breaking news
Karimnagar District News
-
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
పంచాయతీ కిక్కు రూ.151కోట్లు
కరీంనగర్క్రైం: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఎకై ్సజ్శాఖకు కాసులవర్షం కురిపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.151 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27వ తేదీన విడుదల కాగా... డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. జిల్లాలో 94 మద్యం దుకాణాలు, 34 బార్లు ఉన్నాయి. 17 రోజుల వ్యవధిలో ఎన్నికల సందర్భంగా 1,16,963 కాటన్ల మద్యం, 1,57,659 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయని ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మూడు దఫాలుగా పోలింగ్ జరిగింది. ఆయా ప్రాంతాల్లో రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేశారు. ఆయా సందర్భాల్లో పక్క ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసుకెళ్లారు. మొత్తంగా కొత్త మద్యం పాలసీలో దుకాణాలు దక్కించుకున్న వారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోణీ కొట్టగా మంచి ఆదాయం సమకూరుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందుకు మరిన్ని ఎన్నికలు ఉండడంతో ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఆక్రమణలకు అడ్డా..!
నగరంలోని శనివారం అంగడి చౌరస్తా వద్ద ఉన్న ఎస్ఆర్ఆర్ కాంప్లెక్స్లోని దుకాణదా రులు ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణలు తొలగించినా.. కొద్ది రోజులకు షరా మా మూలుగానే ఫుట్పాత్తోపాటు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు.నగరంలోని గీతాభవన్ చౌరస్తా నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే కరీంనగర్, సిరిసిల్ల మెయిన్ రోడ్డుపైనే దుకాణాలున్నాయి. టూటౌన్ పోలీసుస్టేషన్ ముందున్న షాపు ఏకంగా రోడ్డుపైనే కొనసాగుతోంది. ఇక్కడ ఫుట్పాత్లే కాదు.. రోడ్డుపై వైట్ లైన్ కూడా కనిపించని పరిస్థితి. గతంలో బల్దియా అధికారులు తొలగించినా.. మళ్లీ యథాస్థానంలోనే వ్యాపార సామగ్రి ఆక్రమించుకుంది. -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా వేడినీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలోపే అల్పాహారం తిన్నాం. – మాధవి, ఉపాధ్యాయురాలు ఏర్పాట్లు బాగున్నాయ్ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. మాకు రాత్రిబస చేసేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు కలుగకుండా స్థానిక అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది పంచాయతీ ఎన్నికల విధులను నిర్వహించడం సంతృప్తినిచ్చింది. పోలింగ్ సమయానికల్లా సిద్ధంగా ఉండేంలా సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. – సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
తెలుగులో తీర్పుతో గుర్తింపు
1986 నుంచి కరీంనగర్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే 1992లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షలో విజయం సాధించారు గొట్టె రవీందర్. ఆదిలాబాద్, సిర్పూర్, వరంగల్లో విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై సీనియర్ ఏపీపీగా నర్సంపేటలో బాధ్యతలు నిర్వహిస్తూ 2004లో తిరిగి జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కర్నూలు, డోన్లో పనిచేశారు. సీనియర్ సివిల్ జడ్జిగా 2013లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, నాంపెల్లి కోర్టులో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. తెలుగులో తీర్పునిచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. – గొట్టె రవీందర్, విశ్రాంత న్యాయమూర్తి సేవ చేయాలన్న సంకల్పంతో.. విద్యార్థి దశ నుంచే నెహ్రూ యువకేంద్రం ద్వారా సామాజిక సేవలపై ఆసక్తి పెరిగింది ఆసాని జ యశ్రీకి. టీచర్గా పనిచేసిన తండ్రి రాజారెడ్డి స్వ చ్ఛంద సేవలే స్ఫూర్తిగా న్యాయవిద్యను పూర్తి చే శారు. 1996లో న్యాయవాదిగా నమోదై.. మెట్పల్లిలో నాలుగేళ్లపా టు ప్రాక్టీస్ చేశారు. అనంతరం కుటుంబంతోపాటు కరీంనగర్కు షి ఫ్ట్ అయ్యారు. స్థానికసంస్థల్లో సర్పంచ్లు, వార్డుసభ్యులకు పలు మార్లు శిక్షణ ఇచ్చారు. జ్యుడీషియల్ శాఖలోకి 2015లో అడుగుపెట్టి పెద్దపల్లి, కరీంనగర్, ప్రస్తుతం సిరిసిల్లలో పనిచేస్తున్నారు. – ఆసాని జయశ్రీ, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
15ఏళ్ల బాలుడికి బ్లడ్ కేన్సర్ నుంచి విముక్తి
కరీంనగర్: కరీంనగర్కు చెందిన 15 ఏళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్తో బాధపడుతుండగా సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లో అలోజెనిక్ బోన్ మ్యా రో ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించినట్లు హెమటో– అంకాలజీ– బీఎంటీ వైద్యుడు కె.అశోక్కుమార్ తెలిపారు. ప్రస్తుతం బాలు డు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్ల డించారు. గురువారం కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ.. హెమటాలజీ, బోన్ మ్యా రో ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో లుకేమియా, లింఫోమాస్, మల్టీపుల్ మై లోమా, అప్లాస్టిక్ అనీమియా, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ వంటి కేన్సర్, రక్త రుగ్మతలకు పెద్దలు, పి ల్లలకు సమగ్ర చికిత్స అందిస్తున్న ట్లు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఇప్పటివరకు 400కు పైగా విజయవంతమైన బీఎంటీల ను నిర్వహించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా యశోద హాస్పిటల్స్ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. -
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరి ధిలో సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం రేకుర్తి,హౌసింగ్బోర్డుకాలనీల్లోని జాతర నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. జనవరిలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.కరీంనగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన బీమారంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు అతిపెద్ద విఘాతంగా పరిణమించనున్నదని ఎల్ఐసీ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు సతీశ్ అన్నారు. బిల్లు, బీమా చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఇప్పటివరకు ఉన్న 74శాతం పరిమితిని 100శాతం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చి పడతాయ ని, కొత్త టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తుందని, ఇన్సూరెన్స్ విస్తరణ మరింతగా దేశం నలుమూలలకు పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు అబద్ధాలని రుజువైందన్నారు. రామ్మోహన్రావు, సూర్యకళ, వామన్రావు, బసవేశ్వర్, అనుపమ పాల్గొన్నారు.పత్తి మార్కెట్కు మూడురోజులు సెలవుజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,450 పలికింది. గురువారం మార్కెట్కు 19వాహనాల్లో 144 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకాని కి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.6,800కు వ్యాపారులు కొనుగోలు చే శారు. మార్కెట్కు శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు సెలవులుంటా యని, సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయ ని ఇన్చార్జి కార్యదర్శి రాజా పేర్కొన్నారు. 27న ఎస్యూలో మెగా జాబ్మేళాసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో ఈనెల 27న మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఆవరణలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ వంటి 50కి పైగా కార్పొరేట్ కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాల్లో నియామకాలు ఉంటాయన్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
గల్ఫ్లో గుండెపోటుతో ఎల్లారెడ్డిపేటవాసి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పుట్టి న ఊరిలో ఉపాధిలేక బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లిన ఓ వలసజీవి గుండెపోటుకు గు రై మృతిచెందాడు. ఈ సంఘటనతో ఎల్లారెడ్డిపేట మండ ల కేంద్రంలో విషాదం అలుముకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలనర్సు(40) గత 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. గురువారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. బాలనర్సు మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య దేవ కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆమె వేడుకుంటుంది. వలస కార్మికుడి ఆత్మహత్యరుద్రంగి(వేములవాడ): రు ద్రంగి మండల కేంద్రంలో బుధవారం రాత్రి వలస కా ర్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ నుంచి రుద్రంగికి వచ్చిన వలసకార్మికుడు సన్ని(25) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. రుద్రంగి పోలీసులు శవ పంచనామా చేసి మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ అధికారిపై దాడిజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ సెక్షన్ అధికారి సాంబయ్యపై దాడి జరిగినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రవికుమార్ తెలిపారు. రంగపేట అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా సాంబయ్య అడవిలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి గొడ్డలితో కన్పించగా సాంబయ్య అతడిని మందలించాడు. దీంతో కోపంతో రాకేశ్ గొడ్డలితో సాంబయ్యపై దాడిచేశాడని, ఘటనలో సాంబయ్య చేతివేళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులురాయికల్: రాయికల్ పట్టణంలో ఓ బాల్య వివాహాన్ని 1098 ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణానికి చెందిన అబ్బాయి, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వధూవరుల వయసును పరిశీలించారు. వధువు వయసు తక్కువగా ఉండటంతో మేజర్ అయ్యేంత వరకు వివాహం చేయొద్దని 1098 కౌన్సిలర్ శ్రీనివాస్, సోషల్ వర్కర్ రాణి, గంగాధర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. -
ప్రభుత్వ విద్యార్థులకు దంత పరీక్షలు
కరీంనగర్టౌన్/కరీంనగర్ అర్బన్/మానకొండూర్: జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12వేల మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న దంత వైద్య శిబిరాన్ని గురువారం సందర్శించారు. జిల్లావ్యాప్తంగా 9వేల మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయని, 24మందికి చికిత్స అందించామన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, డెంటల్ నిపుణులు రవి ప్రవీణ్, రణధీర్, సాహిత్య, ప్రిన్సిపాల్ కమల పాల్గొన్నారు. కుష్ఠును శాశ్వతంగా నిర్మూలించాలి కుష్ఠువ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశ వర్కర్లు ఇంటింటా తిరుగుతూ సర్వే చేపట్టి కుష్ఠు రోగులను గుర్తించాలన్నారు. ఈనెల 18 నుంచి 31వరకు సర్వేచేసి అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్వో రాజగోపాల్, ఉమాశ్రీ, తహసీల్దార్ విజయ్కుమార్, సల్మాన్ పాల్గొన్నారు. శభాష్.. ఎన్నికల సేన ఎన్నికల నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటింది కరీంనగర్. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసిన మొదటి జిల్లాగా నిలిచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం కలెక్టర్తో పాటు యంత్రాంగాన్ని ప్రశంసించింది. ఇందుకు సహకరించిన అధికారులు, పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు. సాధారణ పరిశీలకుడు వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ను సన్మానించారు. -
బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్కాస్ట్ –1, ఎక్స్టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్గ్రౌండ్ కోల్మైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, వకీల్పల్లి మైన్తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం.. బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్కాస్ట్గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్పల్లి మైన్ను కూడా ఓపెన్కాస్ట్గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజల ప్రధానమైన డిమాండ్లు ● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి ● ఓపెన్కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు ● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు ● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి. నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తొమ్మిది గ్రామాల్లో భూమి.. వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ కార్యాలయ ముట్టడితో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షతో నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఈ ఆందోళన నిర్వహించింది. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా, మార్గమధ్యలో కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొన్నారు. కాంగ్రెస్కు పోటీగా డీసీసీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు చౌరస్తా నుంచి జ్యోతినగర్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు ర్యాలీగా బయల్దేరారు. కోర్టు వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు. అదుపులోకి తీసుకొని పీటీసీకి, టూటౌన్పోలీసు స్టేషన్కు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంను బాలాజీనగర్లోని ఆయన నివాసంలో హౌస్అరెస్ట్ చేశారు. సత్యం తన ఇంటి గేటు దూకేందుకు పలుమార్లు ప్రయత్నించగా, పోలీసులు వారించారు. నిరంకుశ పాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఆటలు ఇక సాగవని డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్రెడ్డి, మల్లికార్జున రాజేందర్, కాశెట్టి శ్రీనివాస్, సిరాజు హుస్సేన్, బానోతు శ్రావణ్ నాయక్, అరుణ్ కుమార్, కల్వల రామచందర్, లింగంపల్లి బాబు పాల్గొన్నారు. డీసీసీ ముట్టడికి బీజేపీ యత్నం కాంగ్రెస్ నాయకుల బీజేపీ ఎంపీ కార్యాలయ ము ట్టడికి నిరసనగా డీసీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు బయలుదేరడంతో పోలీ సులు అరెస్టు చేశారు. మాజీ మేయర్ సునీల్రావు, పార్టీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ మాట్లాడుతూ బీజేపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఈ కేసును రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటోందన్నారు. -
బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఓసీపీ–2 విస్తరణలో భాగంగా బుధవారంపేట గ్రామాన్ని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం సర్వేకు వచ్చిన సింగరేణి అధికారులను వారు అడ్డుకున్నారు. సుమారు 15ఏళ్లుగా సింగరేణి సంస్థ తమ గ్రామంపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పంచాయతీ పరిధిలోని మొత్తం వ్యవసాయ భూములు, గ్రామాన్ని పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుని మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్అండ్ఆర్ ద్వారా అన్ని వసతులతో కొత్త గ్రామాన్ని నిర్మించి తగిన న్యాయం చేయకుంటే సింగరేణి సంస్థ నిర్వహించే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకొని సౌకర్యాలు కల్పిస్తేనే సర్వేకు సహకరిస్తామని తేల్చిచెప్పారు. అప్పటివరకు అధికారులు, సింగరేణికి సహకరించేది లేదని హెచ్చరించారు. చేసేదిలేక సర్వేకు వెళ్లిన అధికారులు వెనక్కి వచ్చేశారు. -
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్యాంప్ఫైర్లో నృత్యం చేస్తున్న క్రిస్టియన్లుసింగరేణి సంస్థ చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. – సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లోu తీగలవంతెనను కమ్మేసిన మంచు దుప్పటిమొగ్ధుంపూర్లో ఉదయిస్తున్న సూర్యుడు చెర్లభూత్కూర్లో లైట్లు వేసుకుని వస్తున్న లారీజిల్లాలో చలి వణికిస్తోంది. కొన్ని రోజుల నుంచి చలితీవ్రతతో ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. నగరశివారులోని తీగలవంతెన, ప్రధాన రహదారులపై ఉదయం 8 గంటల వరకు పొగ మంచు వీడడం లేదు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పొగమంచు నిండిపోయింది. రాజీవ్ రహదారి, రాయపట్నం స్టేట్ హైవే, మొగ్ధుంపూర్– నగునూరు రహదారి కన్పించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొద్ది రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్/ కరీంనగర్రూరల్మంచు కురిసే వేళలో.. -
పైసలు పాయే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలుబడే వరకూ విజయం తనదేననే ధీమాతో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నిక ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా.. ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు.సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్: జిల్లాలోని 316 గ్రామ పంచాయతీలు 2,946 వార్డుస్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 8 సర్పంచ్, 657 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ఖర్చుచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకు నేందుకు డబ్బు, మద్యంతోపాటు విలువైన బహుమతులూ అందజేశారు. ఓటుకు రూ.500 నుంచి రూ.5వేల వరకు నగదు కూడా పంపిణీ చేశారు. చాలామంది ఆస్తులు విక్రయించగా, కొందరు మరీ అప్పు తీసుకొచ్చారు. ఓటమి పాలయ్యాక అప్పులే మిగిలాయని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గెలిచిన వారు సైతం అప్పుచేసి గెలిచామని, ఎలా తీర్చాలన్న మదనతో ఉన్నారు. ఖర్చుకు వెనుకాడలేదు.. సర్పంచ్తోపాటు వార్డుస్థానాల్లోని అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు. రూ.లక్షల్లో వెచ్చించారు. చెక్పవర్ ఉండడంతో రిజర్వేషన్ కలిసిరాని పంచాయతీల్లో వార్డుస్థానాల్లో పోటీచేసిన కొందరు ఉప సర్పంచ్ పదవి చేజిక్కించుకోవాలని వ్యూహం పన్నారు. వార్డు అభ్యర్థులు.. సర్పంచ్ అభ్యర్థులతో సమానంగా ఖర్చు చేశారు. ఫలితం తేడా రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తే గెలుపు ‘నల్లేరుపై నడకే’నని భావించిన కొందరు ఓటమి చెందారు. తమ ఓటమికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషించుకుంటున్నారు. నగదు పంపిణీ, తమ క్యాంపులో ఉంటూ ప్రత్యర్థికి సహకరించిన వారెవరనే కారణాలను నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. రెబల్స్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు.. పార్టీలో ఉండి రెబల్స్కు సహకరించిన వారిని గుర్తించి, వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేస్తున్నారు. వారిపై ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీలకు సహకరించిన వారిపై తమ పార్టీ ముఖ్యనాయకులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు.. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు ఈసారి పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా రిజర్వేషన్ కలిసి వస్తే ఓడిపోయిన సానుభూతితో ఎంపీటీసీగా గెలవవచ్చని భావిస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల వేళ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాల సమయంలో పెట్టిన ఖర్చును రాబట్టుకోవచ్చని పరిషత్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
ఎన్నికలు తెచ్చిన పంచాయితీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రశాంతంగా ఉండే ఆ పల్లెలోని ఓ వర్గంలో పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయితీని తెచ్చి పెట్టాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో ఇటీవల రెండో దశ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. కాగా ఓ వర్గానికి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ బరిలో పోటీచేయగా ఆవర్గం వారు సదరు అభ్యర్థికే ఓటేయాలని తీర్మానించారు. సుమారు 500 ఓట్లు ఉన్న ఆ వర్గం వారి ఓట్లలో 150 వేరే అభ్యర్థికి పోల్ కావడంతో అతడు విజయం సాధించాడాని తేల్చారు. దీంతో బుధవారం గ్రామంలోని ఆలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. తమ అభ్యర్థి రూ.లక్షలు ఖర్చుచేసి పోటీలో ఉంటే ఓట్లు వేరే వారికి ఎలా వేస్తారని చర్చించుకున్నారు. ఓ మహిళ దీనంతటికి కారణమని గుర్తించి ఆమెను కూడా నిలదీశారు. ప్రశాంతంగా ఉండే పచ్చని పల్లెలో ఎన్నికలు చిచ్చు రేపాయాని గ్రామస్తులు చర్చించుకుంటున్నా రు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
యాప్తోనే జనగణన
కరీంనగర్ అర్బన్: సాగుతూ.. ఆగిన జనగణన ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కనుంది. గత నాలుగేళ్లుగా జనగణనపై ప్రభుత్వ ప్రకటన.. అంతలోనే వాయిదా వంటివి జరగగా ఈ సారి పక్కాగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే బ్లాకులుగా విభజించిన అధికారులు మరో 20రోజుల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పక్కా లెక్కలతో పాటు ఇళ్లు, కట్టడాల వివరాలతో పాటు సౌకర్యాల వివరాలను నమోదు చేయనున్నారు. ఇక సదరు ప్రక్రియ అంతా స్మార్ట్ఫోన్లోనే జరగనుండగా ఇంటర్నెట్ లేకున్నా యాప్ పని చేయనుంది. ఒక్కో ఇల్లు రెండుసార్లు పరిశీలన స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసిన జనగణన యాప్లోనే వివరాలను నమోదు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతుండటంతోనే ఆఫ్లైన్ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జనగణన కార్యక్రమం చేపట్టనుండగా ఎన్యుమరేటర్లకు జనవరి, ఆ తదుపరి రెండు దశల్లో శిక్షణనిస్తారు. ఎన్యుమరేటర్ తనకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లకు రెండు దశల్లో వెళ్లి వివరాలు నమోదు చేయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబరులోగా మొదటి దశ కింద ప్రతి ఇల్లు, కట్టడం వివరాలన్నీ సేకరించనుండగా రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. నాలుగేళ్లుగా సా..గదీత 2019లోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్–19 క్రమంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. 2018లో అందుకు సంబంధించిన ప్రక్రియ జరగగా కరోనా నీళ్లు చల్లింది. కోవిడ్–19 నేపథ్యంలో వాయి దా పడుతూ రాగా అన్ని సక్రమంగా ఉంటే జనవరిలో జనగణన ప్రక్రియ షురూ కానుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, నూతన మండలాలు, కొ త్త మున్సిపాలిటీలు వాటి పరిధిలో నివాసాలెన్ని, ఎ ంత మంది సిబ్బంది అవసరమనేది తేల్చారు. భౌ గోళిక స్వరూపం క్రమంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇచ్చిన ఇంటి నంబర్ల ఆధారంగా బ్లాకులుగా విభజించారు. ప్రతీ గ్రామం, మండలం, జిల్లా జనగణన పటాలను సిద్ధం చేశారు. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు.. ఛార్జ్ ఆఫీసర్లు తహసీల్దార్లు ఎన్యుమరేట్ బ్లాక్లకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్లో వివరాలను రూపొందించారు. జిల్లాలో 316 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలుండగా 2.62లక్షల నివాసాలున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో నిర్మాణమైన కొత్త భవనాలను పరిగణలోకి తీసుకున్నారు. కాగా ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులను తీసుకోనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించనుండగా పర్యవేక్షకులుగా స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం, యంఆర్సీలను నియమించనున్నారు. మొత్తం బ్లాక్ల సంఖ్య క్రమంలో 402మంది పర్యవేక్షకులు అవసరం. మండలస్థాయిలో ఛార్జ్ ఆఫీసర్గా తహసీల్దార్, అదనపు ఛార్జ్ అఫీసర్గా ఎంపీడీవో వ్యవహరించనుండగా మండల ప్రణాళిక, గణాంక అధికారులు డీలింగ్ అసిస్టెంట్లుగా వ్యవహరించనున్నారు. మరో 20రోజుల్లో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఏప్రిల్ నుంచి జనగణన ప్రక్రియ షురూ ఎన్యుమరేటర్ రెండుసార్లు ఇంటి వివరాలు సేకరించాల్సిందే ఇంటర్నెట్ లేకున్నా యాప్లో నమోదు జిల్లా జనాభా: 10,05,711 నివాసాలు: 2,58,485కుటుంబాలు: 2,90,6572011 జన గణనలో బ్లాక్లు.. కొత్తగా 2021 జనగణన బ్లాకుల ఏర్పాటు వివరాలు మండలం 2011 2022 గంగాధర 89 101 రామడుగు 104 114 చొప్పదండి 61 71 కరీంనగర్ రూరల్–1 55 65 కరీంనగర్ రూరల్–2 53 63 గన్నేరువరం 55 56 మానకొండూరు 128 133 తిమ్మాపూర్ 83 94 చిగురుమామిడి 83 91 సైదాపూర్ 79 93 శంకరపట్నం 81 101 వీణవంక 91 96 హుజూరాబాద్ 124 79 జమ్మికుంట 139 83 ఇల్లందకుంట 69 69 మున్సిపాలిటీ 2011 2021 కరీంనగర్ 388 808 చొప్పదండి 26 50 హుజూరాబాద్ 46 109 జమ్మికుంట 73 116 -
వేతనం.. సతమతం..
