ఫీడర్ పరిధి సప్తగిరికాలనీ, శివనగర్, రామాలయం, అస్లాంపుర, బైపాస్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 33/11 కేవీ బావుపేట విద్యుత్ సబ్స్టేషన్, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ నారాయణ ఎక్స్ప్రెస్ ఫీడర్ పరిధి బావుపేట, ఆసిఫ్నగర్, ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు పేర్కొన్నారు. -
‘కాపు’ల ఖాతాలో బల్దియా
కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ అరుదైన సామాజిక రాజకీయానికి కేంద్రంగా మారింది. కరీంనగర్ నగర మేయర్, నగరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడమే ఆ ప్రత్యేకత. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిరువురికి తోడు సోమవారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన కొలగాని శ్రీనివాస్ నగర మేయర్గా ఎన్నికయ్యారు. ఇలా ఒకే సమయంలో ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు మేయర్, ఎమ్మెల్యే, ఎంపీగా ఉండడం కరీంనగర్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. గతంలో మేయర్గా డి.శంకర్, ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్, ఎంపీగా పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు తొలిసారిగా ఒకే సమయంలో కరీంనగర్కు ప్రాతినిథ్యం వహించారు. కానీ, ప్రస్తుతం ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలే మేయర్, ఎమ్మెల్యే, ఎంపీగా ఉండడంతో ఆ సామాజిక వర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్కొలగాని శ్రీనివాస్గంగుల కమలాకర్ -
కెనాల్ మరమ్మతుకు నిధులు
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని బొమ్మనపల్లి గ్రామ ఎల్లమ్మ ఆల యం వద్ద ఎంఎంఆర్ కెనాల్ మరమ్మతు పనులను సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈనెల 15న ‘సాక్షి’లో ‘ఏటా గండి ..తాత్కాలిక మరమ్మత్తులతో సరి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మంత్రి స్పందించారు. మండలంలోని పీచుపల్లి కెనాల్ నుంచి రేకొండ, బొమ్మనపల్లి మీదుగా సైదాపూర్ మండలం బొమ్మకల్ వరకు 38 చోట్ల అదనపు స్ట్రక్షర్ల నిర్మాణానికి రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఈసందర్భంగా కెనాల్ మరమ్మతుకు నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణమే కాలువ మరమ్మతు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, సర్పంచ్లు కొంకట మౌనికచక్రధర్, అల్లేపు సంపత్, ఇరిగేషన్ ఏఈఈ రాజు పాల్గొన్నారు. -
కార్పొరేషన్పై 24/7 నిఘా
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో అవినీతికి తావులేకుండా 24/7 నిఘా పెడుతామని కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ పాలకవర్గం అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు విజిలెన్స్ సెల్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మేయర్గా అక్రమాలకు పాల్పడిన సునీల్రావును డిప్యూటి మేయర్గా, ఆయనకు కార్పొరేటర్గా సహకరించిన శ్రీనివాస్ను మేయర్గా చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికి, మేయర్, డిప్యూటీ మేయర్లను చూసి భయపడుతున్నారన్నారు. అందుకే ప్రజల జేబులో నుంచి నయాపైసా పోకుండా తాను కాపలా కాస్తానని చెప్పారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి, బీజేపీ పాలకవర్గం చిన్న అవినీతి చేసినా విడిచిపెట్టమని స్పష్టం చేశారు. నగరపాలకసంస్థకు ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ను కోరుతామని పేర్కొన్నారు. సునీల్రావు మేయర్గా ఉన్నప్పుడు అవినీతి పరుడు అని ఫిర్యాదు చేసిన బండి సంజయ్, ఇప్పుడు పార్టీలో చేర్చుకొని డిప్యూటీ మేయర్ చేశాడని విమర్శించారు. టికెట్ల తేడాతో పది సీట్లు పోయాయి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో లోపాల కారణంగా ఎనిమిది నుంచి పది సీట్లు పోయాయని రాజేందర్రావు అంగీకరించారు. పాత, కొత్త పేరిట కొంతమంది నాయకులు పట్టుబట్టారని, అలాంటి పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపుల వల్ల సీట్లు పోవడం వాస్తవమేనన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందని, తమ మాటే నెగ్గాలని నేతలు అనుకోవడం సహజమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్పొరేటర్లు భాస్కర్నాయక్, గుమ్మడి రాజకుమార్, ఆకల నర్మదనర్సయ్య, ఆకుల నందిని ఉదయ్, పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య, కల్లేపల్లి శారదబాలరాజు, సికిందర్ ఇక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
కమల వికాసం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థపై బీజేపీ కాషాయ జెండా ఎగురవేసింది. ఉత్కంఠ, నాటకీయ పరిణామాల నడుమ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీ సొంతం చేసుకుంది. కరీంనగర్ మున్సిపల్ చరిత్రలో తొలిసారి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శిబిరంతో అంటగాగుతూ వచ్చిన బీఆర్ఎస్ చివరికి చేయిచ్చింది. కీలకమైన ఎన్నిక సమయంలో ఓటింగ్కు దూరంగా ఉండడంతో బీజేపీ గట్టెక్కింది. క్యాంప్ల నుంచి కార్యాలయానికి.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం సోమవారం నగరపాలక కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ సభ్యులు, స్వతంత్రులతో క్యాంప్లకు వెళ్లడం తెలిసిందే. మేయర్ ఎన్నిక సందర్భంగా వారంతా క్యాంప్ల నుంచి నేరుగా నగరపాలక కార్యాలయానికి చేరుకున్నారు. కళాభారతి వైపు గేట్ నుంచి ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాగా, బీజేపీ కార్పొరేటర్లు బస్సులో వచ్చారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు, తమకు మద్దతునిస్తున్న ఎంఐఎం, ఏఐఎఫ్బీ, స్వతంత్ర కార్పొరేటర్లతో కలిసి మార్కెట్ వైపు గేట్ నుంచి బస్సులో కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం కోసం కొద్దిసేపు ఎదురుచూసిన తర్వాత కార్పొరేటర్లు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లు వచ్చారు. అంతకుముందు స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్లో చేరారు. బీజేపీకి 34.. కాంగ్రెస్కు 21 కొత్తగా ఎన్నికై న సభ్యులతో ఎన్నికల అధికారి, ఆర్డీవో మహేశ్వర్ మొదట తెలుగు అక్షరమాల ప్రకారం ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. మేయర్, డిప్యూటీ మేయర్లకు పోటీ ఏర్పడడంతో ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థిగా బీజేపీ నుంచి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా యాదగిరి సునీల్రావు, కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థిగా ఆకుల నర్మద, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా హీనా అఫ్రీన్ బరిలో నిలిచారు. వీరికి పార్టీ బీ ఫాం అందించారు. ఆకుల నర్మదను వైద్యుల అంజన్కుమార్ ప్రతిపాదించగా, గుమ్మడి రాజ్కుమార్ బలపరిచారు. ఓటింగ్ నిర్వహించడంతో కాంగ్రెస్ సభ్యులు 14 మంది, ముగ్గురు స్వతంత్రులు, ముగ్గురు ఎంఐఎం సభ్యులు, ఒక ఫార్వర్డ్ బ్లాక్ సభ్యురాలు ఓటు వేశారు. నర్మదకు మొత్తం 21 ఓట్లు వచ్చాయి. చేతులెత్తే పద్ధతిన కాకుండా ఓటు అని రాసి ఉన్న ఫ్లకార్డును ఎత్తి ఓటు వేశారు. అనంతరం బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్ను మాసం గణేశ్ ప్రతిపాదించగా, పెద్దపల్లి శ్రీలేఖ బలపరిచారు. శ్రీనివాస్కు మద్దతుగా 30 మంది బీజేపీ, ముగ్గురు స్వతంత్ర, ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో బండి సంజయ్ ఓటు వేశారు. మొత్తం 34 ఓట్లు శ్రీనివాస్కు వచ్చాయి. డిప్యూటీ మేయర్గా సునీల్రావు పేరును సోమిడి వేణు ప్రతిపాదించగా, బండారి వేణు బలపరిచారు. ఆయనకు కూడా 34 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా యాదగిరి సునీల్రావు ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా సమావేశానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరైనా, వెంటనే వెళ్లిపోవడంతో ఆయన ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయలేదు. అలాగే మరో ఎక్స్ అఫిషియో, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దూరంగా ఉన్నారు. ఓటింగ్కు బీఆర్ఎస్ దూరం బల్దియాలో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేవడం, ఫార్వర్డ్బ్లాక్ సభ్యులు అటూ ఇటు క్యాంప్లు మారడం, స్వతంత్రులు రెండు శిబిరాల్లో చేరడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అనూహ్యంగా కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు పలకడం, ఒక ఫార్వర్డ్ బ్లాక్ సభ్యురాలు బీజేపీ నుంచి కాంగ్రెస్ శిబిరంలోకి చేరడంతో, కాంగ్రెస్ బలం 35కు చేరుకుంది. దీంతో కాంగ్రెస్కూటమి మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ, ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారింది. కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ చివరి సమయంలో బీజేపీ వైపు మొగ్గు చూపింది. నేరుగా ఓటు వేయకపోయినా, కోరం కోసం మీటింగ్కు హాజరై, ఓటింగ్కు మాత్రం దూరంగా ఉంది. దీంతో బీజేపీ 13 ఓట్ల తేడాతో విజయం సాధించింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు 9 మంది, ఇద్దరు స్వతంత్రులు ఓటింగ్లో పాల్గొనలేదు. మేయర్ పీఠాన్ని ఆశించిన కొమురయ్య కూడా ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావుయాదగిరి సునీల్రావు (బీజేపీ):మేయర్ ప్రొఫైల్పేరు: కొలగాని శ్రీనివాస్ వయస్సు: 37 సంవత్సరాలు విద్యార్హతలు: ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ చిరునామా: తీగలగుట్టపల్లి, కరీంనగర్రాజకీయ నేపథ్యం: ఆర్ఎస్ఎస్లో 2013 లోనే ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. ఎన్ఎస్ఎస్, ఎన్వైపీ, ఏక్తా పరిషత్ సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు. 2005 నుంచి 2007 వరకు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్లో, 2007 నుంచి 2009 వరకు భారతీయ జనతా యువ మోర్చాలో, 2014 నుంచి 2019 వరకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా, 2020 నుంచి 2025 వరకు 1వ డివిజన్ కార్పొరేటర్గా సేవలందించారు. నగర అభివృద్ధికి కృషి చేస్తానని కొలగాని శ్రీనివాస్ అన్నారు. సామాన్య కార్యకర్తలకు ఉన్నత పదవులు కేవలం బీజేపీలోనే సాధ్యమని నగర మేయర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో తెలిపారు. సోమవారం మేయర్గా ఎన్నికై న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో స్మార్ట్ సిటీ నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేసినట్లుగానే, నగరాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్లు వంగల పవన్కుమార్, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు. తొలిసారి మేయర్ పీఠంపై బీజేపీ కరీంనగర్ బల్దియాను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. నగరపాలకసంస్థగా ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ఒకసారి, బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారం దక్కించుకున్నాయి. అంతకుముందు మున్సిపాల్టీగా ఉన్న సమయంలోనూ బీజేపీ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ సారి మేయర్, డిప్యూటి మేయర్ పీఠాలను కై వసం చేసుకొని, చిరకాల కల నెరవేర్చుకుంది.కొలగాని శ్రీనివాస్ (బీజేపీ): -
విద్యార్థికి జ్ఞాన కేంద్రంగా ఉండాలి
కరీంనగర్టౌన్: మ్యూజియం అంటే కేవలం వస్తు ప్రదర్శనగా ఉండకుండా విద్యార్థికి జ్ఞాన కేంద్రంగా ఉండాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగరంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను సోమవారం పరిశీలించారు. మ్యూజియంలో విద్యార్థులకు అవసరమైన సైన్స్, ఆర్ట్ కల్చర్కు సంబంధించి మరిన్ని విషయాలు చేర్చాలన్నారు. మ్యూజియంలో ఉన్న ప్రతీ ఎగ్జిబిట్ పూర్తి సమాచారాన్ని ఇచ్చే విధంగా ఉండాలని సూచించారు. మ్యూజియాన్ని సందర్శించిన విద్యార్థి కొంత నేర్చుకొని వెళ్లాలని, ఆ రకంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అనంతరం ప్రశ్నపత్రాల తయారీ కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నపత్రాల సెట్టర్స్తో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నాపత్రాలు తయారు చేయాలని సూచించారు. ఆదనపు కలెక్టర్ వెంట జిల్లా సైన్స్ అధికారి చాడ జైపాల్రెడ్డి, ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్.భగవంతయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రవీందర్, స్టేట్ రిసోర్స్పర్సన్ గాజుల రవీందర్, ఉమర్ అలీ తదితరులు ఉన్నారు. -
పైసన్నాటకం..!
● ఐదు వార్డుల్లో రూ.కోటిన్నర పైనే ● కోరుట్ల మున్సిపల్ ఎన్నికల తీరు.. కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి నిబంధన ఉత్తదే అయింది. ఎన్నికల అనంతరం అభ్యర్థులు సమర్పించే ఖర్చుల లెక్కలను మాత్రమే పరిగణనలోని తీసుకోవడం ఆనవాయితీగా మారింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు చేసిన అడ్డగోలు ఖర్చుపై ఎన్నికల అఽధికారులు పెట్టిన నిఘా అంతంత మాత్రమే కావడం గమనార్హం. ఫలితంగా కోరుట్ల మున్సిపాల్టీలో ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం అనధికారికంగా చేసిన ఖర్చుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రెండవ గ్రేడ్ మున్సిపాల్టీల్లో అభ్యర్థుల ఖర్చు రూ. 4 లక్షలుగా నిర్ధారించిన ఎన్నికల సంఘం నిబంధన పట్టించుకున్న వారే లేరు. ఎంతైనా సరే..తగ్గేదేలే.. కోరుట్ల మున్సిపాల్టీలో మొత్తం 33 వార్డులు ఉండగా సుమారు 250 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎంత తక్కువ అనుకున్నా రూ. 10 లక్షల నుంచి 15 లక్షల మేర ఖర్చు చేశారు. ఈ లెక్కన ప్రతీ వార్డులో పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చును లెక్కలోని తీసుకుంటే ఒక్కో వార్డుకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు కనీస ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం తగ్గేదేలే.. అన్న తీరుగా సుమారు రూ.20 లక్షల నుంచి 25 లక్షల మేర ఖర్చు చేశారు. ఈ లెక్కన 33 వార్డుల్లో రూ.15 కోట్ల మేర ఖర్చు జరిగినట్లు అంచనా. ఇవి కాకుండా పట్టణంలోని రసవత్తరమైన పోటీ నెలకొన్న నాలుగు వార్డుల్లో కనీస ఖర్చు రూ.70 లక్షల వరకు ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నాలుగు వార్డుల్లోనే బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు దాదాపు రూ. 5 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్క కోరుట్ల మున్సిపాల్టీలోనే ఎన్నికలు ముగిసేసరికి ఎంత తక్కువ అనుకున్నా రూ. 20 కోట్ల మేర ఖర్చు జరగడం నివ్వెరపరుస్తోంది. మద్యం పారించారు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేందుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున కేటాయించడం బహిరంగ రహస్యం. ఈ లెక్కన మొత్తం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను లెక్కలోకి తీసుకుంటే మద్యం ఖర్చు రూ.అరకోటి దాటుతుంది. పార్టీలు మద్యం కోసం ఇచ్చిన ఫండ్ కాకుండా ప్రతీ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థులు సొంతంగా కనీసం రూ.15 లక్షల మేర మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన మొత్తం 33 వార్డుల్లో మద్యం కోసం చేసిన ఖర్చు వెరసి రూ.5 కోట్లకు చేరుకుంది. మొత్తం ఖర్చులను పక్కాగా లెక్కలోకి తీసుకుంటే ఒక్క కోరుట్ల మున్సిపాల్టీలోనే రూ.25 కోట్ల మేర అభ్యర్థులు ఖర్చులు చేశారని జోరగా ప్రచారం సాగుతోంది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహకాలనీ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన బత్తుల రాజయ్య(58) సైకిల్పై ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా.. వెనకాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాజయ్య గొర్లు, మేకలకు మందుల కోసం ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, నెల క్రితం దుమాల గ్రామానికి చెందిన ఒకరు ద్విచక్ర వాహనంపై సెకండ్ బైపాస్కు టర్న్ అవుతుండగా బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన మరువక ముందే.. మరో ప్రమాదం జరిగింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురువుతున్నారు. గతేడాది రాజయ్య కుమారుడు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. -
చికిత్సపొందుతూ మహిళ మృతి
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని డబ్బుతిమ్మాయపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి విజయ (57) చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈనెల 13న మండలంలోని నమిలికొండలో విజయ తల్లి మృతిచెందింది. దీంతో విజయ తన కొడుకు తిరుపతితో కలిసి బైక్పై నమిలికొండ వెళ్తుండగా, గ్రామంలోని జెడ్పీహెచ్ సూ్క్ల్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో కిందపడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందింది. మృతురాలి కూతురు స్వప్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొత్తగట్టుకు చెందిన మడ్డి శ్రీను, పెసరి రాజేశ్వరి కుటుంబాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. ఈనేపథ్యంలో దొంగలు రెండు ఇళ్లలో తాళాలు పగుల గొట్టి రూ.85వేల విలువ గల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. రాజేశ్వరి ఆదివారం వేకువజామున కొత్తగట్టులోని ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శేఖర్రెడ్డి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. అలాగే కొత్తగట్టుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి ఇంటి ముందు పార్కింగ్ చేసిన మోటార్సైకిల్ను దొంగలు ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడిని కాపాడిన లేక్ పోలీసులుకరీంనగర్క్రైం: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ యువకుడు ఆదివారం మానేరు డ్యాం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా లేక్ పోలీసులు కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిగురుమామిడి మండలానికి చెందిన మధు కుటుంబ సమస్యల కారణంగా మానేరు డ్యాంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చాడు. అతడిని గమనించిన లేక్ అవుట్ పోస్ట్ హోంగార్డు ఎం.నారాయణ అప్రమత్తమై అతడిని కాపాడాడు. అనంతరం పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా నారాయణను పోలీసులు, స్థానికులు అభినందించారు. పశువుల పాక దగ్ధం గంభీరావుపేట: మండలంలోని కోళ్లమద్ది గ్రామంలో పిట్ల బాలరాజు అనే రైతుకు చెందిన పశువుల పాక అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశువుల పాకతో పాటు గడ్డివాము, ద్విచక్రవాహనం కాలిపోయాయి. గుడిసెలో ఉన్న లేగదూడకు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్క రైతులు, గ్రామస్తులు వచ్చి మంటలానార్పారు. -
కొడుకు గెలిచాడన్న ఆనందం.. అంతలోనే విషాదం
పెద్దపల్లిరూరల్: ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్న కోరికను తన కొడుకు నదీం ఇటీవల పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి నెరవేర్చాడు. కానీ, ఆ సంతోషం చూడకముందే ఆదివారం అతడి తండ్రి మహమ్మద్ సర్వర్ (72) గుండెపోటుతో మృతిచెందాడు. పదేళ్ల క్రితం నగరపంచాయతీ ఎన్నికల్లో సర్వర్, అతడి భార్య పోటీకి దిగి ఓడిపోయారు. ఇటీవల కౌన్సిలర్గా తన కొడుకు ఎన్నిక కావడంతో ఎంతో సంతోషడ్డాడు. కానీ, గంటలు గడవక ముందే మృతిచెందడంతో పెద్దపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. కౌన్సిలర్లతో కలిసి క్యాంపునకు వెళ్లిన నదీం, తండ్రి మరణించాడని సమాచారం అందడంతో పెద్దపల్లికి చేరుకున్నాడు. ఎమ్మెల్యే విజయరమణారావు, పలువురు నాయకులు సర్వర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గుండెపోటుతో కౌన్సిలర్ తండ్రి మృతి -
కాపుకాసి.. కర్రలతో దాడి చేసి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ నడిబొడ్డున పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్ (30), ఇదే మండలం వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మి ఇద్దరూ కలిసి జగిత్యాల బైపాస్రోడ్లోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్నారు. కాగా, లక్ష్మికి గతంలో వడ్డెరకాలనీకి చెందిన గంగాధర్తో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. 9 నెలల క్రితం లక్ష్మికి ఇన్స్ట్రాగామ్లో విశ్వనాథ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయారు. పోలీసులు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి లక్ష్మిని భర్తకు అప్పగించారు. కానీ, లక్ష్మి భర్త వద్ద ఉండకుండా మళ్లీ విశ్వనాథ్తో కలిసి శ్రీరాంనగర్లో ఉంటున్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథ్, లక్ష్మి పెంబట్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకుని జగిత్యాలకు వచ్చారు. బైపాస్రోడ్లో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా గంగాధర్తో పాటు అతడి బంధువులు మరో ఇద్దరు విశ్వనాథ్పై కర్రలతో దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మికి సైతం గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని పట్టణ సీఐ కరుణాకర్ పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. జగిత్యాలలో యువకుడి దారుణ హత్య -
లాలిస్తూ.. బుజ్జగిస్తూ..
‘మా బుజ్జి కదూ.. ఊరుకో తల్లీ.. మా అమ్మకదా’ అని ఏడుస్తున్న ఆ చిన్నారిని లాలింపసాగింది అమ్మమ్మ. ‘పండుగ కదా తల్లీ.. ఈరోజు మన కడుపు నిండుతుంది’ అని ముద్దుల వర్షం కురిపించింది. ఈ దృశ్యం స్థానికుల మదిని కరిగించింది. ఈ పసికూన తన మనుమరాలేనని ‘సాక్షి’కి సంబురంగా తెలిపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన ఆదివారం దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. పండుగపూట తమ కడుపు నిండుతుందని గంపెడాశతో తమపిల్లలను చంకలో వేసుకొని గుడిముందు యాచిస్తూ కనిపించారు కొందరు మహిళలు. అంతలోనే ఒక్కసారిగా గురకపెట్టి ఆగకుండా ఏడుస్తున్న పాపని చూసి తోటి మహిళ తనకిమ్మంటూ ఎత్తుకొని తన లాలింపు మాటల పాటలు, ముద్దులు కురిపిస్తుంటే ఆ పసిపాప తల్లితో పాటు తోటి యాచకులు సైతం మొహంలో నవ్వులు చిందిస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
‘చేప’డితే లాభమే
వీణవంక(హుజూరాబాద్): మత్స్యకారులు చెరువుల్లో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నారు. కొంత మంది చెరువులను లీజుకు తీసుకొని చేపల పెంపకం చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గత వానాకాలం సీజన్లో చెరువులు, కుంటల్లో పోసిన చేప పిల్లలు ఇప్పుడు పట్టే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గుతోంది. దీంతో మత్స్యకారులు చేపలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే చేపలు పడుతున్నారు. అయితే చేపల పెంపకం ఒక ఎత్తయితే వాటిని పట్టే దశలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే సమయంలో మూడునాలుగు రోజులు రవాణా చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో చేపలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కరీంనగర్ జిల్లాలో 450 చెరువులు, కుంటలు ఉన్నట్టుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీణవంక, శంకరపట్నం, మానకొండూరు మండలాలతో పాటు పెద్దపల్లి జిల్లాలో కూడా చేపల పెంపకం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వారం రోజుల నుంచి చేపలు పడుతున్నారు. ఒక్కో చేప రెండున్నర కిలోల నుంచి 3కిలోల వరకు పెరిగింది. మార్కెట్లో రవ్వు చేప కిలో ధర రూ.150 పలుకుతోంది. అదే వ్యాపారులకై తే కిలోకు రూ.90 విక్రయిస్తున్నారు. బొమ్మె చేప కిలో రూ.350 ఉంది. ఈసారి చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు ఉండగా, చేపల వృద్ధి కూడా బాగా పెరిగింది. చేపల పెంపకంపై ఆసక్తి కనబర్చుతున్న మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి నీటిమట్టం తగ్గుతుండడంతో చేపలు పట్టే బిజీలో మత్స్యకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపలు పట్టేందుకు ఆరు రోజుల ముందు నుంచే మేత అందించడం నిలిపివేయాలి. చేపల పొట్టలో మేత ఉండగా పట్టుకుంటే రవాణా సమయంలో అవి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఎస్సారెస్పీ నీటిని పుష్కలంగా విడుదల చేయడంతో చెరువులు, కుంటలు ఈసారి కళకళలాడాయి. చేపలు కూడా వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఒక్కో చేప 2 కిలోల పైనే ఉంది. రవ్వు, గండె, గ్యాస్కట్ వంటి రకాలను ఎక్కువగా పెంచుతున్నారు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. రవాణా సమయంలో చేపలు కుళ్లి పోకుండా వాటిని పట్టిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాల్లో మూడు పొరలుగా వేసుకొని చేప పొరల మధ్య ఐస్ వేయాలి. చేప కనీసం కిలోపైగా బరువు ఉంటేనే మంచిది. అంత కంటే తక్కువ బరువు ఉంటే చెరువులోకి వదిలివేయాలి. రవ్వు చేప నీటి నుంచి తీసిన 2నిమిషాల వరకే బతుకుతుంది. కావున వెంటనే నీటిలో వేయడం వల్ల చేప గట్టిపడకుండా ఉంటుంది. లేందటే ఐసులో పెట్టడం మంచిది. -
జమ్మికుంటలో ఎన్నికా..? వాయిదా?