కరీంనగర్ అర్బన్: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 2 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు.. మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్లుగా మూడు నెలలు, నాలుగు నెలలకోసారి వేతనమిస్తూ ఉద్యోగులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ఆపరేటర్ నుంచి ఏపీవో వరకు.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్), టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 15, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 274 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే రెండు నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్ సాఫ్ట్వేర్లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోటి పైనే.. ఉపాధిహామీలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.25వేల నుంచి రూ.30వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు సుమారు రూ.50.25లక్షల చొప్పున 2 నెలలకు గాను రూ.1.05కోట్లు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. తగ్గని టార్గెట్లు.. వేతనాలు పెండింగ్లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న టార్గెట్ ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన తండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి. 2 నెలలుగా అందని వైనం ఆందోళనలో ‘ఉపాధి’ ఉద్యోగులు -
ఉద్యాన రైతుకు చేయూత
కరీంనగర్రూరల్: వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆధునిక పద్ధతులు, ఎక్కువ విస్తీర్ణంలో ఉద్యాన పంటలను రైతులు సాగు చేసేందుకు వీలుగా యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లాకు 86 యూనిట్లు మంజూరు చేసింది. దశాబ్దం తర్వాత.. గతంలో వ్యవసాయంతోపాటు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీ చేస్తున్నారనే సాకుతో సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేశారు. దీంతో పలువురు రైతులు ప్రైవేట్గా పరికరాలను కొనుగోలు చేయడంతో ఆర్థికంగా భారం పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాకు 86 యూనిట్లు మంజూరు కాగా.. అర్హులైన రైతుల నుంచి ఉద్యాన శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 49 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. యంత్ర పరికరాలకు సంబంధించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలను చేసుకుంది. పరికరాల కొనుగోలుపై 5 ఎకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు 40 శాతం సబ్సిడీని అందిస్తారు. ప్రభుత్వం సబ్సిడీపై ఉద్యాన రైతులకు యంత్ర పరికరాలను అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. పరికరాలు అవసరమున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలి. – అయిలయ్య, ఉద్యాన శాఖ అధికారి, ఉమ్మడి కరీంనగర్ మండలంపవర్ వీడర్లు: 18, బ్రష్ కట్టర్లు: 29 పవర్ స్ప్రేయర్లు: 27, పవర్ టిల్లర్లు: 9 మినీ ట్రాక్టర్లు: 3 -
కొట్టుకుపోయిందా.. కూలగొట్టారా?
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరుపై నిర్మించిన చెక్డ్యాం కొట్టుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మానేరుపై చెక్డ్యాం నిర్మించగా బుధవారం వేకువజామున సుమారు పది మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిందా? ఎవరైనా కావాలనే కూలగొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టేందుకు గ్రామానికి చెందిన కొందరు వెళ్లి వచ్చిన కాసేపటికే చెక్డ్యాం కొట్టుకు పోయిందని చెబుతున్నారు. గత నవంబర్లో జిల్లాలోని గుంపుల వద్ద చెక్డ్యాం కొట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. అదే తరహాలో ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 16 చెక్డ్యాంలు.. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో మానేరు నదిపై వివిధ చోట్ల 16 చెక్డ్యాంలు నిర్మించింది. ఇందుకోసం రూ.128కోట్లు వెచ్చించింది. ఇందులో మంథని మండలం అడవిసోమన్పల్లి, చిన్నఓదాల, గోపాల్పూర్ ప్రాంతాల్లో చెక్డ్యాంలు ఉన్నాయి. అడవిసోమన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాం అవతలివైపు కొట్టుకుపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బుంగపడి.. కుంగిపోయిందా..? కొద్దిరోజుల క్రితం చెక్డ్యాం వద్ద పెద్దబుంగపడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు చేపలు పట్టేందుకు కొందరు అక్కడకు వెళ్తుంటారని, అక్కడక్కడా పగుళ్లతోపాటు బుంగ కూడా కనిపించిందని స్థానికులు తెలిపారు. మానేరులో ప్రస్తుతం వరద కూడా అధికంగానే ఉందని, ఈక్రమంలో బుంగతోనే కుంగిపోయి కొట్టుకుపోయిందని స్థానికులు అంటున్నారు. నాణ్యతపై ఆరోపణలు.. చెక్డ్యాంల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న చెక్డ్యాంలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మించారనే వాదనలు వినిపించాయి. కానీ భారీవర్షాల సమయంలో కొట్టుకుపోకుండా ప్రస్తుతం నామమాత్రంగా వచ్చిన వరద తాకిడితో కొట్టుకుపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన.. చెక్డ్యాం కొట్టుకుపోయిందన్న సమాచారం మేరకు ఇరిగేషన్ ఏఈ నిఖిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద తాకిడితో కొట్టుకుపోయిందా? లేక ఎవరైనా కూలగొట్టారా? అనే కోణంలో పరిశీలన చేశారు. అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని, వరద తాకిడితో కొట్టుకుపోయినట్లు కనిపించడం లేదని ఏఈఈ తెలిపారు. ఘటనపై అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కూలిన అడవిసోమన్పల్లి చెక్డ్యాం నాసిరకమా?.. కావాలనే కూల్చారా? పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు చెక్డ్యాం కొట్టుకుపోవడంపై అనుమానాలు -
ఉపసర్పంచ్ పదవికి వేలం
● ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత ● రంగంలోకి దిగిన పోలీసులు ధర్మపురి: ధర్మపురి మండలం కమలాపూర్లో బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కుమ్మరి తిరుపతి గెలుపొందారు. ఉపసర్పంచ్ పోటీలో ఉన్న కొందరు తనకంటే తనకు అంటూ రసాభాస చేశారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఉపసర్పంచ్ పదవికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ వేలానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ కార్మికుడికి గాయాలు జూలపల్లి (పెద్దపల్లి): అబ్బాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొమ్మెనవేని చంద్రయ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పనినిమిత్తం అబ్బాపూర్ నుంచి జూలపల్లికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో స్థానిక కొచ్చెరువుకు సమీపంలో ఆటోను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈఘటనలో కాలితీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 వాహనం సిబ్బంది ఆరె సతీశ్, ఈఎంటీ, పైలెట్ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విజయ్నగర్లో నివాసముంటూ మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఆవుల రమేశ్(50) బుధవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు వన్టౌన్ ఏఎస్సై వెంకటేశ్వరబాబు తెలిపారు. ఏడాదిన్నర క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. భార్య కాపురానికి రావడంలేదని తాగుడుకు బానిసై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఏఎస్సై వివరించారు. మృతుడి తల్లి ఆవుల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. విద్యార్థి మృతితో రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుర్రం శరత్రెడ్డి(20) కరీంనగర్లో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. కరీంనగర్లోని తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు రేపాక నుంచి సోమవారం బైక్పై మరో ఫ్రెండ్తో కలిసి వెళ్లాడు. కరీంనగర్లోని ఎల్ఎండీ వద్ద రాజీవ్ రహదారిపై స్కూటీ ఢీకొనడంతో బైక్ అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ శరత్రెడ్డిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపుతప్పి ఒకరి దుర్మరణం● మరొకరి పరిస్థితి విషమం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని వారసంత సమీపంలో బుధవారం రాత్రి బైక్ అదుపు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భూపాలపల్లి జిల్లా పెద్దతూండ్ల గ్రామానికి చెందిన పింగిలి బబ్బులు(25)తీవ్రగాయాలతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఒజ్జం వినయ్(22) తీవ్రంగా గాయపడగా.. కరీనంగర్ తరలించారన్నారు. వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బైక్ అదుపుతప్పి మోరీ గోడకు ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
తలరాత మార్చిన ఒక్కఓటు
కరీంనగర్అర్బన్/ ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/ బుగ్గారం/సుల్తానాబాద్ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మూడు విడతల్లో జిల్లావ్యాప్తంగా ఎన్నికలు జరగగా బుధవారంతో తుది సమరం ముగిసింది. ఒక్కో విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఫలితాలు ఆసక్తికరంగా ఉండటం విశేషం. ఒక్క ఓటూ ఎంత కీలకమో స్పష్టం చేసింది. మెజారిటీ అటుంచితే విజయమే అతి కష్టంపై వరించింది. టై: కరీంనగర్ రూరల్ మండలంలోని బహుదూర్ఖాన్పేట గ్రామ పంచాయతీ 1వ వార్డులో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు లభించగా టై అయింది. మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్ కాగా బుర్ర మారుతి, బుర్ర సంపత్కుమార్, బుర్ర తిరుపతిలకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. డ్రా తీయగా మారుతి గెలుపొందారు. 01: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పెద్దూరుపల్లి గ్రామ సర్పంచిగా పోటీచేసిన రామడుగు హరీశ్ ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ సర్పంచ్గా పొన్నాల సంపత్ ఒకే ఓటు ఆధిక్యతతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థికి ఏకానందంకు 642 ఓట్లు రాగా సంపత్కు 643 ఓట్లు పోలయ్యాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో సర్పంచ్ అభ్యర్థులు అంజిత్రావుకు 437 ఓట్లు, ధర్మరాజుకు 438 ఓట్లు వచ్చాయి. ధర్మరాజును ఒక్కఓటు తేడాతో విజయం వరించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో ఉమ్మెంతల శోభకు 213, పల్లెలక్ష్మికి 212 ఓట్లు రాగా.. ఒక్కోటు తేడాతో శోభ సర్పంచ్గా గెలిచారు. 02: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచిగా గోదరి శోభారాణి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కనకలక్ష్మిపై 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శోభా రాణికి 324 ఓట్లు పోలవగా కనకలక్ష్మికి 322 ఓట్లు పోలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో కాశోల్ల పద్మకు వంద ఓట్లు రాగా, రొడ్డ భాగ్యకు 102 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో భాగ్య సర్పంచ్గా విజయం సాధించారు. 03: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట గ్రామ సర్పంచ్గా శ్రీలత ఎన్నికయ్యారు. అగ్గని శ్రీలతకు 505 ఓట్లు పోలవగా రాసమల్ల అనూషకు 502 ఓట్లు పోలయ్యాయి. కేవలం మూడు ఓట్లతో శ్రీలత సర్పంచ్గా గెలుపొందారు. 06: చొప్పదండి మండలంలోని రేవెల్లి గ్రామ సర్పంచ్గా బందారపు అజయ్కుమార్ 6 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి రాజిరెడ్డిపై గెలుపొందారు. అజయ్కుమార్కు 385 ఓట్లురాగా ప్రత్యర్థి రాజిరెడ్డికి 379 ఓట్లు పోలయ్యాయి. రామడుగు మండలంలోని కిష్టాపూర్ గ్రామ సర్పంచ్గా వేల్పుల మల్లేశం తన ప్రత్యర్థిఽ తిరుమల్పై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మల్లేశంకు 145 ఓట్లు రాగా తిరుమల్కు 139 ఓట్లు పోలయ్యాయి. 07: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో కల్లూరు బాపురెడ్డి ఏడు ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందాడు. తన సమీప ప్రత్యర్థి నమిలికొండ శ్రీనివాస్పై 7 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. 08: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లెలో సర్పంచ్గా చొప్పరి శైలజ ప్రత్యర్థి పన్నాల స్వరూపపై 8 ఓట్ల తేడాతో గెలుపొందారు. 10: జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామ సర్పంచ్గా సంఘం అమృత సమీప ప్రత్యర్థిపై 10ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇలా పలువరు సర్పంచ్, వార్డు సభ్యులు ఓటు తేడాతో గెలుపొందారు. -
ముగిసిన సంగ్రామం
సైదాపూర్: సూచనలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిపర్యవేక్షిస్తున్న సీపీ గౌస్ ఆలంమండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు పోలైన ఓట్ల శాతం ఇల్లందకుంట 26,100 22,720 11,175 11,544 87.05 హుజూరాబాద్ 35,945 30,891 14,915 15,976 85.94 జమ్మికుంట 28,929 24,798 12,149 12,649 85.72 వీణవంక 42,659 36,630 18,140 18,489 85.87 వి.సైదాపూర్ 31,415 27,598 13,619 13,978 87.85 మొత్తం 1,65,046 1,42,637 69,998 72,636 86.42 -
అతివలదే అంతిమ తీర్పు
పంచాయతీ పోరులో..కరీంనగర్ అర్బన్: ఎన్నికల సం‘గ్రామం’లో అతివలే నిర్ణేతలయ్యారు. జిల్లాలో మొత్తం 316 గ్రామ పంచాయతీలకు గానూ 126 గ్రామాల్లో మహిళలే గ్రామ ప్రథమ పౌరురాలిగా సేవలందించనున్నారు. గ్రామ సర్పంచ్ల నిర్ణయంలో మహిళల ఓట్లే కీలకమయ్యాయి. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక, చిగురుమామిడి మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగగా అన్ని విడతల్లోనూ అతివలే అఽత్యధికంగా ఓట్లు వేశారు. ఎక్కడా పురుష ఓటర్ల ఆధిక్యం కనిపించకపోవడం విశేషం. అత్యధికంగా గంగాధర మండలంలో 2,171 మంది మహిళలు పురుష ఓటర్ల కన్న ఎక్కువ మంది ఓట్లు వేయగా అత్యల్పంగా శంకరపట్నం మండలంలో వంద మహిళా ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేశారు.మండలం పురుషులు మహిళలు మహిళల ఆధిక్యం ఇల్లందకుంట 11,175 11,544 369 హుజూరాబాద్ 14,915 15,976 1,061 జమ్మికుంట 12,149 12,649 500 వీణవంక 18,140 18,489 349 సైదాపూర్ 13,619 13,978 359 చొప్పదండి 11,145 12,008 863 గంగాధర 16,293 18,464 2,171 కరీంనగర్ రూరల్ 9,233 9,438 205 కొత్తపల్లి 6,810 7,259 449 రామడుగు 16,023 17,411 1,388 చిగురుమామిడి 14,585 14,913 328 గన్నేరువరం 7,533 7,902 369 మానకొండూరు 24,360 24,967 607 శంకరపట్నం 16,617 16,717 100 తిమ్మాపూర్ 15,919 16,670 751జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో థర్డ్ జెండర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 12 మంది ఓటర్లుండగా 8మంది ఓటేయగా నలుగురు ఓటు వేయలేదు. చిగురుమామిడిలో ఒకరు ఉండగా ఓటు వేయకపోగా మానకొండూరులో ఒకరుండగా ఓటు వేశారు. చొప్పదండిలో ఒకరు, గంగాధరలో ఇద్దరికి ఒకరు ఓటేశారు. కరీంనగర్ రూరల్లో ఒకరు, రామడుగులో ముగ్గురుండగా ఒకరు ఓటేశారు. ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఒక్కొ ఓటరుండగా అందరూ ఓటేశారు. అవును.. అక్షరాల 75,548 మంది ఓటర్లు ఓటు వేయలేదన్నది సుస్పష్టం. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 5,02,457 ఓటర్లకు గానూ 4,26,909 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 84.96శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 15 మండలాల్లోని 316 గ్రామ పంచాయతీలకు గానూ 312 గ్రామాల్లో పోలింగ్ జరగగా ఎక్కడా 90శాతం పోలింగ్ నమోదు కాలేదు. తొలి విడతలో 28,320 మంది ఓటర్లు ఓటు వేయకపోగా రెండో విడతలో 24,819, మూడో విడతలో 22,409 మంది ఓటు వేయలేదు. గంగాధర, కొత్తపల్లి మండలాల్లో ఓటేయనివారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత జమ్మికుంట నిలుస్తుంది. -
సెంచరీ కొట్టిన బీజేపీ
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టు పెంచుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో వంద సీట్లకు పైగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటారు. తొలి, మలి దశలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు 76 స్థానా లను కై వసం చేసుకుంది. గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడలోని విజయనగర్ కాలనీ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికై న సంగతి తెలిసిందే. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా 112 స్థానాల్లో పోటీ చేస్తే బుధవారం వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే అందులో 24 స్థానాలను బీజేపీ కై వసం చేసుకుంది. మూడు దశలో బీజేపీ సెంచరీ కొట్టింది. గెలిచిన అభ్యర్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్లకు అభినందనకరీంనగర్ కార్పొరేషన్/చిగురుమామిడి: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్లను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఇటీవల విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో మంత్రులను కలిశారు. మంత్రులు సర్పంచ్లను సన్మానించారు. రేకొండ సర్పంచ్ అల్లెపు సంపత్ కాంగ్రెస్లో చేరగా, మంత్రి పొన్నం కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో చర్లభూత్కూర్, చామనిపల్లి, దుబ్బపల్లి బహదూర్ఖాన్ పేట్, జూబ్లీ నగర్, ఎలబోతారం, ఫకీర్పేట్, చేగుర్తి, నల్లగుంటపల్లె, ఓగులాపూర్, ఇందుర్తి, లంబాడిపల్లి, సీతారాంపూర్, నవాబుపేట్, కొండాపూర్, ఉల్లంపల్లి సర్పంచ్లు పాల్గొన్నారు. పెన్షన్ భిక్ష కాదు.. హక్కుకరీంనగర్ అర్బన్: పెన్షనర్లకు పెన్షన్ భిక్ష కాదని రాజ్యాంగబద్ధమైన హక్కని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ పెన్సనర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో భవన్లో తెలంగాణ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి, కార్యదర్శి ఎలదాసరి లింగయ్య అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ.. తమ వద్దకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక కుటుంబ, ఆర్థిక సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని, పెన్షనర్లు ఎవరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నరసయ్య, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్షణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పట్టు పెంచుకున్న ‘బండి’
● ఈటల బలపర్చిన అభ్యర్థి ఒక్కరే గెలుపు హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అభ్యర్థులను బరిలో దింపిన మల్కాజ్గిరి ఎంపీ ఈట ల రాజేందర్కు భంగపాటు ఎదురైంది. మెజారి టీ గ్రామాల్లో అభ్యర్థులను పోటీలో దింపగా.. పోతిరెడ్డిపేట సర్పంచ్ అభ్యర్థి సుమలత సురేందర్ మాత్రమే గెలుపొందారు. హుజూరాబాద్ మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ బలపర్చిన అభ్యర్థులు ఐదుగురు గెలుపొందారు. కందుగుల, బొత్తలపల్లి సర్పంచ్ అభ్యర్థులు మహేశ్, బాసవోయిన శ్రీనివాస్ ఉన్నా రు. రాంపూర్లో ముశం సంగీత గణేశ్ స్వతంత్రులుగా పోటీ చేసి వెంటనే బీజేపీలో చేరారు. శాలపల్లి సర్పంచ్గా గెలిచిన కొడిగూటి ప్రవీణ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చిన్న పాపయ్యపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి బండి సంజయ్ అభిమాని. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఒకటి, రెండ్రోజుల్లో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. -
బిడ్డను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి..
● వ్యవసాయబావిలో ఆటోపడి మహిళ మృతి జూలపల్లి(పెద్దపల్లి): తన కూతురు యోగక్షేమాలు తెలుసుకునేందుకు వచ్చిన తల్లి అనూహ్యంగా మృత్యుఒడిలోకి చేరుకుంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట – ధూళికట్ట మధ్య మంగళవారం చోటుచేసుకుంది. ఘటనలో బోమ్మగాని చిలుకమ్మ(55) దుర్మరణం చెందింది. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం ముంజంపెల్లికి చెందిన బోమ్మగాని చిలుకమ్మ.. తన కూతురు రమ్యను ధూళికట్టకు చెందిన దుర్గం నగేశ్కు ఇచ్చి వివాహం చేసింది. రమ్యను చూసేందుకు చిలుకమ్మ ఇటీవల ధూళికట్టకు వచ్చింది. ముంజంపెల్లిలో బుధవారం జరిగే ఎన్నికల్లో చిలుకమ్మ ఓటువేయాల్సి ఉంది. ఆమెను తీసుకెళ్లేదుకు కుమారుడు సతీశ్ ధూళికట్టకు వచ్చాడు. ఈక్రమంలో బావ దుర్గం నగేశ్తో కలిసి సతీశ్ మద్యం తాగారు. ఆ తర్వాత నగేశ్ తన ఆటోలో అత్త చిలుకమ్మ, బామ్మర్ది సతీశ్ను తీసుకుని చీమలపేటలో దింపేందుకు బయలు దేరాడు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి వ్య వసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఆటోలోని చిలుకమ్మ నీట మునిగి ఊపిరి ఆడక మృతి చెంది. నగేశ్, సతీశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతురాలి కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఫణి శివాజీ(35) కడుపునొప్పి భరించలేక క్రిమిసంహరిక మందుతాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పొత్కపల్లి ఏఎస్సై కిషన్ కథనం ప్రకారం.. శివాజీ 2021లో బెటాలియన్ కానిస్టేబుల్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సెలవులపై స్వగ్రామమైన కొమిరకు వచ్చారు. గ్రామంలో తనకున్న రెండు ఎకరాల పొలం వద్దకు నిత్యం వెళ్లి వ్యవసాయ పనులు చూసుకునేవారు. ఈక్రమంలో మంగళవారం అక్కడకు వెళ్లగా కడుపునొప్పి వచ్చింది. భరించలేక అక్కడే క్రిమిసంహరిక మందుతాగారు. స్థానికులు గమనించి సుల్తానాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య తేజస్విని, కుమారుడు(2) ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దేవునిపల్లిలో యువకుడు.. పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కె.గణేశ్(27) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారులోని మంథని ఫ్లైఓవర్ వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మానసిక, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు(2) ఉన్నట్లు వివరిబంచారు. కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
ఇప్పుడు గులాం
సర్పంచ్గిరీకి ఓ సలాం..సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ పదవికి ఎంతో మంది నామినేషన్లు వేసి పోటీలో ఉన్నారు. చదువుకున్న విద్యావంతులు, సమీప బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు బంధాలను మరిచి బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటాపోటీగా నీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నెన్నో వ్యూహాలు అమలు చేశారు. మందు విందులు, నోట్ల పంపిణీ, చీరల పంపిణీ ఇలా అభ్యర్థులు చేయని ప్రలోభాలు లేవు. ఆఖరికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లోనూ వేలం పాటలు, భూమిని విరాళంగా ఇవ్వడం, ఊరందరికీ అక్కరకు వచ్చే పనులు చేసేందుకు నగదు ఇవ్వడం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్కోక్కరు రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఊరిలోనే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన పదవీ కాంక్ష ఏమేరకు ప్రభావం చూపిందో అర్థమవుతుంది. ఇవీ గ్రామాల్లో గతానుభవాలు శాసించే తుపాకుల మధ్య గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఆఖరికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలున్నాయి. గ్రామాల్లో చీకటి పడిందంటే చాలు పోలీసుల బూట్ల చప్పుడు, నక్సలైట్ల తుపాకుల మోతలతో తెల్లవారేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఊరికి దూరంగా పట్టణాల్లో నివాసం ఉండేవారు. కొందరైతే రాత్రి అయితే ఊరు విడిచి వెళ్లేవారు. అనేక సందర్భాల్లో నక్సలైట్లు ప్రజాప్రతినిధులను పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ.. టార్గెట్ చేసి భౌతికదాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రామాభివృద్ధికి వచ్చే జవహర్ రోజ్గార్ యోజన(జేఆర్వై) నిధులను మింగారంటూ, అనేక మంది సర్పంచులపై దాడులు జరిగాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది ‘సర్పంచ్ గిరీకి ఓ సలాం.. మాకు వద్దు ఆ పదవి’ అంటూ దూరంగా ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. అందుకు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే తాజా ఉదాహరణగా నిలుస్తాయి. గతం గాయాలు ఇవీ.. ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, మాజీ సర్పంచ్లను మావోయిస్టు, జనశక్తి నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ హత్య చేశారు. ● రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సర్పంచ్ రాధాకిషన్రావును నక్సలైట్లు హత్య చేశారు. ఇదే మండలం సుద్దాల మాజీ సర్పంచ్ ఏనుగు ప్రభాకర్రావు అలియాస్ వేణుగోపాల్రావును మారుపాక శివారులో చంపేశారు. ● చందుర్తి మండలం రామారావుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పోతుగంటి భాస్కర్ను చంపేశారు. ● ఎల్లారెడిపేట మండలం కంచర్లకు చెందిన మాజీ సర్పంచ్ సూర వెంకటిని, ఇదే మండలం సింగారంకు చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య ను, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ ఎల్సాని మల్లయ్యను నక్సలైట్లు చంపేశారు. ● గంభీరావుపేట మండలం గజసింగారంకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డిని కాల్చి చంపారు. ● జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన మాజీ సర్పంచ్ బచ్చు నందంను హత్య చేశారు. ● పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీపతి రాజయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ తుల సుధాకర్రావును, ఇదే మండలం పెద్దరాతిపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డిని చంపేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక మంది నక్సలైట్ల తూటాలకు బలి అయ్యారు. నక్సలైట్లు చేసిన భౌతికదాడులకు లెక్కే లేదు. ఇలాంటి పరిస్థిల్లో రెండు దశాబ్దాల కిందట సర్పంచ్ పదవి ముళ్ల కిరీటంలా భావించి తమకు వద్దు అనేవారు. కానీ, నక్సలైట్ల కదలికలు క్షీణించడంతో పల్లెల్లో ఎన్నికల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు వచ్చాయి. నాడు పోటీకి నై.. నేడు సై.. మారిన పల్లె ముఖచిత్రం రెండు దశాబ్దాల కిందట పల్లెల్లో కల్లోలం ప్రాబల్య ప్రాంతాల్లో ‘అన్నలదే’ రాజ్యం ఇన్ఫార్మర్ల పేరిట సర్పంచ్లను హత్య చేసిన నక్సలైట్లు -
సామాజిక సేవలో మేము సైతం
కరీంనగర్టౌన్: ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించి విరమణ పొంది సంఘటితమై సంఘం ఏర్పర్చుకున్నారు. తమ హక్కుల సాధనకోసమే కాకుండా వృద్ధులకు మూడు నెలలకోసారి ఉచిత వైద్యశిబిరాలు, యోగాశిక్షణ తరగతులు, చెట్లు, మొక్కలు నాటడం, గ్రంథాలయంలో పఠనం సాగించడం, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడం, చలివేంద్రాల ఏర్పాటు లాంటి సేవా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం పెన్షనర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. గ్రంథాలయం, చెస్, క్యారం.. పెన్షనర్ భవన్లో ఒక గదిలో గ్రంథాలయం, హాల్లో టీవీతో పాటు, క్యారం, చెస్ ఆడేందుకు గదులతో పాటు దినపత్రికలు అందుబాటులో ఉంటాయి. రూ.2లక్షల విలువైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉండడంతో వివిధ పుస్తకాలు చదవడం పెన్షనర్లు అలవాటుగా మార్చుకున్నారు. అలాగే సంఘం సభ్యుల కుటుంబ సభ్యులు చనిపోతే గ్రూప్గా వెళ్లి నివాళి అర్పిస్తారు. నేడు వేడుకలు ఇందిరానగర్లోని పెన్షనర్స్ భవన్ కార్యాలయంలో 75 ఏళ్లు నిండిన పెన్షనర్ల దంపతులను బుధవారం సన్మానించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిగా డిప్యూటీ డైరెక్టర్ యు. నాగరాజు హాజరుకానున్నారు. టీఎన్జీవో భవన్లో పెన్షనర్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 మండలాల్లో 31 శాఖలతో 300 మండల యూనిట్లతో 15 వేల మంది పెన్షనర్ల సభ్యత్వంతో సొంత భవనాలు ఏర్పర్చుకోని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. విజయవంతం చేయాలి కరీంనగర్ అర్బన్: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం టీఎన్జీవో భవన్లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పెన్షనర్ల కేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల కేఽశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలదాసరి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ పెన్షనర్లను సన్మానించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పెన్షనర్లు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం.. సేవా కార్యక్రమాలు నెలనెలా సమావేశాలు జిల్లాలో 15 వేల మంది పెన్షనర్లు నేడు పెన్షనర్స్ డే -
రేకుర్తి కంటి ఆసుపత్రికి విరాళం
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా.భాస్కర్ మడేకర్ ఉదార నేత్ర వైద్యశాలకు ఐడీబీఐ బ్యాంకు రూ.74,08,700 భారీ విరాళం సీఎస్ఆర్ కింద అందజేసినట్లు ఆసుపత్రి చైర్మన్ కె.వేణుమూర్తి తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రెటీనా డిపార్ట్మెంట్లో మాడ్యులర్ మూడు ఆపరేషన్ థియేటర్లు, అశోక్ ల్యాండ్ బస్ గురించి ఈ విరాళం డబ్బును ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రిలో కాటరాక్ట్ ఆపరేషన్లతోపాటు గ్లకోమా, మెల్లకన్ను, రెటీనా వంటి సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ గురువారం ఉచితంగా కంటి(తెల్ల రేషన్ కార్డు, 50 ఏళ్ల వయస్సు తప్పనిసరి) ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని అన్నారు. కేవలం హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్న రెటీనా డిపార్టుమెంటును సుమారు రూ.5కోట్ల బడ్జెట్తో రేకుర్తి ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేణుమూర్తితోపాటు ఆసుపత్రి ప్రతినిధులు సురేశ్, ప్రకాశ్హొల్లా, పవన్కుమార్, ఇంజనీర్ అన్నారెడ్డి, డా.టి.మురళీధర్రావు, శరత్కృష్ణ, శివకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. -
అక్రమాలకు ముకుతాడు!
కరీంనగర్ అర్బన్: యూరియా అక్రమాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు యూరియా తరలుతుండగా.. లక్షిత వర్గానికే చేరేలా యాప్ను అందుబాటులోకి తెస్తోంది. ఈనెల 20 నుంచి యాప్ అందుబాటులోకి రానుండగా.. ఈనెల 18, 19ల్లో వ్యవసాయ అధికారులకు శిక్షణనివ్వనున్నారు. ప్రస్తుతం ఆధార్/బయోమెట్రిక్తో యూరియా పంపిణీ చేస్తుండగా.. యాప్ అందుబాటులోకి రాగానే స్లాట్ విధానంలో యూరియా పంపిణీ చేయనున్నారు. వానా కాలం సీజన్లో యూరియా కోసం రైతులు బారులు తీరడం, పలు మండలాల్లో అవసరం మేరకు లభ్యం కాకపోవడంతో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రైతులకు సరిపడా లభించేలా కొత్తగా బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 3.38లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. రెండు సీజన్లు కలిపి 90వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. పత్తి పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నట్లే.. రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకొని యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. విడతలవారీగా.. రైతులు ఒకేసారి కాకుండా విడతలవారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదెకరాల్లో భూమి ఉ న్న రైతులు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్లోనే బుకింగ్.. యూరియా బుకింగ్ యాప్లో పట్టాదారు పాసు పుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్కు ఓటీపీ వస్తుంది. సదరు నంబర్ నమోదు చేయగానే రైతుకు ఎన్ని ఎకరాలుంది.. ఏ పంట వేశారనే వివరాలతోపాటు ఆ పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం, బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రీటైలర్ లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆలోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్టాక్లోకి వెళ్తుంది. ఈ యాప్తో జిల్లా మొత్తంలో యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉందనే సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు సైతం తెలిసిపోతుంది. ప్రస్తుతం ఆధార్తో పంపిణీ కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎంఎఫ్ఎంఎస్) ప్రవేశపెట్టి వ్యాపారులతోపాటు సంఘాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లు సరఫరా చేసింది. ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేసి రైతుల వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్న్రాు. దీంతో ఆధార్ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నారో పీఓఎస్ మిషన్లలో తెలుస్తుంది. అధికంగా తీసుకొని నిల్వ చేసుకునే వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వేరేవారి ఆధార్ తీసుకొస్తే సంబంధిత రైతు చరవాణికి వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. పంట వివరాలెలా.. ఇదిలా ఉండగా.. యాసంగి క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి వరకు పూర్తి కాదు. అలాంటప్పుడు రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనేది ఎలా నిర్ధారిస్తారు? ఏ ఆధారంగా యూరియా కేటాయిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఒకే సమయంలో రైతులకు యూరియా అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి లక్ష మంది రైతులు నమోదు చేసుకుంటే యాప్ పని చేస్తుందా? సర్వర్ సపోర్ట్ చేస్తుందా?. 15 రోజులకోసారి.. 15 రోజులకోసారి యూరియా ఇస్తారు. అయితే మొదటి 15 రోజుల్లో కొరతతోనో లేక రైతులు రావడానికి వీలు లేకనో లేదా ఆర్థిక సమస్య కారణంగానో యూరియా లభించకపోతే తర్వాత రెండు కలిపి ఇస్తారా? లేదా ఎగవేస్తారా అన్నది స్పష్టత లేదు. కౌలు రైతుల నమోదుకు అసలు రైతులు అంగీకరించే పరిస్ధితి లేదు. ఎకరం వరికి కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్న పంటకు 2 బస్తాలివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
హుజూరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే శాఖాఫరమైన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం అన్నారు. మూడో విడత ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనున్న నేపథ్యంలో మంగళవారం డివిజన్వ్యాప్తంగా హుజూరాబాద్, జమ్మికుంట, సైదాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ వేళ ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలా భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద నిఘా పెంచాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. నిబంధనలకనుగుణంగా విధులను నిర్వర్తించాలని అన్నారు. ఏసీపీ మాధవి తదితరులున్నారు. -
దేహదానానికి తల్లీబిడ్డల అంగీకారం
జ్యోతినగర్(రామగుండం): తమదేహాలు దానం చేసేందుకు తల్లీబిడ్డలు అంగీకరించారు. ఎన్టీపీసీ కృష్ణానగర్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సామ శిరీష, ఆమె తల్లి శారద తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తమ మరణానంతరం నేత్రాలు, అవయవాలతోపాటు శరీరాన్ని కూడా దానం చేస్తామని ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష చదువుతోపాటు విలువలు కూడా బోధించాల్సిన బాధ్యతను ఆచరణలో చూపించారు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె తల్లి శారద సదాశయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అవయవదాన అవగాహన కార్యక్రమాల ప్రభావంతో ఈ మహత్తర నిర్ణయానికి వచ్చారు. మరణానంతరం ఇతరులకు చూపు, జీవితం అందించడంతో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా శరీరాన్ని దానం చేయాలని శారద తన కూతురు శిరీషకు తెలియజేశారు. తల్లి ఆలోచనను గౌరవించిన శిరీష కూడా అదే బాటలో నడుస్తానంటూ తల్లితో పాటు తాను కూడా అవయవాలు, శరీరాన్ని దానం చేస్తానని అంగీకరించారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ కృష్ణానగర్లో తల్లి, బిడ్డ ఇద్దరూ తమ అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు అందజేశారు. సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు, జిల్లా సలహాదారు తడబోయిన రామన్న వారిని శాలువాతో సత్కరించారు. ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, చంద్రమౌళి, భీష్మాచారి, వాసు, వెద్దీ అనంతరాములు, కవిత, రఘురాం తదితరులు ప్రశంసించారు. -
తీర్థయాత్రలకు స్పెషల్ లగ్జరీ బస్సులు
కరీంనగర్ టౌన్: తీర్థయాత్రల కోసం ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతోంది. ఇప్పటికే ఆయా పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను ప్రారంభించిన అధికారులు కొత్తగా ఉడిపి, గోకర్ణ, గోవా, కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ దర్శనం కోసం బస్సులు ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్–1, 2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 24న కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్, మైహర్, రామ్ టెక్, చందా మహంకాళి, చిత్రకూట్ తదితర ప్రాంతాల సందర్శన కోసం బయలుదేరుతుందన్నారు. వివరాల కోసం 7382849352, 9959225920, 80746 90491 నంబర్లకు కాల్చేయాలని సూచించారు. కరీంనగర్–2 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి 27న సాయంత్రం 6 గంటలకు హంపి, హరిబేరు, కుక్కి, శృంగేరి, ఉడిపి, మృగేశ్వర్, గోకర్ణ తదితర ఆలయాల సందర్శన కోసం బయలు దేరుతుందని వివరించారు. పెద్దలు, పిల్లల టికెట్ల వివరాలు, ఇతర సమాచారం కోసం 9398658062, 7382850708, 8978383084 నంబర్లకు ఫోన్చేయాలని సూచించారు. నీటిపారుదల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా లక్ష్మణ్రావుతిమ్మాపూర్: నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అడ్హక్ కమిటీ కన్వీనర్ టీఎన్జీవోస్ కరీనంగర్ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు నియమితులయ్యారు. రాష్ట్ర మేజర్ టెంపుల్ ఎంప్లాయీస్ జేఏసీ కోకన్వీనర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యాయుల చంద్రశేఖర్ ఎల్ఎండీ నీటిపారుదలశాఖ కార్యాలయంలో లక్ష్మణ్రావును సత్కరించారు. కొండగట్టు అంజన్న శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగారపు రమేశ్ గౌడ్, తిమ్మాపూర్ టీఎన్జీవో యూనిట్ ప్రెసిడెంట్ పోలు కిషన్, కరీంనగర్ జిల్లా అసోషియేట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, నాయకులు ప్రసాద్, పవన్ పాల్గొన్నారు. -
ఆఖరి పోరాటం!
హుజూరాబాద్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సామగ్రితో బయల్దేరుతున్న సిబ్బంది జిల్లా పంచాయతీలు ఏకగ్రీవాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కరీంనగర్ 111 03 02 00 00 01 పెద్దపల్లి 91 06 06 00 00 00 జగిత్యాల 119 06 06 00 00 00 సిరిసిల్ల 87 07 02 02 00 03 మొత్తం 408 22 16 02 00 04 సాక్షిప్రతినిధి,కరీంనగర్: గ్రామ పంచాయతీ తుది పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మమైన ఈ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆదినుంచీ అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్పై ఆదినుంచీ తన పైచేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పటివరకూ రెండు విడతల ఎన్నికల్లో ఇదే దృశ్యం కనిపించింది. కీలకమైన మూడో విడతలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఇక ఆఖరి పోరాటంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తుండగా.. ఇప్పటివరకు 64 సీట్లు గెలిచిన బీజేపీ.. 100 సీట్లకు పైగా గెలుపొంది సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డేందుకు ఆఖరి ఎన్నికల బరిలోకి దిగాయి. ఆగని డబ్బు, మద్యం పంపిణీ.. తొలి రెండు విడతల్లో మద్యం, డబ్బు పంపిణీతో అభ్యర్థులు చేతులు కాల్చుకున్నా.. మూడో విడతలోనూ అవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. సర్పంచ్ బరిలో ఉన్నవారు ఎక్కడా తగ్గడం లేదు. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మేందుకు సిద్ధమవుతు న్నారు. ఓటర్లకు తాయిలాలిచ్చి ప్రలోభాలకు గురిచేయడంలో ఎక్కడా తగ్గడం లేదు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీకే పరిమితమవగా.. జగిత్యాల జిల్లాలో ఒకడుగు ముందుకేసి ఓటర్లకు ఏకంగా వెండి నాణేలు పంచు తుండడం విశేషం. ఇంత జరుగుతున్నా.. ప్రలోభాలను పోలీసులు పూర్తిస్థాయిలో నియంత్రించడం లేదన్న విమర్శలు ఆగడం లేదు.ఇప్పటివరకు తొలివిడత 398 గ్రామాలు, రెండోవిడతలో 418 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 436 స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్ మద్దతిచ్చిన చోట 224 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీజేపీ సపోర్ట్తో 64 మంది సర్పంచులుగా గెలిచారు. ఇతరులు 87 మంది స్వతంత్ర సర్పంచులుగా ఎన్నికయ్యారు. కీలకమైన మూడో విడతలో 436 స్థానాల్లో కనీసం 300 వరకు స్థానాలను వశపరచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక సగానికిపై సీట్లు గెలవాలని బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. రెండో విడత ఎన్నికల్లో గెలిచిన స్వతంత్రులు, బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చిన వారిని, మూడో విడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో కలిపి 800 వరకు సర్పంచుల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాలోని 408 గ్రామాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