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. శుక్రవారం నాటి ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయం జోరుగా సాగుతోంది. సోమవారం చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఎన్నికపై సందిగ్ధం ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్రపోటీ కొనసాగుతుండగా బేరసారాలపై చైర్మన్ ఎన్నిక ఆధారపడి ఉందని సమాచారం. ఇరుపార్టీల కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంపుల్లో ఉండగా.. చివరి క్షణంలో ఎవరు ఎటువైపు మద్దతు తెలుపుతారనేది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ మద్దతు ఎవరికి? జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇండిపెండెంట్లతో కలిపి 15మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్కు 11మంది మద్దతు ఉంది. ఎమ్మెల్యే ఎక్స్ఆఫీషియో ఓటుతో సంఖ్య 12కు చేరింది. బీజేపీ తరఫున నలుగురు గెలిచారు. వారు మద్దతు ఇచ్చిన వారికే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. స్పష్టమైన మెజార్టీ ఉంటేనే చైర్మన్ ఎన్నిక జరగనుండగా.. కోరం లేకుంటే ఎన్నికను వాయిదా వేసే అవకాశం ఉంటుంటుందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండీ.అయాజ్ తెలిపారు. ఏర్పాట్లు పూర్తి.. హుజూరాబాద్: హుజూరాబాద్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సిల్లో కాంగ్రెస్ 16 మంది సభ్యులతో చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించనుంది. 05,13,16,30వార్డు సభ్యులు సొల్లు సునీత, సందమల్ల పుణ్య, బండ వెన్నెల, రొంటా సుహాసిని చైర్పర్సన్ బరిలో ఉన్నారు. సోమవారం 10 గంటలకు పురపాలక సంఘ కౌన్సిల్హాల్లో ప్రమాణస్వీకారం ఉంటుందని కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. -
నేడు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు
● సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: కరీంనగర్ కార్పొరేషన్ మే యర్, డిప్యూటీ మేయ ర్ ఎన్నికలు, హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం ఆయాప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6గంటల వరకు బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడదని ఉత్తర్వులు జారీచేశారు. నగరంలో సోమవారం ట్రాఫిక్ దారిమళ్లింపు చర్యలు ఉంటా యని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి తెలిపా రు. అమరవీరుల స్తూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు, బస్టాండ్ నుంచి బయటకు వచ్చే ప్రత్యామ్నాయమార్గాల ద్వారా దారిమళ్లింపు ఉంటుందన్నారు. సీఎస్ఐ చర్చి ప్రాంతం నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేదారులను మూసివేయడం, దారి మళ్లించడం జరుగుతుందని సూచించారు. శివరాత్రికి నిరంతర విద్యుత్ కొత్తపల్లి(కరీంనగర్): మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ సర్కిల్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరా చేశామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వడ్డకొండ గంగాధర్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలు విద్యుత్ దీపాలతో ప్రకాశిస్తున్నాయని అన్నారు. సరఫరాలో అంతరాయం లే కుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ముందస్తు లోడ్ అంచనాకు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంచామని, తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా కత్తరించడం జరిగిందని, లైన్ల మధ్యలో స్పేసర్లు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పర్యవేక్షణకు అదనపు సిబ్బందిని నియమించామని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారని పేర్కొన్నారు. కొత్తగట్టులో అగ్నిగుండాలుశంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై శివరాత్రి సందర్భంగా ఆదివారం అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. భక్తులు అగ్ని గుండాల్లోంచి నడిచారు. కొత్తగట్టు, కేశవపట్నం, కన్నాపూర్, చింతలపల్లిలో శివకల్యాణం జరిపించారు. ఆలయ చైర్మన్ కోరెం రాజిరెడ్డి పాల్గొన్నారు. ధర్మభిక్షం ఆశయసాధనకు ఉద్యమిద్దాంకరీంనగర్టౌన్: తెలంగాణ సాయుధ పోరా టయోధుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం ఆశయా ల సాధించేందుకు ఉద్యమించాలని న్యాలపట్ట రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ధర్మభిక్షం 104వ జయంతి సందర్భంగా బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన చిత్రపటానికి న్యాలపట్ల రాజుగౌడ్, కసిరెడ్డి సురేందర్రెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, కల్లుగీత పనివారాల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైడిపల్లి రాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కొత్తపల్లి: కొత్తపల్లి తహసీల్ కార్యాలయ పరిధి లోని రేకుర్తి సర్వే నం.55 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను శనివారం రాత్రి పోలీసుల సహకారంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో గురువారం అక్రమ నిర్మాణాలు చపట్టగా.. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. -
ఏఐఎఫ్బీ కార్పొరేటర్లకు విప్ జారీ
కరీంనగర్టౌన్: కరీంనగర్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ విపుల సాయిజ్యోతి, 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామలకు విప్ జారీ చేయడం జరిగిందని ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్దీప్రెడ్డి, జిల్లా కార్యదర్శి బండారి శేఖర్తో కలిసి ఆదివారం మాట్లాడారు. ఏఐఎఫ్బీ బీఫాంపై గెలిచిన ఇద్దరిలో 15వ డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతిని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ బీజేపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అన్నా రు. మేయర్ సీటుకోసం బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీకి మేయర్ను ఎన్నుకోవడానికి పూర్తిస్థాయిలో కార్పొరేటర్లు లేరని, ఫార్వర్డ్ బ్లాక్, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని కిడ్నాప్ చేసి పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరికి మద్దతివ్వాలో అధికారికంగా ప్రకటించలేదని, తమ పార్టీ బీఫాంపై గెలిచి ఇతర పార్టీలకు వెళ్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము ఎవరికి మద్దతు ఇవ్వాలో సోమవారం ఉదయం 10గంటల వరకు నిర్ణయిస్తామని తెలిపారు. -
● 11 గంటలకు ప్రత్యేక సమావేశం ● 12.30 గంటలకు మేయర్ ఎన్నిక
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. సోమవారం సభ్యు ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలకు నగరపాలకసంస్థ అధికారులు కౌన్సిల్ హాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొత్తగా ఎన్నికై న 66మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మేయర్ ఎన్నిక చేపడుతారు. అనంతరం డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. సభ్యుల ప్రమాణ స్వీకారానికి కౌన్సిల్ హాల్లో పార్టీలవారీగా, తెలుగు అక్షర మాల ప్రకారం సభ్యులకు సీట్లు కేటాయించారు. తమకు కేటాయించిన సీట్లలోనే సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది. 35 మంది ఉంటేనే కోరం మేయర్ఎన్నికకు నిబంధనల ప్రకారం కోరం ఉండాలి. నగరపాలకసంస్థలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 69 మంది సభ్యులు నగరపాలకసంస్థలో ఉండగా, సగం 35మంది సభ్యులు తప్పనిసరిగా ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలి. కనీసం 35 సభ్యులుంటేనే కోరం ఉన్నట్లుగా భావించి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రజలకు ప్రవేశం లేదు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా సో మవారం ప్రజలకు నగరపాలకసంస్థ కార్యాలయంలోనికి అనుమతి లేదని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. ఆదివారం కౌన్సిల్ హాల్లో ప్రమాణస్వీకారం, మేయర్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల అధి కారి ఆర్డీవో మహేశ్వర్తో కలిసి పరిశీలించారు. -
కిస్సా కుర్సీ కా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ భావించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్09, మజ్లిస్03, ఏఐఎఫ్బీ 02, స్వతంత్రులు04, ఎక్స్ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు వరకు పర్యవేక్షించాల్సి వచ్చింది. రోజంతా హైడ్రామా 15 డివిజన్ నుంచి ఏఐఎఫ్బీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికై న విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్బీ నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్లోని కాంగ్రెస్ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ● జమ్మికుంటలోనూ హంగ్ ఉత్కంఠను రేపింది. మొత్తం 30 సీట్లలో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్లో ఒక కౌన్సిలర్ వెళ్లి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01, బీఆర్ఎస్ రెబల్1 కలిపి 15 స్థానాలతో మున్సిపాలిటీ వశపరుచుకోవాలని చూసినా మేజిక్ ఫిగర్ చేరలేదు. దీంతో బలపరీక్ష వాయిదా వేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. ● జగిత్యాల జిల్లా రాయికల్లో 12 సీట్లున్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒక సీటు గెలిచారు. కరీంనగర్ తరహాలోనే ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ● 26 సీట్లున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్ఎస్ 06, కాంగ్రెస్ 06, స్వతంత్రులు 04 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. దీంతో బీజేపీకి మున్సిపాలిటీపై ఆశలు సన్నగిల్లాయి. ● పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సు ల్తానాబాద్, రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో స్పష్టమైన మెజారి టీ రావడంతో కాంగ్రెస్ పాలకవర్గాలను ఏర్పా టు చేయనుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరేయనుంది. ఇండిపెండెంట్ల జోరు హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, కార్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కరీంనగర్ లాంటి చోట డబ్బుతో పాటు ఫార్చునర్ కారు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి.ప్రమాణ స్వీకారం: ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: మ.12.30 నుంచి 1.30 వరకు ప్రెసిడింగ్ అధికారి: ఆర్డీవో ఎన్నిక మొత్తం: వెబ్కాస్టింగ్, లైవ్స్ట్రీమింగ్ -
స్ట్రాంగ్రూమ్ ఘటనపై విచారణ చేపట్టాలి
హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యంపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని కేసీ క్యాంపులో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే కాంగ్రెస్ నాయకులు తమకు ఇన్ని సీట్లు వస్తాయని ముందుగానే ప్రకటించడం యాధృచ్ఛికంగా ఉందన్నారు. ఎవరికెన్ని సీట్లు వస్తాయో ముందే చెప్పడం మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లే అనిపిస్తోందన్నారు. స్ట్రాంగ్రూం తాళాలు పగలగొట్టడం, సీసీ కెమెరా ఫుటేజ్ తొలగించడం వంటి ఘటనలు సందేహాలకు తావిస్తోందన్నారు. పోలీసులు, ఎన్నికల యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తోందని ప్రశ్నించారు. జరిగిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ డేటా రికవరీ చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, గందె శ్రీనివాస్, వర్ధినేని రవీందర్రావు, మారపల్లి సుశీల, కొండల్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రపంచాన్ని నడిపేది ప్రేమ తత్వమే
కరీంనగర్కల్చరల్: ప్రపంచాన్ని నడిపేది ప్రేమ తత్వమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవా ర్డు గ్రహీత సాదనాల వెంకటస్వామి నాయుడు అన్నారు. కవి కసిరెడ్డి జలంధర్రెడ్డి రచించిన ప్రేమ రాగాలు పుస్తకాన్ని కరీంనగర్లోని గణాంకభవన్లో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. విశిష్ట అతి థిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల లక్సెట్టిపేట సహాయ ఆచార్యుడు తన్నీరు సురేశ్ మాట్లాడుతూ.. ప్రేమ రాగాలు కవితలు గోదావరి నదిలా ప్రవహించాయని, కవిత్వంలో భావాలు అందరి జీవితాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. తెరవే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకట్ల తిరుపతి మాట్లాడుతూ ప్రేమ మానసికమైనదని, ప్రేమ లేని జీవితాలు ఉండవన్నారు. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవులు ఎల్గటి తిరుపతిరెడ్డి, అన్నాడి గజేందర్రెడ్డి, దామరకుంట శంకరయ్య, అన్నవరం దేవేందర్, జి.కాళిదాసు, నాగమల్ల పున్నంచందర్, పెంచాల రంగా రావు, బొమ్మకంటి కిషన్, సింగిరెడ్డి రాజిరెడ్డి, గుండు రమణయ్య పాల్గొన్నారు. విద్యార్థుల కోసం ఉద్యమించేది ఏఐఎస్ఎఫ్ కరీంనగర్టౌన్: విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తున్న ఏకై క విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, ఫిబ్రవరి 18 నుంచి 20వరకు నిజామాబాద్లో జరిగే ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని గణేశ్నగర్లో శనివారం ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు నిజామాబాద్లో జరిగే ఏఐఎస్ఎఫ్ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నూనావత్ శ్రీనివాస్ నాయ క్, నగర ఉపాధ్యక్షుడు సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, శ్రావణ్, నవీన్ పాల్గొన్నారు. బిల్లును వ్యతిరేకించండి కరీంనగర్టౌన్: ఫెడరల్ విధానానికి వ్యతిరేకంగా విద్యారంగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకువచ్చే వికసిత భారత్ శిక్ష అభియాన్ బి ల్లును వ్యతిరేకించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహా ప్రధాన కార్యదర్శి ముస్కుల రఘుశంకర్ రెడ్డి అన్నారు. శనివా రం టీఎన్జీవో భవన్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అవా లు నరహరి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబు ల్ సమావేశంలో మాట్లాడారు. విద్యారంగానికి నిధులు కేటాయించకుండా కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసే విధంగా ప్రవేట్ యూని వర్సిటీలను ఆహ్వానిస్తూ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ లేని విద్యా విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. పాఠ్యాంశాలలో సైంటిఫిక్ భావజాలాన్ని తగ్గిస్తూ, శాసీ్త్రయమైన అంశాలను పాఠ్యాంశాలలో చెప్పిస్తూ, ప్రజలను మధ్యయుగంలోకి తీసుకెళ్లే విధంగా విద్యా విధానాన్ని రూపొందిస్తుందన్నారు. ఇది సరైన విధానం కాదని దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. టీస్ఈసీ బాధ్యులు వేల్పుల రత్నం, ఆంజనేయరావు, రామ లింగారెడ్డి, ఏసురెడ్డి, జెల్ అసోసియేషన్ బాధ్యులు సుధాకర్, శ్రీనివాస్, తిరుమలయ్య, టీపీటీఫ్ బాధ్యులు రామచంద్ర రెడ్డి, శ్రీనివాస్, డీటీఫ్ బాధ్యులు చకినాల రామ్మోహన్, తూముల తిరుపతి పాల్గొన్నారు. మేయర్ ఎన్నికల అధికారిగా మహేశ్వర్కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో పూర్తి చేస్తారు. -
యూరియా కోసం ఆందోళన
శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. మొలంగూర్ గోదాంలో 450 బస్తాల యూరియా ఉండగా రైతులు గోదాం వద్దకు వచ్చారు. మొబైల్యాప్లో బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా దొరకగా.. స్మార్ట్ఫోన్లలో సాంకేతిక సమస్య తెలియని రైతులకు యూరియా దొరకపోవడంతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పదిరోజులుగా తిరుగుతున్నా ఒక్కబస్తా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏవో వెంకటేశ్ మొలంగూర్కు చేరుకుని ఆన్లైన్లో రైతుల మొబైల్నంబర్లు లింక్ చేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. -
బల్దియా బాద్షా ఎవరో?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మేయర్ పీఠంపై ఉత్కంఠ మొదలైంది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 66 కార్పొరేటర్ స్థానాలకు బీజేపీ 30 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే మరో నలుగురు కార్పొరేటర్లు అవసరముండగా... ఇప్పటికే ఇండిపెండెంట్లు ముగ్గురు, ఒక ఎఐఎఫ్బీ కార్పొరేటర్ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను తాకింది. మున్సిపల్ కార్పొరేషన్లో అధికారం బీజేపీ వైపు ఒరిగిన నేపథ్యంలో మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరో అన్న ఆసక్తి నగర ప్రజల్లో నెలకొంది. ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగినా, మేయర్ పదవిపై అంతర్గత పోటీ ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి ప్రసన్నం కోసం మేయర్ పదవి బీసీ జనరల్కు కేటాయించిన విషయం విధితమే. అధికార పగ్గాలు చేపట్టే స్థితికి చేరుకున్న బీజేపీలో మేయర్ రేసులో పలువురు సీనియర్ బీసీ కార్పొరేటర్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్తో ఆశావహులు వరుసగా భేటీలు అవుతూ తమకు మేయర్ పదవి ఇవ్వాలంటూ వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీకి విధేయతతో పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఒకవర్గం భావిస్తుండగా, సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యం, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే వరకు మేయర్ అభ్యర్థిత్వంపై స్పష్టత రానప్పటికీ, అంతర్గత లాబీయింగ్ జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రచారం నుంచి పబ్లిసిటీ వరకు అన్ని తానై అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఎవరికి అవకాశం ఇస్తారో అనే ఆసక్తి నెలకొంది. మొత్తానికి, కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరో అన్న ఉత్కంఠ నగర రాజకీయాలను వేడెక్కిస్తోంది. చొప్పరి జయశ్రీ బండారి వేణు వాసాల రమేశ్ కొలగాని శ్రీనివాస్ మేయర్ రేసులో బీసీ నేతలు సోమవారం మేయర్ పదవికి ఎన్నిక జరగనుండడంతో పీఠం అధిష్టించేది ఎవరనేది నగర ప్రజల్లో ఆసక్తిగా మారింది. మేయర్ పదవి ఆశిస్తున్న వారిలో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో విధేయతతో పనిచేస్తున్న 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, సీనియర్ నాయకుడు 18వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన వాసాల రమేశ్, మరో సీనియర్ నాయకుడు 51వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన బండారి వేణు మేయర్ రేసులో ఉండగా, మహిళలకు అవకాశమిస్తే సీనియర్ కార్పొరేటర్ 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ మేయర్ పదవి ఆశిస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. -
యువతరానికి పట్టం
చొప్పదండి: పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత జరిగిన రెండో పాలకవర్గ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు యువతకు పట్టం కట్టారు. 14 వార్డుల్లో గెలిచిన కౌన్సిలర్లు 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లే కావడం విశేషం. శుక్రవారం ఫలితాలు వెలువడిన అనంతరం మెజారిటీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు క్యాంపుకు తరలివెళ్లిన తరుణంలో సోమవారం ఉదయం జరుగనున్న పాలకవర్గ ఎన్నికల్లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవుల్లోనూ యువతరమే కొలువు తీరనుంది. పట్టణంలో పద్నాలుగు వార్డులుండగా ఎనిమిది మంది మహిళలే గెలుపొందడం గమనార్హం. మరోసారి పాలకవర్గంలోకి 14వ వార్డు నుంచి పెరుమాండ్ల మానస వరుసగా రెండో సారి కౌన్సిలర్గా గెలుపొందింది. గత పాలకవర్గంలో ఉన్న రాజన్నల ప్రణీత స్థానంలో ఆమె భర్త రాజన్నల రాజు గెలుపొందగా, కొట్టె అశోక్ స్థానంలో ఆయన సతీమణి కొట్టె సునీత కౌన్సిలర్గా గెలుపొందారు. ఇక గత పాలకవర్గంలో చైర్పర్సన్గా పని చేసిన గుర్రం నీరజ కుమారుడు గుర్రం సుజిత్ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో పదోవార్డు నుంచి గెలుపొందారు. నాడు పరాజితులు.. నేడు విజేతలు చొప్పదండి మున్సిపాలిటీకి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం చెందిన పలువురు అభ్యర్థులు తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గతంలో ఆరోవార్డులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కనమల్ల రాజశేఖర్ తాజాగా 4వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. గతంలో 5వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన ఒలుగొత్తుల సురేశ్ తాజాగా 6వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 11వ వార్డు నుంచి గతసారి బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన పిట్టల వెంకటేశ్ మళ్లీ అదేస్థానం నుంచి రిజర్వేషన్ కలిసి రావడంతో పోటీ చేసి గెలుపొందారు. పన్నెండో వార్డులో గతంలో పోటీచేసి ఓడిపోయిన ముద్దం తిరుపతిగౌడ్, తాజాగా తన సతీమణిని అదేస్థానంలో పోటీకి నిలిపి గెలిపించారు. ఇలా గత ఎన్నికల్లో పరాజితులైన నలుగురు అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందారు. -
మార్కెట్లో రద్దీ.. ఆలయాలు ముస్తాబు
కరీంనగర్ కల్చరల్/విద్యానగర్: శివరాత్రి పూజలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం నగరంలోని మార్కెట్లో రద్దీ నెలకొంది. శనివారం వీక్లీ మార్కెట్, ప్రధాన కూరగాయల మార్కెట్, రైతుబజార్, శ్రీవెంకటేశ్వర ఆలయ ప్రాంతం, టవర్ సర్కిల్ పూజా సామగ్రి కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కిలో ద్రాక్ష రూ.150 నుంచి రూ.180వరకు, దీపపు కంచుళ్లు జత రూ.100, మొక్కజొన్న కంకులు ఒక్కటి రూ.15, మోదుగుపూలు రూ.50 చొప్పున విక్రయించారు. నగరంలోని పాతబజార్ శ్రీగౌరీశంకరాలయం, కమాన్రోడ్లోని శ్రీరామేశ్వరాలయం, భగత్నగర్లోని భవానీ శంకరాలయలను శివరాత్రి వేడుకలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
హంగ్ ఆర్భాటాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మా రాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు రాయికల్, మెట్పల్లి, జమ్మికుంటలో పరిస్థితి భిన్నంగా మారింది. ఎన్నికల ఫలితాల వరకు మాటల కత్తులు దూసుకున్న పార్టీలు మేయర్, మున్సిపల్ చైర్మన్ కోసం పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. ముఖ్యంగా 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లో 30 సీట్లు బీజేపీ గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్బీ 2 చొప్పున గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లలో నలు గురు చేరడంతో బీజేపీ బలం 34కు చేరింది. వీరికి స్థానిక ఎంపీ బండి సంజయ్ ఎక్స్అఫీషియో ఓటు తోడవడంతో బలం 35కు పెరిగింది. ఈ క్రమంలోనే మేయర్ పీఠం కాంగ్రెస్కు రావాలని అధికార పార్టీ వ్యూహాలు రచించింది. బీఆర్ఎస్, మజ్లిస్తో కలిసి అవగాహనకు వచ్చింది. కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 5, ఎంఐఎం 3, ఏఐఎఫ్బీ 2, ఎక్స్అఫీషియో ఇద్దరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు (గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ) ఓటుతో సంఖ్యాబలం 35 ఉందంటున్నారు. ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి విషయంలో రెండు కూటములు తమ వైపే ఉన్నారని వాదిస్తున్నారు. ఈ పంచాయితీ ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మేయర్ పీఠం తమదేనని బీజేపీ ధీమాగా ఉంది. బీజేపీలోకి ఇద్దరు స్వతంత్రులు కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి గెలుపొందిన ఇద్దరు కార్పొరేటర్లు శనివారం హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్కు సంజయ్ కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఒక ఇండిపెండెంట్, ఏఐఎఫ్బీ కార్పొరేటర్ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరి చేరికతో బీజేపీ బలం 34కు చేరింది. ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎంపీ బండి సంజయ్కి ఓటు ఉంటున్నందున బీజేపీ బలం 35కు చేరింది. వీరు కాకుండా మరి కొంతమంది కార్పొరేటర్లు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. -
డ్యూటీలో పోలీస్ కపుల్స్
భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
రాజీనామా చేసి.. ఆపై గెలిచి..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత మున్సిపల్ 7వ వార్డు నుంచి బరిలో నిలిచి 261 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదేవిధంగా 26వ వార్డు కౌన్సిలర్ పదవికి ఏఐబీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని వదులుకొని బరిలో నిలిచిన కుక్క శ్రావణ్.. 52 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో 8వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై న స్వరూప.. వైస్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 3 ఓట్లతో పరాజయం పాలయ్యారు. మార్కెట్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అయితే ఈసారి చైర్పర్సన్ పదవి వరిస్తుందన్న ఆశతో ఉన్నారు. -
‘సింహం’ గెలుపు
గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్ల ఫలితాలు ఒక ఎత్తయితే.. 59వ డివిజన్ ఫలితం ఆద్యంతం ఉత్కంఠభరితంగా అభ్యర్థులను టెన్షన్ పెట్టించింది. డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాజ సనా, సింహం గుర్తుపై బాలసాని తిరుపతి పోటీ చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. మొదటిసారి లెక్కింపులో బాలసాని తిరుపతికి రెండు ఓట్ల లీడింగ్ వచ్చింది. ఈక్రమంలో గెలుపు ప్రకటించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అయితే తిరిగి లెక్కించాలని నిర్ణయించారు. అయితే అదే ఫలితం రావడంతో.. తిరస్కరణకు గురైన నాలుగు ఓట్లను పరిశీలించారు. అందులో రెండు పరిగణలోకి తీసుకోవాలని ఖాజ సనా కోరారు. అయితే ఎన్నికల అబ్వర్వర్ వద్దకు పంచాయితీ వెళ్లింది. తిరస్కరణకు గురైన ఓట్లు సరిగానే ఉన్నాయని గుర్తించి.. బాలసాని తిరుపతి రెండు ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గతంలో 39వ డివిజన్లో జెట్టి జ్యోతి ఒక్క ఓటుతో మోహన్ అనే అభ్యర్థిపై విజయం సాధించారు. -
అమ్మా.. నీకే అంకితం..