ఉపాధిహామీని నిర్వీర్యం చేసే కుట్ర
కరీంనగర్ కార్పొరేషన్: మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని సుడా చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధిహామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని ఖండించారు. కేవలం కాంగ్రెస్కు పేరు వస్తుందనే కుట్రపూరితంగా మహాత్మాగాంధీ పేరును తొలగించారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా కూలీ రేట్లు, పని దినాలు పెంచని ప్రభుత్వం కొత్త బిల్లు పేరిట నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు బల్లలు చరచడం కాదని, బిల్లును వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, మేకల నర్సయ్య, రమణారెడ్డి, సుదర్శన్, మేరాజ్, మాసుంఖాన్, తోట అంజయ్య, బషీర్, పెద్దిగారి తిరుపతి, కొట్టె ప్రభాకర్, అష్రఫ్, బత్తుల రాజ్కుమార్, బషీర్, భారీ, సాయిరాం, ఉప్పరి అజయ్, యోనా తదితరులు పాల్గొన్నారు. -
సమర్థతకు సలాం.. కావొద్దు గులాం
కరీంనగర్ అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. గ్రామ తలరాతను మార్చే శక్తి ఓటరుదే. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తవగా.. తుది విడతగా బుధవారం ఎన్నికలు ముగియనున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రచారం పూర్తి చేశారు. ఈ క్రమంలో ఓటరు ఓటు ప్రాధాన్యం చాటేలా తీర్పునివ్వడమే ఉత్తమం. ఇటీవల ఫలితాల్లో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులుండగా.. ఓట్లు సమానంగా వచ్చి టాస్తో గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు కీలకమేనన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ప్రలోభాలకు లొంగకుండా ఓటరు తనదైన శైలిలో ఓటును సద్వినియోగం చేసుకోవడం అత్యవసరం. ఆ ఊరును గుర్తుంచుకోండి.. ఓటర్లంతా సింగారంను మరిపించేలా వ్యవహరించడం సుపరిపాలనకు బీజం వేసినట్లే. మహబూ బాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రా మంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఏ ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 875 మంది ఓటర్లుండగా.. అందరూ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నా.. పోలింగ్ రోజున స్వగ్రామం చేరి అందరూ ఓటేశారు. నిష్పక్షపాతం.. కులం, మతం, వర్గం, కుటుంబం, తమవారంటూ పక్షపాతం చూపకుండా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఉండాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపకుండా లక్షిత వర్గానికి అందేలా చూడాలి. సమన్వయంతో.. గ్రామంలో ఏమేం సమస్యలున్నాయి.. వాటి పరిష్కార మార్గాలు.. నిధుల సమీకరణలో చాకచక్యం ఉండాలి. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకెళ్లేవారే అవసరం. గ్రామంలో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఇతర నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామసభలు నిర్వహించి నిర్ణయం మేరకు అడుగులేయాలి. శాంతియుతంగా.. ప్రజల సమస్యలు తనవిగా భావించి, ప్రజా ప్రయోజనమే ముఖ్యమనే వారు కావాలి. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం, గ్రంథాలయం తదితర వసతుల కల్పనపై దృష్టి పెట్టే నేర్పరి అవసరం. గ్రామంలో ఘర్షణలు, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి. శాంతియుత వాతావరణం ఉండేలా చొరవ చూపాలి. పారదర్శకత.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా గ్రామ సర్పంచ్ వద్దకే వెళ్తారు. సర్పంచ్గా గెలిచినవారు కొందరు పట్టణాలకు వెళ్తుంటారు. స్థానికంగా ఉండి ప్రజల కష్టాల్లో భాగమయ్యే వ్యక్తి కావాలి. అలాగే వచ్చే నిధులను సొంత అవసరాలకు కాకుండా.. గ్రామానికే పారదర్శకంగా వినియోగించాలి. ప్రతీ రూపాయికి లెక్క చూపేవారు కావాలి. జవాబుదారీతనంగా ఉండాలి. -
సర్వేకు సహకరించాలి
కుష్ఠు రహిత ఉన్నతమైన సమాజం కోసం చేస్తున్న సర్వేకు ప్రజలు సహకరించాలి. వైద్యసిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు శరీరంపై మచ్చలు చూపించాలి. కుష్ఠు మచ్చలుగా అనుమానిస్తే పరీక్షలు చేయించి, నిర్ధారిస్తారు. ఇలాంటివారి వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తాం. ముందస్తు చికిత్స చేస్తే వ్యాధి సులువుగా నయం చేయవచ్చు. – వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ మందులు ఉచితం ఈనెల 18వ తేదీ నుంచి వైద్యసిబ్బంది ఇంటింటా లెప్రసీ సర్వే చేస్తారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వారికి సహకరించాలి. మచ్చలు ఉంటే వారు పరిశీలిస్తారు. గోధుమరంగుతో కూడిన మచ్చలు ఉంటే సిబ్బందికి చూపించాలి. వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే ప్రభు త్వమే పూర్తిస్థాయిలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. – సుధాకర్ రెడ్డి, లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్, పెద్దపల్లి -
సమస్యల పరిష్కారానికి కృషి
పెన్షనర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి గ్రంథాలయం, టీవీ ఇతరత్రా అన్నిరకాల పుస్తకాలు ఏర్పాటు చేసి భవనంలో యోగా, సాహిత్యం తరగతులు నిర్వహిస్తున్నాం. పింఛన్దారులకు ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం. ఏటా డిసెంబర్ 17న పెన్షనర్ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. –మోసం అంజయ్య, రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆనందంగా ఉంది ఉద్యోగ విరమణ అనంతరం అంతా ఒకచోట కలిసి కూర్చోవడం, ఒకరి బాధల్ని మరొకరు పంచుకోవడం, సామాజిక సేవల్లో భాగస్వామ్యమవడం ఆనందంగా ఉంది. ఒంటరి వాళ్లం కాదు అన్న సంకేతాన్ని పింఛన్దారులకు అందిస్తున్నాం. సామాజిక సేవలో భాగస్వాములమవుతాం. –దామెర మహేందర్రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బస్చార్జీల్లో రాయితీ కల్పించాలి మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వం కూడా రిటైర్డు ఉద్యోగులకు బస్సు ప్రయాణాల చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించాలి. మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించి హెల్త్కార్డులు మంజూరు చేయాలి. 65 ఏళ్లు నిండిన పెన్షనర్కు పంజాబ్ రాష్ట్రం ఇస్తున్నట్లు అదనపు పెన్షన్ను జమచేయాలి. –దాసరి రామయ్య, పెన్షనర్ -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
హుజూరాబాద్/జమ్మికుంట/ఇల్లందకుంట: మూడో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు–2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, వీణవంక, సైదాపూర్ మండలాల్లోని పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. హుజూరాబాద్ మండలానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జమ్మికుంట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఇల్లందకుంట మండలానికి సీతారామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతీ కౌంటర్, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు జిల్లాకేంద్రానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఆర్డీవో రమేశ్బాబు, ఇల్లందకుంట తహసీల్దార్ రాజమల్లు, ఎంపీడీవో రాజేశ్వర్రావు, ఎంఈవో రాములునాయక్, ఎస్సై క్రాంతికుమార్ తదితరులున్నారు. -
కుష్ఠు నిర్మూలనే లక్ష్యం
కరీంనగర్/పెద్దపల్లి: కుష్ఠు నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వ్యాధిని తొలదశలోనే గుర్తించి చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటా రెండోవిడత సర్వేకు శ్రీకారం చుట్టింది. ఏటా రెండుసార్లు సర్వే నిర్వహిస్తోంది. ఈఏడాది మార్చి 17 నుంచి 30వ తేదీ వరకు తొలివిడత సర్వే నిర్వహించింది. అప్పుడు కరీంనగర్ జిల్లాలో సుమారు వెయ్యి మందికిపైగా, పెద్దపల్లి జిల్లాలో 216మంది అనుమానితులను గుర్తించారు. పరీక్షల అనంతరం కరీంనగర్లో 8 మంది, పెద్దపల్లి జిల్లాలో ఏడుగురికి వ్యాధి ఉన్నట్లు తేలింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన రెండోవిడతలో కరీంనగర్ జిల్లాలో 2 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల 9,372 ఇళ్లలో సర్వే చేస్తారు. ఇందుకోసం కరీంనగర్లో 645 మంది ఆశ కార్యకర్తలు, 250 మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, సూపర్వైజర్లు, పెద్దపల్లి జిల్లాలో 638 మందితో సర్వే చేయన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 29 మందికి చికిత్స అందిస్తున్నారు. చర్మంపై మచ్చలు కనిపించినా, కాళ్లు, చేతులు చచ్చుబడినా వైద్యుల ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంపై స్ప ర్శలేని మచ్చలు, నరాలవాపు, నొప్పితెలియని పుండ్లు, ముఖంపై గుళ్లలు, చేతులు, పాదాల తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తే కుష్ఠుగా అనుమానిస్తారు. వ్యాధి లక్షణాలు.. ● చర్మంపై స్పర్శలేని రాగిరంగు మచ్చలు. చెవులపై బుడిపెలు, కణితులు, నరాల తిమ్మిర్లు. ● మందమైన మెరిసే జిడ్డుగల చర్మం ● కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం ● కనురెప్పలు మూతపడకపోవడం ● చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం ● చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం ● కాళ్ల చెప్పులు జారిపోవడం ● చల్లని, వేడివస్తువులు గుర్తించకపోవడం ● పాదాలు, మడమల్లో వాపు రావడం ● ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం. చికిత్స విధానం.. కుష్ఠు నివారణకు రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తారు. శరీరంపై మూడు మచ్చలు ఉన్నవారికి పాసివ్బ్యాసిలరీ(పీబీ) విధానంలో ఆరు నెలల పాటు చికిత్స అందిస్తారు. ఐదు మచ్చలకు పైబడి ఉన్నవారికి మల్టీబ్యాసిలరీ(ఎంబీ) విధానంలో చికిత్స చేస్తారు. ఇందులో భాగంగా నెలకు ఒకసారి మందులను పేషెంట్ల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తారు. సర్వేలో గుర్తించిన బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందజేయడంతోపాటు ఆ వ్యాఽధిపై అవగాహన కల్పిస్తారు. బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. బాధితులకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. 12 నెలల పాటు చికిత్స.. మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మక్రిమితో కుష్టు సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చర్మం, నరాలకు సోకుతుంది. లక్షణా లు బహిర్గతమయ్యేందుకు సగటున 3ఏళ్ల నుంచి 5ఏళ్ల సమయం పడుతుంది. వ్యాధి ఎవరికై న రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6నెలల నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు. వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే రేపటి నుంచి 31వరకు ఇంటింటా సర్వే జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు -
జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవ్..
జగిత్యాల: ‘నీ వ్యక్తిగత పనుల కోసం జగిత్యాల ఆ త్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవ్.. కోరుట్ల వారు జి ల్లాకేంద్రానికి వస్తున్నారని అంటున్నావ్.. జిల్లాకేంద్రం అందరిదీ.. ఎవరైనా రావచ్చు.. మెడికల్ కళా శాల విద్యార్థులకు మంచి విద్య అందాలని అడిగే హక్కు నాకూ ఉంది. నేను వ్యక్తిగత విమర్శలు చే యలేదు..’ అంటూ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై ఫైర్ అయ్యా రు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కా ర్యాలయంలో మాట్లాడారు. తన కృషితోనే జగిత్యాలకు మెడికల్ కళాశాల వచ్చిందని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పరి పాలన సౌలభ్యం కోసం కేసీఆర్ జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసి మెడికల్ కళాశాల మంజూరు చేశారని చెప్పారు. మెడికల్ కళాశాల విద్యార్థులకు ఒక డాక్టర్గా మంచి విద్య అందాలని సందర్శించడం తప్పా.. అని ప్రశ్నించారు. తాను ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. సంజయ్ కుమార్లో ఆత్మవిశ్వాసం తక్కువ.. అభద్రత ఎక్కువగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లా అంటే ఏంటి..? జిల్లాలో ఏమేం ఉంటాయి..? ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని సూచించారు. తన నాన్న కాంట్రాక్టర్ కాదని, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అన్నారు. కోరుట్ల, మెట్పల్లి ఆస్పత్రుల గురించి అసెంబ్లీలో అడిగి హక్కులు సాధించుకున్నానని, తాను కోరుట్లలో రాజీనామా చేస్తా.. సంజయ్ జగిత్యాలలో రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు. ఆయన వెంట మారు సాయిరెడ్డి, రాజేశ్, దశరథరెడ్డి, లక్ష్మీరెడ్డి, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకున్నట్లు? కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లా ఏర్పాటు చేశారు జిల్లాకేంద్రానికి అందరూ వస్తారు.. అందులో తప్పేంటి..? నేను రాజీనామా చేస్తా... నువ్వు రాజీనామా చేయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్ -
● మూడో విడత సర్పంచ్ అభ్యర్థుల మల్లగుల్లాలు ● రెండు విడతల ఫలితాలపై విశ్లేషణ ● గెలిచిన వారి నుంచి పలువురి సలహాలు ● ప్రలోభాలు.. ఓటర్ల నాడిపై అంచనాలు ● సైలెంట్ మోడ్లో చివరి విడత పల్లెలు
కరీంనగర్: పల్లెపోరు చివరి దశకు చేరింది. రెండు విడతల్లో జరిగిన పలు సంఘటనలు.. గెలుపోట ములు.. మూడో విడత అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు చేసిన వారే ఓటమిని చవిచూశారన్న సమాచారంతో కొందరు గెలుపే లక్ష్యంగా ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. మరికొందరు సాధ్యమైనంత వరకు ఖర్చుచేసి కాళ్లా..వేళ్లా పడేందుకు నిర్ణయించుకున్నా రు. జిల్లాలోని హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్ మండలాల్లో బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి ఇక్కడ ప్రచారం ముగిసి, సైలెంట్ మోడ్ ప్రారంభం కావడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. ప్రలోభం.. ప్రసన్నం గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఒకప్పుడు అభ్యర్థి పేరు, వంశపారంపర్యం, గ్రామానికి చేసిన సేవలు గుర్తొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నోటు, మద్యం, మాంసం మధ్యే గ్రామ రాజకీయాలు నడుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు పూర్తయిన రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్నది కాదు.. ఓటరును ప్రసన్నం చేసుకున్నామా లేదా అన్నదే ముఖ్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. గత రెండు విడతల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టిన కొందరు ఓటమి పాలవుతుంటే, సాదాసీదాగా ప్రజలతో మమేకమైన కొందరు విజయపథాన నడిచారు. మూడో విడతలోనూ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం, సోషల్ మీడియా వీడియోలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రసంగాలతో బిజీగా ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు పూర్తిగా ప్రలోభాల బాట పట్టారు. మద్యం, మాంసం, ఓటుకింత అంటూ అభ్యర్థులు స్వయంగా రంగంలోకి దిగకుండా తమ అనుచరులతో పని కాని చ్చేస్తున్నారు. ఎవరి ఇంటికి ఏ రోజు ఏ ‘సరుకు’ వెళ్లాలన్నది ముందే లిస్టులు తయారు చేసుకొని కార్యాచరణ పూర్తి చేస్తున్నారు. ఇక వార్డు మెంబర్ అభ్యర్థులు ఉపసర్పంచ్ పదవిని లక్ష్యంగా పెట్టుకొని రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ‘ఇప్పుడు ఖర్చు చేస్తేనే రేపు పదవి’ అన్న భావనతో ముందుకు సాగుతున్నారు. ఓటరు మాత్రం తమ మనసుకు నచ్చిన వారికే ఓటు వేస్తున్నారు. ఈ విషయం గత రెండు విడతల్లో ఖాయమైంది. మూడో విడత అభ్యర్థుల ఫలితాల కోసం బుధవారం సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. -
నేటి నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): ధనుర్మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని ముయార గిరి పీఠదీశులు నమిలకొండ రమణా చార్య స్వామి తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్లోని శ్రీ నిలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం అర్చన, ఆరాధన సేవాకాలం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, 30వ తేదీ వైకుంఠ ఏకా దశి పూజలు, జనవరి 11న కూడారై ఉత్సవం, 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి గోదారంగనాధుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కరీంనగర్టౌన్: సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రకాశం గంజ్లో సంఘం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి పతాకం ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆవుల రాజయ్య, సురేందర్, సుక్క కుమార్, ఆవుల లక్ష్మణ్, సంపత్, బిక్షపతి, రాజమౌళి పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూ నివర్సిటీ పరిధిలోని కళాశాలలకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులో 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు ఈ నెల 24లోపు ఫీజు చెల్లించాలని పరీక్షలనియంత్రణ అధికారి డి.సురేశ్ కుమార్ తెలిపా రు. పరీక్షలు 2026 జనవరిలో జరుగుతా యని, రూ.500 అపరాధ రుసుంతో ఈ నెల 30లోపు ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. -
షార్జా పోలీసుల అదుపులో కల్లెడ యువకుడు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు రెండేళ్లు ఉండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా షార్జా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం జరిగింది. వివరాలు.. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన గాలిపల్లి మధు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. స్వగ్రామం వస్తున్నానని ఇటీవల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో మధు షార్జా ఎయిర్పోర్టుకు చేరుకుని బోర్డింగ్ చేస్తున్న సమయంలో ఎయిర్పోర్టు పోలీసులు అతడి నుంచి పాస్పోర్టు, సెల్ఫోన్ తీసుకుని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సప్లో వాయిస్రికార్డు పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అక్కడున్న వారికి సమాచారం అందించారు. కాగా గతంలో మధు పేరిట ఉన్న ఐడీ కార్డుతో గుర్తుతెలియని వ్యక్తులు రుణం తీసుకోగా, రుణం ఎగవేసి వెళ్లకుండా బ్యాంక్ అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి మధును స్వదేశానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వాయిస్ రికార్డుతో కుటుంబ సభ్యులకు సమాచారం -
లాభాల ‘పుట్ట’
● పుట్ట గొడుగుల పెంపకంలో వ్యవసాయ విద్యార్థులు ● తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ● రైతులకు శిక్షణ ఇస్తామంటున్న ప్రొఫెసర్లు జగిత్యాలఅగ్రికల్చర్: ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది ఔత్సాహిక రైతులు పెంచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలాస వ్యవసాయ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు సైతం తమ ప్రాజెక్టులో భాగంగా పుట్టగొడుగులు పెంచుతున్నారు. వీరికి గైడ్గా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్లాగౌడ్ వ్యవహరిస్తున్నారు. ఇలా పెంచుతారు పుట్టగొడుగులను పెంచేందుకు 6–12 నెలల వయస్సు ఉన్న గడ్డిని ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన గడ్డిపై నీళ్లు చల్లి, తగినంత తేమ ఉండేలా చూస్తారు. ఒక కిలో వరిగడ్డికి 50 గ్రాముల స్పాన్ కలిపి పాలిథీన్ సంచుల్లో నింపి రబ్బర్ బ్యాండ్ వేస్తారు. సంచులను తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉన్న గదుల్లోకి పెడితే 3–4 వారాలకు గడ్డిపైన తెల్లని శీలింధ్రం వస్తోంది. ఇలా చేసిన 6–7 రోజులకు తొలి పంట వస్తుంది. రంగు మారిన, మచ్చలు కలిగిన గడ్డిని ఉపయోగించరు. పుట్టగొడుగులు పెంచే గదుల్లో పురుగులు, కీటకాలు, ఎలుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గదిలో ఉష్ణోగ్రత, తేమ శాతం తటస్థంగా ఉండేలా చూస్తారు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనువైన వరిగడ్డి పుట్టగొడుగులు, బటన్, అయిస్టర్, పాల పుట్టగొడుగుల రకాలను ఎక్కువగా పెంచుతున్నారు. లాభాలు పుట్టగొడుగులను తక్కువ పెట్టుబడితో, తక్కువ వ్యవధిలో అంటే 30–40 రోజుల్లో పెంచవచ్చు. వీటిలో ప్రొటీన్స్ వరి, గోధుమ, కూరగాయల కంటే అధికంగా ఉంటాయి. తాజా పుట్టగొడుగుల్లో విటమిన్–డీ అధికంగా ఉంటుంది. పోటాషియం, సోడియం నిష్పత్తి, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల బీపీ, ఆసిడిటితో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్–బీ కాంప్లెక్స్, విటమిన్–సీ, ఫాంటాథెనిక్, నియాసిన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తాజా పుట్టగొడుగుల్లో 43 కిలోల కాలరీలు ఉంటాయి. మార్కెట్లో డిమాండ్ పుట్టగొడుగులపై ప్రజలకు అవగాహన పెరగడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో శాఖాహారులకు మాంసాహారంగా ఉపయోగపడుతుంది. గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలు, సన్నకారు రైతులు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడితే మంచి ఆదాయం పొందవచ్చు. పుట్టగొడుగుల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు. వాటితో పచ్చళ్లు, బిర్యాని, సూప్ పౌడర్, కెచప్ వంటి పదార్థాలను తయారు చేయవచ్చు. -
15 రోజుల్లో వ్యవధిలో..
ఎప్పుడూ తేమ ఉండేలా చూ స్తే పుట్టుగొడుగులు పెరిగి, 15 రోజుల వ్యవధిలోనే 3 పంటలు వస్తాయి. కిలో ఎండుగడ్డి నుంచి దాదాపు కిలో పచ్చి పుట్టగొడులు వస్తాయి. రైతులకు లాభాసాటిగా ఉంటుంది. – సాయి లిఖిత, వ్యవసాయ విద్యార్థిని పుట్టగొడుగులు తాజాగా ఉన్నప్పుడే మార్కెట్ చేస్తే మంచి ధర వస్తుంది. ప్రిడ్జ్లో అయితే మరో 3 రోజులు నిల్వ ఉంటాయి. ఏడాదికి 9 పంటలు తీయవచ్చు. పుట్టుగొడుగుల్లో నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు వంటివి వస్తే వెంటనే తీసివేయాలి. – తరుణ్, వ్యవసాయ విద్యార్థి పుట్టగొడుగులు పెంచే రైతులు బృందాలుగా వస్తే వ్యవసాయ కళాశాలలో శిక్షణ ఇస్తాం. ప్ర యోగాత్మకంగా విద్యార్థులు ప్రాజెక్టులో తయారు చేసి సక్సెస్ సాధించారు. పుట్టగొడుగులను పెంచడం తేలిక, తక్కువ ఖర్చులో పెంపకం చేపట్టవచ్చు. – డాక్టర్ ఎల్లాగౌడ్, గైడ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలాస -
గుండెపోటుతో అన్నదాత మృతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): పొద్దంతా వ్యవసాయ పనులు చేసిన అన్నదాత నిద్రలోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతిచెందిన ఘటన బాధిత కుటుంబ సభ్యులను కలచివేసింది. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో విషాదం నింపింది. వివరాలు.. బండలింగంపల్లికి చెందిన రైతు జంగా ముత్తిరెడ్డి (45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం పొద్దంతా ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం రోజులాగే తన బెడ్ రూమ్లోకి వెళ్లి పడుకున్నాడు. వేకువజామున కుటుంబ సభ్యులు నిద్ర లేపగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కుటుంబీకులు స్థానిక వైద్యులకు చూపించగా అప్పటికే మరణించినట్లు వారు ధ్రువీకరించారు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు నరేశ్, కూతురు దివ్య ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లారీ బోల్తా.. డ్రైవర్కు స్వల్పగాయాలుధర్మపురి: పత్తి లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయపట్నం నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ ధర్మపురిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ శివారులోని కల్వర్టు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన యాదగిరి, నర్సింలు ద్విచక్ర వాహనంపై సిరిసి ల్లకు వస్తుండగా, కల్వర్టుపై వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. కాగా ఈ కల్వర్టుపై రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన కల్వర్టుకు మరమ్మతు చేయాలని వాహనదారులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సిరిసిల్ల– కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఈ కల్వర్టుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదుపాలకుర్తి(రామగుండం): మండలంలోని జీడీనగర్ గ్రామంలో ఆదివారం తన కారుపై దాడి చేసిన సూర సంతోష్పై సోమవారం బసంత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు ఫీట్ల గోపాల్ తెలిపారు. ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి సూర రమ గెలుపొందగా.. అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన తనను బీసీకాలనీలో నివాసముండే సూర సంతోష్ పరుష పదజాలంతో దూషిస్తూ తన కారు అద్దాలు ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. -
అమృత్ పనుల్లో అలసత్వం వద్దు
కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2 పథకం పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ శ్రీదేవి హెచ్చరించారు. పనులు మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, ఆయాజ్, నాగరాజు పాల్గొన్నారు. అమృత్ 2 పథకం అభివృద్ధి పనుల పురోగతి, తాగునీటి సరఫరా పైప్లైన్ పనులు, సమస్యలు, రిజర్వాయర్లు, సంప్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్లో సీడీఎంఏ చర్చించారు. పనులను ప్రారంభించకుండా, నత్తనడకన పనులు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా పైప్లైన్ల పనులతో పాటు, రిజర్వాయర్లు, సంప్ల నిర్మాణం పనులు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం అమృత్ అభివృద్ధి పనుల పురోగతి ఫొటోలు, వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. అమృత్లో భాగంగా చేపట్టిన లేక్ పునర్జీవ స్కీం ఒప్పందం పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం యూడీఐఎఫ్ ద్వారా విడుదల చేసిన రూ.50 కోట్ల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రణాళికలు సిద్దం చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎస్ఈ రాజ్ కుమార్, ప్రజారోగ్యశాఖ ఈఈ సంపత్ రావు పాల్గొన్నారు. -
● సొంత వైద్యంతో సమస్య జఠిలం ● జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దూరం
కరీంనగర్: ప్రస్తుతం జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు శీతల గాలుల తీవ్రత పెరుగుతోంది. ఆ ప్రభావంతో చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. చర్మం పొడిబారడం, పగళ్లు రావడం, దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎక్కువగా చర్మసమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇంట్లో ఒకరికి చర్మ సమస్య వచ్చిందంటే అది ఇంటిల్లిపాదికి వచ్చే ప్రమాదముందని, చర్మ సమస్యలు ఉన్న వారు వాడిన సబ్బులు, టవల్స్, బట్టలు ఇతరులు వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, లేదంటే అందరికి చర్మ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందంటున్నారు. జిల్లాలో 50 మందికి పైగా చర్మవ్యాధి నిపుణులు ఉండగా వారం పది రోజులుగా నిత్యం 100కుపై ఓపీ పేషెంట్లు వస్తున్నారు. ఎదురయ్యే ఇబ్బందులు చలికాలంలో చర్మం పొడిబారి తామర వస్తుంది. దురద ఉంటుంది. గోకితే దద్దుర్లు ఏర్పడి మంట పుడుతుంది. జలుబు, దగ్గు, ఎక్కువగా ఉన్న పిల్లలు ఎటోఫిన్ డెర్మటైటిస్ వ్యాధికి గురికావడంతోఎరుపు రంగు మచ్చలు వస్తాయి. సోరియాసిస్ సోకి చర్మంపై మచ్చలు ఏర్పడి పొట్టులా రాలిపోతూ దురద వస్తుంది. తలలో చుండ్రు పెరుగుతోంది. సెబోరిక్ డెర్మటైటిస్ తలలో ఏర్పడి పొట్టులా చర్మం ఊడిపోతుంది. కాళ్ల మడమలు, పెదాలు, చేతులపై పగుళ్లు వస్తాయి. చేతి మునివేళ్లు మంగా ఉండి గుంజినట్లు అవుతాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్లేటప్పుడు పూర్తిగా చర్మాని కప్పేలా ఉన్ని లేదా కాటన్ దుస్తులు ధరించాలి. సన్స్క్రీన్ లేపనాలు వాడాలి. గ్లిజరిన్ సబ్బులు వాడాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. చర్మం తేమగా ఉండేలా ప్రతి 2 గంటలకోసారి కొబ్బరినూనె, కోల్డ్ మాయిశ్చరైజర్ క్రీములు పూసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. విటమిన్‘సి’ ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. సోరియాసిస్, తామర, దద్దుర్లు ఏర్పడితే ఇంట్లోనే సొంత వైద్యాన్ని చేసుకోకుండా తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాలి. గహిణులు పాత్రలు కడిగేందుకు సబ్బులు వాడతారు. ఆ పని పూర్తయిన వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకొని కొబ్బరినూనె, మాయిశ్చరైజర్క్రీములు, ఇతర లేపనాలు రాసుకోవాలి. -
షార్ట్ సర్క్యూట్తో రూ.2.50 లక్షల ఆస్తినష్టం
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక మల్లికార్జున్నగర్లో చిరువ్యాపారి పి.రాజేశ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం రాజేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కలవారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా, సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ.2.50 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. సిబ్బంది ఎ.రమేశ్, ఎం.బానయ్య, పి.మనోహర్, ఇ.చందు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ పేరిట మట్టిదందా
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ట్రాక్టర్ యజమానులు అక్రమ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. సమీపంలోని గుట్ట నుంచి మట్టిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి. ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు మాత్రమే గుట్ట నుంచి మట్టిని ట్రాక్టర్ యజమానులు రవాణా చేయాలని నిర్ణయించారు. అయితే కొందరు ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో ఇతర అవసరాలకు సైతం మట్టిని రవాణా చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో అధికారులు ఉండటంతో ఇదే అదునుగా మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గ్రామంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్మాణానికి అవసరమైన మట్టిని ట్రాక్టర్ యజమానులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే గ్రామస్తుల సమాచారంతో సోమవారం రెవెన్యూ అధికారులు గుట్ట వద్దకు వెళ్లడంతో ట్రాక్టర్ యజమానులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి గుట్టనుంచి అక్రమ మట్టి రవాణాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. అధికారుల రాకతో ట్రాక్టర్ డ్రైవర్ల పరార్ -
సమ్మక్క భక్తులకు ముస్తాబైన వేములవాడ
వేములవాడ: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న, అనుబంధ ఆలయాలను అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క జాతరకు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకుని, కోడె మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా ఉండటంతో భక్తుల రద్దీ ప్రారంభమైంది. దీంతో, ఆలయ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుడి చెరువు పార్కింగ్ ప్లేస్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.100 కోడె కట్టె దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. వీఐపీ రోడ్తోపాటు ఆలయ పరిసరాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా భక్తులు స్నానం చేసేందుకు ప్రత్యేకంగా వేడి నీరు (హాట్ వాటర్) సదుపాయం కల్పించినట్లు ఆలయ ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. స్నానఘాట్ల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, భక్తులు సులభంగా స్నాన ప్రాంతాలను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం పరిశుభ్రత, నీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక లైటింగ్.. వేడి నీటి సౌకర్యం -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్: జిల్లాలో మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్తో సమీక్షించారు. గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. మూడో విడతకు హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇల్లందకుంటలో సీతారామచంద్రస్వామి ఆలయ కల్యాణమండపం, సైదాపూర్లో వెంకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
నాటి అల్ఫా.. నేడు రాజీవ్ చౌక్
విద్యానగర్(కరీంనగర్): నగరంలోని రాజీవ్ చౌక్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత రాజీవ్చౌక్ను గతంలో అల్ఫాచౌరస్తాగా పిలిచేవారు. ఇదే ప్రాంతంలో ఉన్న తీరందాజ్ థియేటర్ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. దాని చుట్టు పక్కల పంటపొలాలు ఉండేవి. 1953లో నిర్మించిన వక్ఫ్బోర్డు బిల్డింగ్లో చిన్న పిల్లలకు టీకాలు వేసేవారు. తర్వాత బిల్డింగ్ తీసేసి రెండంతస్తులల్లో దుకాణాల సముదాయం నిర్మించారు. ఈ సముదాయం ఎదురుగా అల్ఫా పేరుతో హోటల్ ఉండేది. ఈ హోటల్లో ఇరానీ చాయ్, బిస్కెట్టు, బన్ను అమ్మేవారు. ఉదయం సాయంత్రం ఈ హోటల్లో చాయ్ తాగేవారితో రద్దీగా ఉండేది. అల్ఫా హోటల్ పేరుతోనే ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మరణనంతరం 12 జనవరి 1994లో ఇక్కడి సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడే ఈ ప్రాంతానికి రాజీవ్చౌక్గా నామకరణం చేశారు. ప్రస్తుతం రాజీవ్చౌక్గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రాంతం వారధి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటీవల ఇక్కడి రాజీవ్గాంధీ విగ్రహాన్ని తొలగించారు. అధునాతన కాంస్య విగ్రహం ఏర్పాటుకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పనులు కొనసాగుతుండగా.. విగ్రహం ఏర్పాటు.. చౌరస్తా సుందరీకరణతో ఈ ప్రాంతం మరింత ప్రాచూర్యం పొందనుంది. -
ఐదుగురు గుమికూడితే చర్యలే
● మూడో విడత ఎన్నికల్లో నిషేధాజ్ఞలు కరీంనగర్క్రైం: ఈ నెల 17న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న వీణవంక, హు జూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వి– సైదాపూర్ మండలాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్న ట్లు సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం, సమావేశం కావడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు 15వ తేదీ సాయంత్రం నుంచి 17 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉల్లంఘించిన వా రిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యానగర్(కరీంనగర్): రెండు రోజుల వరుస సెలవుల అనంతరం సోమవారం కరీంనగర్ బస్స్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో ప్రయాణికుల రద్దీని కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) పి.మల్లేశం పర్యవేక్షించారు. వివిధ రూట్లలో బస్సుల అందుబాటును పరిశీలించి, కరీంనగర్ బస్స్టేషన్లో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, బస్స్టేషన్ సూపర్వైజర్ రామకృష్ణకు సూచించారు. కరీంనగర్: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కఠినంగా అమలు చేస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 అమలు విధానంపై ఓరియంటేషన్ నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 598 ప్రైవేట్ హాస్పిటల్స్ను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 కింద రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని, యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి. వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010ను సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అధికారులు, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు నాగరాజు, సునీల్ రాజు, వెంకటరమణ, మౌనిక పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. మూడు నెలల క్రితం రూ.5 పలికిన గుడ్డు ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్సేల్లో రూ.7 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8 పలుకుతోంది. గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల వరకు హోల్సెల్లో వందగుడ్లు రూ.550 పలకగా, ప్రస్తుతం 100 గుడ్లు రూ.650 వరకు విక్రయిస్తున్నారు. చలికాలం కావడంతో గుడ్ల వినియోగం పెరిగిందని, దీనికి తోడు రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరగడంతో గుడ్ల రేట్లు పెరుగుతున్నాయని, కోళ్లదాణా ఖర్చు పెరగడం కారణంగా ఫౌల్ట్రీఫామ్ యాజమానులు చెబుతున్నారు. జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,500 పలి కింది. సోమవారం మార్కెట్కు 52 వాహనాల్లో 300 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
వరినారుపై చలి పంజా
మల్లాపూర్(కోరుట్ల): యాసంగి సీజన్కు సంబంధించి వరినారుపై చలి పంజా విసురుతుంది. దీంతో నారు ఎదగడం లేదు. వరి సాగు కోసం రైతులు 10– 15 రోజుల క్రితం నారు పోశారు. చలిగాలులు తీవ్రంగా వీస్తుండడం నారు పెరుగుదలకు ఆటంకంగా మారింది. నాలుగైదు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరిగి నారు ఎదగకపోవడంతో పాటు ఎర్రబడిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చలి ప్రభావంతో నారు భూమిలో నుంచి సరైన పోషకాలను గ్రహించలేదు. దీంతో నారు ఇటుక రంగులోకి మారి పలు ప్రాంతాల్లో ఎదగడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో నారుమడిపై నేరుగా మంచు పడకుండా నాలుగు వైపుల కర్రలు పాతి పాలిథీన్ కవర్లు కట్టాలని సూచిస్తున్నారు. జింక్ లోప నివారణకు నారుపై జింక్ సల్పేట్ను నీటిలో కలిపి పిచికారీ చేయాలని, రాత్రి వేళల్లో నారుమళ్లకు నీరు పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పాత నీరు తీసేసి వెచ్చటి నీరు అందించాల్సింగా పేర్కొంటున్నారు. జింక్, మాంగనీస్, రాగి వంటి సూక్ష్మపోషక ద్రావణాలను పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. చలిగాలులకు ఎదగని నారు -
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
రాయికల్/పాలకుర్తి: చిన్న వయస్సులోనే పలువురు మహిళలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన బండారి మానస 21 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్తండాకు చెందిన ఇస్లావత్ అఖిల 22 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికవడం విశేషం. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అఖిల తన సమీప అభ్యర్థి బదావత్ లక్ష్మిపై విజయం సాధించారు. స్థానిక కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన అఖిల ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. చిన్నవయస్సులోనే సర్పంచ్గా ఎన్నికై న వీరిని స్థానికులు అభినందిస్తున్నారు. అలాగే రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొడిపల్లి రాజవ్వ సర్పంచ్గా గెలుపొందారు. రాయికల్ మండలంలో మానస, రాజవ్వ అత్యల్ప, అత్యధిక వయస్సు గల సర్పంచులు. మానస, ఒడ్డెలింగాపూర్రాజవ్వ, బోర్నపల్లి ఇస్లావత్ అఖిల, బామ్లానాయక్తండా ఇరవై ఏళ్లుగా ఆ దంపతులే.. రాయికల్(జగిత్యాల): రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో 20 ఏళ్లుగా ఆ దంపతులే సర్పంచ్, ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. గ్రామానికి చెందిన బెజ్జంకి మోహన్ 2006–11 వరకు సర్పంచ్, 2014–19 వరకు ఎంపీటీసీగా గెలిచారు. 2019–24 వరకు ఆయన భార్య రమాదేవి సర్పంచ్గా సేవలందించగా, ప్రస్తుతం మోహన్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అక్క సర్పంచ్.. తమ్ముడు ఉపసర్పంచ్జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారు విజయం సాధించడంతో పాటు, రెండు పదవులను కై వసం చేసుకోవడం వారిలో ఆనందం నింపింది. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామ సర్పంచ్గా రెడ్డిరత్న గెలుపొందగా, ఆమె సోదరుడు గుంటి రవి వార్డుమెంబర్గా గెలిచి ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్గా గెలిచి.. హామీ నెరవేర్చిఇల్లంతకుంట(మానకొండూర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చారు. వివరాలు.. ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ తనను సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు. విజయం సాధించగానే నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులను పట్టెవారిని రప్పించారు. సోమవారం 113 కోతులను బోనులో బంధించి అడవికి తరలించారు. ఒక కోతిని పట్టుకుంటే రూ.500 చొప్పున చెల్లిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో చాలా కోతులు ఉన్నాయని వాటన్నింటినీ తరలిస్తామని పేర్కొన్నారు. -
‘ఊయల’కు చేరిన ఐదు నెలల పసికందు
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు ఐదు నెలల వయసున్న పసికందును ఆ ఊయలలో వదిలి వెళ్లారు. పసికందుకు సంబంధించి ఆరోగ్య వివరాల రికార్డును కూడా చిన్నారివద్దనే ఉంచడం గమనార్హం. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై చిన్నారిని పరిశీలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని, ఐసీయూలో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కుటు ంబ పరిస్థితులు ఎలా ఉన్నా, శిశువులను నిర్లక్ష్యంగా వదిలేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చని మరోసారి ఈ ఘటన రుజువుచేసింది. పిల్లలు భారంగా అనిపించినా, జీవితం విలువైనదేనని గుర్తించి ఊయ ల మార్గాన్ని ఎంచుకోవడం మానవత్వానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఊయల వ్యవస్థ వల్ల అనేకమంది చిన్నారులకు కొత్త జీవితం లభిస్తోందని, సమాజం మరింత బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ● కుటుంబాన్ని పోషించే దారి లేక ఆత్మహత్య కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించే దారి లేక మనస్తాపం చెందాడు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్లకు చెందిన రెవెల్లి రాజ్కుమార్(38) జీవనోపాధి కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడాదిగా డ్రైవర్గా పని చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల గ్రామానికి చేరుకున్నాడు. ఈనెల 11న ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్కుమార్ భార్య రజిత.. తన పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయింది. రాజ్కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోయాడు. అయితే, హైదరాబాద్ వెళ్లాక భార్య రజిత తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. హైదరాబాద్ రాకపోవడంతో ఉద్యోగంలోంచి తొలగించారని, చిట్టీ డబ్బులు ఎలా చెల్లివస్తాని నిలదీసింది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రాజ్కుమార్ ఉరివేసుకుని చనిపోయాడు. తన కుమారుడు ఆత్మహత్యపై తమకు ఎలాంటి అనుమానం లేదని తండ్రి పీసారయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఏఎస్సై నీలిమ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు దినేశ్, కూతురు లాస్య, తల్లిదండ్రులు సమ్మక్క –పీసారయ్య ఉన్నారు. రాజ్కుమార్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
మేడిపల్లి ఓసీపీలో పులి సంచారం
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)లో ఆదివారం పెద్దపులి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది. రామగుండం డివిజన్–1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వలు అడుగండంతో దానిని గతంలోనే యాజమాన్యం మూసివేసింది. ఆ ప్రాంతంలోనే పెద్దపులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మంచిర్యాల వైపు నుంచి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు వారు వెల్లడిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పులి వేలిముద్రలను వారు పరిశీలించారు. లింగాపూర్ శ్మశానవాటిక వైపు ఉన్న ముళ్ల పొదల్లో పులి సంచరినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఫారెస్ట్ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ రహ్మతుల్లా తెలిపారు. దీంతో లింగాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా వెళ్లవద్దు – డీఎఫ్వో శివయ్య మేడిపల్లి, లింగాపూర్, పాములపేట, హౌసింగ్బోర్డు కాలనీ వాసులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని డీఎఫ్వో శివయ్య సూచించారు. అవసరమైతేనే గుంపులుగా వెళ్లాలని, ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అన్నారు. ద్విచక్రాహనాలపై కూడా ఒంటరిగా వెళ్లవద్దని ఆయన పేర్కొన్నారు. స్థానికుల్లో భయం.. భయం జ్యోతినగర్(రామగుండం): మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఓసీపీ, సమీప గోదావరి నదీతీరంలో పులి సంచరించినట్లు పాదముద్రలు పరిశీలించిన అనంతరం.. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎన్టీపీసీ, ఎఫ్సీఐ పంప్హౌస్ ప్రాంతం మల్కాపూర్ గ్రామానికి సమీపంలో ఉండడంతో ఎప్పుడేమవుతుందోనని గ్రామస్తులు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం పులి సంచరించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. పేట్రేగనున్న స్క్రాప్ చోరీ ముఠాలు ఓపెన్కాస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో జనసంచారం ఉండదని భావించే ఇనుప సామాను దొంగలించే ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో సైతం పులి సంచారం ప్రచారం కావడంతో పెద్దమొత్తంలో ఇనుస సామగ్రి చోరీ అయినట్లు తెలుస్తోంది. గోదావరి నదీతీరంలో పాదముద్రలు నిర్ధారించిన అటవీశాఖ అధికారులు -
కొత్త ఓటు.. అవగాహన లోటు
మానకొండూర్: సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన నూతన ఓటర్లలో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కరువు అవడంతో అయోమయానికి గురయ్యారు. చాలామంది నూతన ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడని అనుకున్నారు. బ్యాలెట్ పేపర్పై ఓటు వేయాలని పోలింగ్ కేంద్రంలో తెలుసుకున్నాక అయోమయానికి గురయ్యారు. నాకు తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటు వేసుడు ఏ విధంగానో నాకు తెలియదు. పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు కొంత కంగారుగా ఉండే. మొదటి సారి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది. – రసజ్ఞ, గంగిపల్లి నేను తొలిసారిగా ఓటు వేస్తున్నా. ఓటుహక్కు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేసుడనుకున్నా. బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఓటు వేసుడో తెలియదు. అవగాహన కల్పించాల్సి ఉంది. – మమత, గంగిపల్లి తొలిసారి నాకు ఓటు హక్కు వచ్చి ంది. ఓటు వేయడం సం తోషంగా ఉంది. ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడనుకుంటున్నా. ఓటు ఏ విధంగా వేయాలో తెలియ దు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలా వేయాలో తెలుసుకుంటా. – కొలిపాక అఖిల( కొండపల్కల) ఈవీఎంలు ఉంటాయనుకున్నా యువ ఓటర్లు బ్యాలెట్ పేపర్లతో అయోమయం -
పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ సీటు