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డులో 70 ఏళ్ల మచ్చ గంగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నుంచి 223 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలింగ్ కేంద్రంలో కుమారుడు శేఖర్ ఆమె కాళ్లకు దండం పెడుతూ.. ఈ గెలుపు నీకు అంకితమనడం అందరి హృదయాలను కదిలించింది. వరుస గెలుపులుహుజూరాబాద్: మేజర్ గ్రామ పంచాయతీ హుజూరాబాద్ మున్సిపల్గా ఏర్పాటైన నుంచి పట్టణంలోని సూపర్బజార్ ఏరియా 26 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య–నర్సింహారెడ్డి వరసగా 2006, 2014, 2020, 2026 మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. డిపాజిట్ దక్కని మాజీ చైర్మన్రాయికల్: రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు 7వ వార్డులో పోటీ చేయగా.. డిపాజిట్ సైతం దక్కలేదు. బీఆర్ఎస్కు చెందిన ఎలిగేటి లలితకు 565 ఓట్లు రాగా.. మోర హన్మండ్లుకు 109, బీజేపీ అభ్యర్థి సామాల్ల రాజేశంకు 36, కోన రాజుకు 46 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాయికల్లో అత్యధికం.. 702 ఓట్లురాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో 4వ వార్డు కౌన్సిలర్ తురగ సౌజన్యకు అత్యధికంగా 702 ఓట్లు రాగా.. అత్యల్పంగా 8వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి మ్యాకల జనార్దన్కు కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ ఓటమి రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 7వ వార్డులో మోర హన్మండ్లు ఎలిగేటి లతికపై, 9వ వార్డులో రమాదేవి బత్తిని మహేశ్వరిపై పరాజయం పాలయ్యారు. అంతస్తు ముందు.. అభిమానం నెగ్గిందిసిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో అంతస్తుల ముందు అభిమానం గెలిచింది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలోని 33వ వార్డులో బీజేపీ నుంచి పోటీ చేసిన కొండ వర్షిణి దంపతులకు ఉండడానికి భవనం లేదు. భర్త నరేశ్కు పెద్దల నుంచి వచ్చిన పది సాంచాలను నడిపిస్తూ సాధారణ జీవితం సాగిస్తున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి విధేయంగా పని చేస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి అండదండలు లేవు. వీరి సేవలను గుర్తించి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి దార అశోక్పై 67 ఓట్ల మెజార్టీతో వర్షిణి గెలిచారు. ఈ విషయం సిరిసిల్లలో హాట్ టాపిక్గా మారింది. -
నాలుగోసారి..
జగిత్యాల: గత మూడు పర్యాయాలు దేవేందర్నాయక్ కౌన్సిలర్గా గెలుపొంది మళ్లీ నాలుగోసారి సైతం విజయం సాధించి రికార్డు సృష్టించారు. దేవేందర్నాయక్ ఎస్టీ రిజర్వేషన్ నుంచి పోటీ చేస్తుంటారు. జగిత్యాలలో మొదటిసారి 2వ వార్డు నుంచి, రెండోసారి 9వ వార్డు, మూడోసారి 48వ వార్డు, ఈసారి 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొంది రికార్డు సృష్టించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక్క బీఆర్ఎస్ కౌన్సిలర్గా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి వరుసగా కౌన్సిలర్గా గెలుపొందుతూ వస్తున్నారు. -
ఆకాశాన్నంటిన ఆనంద భాష్పాలు
నా భర్త గెలుపు కోసం వెన్నంటే ఉండి పోరాటం చేశానని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వాడజనం మా ఆయనను గెలిపించారని.. భర్త విజయం సాధించిన వార్త విని పరుగులతో వచ్చింది భార్య. ఆ క్షణం భర్త గుండైపె వాలి ఆనందంతో ఏడ్వసాగింది. తల్లి సైతం గారాల కొడుకును చూసి ముద్దులు ెపెడుతూ కన్నీరుతెచ్చుకుంది. ఈసన్నివేశం చూస్తూ గెలిచిన అభ్యర్థులంతా ఒక్కసారిగా వారి ప్రేమను చూస్తూ ఉండిపోయారు. పెద్దపల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థి పాగాల శ్రీకాంత్ గెలుపుతో తల్లి, భార్య, కూతురు, బంధువులు, కాలనీవాసుల ఆనందం ఆకాశాన్నంటింది. కౌంటింగ్ కేంద్రం బయట ఒకరికొకరు తమ మద్దతుదారులు గెలిచారంటూ సంబురాల్లో మునిగిపోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
భార్యాభర్తలిద్దరూ..
గోదావరిఖని: ఒక్కరు పోటీలో ఉంటేనే ఇంటిల్లిపాది ప్రచారం చేసి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది రెండు డివిజన్లలో.. అదీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి భార్యాభర్తలిద్దరూ కార్పొరేటర్లుగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 58వ డివిజన్లో బీఆర్ఎస్ నుంచి మేకల సమ్మయ్య కాంగ్రెస్ అభ్యర్థి మేకల హరికృష్ణపై 362 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 60వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మేకల శారద కాంగ్రెస్ అభ్యర్థి మోతిపాటి స్వప్నపై 89 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. నాడు భర్త.. నేడు భార్యరాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో నాడు భర్త తురగ శ్రీధర్రెడ్డి 4వ వార్డు కౌన్సిలర్గా ఎన్నిక కాగా.. ఆయన భార్య తురగ సౌజన్య శుక్రవారం అదే వార్డు నుంచి సురతాని భాగ్యలక్ష్మిపై విజయం సాధించారు. -
అక్క గెలుపు.. తమ్ముడు ఓటమి
యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ పరిధి వెంకట్రావుపల్లి 15వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బుర్ర శశికళ–ముత్యాలగౌడ్ విజయం సాధించారు. ఆమె తమ్ముడు దాసరి శ్రీనివాస్ 18వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థిపై 376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. హ్యాట్రిక్ విజయంమెట్పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 18వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీలో నిలిచిన చెట్లపల్లి మీనా వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2014, 2020 ఎన్నికల్లో కూడా మీనా ఈ వార్డు నుంచి గెలుపొందారు. ప్రస్తుతం మరోమారు విజయం పొంది మున్సిపల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి కౌన్సిలర్గా రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ ముందంజ వేసింది. మీనా ఆ పార్టీ నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మూడుసార్లు..జగిత్యాల: జగిత్యాల 21వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 3వ వార్డులో పోటీ చేసి గెలుపొందగా.. రెండోసారి బీఆర్ఎస్ తరఫునే 17వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి 21వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం పొందారు. కోరుట్ల విశేషాలు..కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని 31వ వార్డులో పోటీ చేసిన ఓ స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు రాలేదు. ఒక్క ఓటు.. పట్టణంలోని 32, 24, 17, 12 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. వీరు తమ ఓటు తాము వేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అత్యధిక మెజార్టీ.. పట్టణంలోని 25 వార్డులో బీజేపీ అభ్యర్థి కలాల రాధకు అత్యధిక మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ కవితపై 660 ఓట్ల మెజార్టీ వచ్చింది. అత్యల్పంగా 3వ వార్డు అభ్యర్థి మోర్తాడ్ లక్ష్మీనారాయణ 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి దొబ్బల వెంకటేశ్ రెండో స్థానంలో నిలిచారు. భార్య గెలుపు.. భర్త ఓటమి గత మున్సిపల్ ఎన్నికల్లో 10, 11 వార్డుల్లో పోటీ చేసిన దాసరి రాజశేఖర్–సునీత దంపతుల్లో రాజశేఖర్ ఓటమిపాలు కాగా.. సునీత గెలిచింది. ఈసారి కూడా రాజశేఖర్ పరాజయం పాలవ్వగా.. సునీత విజయం సాధించింది. పెళ్లి కాని కౌన్సిలర్ 28వ వార్డులో కొక్కెర వెంకటేశ్ బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. ఈయనకు 25 ఏళ్లు. పెళ్లి కాలేదు. -
ఓటమెరగని నేత..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మేజర్ పంచాయతీకి మూడుసార్లు వార్డు సభ్యుడిగా.. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా.. ఇప్పుడు మూడోసారి ఎన్నికై నూగిల్ల మల్లయ్య ఓటమి ఎరగని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లో కౌన్సిలర్గా ఎన్నికయ్యాక హంగ్ ఏర్పడింది. అనూహ్య పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నూగిల్ల మల్లయ్యనే వరించింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో తాను గతంలో ఎన్నికై న వార్డు నుంచి రిజర్వేషన్ కలిసి రాక 21వ వార్డులో పోటీ చేసి విజయం సాధించారు. ఆ వార్డులో గెలిస్తే చైర్పర్సన్! పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వార్డుగా 21వ వార్డు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే.. ఈ వార్డు నుంచి గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ మమతారెడ్డి చైర్పర్సన్గా వ్యవహరించారు. ఈసారి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అంటూ నూగిల్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. దీంతో ఆయన కూడా 21వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. -
టికెట్ దక్కకున్నా.. ప్రజామోదం దక్కింది..
జగిత్యాలటౌన్: టికెట్ దక్కకపోయినా ప్రజామోదం మాత్రం దక్కింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలు వెలువడ్డాయి. 22వ వార్డులో బీజేపీ టికెట్ ఆశించిన అరవ లక్ష్మి(బిట్టు)కి టికెట్ రాకపోవడంతో.. పార్టీ నాయకులకు ఫోన్ చేసిన లక్ష్మి కుమారుడు బోరున విలపించాడు. అనంతరం లక్ష్మి రెబల్గా బరిలోకి దిగారు. స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 26వ వార్డులో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ పులి రమకు చివరి నిమిషంలో టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె కుమారుడు శ్రీధర్ బోరున విలపిస్తూ పార్టీ నేతలకు ఫోన్ చేసి తానేం పాపం చేశానని నిలదీశాడు. రెబల్గా బరిలోకి దిగి ప్రజామోదంతో గెలుపొందారు. తల్లులకు టికెట్లు రాక ఆవేదనకు లోనైన వారి కుమారులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఇద్దరూ ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడం జగిత్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ టికెట్ కంటే ప్రజాభిమానమే గొప్పదని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని చర్చించుకుంటున్నారు. -
వరుసగా భార్యాభర్తలు
యైటింక్లయిన్కాలనీ: రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ అల్లూరు 19వ డివిజన్ ఏరియాలో మారెల్లి సుశీల–రాజిరెడ్డి కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు కౌన్సిలర్, కార్పొరేటర్గా విజయం సాధించారు. మొదటిసారి జనరల్ కేటగిరిలో మారెల్లి రాజిరెడ్డి గెలుపొందారు. జనరల్ మహిళ కేటగిరిలో మూడుసార్లు తన భార్య మారెల్లి సుశీల గెలుపొందారు. 20వ డివిజన్ నుంచి.. పోతనకాలనీ న్యూమారేడుపాక గ్రామంలో 20వ డివిజన్ నుంచి ఒకసారి టీడీపీ నుంచి, ఏఐఎఫ్బీ నుంచి, రెండుసారర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్గా నాలుగుసార్లు విజయం సాధించిన తాళ్ల అమృత–రాజయ్య. మూడుసార్లు తాళ్ల అమృత గెలుపొందారు. ఒకసారి జనరల్ కేటగిరి రావడంతో తాళ్ల రాజయ్య విజయం సాధించారు. 16వ డివిజన్ నుంచి.. రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీ 16వ డివిజన్లో బీజేపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్గా విజయం సాధించిన మందల రమ–కిషన్రెడ్డి. రెండుసార్లు మందల కిషన్రెడ్డి గెలుపొందారు. ఈసారి జనరల్ మహిళ రావడంతో మందల రమ విజయం సాధించారు. మారెల్లి సుశీల–రాజిరెడ్డి మందల రమ–కిషన్రెడ్డి -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ కాంగ్రెస్దే జోరు
● సుల్తానాబాద్లో రెండు ఓట్లు తిరస్కరణ సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పడ్డాయి. రామగుండం కార్పొరేషన్లో 467 ఓట్లకు 220 కాంగ్రెస్కు, 92 బీఆర్ఎస్కు, 46 బీజేపీకి పడ్డాయి. సింహానికి 45,ీ ససీపీఐకి 2, జనసేనకు 3, స్వతంత్రులకు 31 ఓట్లు పడ్డాయి. 28 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 65 ఓట్లు పోలవ్వగా, అందులో రెండు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 63 ఓట్లలో కాంగ్రెస్కు 31, బీఆర్ఎస్కు 14, బీజేపీకి 07, ఏఐఎఫ్బీకి 7, ఇండిపెండెంట్లకు 4 ఓట్లు పడ్డాయి. పెద్దపల్లిలో మొత్తం 215 ఓట్లలో కాంగ్రెస్కు 133, బీఆర్ఎస్కు 34, బీజేపీకి 19, ఇతరులకు 29 ఓట్లు పడ్డాయి. మంథనిలో 49 ఓట్లకు కాంగ్రెస్కు 30, బీఆర్ఎస్కు 12, ఏఐఎఫ్బీకి 2, ఇండిపెండెంట్లకు 5 ఓట్లు పడ్డాయి. నోటాకు 847.. సాక్షి పెద్దపల్లి: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి మద్దతు తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దేశంలో నిర్బంధ ఓటింగ్ వ్యవస్థ లేదు. దీంత వివిధ కారణాలతో చాలామంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోంది. దీంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు నోటా (నన్ ఆఫ్ ది ఎబౌట్)ను తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించారు. దీంతో రామగుండం కార్పొరేషన్లో 736 మంది, మంథనిలో 34మంది, పెద్దపల్లిలో 77మంది నోటాను వినియోగించుకున్నారు. సుల్తానాబాద్లో ఒక్కరు కూడా నోటాహక్కు వినియోగించుకోలేదు. పెద్దపల్లిలో ఒక ఓటరు పోస్టల్ బ్యాలెట్లో నోటాకు ఓటు వేయడం గమనార్హం. చెల్లని ఓట్లు 1,640 సాక్షి పెద్దపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. బ్యాలెట్ పత్రంలో సరైన విధంగా స్వస్తిక్ సింబల్ వేయకపోవడం, ఓటువేసిన వారు తప్పుగా మలచటం తదితర కారణాలతో రామగుండం కార్పొరేషన్లో 1,163 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పెద్దపల్లిలో 288, సుల్తానాబాద్లో 101, మంథనిలో 88 ఓట్లు మొత్తంగా 1,640 ఓట్లు చెల్లకుండా పోయాయి. -
నాడు మేయర్.. నేడు కార్పొరేటర్గా ఓటమి..
గోదావరిఖని: రామగుండం నగరపాలక మేయర్గా పని చేసిన డాక్టర్ బంగి అనిల్కుమార్ నేడు కార్పొరేటర్గా ఓటమి పాలయ్యారు. 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనిల్కుమార్ పోటీలో ఉన్నారు. ఈసారి కూడా మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీపీఐ అభ్యర్థి మార్కపురి సూర్య చేతిలో ఓటమి పాలయ్యారు. 119 ఓట్ల మెజార్టీతో సూర్య గెలుపొందారు. మేయర్గా పని చేసి మళ్లీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన అనిల్కుమార్.. సీపీఐ అభ్యర్థి చేతిలో ఓటమిపాలు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డబ్బులు పంచుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత పోలీసులు చేరుకొని తనిఖీలు నిర్వహించడం.. సీపీఐ అభ్యర్థి జేబులో రూ.48వేలు దొరకడం.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మైనస్గా మారిందనే చర్చ జరుగుతోంది. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
కరీంనగర్: అల్ట్రాసౌండ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని పలు అల్ట్రాసౌండ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, కేస్ రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లు, ఫామ్–ఎఫ్ పత్రాలు పరిశీలించారు. ప్రత్యేక వైద్య నిపుణులైన గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, ఇతర అర్హత కలిగిన నిపుణుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ధృవీకరించారు. సిజేరియన్ కాన్పులు తగ్గించే దిశగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లోని కేస్ షీట్లను ఆడిట్ చేశారు. పీవోడీటీటీ ఉమాశ్రీ, పీవో ఎంహెచ్ఎన్ సన జవేరియా, సయ్యద్ సాబీర్, రమేశ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సమాజంలో అన్యాయాలను ఎదిరించగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, ప్యానల్ న్యాయవాదులు తెలిపారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బాల వివాహ్ ముక్త్ భారత్’లో భాగంగా న్యాయ చట్టాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, బాల్య వివాహాల నిషేధ చట్టం– 2006 గురించి వివరించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం ద్వారా బాల్యం ఛిద్రమవుతుందని, అటువంటి ఘటనలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పొక్సో చట్టం–2012 కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కోర్టు ఖర్చులు భరించలేని బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాశ్రెడ్డి, ఏ.కిరణ్కుమార్, మాన్వాడ రామాంజనేయులు, బలాసుల శాంతి కుమార్, హెచ్ఎం బి.భీమేశ్ పాల్గొన్నారు. -
పైచేయి
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కమలంకార్పొరేషన్లోమున్సిపాలిటీల్లోసింగ్ ఈజ్ కింగ్తెరపైకి ఎక్స్అఫిిషియో ఓట్లునృత్యం చేస్తున్న విద్యార్థులు కరీంనగర్రూరల్: కరీంనగర్ కార్పొరేషన్లో విలీ నమైన గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు కార్పొరే టర్లుగా గెలుపొందడం సంచలనంగా మారింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ రూర ల్ మండలంలోని 7డివిజన్ల పరిధిలో ఐదింటిలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆరెపల్లిలోని 1వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి బారి అపర్ణ, తీగలగుట్టపల్లిలోని 2వ డివిజన్లో కొలగాని శ్రీనివా స్, తీగలగుట్టపల్లి–వల్లంపహాడ్లోని 3వ డివిజ న్లో సాదినేని లావణ్య, గోపాల్పూర్–దుర్శేడ్లోని 4వ డివిజన్లో భూపతి రవీందర్, బొమ్మకల్లోని 6వ డివిజన్లో మ్యాకల వెంకటేశ్ కార్పొరేటర్లుగా గెలుపొందారు. బొమ్మకల్– దుర్శేడ్లోని 5వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదె రూప, బొమ్మకల్– కృష్ణానగర్లోని 34వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి సమీనా పర్వీన్ విజయం సాధించారు.కరీంనగర్క్రైం: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్టమైన పోలీసు భద్రత మధ్య ముగిసింది. ఎన్నికలు ముగిసి ఎస్సారార్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులు పెట్టినప్పటి నుంచి కళాశాల ఆవరణలో మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. శుక్రవారం సీపీగౌస్ ఆలం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలీసులకు పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కౌంటింగ్ కేంద్రాలను సీపీ సందర్శించారు. నగరంలోని టూటౌన్ పరిఽధిలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.కౌంటింగ్ను పరిశీలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, తదితరులుచొప్పదండిలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 38వ డివి జన్కు సంబంధించి రీ కౌంటింగ్ వివాదం ఏర్పడింది. ఈ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి దేవసా ని సరస్వతి కాంగ్రెస్ అభ్యర్థి దేశబోయిన హారి కపై 12 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించా రు. రీ కౌంటింగ్ చేయాలని దేశబోయిన హారిక అధికారులను లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. అప్పటికే విజేతగా ప్రకటించినందున రీకౌంటింగ్ అవసరం లేదంటూ బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి రీ కౌంటింగ్ చేపట్టినప్పటికీ.. తనకు సంబంధించిన బండెల్స్ మాత్రమే లెక్కించారని, మొత్తం ఓట్లు తిరిగి లెక్కించాలంటూ హారిక వాదనకు దిగారు. అధికారులు వినకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మేయర్ సునీల్రావు అధికారులను బెదిరించి, రీకౌంటింగ్ కాకుండా చూశారంటూ ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఎస్సారార్లో ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందిజగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలకు గాను 23 కాంగ్రెస్ గెలుచుకుంది. 23 మందిలో ఏడుగురు జీవన్రెడ్డి వర్గీయులు కాగా, 16 మంది సంజయ్ వర్గీయులు. 15 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. మొత్తం మీద 18 చోట్ల సంజయ్ వర్గీయులు, 17 చోట్ల జీవన్రెడ్డి వర్గీయలు గెలుపొందారు. వీరి మధ్య సయోధ్యకు చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ 06, బీఆర్ఎస్ 04, ఎంఐఎం 02 సీట్ల చొప్పున అభ్యర్థులు గెలిచారు. 33 స్థానాలున్న కోరుట్లలో కాంగ్రెస్ 18 సీట్లు సాధించి మున్సిపాలిటీని వశపరరచుకుంది. 26 స్థానాలున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 12 స్థానాలున్న రాయికల్లో 5 చోట్ల బీజేపీ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఽ15 స్థానాలు ధర్మపురిలో 15 స్థానాలు కాంగ్రెస్ కై వసం చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది.మెట్పల్లి, రాయికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 26 స్థానాలున్న మెట్పల్లిలో 03 సీట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలవగా.. 12 సీట్లున్న రాయికల్లో బీఆర్ఎస్తో సమానంగా 03 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. ఈ రెండుచోట్ల బీజేపీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక 30 సీట్లున్న జమ్మికుంటలో 12 బీఆర్ఎస్ గెలచుకుంది. 10 స్థానాలతో కాంగ్రెస్ రెండో ప్లేసులో నిలిచింది. నలుగురు స్వతంత్రులు, నలుగురు బీజేపీ అభ్యర్థులు కీలకమయ్యారు. ఇక్కడా బీఆర్ఎస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.విలీన గ్రామాల్లోకౌంటింగ్కు అవినీతి రహిత పాలన చూపిస్తాంకరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్పై తొలిసా రి కాషాయజెండా ఎగరేసి రికార్డు సృష్టించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. బల్దియా లో అవినీతి రహిత పాలన చూపిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ బల్దియా ఫలితా ల్లో బీజేపీ 30స్థానాలు కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మకై ్క ఎన్నో కుట్రలు చేశాయని, ఓటుకు రూ.7 వేలు ఇచ్చి, చివరకు బీజేపీ అభ్యర్థులను, నాయకులను ప్రలోభపెట్టేదుకు కుట్ర లకు పాల్పడ్డారని ఆరోపించారు. అయినా వారి పాచిక పారలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎంఐఎం ఒవైసీ బ్రదర్స్ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. బండి సంజయ్ హిందుత్వమే మా ట్లాడతారు. అభివృద్ధి మాట్లాడరు. కరీంనగర్కు నయాపైసా కూడా తేలేదంటూ పిచ్చికూతలు కూసిన వాళ్లకు చెంపపెట్టు తీర్పు ఇచ్చి కర్రు కాల్చివాతపెట్టారని అన్నారు. కరీంనగర్ ప్రజలను ఆదుకునేది, అభివృద్ధి చేసేది మోడీ ప్రభుత్వమేనని నమ్మి ఆదరించారని తెలిపారు. 5 ఏళ్లలో కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేతల్లో చూపిస్తామని స్పష్టం చేశారు. 30 సీట్లు గెలిచామని, కొన్ని కారణాలతో మరో ముగ్గురికి సీట్లు ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారని అన్నారు. ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల్లో గెలిచినవారు కూడా బీజేపీలోకి రాబోతున్నారని తెలిపారు.38వ డివిజన్సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టణాల ఓటర్లు వైవిధ్య తీర్పునిచ్చారు. బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీకి అధిక స్థానాలు కట్టబెట్టి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ను రెండు చోట్ల ముందంజలో నిలబెట్టారు. మూడు చోట్ల బీజేపీకి అధికస్థానాలు అప్పగించి అనూహ్య ఫలితాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు ఉండగా.. 9 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, రామగుండం నగరపాలక సంస్థ కాంగ్రెస్ వశమైంది. ధర్మపురి మున్సిపాలిటీని క్లీన్స్వీప్ చేసింది. జగిత్యాలలో స్వతంత్రులు అధికస్థానాలు గెలిచి జోరుమీదున్నారు. 66 డివిజన్లున్న కరీంనగర్లో 30స్థానాలు గెలు చుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. దీనికితోడు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం మూడు ఎక్స్ అఫిషియో ఓట్లు వీరికి తోడుగా ఉన్నాయి. ఇప్పటికే పదిమంది వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని కేంద్ర సహాయమంత్రి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చొప్పదండిలో 14 వార్డులకు కాంగ్రెస్ 10స్థానాలు కై వసం చేసుకుంది. 30 వార్డులున్న హుజూరాబాద్ మున్సిపాలిటీలో 16 స్థానాలతో కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జమ్మికుంటలో 30 సీట్లకు 12 స్థానాలు బీఆర్ఎస్, 10 సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. బీజేపీ నలుగురు, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. సంఖ్యాపరంగా బీఆర్ఎస్కి ఆధిక్యమున్నా.. చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగానే ఉంది. బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో గులాబీ పార్టీ మున్సిపాలిటీని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. 60 డివిజన్లు ఉన్న రామగుండం కార్పొరేషన్లో 38 స్థానాలు గెలిచి కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 13, బీజేపీ 01 స్థానంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీలనూ ఇదే తరహాలో కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 స్థానాలకు 27 సీట్లు గెలచుకుని బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 06, బీజేపీ 05 స్థానాల్లో తరువాతి స్థానాల్లో నిలిచాయి. వేములవాడలో 28 సీట్లకు 13 స్థానాల్లో హస్తం విజయకేతనం ఎగరేసింది. బీజేపీ 08 స్థానాలు, బీఆర్ఎస్ 05, ఇండిపెండెంట్లు రెండు సీట్లు గెలుచుకున్నారు. -
నామమాత్రంగానే ఏర్పాట్లు
మహాశివరాత్రికి ఏటా నామమాత్రంగానే ఏర్పాట్లు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గుట్టపై ఆదా యం ఉన్న వసతులు మాత్రం లేవు. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఏర్పాట్లు అంతంతే కనిపిస్తున్నాయి. – చిలివేరి బాబు, నాంపల్లి నాంపల్లిగుట్టపై ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపిస్తుంది. గుట్టపై పారిశుధ్య సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేయాలి. గుట్టపై ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలి. – బుర్ర పర్శరాములు, నాంపల్లి మహాశివరాత్రి సందర్భంగా నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గుట్టపై పారిశుధ్యం లోపించకుండ చూస్తాం. గుట్టపై వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – బండారి శంకర్, నాంపల్లి ఆలయ ఇన్చార్జి -
ప్రతీ గర్భిణికి టిఫా తప్పనిసరి
కరీంనగర్: గర్భిణులకు టిఫా స్కాన్ తప్పనిసరి అని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లల వార్డును సందర్శించి, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రసవాలు జరగడం విశేషమన్నారు. ఆదిలాబాద్ తర్వాత జిల్లాలోని పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డెలివరీల సంఖ్య పెరుగుతోందన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గర్భిణికి ముందు నుంచే సాధారణ ప్రస వం ఆవశ్యకతపై ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. శుక్రవారం సభకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హాజరుకావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాల జాబితా సమర్పించాలన్నా రు. ఎంసీహెచ్లో మరిన్ని పడకలు ఏర్పాటుకు చ ర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఆర్ఎంవో నవీనా, ప్రోగ్రాం అధికారి సనా పాల్గొన్నారు. -
డీఎంఎఫ్టీ నిధులపై కేంద్రం నజర్
డీఎంఎఫ్టీ అంటే.. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ). దేశంలో మైనింగ్/గని కార్యకలాపాలతో ప్రభావితమయ్యే ప్రజల భావజాలాలు, పరిసరాల యాజమాన్యాన్ని మెరుగుపర్చడానికి నిర్దేశించిన దాతృత్వ నిధి ఇది. మైన్స్, మినరల్స్ (డెవలప్మెంట్, రెగ్యులేషన్) అమెండ్మెంట్ యాక్ట్–2015 ప్రకారం అమలు చేశారు. ప్రతీ మైనింగ్ ప్రభావిత జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్గా దీన్ని ఏర్పాటు చేస్తోంది. గోదావరిఖని: సింగరేణి విస్తరించిన జిల్లాల్లో కేటాయించే డీఎంఎఫ్టీ నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించింది. తెలంగాణకు తలమానికమైన సింగరేణి డీఎంఎఫ్టీ నిధులు ఇక్కడే ఖర్చుచేయాలనే నిబంధన ఉన్నా.. కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని సింగరేణేతర నియోజకవర్గాలకు తీసుకెళ్తున్నట్లు తేల్చింది. పలుకుబడి, రాజకీయ జోక్యం ఇందుకు కారణమవుతోందని భావిస్తోంది. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటకు తరలివెళ్లిన డీఎంఎఫ్టీ నిధులు ఇప్పుడు కొడంగల్కు కూడా తరలించారనే అభియోగాలున్నాయి. దీంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై అధ్యయనం చేశాక సింగరేణి విస్తరించిన పది జిల్లాల్లోనే ఈ నిధులు వినియోగించేలా చట్టం చేయాలని యోచిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, చట్టం తీరుపై ఇటీవల ఆరా తీశారు. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి చట్టంలోని లొసుగుల్ని తొలగించేలా విన్నవించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎంఎఫ్టీలో కీలక మార్పులు, చేర్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. డీఎంఎఫ్టీ నిధులు ఎలా? మైనింగ్ లీజ్దారులు ప్రభుత్వం తీసుకునే రాయల్టీ/సీనరేజీ ఫీజుకు అదనంగా ట్యాక్స్ చెల్లిస్తారు. ట్యాక్స్ శాతం రాష్ట్రానికి అనుగుణంగా ఉంటుంది. ఇలా సేకరించిన నిధి నిల్వ చేస్తారు. ఇందులో 98 శాతం డీఎంఎఫ్టీ ఖాతాకు చేరుతుంది. మిగతాది మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో పాలనాపరమైన ఖర్చులకు ప్రభుత్వం ఉపయోగించవచ్చు. డీఎంఎఫ్టీ ఖాతాలోంచి కనీసం 60–70 శాతం నిధులు ప్రజాసంక్షేమానికి ఉపయోగించాలి. ఇందులో తాగునీటి శుద్ధి, ఆరోగ్యం, విద్య, శిక్షణ, ఉద్యోగ నైపుణ్యం, మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, వికలాంగులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, రోడ్లు, పొలాలు, డ్రైనేజీ, వాటర్ వే ప్రాజెక్టులు, సేద్యం, ఇరిగేషన్, నీటినిల్వలు, శక్తి వాటర్షెడ్స్ వంటి వనరుల అభివృద్ధికి కేటాయించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్ దీన్ని పర్యవేక్షిస్తుంది. రూ.1,700 కోట్ల నిల్వలు డీఎంఎఫ్టీ నిధులు రూ.1,700 కోట్లు నిల్వ ఉన్నట్లుగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. మరోవైపు సింగరేణికి రాష్ట్రప్రభుత్వం రూ.51 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని విడుదల చేస్తే అందులో రూ.1,700 కోట్లు డీఎంఎఫ్టీకి జమ చేస్తుందని చెబుతున్నారు. ఈ నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ అంశాలపై అధికారులతో చర్చించి సింగరేణి విస్తరించిన పది జిల్లాల అభివృద్ధికే ఈ నిధులు కేటాయించాలని సూచించారు. కాగా, సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కేంద్రప్రభుత్వం ఇద్దరిని నియమిస్తోంది. అయితే ప్రతీ సమావేశంలో వీరు పెద్దగా పోషించే పాత్రేమీలేదని గుర్తించారు. సింగరేణి అభివృద్ధి, స్థానికులకు ప్రయోజనం జరగడంలేదని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈసారి సమర్థవంతమైన ఇద్దరు అధికారులను నియమించేలా చర్యలు తీసుకుంటోంది. సింగరేణి ప్రభావిత జిల్లాల్లో వినియోగంపై దృష్టి సింగరేణేతర నియోజకవర్గాలకు నిధులు తరలిస్తున్నట్టు గుర్తింపు ప్రధానితో భేటీ కానున్న బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి -
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ బస్సులో పర్సు మరిచిపోయిన ప్రయాణికురాలికి అందజేసి కరీంనగర్–2 డిపో సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. గురువారం కరీంనగర్ ఆర్టీసీ–2 డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చింది. ఈ బస్సులో ప్రయాణించిన కరీంనగర్కు చెందిన రాజేశ్వరి తన పర్సును బస్సులో మరిచిపోయింది. బస్సు డైవర్ ఎన్.సంపత్, కండక్టర్ ఎన్.రజిత పర్సులో 5 తులాల బంగారం గొలుసు, కొంత నగదు ఉందని గమనించి ఆమెకు అందజేశారు. డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ సిబ్బందిని అభినందించారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం రామునిపల్లికి చెందిన మడతనపల్లి చరణ్(29) చికిత్స పొందు తూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చరణ్ హైదరాబాద్లో ఎంసీఏ చది వాడు. జాబ్ రాలేదు. గతనెల సమ్మక్క జాతర కోసం ఇంటికి వచ్చాడు. ఉద్యోగం రాలేదని తండ్రితో బాధపడితే, మనకు కొంత పొలం ఉంది అని ధైర్యం చెప్పాడు. ఈనెల 5న కొడుకును తీసుకుని తండ్రి పొలం వద్దకు వెళ్లి చూపెట్టడంతోపాటు గడ్డిమందు చల్లారు. మి గిలిన మందు పొలం వద్దే ఉంచారు. మరుసటి రోజు చరణ్ పొలం వద్దకు వెళ్లి ఆ మందు తా గి తన సోదరి కుమార్తెకు ఫోన్ చేసి చె ప్పాడు. వెంటనే తండ్రి సుధాకర్కు చెప్పడంతో అ తను పొలం వద్దకు వెళ్లి చూడగా చరణ్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, అక్కడి నుంచి హైదారాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందా డు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
కరీంనగర్టౌన్: నాలుగు లేబర్ కోడ్లు, బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్, విత్తన బిల్లులు ఉపసంహరించాలని నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో గురువారం విజయవంతమైంది. నగరంలోని గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పీఎఫ్ కార్యాలయం రోడ్డులో సభ నిర్వహించారు. సీఐ టీయూ జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ.రమ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టేకుమట్ల సమ్మయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీని వాస్రెడ్డి మాట్లాడారు. కార్మిక, కర్షకుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని తరిమికొట్టాలన్నారు. నాయకులు జనగాం రాజమల్లు, పున్నం రవి, కాళిదాసు, కాశెట్టి లక్ష్మయ్య, దాసరి ప్రభాకర్, రాజేందర్, సంపత్ యాదవ్, రాజు, వీరయ్య, పోశయ్య, కిరణ్, ఆగయ్య, బి.అశోక్, పొనగంటి కేదారి, రాయకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులు విధులు నిలిపివేసి ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. -
కూలీ పనికి వచ్చి తిరిగిరాని లోకాలకు...
జైపూర్: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో జగి త్యాల జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల మేర కు జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన తూర్పాటి అభి (19), పెంబట్లకు చెందిన పురాణం రవి, పస్తం అరుణ్ ముగ్గురూ స్నేహితులు. చెన్నూర్లో పత్తి లోడింగ్ చేసేందుకు ఈ నెల 11న ముగ్గురూ క లిసి ఒకే బైక్పై కూలీ పనికి వచ్చారు. రాత్రంతా ప నిచేసిన యువకులు గురువారం తెల్లవారుజామున లక్సెట్టిపేటకు బయలుదేరారు. రసూల్పల్లి సమీ పంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. అభి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి, అరుణ్కు తీవ్రగాయాలు కావడంతో 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. అభి తండ్రి తూర్పాటి అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
కౌంట్డౌన్!
టిక్.. టిక్.. టిక్సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. రెండు కార్పొరేషన్లలో 126 డివిజ న్లకు, 13 మున్సిపాలిటీలలో 341 వార్డుల ఫలితా లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 764, జగిత్యాల 655, పెద్దపల్లి 580, సిరిసిల్ల 287 మొత్తం 2,286 మంది భవితవ్యం నేడు తేలనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రధాన పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి. ఎగ్జిట్ ట్రెండ్స్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశముందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐదు చోట్ల బీఆర్ఎస్కు ఆధిక్యం కనిపిస్తుండగా, రెండు చోట్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు సునాయాస విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాంపు రాజకీయాలు.. ఫలితాలు వెలువడగానే క్యాంపు రాజకీయాలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీల నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులతో ముందస్తు ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్క కార్పొరేటర్/కౌన్సిలర్ ఓటు కీలకంగా మారనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కొన్నిచోట్ల అభ్యర్థులను గురువారమే క్యాంపునకు తరలించింది. రామగుండం, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడలో అభ్యర్థులను క్యాంపుకు రావాలని ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ కూడా కరీంనగర్, రామగుండం, సిరిసిల్ల, హుజూరాబాద్, జమ్మికుంట, మెట్పల్లి, రాయికల్లో క్యాంపు రాజకీయానికి తెరలేపారు. కరీంనగర్, వేములవాడలో క్యాంపు కోసం బీజేపీ అభ్యర్థులను సిద్ధంగా ఉండాలని సూచించింది. తారుమారు కానున్న స్థానిక రాజకీయం పుర ఫలితాలు స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రస్థాయిలో మారుతున్న రాజకీ య సమీకరణాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారే అవకాశముంది. అధికార పార్టీ తమపట్టును నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉండగా, ప్రతిపక్షాలు బలమైన ప్రాతినిథ్యం సాధించి భవిష్య త్ ఎన్నికలను శాసించేందుకు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం వెలువడే ఫలితాలు కేవలం మున్సిపల్ పాలనకే కాదు, జిల్లాలో భవిష్యత్ రాజకీయ దశ, దిశను నిర్ణయించనున్నాయి. అధికార కుర్చీ కోసం జరుగుతున్న ఈ పోరు ఉమ్మడి రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. కరీంనగర్ డివిజన్లు: 66చొప్పదండి వార్డులు: 14హుజూరాబాద్ వార్డులు: 30 జమ్మికుంట వార్డులు : 30కాంగ్రెస్: రామగుండం, మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ బీఆర్ఎస్: మెట్పల్లి, రాయికల్, హుజూరాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల బీజేపీ: కరీంనగర్, వేములవాడ -
మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు
వేములవాడ: ఈనెల 14 నుంచి భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. తన కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. రూ.1.96 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు జాతరకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2.50 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలు సిద్ధమని తెలిపారు. భక్తు ల నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశామని, రాజన్న జలప్రసాదం ఆరు ప్రధాన కేంద్రాలు, 30 ప్రాంతాల్లో అందుబాటులో ఉంచడమే కాకుండా ట్రాలీ ఆటోల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు వివరించారు. దాతల సహకారంతో లక్ష వరకు మజ్జిగ పాకెట్లు, టిఫిన్లు భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వం తరఫున, 14న సాయంత్రం 7 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 14 నుంచి 16 వరకు శివార్చన వేదికపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కొనసాగుతాయని వివరించారు. 87369 36969 నంబర్కు ‘ఏజీ’ అని మెసేజ్ చేయడం ద్వారా ఆలయ సేవల వివరాలు పొందవచ్చని తెలిపారు. ఈవో రమాదేవి -