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ దక్కింది. పట్టణంలోని గీతానగర్కు చెందిన యువకుడు రెడ్డిమల్ల అభినవ్ సాయి నీట్ పీజీ 2025–26 ప్రవేశ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో 716వ ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్ సీటు కైవసం చేసుకున్నారు. సిరిసిల్లకు చెందిన రేషన్ డీలర్ రెడ్డిమల్ల హన్మాండ్లు–కల్యాణి దంపతుల కొడుకు అభినవ్సాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. ఆర్ఎంఎల్లో సీటు సాధించడంతో ఆదివారం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. అభినవ్సాయి సోదరుడు గుణశేఖర్ సైతం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రోడ్డ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేశ్, సమ్మయ్య, భాను, ప్రతినిధులు గట్టయ్య, రవీందర్, ఆకునూరి బాలరాజు, రాజయ్య, మహేశ్, శ్రీనివాస్, మహేందర్రెడ్డి, నర్సయ్య, గాజుల శ్రీనివాస్, ప్రసాద్, చంద్రం, శంకర్, శ్యామ్, శోభన్ పాల్గొన్నారు. ఆర్ఎంఎల్ మెడికల్ కాలేజీలో సీటు అభినందించిన రేషన్డీలర్ల సంఘం ప్రతినిధులు -
చలో ‘గురుకులం’
కరీంనగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత కేజీ టు పీజీ మిషన్లో భాగంగా 2026– 27 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇంగ్లిష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ జోనల్ పరిధిలో50 గురుకులు పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలలో జిల్లాలో 2,227పై సీట్లు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 5, జగిత్యాలలో 5, పెద్దపల్లిలో6, రాజన్న సిరిసిల్లలో 7 కలిపి 23 గురుకులాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో చింతకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూర్, జగిత్యాల జిల్లాలో మేడిపల్లి, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, గొల్లపల్లి, పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని, రామగుండం, నందిమేడారం, మల్లాపూర్, గొల్లపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బద్దెనపల్లి, వేములవాడ, చిన్నబోనాల, బోయినపల్లి, ముస్తాబాద్, నర్మాల, ఇల్లంతకుంట లలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు రాజన్నసిరిసిల్ల జోన్ పరిధిలో గురుకులాలు కుండా కరీంనగర్ జోన్ పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్లు గరిష్ట సడలింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1 లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. కరీంనగర్ జోన్ల్ పరిధిలో 2,227 సీట్లు ఉమ్మడి జిల్లాలోని 23 గురుకులాల్లో 5వ తరగతిలో ఒక్కొక్క పాఠశాలలో 80 సీట్ల చొప్పున 1,840 సీట్లు ఉన్నాయి. కరీంనగర్లో జోన్ల్ పరిధిలో మిగితా పాఠశాలలున్నాయి. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధనతో పాటు, భోజనవసతితో పాటు సకల వసతులు ఉంటాయి. సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉండనుంది. ఇంగ్లిష్ మీడియంలో బోధించనున్నారు. ఎస్సీలకు 65 సీట్లు, ఎస్టీ, బీసీ,ౖ మెనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఒక్కసారి ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు ఉచితంగా చదువు, హస్టల్తో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తారు. బట్టలు, పుస్తకాలు, కాస్మోటిక్ చార్జీలు అందించనున్నారు. జనవరి 21 వరకు దరఖాస్తు గడువు 5వ తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు దరఖాస్తులను ఆన్లైన్లో 22 ఫిబ్రవరి 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్నంబరుతో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు. వేరే వారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే వారిపై సెక్షన్ 416 ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. 2025లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో గుర్తించిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు వరం. పిల్లలకు పౌష్టికాహార లోపంతో తలెత్తే రుగ్మతలు మాయమవుతాయి. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం బోధన కావడంతో పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటి నెలకొంది. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. జనవరి 21 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. కరీంనగర్ జోనల్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాలకై అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – కె.ప్రత్యూష, గురుకులాల జోనల్ ఆఫీసర్ 5వ తరగతిలో ప్రవేశాలు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జనవరి 21 వరకు గడువు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష కరీంనగర్ జోనల్ పరిధిలో 50 గురుకులాలు -
మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్కు స్పందన
కొత్తపల్లి(కరీంనగర్): అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అమోట్–2025కు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ (అమోట్)–2025ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించిన టెస్ట్కు 18,450 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఎన్ఆర్ మాట్లాడుతూ, అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆరంభం నుంచి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ రూ.3 వేలు, తృతీయ రూ.2 వేలు ఈ నెల 22న రామానుజన్ జయంతి సందర్భంగా అందజేస్తామని తెలిపారు. -
మా ఓటు అమ్మబడదు
● మామిడాలపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు వీణవంక: ‘మా ఓటు మద్యానికి, డబ్బుకు అమ్మబడదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కల్పించిన ఓటుహక్కును వినియోగించుకుందాం. మన గ్రామ అభివృద్ధికి ఓటు వేద్దాం’ అని మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు మద్యం, డబ్బు పంపిణీ చేయొద్దని, పంపిణీ చేసినా ఓటర్లు తీసుకోవద్దని, యువకులు, విద్యావంతులు అలోచన చేియాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు. -
కేపీఎస్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ పరీక్షకు స్పందన
కరీంనగర్ టౌన్: కరీంనగర్లోని కోట పబ్లిక్ స్కూల్ ఆదివారం నిర్వహించిన టాలెంట్ ఎంకరేజ్మెంట్ పరీక్ష– 2026కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి మాట్లాడుతూ.. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుత సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100శాతం స్కాలర్షిప్తో పాటు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతిభను ప్రోత్సహించడమే కోట పబ్లిక్ స్కూల్ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులకు బలమైన అకాడమిక్ ఫౌండేషన్తో పాటు విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా శిక్షణ ఉంటుందని వివరించారు. -
ఎల్లలు దాటి వచ్చి.. ఓటేసి
రాయికల్: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా యువతీ, యువకులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహ్రెయిన్, యూఎస్ఏ, తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో మాట్లాడారు. యూఎస్ఏ నుంచి వచ్చా నేను యూఎస్ఏ హస్టన్ టెక్సెస్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నా. కొద్దిరోజుల తర్వాత మా ఊరికి వస్తాననుకున్న. కానీ, ఇంతలోనే సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుగానే వచ్చా. – బొలిశెట్టి భావన, ఇటిక్యాల ఆనందంగా ఉంది సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయడం ఆనందాన్ని ఇచ్చింది. గ్రామాభివృద్ధి కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకున్న. – సుప్రియ, ఇటిక్యాల ప్రతీ ఓటు కీలకం సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. మంచి నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటు హక్కు మంచి అవకాశం. నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చి విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్తున్నా. – సిరిపురం గిరి, డెప్యూటీ తహసీల్దార్, ఎలిగేడు మండలం, పెద్దపల్లి నోటిఫికేషన్ రాగానే.. నేను ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో ఉంటున్నా. ప్రతి రెండేళ్లకోసారి నాకు కంపెనీ సెలవు ఇస్తుంది. ప్రస్తుతం మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకుని ఎలాగైనా ఓటు వేద్దామన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ రాగానే స్వగ్రామానికి వచ్చి ఓటు వేశా. – పడాల రమేశ్, కుమ్మరిపల్లి ప్రలోభాలకు లొంగకుండా.. ఓటు వేసేందుకు ముంబయ్ నుంచి వ చ్చాం. తిరిగి వెళ్తున్నా ం. ప్రతి ఓటు కీలకం కాబట్టి వచ్చినం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్నాం. – గాజంగి శ్రీధర్, రాజేంద్రప్రసాద్ కుటుంబ సమేతంగా.. హైదరాబాద్ నుంచి సుమా రు 20 మందిమి మా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఆది వారం సెలవు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశాం. – పారిపల్లి సుధీర్, ప్రైవేటు ఉద్యోగి, కుమ్మరిపల్లి -
నోట్లు పాయే.. ఓట్లు రాకపాయే!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి, మలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండు విడతల్లోని ఫలితాలపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తున్నారు. నోట్ల కట్టలు పాయే.. ఓట్లు రాకపాయే అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రెండో విడత ఫలితాలు వెలువడిన ఆదివారం వరకు అభ్యర్థులు చేసి ఖర్చు తడిసి మోపైడెంది. తొలివిడత నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత.. వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబరాల్లో ముగిని తేలుతుండగా.. ఓడిన వారు ఎక్కడ బోల్తాకొట్టామని సమీక్షించుకుంటున్నారు. నమ్మకంగా వంచించారంటూ ఆవేదన ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండ ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కులసంఘాల వారీగా, ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు ఓట్లను రాల్చకపోవడంతో ఏమైందనే ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేశారు. ఇంకా కులసంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందుపార్టీలు అదనం. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ, వెండి భరణిలు, దేవుడి లడ్డూలను పంపిణీ చేసిన అభ్యర్థులు గెలుపు అంచు వరకు వెళ్లి ఓడిపోవడంతో అవాక్కయ్యారు. నమ్మకంగా వంచించారంటూ కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎన్నికలు సవ్యంగా సాగడంతో అధికారులు ఫలితాలు ప్రకటించారు. ఒక రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడఅర్బన్ మండలం చింతల్ఠాణాలో చనిపోయిన వ్యక్తి చెర్ల రమేశ్ గెలుపొందడంతో ఆ ఫలితాలను నిలిపివేశారు. ఓట్ల ఖరీదు రూ.200 కోట్లు ఉమ్మడి జిల్లాలో తొలి, మలి విడతల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే రెండు విడతల్లో దాదాపు రూ.50కోట్లకు పైగా డబ్బును వెచ్చించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పక్షం రోజులుగా సగటును ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అనధికారికంగా వెచ్చించారు. ఒక్కో ఊరిలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు కలిపి సగటున రూ.35 లక్షల వరకు ఖర్చు చేశారు. పెద్ద గ్రామాల్లో ఈ వ్యయం మరింత పెరిగింది. ఈ లెక్కన ఒక్కో ఓటు కోసం సగటున సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రూ.3వేలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చు చేసిన డబ్బుకు గౌరవ ప్రదమైన ఓట్లు రాకపోయేనని పరాజితులు కన్నీరుపెడుతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు లెక్కల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో ఉన్నారు. వదిలిందెంత? వచ్చిందెంత ? ఎన్ని‘కల’ల్లో రూ.‘లక్ష’ణంగా ఖర్చు పైసలు పోయే.. ఫలితం లేకపాయే ‘పంచాయతీ’ ఎన్నికల ఫలితాలపై పరాజితుల పోస్ట్మార్టం నమ్మకంగా వంచించారని ఆవేదన తొలి, మలి విడతల్లో అనధికారిక ఖర్చు రూ.200 కోట్లు -
చేయి ఎత్తిన సంగ్రామం
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ ●: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక గ్రామాలు తమ ఖాతాలో వేసుకున్న హస్తం పార్టీ అదే జోరును రెండో విడతలోనూ కొనసాగించింది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 398 స్థానాలకు 203స్థానాలు కై వసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆదివారం జరిగిన రెండో విడతలో 418కి 234 స్థానాలతో జోరును కొనసాగించి పల్లెపోరులో పట్టు సాధించింది. తొలి విడతలో 121స్థానాలకే పరిమితమైన కారు పార్టీ, రెండో విడతలో 102 గ్రామాలతో అదేస్థాయిలోనే నిలిచింది. రెండో విడతలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. తొలి విడతలో జరిగిన తప్పులను సరిదిద్దుకున్న బీఆర్ఎస్, రెండో విడతలో గట్టి పోటీనిచ్చింది. రెండు జిల్లాల్లో కారు పార్టీకి మంచి స్పందన లభించగా, కాంగ్రెస్కు సవాల్ విసిరినట్టుగా పరిస్థితి మారింది. మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటేందుకు ప్రయత్నించింది. తొలి విడతలో 37స్థానాలతో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ రెండో విడతలో 27 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ప్రశాంతంగా రెండో విడత రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. రెండో శనివారం, ఆది వారం సెలవులు కలిసి రావడంతో భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో తొలివిడతలో 81.42శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో 86.58శాతం రికార్డవడం నిదర్శనం. హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున రావడం పోలింగ్శాతం పెరగడానికి దోహదపడింది. ఉదయం 7 గంటల నుంచి మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో పోలింగ్ ఉత్సాహంగా సాగింది. ఉదయం 9 గంటలకల్లా చాలా కేంద్రాల్లో 55శాతం పోలింగ్ దాటడం విశేషం. మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లో 86.58శాతం పోలింగ్ నమోదైంది. గన్నేరువరం లో 88.91శాతం పోలింగ్ నమోదైంది. ఓటెత్తిన పుషులు.. ఈనెల 11న జరిగిన తొలివిడత కన్నా 5శాతం పోలింగ్ పెరిగింది. తొలివిడతలో మహిళలు 82.51 శాతం ఓట్లు వేయగా.. పురుషులు 80.26 శాతానికే పరిమితమయ్యారు. తాజా పోలింగ్లో మహిళలు 85.77శాతం ఓటింగ్లో పాల్గొనగా.. పురుషులు 87.44శాతం మేర ఓట్లేసి ముందంజలో నిలిచారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటట్లలో పురుషులే అధికంగా ఉండటం కూడా ఓటింగ్ పర్సంటేజీ పెరగడంలో కారణంగా చెబుతున్నారు.మేమూ ఓటేశాం: పచ్చునూరులో ఓటేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి దంపతులుఇదిగో ఇలా మలవాలమ్మా: కేశవపట్నంలో బ్యాలెట్ పేపర్ గురించి వివరిస్తున్న సిబ్బందిజిల్లాలో విజయం సాధించిన వివిధ పార్టీల మద్దతుదారులు గ్రామపంచాయతీలు 113కాంగ్రెస్ 45బీఆర్ఎస్ 42బీజేపీ 09ఇతరులు 17మండలం గ్రామాలు మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం శాతం చిగురుమామిడి 17 34,370 29,498 14,585 86.58 14,913 85.11 85.82గన్నేరువరం 15 17,430 15,435 7,533 88.19 7,902 88.91 88.55 మానకొండూర్ 29 56,922 49,328 24,360 87.85 24,967 85.52 86.66 శంకరపట్నం 27 37,867 33,334 16,617 89.1 16,717 86.99 88.03 తిమ్మాపూర్ 23 38,414 32,589 15,919 85.59 16,670 84.13 84.84 మొత్తం 111 1,85,003 1,60,184 79,014 87.44 81.169 85.77 86.58 -
గ్రామాల్లో వికసిస్తున్న కమలం
కరీంనగర్: గ్రామాల్లో కమలం పార్టీ వికసిస్తోందని 1, 2వ విడత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జరుగబోయే మూడో విడత ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతామని అన్నా రు. మొదటి, రెండో విడత ఫలితాలు సంతృప్తిని చ్చాయని, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానంగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సర్పంచ్ స్థానానికి గట్టి పోటీ ఇచ్చారని, ఎంతోమంది వార్డు మెంబర్లుగా గెలు పొందారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసించారని అన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల వైపు చూశారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ చొరవతో నేడు గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన చోట గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బండి సంజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.రూ.18 లక్షలతో రాజీవ్ చౌక్ సుందరీకరణ కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులు మొదలయ్యాయి. సుడా నిధులు సుమారు రూ.18 లక్షలతో జంక్షన్ పనులు చేపట్టారు. రాజీవ్గాంధీ పాత విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం చౌక్లోని పాత విగ్రహాన్ని నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించారు. జంక్షన్ పనులు పూర్తి అయిన తరువాత కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాజీవ్ చౌక్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి రాజమండ్రిలో రాజీవ్గాంధీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. పది రోజుల్లో పనులు పూర్తి చేసి, రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 27నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్, నీలం లక్ష్మణ్ తెలిపారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ.. ఈనెల 13, 14వ తేదీల్లోనే పోటీలు జరగాల్సి ఉండగా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వే య డం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లా ల నుంచి సుమారు 1,200మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రన్స్, త్రోస్, జంప్స్ విభాగాల్లో 48 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ చాటిన మాస్టర్ అథ్లెట్స్ను రాజస్థాన్లోని ఆజ్మీరాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ వరాల జ్యోతి, స్టేట్ ట్రెజరర్ డి.లక్ష్మి, జాయింట్ సెక్రటరీలు లక్ష్మణ్ రావు, కోశాధికారి శిరీశ్, సలహాదారు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నగరంలో పునుగు పిల్లి కరీంనగర్: కరీంనగర్ విద్యానగర్లో ఓ ఇంట్లోకి ఆది వారం ఉదయం పునుగు పిల్లి రావడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే శ్రీలక్ష్మి జంతు సంరక్షణశాలకు, ఫారెస్ట్ అధికారులకు సమాచా రం ఇవ్వగా... ఆ ఇంటికి చేరుకొని, అధికారులు, జంతు సంరక్షణశాల నిర్వాహకులు ఆసిరి సుమన్ పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నా రు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు ఆ పిల్లిని అప్పజెప్పారు. పిల్లిని క్షేమంగా డీర్పార్క్లో ఉంచినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. -
తుప్పు.. తుక్కు!
గాడి తప్పితే వేటేమా పేర్లు ఎక్కడున్నాయ్: మానకొండూర్లో ఓటర్ లిస్టులో పేర్లు సరిచూసుకుంటున్న ఓటర్లుయువతరంగం: మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామంలో తొలిసారి ఓటేసిన యువతులుబ్యాలెట్ భద్రం: తిమ్మాపూర్లో ఓటింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్స్కు సీల్ వేస్తున్న ఎన్నికల సిబ్బందిపిల్లలతో వచ్చాం: కేశవపట్నంలో చంటి బిడ్డలతో ఓటేసేందుకు వచ్చిన మహిళలుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఓపెన్జిమ్ల నిర్వహణ ఎవరికీ పట్ట డం లేదు. స్మార్ట్సిటీలో భాగంగా నగరవ్యాప్తంగా పార్క్లు, ఓపెన్ప్లేస్లు, వాకింగ్ ట్రాక్ల వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో పరికరాలు అధ్వానంగా మారుతున్నాయి. చెడిపోయి.. తుప్పు పట్టిన పరికరాలకు మరమ్మతులు చేసే నాథుడు కరువవడంతో నగరవాసులు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 30 ఓపెన్ జిమ్లు నగరప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 30 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్ రూ.12 లక్షల చొప్పున, సుమారు రూ.3.60 కోట్ల వ్యయంతో నెలకొల్పారు. నగరంలోని వివిధ కాలనీలు, పార్క్లు, బహిరంగ ప్రదేశాలు, వాకింగ్ ట్రాక్లు, స్టేడియం, మైదానాల్లో ఈ ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. వ్యాయామానికి విరామం రూ.లక్షల ఖర్చుతో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ అధికారులు వాటి నిర్వహణలో చూపడం లేదనే విమర్శలున్నాయి. జిమ్ల నిర్వహణ బాధ్యతను అధికారులు గాలికి వదిలేయడంతో పరికరాలు దెబ్బతింటున్నాయి. ఆరోగ్యపరంగా వ్యాయామం అవసరం, అందులో శీతాకాలం కావడంతో ప్రస్తుతం ఓపెన్జిమ్లకు ఆదరణ ఎక్కువగానే ఉంది. ఆయా కాలనీల కు చెందిన మహిళలు, యువత ఎక్కువగా ఓపెన్జిమ్లపై ఆధారపడుతున్నారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి వస్తోంది. కొన్ని చోట్ల వాడకం ఎక్కువై, మరికొన్ని చోట్ల నాసిరకం పరికరాలు, చాలా చోట్ల పోకిరీల కారణంగా ఓపెన్ జిమ్ల్లోని పరికరాలు దె బ్బతింటున్నాయి. పరికరాలను ఎప్పటికప్పుడు మ రమ్మతులు చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా నగరపాలకసంస్థ అధికారులు ఓపెన్జిమ్ల నిర్వహణపై దృష్టి సారించి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.కరీంనగర్టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదుకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన డీఎస్ఈ, ఎఫ్ఆర్ఎస్ యాప్పై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎఫ్ఆర్ఎఫ్ విధానంతో ఇప్పటికే ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం 85శాతం నుంచి 90శాతానికి పెరిగింది. ఎఫ్ఆర్ఎస్పై నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. ఇటీవల జరిగిన ఎంఈవోల సమావేశంలో హాజరుశాతం తక్కువగా ఉన్న పాఠశాలల హెచ్ఎంలపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. స్కూళ్లకు సక్రమంగా హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్లో ఇన్టైమ్, అవుట్ టైమ్పై ప్రత్యేక నిఘా పెట్టారు. సెలవు కోసం యాప్లో దరఖాస్తు చేసుకుని, హెచ్ఎంలతో అనుమతి పొందిన తర్వాతే అది సాధారణ సెలవుగా పరిగణించబడుతుంది. ట్రైనింగ్, ఇతరత్రా కార్యాలయ పనులకు వెళితే ఓడీ వెళ్లిన చోట నుంచి పాఠశాల ముగింపు సమయంలోపే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ యాప్పై గుర్రుగా ఉన్నాయి. విద్యాశాఖ అధికారుల దృష్టి.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం, విధులకు అనధికారికంగా హాజరు కాకపోవడం, పారిశుధ్యం లోపించడం.. తదితరాల అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్న, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్న, నిధులను దుర్వినియోగం చేస్తున్నవారిపై గ్రామస్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు వేటు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులతో అమర్యాదగా ప్రవర్తించడం, మద్యం సేవించి పాఠశాలకు రావడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం, ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా వాట్సాప్లో సందేశాలు పంపించడం వంటి ఘటనలతో కరీంనగర్ రూరల్, శంకరపట్నం, హుజూరాబాద్ ప్రాంత పాఠశాలల్లో రెండు నెలల వ్యవధిలో 9మంది ఉపాధ్యాయులపై వేటు వేసిన విషయం తెలిసిందే.మానేరు వద్ద పాడైపోయిన జిమ్ పరికరం కిసాన్నగర్లో పాడైపోయిన పరికరం ఓపెన్ జిమ్లు వినియోగంలోకి తేవాలి నగరపాలకసంస్థ పరిధిలో ఉన్న ఓపెన్ జిమ్లు పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. చాలా చోట్ల నిర్వహణ లోపంతో పరికరాలు పనిచేయడం లేదు. దీంతో వ్యాయామానికి వచ్చే వాళ్లు వెనుదిరగాల్సి వస్తోంది. ఓపెన్జిమ్ల నిర్వహణ నగరపాలకసంస్థదా, సంబంధిత కాంట్రాక్టర్లదా తెలియడం లేదు. కమీషన్ల కోసమే ఓపెన్జిమ్లను ఏర్పాటు చేసినట్లుంది. నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓపెన్జిమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. – అనంతుల రమేశ్, కాంగ్రెస్ నాయకుడు, కిసాన్నగర్, కరీంనగర్ -
నేను 14 ఏళ్లు సర్పంచ్గా పనిచేశాను
మాది కోనరావుపేట మండలం మల్కపేట. నేను రాజేంద్రనగర్లో బీఎస్పీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. మా ఊరిలో 1980లో తొలిసారి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 1994 వరకు 14 ఏళ్లపాటు సర్పంచ్గా ఉన్నాను. ఎన్నికల్లో అప్పట్లో ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. పైసా ఖర్చు లేకుండానే ఎన్నికయ్యాను. నేను అంతే నిజాయితీగా ఉండి గ్రామాభివృద్ధికి పనిచేశాను. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్నికల పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. – చెలిమెడ రాజేశ్వర్రావు, మల్కపేట మాజీ సర్పంచ్, డెయిరీ చైర్మన్ -
కర్ల రాజేశ్ మృతికి పోలీసులే కారణం
జ్యోతినగర్(రామగుండం): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళితుడు కర్ల రాజేశ్ లాకప్డెత్కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కోరారు. ఈమేరకు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ జ్యోతిభవన్కు చేరుకున్న మందకృష్ణ మాదిగ.. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ను కలుసుకుని పూలమొక్క అందించారు. కర్ల రాజేశ్ లాకెప్డెత్కు కారణమైన సూర్యపేట సీఐ, కోదాడ ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోరెన్సిక్ నిపుణులతో రాజేశ్ మృతదేహానికి రీపోస్ట్మార్టం చేయించాలన్నారు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతోనే రాజేశ్ మరణించాడని ఆరోపించారు. సూర్యాపేట పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తమకు పూర్తిస్థాయి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై అక్రమ నిర్బంధాలు, దాడులు జరుగుతున్నాయని, వీటిని నిర్మూలించేందుకు ఐక్య పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్ట్మార్టం జరిపించాలి లాకెప్ డెత్కు కారణమైన పోలీసులపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ -
గోదావరిలో స్నానానికి వచ్చి..
● గల్లంతైన వ్యక్తి మృతి వెల్గటూర్(ధర్మపురి): గోదావరిలో స్నానానికి వచ్చి గల్లంతైన వ్యక్తి మృతిచెందిన ఘటన వెల్గటూర్ మండలం కోటిలింగాలలో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన గోలెం మల్లయ్య (53) సమీప బంధువు మృతిచెందగా అతడి అంత్యక్రియలకు వెళ్లాడు. ఆదివారం ఇంట్లో మల్లన్న బోనాల కార్యక్రమం ఉండడంతో శనివారం గోదావరి స్నానానికి కోటిలింగాలకు వచ్చాడు. సాయంత్రం కావడంతో పుష్కర ఘాట్లపై కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించగా మల్లయ్య మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మృతుడి బావ నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిజమ్మికుంట: అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన పార్వతి రాజయ్య(46) అనారోగ్యంతో ఈ నెల 10న పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాజయ్య ట్రాక్టర్ డ్రైవర్. భార్య వనజ, కొడుకు ఉన్నారు. కొడుకు శివకుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. -
మూడుసార్లు సర్పంచ్గా ఉన్నాను
మాది గంభీరావుపేట మండలం శ్రీగాధ. నేను 1981లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పట్లో నేను చేసిన పనులకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉండేది. వరుసగా మూడుసార్లు సర్పంచ్గా పనిచేశాను. ఎన్నికల్లో అప్పుడు రూ.130 మాత్రమే ఖర్చు అయింది. ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీదనే ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతుంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాధించుకోవడమే లక్ష్యమైపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. – గౌరినేని మాణిక్యారావు, శ్రీగాధ, మాజీ సర్పంచ్ -
ఆరు గంటలు పనిచేస్తున్నా
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటుతో ఉపాధి దొరుకుతుంది. ప్రింటర్స్ నుంచి ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఫ్రేమ్లకు అతికించడం, గిరాకీ చెప్పిన చోట్లలో కట్టేస్తున్నాం. ఒక్క ఫ్లెక్సీ కడితే రూ.150 నుంచి రూ.200 ఇస్తారు. సాధారణ రోజుల్లో నెలలో 10 సార్లు పని దొరికేది. ఇప్పుడు పదిహేను రోజులుగా నిరంతరం పని ఉంటుంది. ప్రతీ రోజు 6గంటలకు పైగా ఫ్లెక్సీల ఏర్పాటులో బిజీగా ఉంటున్నాం. – యెల్లె లక్ష్మణ్, ఫ్లెక్సీ కార్మికుడు 300 పాటలు రికార్డు చేశాం ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రచారానికి మూడు వందల పాటలను రికార్డు చేశాం. నాకు 30 ఏళ్లుగా రికార్డింగ్ రంగంలో అనుభవం ఉంది. ఇరవై ఏళ్ల క్రితం సిరిసిల్ల లో రికార్డింగ్ స్డూడియో ఏర్పాటు చేసిన. అభ్యర్థులు కేవలం తమ కరపత్రాలు, మేనిఫెస్టో అందిస్తే చాలు వారిపై పాటలు కట్టి రికార్డు చేసి పంపిస్తాం. మా స్డూడియోలో ఆరుగురు రచయితలు, ఆరుగురు సింగర్స్, ముగ్గురు కోరస్ కళాకారులు ఉన్నారు. పాటల రాయడం, ప్లేబ్యాక్, సంగీతం, రికార్డింగ్ అంతా మాదే. చాలా మంది అభ్యర్థులకు ప్రచార బాణీలు కూడా అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలు గతంలో కన్నా ఎక్కువ గిరాకీ వస్తుంది. – ఎండీ సత్తార్, రికార్డింగ్ స్డూడియో నిర్వాహకుడు -
పనిమంతులకు ఎన్నికళ!
సిరిసిల్లటౌన్: పల్లెపోరులో పనిమంతులకు చేతినిండా పని ఉంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులకు ఎన్నికల ఉపాధితో సంతోషంగా ఉంటున్నారు. సాధారణ రోజుల్లో తక్కువగా ఉండే పనులు ఇప్పుడు పొద్దస్తమానం ఉండడంతో నాలుగురాళ్లు సంపాదిస్తూ... ఉత్సాహంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో లైటింగ్, ప్రింటింగ్, ఫ్లెక్సీ ఏర్పాటు, ఆటో తదితర కార్మికులు, చిరువ్యాపారులకు సర్పంచ్ ఎన్నికల ఆర్డర్లు కలిసి వస్తున్నాయి. పక్షం రోజులు ఉండే సీజనల్ ఆర్డర్లు వస్తుండడంతో మూడు పూటలు కష్టపడుతూ.. మెరుగైన ఉపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలో ఎన్నికలు ఉపాధి పొందుతున్న కష్టజీవులపై కథనం.. సిరిసిల్లలో ఎలక్షన్ జోష్ మార్కెట్కు సర్పంచ్ ఎన్నికల హోష్ ప్రచార కార్మికులకు సీజనల్ ఉపాధి పక్షం రోజులుగా ఎడతెరపి లేకుండా పనులు -
వార్డుల్లో కుటుంబ సభ్యుల పోటీ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలోని పలు పంచాయతీల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు వార్డుస్థానాలకు పోటీపడుతున్నారు. అందుగులపల్లి పంచాయతీలో మాజీ ఉపసర్పంచ్ తలారి స్వప్న మళ్లీ వార్డు సభ్యురాలిగా పోటీపడుతుండగా ఈసారి ఆమె భర్త తలారి సాగర్ కూడా వార్డు సభ్యుడిగా వేర్వేరు స్థానాల్లో పోటీచేస్తున్నారు. అలాగే గుర్రాంపల్లి పంచాయతీలో సుల్తాన్కుమార్ 6వ వార్డులో, ఆయన భార్య విజయ 7వ వార్డులో పోటీకి దిగారు. ఇక కాసులపల్లి పంచాయతీలో వెల్ది రాజ్యలక్ష్మి 3వ వార్డులో, ఆమె కొడుకు వెల్ది సాయిచంద్రావు 2వ వార్డులో పోటీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వ్యక్తిపై కేసుతంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్నికల ప్రచారం సమయం ముగిసి 48 గంటల సైలెంట్ పీరియడ్లో కోడ్ ఉల్లంఘించి ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్నగర్లో సిరిసిల్లకు చెందిన సంపత్ శనివారం ప్రచారం చేస్తుండగా ఎఫ్ఎస్టీ టీమ్ గుర్తించి.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.సుల్తాన్ కుమార్, విజయ తలారి సాగర్, స్వప్న -
అనారోగ్యంతో కూలి మృతి
చందుర్తి(వేములవాడ): నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే స్థితిలో ఓ నిరుపేద ప్రాణాలు వదిలాడు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మేడారం మురళి(58) కులవృత్తిని చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రితం సైకిల్పై నుంచి జారిపడ్డాడు. అప్పటి నుంచి మంచంపట్టి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వైద్యం చేయించుకునే స్థోమత లేక శనివారం ప్రాణాలు కోల్పోయాడు. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మై వేములవాడ చారిటబుట్ ట్రస్టు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య వనజ, ఇద్దరు కుమారులు నరేశ్, రాజశేఖర్ ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
‘ట్రినిటి’కి జాతీయస్థాయి అవార్డు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ట్రినిటి ఇంజినీరింగ్ కాలేజీ(అటానమస్)కు జాతీయస్థాయి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్ అవార్డు – 2025ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. బ్రెయిన్ ఫీడ్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి వేదికపై ఉన్నత విద్యామండలి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫె సర్ బాలకృష్ణరెడ్డి ద్వారా విద్యాసంస్థ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. జిల్లాలో వ్యాప్తంగా తమ కాలేజీకే అవార్డు దక్కడం సంతోషకరమని ట్రినిటి ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, డైరెక్టర్ మమతారెడ్డి, కో ఆర్డినేటర్ అశోక్కుమార్, ప్రిన్సిపాల్ మణిగణేశన్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థి కళ్లలో కారం చల్లి దాడిశంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామపంచాయతీ అభ్యర్థి దండు కొమురయ్య కళ్లలో కారం చల్లి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ మద్దతుతో పోటీచేస్తున్న కొమురయ్య శుక్రవారం రాత్రి ఒంటరిగా వెళ్తున్న క్రమంలో ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లి దాడి చేసి పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. సృహతప్పి పడిపోయి తేరుకున్న తర్వాత 100కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. -
పన్నెండు గంటలు పనిచేస్తున్నాం
నేనే ప్రింటింగ్ రంగంలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్ల క్రితం సొంతంగా ఫ్లెక్సీలు, స్టిక్కర్లు ప్రింటింగ్ స్టూడియో నడిపిస్తున్నా. మామూలు రోజుల్లో ఆర్డర్లు కన్నా ఇప్పుడు మూడింతలు పెరిగాయి. పక్షం రోజులుగా సర్పంచ్ ఎన్నికలతో వచ్చే గిరాకీతో నేను, మరో నలుగురు సిబ్బందిమి పన్నెండు గంటలపాటు పనిచేయాల్సి వస్తుంది. ఆర్డర్లు చెప్పిన సమయానికి అందిస్తున్నాం. – నందగిరి మహేశ్, ఫ్లెక్సీ ప్రింటర్నలభై ఏళ్లుగా ప్రింటింగ్ రంగంలో.. మేము నలభై ఏళ్లుగా ప్రింటింగ్ప్రెస్ రంగంలో పనిచేస్తున్నాం. ఇద్దరం 20 ఏళ్ల క్రితం సొంతంగా ప్రెస్ నిర్వహిస్తున్నాం. బ్యాలెట్స్, పోస్టర్లు, కరపత్రాలు ప్రింటింగ్ చేస్తున్నాం. గుర్తులు కేటాయించిన రోజు, తెల్లవారి రోజు పని ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ మొదలుకొని ప్రతిరోజు 30 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇది మామూలు రోజుల కన్నా మూడింతలు ఎక్కువ. ఇద్దరం కలిసి రోజూ పన్నెండు గంటలు పనిచేయాల్సి వస్తుంది. – కట్కం ఉపేందర్ తీరిక లేకుండా పని ఉంటుంది ఎన్నికల రాకతో మాకు పని బాగా ఉంటుంది. ఆర్డర్లమీద ఆర్డర్లుతో క్షణం తీరిక లేకండా ఉంటుంది. మా దగ్గర కండువాలు, జెండాలు, బ్యానర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, పోస్టర్లు, అన్ని రకాల ప్రింటింగ్ పనిచేస్తాం. పక్షం రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు 15 గంటలపాటు పనిచేస్తేనే ఆర్డర్లు సమయానికి ఇవ్వగలుగుతున్నాం. 23 ఏళ్లుగా స్క్రీన్ప్రింటింగ్ పనిచేస్తున్నా. నలుగురు వర్కర్లతో కలిసి గోదాంలో ప్రింట్ చేసి అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికల గిరాకీ బాగా ఉంది. – మంచికట్ల శ్రీనివాస్, స్క్రీన్ ప్రింటర్ సౌండ్ సిస్టమ్కు డిమాండ్ సర్పంచ్ ఎన్నికల్లో మైక్లు, సౌండ్ సిస్టమ్కు డిమాండ్ ఉంది. మా తాత మొదలుకుని నాన్న నేను కలిసి 60 ఏళ్లుగా సిరిసిల్లలో మైక్సౌండ్, లైటింగ్, టెంట్హౌస్, సీలింగ్(ఈవెంట్స్), అనౌన్స్మెంట్ పనిచేస్తున్నాం. ఉదయం 7–30 గంటలు మొదలుకుని రాత్రి 10 గంటల వరకు పనిచేస్తున్నాం. మాతోపాటు ముగ్గురు వర్కర్లకు చేతినిండా పని ఉంటుంది. – షేక్ షరీఫ్, మైక్ సౌండ్స్ నిర్వాహకుడు -
మాట మీద ఉండే వారు
మాది కోనరావుపేట మండలం నాగారం. 1980లో నాగారం సర్పంచ్గా పనిచేశాను. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్గా గుర్తింపు, గౌరవం ఉండేది. నేను వేములవాడ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశాను. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. ఆనాటి గౌరవం, మర్యాద ఇప్పటితరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరును చూస్తే బాధగా ఉంది. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే.. ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతుంది. – మ్యాకల భూమయ్య, నాగారం మాజీ సర్పంచ్ -
అర్చనకు గోల్డ్ మెడల్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి అంతర్జాతీయ పారా త్రో బాల్ చాంపియన్షిప్లో గోల్డ్మెడల్ సాధించింది. చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన శ్రీలంకలో ఈనెల 6, 7 తేదీలలో జరిగిన ఫస్ట్ సౌత్ ఆసియన్ పారా త్రో బాల్ చాంపియన్షిప్లో పాల్గొన్నారు. గోల్డ్మెడల్ సాధించి శనివారం స్వగ్రామానికి చేరుకోగా.. సిరిసిల్ల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రస్తుతం సీ్త్ర శిశు సంక్షేమ వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖలో ‘మల్టీ టాస్క్’ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. అర్చనను సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీలంకలో జరిగిన పోటీలకు ప్రభుత్వం పంపింది. వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది శాంతి ప్రకాశ్శుక్లా, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధాబాయి, విశ్రాంత ఉపన్యాసకులు ఝాన్సీశుక్లా, యెల్లె సువర్ణ, సీనియర్ పాత్రికేయులు తడుక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో నకిలీనోటు కలకలం?వేములవాడ: మున్సిపల్ పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీనోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లించే క్రమంలో రూ.500 నకిలీ నోటు రావడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో ఓసారి రూ.500 నోటు నకిలీది వచ్చిందని, ఇది రెండోసారి కావడంతో మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురవుతున్నారు. -
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
నేను వేములవాడ పాతసమితి పరిధిలోని రుద్రవరం సర్పంచ్గా 1964లో ఏకగ్రీవమయ్యాను. అప్పటికే నేను నిజాం కాలేజీలో చదువుతున్నాను. మా నాన్న అనంతరావు సిరిసిల్లలో అడ్వకేట్గా ఉన్నారు. ఊరిలో సేవచేయాలని సర్పంచ్ను చేశారు. అప్పటి నుంచి 1980 వరకు మూడుసార్లు ఏకగ్రీవంగానే సర్పంచ్గా పనిచేశారు. రాష్ట్రస్థాయిలో రుద్రవరం ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై ంది. అప్పట్లో డబ్బు ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. నేను 1980 నుంచి 1986 వరకు వేములవాడ సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. 1987 నుంచి 1992 వరకు ఎంపీపీగా పనిచేశాను. కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్గా, 1999లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పనిచేశాను. – రేగులపాటి పాపారావు, రుద్రవరం మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే -
ఎన్నికల స్వరూపం మారింది
సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం సాగుతోంది. ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికలతో పల్లెలు సందడిగా మారాయి. నాలుగున్నర దశాబ్దాల కిందట తొలితరం సర్పంచులుగా పనిచేసిన వారెందరో ఉన్నారు. అప్పటి పల్లె వ్యవస్థ, ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. నాటి ఎన్నికల తీరు.. నేటి ఎన్నికల పరిణామాలను గమనిస్తున్న వారెందరో ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి తొలితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. నాటి సర్పంచుల మనో‘గతం’ఇదీ.. నోటే ఓటైంది వ్యాపారంగా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు తొలితరం సర్పంచుల మనో‘గతం’ -
బీజేపీ సర్పంచ్లున్న గ్రామాలకు పెద్దపీట
కొత్తపల్లి(కరీంనగర్): కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచులు అసూయ పడేలా బీజేపీ సర్పంచులున్న గ్రామాలకు పెద్దపీట వేసి అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప సర్పంచ్లతో కేంద్ర మంత్రి శనివారం కరీంనగర్ శివారులోని రాజశ్రీ గార్డెన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులను శాలువాతో సత్కరించారు. సంజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కుంటుపడటంతో రాబోయే రోజుల్లో సర్పంచ్లపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశముందన్నారు. బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్లు ఎవరూ బాధపడొద్దని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్తోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఈ నెల 18లోపు మాత్రమే బీజేపీలోకి వస్తే ఆ గ్రామాలకు కూడా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానన్నారు. 18 తర్వాత ఏ పార్టీవారిని చేర్చుకునేది లేదని డెడ్లైన్ విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరకముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిని గోపి, బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్ రావు పాల్గొన్నారు. -
అంతుచిక్కని ఓటరు నాడి
కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ఓటు అడిగేందుకు ఇంటికి వస్తున్న అభ్యర్థులను నిరాశ పర్చడం లేదు. మా ఓటు మీకే అంటూ హామీ ఇస్తూ ఉత్సాహపరుస్తున్నారు. మీకు కాకుంటే ఎవరికేస్తాం అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఏ అభ్యర్థి ప్రచారానికి వెళ్లినా ఓటర్ల నుంచి ఇదే సమాధానం వస్తోంది. దీంతో అభ్యర్థులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఓట్లు చేజారకుండా చూసుకునే పనిలోనే ఉంటున్నారు. మొదటి విడత ఎన్నికలు పూర్తవ్వగా, నేడు రెండో విడత జరగనున్న నేపథ్యంలో ప్రచారవేడీ మరింత పెరిగింది. మూడో విడత ఎన్నికలు సమీపిస్తుండటంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యక్షంగా ఓటు అడగడమే కాకుండా, ఓటర్లు ఎవరి మాట వింటారు, ఎవరి ప్రభావంలో ఉంటారు అనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటూ మధ్యవర్తుల ద్వారా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఓటే గెలుపు– ఓటములను నిర్ణయించే స్థితి ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దన్న భావన అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సర్పంచ్గా గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు గ్రామాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యమని హామీలు గుప్పిస్తున్నారు. యువత, మహిళల ఓటు కీలకమని గుర్తించిన అభ్యర్థులు వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ హామీల మధ్య నిజమైన ఓటరు తీర్పు మాత్రం బ్యాలెట్బాక్సు వద్దే బయటపడనుంది. చివరి క్షణం వరకు ఎవరికి ఓటు పడుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతుండటమే గ్రామీణ రాజకీయాల్లో ఓటరు స్వతంత్రతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కన్నా ఓటరు మనసు గెలవడం ఎంత కష్టమో అభ్యర్థులకు స్పష్టంగా అర్థమవుతోంది. -
852 మంది పోలీసులతో బందోబస్తు
కరీంనగర్క్రైం/శంకరపట్నం: రెండో విడత పంచాయతీ ఎన్నిలకు 852 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. పోలీసు కమిషనరేట్ కేంద్రంలో శనివారం పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లడుతూ.. ఐదు మండలాల పరిధిలో జరిగే ఎన్నికలకు ఆరుగురు ఏసీపీలు, 18 మంది సీఐలు, 36 మంది ఎస్సైలు, 37 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 450 మంది కానిస్టేబుళ్లు, 40 మంది స్పెషల్యాక్షన్ టీంలు, 165 మంది హోంగార్డులు, 100 మంది స్పెషల్ బెటాలియన్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తిమ్మాపూర్, శంకరపట్నం, మానకొండూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లోని 113 గ్రామాల్లో ఏర్పాటు చేసిన 1,046 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, ఒక్కో మండలానికి ఏసీపీ ఇన్చార్జిగా ఉండడంతో పాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 15 కేసులు నమోదు చేశామన్నారు. శంకరపట్నం మండలకేంద్రంలో ప్రభుత్వ మాడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. -
మాకివ్వండి!