● కాంగ్రెస్ ప్రలోభాలకు తెరతీసింది ● దేశమంతా కరీంనగర్ వైపు చూస్తోంది ● కౌంటింగ్ వద్ద అప్రమత్తంగా ఉండండి ● చిన్న పొరపాటు చేసినా నష్టపోతాం ● అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో కేంద్ర మంత్రి సంజయ్ కుమార్
కరీంనగర్: కరీంనగర్ కార్పొషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కై వసం చేసుకోబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశమంతా కరీంనగర్ ఫలితాలవైపు చూస్తోందన్నారు. బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కై వసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. గురువారం కరీంనగర్లోని రాజశ్రీ గార్డెన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు రాబోతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ప్రలోభాలకు గురిచేసి బీజేపీ కార్పొరేటర్లను లాగాలని చూస్తోందన్నారు. పార్టీని మోసం చేస్తే కన్నతల్లిని మోసం చేసినట్లేనని చెప్పిన బండి సంజయ్ అధికార పార్టీ ఆశలకు లోబడి ఎవరైనా కాంగ్రెస్లోకి వెళ్తే తీవ్రమైన పరిణామాలుంటాయన్నారు. కార్యకర్తల ఆవేశాన్ని తట్టుకోవడం అసాధ్యమని హెచ్చరించారు. సునీల్రావు మాట్లాడుతూ.. ఫలితాల సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల తరఫున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. చర్చలు, గొడవల పేరుతో దృష్టి మళ్లించేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేసే అవకాశముందని, వాటికి తావివ్వకుండా బ్యాలెట్ పైనే దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రంలో ఎవ్వరితోనూ గొడవ పడొద్దని, ఏదైనా అభ్యంతరం ఉంటే రాతపూర్వకంగా రాసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్దామని తీర్మానించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను పాల్గొన్నారు. -
నాంపల్లిపై చిన్నచూపు
వేములవాడఅర్బన్: వేములవాడకు వచ్చే భక్తులు నాంపల్లిగుట్టపై వెలసిన నృసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. కొలిస్తే.. మొలిచే పేరున్న నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై అధికారులకు పట్టింపు కరువైంది. నాంపల్లిగుట్టపై ఏర్పాట్ల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈనెల 14 నుంచి మొదలయ్యే మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు తూతూమంత్రంగానే చేసి చేతులు దులుపుకున్నారు. మూలనపడ్డ వాటర్ ఫౌంటేయిన్ నాంపల్లిగుట్టపై భక్తుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేయిన్, రంగులైట్ల ప్రదర్శన మూలనపడింది. పట్టించుకునే వారు లేక నిరుపయోగంగా మారింది. వెలసిపోయిన కాళీయమర్ధనం నాంపల్లిగుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనంపై కృష్ణుడి బొమ్మ భక్తులను ఆకట్టుకుంటుంది. అయితే రంగు వెలసిపోయింది. కాళీయమర్ధనం ఎదుట ఉన్న నరసింహుడి బొమ్మ రంగుపోయి కళావిహీనంగా కనిపిస్తుంది. పారిశుధ్యం అస్తవ్యస్తం నాంపల్లిగుట్టపై పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపిస్తుంది. కాళీయమర్ధనం పక్కన చెట్ల కింద మొత్తం చెత్తమయంగా మారింది. నిరుపయోగంగా మూత్రశాలలు గతంలో మహాశివరాత్రికి భక్తుల కోసం లడ్డూ కౌంటర్ వెనుక, కాశీయమర్ధనం పక్కన తాత్కాళికంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అవి వాడుకలో లేకపోవడంతో మూలకుపడ్డాయి. భక్తులకు అత్యవసరం ఏర్పడితే ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. మహాజాతరకు ఏర్పాట్లు అంతంతే.. గుట్టపై పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తం నృసింహస్వామిపై పట్టింపు కరువు -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
కరీంనగర్క్రైం/కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎస్సారార్ కళాశాల వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసుల ఆధ్వర్యంలో మూడంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. ప్రత్యేక పాసులున్నవారు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను మాత్రమే సెంటర్లోకి అనుమతించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబరాలు, నిరసనలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6గంటల వరకు కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. దారిమళ్లింపు చర్యలు లెక్కింపు కేంద్రం ఎస్సారార్ కళాశాల వద్ద రద్దీని నివారించేందుకు శుక్రవారం నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపుకు వచ్చే వాహనాలు రేకుర్తి చౌరస్తా, శాతవాహన యూనివర్సిటీ, కొత్తపల్లి పోలీసుస్టేషన్ రోడ్డు మీదుగా చింతకుంట నుంచి నగరంలోకి చేరుకుంటాయన్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపుకు వెళ్లే వాహనాలు తెలంగాణ చౌక్, రాంనగర్, పద్మనగర్, చింతకుంట మీదుగా శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి నుంచి జగిత్యాల వైపునకు వెళ్లాలని సూచించారు. కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. గురువారం కౌంటింగ్ కేంద్రమైన ఎస్ఆర్ఆర్ కళాశాలలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సీపీ గౌస్ ఆలం సమక్షంలో మాస్టర్ శిక్షకులు కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్దేశాయి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు 66 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్ వైజర్లు కలుపుకొని మొత్తం 300 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుందని అన్నారు. వేయి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కించి, ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. -
అగర్తల టు కన్యాకుమారి సైకిల్యాత్ర
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్లో కాజీపేట రైల్వే ప్లాట్ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి సెల్ నంబర్ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. -
చిన్నారిని బలిగొన్న బైక్
మల్లాపూర్: రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మల్లాపూర్ మండలంలోని నడికుడలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్కొండాపూర్ గ్రామానికి చెందిన తోకల నాగరాజు, గౌతమి దంపతులకు కూతురు, కుమారుడు వేదాన్ష్ (4) సంతానం. నాగరాజు భార్యాపిల్లలతో కలిసి బుధవారం మల్లాపూర్ మండలం వాల్గొండలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. రాత్రి 7గంటల సమయంలో ఆటో దిగగానే వేదాన్ష్ రోడ్డు దాటేందుకు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో మొగిలిపేట నుంచి అతివేగంగా వస్తున్న ఓ బైక్ వేదాన్ష్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వేదాన్ష్ను కుటుంబసభ్యులు హుటాహుటిన నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించి అర్ధరాత్రి వేదాన్ష్ మృతి చెందాడు. బాలుడి మృతితో ఫకీర్కొండాపూర్లో విషాదం అలుముకుంది. బైక్ను అతివేగంగా.. నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన రాఘవపేటకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు నిజామాబాద్లో చికిత్స పొందుతూ మృతి -
రోడ్డెక్కిన రైతులు
శంకరపట్నం: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. పారదర్శకంగా యూరియా అందించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ అన్నదాతలకు చుక్కలు చూపుతోంది. యాప్లో బుక్చేసినా యూరియా అందడం లేదని శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో గురువారం రైతులు రోడ్డెక్కారు. అరగంటపాటు కరీంనగర్– వరంగల్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్తో లారీ వచ్చింది. రైతులు గోదాం వద్దకు చేరుకుని మొబైల్ యాప్లో బుకింగ్ చేసుకున్నారు. అయితే రెండు నిమిషాల్లోనే స్టాక్ క్లోజ్ అని చూపడంతో రైతులు ఆగ్రహించారు. గోదాం నుంచి రోడ్డుపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి కలుపుతీత పనులు జరుగుతున్నాయని, పొలాల వద్దకు వెళ్లకుండా నిత్యం గంటల తరబడి ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు. పొలానికి యూరియా వేయకుంటే ఎర్ర బడుతోందని వాపోయారు. ఆంక్షలు లేకుండా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
రంగస్థల నటుడు జేఎస్ కన్నుమూత
కోల్సిటీ(రామగుండం): గోదా వరిఖనికి చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ నటుడు, సింగరేణి మాజీ ఉద్యోగి జల్లారం సత్యనారాయణ(81) గురువారం అనారో గ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి కళా రంగాన్ని విషాదంలో ముంచింది. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంగస్థల నాటకాలు, టీవీ ప్రదర్శనల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. స్థానిక కళాకారులు, పలు కళాసంఘాల బాధ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, కనకం రమణయ్య, చంద్రపాల్, మేకప్ అంజన్న, సిరిపురం శ్రీనివాస్, దయానంద్గాంధీ, మేజిక్ హరి, దామెర రాజేశ్ తదితరులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
గురుకులాలకు ఆదరణ
● మైనార్టీ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 28 వరకు అవకాశం కరీంనగర్రూరల్: మైనార్టీ గురుకులాలకు ఆదరణ పెరుగుతోంది. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు చక్కటి విద్యాబోధన చేస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. జిల్లాలోని బొమ్మకల్లో బాలుర–1,2, ఇరుకుల్లలో 3, రేకుర్తిలో బాలిక–1,గణేశ్నగర్–2, చొప్పదండి, జమ్మికుంటలో బాలికల పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 2026–27 విద్యాసంవత్సరానికి మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 28 వరకు ప్రక్రి య కొనసాగుతుంది. 5వ తరగతిలో మైనా ర్టీలకు 60 సీట్లు, బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2సీట్లు ఉండగా మిగితా 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రవేశాల్లో 75శాతం మైనార్టీలకు, 25శాతం ఇతరులకు కేటాయించారు. మైనార్టీకోటాలో ముస్లింలకు 64శాతం, క్రిస్టియన్లకు 7, జైన, పార్శి, బౌద్ధ, సిక్కులకు 4శాతం కేటాయించగా నాన్ మైనార్టీ కోటాలో ఎస్సీలకు 6శాతం, ఎస్టీలకు 4, బీసీలకు 12, ఓసీలకు 3శాతం సీట్లు ఉన్నా యి. దరఖాస్తులను సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్స్కు లేదా ఆన్లైన్లో సమర్పించాల ని బొమ్మకల్ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ వీర్ల మహేశ్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన అనంతరం మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారని వివరించారు.యూరియా నో స్టాక్కరీంనగర్రూరల్: జిల్లాలోని యూరియా విక్ర య కేంద్రాల్లో నో స్టాక్ చూపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం 10గంటలకు పలువురు రైతులు యూరియా బుకింగ్ కోసం ప్రయత్నించగా స్టాక్ జీరోగా చూపించడంతో ఆందోళన చెందారు. చామనపల్లిలోని విక్రయ కేంద్రంలో బుధవారం యూరియా బుక్ చేసుకున్న రైతులకే పంపిణీ చేశారు. పలువురు రైతులకు స్మార్ట్ఫోన్ లేకపోవడంతో యూరియా బుకింగ్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల నుంచి ఏఈవోలకు మున్సిపల్ ఎన్నికల విధులను అప్పగించడంతో కేంద్రాలకు రావడంలేదు. దీంతో రైతులకు యూరియా అందడం లేదు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలుకొత్తపల్లి: కొత్తపల్లి తహసీల్ కార్యాలయ పరిధి లోని రేకుర్తి సర్వే నంబర్ 55 ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు మళ్లీ జోరందుకున్నా యి. ఎన్నికల సమయాన్ని అదునుగా చూసుకొని అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో గురువారం అక్రమ నిర్మాణాలు కొనసాగాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు గ్రామ పాలనాధికారి అంజనేయ ప్రసాద్ నిర్మాణాలను ఆపాలని ఆదేశించారు. ఓ మహిళ తనకు అన్ని అనుమతులున్నాయని, రాచకొండ నరేశ్ అనే వ్యక్తి తనకు విక్రయించాడని ఆ గ్రామ పరిపాలన అధికారి తో వాగ్వివాదానికి దిగింది. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొత్తపల్లి తహసీల్దార్, ఆర్ఐను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలికరీంనగర్ కార్పొరేషన్: ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి రౌండ్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎటువంటి సందేహాలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాలన్నారు. -
చిన్నారుల సమాచారం ఇవ్వండి
వరంగల్ క్రైం: కాజీపేట పోలీస్, రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను అపహరించిన ముఠాను టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో నిందితులను విచారించగా మరో ముగ్గురు చిన్నారులు వివిధ ప్రాంతాల్లో అపహరణకు గురై ప్రస్తుతం శిశు సంక్షేమశాఖ సంరక్షణలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వారి తల్లిదండ్రులు సరైన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చిన్నారుల్లో ఒకరైన ఆరేళ్ల వయస్సు గల బాబును 2023 అక్టోబర్లో కాజీపేట రైల్వే ప్లాట్ ఫాం నుంచి అపహరించగా, ఏడు నెలల పాపను గతేడాది మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో, ఇంకో ఐదు మాసాల పాపను రామగుండం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అపహరించినట్లు వివరించారు. పిల్లలకు సంబంధించి సరైన ఆధారాలను పట్టుకొని కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి సెల్ నంబర్ 87126 85122లో సంప్రదించి పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. -
● అభ్యర్థుల నివాసాల్లో సందడి
కరీంనగర్టౌన్: మరికొన్ని గంటల్లో కార్పొరేషన్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల నివాసాల్లో ముందురోజు నుంచే సందడి నెలకొంది. నగరంలో 3,40,580 మంది ఓటర్లు ఉండగా 2,14,486 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 62.98శాతం ఓటింగ్ నమోదు కావడంతో గెలుపోటములను అభ్యర్థులు అంచనా వేయలేకపోతున్నారు. అనుచరులతో బూత్లవారీగా లెక్కలు కడుతూ మల్లగుల్లాలు పడుతున్నారు. కులాలు, మతాల ఓట్లను లెక్కిస్తూ తమకు ఇన్ని వస్తాయంటూ ఆశతో ఉన్నారు. ఎవరికి వారు గెలుపు తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచే అనుచరులను తమ ఇండ్లకు పిలుచుకుని పోలైన ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనే అంచనాల్లో మునిగితేలుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్లలో కార్యకర్తల సందడి నెలకొంది. -
విద్యుత్షాక్తో పంచాయతీ వర్కర్ మృతి
జగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం రంగపేట గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్, ఎలక్ట్రిషీయన్గా పనిచేస్తున్న ఏసు సుందర్రావు (60) విద్యుత్ మరమ్మతు చేస్తూ షాక్కు గురై మృతిచెందాడు. సుందర్రావు కొన్నేళ్లుగా పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడి భార్య ఏసు రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. హైదరాబాద్లో జగిత్యాల యువకుడు..జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెట్పల్లి సంజయ్ (24) గురువారం చెరువులో అనుమానాస్పదంగా మృతి చెందాడు. సంజయ్ బుధవారం ఎన్నికల్లో ఓటు వేయడానికి జగిత్యాల వచ్చి ఓటు వేసి రాత్రి హైదరాబాద్ వెళ్లాడు. గురువారం మియాపూర్ చెరువులో మృతదేహమై కనిపించాడు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ముంబయ్లో వ్యక్తి..జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్కు చెందిన గర్వంద రాజేశ్గౌడ్ (40) ముంబయ్లో గుండెపోటుతో మృతిచెందాడు. రాజేశ్గౌడ్ ముంబయ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లి వచ్చిన ఆయన గురువారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటిచే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజేశ్గౌడ్ మృతదేహాన్ని అంబులెన్స్లో లక్ష్మీపూర్కు తీసుకొస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంకొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని మతిస్థిమితం లేని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. 50 నుంచి 55 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. కొత్తపల్లి ఆర్ఐ అనంతుల రజినీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
● తొలి ఫలితం 64వ డివిజన్కు చాన్స్
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు 66 డివిజన్లకు గాను 66 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 33 మంది ఆర్వోలు, రెండు డివిజన్ల చొప్పున నేరుగా పర్యవేక్షిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఈ నెల 7,8,9 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వగా, 66 డివిజన్లకు 2,855 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడుతారు. బ్యాలెట్ బాక్స్ల సీల్ అభ్యర్థులు, ఏజెంట్ల ముందు తొలగించి, బ్యాలెట్ పత్రాలు తీస్తారు. 25 బ్యాలెట్ పత్రాలకు ఒక బండెల్ చొప్పున కట్టలు కడుతారు. వేయి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమైనా, 10 గంటల తరువాతనే ఒరిజినల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వేయికి ఒక రౌండ్ చొప్పున లెక్కిస్తున్నందున, మొత్తంగా నాలుగైదు రౌండ్లలో అన్ని డివిజన్ల ఫలితాలు పూర్తికానున్నాయి. కొన్ని డివిజన్లు మూడు రౌండ్లలోనే ముగియనున్నాయి. సాయంత్రం 4 గంటలవరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మొదటగా 227 ఓట్లు పోలైన 64వ డివిజన్, చివరగా 4,795 ఓట్లు పోలైన 8వ డివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాగా సిబ్బంది లెక్కింపుతోనూ సమయం మారే అవకాశముంది. -
ప్రజాస్వామ్యం అపహాస్యం: పొన్నం
కరీంనగర్కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు పార్టీలు ఒకటిగా కలిసి ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేశాయన్నారు. బుధవారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూ, భౌతిక దాడులకు దిగుతూ మళ్లీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించారన్నారు. నిజామాబాద్ ఎంపీ పోలింగ్ బూత్లోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులపై దౌర్జన్యం చేశారన్నారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న అంశాలు ఇన్నాళ్లు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నది బీజేపీయేనని, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ప్రకటనల ద్వారా ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీజేపీపై ఆయా పురపాలక పాలకవర్గాలు ఒత్తిడి తేవాలన్నారు. బీజేపీ అమలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసిన, రెండు బడ్జెట్లలో రూపాయి కేటాయించని బీజేపీకి ఓటు అడిగే నైతికత లేదన్నారు. తెలంగాణ ప్రజల కళ్లు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్న పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 80 శాతం మున్సిపాల్టీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. -
ట్రాన్స్ జెండర్ల ఆదర్శం
కోల్సిటీ(రామగుండం)/పెద్దపల్లిరూరల్: రామగుండం నగరంలోని ట్రాన్స్జెండర్లు బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కోసం నియమించిన ట్రాన్స్జెండర్ ఐకాన్ ఓరుగంటి లైలా ఆదేశాల మేరకు జిల్లా మోడ్రన్ అవీర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించారు. వారు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురికాకుండా సరైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటుహక్కు వినియోగించుకున్నామన్నారు. పురుషులు, మహిళలకు తీసిపోని విధంగా ట్రాన్స్జెండర్స్ను ఎన్నికల సంఘం గుర్తించి, ప్రత్యేక విభాగం కింద ఓటుహక్కు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటుహక్కును వినియోగించుకున్న వారిలో జిల్లా మోడ్రన్ అవరైస్ సొసైటీ సభ్యులు సమక్క, భవాని, శివాని, లాస్య, సుష్మా, అనిత, శ్రావ్య శ్రీవర్ష, అన్విత, అపరంజి, గాయత్రి తదితరులు ఉన్నారు. మరోవైపు.. జిల్లాకేంద్రంలో హిజ్రాలు జ్వాలాముఖి, రిషిత తమ ఓటుహక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని పరశురాంనగర్కు చెందిన ట్రాన్స్జెండర్ నాంపల్లి కావ్య తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న వైనం -
డ్రోన్ ఉపాధి
వేములవాడఅర్బన్: ఆలోచన ఉంటే ఎక్కడైనా ఉపాధి వెతుక్కోవచ్చని ఈ యువకుడు నిరూపించాడు. డ్రోన్ ఆవిష్కరణను తనకు ఉపాధిగా మలుచుకున్నాడు. డ్రోన్ సాయంతో మందు పిచికారీ చేస్తూ అటు రైతులకు శ్రమ తగ్గించడంతోపాటు తనకు పక్కా ఉపాధిగా మలుచుకున్నాడు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్కు చెందిన గంగాధర శ్రీనివాస్ డ్రోన్తో క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తూ నమ్మకమైన ఉపాధి పొందుతున్నాడు. యాంత్రీకరణతో అనేక మార్పులు వ్యవసాయం అంటేనే శ్రమతో కూడిన పని. తెల్లారెంది మొదలు రాత్రి పొద్దుపోయే దాక పనిచేసిన ఒడవని కథ. అయితే యాంత్రీకరణతో వ్యవసాయ పనులు తేలికగా మారాయి. ట్రాక్టర్ రాకతో దుక్కిదున్నే పని సులభతరమైంది. నాటువేసే యంత్రాలు రావడంతో గంటలోనే ఒక ఎకరం పొలం నాటువేసేస్తుంది. హోర్వెస్టర్ ఆవిష్కరణతో వరికోతలు సులభంగా మారిపోయాయి. ఒక్క రోజులోనే ఒకే మిషిన్తో దాదాపు పది నుంచి పదిహేను ఎకరాలలో కోత పూర్తయింది. ఈక్రమంలోనే డ్రోన్ ఆవిష్కరణ రైతుల శ్రమను మరింత తగ్గించింది. క్రిమిసంహారక మందు పిచికారీ చేయాలంటే నీళ్లు మోసేందుకు ఇద్దరు మనుషులు, డబ్బతో మందు పిచికారీ చేసేందుకు ఒక్క మనిషి అవసరముండేది. ముగ్గురు కలిస్తే రెండు గంటల్లో ఎకరం పొలానికి మందు పిచికారీ చేస్తారు. కానీ డ్రోన్ సాయంతో అరగంటలోపే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తున్నారు. అది కూడా తక్కువ నీటి అవసరంతోనే. డ్రోన్ కొని.. మందుకొట్టి బోయినపల్లి మండలం నర్సింగాపూర్కు చెందిన శ్రీనివాస్ పీజీ వరకు చదివాడు. అనంతరం ప్రైవేట్ కంపెనీలో 12 ఏళ్లపాటు పనిచేశారు. రైతుబిడ్డ కావడంతో ఎక్కడ ఉద్యోగం చేయడం ఎందుకు కొత్తగా వ్యవసాయంలోనే యంత్రాలతో పనులు చేయాలని ఆలోచనతో ఏడాదిన్నర క్రితం డ్రోన్ను కొనుగోలు చేశాడు. ఇందుకు డ్రోన్కు రూ.4లక్షలు వెచ్చించాడు. మరో రూ.2 లక్షలు పెట్టి కారు కొన్నాడు. డ్రోన్ను కారుపై పెట్టుకొని పొలాల వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నాడు. ఇటు రైతులకు శ్రమ తప్పడంతోపాటు శ్రీనివాస్కు ఉపాధి లభిస్తుంది. సీజన్ వారీగా సంపాదన సీజన్ ఉన్నప్పుడు డ్రోన్తో రోజు 20 ఎకరాల వరకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నాడు. ఎకరానికి రూ.500 తీసుకుంటున్నాడు. మొదటి సీజన్ ఆరు నెలల్లో 400 ఎకరాలు పిచికారీ చేశాడు. రెండో సీజన్లో 900 ఎకరాలు.. ఇప్పుడు మూడో సీజన్లో 1500 ఎకరాలలో పిచికారీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. డ్రోన్లో 10 లీటర్లు నీరు పడుతుంది. అది ఒక ఎకరానికి పిచికారీ చేస్తుంది. డ్రోన్తో నీరు తక్కువ మందు ఎక్కువగా పిచికారీ అవుతుంది. సీజన్లో మూడు నెలలు ఇదే పనిచేస్తున్నాడు. ఆధునిక యంత్రాలతో పురుగుమందులు పిచికారీ రైతులకు తప్పిన తిప్పలు యువకుడికి పక్కా ఉపాధిప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన. నోటిఫికేషన్లు రాకపోవడంతో 12 ఏళ్లు ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన. విసిగిపోయి ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా డ్రోన్ కోనుగోలు చేసిన. దీంతో సంతోషంగా పని చేసుకుంటున్నాను. – గంగాధర శ్రీనివాస్, నర్సింగాపూర్ -
ఓటు లేకున్నా.. పోలింగ్ బూత్లోకి
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: ఓటు లేకున్నా.. ఓ వ్యక్తి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఘటన జిల్లాకేంద్రంలోని ఏడోవార్డు బూత్ నంబర్ 22లో చోటుచేసుకుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అనుమానించిన పోలింగ్ ఏజెంట్లు పోలీ సులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓటు వేయలేదని తేలడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే 26వ వార్డులో ఓటేసేందుకు ఓ వ్యక్తి రాగా.. పోలింగ్ కేంద్రం వద్దే స్వతంత్ర అభ్యర్థి భర్త సదరు వ్యక్తిని గుర్తించి నిలదీశాడు. దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
పురపోరు ముగిసింది..
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మేమూ..: మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులుఓటేసిన..: ఓటు వేసిన కలెక్టర్ పమేలా సత్పతిమాకొద్దీ యూరియా యాప్శంకరపట్నం: ఆంక్షలు లేకుండా యూరియా సరఫరా చేయాలని, మొబైల్యాప్లో బుకింగ్ వద్దని మండలంలోని కన్నాపూర్ గ్రామంలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. మెట్పల్లి సహకార సంఘం పరిధిలోని కన్నాపూర్ గోదాంకు 240 బస్తాల లోడ్ వచ్చింది. విష యం తెలిసి కన్నాపూర్, ధర్మారం గ్రామాల రై తులు గోదాం వద్దకు చేరుకున్నారు. స్మార్ట్ఫోన్లు లేని రైతులకు మొబైల్యాప్లో యూరి యా బుకింగ్ కాకపోవడంతో పాటు 5జీ ఫోన్లోనే బుక్ కావడం, సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని, బుకింగ్ లేకుండా పట్టాదారు పాసు పుస్తకంపై యూరియా ఇవ్వాలని గోదాం ఎదుట ఆందోళనకు దిగారు. రెండు గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీంతో గోదాం సిబ్బంది తాళంవేసి వెళ్లిపోయారు. కన్నాపూర్ గోదాం, కేశవపట్నం సోమేశ్వర ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఏ శ్రీధర్ తనిఖీ చేశారు. జనవరి 31నుంచి 2,287 మంది రైతులు 7,439 బస్తాల యూరియా బుక్ చేసుకుంటే, 6,703 బస్తాలు పంపిణీ జరిగిందన్నారు. అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తామని డీఏవో తెలిపారు. యూరియా కొరతకు కేంద్రమే కారణంకరీంనగర్ కార్పొరేషన్: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. బుధవారం నగరంలోని సుడా క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత బండి సంజయ్పై లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే వాటా గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరి యా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వాటా ను సకాలంలో అందించకుండా బీజేపీ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చి కొంటున్నారని గంగుల చేసిన ఆరోపణను తోసిపుచ్చారు. డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. ఓటేసిన ట్రాన్స్జెండర్లుహుజూరాబాద్: హుజూరాబాద్లో నలుగురు ట్రాన్స్జెండర్లు ఓటేశారు. పట్టణంలో నలుగు రు ట్రాన్స్ జెండర్లుగా నమోదు కాగా.. 100 శాతం నమోదై ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కుమారి, రవళి ఓటేశారు. కృష్ణవేణి పబ్లిక్ స్కూల్లో రాజి, కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సత్తెమ్మ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అటు ఓటింగ్.. ఇటు డబ్బులుకరీంనగర్రూరల్: కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో బుధవారం పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు ఓటర్లకు పెద్దఎత్తున డబ్బుల పంపిణీ యథేచ్ఛగా చేపట్టారు. ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, దుర్శేడ్, గోపాల్పూర్, బొమ్మకల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు ఓటర్లను కలిసి డబ్బులిస్తూ.. ఆటోల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు సమాచారం. 2వ డివిజన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో ఓ అభ్యర్థి ఇప్పటికే ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేయగా కొంతమంది ఓటర్లకు రూ.4వేల నుంచి రూ. 5వేల వరకు మరోసారి ఇవ్వడం విశేషం. ఆరెపల్లిలో సైతం పోటాపోటీగా ఓటర్ల ఇంటికి వెళ్లి డబ్బులిచ్చారు. బొమ్మకల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.1,000 నుంచి రూ.1,500 చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది.సాక్షిప్రతినిధి,కరీంనగర్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దాదాపు పక్షం రోజుల పాటు జరిగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారానికి ఫలితం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా హుజూరాబాద్లో అత్యధికంగా 81.47శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా కరీంనగర్లో 62.98శాతం రికార్డయింది. 79.81శాతంతో జమ్మికుంట రెండోస్థానంలో నిలిచింది. 78.76శాతం పోలింగ్తో హుజూరాబాద్ మూడోస్థానంలో ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. కరీంనగర్లో రణరంగం జిల్లాలో పురపాలికల ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. కరీంనగర్ కార్పొరేషన్లో పలు పోలింగ్ బూత్ల వద్ద బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్ర నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఉద్రిక్తతలు చాలా చోట్ల లాఠీచార్జికి దారితీశాయి. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ సజావుగా సాగింది. వెబ్కాస్టింగ్తో కలెక్టర్ పర్యవేక్షణ కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళని పర్యవేక్షించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఎన్నికల తీరును పరిశీలిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్ను పరిశీలించారు. కరీంనగర్లోని రోడ్లు భవనాలశాఖ ఎస్ఈ కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. జ్యోతినగర్లోని ఎస్సార్ ఉన్నత పాఠశాల పోలింగ్స్టేషన్లను సందర్శించారు. సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఈ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన వారికి మొక్కలు అందజేశారు. బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు 59వ డివిజన్ ముకరంపుర హైస్కూల్లో ఓటేశారు. భారీ బందోబస్తు మున్సిపల్ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. జిల్లావ్యాప్తంగా 1,300 మంది విధుల్లో పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోనే 900 మంది డ్యూటీ నిర్వహించారు. ఉదయం సీపీ గౌస్ ఆలం 23 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. పలు డివిజన్లలో నేతల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీయగా.. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. 32వ డివిజన్లో హుస్సేనీపురాలో జరిగిన లాఠీచార్జిలో సీపీ గౌస్ ఆలం స్వయంగా పాల్గొని అల్లరిమూకలను చెదరగొట్టారు. 3వ టౌన్ పరిధిలో జరిగిన పలు ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓటేసిన ప్రముఖులు కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు. పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు వారు నివాసముండే డివిజన్ల పరిధిలోని పోలింగ్ బూత్ల్లో కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 50వ డివిజన్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హైస్కూల్లోని 361 పోలింగ్బూత్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఓటేశారు. 52వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలోని ట్రినిటి కళాశాలలో కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే కేంద్రంలో కాంగ్రెస్పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఓటేశారు. మంకమ్మతోటలోని దన్గర్వాడీ పాఠశాలలో సుడా చైర్మన్ నరేందర్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.చొప్పదండిలో ఓటేసిన ఎమ్మెల్యే సత్యంమున్సిపల్ 9 గంటలకు 11 గంటలకు 1 గంటకు 3 గంటలకు 5 గంటలకు కరీంనగర్ 9.18 24.36 39.27 51.95 62.98 జమ్మికుంట 7.74 24.89 47.35 65.53 79.81 హుజూరాబాద్ 11.70 30.41 52.90 69.90 81.47 చొప్పదండి 12.47 34.49 56.96 74.28 78.76ఓట్ల జగడం!32వ డివిజన్ లో ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులుఆందోళనకారులను హెచ్చరిస్తున్న సీఐసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 58వ డివిజన్ జిల్లా పరిషత్ పోలింగ్బూత్లో బీఆర్ఎస్ నేతలు తమఓట్లు వేశారంటూ బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇది లాఠీచార్జ్కు దారి తీసింది. 32వ డివిజన్లో ఎంఐఎం, బీఆర్ఎస్ అభ్యర్థుల వర్గీయులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. 33వ డివిజన్లో దొంగ ఓట్లు పడ్డయని ప్రచారం జరిగినా.. దాన్ని మున్సిపల్ కమిషనర్ ఖండించారు. 28 డివిజన్లో తమ నేతలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 49వ డివిజన్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్రెడ్డి సెల్ఫోన్ లాక్కుని బీజేపీ నాయకులు పగులగొట్టారని ఆరోపించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థి భర్త ఎన్నం ప్రకాశ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 36వ డివిజన్లో పోలీసులతో స్వతంత్ర అభ్యర్థి యాదయ్య వాగ్వాదానికి దిగారు. 27 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బంధువు అయిన పోలీసు తమపై చేయి చేసుకున్నారని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆరోపించాడు. పెద్దపల్లి జిల్లాలో.. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు అభ్యర్థి రజని కష్ణమూర్తి ఫొటోల గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్పు పంపిణీ చేశారంటూ బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, మనోహర్రెడ్డి అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎనిమిదోకాలనీ 17వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఓటింగ్ లిస్టు బయటికి వచ్చిందని బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా జగిత్యాలలోని 31వ వార్డులో ఎంఐఎం బీఆర్ఎస్ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. 26వ వార్డులో ఓటు వేసేందుకు వచ్చిన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన బాపురపు చంద్రశేఖర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెట్పల్లి మున్సిపాలిటీలో 12వ వార్డులో ఓ అంగన్వాడీ కార్యకర్త అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపణలు రావడంతో విధుల నుంచి తొలగించారు. జగిత్యాల 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి స్వతంత్ర అభ్యర్థికి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాల 2వ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఏకంగా ఒకరినొకరు తోసుకున్నారు. కోరుట్లలో 27 వార్డులో స్వతంత్ర అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన ఆపిల్ పండ్లు పంచుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వేములవాడ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి తనను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓ ఎస్సై సపో ర్టు చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించా రు. వేములవాడ మున్సిపాలిటీలో 4వ వార్డులో బీ ఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ సతీమణి పోలింగ్ ఏజెంట్గా మరో వ్యక్తి ఐడీ కార్డుతో ఓట్లు అడిగిన ట్లు కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు.బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం -
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన దేశవేని గంగనర్సయ్య(54) బుధవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. గంగనర్సయ్య కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స చేయించినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఉరేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగనర్సయ్య తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు. జమ్మికుంట: బజాజ్ ఆటో ఢీకొట్టిన ఘటనలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన మారపల్లి ఐలయ్య(59) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ధర్మారం బస్టాండ్ వైపు కాలినడకన వస్తుండగా.. వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన బుర్రగళ్ల రాజ్కుమార్ అనే వ్యక్తి అతివేగంగా బజాజ్ ఆటో నడుపుతూ ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కాగా.. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రేగు పండ్ల కోసం వెళ్లి..● బావిలో పడి విద్యార్థి మృతి వీణవంక: రేగు పండ్లు తెంపుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈర్నాల శ్రీనివాస్–శారద దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు రాజు(11) ఉన్నారు. రాజు స్థానిక పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. మంగళవారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా.. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద రేగు పండ్ల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రాజు కనిపించకపోవడంతో.. రాజు కోసం వెతికారు. కొలిపాక శ్రీనివాస్ అనే వ్యక్తి బావిలో అదే రోజు అర్ధరాత్రి శవమై కనిపించాడు. విద్యుత్ మోటార్ల సాయంతో బుధవారం వెలికితీశారు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి విద్యార్థి దహన సంస్కారాలకు రూ.10వేలు అందజేశారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అరవింద్నగర్లో బుధవారం మహిళ మెడలోంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రెండు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేసరికే దొంగలు పారిపోయారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. -
ఓటు వేసేందుకు కర్నాటక నుంచి రాక
● ఆదర్శంగా మారిన యువ ఇంజినీర్ జయాకర్ రాజు కోల్సిటీ(రామగుండం): కర్నాటక రాష్ట్రంలో పనిచేస్తున్న ఓ యువ ఇంజినీర్ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించడానికి రెండురోజులు సెలవుపెట్టి తన ఇంటికి వచ్చాడు. గోదావరిఖని రమేశ్నగర్కు చెందిన జయాకర్రాజు కర్నాటక రాష్ట్రంలోని స్టాల్ప్లాంట్లో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. రోజూ దినపత్రికలు చదవడం అలవాటు ఉన్న జయాకర్రాజుకు రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని తెసింది. గోదావరిఖనిలోని తన మిత్రుల ద్వారా ఎన్నికల వివరాలు సేకరించాడు. ఓటుహక్కును ఎన్నికల్లో వినియోగించుకోవడానికి గోదావరిఖనికి వచ్చాడు. బుధవారం జవహార్నగర్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేశాడు. తనవంతు బాధ్యత నిర్వర్తించాని తెలిపాడు. ఎక్కడ పనిచేస్తున్నామన్నది ముఖ్యం కాదని, మన ప్రాంత అభివృద్ధికి మన ఓటు ఎంతో కీలకమన్నారు. ఓటు వేసిన జయాకర్ రాజు -
ఎమ్మెల్యే గంగులపై రెండు కేసులు నమోదు
కరీంగనర్క్రైం: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో త్రీటౌన్ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా ఇందులో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై రెండు కేసులు ఫైల్ అయినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. సీపీ వివరాల ప్రకారం నగరంలోని కిసాన్నగర్లో లోకిని జంపయ్య నుంచి రూ.47వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పోలీసుస్టేషన్కు తరలిస్తుండగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోక్యం చేసుకొని, విధులకు ఆటంకం కలిగించారని, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించుకుని వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గంగులతో పాటు కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, బెజుగం మధుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదే ప్రదేశంలో సమావేశం నిర్వహించి ఓట్లు వేయాలని ఎమ్మెల్యే గంగుల కోరారని, ఈ ఘటనలో గంగులతో పాటు ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిలపై మరో కేసు నమోదు చేశామన్నారు. కుర్ర తిరుపతి వద్ద రూ.44,500 నగదు పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. -
వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆందోళన
వేములవాడ: పట్టణంలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి పోలింగ్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కృష్ణవేణి మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఎస్సై బీఆర్ఎస్ నాయకులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరిని 100 మీటర్ల దూరంలో ఉంచేశారు. 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఆయన సతీమణి మరొకరి ఐడీ కార్డు మెడలో వేసుకుని పోలింగ్ ఏజెంట్గా కూర్చుని ప్రచారం చేసిందని.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోట రాజు ఆరోపించారు. పోలీసులు విచారణ చేపట్టి ఆమెను బయటకు పంపించి వేశారు. కోడ్ ఉల్లంఘించిన ఇద్దరిపై కేసు వేములవాడలోని 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మారం కుమార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున వారి దంపతులపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. పోలింగ్స్టేషన్లో తన తరఫున ఉన్న ఏజెంట్ ఐడీ కార్డును ఆయన సతీమణి వేసుకుని ఉండడం, పోల్ చీటి వెనుక భాగంలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ముద్రించిన అంశంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి దంపతులపై కేసు -
భీమన్న గుడిలో మహాజాతర
వేములవాడ: మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈ యేడు భీమన్న ఆలయంలో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఈసారి భీమేశ్వరస్వామి ఆలయంలోనే శివరాత్రి మహాజాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో తొలిసారి రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శనాలు, మొక్కులకు భీమన్న ఆలయానికి గత అక్టోబర్ 11న మార్చారు. దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు ప్రచారరథంలో స్వామి వారిని దర్శించుకుని, భీమన్న గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఉన్నందున భీమన్న ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాజన్న ఆలయ చరిత్రలోనే మొదటిసారి ఉత్సవాల వేదిక మారింది. భక్తుల సౌకర్యమే లక్ష్యం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయం మరింత వైభవంగా రూపుదిద్దుకునే దిశగా రూ.150కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులతో ప్రధాన ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ, భద్రత సమస్యల దృష్ట్యా భీమన్న ఆలయాన్ని జాతర వేదికగా ఎంపిక చేశారు. ఆమేరకు గత డిసెంబర్ 30న జాతర సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గుడి చెరువు పార్కింగ్ స్థలంతోపాటు భీమన్న ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లు, క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనాలు ఇలా.. ● ఈనెల 14, 15, 16 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాజరాజేశ్వరస్వామికి ఏకాంతంగా సేవలు నిర్వహిస్తూనే భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్శర్మ తెలిపారు. భీమన్న ఆలయంలో... ● 14న ఉదయం 7.30 గంటలకు టీటీడీ ఆధ్వర్యంలో పట్టువస్త్రాల సమర్పణ. ● 15న ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టువస్త్రాల సమర్పణ. ● 14న రాత్రి 11.30 నుంచి 15న తెల్లవారుజాము 3.30 గంటల వరకు పట్టణ ప్రజలకు దర్శనాలు. ● 15న ఉదయం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శనాలు. ● 15న సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివదీక్షా స్వాములకు దర్శనాలు. ● 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనువంశిక అర్చకుల ఆధ్వర్యంలో మహాలింగార్చన. ● 15న రాత్రి 11.35 గంటల నుంచి లింగోద్భవ కాలంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. కొనసాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు ఏర్పాట్లు చేసిన అధికారులు ఈనెల 14 నుంచి ఉత్సవాలు మహా శివరాత్రి జాతర మహోత్సవాలను ఈసారి భీమేశ్వరాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు పనులు పరిశీలించాం. వివిధ శాఖలకు అప్పగించిన పనులపై సమీక్షిస్తూ పరిశీలిస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. – గరీమా అగ్రవాల్, కలెక్టర్, ఉత్సవ కమిటీ చైర్పర్సన్ -
పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్
కొత్తపల్లి(కరీంనగర్): జిల్లాలోని మున్సిపాలిటీలకు ఈ నెల 11న జరిగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ ఆదేశించారు. కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, డీటీఆర్ల వద్ద సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా గురించి నివేదిక తయారు చేయాలన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాబాట కార్యక్రమాలన్నీ మంగళవారం, శుక్రవారం తమ సెక్షన్ పరిధిలోని సిబ్బందితో నిర్వహించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. 1912 నంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, తిరుపతి, చంద్రమౌళి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, ఏవోలు, ఏఏవోలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
సహకార ఎన్నికలు ఎప్పుడో ?
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇన్చార్జి అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం అధికారులకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇన్చార్జి అధికారుల పాలనతో రైతులకు సరైన సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎన్నికలు ముగిసి, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని రైతులు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గాలు ఉన్నప్పుడే యూరియా, విత్తనాలు, రుణాలు వంటి సేవలకు ఆటంకం లేకుండా అందుతాయని వారు పేర్కొంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 60వేలకు పైగా రైతులు వాటాధనం కలిగి ఉన్నారు. ఇన్చార్జి అధికారులకు ఇబ్బందులు జిల్లాలో సహకార ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. కొలువుదీరిన పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు గడిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు పోకుండా ఆరు నెలలపాటు వారి పదవీకాలం పొడగించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీకాలం ముగియగా, 2025 ఆగస్టు వరకు ఒకసారి, అనంతరం మరో ఆరునెలలు పొడగించింది. డిసెంబర్ 19న పాలకవర్గాలను తొలగించి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. రెండు నెలలుగా అటు మాతృసంస్థలలో విధులు నిర్వర్తిస్తూ ఇటు ఇన్చార్జి సేవలను అందిస్తున్నారు. ఒక్కో అధికారికి నాలుగు సహకార సంఘాల బాధ్యతలను అప్పగించారు. రబీలో సమస్యలపై స్పందన ఏదీ.. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. ఎరువులు, యూరియా విత్తనాల సరఫరాపై సహకార ఉద్యోగులు, సిబ్బందికి సరైన మార్గనిర్దేశం చేసే వారులేరని రైతులు అంటున్నారు. మరోవైపు రుణాల రికవరీ వెనుకబడిందని తెలుస్తోంది. రుణాల మంజూరు, ఇతర సేవలు మందగించాయని సంఘ సభ్యులైన రైతులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై సమీక్షించే వారు లేరు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా సింగిల్విండోలకు నామినేటెడ్ ద్వారా పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు పోకుండా నామినేషన్ పద్ధతి ద్వారా పాలకవర్గాలను నియమిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉన్న సంఘాలను మరింత విస్తరిస్తారని ఆ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. 20 ఏళ్ల క్రితం మండలానికి మూడు నుంచి నాలుగు సంఘాలు ఉండేవి. ఇప్పుడు కూడా సంఘాలను విస్తరించడంతోపాటు కొత్తగా ఏర్పడిన మండలాల్లో కూడా సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అలా వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ అర్బన్ సంఘాలను ఏర్పాటు చేయవచ్చు. ఇల్లంతకుంటలో మరో రెండు సంఘాలు వచ్చే అవకాశం ఉంది. -
ఆధ్యాత్మికం.. గిరి ప్రదక్షిణం
గిరిప్రదక్షిణలో భక్తులుకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంమల్యాల: భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ప్రసిద్ధికి తోడు.. గిరి ప్రదక్షిణ మరింత ఆధ్యాత్మికతకు బాటలు వేస్తోంది. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి పౌర్ణమికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రహదారి అభివృద్ధికి కూడా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గిరి ప్రదక్షిణ చేసేవారు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవాలన్న నియమం లేకపోవడంతో సగం మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్తుండడంపై కొందరు భక్తులు ఆక్షేపిస్తున్నారు. అదే సమయంలో కొండగట్టు ఆలయం ఆధ్వర్యంలోనే గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రతిపౌర్ణమికి వేలాదిమంది కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి పౌర్ణమికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి అనుబంధం లేకుండా గతేడాది హైదరాబాద్లోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ యాత్రను చిలుకూరి బాలాజీ అర్చకులే ప్రారంభిస్తున్నారు. ఆలయ ప్రాశస్త్యంపై గిరి ప్రదక్షిణ ప్రభావం భక్తుల గిరి ప్రదక్షిణతో కొండగట్టు ఆలయ ప్రాశస్త్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అయితే స్వామివారిని దర్శించుకోవాలనే నియమం లేకపోవడంతో భవిష్యత్లో ఆలయ ప్రాశస్త్యంపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి దిగువ కొండగట్టులోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రారంభించి.. అక్కడే ముగించడంతో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గిరి ప్రదక్షిణ కొండగట్టు ఆలయానికి సంబంధం లేకుండా కొనసాగిస్తే భవిష్యత్లో ఆలయ ప్రాశస్త్యం, అంజన్న భక్తుల మనోభావాలపై ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి భక్తుల ఆక్షేపణ కొండగట్టు ఆలయానికి సంబంధం లేకుండా గిరి ప్రదక్షిణ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని ఆంజనేయస్వామి భక్తులు ఆక్షేపిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో సుమారు ప్రతి పౌర్ణమికి వేయి మందికిపైగా పాల్గొంటున్నా.. వారిలో స్వామివారి దర్శనానికి వెళ్లేవారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకునేలా కార్యక్రమాన్ని రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వైజంక్షన్ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభంతో మేలు.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని వైజంక్షన్ వద్ద గిరి ప్రదక్షిణను ఆలయ అర్చకులు ప్రారంభించడం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని.. స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. దిగువ కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రారంభించడంతో ఆలయ సమీపం నుంచి ఆరు కిలోమీటర్లు కాలినడక గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరోసారి మూడు కిలోమీటర్ల దూరంలోని స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గిరి ప్రదక్షిణ..ఆధ్యాత్మికతకు బాట.. గిరి ప్రదక్షిణ ప్రజల్లో మరింత ఆధ్యాత్మికత పెంపొందించేందుకు తోడ్పాటునందిస్తోంది. రోజురోజుకూ గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో రహదారి అభివృద్ధికి ఇటీవల కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయె
● 12 నుంచి ప్రారంభం.. 15న స్వామివారి కల్యాణం ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 12న నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకిస్తారు. గురువారం ప్రత్యేక అర్చకులు దూపం వీరభద్రయ్య ఆధ్వర్యంలో అగ్రోదకం, కృద్రాచరణం, శ్రీమహాగణపతిపూజ, గౌరీపూజ, శివపుణ్యహావచనం, నాంది సమారాధానం, రుత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, హారతి, మంత్రపుష్పం, సాయంత్రం ధ్వజారోహణం, తీర్థప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. 13న ఉదయం బలిహరణ, దృష్టి కుంభోత్సవం, స్థాపిత మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, రుద్రహవనం నిర్వహిస్తారు. ఉదయం 10ః30గంటలకు భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణం జరుగుతుంది. స్వామివారి కల్యాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. 14న నాకబలి, గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 నుంచి సాయంత్రం 4గంటల వరకు సామూహిక రుద్రాభిషేకం, రాత్రి 8గంటలకు రథోత్సవం, రాత్రి 11ః45గంటలకు మహాహారతి, సాంస్రృతిక కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆలయ ఆలయ సిబ్బంది వివరించారు.బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో 12 నుంచి మహాశివరాత్రి వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు రానున్న భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు నీడ, ప్రత్యేక పూజలు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాం. భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – బి.సదయ్య ఆలయ ఈవో, ఓదెల -
సింగిల్విండోల ఎన్నికలు నిర్వహించాలి
సింగిల్విండోల పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తోంది. ఇప్పుడు ప్రత్యేకాధికారులను నియమించారు. రైతులకు సత్వర సేవలు అందాలంటే ఎన్నికలను నిర్వహించాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి. – మెంగని శ్రీనివాస్, రైతు, మొర్రాయిపల్లిప్రస్తుతం సహకార సంఘాలకు ఇన్చార్జి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఆదేశాలు, నోటిఫికేషన్కు ముందే ఏర్పాట్లు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కొత్త సంఘాల ఏర్పాటుకు నిర్ణయం జరగలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘాలను నిర్వహిస్తాం. – రామకృష్ణ, జిల్లా సహకార అధికారి -
సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనకు చెంప పెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు ద్వారా అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ‘సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ’ అనే బీజేపీ నినాదానికి అనుగుణంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘ప్రజలారా! రేపు జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తెలంగాణలో మార్పునకు సంకేతం కావాలి. అవినీతి, అరాచకాలు, మోసపూరిత హామీలతో అడ్డగోలు పాలన చేస్తున్న కాంగ్రెస్ పాలకులకు చెంప పెట్టు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పాలనలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, తిట్ల దండకాలు, తప్పుడు హామీలు, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. బీజేపీ మాత్రమే స్పష్టమైన ఎజెండా, అభివృద్ధి కార్యాచరణతో ఎన్నికల్లో పాల్గొంటోంది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధులవల్లేనని గుర్తుంచుకోండి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు నయాపైసా ఇయ్యలేదు. ఇప్పుడు ప్రజల ముందున్న దారి ఒక్కటే. అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీకి బలమైన హెచ్చరిక జారీ చేయాలి. తెలంగాణను దోచుకుతిన్న బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మొలవకుండా బొందపెట్టాలి. ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త..! బీఆర్ఎస్, కాంగ్రెస్ను నమ్మితే అధోఃగతే. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, మున్సిపాలిటీల్లో నిజమైన పాలన రావాలంటే, అవినీతి రహిత పరిపాలన కావాలంటే.. కమలం గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. సేవ్ తెలంగాణ.. ఓట్ ఫర్ బీజేపీ’ అని పిలుపునిచ్చారు. -
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు
జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్ బీఫామ్లు తెచ్చుకుని.. కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇసుక లారీ పట్టివేతఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్ శంకర్, డ్రైవర్ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజీలో టాస్క్ ఆధ్వర్యంలో డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే అంశంపై మూడురోజుల వర్క్షాప్ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్ ప్రోగ్రామింగ్ విత్ ఎస్ క్యూ ఎల్కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్ పర్సన్ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏవో పవన్కుమార్, అకడమిక్ ఇన్చార్జి ఇజాజ్ఖాన్, హెచ్వోడీ శశికాంత్, నవ్య, షాకీర్, శిరీష పాల్గొన్నారు. -
బీజేపీ వల్లే ఆకాశానికి బంగారం, వెండి ధరలు
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లే బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు పెట్టే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని కట్టరాంపూర్లో 10,11వ డివిజన్ల అభ్యర్థులు ఆకుల నర్మద, కొడూరి రవీందర్గౌడ్లకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ను గెలిపిస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కాగా ప్రచారం గడువు ముగుస్తున్న తరుణంలో వచ్చిన శ్రీధర్బాబు, సరిగ్గా సాయంత్రం 5 గంటలకు తన ప్రసంగాన్ని ముగించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవేత్తకు డాక్టరేట్
పట్టా అందుకుంటున్న శేఖర్ కరీంనగర్రూరల్: ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పని చేసిన కల్వల శేఖర్కు వ్యవసాయ విద్యలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ సాత్నకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రభు పింగళి పట్టాను అందించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పని చేస్తున్న శేఖర్.. ఉత్తర తెలంగాణలోని నేలల్లో అధిక భాస్వరం తగ్గించి చేసే యాజమాన్య పద్ధతులు, ప్రధాన పంటలను ప్లాంటర్తో ఎత్తు మడుల్లో సాగు చేస్తే అధిక వర్షాలు, తేమ తక్కువగా ఉన్న సందర్భాల్లో కలిగే పంట నష్టాలను కచ్చితంగా తగ్గించొచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫ్రొఫెసర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురించారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నవంబర్– 2025లో జరిగిన యూజీ (సీబీసీఎస్) (ఆర్19) మొదటి సెమిస్టర్ (బ్యాక్లాగ్), మూడవ, ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. www. satavahana. ac. in వెబ్సైట్లో ఫలితా లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతిచెందాడు. టౌన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన అన్న వరుణ్ (26) సోలార్ సిస్టం కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటిపై సోలార్ సిస్టం అమర్చేందుకు స్లాబ్పైకి ఎక్కిన క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లే 11 కేవీ వైర్లు తాకి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన ఇంటి యజమాని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మేడిపల్లి: బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తొంబర్రావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. తొంబర్రావుపేటకు చెందిన సంగ రాజు (52) కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కుమారుడు రమేశ్, కూతురు ధరణి ఉన్నారు. సంగ రాజు భర్త చిన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం నిల్వలు
● పట్టుకున్న ఎంఐఎం కార్యకర్తలు జగిత్యాలక్రైం/ జగిత్యాలలోని ఓ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్లు డంప్ చేస్తుండగా ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంఐఎం కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకుని పరిశీలించి వెళ్లిపోయారు. సదరు అభ్యర్థి ఇంట్లోకి వెళ్లకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోచీబజార్లో మద్యం పట్టివేత పట్టణంలోని మోచీబజార్లో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. రూ.3,250 విలువైన 13 లీటర్ల మద్యాన్ని ఇంట్లో ఉంచగా.. పోలీసులు పట్టుకున్నారు. అరవింద్నగర్కు చెందిన ఒకరి ఇంట్లోనుంచి రూ.3వేల విలువైన 2.5లీటర్ల మద్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. -
ఓటిక్కడ.. కేంద్రం అక్కడ
కరీంనగర్రూరల్: మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ఓటర్లకు భారంగా మారింది. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటరు జాబితా ప్రకారం సమీపంలోని పోలింగ్స్టేషన్లో ఓటు వేసే సౌకర్యం కల్పించాల్సి ఉండగా అధికారులు దూరంగా ఉన్న మరో స్టేషన్ను కేటాయించడం వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ అధికారులకు స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఓటర్లకు దూరభారంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్లో దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలను విలీనం చేసి 4,5వ డివిజన్లుగా విభజించారు. 4వ డివిజన్లోని గోపాల్పూర్ ఓటర్లకు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని విస్మరించి 2 కిలోమీటర్ల దూరంలోని దుర్శేడ్ జెడ్పీ స్కూల్లో పోలింగ్ కేంద్రం కేంటాయించారు. అలాగే దుర్శేడ్లోని సుమారు 760మంది ఓటర్లకు స్థానిక జెడ్పీ స్కూల్లో కేంద్రం కేటాయించకుండా గోపాల్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో కేటాయించారు. దీంతో రెండు గ్రామాల ఓటర్లు ఓటేసేందుకు నాలుగైదు కిలోమీటర్లు దూరం పోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, 5వ డివిజన్ పరిధిలోని దుర్శేడ్కు చెందిన సుమారు 500 మంది ఓటర్లకు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో కాకుండా దాదాపు 5కిలో మీటర్ల దూరంలోని బొమ్మకల్ రజ్వీచమన్లో ఐక్యుర జెమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ను కేటాయించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేసేందుకు ముందుకువచ్చే అవకాశం లేకపోవడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కుటుంబ సభ్యులతో కలిసి..
హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నా. ఓటరుగా గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటా. భారత పౌరుడిగా ఓటును సద్వినియోగం చేసుకునే అవకాశం తొలిసారిగా వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేస్తా. – రాచమల్ల అభిలాష్, అశోక్నగర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉ ద్యోగం చేస్తున్నా. ఓటు హక్కు రావడమే కాదు.. దాన్ని సద్వి నియోగం చేసుకోవడం కూడా గొప్ప విషయమే. గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారిగా ఓటు వినియోగించుకుంటున్నా. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ఓటేస్తా. వారిలో అవినీతి ఉండదు. – వాసాల స్నేహ, సాయినగర్ -
ఐదేళ్లలో గ్రేటర్ కరీంనగర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘కరీంనగర్ కార్పొరేషన్ను ఐదేళ్లలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తాం.. కరీంనగర్కు త్వరలో రానున్న ఔటర్ రింగ్రోడ్డుతో నగర రూపురేఖలు మారనున్నాయి. సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. ప్రతీ ఇంట్లో కాంగ్రెస్ ప్రజాపాలన లబ్ధిదారులు ఉండటం మాకు కలిసి వచ్చే అంశం. అందుకే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 50పైగా సీట్ల తో విజయదుందుబి మోగిస్తాం. మజ్లిస్ పార్టీతో మాకు ఎలాంటి పొత్తు లేదు. ముస్లింలు, దళితులు మా సంప్రదాయ ఓటు బ్యాంకు. వారెప్పుడూ మాతోనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ–బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో చేతులు కలిపాయి. కాంగ్రెస్ను ఓడిచేందుకు కరీంనగర్లో గంగుల– బండి జతకలిశా రు. అయినా మా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ‘సాక్షి’తో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ అన్నారు. స్మార్ట్సిటీ పేరిట దోపిడీ నగరంలో స్మార్ట్సిటీ పేరిట రూ.వందల కోట్లు ప్రజాధనం దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి సంజయే చెప్పారు. తీవ్ర అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను, అవినీతి అనకొండలను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారు?. బీఆర్ఎస్– బీజేపీ చేతులు కలిపాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అందుకే, ఇద్దరు కలిసినా హస్తం పార్టీని ఓడించలేరని బండి సంజయ్, గంగుల కమలాకర్కు సవాలు విసురుతున్నా. ఆ రెండు పార్టీల్లో కార్పొరేటర్లు బెయిల్ మీద ఉండి పోటీ చేస్తుండటం బీజేపీ– బీఆర్ఎస్ అవినీతి విధానాలకు అద్దం పడుతోంది. మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతె న నిర్మాణాల్లో లోపాలు, ఖర్చులో అవకతవకలపై విచారణ జరిపిస్తాం. అధ్యయనం అనంతరం ప్రాజెక్టులను పునరుద్ధరిస్తాం.నగరంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తాం. ముఖ్యంగా గత పాలకమండలి ముస్లిం, దళితవాడలలో సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. నగరాభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కీలక పాత్ర పోషించనుంది. ఔటర్ వెలుపల ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు వచ్చి, వలసలు పెరుగుతాయి. ఐదేళ్లలో ఇప్పుడున్న 4లక్షల జనాభా కాస్తా.. 6 నుంచి 7 లక్షలు దాటుతుంది. నగర ఆర్థికాభివృద్ధి కూడా మెరుగుపడగానే.. గ్రేటర్ నగరంగా అప్గ్రేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి మాటిచ్చినట్లుగా డంపింగ్యార్డు సమస్య తీరుస్తాం. నగరం మొత్తానికి 24 గంటల తాగునీరు అందజేస్తాం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవించేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను తీర్చిదిద్దాం. సోనియా సైనికులుగా, సీఎం రేవంత్ అనుచరులుగా కరీంనగర్ బల్దియాపై మూడురంగుల జెండా ఎగరేస్తాం. -
శ్రీచైతన్య విద్యార్థులకు ఘన స్వాగతం
కరీంనగర్టౌన్: మంకమ్మతోటలోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ విద్యార్థులకు కరీంనగర్లో ఘన స్వాగతం లభించింది. కళాశాలకు చెందిన బి.సంధ్య, కె.అజయ్ అనే విద్యార్థులు 2026 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపునకు ఎన్నికయ్యారు. సుమారు 40 రోజులపాటు శిక్షణ పొంది జనవరి 26న రాష్ట్రపతి, దేశ ప్రధాని సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కళాశాలకు చెందిన సంధ్య కర్తవ్యపత్ ర్యాలీలో, అజయ్ పీఎం ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం క్యాంప్ పూర్తి చేసుకొని వచ్చిన ఆ ఇద్దరితో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు 9టీ బెటాలియన్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక పరేడ్లో తమ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సన్మానం చేసి యాజమాన్యం తరఫున రూ.25,000 చొప్పున నగదు బహుమతి అందజేసినట్లు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణారెడ్డి, ఎన్సీసీపీఐ స్టాఫ్ పి.అశోక్, కేర్ టేకర్ జి.రాజేందర్, 9 తెలంగాణ బెటాలియన్ సుబేదారు విజయ్కుమార్, హవల్దార్ పీవీరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఉన్నత చదువుకు ‘అంబేడ్కర్ విద్యానిధి’
● దళిత విద్యార్థులకు చక్కని అవకాశం ● రూ.20లక్షల వరకు రుణం పొందే చాన్స్ ● పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం కరీంనగర్టౌన్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం ఓ వరంగా మారింది. చదువుపై శ్రద్ధాశక్తులు ఉండి చేతిలో డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 210 మంది విద్యార్థులకే సాయమందించింది. ఇటీవల ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు చదివే కోర్సు ఫీజులను బట్టి గరిష్టంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థి వివరాలను పూరించి సంబంధిత ధ్రువపత్రాలను జేపీజీ ఫార్మాట్లో జతపర్చాలి. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. జీఆర్ఈ/జీమ్యాట్లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి విదేశీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రవేశ లేఖ ఆధారంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందజేస్తారు. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ధ్రువపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకుంటే సాయం నిలిచిపోతుంది. కావాల్సిన ధ్రువపత్రాలు పాస్పోర్టు సైజ్ ఫొటో, బోనాఫైడ్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, స్థానికత ఽధ్రువపత్రం, పదోతరగతి మెమో, చివరి కోర్సు మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్, జీఆర్ఈ/జీమ్యాట్/ఇతర స్కోర్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ, పాస్పోర్టు కాపీ. కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల్లోపు ఉండాలి. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జీఆర్ఈ/జీమ్యాట్లో అర్హత మార్కులు సాధించాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు. దరఖాస్తు గడువు మార్చి 31. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవచ్చు. -
తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ
గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం భూస లక్ష్మణ్, తెలుగు సబ్జెక్టు టీచర్ శివకుమార్ పాల్గొన్నారు. అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం -
పుర.. పలోభాల ఎర!
కరీంనగర్టౌన్: మున్సిపల్ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. పోలింగ్కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉండడంతో ఇక రాజకీయ సీన్ రసవత్తరంగా మారబోతోంది. ఓటర్లే లక్ష్యంగా అన్ని రకాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు బహిరంగ ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు గడువు ముగియడంతో అంతర్గత ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రచారాల జోరు ఇదిలా ఉండగా కాంగ్రెస్కు సీఎం రేవంత్రెడ్డి చొప్పదండిలో ప్రచారం నిర్వహించగా, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు విస్త్రృత ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ అన్నీ తానై ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని సుడిగాలి పర్యటన చేశారు. మాజీ ఎంపీ, సినినటీ నవనీత్కౌర్ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్షాన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, పంజాల శ్రీనివాస్, ఏఐఎఫ్బీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి అంబటి జోజిరెడ్డి, బీఎస్పీ పక్షాన ఎంపీ సుందర్పాల్ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. బహిరంగ ప్రచారానికి తెర మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. రోడ్షోలు, ఇంటింటా ప్రచారాలు, మైక్లు, లౌడ్ స్పీకర్లతో ఎన్నికల ప్రచారం రక్తికట్టింది. బహిరంగ ప్రచారం ముగియడంతో అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలిసి ఓటు కోసం ప్రాధేయపడనున్నారు. గంపగుత్తగా కుల సంఘాల ఓట్లను సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఓటర్లను నయానో, బయానో ఒప్పించి వారి మద్దతు కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఎన్నికలకు ఒక్కరోజు గడువు ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. మందు, విందు, వినోదాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు జరిగాయి. మద్యం పంపిణీకి అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ప్రచారం పరిసమాప్తం -
సంతోషంగా ఉంది
హైదరాబాద్ నారాయణ గూడలోని ఆర్బీవీఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఓటు మన జన్మ హక్కు. దాన్ని సద్విని యోగం చేసుకుంటా. అవినీతిపరులకు కాకుండా అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేస్తా. – ఆవుదరి సిరిచందన, రాంనగర్ హైదరాబాద్లోని ఓరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నా. గత సంవత్సరం ఓటు నమోదు చేయించుకున్నా. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వినియోగించుకోనున్నాను. మనది ప్రజాస్వా మ్య వ్యవస్థ. కీలకమైనది, అత్యంత విలువైనది దేశం కల్పించిన హక్కు ఓటు. ఓటు సక్రమంగా వినియోగిస్తే నిజాయితీపరులు ఎన్నికవుతారు. – పల్లెర్ల స్నేహిత, అశోక్నగర్ గచ్చిబౌలిలోని నియట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఓటేయడం ఎంతో ముఖ్యం. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ.. అభివృద్ధి కోసం, ప్రజలకు స్వార్థం లేకుండా సేవలందించాలనే ఉద్దేశంతో పోటీలో నిలబడిన వారిని గుర్తించి ఓటెయ్యాలి. – నరాల సాయి మనుహార్ష్ -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
కరీంనగర్ క్రైం: జిల్లాలో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ గౌస్ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడంపై నిషేధం విధించినట్లు తెలి పారు. కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈనెల 10న ఉదయం 6 గంటల నుంచి 12న ఉద యం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఏదైనా చట్టబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్: ఆదరించి గెలిపిస్తే ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మాజీ మేయర్, బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్రావు అన్నారు. సోమవారం 42వ డివిజన్ భగత్నగర్లో విస్తృత ప్రచారం చేశారు. వివేకానందస్కూల్, అయ్యప్ప టెంపుల్, గోదాంగడ్డ మెయిన్రోడ్డు, గోదాం గడ్డ వాటర్ట్యాంక్, సాయికృష్ణ థియేటర్ తదితర ప్రాంతాల్లో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాననే భరోసా కల్పిస్తుండటంతో ఓటర్లు వారి వైపు మొగ్గుచూపుతున్నారు. చైతన్య, ఆదర్శ, జై భీమ్, మహాదేవ యూత్ క్లబ్ సభ్యులు, భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, డివిజన్ పెద్దలు, మహిళలు, పార్టీ శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్: మున్సిపల్ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్, అదనపు కలెక్టర్ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అధికారులు ఎం.మనోహర్, సయ్యద్, ముసాబ్ అహ్మద్, మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే తాను ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని ఓ అభ్యర్థి వినూత్న ప్రచారం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. కరీంనగర్ నగరపాలక పరిధిలోని 17వ డివిజన్ (కొత్తపల్లి) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేముల కవిత చంద్రశేఖర్ రూ.100 బాండ్ పేపర్పై హామీలు ఇస్తూ సోమవారం స్థానిక ప్రజలకు ఒప్పంద పత్రం రాసిచ్చారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే సొంత నిధులతో డివిజన్లోని ప్రతీ ఆడబిడ్డ వివాహానికి కానుకగా రూ.10,116, డివిజన్లో ఆడబిడ్డ జన్మిస్తే రూ.10,116 ఫిక్స్డ్ డిపాజిట్, ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారానికి రూ.5,016 అందజేస్తానంటూ ఒప్పంద పత్రాన్ని విడుదల చేశారు. హామీల బాండ్ పేపర్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ పలువురు స్వాగతిస్తున్నారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రంగా కరీంనగర్ ఎస్సారార్ కళాశాలను నిర్ణయించినందున ఈ నెల 10 నుంచి 13 వరకు కళాశాలకు సెలవులు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా కళాశాల ప్రాంగణంలోకి విద్యార్థులను అనుమతించబడరని, గమనించాలని పేర్కొన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీలు
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్టౌన్: బీజేపీ, కాంగ్రెస్లు అభివృద్ధి నిరోధక పార్టీలని, అభివృద్ధి కావాలో, విధ్వంసం కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం 21,47వ డివిజన్ల అభ్యర్థులు చల్లా హరిశంకర్, స్వరూపారాణిలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు జనరంజక పాలన సాగించామని గుర్తు చేశారు. కులాల పేరిట పెనుగులాటలు, మతాల పేరిట మారణహోమాలు, వర్గాల పేరిట విభజించి పాలించడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. అనంతరం 17,18వ డివిజన్ల అభ్యర్థులు రుద్ర నవిత, జమీలోద్దిన్కు మద్దతుగా ప్రచారం చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్, బీజేపీలు 2 రూపాయల అభివృద్ధి చేయలేదని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు, సెంటిమెంట్తో ఓట్లు దండుకునే బీజేపీకి ప్రజల చీత్కారం తప్పదని హెచ్చరించారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు డబ్బుల సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారని, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అలాగే 16,37,4,5వ డివిజన్ల అభ్యర్థులు బెజ్జంకి అయిలయ్య, గాదె స్వరూప, రామచంద్రం తదితరులకు మ ద్దతుగా రోడ్ కార్నర్ నిర్వహించారు. హరీశ్రావు, రుద్ర రాజు, శ్రీనివాస్, శ్రీనివాస్గౌడ్, గంగాధర చందు, మల్లేశం పాల్గొన్నారు. -
మా నాన్నను కాపాడండి
చందుర్తి(వేములవాడ): రెక్కాడితేనే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఈ కుటుంబాన్ని కొద్ది రోజులుగా విధి వెంటాడుతోంది. పది నెలల క్రితం తల్లి కేన్సర్తో మృతిచెందగా.. ఇప్పుడు తండ్రి గుండె సంబంధిత వ్యాధితో ప్రభుత్వాస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఖరీధైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబానికి అండగా నిలిచే దిక్కులేక ఆ ఇంటి పెద్దబిడ్డ తన తండ్రిని కాపాడాలని వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన మ్యాదరి విజయ, లక్ష్మణ్ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు పావని(16), కుమారులు నితిన్(12), రిషిత్(10). ఈ దంపతులు ఇద్దరు కూలీ పనిచేసి జీవించేవారు. గతేడాది తల్లి విజయకు నోటి కేన్సర్ వచ్చింది. వ్యాధి ముదిరి 10 నెలల క్రితం మృతిచెందింది. తండ్రి అన్నీతానై పిల్లలను సాదుకుంటున్నాడు. ఈక్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. రెండు రోజులుగా మంచం పట్టడంతో 16 ఏళ్ల కూతురు పావని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి గుండె పంపింగ్ సరిగ్గా లేదని.. ఇక్కడ వైద్యం చేసేందుకు సౌకర్యాలు లేవని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది చెప్పారు. అయితే ఎలాంటి దిక్కులేని ఆ కుటుంబం చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వాస్పత్రిలో తండ్రి మంచం పక్కన కూర్చొని ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరైనా దాతలు సాయం చేసి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటుంది. దాతలు 95423 96066లో సంప్రదించి, ఆదుకోవాలని కోరుతుంది. పది నెలల క్రితం కేన్సర్తో తల్లి మృతి నేడు ప్రాణాపాయ స్థితిలో తండ్రి ఆదుకోవాలని వేడుకుంటున్న కూతురు -
కరీంనగర్
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026I‘అంబేడ్కర్ విద్యానిధి’ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం వరంగా మారింది. డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది. పత్తి మార్కెట్కు సెలవుజమ్మికుంట: స్థానిక మార్కెట్లో సోమవారం క్వింటా ల్ పత్తి రూ.7,750 పలికింది. ఎన్నికల సందర్భంగా మంగళ, బుధవారాలు మార్కెట్కు సెలవు ఉంటుందని చైర్పర్సన్ స్వప్న, కార్యదర్శి రాజా తెలిపారు.ఆకాశం నిర్మలంగా ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి. -
నిరుద్యోగులకు అండగా కోడింగ్ ట్యూటర్
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు కోడింగ్ ట్యూటర్ అండగా ఉంటుందని కోడింగ్ ట్యూటర్ నిర్వాహకులు ఫణిరాజ్ జాలిగామ అన్నారు. ఐటీ రంగంలోకి రావాలనుకునే అభ్యర్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులకు కోడింగ్, స్కిల్ మేనేజ్మెంట్పై ఆదివారం కరీంనగర్లోని శ్వేత హోటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఫణిరాజ్ జాలిగామ మాట్లాడుతూ యువతకు ఐటీ రంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతోనే ఐటీ జాబ్మేళా, ఇంటర్న్షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు, గ్రాడ్యుయేషన్ పూర్తయి నాలుగైదేళ్లు గ్యాప్ ఉన్న వారు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కోచింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో కోడింగ్ నేర్చుకునేందుకు ఇంటర్న్షిప్ చేస్తే లాభా లేంటనే అంశంపై వివరించారు. కోడింగ్, స్కిల్స్ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోడింగ్ట్యూటర్ ఆఫీస్కు 9 నెలల పాటు వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. కోచింగ్ పూర్తయిన తర్వాత ఎంప్లాయీమెంట్ రాకపోయినా తమ కంపెనీలోనే అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. -
మౌనమే అయితే..
కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ప్రచారంతో మొదలైన నా వాయిస్ ఓవర్ ప్రయాణం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ విస్తరించింది. ప్రధాన పార్టీలే కాదు.. స్వతంత్ర అభ్యర్థులూ శ్రీఈ వాయిస్ కావాలిశ్రీ అంటున్నారు. రామగుండమే కాదు.. మంథని, మంచిర్యాలలోనే నా గొంతు వినిపించింది. ఎన్నికల ప్రచారానికే కాకుండా.. ఆలయాల ప్రారంభం, బ్రహ్మోత్సవాలు, పుష్కరాలు, సమ్మక్క – సారలమ్మ జాతర, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్యాపార–వాణిజ్య ప్రకటనల వరకూ ప్రత్యక్ష వ్యాఖ్యాతగా, వాయిస్ ఓవర్గా సేవలందించాను. 1986 నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నా. సుమారు 4వేల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. దివంగత సీఎం వైఎస్సార్ హాజరైన 4 బహిరంగ సభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పెద్దపల్లి జిల్లా ఆవిర్భావ సభకు వాయిస్ ఇవ్వడం నా జీవితంలో మైలు రాళ్లు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశా. అరకొర జీతంతోపాటు, కళా రంగం ఇచ్చిన ఆదాయం నా కుటుంబ జీవనాన్ని పెద్దగా ఇబ్బందులు లేకుండా నడిపించింది. ఇప్పుడు రిటైర్ అయ్యాను. అనుభవం, సేవాభావం, అంకితభావం ఉన్న కళాకారులను గుర్తించి, గౌరవంతోపాటు స్థిరమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఎందుకంటే కళాకారుడి గొంతు మౌనమైతే.. చరిత్రే మౌనమవుతుంది. – మేజిక్రాజా, వాయిస్ ఓవర్ కళాకారుడు, గోదావరిఖని -
సుస్థిరం.. రామగుండం
రామగుండం: శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా.. రామగుండం ప్రాంతంలో పర్యటించారని, ఆయన అడుగుజాడలతో జలఊటలు ఏర్పడ్డాయని, అవే రామునిగుండాలు కావడంతో దీనికి రామగుండంగా పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ముడిసరుకుల లభ్యతతో విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మారింది. విద్యుత్ రంగంలో దేశవ్యాప్త ఖ్యాతి గడిచింది. భిన్నవర్గాల ఓటర్ల సమ్మేళనంగానూ అవతరించింది. రామగుండంలో ఒకే రైల్వేస్టేషన్ ఉన్నా.. గోదావరిఖనిలో పోలీస్ కమిషరేట్, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. వాటిపేరు రామగుండంపైనే ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం రామగుండం అంటేనే గుర్తింపు లభిస్తుంది. మద్యం పట్టివేతసిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని భావనరుషినగర్లో రామగిరి దిలీప్ అక్రమంగా రూ.4,537 విలువ గల మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. అతడి నుంచి మద్యం సీసాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. -
నేను.. నా పోరాటం
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్మడ్ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ జీవిత చరిత్ర. నక్సలైట్ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్దే కావడం విశేషం. ఎన్కౌంటర్కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్కౌంటర్లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్– మహారాష్ట్ర వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు(57) అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి. ప్రభాకర్ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు.. ● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్స్టేషన్లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు. ● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్వార్లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్, డివిజన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్ వన్పల్లి ఎన్కౌంటర్లో మరణించాడు. కానీ, లోకేటి చందర్రావు అలియాస్ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. ● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. ● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్ జోన్ నుంచి పశ్చిమ సబ్ జోన్కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ప్రభారిగా పనిచేశారు. ● ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు. కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోరాట క్షేత్రంగా ఆత్మకథ పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది. కన్నీటి వీడ్కోలు మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్రావు, మానిక్రావు, నేను చిన్నోడిని చందర్రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్ అయ్యాయని.. రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్కు వచ్చిన హెలీకాప్టర్ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్కౌంటర్లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి. 22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి సోషల్ మీడియాలో వైరల్ -
● వేములవాడలో మాంసం మాయ
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): కార్పొరేషన్ పరిధిలోని ఫెర్టిలైజర్సిటీ(ఎఫ్సీఐ)టౌన్షిప్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ 2000–01 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 25ఏళ్ల రీయూనియన్ సమావేశం ఆదివారం హైదరాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్లో నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వారంతా ఒకేవేదికపైకి చేరారు. బాల్యంలోని స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాలలో గడిపిన మధురమైన క్షణాలను ఆనందంగా పంచుకున్నారు. ఎఫ్సీఐ టౌన్షిప్లో గడిపిన రోజులను శ్రీభూమిపై స్వర్గంశ్రీగా అభివర్ణిస్తూ స్నేహాలు, ఆటలు, ఉత్సాహభరితమైన వాతావరణాన్ని స్మరించుకున్నారు. తరగతి గదులు, ఆటస్థలాలు, గురువుల మార్గదర్శనం, స్నేహితులతో గడిపిన చిరునవ్వుల రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం వారికి అపూర్వమైన ఆనందాన్ని ఇచ్చింది. సభ్యులంతా తమ జీవిత ప్రయాణాలు, వత్తిపరమైన అనుభవాలు, విజయాలను పంచుకుంటూ భవిష్యత్లో ఇలాంటి సమావేశాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. రోడ్డుపై పడిన బండరాయిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ స్టేజీ వద్ద హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై గ్రానైట్ లారీ నుంచి బండరాయి పడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం బొమ్మనపల్లి గ్రానైట్ క్వారీ నుంచి ఆసిఫ్నగర్కు కటింగ్ నిమిత్తం లారీలో తీసుకెళ్తుండగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న కారును తప్పించబోయిన, డ్రైవర్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాయి లారీ నుంచి రహదారిపై పడింది. గ్రానైట్ రాయి పడినచోట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిగురుమామిడి ఏఎస్సై తిరుపతి ఘటనా స్థలానికి వెళ్లి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. గుంతపడిన చోట మట్టితో పూడ్చివేయించారు. వేములవాడ: ఆదివారం అంటే చికెన్, మటన్ ప్రియులు ప్రత్యేకంగా రుచి వైపు మగ్గుతారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ఈ ఆదివారమే చివరిది కావడంతో మటన్, చికెన్ బిర్యాని పొట్లాలతో అభ్యర్థులు తమ వార్డుల్లో హడావుడి చేస్తూ వారి అనుయాయులు, ఓటర్లకు ముందస్తు పండుగ చూపించారు. మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11న జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఇంటింటి ప్రచారంతోపాటు, ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం వేములవాడలోని పలు వార్డుల్లో మటన్, చికెన్ పొట్లాల పంపిణీ జోరుగా సాగింది. ఒకవైపు అభివృద్ధి హామీలు, మరోవైపు సంక్షేమ పథకాల మాటలు వినిపిస్తుండగా మరోవైపు పొట్లాల రాజకీయాలు చర్చకు దారితీస్తున్నాయి. ఓటు వేయించే ముందు కడుపు నింపితే సరిపోతుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయినా ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కాదని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్స్ దగ్గర ఫలితం ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఆదివారం మాత్రం చాలా ఇళ్లలో రాజకీయ రుచితో భోజనాలు జరిగాయని మాత్రం చెప్పొచ్చు. పంపకాలకు ప్లాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఇక అసలు పంపకాలపై దృష్టి సారించనున్నారు. కుల సంఘాలు, యూత్, మహిళా సంఘాలు, గ్రూపులవారీగా పంపకాలు జరిపేందుకు ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: వారంతా బంధువులు. ఒకే కులానికి చెందిన వివిధ పార్టీల నాయకులు. మున్పిపల్ ఎన్నికల్లో మాత్రం వైరివర్గాలుగా మారిపోయారు. ఆయా పార్టీల నుంచి కార్పొరేటర్ స్థానానికి పోటీపడుతున్నారు. నగరపాలకసంస్థలో సం్ఙకులశ్రీ సమరానికి వేదికగా మారింది 23వ డివిజన్. పోటీలో ఉన్న ప్రత్యర్థులంతా మున్నూరుకాపులు కావడమే ఆ డివిజన్ స్పెషల్. నగరంలోని 23వ డివిజన్ స్థానానికి మున్నూరు కాపు కులస్తులే పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, బీజేపీ నుంచి పాదం శివరాజ్, కాంగ్రెస్ నుంచి గుమ్మడి రాజ్కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా ఎడ్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వీరంతా కూడా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. పైగా బంధువులు కావడంతో ఆ డివిజన్ ప్రస్తుత ఎన్నికల్లో స్పెషల్గా మారింది. 1, 2, 36వ డివిజన్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కాకపోతే 1వ డివిజన్లో ఐదుగురు అభ్యర్థులకు గాను నలుగురు, 2వ డివిజన్లో ఆరుగురిలో ఐదుగురు, 36వ డివిజన్లో ఏడుగురిలో ఆరుగురు మున్నూరుకాపులే పోటీలో ఉండడం విశేషం. నగరంలో ఈ సం‘కుల’ సమరం ఆసక్తి రేపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్: ‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు. మేము పన్నులుకట్టడం లేదా. మేం చెల్లించిన పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయి. మీకు ఎందుకు ఓటు వేయాలి. మా ఇంటికి రాకండి’.. అంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓ ఇంటి యజమాని వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కరీంనగర్ నగరపాలకసంస్థ 36వ డివిజన్లోని మారుతినగర్కు చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో రోడ్లు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నాయని... మీకు ఎందుకు ఓటువేయాలంటూ ఆయన ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నలు సంధించారు. మున్సిపల్ పోరు.. నాన్వెజ్ జోరుబంధువులే ప్రత్యర్థులు -
ఓటరు మహాశయులారా
కోల్సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య శ్రీపలానా గుర్తుకే మన ఓటుశ్రీ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది. మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్గా, గాయకుడిగా, నృత్య మాస్టర్గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని -
కళకు జీవితమిస్తే..
ఇరవై ఐదేళ్లు.. ఇదొక సాధారణ కాలం కాదు. కళనే శ్వాసగా, పాటనే ఆయుధంగా మలుచుకుని సాగించిన పోరాట కాలం. కమాన్పూర్ మండలం రొమ్మికుంట గ్రామానికి చెందిన పులిపాక బాలయ్య అనే కాళాకారుడు కళాకారుడిగా అనేక సేవలు చేశాడు. పాటలు రాయడం నుంచి వేదికలపై పాడటం వరకూ ప్రజల మధ్య చైతన్యం నింపే కార్యక్రమాల నుంచి సామాజిక సందేశాల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉద్యమ గీతాల ద్వారా ప్రజల గుండెల్లో స్పందన రేపాడు. ఉద్యమాల వేడి వేదికలపై కనిపించినా.. జీవితంలో కష్టాలే ఎదురయ్యాయి. ఇంతకాలం కళకు అంకితమై ఉన్నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వెంటాడుతోంది. ప్రస్తుతం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ,చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కళాకారుడి ప్రతిభను చూసే సమాజం, అతడి బతుకును చూడడం మరిచిపోతుందంటున్నాడు. ఉద్యమాల సమయంలో అవసరమైన కళాకారులు.. ఆ ఉద్యమం ఫలించిన తర్వాత పక్కన పడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించాలని, కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతున్నాడు. – పులిపాక బానయ్య, పాటల రచయిత, కమాన్పూర్ -
దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య
వీర్నపల్లి(సిరిసిల్ల): ఉపాధి కోసం ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన యువకుడు అక్కడ తనువు చాలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విషాదం నింపింది. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్ (22) దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాకేశ్ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేక, ఇంటి నిర్మాణానికి చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించక కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న తల్లి లక్ష్మి, సోదరుడు సతీశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్పంచ్ సామర్ల దేవరాజు, వడ్డెర సంఘం నాయకులు గోగుల రమేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన షేక్ నయూం(43) ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నయూం ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి జరీనాబేగం ఈనెల 7న రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో నయూం నర్సింగాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించాడు. నయూంకు భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తల్లి వద్దే ఉంటున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో వృద్ధుడి మృతికొడిమ్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన చిన్న శంకరయ్య అనే వృద్ధుడు అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్న్స్కు స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది శంకరయ్యను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. -
కేంద్రం నిధులతోనే అభివృద్ధి
కరీంనగర్: కేంద్రం నిధులతోనే నగరం అభివృద్ధి చెందిందని 42వ డివిజన్ బీజేపీ అభ్యర్థి యాదగిరి సునీల్ రావు అన్నారు. ఆదివారం డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీవాసులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్లో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని తెలిపా రు. స్మార్ట్సిటీ కింద కరీంనగర్ను ఎంపిక చేసి, తెలంగాణలోనే సుందరమైన నగరంగా కేంద్రం తీర్చిదిద్దిందన్నారు. మేయర్ పనిచేసిన ఐదేళ్లలో నగరంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దానని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు ఎంత కృషి చేశారని తెలిపారు. 42వ డివిజన్ కార్పొరేటర్గా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు, గొల్ల పల్లి గ్రామాల్లో ఆదివారం మత్స్యగిరీంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. గుట్టపై నుంచి తీసుకువచ్చిన స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగిస్తుండగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. చైర్మన్ కోరెం రాజిరెడ్డి, ఆలయ పూజారులు శేషం ము రళీధరాచార్యులు, మాధవాచార్యులున్నారు. రెండోరోజు 1,532 ఓట్లు కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండవరోజు ఆదివారం 1,532 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 2062 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సోమవారం సైతం ప్రక్రియ కొనసాగనుంది. -
కాంగ్రెస్ వర్సెస్ మజ్లిస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియా పోరు అనూహ్య మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో గెలిచి కింగ్మేకర్గా నిలుస్తామని ఉవ్విళ్లూరుతున్న మజ్లిస్కు పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ వ్యూహాలకు గాలిపటం ఎదురీదుతోంది. మజ్లిస్ ఆశలు పెట్టుకొన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్ పథకం వేస్తోంది. గతంలో పలుమార్లు కలిసి పీఠాన్ని నడిపిన గాలిపటానికి ఈసారి చేతి సాయం దూరమయ్యేలా కనిపిస్తోంది. మిత్రపక్షంతో స్నేహంగా ఉంటూనే సొంతంగా మెజారిటీ సాధించాలన్న కాంగ్రెస్ పట్టుదల ఆచరణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఎంఐఎంలోని పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడం ప్రతికూలాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ సొంత బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు తిరుగుబాటుదార్లు బీఆర్ఎస్లో చేరి పోటీ చేయడంతో ముస్లిం ఓట్లు గంపగుత్తలా పడే మార్గాలు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరాన్ని బట్టి పొత్తులకు వెళ్లేలా కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోంది. విజేతగా నిలిచేనా? ప్రతీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు మజ్లిస్ చాంపియన్గా ఉంటూ వస్తోంది. ఎన్నిక ఏదైనా ఎంఐఎం వైపే ముస్లిం సమాజం నిలుస్తుందనే భావన ఉంటుంది. నగరపాలకసంస్థ ఎన్నికల్లో గతంలో పలుమార్లు ఇది రుజువైంది కూడా. మొదటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా 50 డివిజన్లకు గాను తొమ్మిది స్థానాలు గెలుచుకొని డిప్యూటీ మేయర్ను సొంతం చేసుకుని సత్తా చాటింది. పైగా ఎంఐఎం మద్దతుతోనే అప్పుడు మేయర్ అభ్యర్థి చివరినిమిషంలో మారారనే ప్రచారం సాగింది. తరువాత జరిగిన రెండు నగరపాలకసంస్థ ఎన్నికల్లో ఎంఐఎం సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గడమే అందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో 60 డివిజన్లకు కేవలం ఆరు స్థానాలకే ఎంఐఎం పరిమితమైంది. ముస్లిం ఓట్లకు కాంగ్రెస్ గాలం పదేళ్లపాటు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమ వైఖరినీ మార్చుకుంది. ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బాసటగా నిలుస్తూ వస్తోంది. కరీంనగర్ బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం కనీసం పది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకొని, మేయర్ ఎన్నికల్లో చక్రం తిప్పుతుందని అంతా భావించారు. బయట ప్రచారం అదే సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఓటు బ్యాంకును పెంచుకొనే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ముస్లిం, దళితుల ఓట్లను ఆకర్షిస్తోంది. సహజంగా ఎంఐఎం బలంగా ఉన్న చోట కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పోటీలో నిలుపుతుంది. ఈసారి ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎంఐఎంకు కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టిపోటీ నెలకొంది. ఎంఐఎం మద్దతు అవసరం పడకుండా, నేరుగా ముస్లిం ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో పావులు కదుపుతున్నారు. ఎంఐఎంకు ఓటు వేయడం ద్వారా బీజేపీకి పరోక్షంగా లాభం జరుగుతుందనే ఆలోచనకు వస్తున్న ముస్లిం మేధావులను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఎంఐఎం నుంచి విడిపోయిన ఓ బలమైన వర్గం బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగడం ఎంఐఎం గడ్డు పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్ నాటికి ఉన్న పరిస్థితి పోలింగ్ నాటికి ఎంఐఎంకు లేకుండా పోవడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం. -
ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీలు, దళితులకు కాంగ్రెస్ బాసటగా నిలుస్తోంది. మా పార్టీ ముస్లింల అభివద్ధికి కట్టుబడి ఉంది. ఈసారి మేం బల్దియాలో మెరుగైన స్థానాలు సాధిస్తాం. నగరంలో పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో కనీస సదుపాయాలు లేక మైనార్టీ ప్రాంతాలు వెనకబడ్డాయి. స్మార్ట్సిటీ పేరుతో అభివద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈసారి బల్దియాపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం. ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటాం. ముఖ్యంగా ఉపాధి, నైపుణ్య అభివద్ధి, ఆరోగ్యం, వసతుల కల్పనలో పూర్తి ప్రాధాన్యం కల్పిస్తాం. – వెలిచాల రాజేందర్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, కరీంనగర్ -
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
కరీంనగర్క్రైం/కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఆదివారం కమిషనరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పనిచేస్తున్నాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని 66 వార్డులను వివిధ క్లస్టర్లుగా విభజించామని, ఏదైనా సమస్య తలెత్తితే నిమిషాల్లో స్పందించేలా పెట్రోలింగ్ పార్టీలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. 25శాతం కేంద్రాలను ‘క్రిటికల్’గా గుర్తించామని, అక్కడ వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ హాల్ను, పోలింగ్ స్టేషన్ను బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద లైటింగ్, ఫర్నిచర్, తాగు నీటి వసతి, రవాణా కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్ లెక్కింపు కోసం ట్రేలు, ర్యాకులు, టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ వెంకటరమణ, సీఐలు సృజన్ రెడ్డి, రాంచందర్ రావు, తిరుమల్ పాల్గొన్నారు. -
ఇప్పలపల్లిలో రాష్ట్రబృందం పర్యటన
శంకరపట్నం: మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ బృందం సభ్యులు ఆదివారం పర్యటించారు. రాష్ట్రస్థాయిలో స్వయంసమృద్ధి వసతుల గ్రామపంచాయతీగా ఇప్పలపల్లి ఎంపికై ంది. ఈ మేరకు గ్రామంలో పర్యటించిన రాష్ట్రబృందం సభ్యులు గ్రామ పంచాయతీ భవనం, గ్రామైక్య మహిళా సంఘం భవనం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, నర్సరీ, పాడిపశువుల పెంపకం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు.జాతీయస్థాయికి ఎంపికై తే రూ.50 లక్షల అవార్డు అందుతుందని పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధిశాఖ అదనపు కమిషనర్ జాన్వెస్లీ తెలిపారు. డీపీవో జగదీశ్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో ప్రభాకర్, సూపరింటెండెంట్ రఘువేందర్రెడ్డి పాల్గొన్నారు. -
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్/తిమ్మాపూర్/చొప్పదండి: కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే నగర రూపురేఖలు మారుస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్లో విజయసంకల్పయాత్రతో పాటు అలుగునూరు, సదాశివపల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అలుగునూరు తలాపునే మానేరు ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యారన్నారు. మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే 24 గంటల తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. సదాశివపల్లి, హౌసింగ్ బోర్డు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ ఎత్తున ‘విజయ సంకల్ప ర్యాలీ’ నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్కౌర్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే టాక్స్లు పెంచుతారు కేంద్రం నుంచి నిధులు ఇచ్చేది మోడీ అని, అవి తెచ్చేది బండి అని, అలాంటప్పుడు కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండిలోని మార్కెట్చౌరస్తాలో ఆదివారం జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు, చొప్పదండి, అన్ని మున్సిపాలిటీలకు నిధులిచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటేందుకు వేయాలని ప్రశ్నించారు. పదేళ్లపాలనలో ప్రభుత్వ స్థలాలతో పాటు, ప్రజల జాగాలను కబ్జా చేసి అరాచకలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఏం ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రం నిధులతోనేనన్నారు. చొప్పదండికి అమృత్ 2 ద్వారా రూ.36.30 కోట్లు, 14,15 ఆర్థిక సంఘాల ద్వారా రూ.5.57 కోట్లు, స్వచ్ఛ భారత్ ద్వారా రూ.42లక్షలు కేంద్రం ఇచ్చిందన్నారు. స్వనిధి ద్వారా 1,611 మంది రూ.2.94కోట్లు లబ్ధి పొందారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్టౌన్: కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మవద్దని, రెండున్నరేళ్లలో కరీంనగర్కు నయాపైసా తేలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 41,22,23,46,14,15,13,26,54 డివిజన్ల అభ్యర్థులు తోట సుగుణ, జంగిలి సాగర్, బోనాల శ్రీకాంత్, గడ్డి ప్రదీప్, గుర్రాల శివ, కంజర్ల రేణుక, మేడి ఉమా మహేశ్వర్, నాంపల్లి భవాని, మంథెన అనితకు మద్దతుగా కాలనీల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ల్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ తరువాత కరీంనగర్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలది ఓట్ల రాజకీయాలే తప్ప అభివృద్ధి పట్టదని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ అడ్డగోలు అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. వేంకటేశ్వరస్వామి ఆలయం కోసం పది ఎకరాల భూమి కేటాయించామని, ఇప్పటికీ నిర్మా ణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు. గ్రేటర్ రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడుతూ రెండు పర్యాయాలు నగర మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్కు అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపించామని, మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. -
త్రిముఖ పోరు.. ప్రచార జోరు
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: జిల్లాలో రాజకీయ ప్రముఖుల మకాం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు గల్లీ.. గల్లీలో పర్యటనలు.. చౌరస్తాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు.. మైకుల్లో దద్దరిల్లే వాగ్దానాలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఇంటింటా ప్రచార జోరుతో మున్సిపల్ ఎన్ని కల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచార ముగింపునకు మరి కొద్ది గంటలే సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు.. మద్దతుదారులు చెమటోర్చుతున్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుండగా.. సింహం గుర్తుతో బరిలో నిలిచిన వారితో పాటు పలువురు స్వతంత్రులు సైతం గట్టి పోటీనే ఇస్తున్నారు. మూడు పార్టీల దూకుడు కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. కొద్దిరోజుల నుంచి నుంచి అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు డివిజన్ల వారీగా స్ట్రీట్కార్నర్ మీటింగ్లతో గల్లీగల్లీల్లో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి 50 నుంచి 100 మంది కార్యకర్తలను వెంటేసుకొని ఇంటింటా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలతో పాటు రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలను ప్రచారంలో అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.