మా పైసలు‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. తమ నాయకుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అతని అనుచరులు వేధిస్తున్నారు.’సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటుకు రాలవు ఓట్లు.. అనేది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. తొలి విడత ఫలి తాలు మూడో విడత అభ్యర్థులకు గుణపాఠమైంది. గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో తొలివిడత ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు చేసిన అభ్యర్థులు అప్పు ల పాలయ్యారు. ఒక్కో గ్రామంలో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పంపకాలు జరగడం గమనార్హం. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో తొలివిడత గ్రామాల్లోని పరాజితులు ఎక్కడ మిస్సయ్యిందని లెక్కలేసుకుంటున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన.. పరాజ యం పొందిన ఇద్దరి జేబులు ఖాళీ అయ్యాయి. పైగా అప్పులపాలయ్యారు. విజయం సాధించిన అభ్యర్థి సంపాదించుకుంటాననే నమ్మకంతో ఉండగా పరాజయం పొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేశారో, ఏ ప్రాంతంలో ఓట్లు రాలేదో తెలు సుకుని ‘మా డబ్బులు వెనక్కియ్యండంటూ’ ఆయా ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లి జబర్దస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంతని ఇచ్చినా ఓటర్లు ముఖం చూడకపోవడంతో అభ్యర్థుల ఆవేశం కట్ట లు తెంచుకుంటోంది. ‘ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినం.. అయినా నాలుగు ఓట్లు పడలేదంటూ’ తిట్లపురాణం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మూడో విడతకు గుణపాఠం తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మూడో విడత అభ్యర్థులకు గుణపాఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగింది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపించింది. ఓట్లు వే స్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచా ల్సిందే అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం.‘మొదటి విడత రిజర్వేషన్లు వచ్చిన పలు గ్రామాల్లో కొందరు పెట్టుబడిదారులు సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో తిరిగి డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు.’‘కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ రెవెన్యూ గ్రామ పంచాయతీలో రూ.80 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాడు’. -
మా ప్రాణాలు కాపాడండి
● డంప్యార్డ్లో ప్లకార్డులతో నిరసన కరీంనగర్ కార్పొరేషన్: సీఎం గారూ...డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తారా... చనిపోతుంటే చూస్తూ ఉంటారా.. మా ప్రాణాలు కాపాడండి...అంటూ డంప్యార్డ్ బాధితులు వినూ త్న రీతిలో నిరసన తెలిపారు. నగరంలోని అలకాపురికాలనీకి చెందిన సామాజిక కార్యకర్తలు దుంపేటి రాము, ఉమర్ అన్సారీ, రాజు, శ్రీనివాస్ శనివారం డప్యార్డ్లో నిరసనకు దిగారు. సీఎం సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. నగరంలోని రాజీవ్ రహదారి బైపాస్ వద్ద ఉన్న డంప్యార్డ్తో సమీప కాలనీల వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపా రు. డంప్యార్డ్ మూలంగా వెలువడుతున్న విషవాయువులతో సమీప ప్రాంత వాసులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన చెందారు. చొప్పదండి/కరీంనగర్ టౌన్: పీఎంశ్రీ నవోద య విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 6,812 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,113 మంది హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా నుంచి 1,497, జగిత్యాల జిల్లా నుంచి 1,858, పెద్దపల్లి జిల్లా నుంచి 731, సిరిసిల్ల జిల్లా నుంచి 671, సిద్దిపేట జిల్లా నుంచి 159 మంది, హన్మకొండ జిల్లా నుంచి 58, జయశంకర్ జిల్లా నుంచి 133 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే నోడల్ ఆఫీసర్గా వ్యవహరించారు. నగరంలోని భగవతి పాఠశాలలోని పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏడు జిల్లాల నుంచి ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షించి ప్రవేశ పరీక్షను విజయవంతం చేశారని, వారికి నవోదయ ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి వరకు ఐడీసీఎంటీ పనులు పూర్తి చేయాలికరీంనగర్ కార్పొరేషన్: సంక్రాంతి నాటికి ఐడీఎస్ఎంటీ భవన మరమ్మతు పనులు పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఐడీఎస్ ఎంటీ భవన మరమ్మతు పనులను, సిక్వాడీలోని సుడా భవన నిర్మాణ పనులను పరి శీలించారు. వచ్చే సంక్రాంతి పండగ వరకు ఐడీఎస్ఎంటీ భవన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సుడా భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. మార్చి వరకు మొదటి దశ పనులు పూర్తి చేయాలన్నారు. డీఈ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇన్స్టాలో మాక్ పోలింగ్చిగురుమామిడి: నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల సైలెంట్ పీరియడ్లో ఇన్స్టాలో గ్రామంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారని మాక్ పోలింగ్ నిర్వహించారు. బహిరంగంగా ఆన్లైన్ వేదికగా ఇన్స్ట్రాగామ్లో ఇలాంటి చర్యలు నేరమని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ ఇన్స్ట్రాగామ్ పేజీలో జీపీ ఎన్నికలపై శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించినట్లు ఇదే గ్రామానికి చెందిన మంథని శ్రీకాంతాచారి జిల్లా ఎన్నికల సహాయ అధికారి, చిగురుమామిడి తహసీల్దార్ ముద్దసాని రమేశ్కు ఫిర్యాదు చేశాడు. ఇలా చేయడం ఎన్నికల నింబధనలకు విరుద్ధమని జిల్లా సహాయ ఎన్నికల అధికారి రమేశ్ తెలిపారు. శ్రీకాంతాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని చిగురుమామిడి పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఆన్లైన్లో మాక్ మాక్ పోలింగ్ నిర్వహించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని సైబర్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. -
ఇయాల్నే
రెండో తీర్పుసాక్షిప్రతినిధి, కరీంనగర్:జిల్లాలోని ఐదు మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ, ఆనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. రెండో విడతలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం. గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 1,046 వార్డులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో రెండు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 111 గ్రామ పంచాయతీ స్థానాలకు 438 మంది బరిలో ఉన్నారు. 1,046 వార్డుమెంబర్ స్థానాలకు గానూ 197 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 849 వార్డు స్థానాలకు గానూ 2,476 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి రెండో విడత ఎన్నికలు జరిగే మండలాలకు సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. మానకొండూర్ మండలానికి మానకొండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిమ్మాపూర్కు వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, శంకరపట్నంకు కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గన్నేరువరం మండలానికి సంబంధించి జంగపెల్లి హైస్కూల్, చిగురుమామిడి మండలానికి సంబంధించి ఎంపీడీవో కార్యాల యం నుంచి సామగ్రి పంపిణీ పూర్తి చేశారు. 1,046 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను సిబ్బందికి అందజేశారు. ప్రిసైడింగ్ అధికారులు శనివారం సాయంత్రం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 18 జోన్లు, 40 రూట్లను ఏర్పాటు చేసి, ఒక్కో అధికారిని ఇన్చార్జిగా నియమించారు. అదనంగా చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. మేజర్ గ్రామపంచాయతీలు మినహా మిగితా గ్రామాల్లో సాయంత్రం వరకు ఫలితాలు వెలువడే అవకాశ ముంది. మూడువేలకు పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఏడు గంటల వరకు, ఐదువేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది గంటలవరకు పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. మేజర్ గ్రామాల్లో ప్రలోభాల ప్రవాహంరెండోవిడత పోలింగ్ జరిగే పల్లెల్లో ప్రలోభాల ఎర తీవ్రమైంది. గ్రామాల్లోని మహిళా సంఘాలు, యువకులను ప్రసన్నం చేసుకునేందుకు శనివారం రాత్రివరకు ప్రయత్నాలు నిర్వహించారు. జనరల్ స్థానాలు వచ్చిన పంచాయతీల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, చిగురుమామిడి మండలకేంద్ర సర్పంచ్ స్థానాలతో పాటు ఆదాయం ఉన్న గ్రామాల్లో అభ్యర్థులు ఖర్చు కు వెనకాడడం లేదు. ఒక్కోచోట రూ.20లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఖర్చుకు సై అంటున్నారు. 144 సెక్షన్ అమలు పోలింగ్ జరిగే 113 గ్రామపంచాయతీల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పో లింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. పోలింగ్ రోజు అభ్యర్థులు కానీ, అభ్యర్థుల తరఫునవారు అల్పాహారం, భోజనం పెట్టడం, వాహనాల్లో ఓటర్లకు చేరవేయడం చేయరాదు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయొద్దు. గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు తీయరాదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.మానకొండూర్: రెండో విడత పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. ప్రతి కౌంటర్ను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్లిస్ట్ ప్రకారం తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏవైన సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలన్నారు.84 -
మృతశిశువుతో ఆందోళన
హుజూరాబాద్: హుజూరాబాద్ ఆస్పత్రి ఎదుట మృత శిశువుతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల లత ఎనిమిది నెలల గర్భిణీ. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లింది. సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా గర్భస్రావమైంది. వైద్యులు పరీక్షించి శిశువు చనిపోయి రెండురోజులు అవుతుందని చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు హుజూరాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో పాప చనిపోయిందని ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి తెలిపారు. -
మహిళలకు ఆరోగ్యం.. పిల్లలకు పోషకాహారం
కరీంనగర్టౌన్: శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా జిల్లాలో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణపై అవగాహన వస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హౌసింగ్బోర్డ్ కాలనీ అంగన్వాడీకేంద్రం పరిధిలో నిర్వహించిన శుక్రవారం సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ శుక్రవారం సభతో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనివల్ల చాలామంది రక్తహీనత గురించి తెలుసుకుని అధిగమించారని అన్నారు. తమ పిల్లలు ఎంత బరువు, ఎంత ఎత్తు ఉండాలి అనే విషయంపై తల్లులకు అవగాహన పెరుగుతోందని తెలిపారు. పిల్లలకు పోషకాహారం అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా స్వీకరించాలని సూచించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన చేశారు. మెప్మా పీడీ స్వరూపారాణి, సీడీపీవో సబితాకుమారి, మెడికల్ ఆఫీసర్ ప్రణవ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖి కేంద్రం కౌన్సిలర్ పద్మావతి పాల్గొన్నారు. ‘స్వచ్ఛ ఏవం యు హరిత రేటింగ్’కు ఎంపిక స్వచ్ఛ ఏవం యు హరిత విద్యాలయ రేటింగ్లో జిల్లా నుండి 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాస్థాయిలో చిగురుమామిడి మండలం కొండాపూర్ మండల పరిషత్ పాఠశాల, ఇస్లాంనగర్ మండల పరిషత్ పాఠశాల, తిమ్మాపూర్ ఉర్ధూ మీడియం పాఠశాల, గంగాధర మండలం ఒడ్యారం జిల్లా పరిషత్ హైస్కూల్, మానకొండూర్ మండలం పచ్చునూర్ జిల్లా పరిషత్ హైస్కూల్, జమ్మికుంట ధర్మారం పీఎంశ్రీ పాఠశాల, కరీంనగర్ కుమ్మర్వాడి పాఠశాల ఎంపికయ్యాయి. -
ఓట్ల లెక్కింపుపై ఫిర్యాదులు
మంథని: సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగలేదని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మెండె రాజయ్య ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఓట్ల లెక్కింపు క్రమంలో తనకు ప్రత్యర్థి కన్నా అదనంగా ఒకఓటు వచ్చిందని, దీంతో గెలుపు తనదేనని ప్రకటించిన కొద్దిసేపటికే ఓటు చెల్లదని అధికారులు ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందన్నారు. అంతేకాకుండా ఆగమేఘాలపై అధికారులు తనను అయోమయానికి గురిచేసి డ్రా పద్ధతిన ప్రత్యర్థిని గెలిచినట్లు ప్రకటించారని అన్నారు. ఓట్ల లెక్కింపుల్లో అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. పెగడపల్లి సర్పంచ్ ఎన్నికపై.. పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి పంచాయతీ ఎన్నికల్లో అనుమానాలు ఉన్నాయని సర్పంచ్ అభ్యర్థి అల్లం సదయ్య పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ బండిళ్లపై గుర్తు కనిపించలేదని, లెక్కింపు సమయంలో తమ ఏజెంట్లను ఓట్ల ధ్రువీకరణకు అనుమతివ్వలేదని, కౌంటింగ్ విధానం సరిగా చేయకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని, రీకౌంటింగ్ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నూనేటి సదయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్ తదితరులు ఉన్నారు. -
దీపావళికి గుర్తింపుపై సంబరాలు
దీపావళికి సాంస్కృతిక వారసత్వ జాబితాలో యునెస్కో చోటునివ్వడాన్ని హర్షిస్తూ అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చుతూ నిర్ణయించడం పట్ల దీపాలు వెలిగించి..టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి , రిటైర్డ్ ప్రిన్సిపల్ డా.మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. – కొత్తపల్లి(కరీంనగర్) -
హామీల బాండ్ పేపర్ విడుదల
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి ఆకుల మణక్క తాను గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ పేపర్ విడుదల చేశారు. సర్పంచ్గా పోటీచేస్తున్న ఆమె.. అభివృద్ధి పనులు చేపడతామని శుక్రవారం బాండ్ పేపర్పై రాసి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ 40 ఏళ్లుగా గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, తనను గెలిపిస్తే ఐదేళ్లలోనే 14 సమస్యలు పరిష్కరిస్తానని బాండ్ పేపర్ రాశారు. ఆ పేపర్ను అభిమానులు, ఓటర్ల మధ్య విడుదల చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. -
ఎస్యూకు రూ.100 కోట్లు కోరుతాం
కరీంనగర్కార్పొరేషన్/సప్తగిరికాలనీ: శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటా యించాలని ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులంతా కలిసి సీఎం రేవంత్రెడ్డిని కోరుతామని బీసీ సంక్షేమ,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. శాతవాహన యూనివర్సిటీని అభివృద్ధి చేయాలంటూ వీసీ ఉమేశ్కుమార్ శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇటీవల ఉస్మానియాయూనివర్సిటీ అభివృద్ధికి రూ.1 వేయి కోట్లు కేటాయించిందని తెలిపారు. అదే తరహాలో ఉత్తర తెలంగాణలోని చారిత్రాత్మక శాతవాహనయూనివర్సిటీ అభివృద్ధికి రూ.100కోట్లు కావాలని కోరుతామని చెప్పారు. భవిష్యత్తరాలను తీర్చిదిద్దే ఈ యూనివర్సిటీకి రూ.100 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వీసీకి సూచించారు. ఈ ప్రతిపాదనలను తాము సీఎం వద్దకు తీసుకెళ్లి, కేటాయించేలా కృషి చేస్తామన్నారు. -
యాచకుల రహిత రామగుండం లక్ష్యం
కోల్సిటీ(రామగుండం): యాచకుల రహిత రామగుండం నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరు సహకరించాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోరారు. స్మైల్ ప్రాజెక్ట్ (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ ప్రైజెస్) నిర్వాహక సంస్థ శ్రీవినాయక విమెన్(అర్బన్) త్రిఫ్ట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రూపొందించిన పోస్టర్ను శుక్రవారం బల్దియాలో ఆవిష్కరించారు. కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్లో యాచకులను గుర్తించి పునరావాసం కల్పిస్తుందన్నారు. గోదావరిఖని తిలక్నగర్ డౌన్లో స్మైల్ ప్రాజెక్ట్ పునారావాస కేంద్రాన్ని మెప్మా నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో ఉచిత వసతి, మూడు పూటలా భోజనం, ఆసక్తి గలవారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తుందని వివరించారు. యాచకులు కనిపిస్తే 70135 84588, 86397 17597 నంబర్లకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు. ఈ అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, మెప్మాటౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, సీవో ఊర్మిళ, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు నూనెలతా మోహన్, నిర్వాహకులు శరత్ మోహన్, మమత తదితరులు పాల్గొన్నారు. -
ఆ రెండు పంచాయతీలు పవర్ఫుల్
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి, టీటీఎస్ అంతర్గాం పవర్ఫుల్ పంచాయతీలు. కుందనపల్లి ఓటర్లు 1,850 మంది ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. ఎన్టీపీసీ నిర్వాసిత గ్రామం. వసతుల కల్పనకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయిస్తుంది. ఎన్టీపీసీ బూడిద చెరువు కూడా ఉంది. బూడిదకు డిమాండ్ ఏర్పడింది. ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ డిపోలతో పాటు ఐవోసీ, హెచ్పీ, ఐబీపీ పెట్రోల్ బంకుల స్థిరాస్థుల నుంచి అత్యధికంగా పన్నుల రూపేణా నిధులు సమకూరుతాయి. ఏటా సుమారు రూ.కోటి వరకు పంచాయతీ ఖజానాకు జమవుతుంది. దీంతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీపడుతున్నారు. టీటీఎస్ అంతర్గాంలో 600 ఎకరాలు.. టీటీఎస్ అంతర్గాం పరిధిలో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్ని గ్రామాలకు జంక్షన్. విమానశ్రయం, పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండడంతో సర్పంచ్ పదవిపై ప్రతీఒక్కరి దృష్టి పడింది. దీంతో ఎలాగైనా సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రామంలో 1,302 మంది ఓటర్లు ఉండగా, ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. -
ఎస్ఐఆర్లో బీఎల్వోలది ముఖ్యపాత్ర
కరీంనగర్కార్పొరేషన్: స్పెషల్ ఇన్టెన్సీవ్ రివిజన్(ఎస్ఐఆర్)ప్రక్రియలో బీఎల్వోలు, సూపర్ వైజర్లు ముఖ్య పాత్ర పోషించాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. నగరపాలక సంస్థ ఆవరణలోని కళాభారతిలో బూత్ లెవల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్లో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరించి ధ్రువీకరించాలన్నారు. ఓటర్ల జాబితా సమగ్రంగా ఉండేలా చూసుకోవడం బీఎల్ఓల ప్రధాన బాధ్యత అన్నారు. సమావేశానికి హాజరుకానివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో మహేశ్వర్, కొత్తపల్లి తహసీల్దార్ వెంకటలక్ష్మి, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ రాజేశ్, సహాయ కమిషనర్ దిలీప్, ఎస్ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు. -
సైబర్ మోసం.. రూ.3.3లక్షలు మాయం
ధర్మపురి: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి ఓక వేద పండితుడు మోసపోయిన ఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురికి చెందిన కొరిడె చంద్రశేఖర్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారు. శుక్రవారం తన సెల్ఫోన్లో వచ్చిన వ్యోమ్ యాప్ను డౌన్లోడ్ చేయగా బ్యాంకు అధికారుల పేరుతో సైబర్ మోసగాడు లైన్లోకి వచ్చి బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు నంబర్ తెలుపాలని సూచించాడు. బాధితుడు డెబిట్కార్డు నంబర్ తెలుపగా 2 గంటల్లో నీ పని పూర్తి అవుతుందని సైబర్ మోసగాడు పేర్కొన్నాడు. ఈక్రమంలో చంద్రశేఖర్ బ్యాంకు ఖాతాలోని రూ.3,03,300 లక్షలు మాయం కాగా, బాధితుడు జగిత్యాల సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని.. జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ కథనం మేరకు వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్పల్లికి చెందిన బోదాసు దేవరాజు(37) ఏడాదిగా సోదరి గ్రామం గూడెంలో ఉంటున్నాడు. కూలీ పనులకు వెళ్తున్నానని గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన దేవరాజు ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం కుటుంబ సభ్యులు వెతకగా గూడెం శివారులో చెట్టుకు ఉరివేసుకుని దేవరాజు విగతజీవిగా కనిపించాడు. ఏడాది క్రితం దేవరాజు భార్యతో గొడవపడుతున్నాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో దేవరాజు మద్యానికి బానిసయ్యాడు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి బోదాసు నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం పట్టివేతరాయికల్(జగిత్యాల): మండలంలోని కట్కాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రంజిత్కుమార్ అనే యువకుడు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎఫ్ఎస్టీ సభ్యులు పట్టుకున్నారు. రూ.4,500 విలువ గల 12 బీర్లు, 12 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్టీ సభ్యులు పద్మయ్య, రంజిత్కుమార్, తిరుపతి పాల్గొన్నారు. -
హాట్సీట్గా.. ఉప సర్పంచ్
కరీంనగర్రూరల్: రిజర్వుడ్ పంచాయతీ స్థానాల్లో ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ ఏర్పడింది. రూ.లక్షలు ఖర్చు చేసి ఉపసర్పంచ్ సీటును దక్కించుకున్నారు. సర్పంచ్ పదవి ఎస్సీ, మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవికి తీవ్రపోటీ నెలకొంది. మెజార్టీ వార్డు సభ్యుల మద్దతు కూడగట్టేందుకు రూ.లక్షలు ఖర్చుచేసి పదవిని దక్కించుకున్నారు. కరీంనగర్ మండలంలో ప్రధాన గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవికి అభ్యర్థులు ఖర్చుపెట్టిన స్థాయిలో ఉపసర్పంచ్ పదవికోసం వార్డుసభ్యులకు రూ.లక్షలు చెల్లించా రు. ఓ గ్రామంలో ఉపసర్పంచ్ బరిలో ఉన్న నాయకుడు మిగితా వార్డు సభ్యుల మద్దతు ముంద స్తుగానే సాధించాడు. మరో గ్రామంలో ఉపసర్పంచ్ పదవిని ఓ వార్డుసభ్యుడు అత్యధిక డబ్బులు చెల్లించి దక్కించుకున్నట్లుగా సమాచారం. అర్ధరాత్రి వరకు ఉపసర్పంచ్ ఎన్నిక కరీంనగర్ మండలంలో మొత్తం 14 సర్పంచ్,100 వార్డు స్ధానాలకు గురువారం పోలింగ్ జరిగింది. ముందుగా వార్డు స్ధానాలకు వచ్చిన ఓట్లను అధికా రులు లెక్కించిన అనంతరం సర్పంచ్ స్ధానాల ఓట్లను లెక్కించారు. చేగుర్తి, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ రాత్రి 7గంటలవరకు సర్పంచ్ ఫలితాలు ప్రకటించారు. చామనపల్లి సర్పంచ్ ఫలితం రాత్రి 9గంటలకు, నగునూరు సర్పంచ్ ఫలితం రాత్రి 11గంటలకు ప్రకటించారు. ఉపసర్పంచ్ పదవి కోసం పోటిపడిన అభ్యర్థులు అప్పటికప్పుడే వార్డుసభ్యులకు రూ.లక్షల్లో చెల్లించేందుకు ఒప్పుకోవడంతో అన్నిగ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. -
చలి వణికిస్తోంది
కరీంనగర్: వారంరోజులుగా జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఉదయాన్నే మంచు పొరలు, తెల్ల వారుజామున చలితో గజగజ వణుకుతున్నారు. పగటి వేళల్లో ఎండ ఉన్నా చల్లగాలులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రిపూట స్వెట్టర్ లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 12.2 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. జాగ్రత్తలు పాటించాలి ఉదయం పాఠశాలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల కోసం వెళ్లేవారు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు చలికి ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి గాలులు మొదలై రాత్రంతా తీవ్రత పెరిగిపోతోంది. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఆ ప్రభావం కొనసాగుతోంది. పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, నిమోనియా వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, హృదయ సంబంధ వ్యాధులు, ఆస్తమా, ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.తేదీ కనిష్టం గరిష్టం డిసెంబర్ 6 15.6 29.0 7 15.8 30.7 8 13.3 30.5 9 13.0 29.9 10 13.2 29.5 11 12.2 29.6 -
మేడారం జాతరకు సిద్ధం కావాలి
విద్యానగర్(కరీంనగర్): మేడారం జాతరకు సిద్ధం కావాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ సూచించారు. కరీంనగర్ ఆర్టీసీ బస్స్టేషన్లోని సమావేశ మందిరంలో జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లతో శుక్రవారం సమీక్షించారు. మేడారం జాతరకు వసతులు, సరిపడ బస్సులు, ఇతర రీజియన్ల నుంచి బస్సుల సర్దుబాటు, బస్సుల మరమ్మతు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతర విధుల్లో ఉండేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కరీంనగర్ జోనల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఏవీ.గిరిసింహా రావు ముద్రించిన ‘మేడారం జాతర ఆరోగ్య సూచనలు’ కరపత్రాలు ఆవిష్కరించారు. ఆర్ఎంలు బి.రాజు, డి.విజయభాను, టి.జ్యోత్స్న, ఎ.సరిరాం, ఎస్.భవాణీ ప్రసాద్, డిప్యూటీ రీజియన్ మేనేజర్లు పి.మల్లేశం, ఎస్.భూపతిరెడ్డి, ఎస్.మధుసూధన్, పి.మహేశ్, వి.మల్ల య్య, ఎస్.రామయ్య, శ్రీహర్ష పాల్గొన్నారు. కరీంనగర్: అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శుక్రవారం కరీంనగర్లోని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. పేదరికం, లింగ వివక్షతో ఆరోగ్య సేవలు అందకుండా పోకూడదని, అలాంటివారికి న్యాయసాయం అందించడానికి డీఎల్ఎస్ఏ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ జీ.వీరారెడ్డి, టీబీ ఆఫీసర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,450 పలికింది. శుక్రవారం మార్కెట్కు 212 క్వింటాళ్లను రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలుంటాయని ఇన్చార్జి కార్యదర్శి రాజా వివరించారు. కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ. ఎల్టీ లైన్ వావిలాలపల్లి ఫీడర్ పరిధి లోని బూత్బంగ్లా, అల్ఫోర్స్ కళాశాల, పోచ మ్మ ఆలయం, గుండు హనుమాన్ ఆలయం, తేజస్ స్కూల్, రెడ్డి ఫంక్షన్ హాల్, సుభాష్నగర్ ప్రాంతాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భగత్నగర్, కట్టరాంపూర్, గౌతమినగర్, శ్రీరాంనగర్ కాలనీ, అంబేద్కర్స్టేడియం, ఎల్ఐసీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలుకరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 14వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో పలు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం నిషేధం అన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఈ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రామగుండం: శీతాకాలంతోపాటు సంక్రాంతి పండుగ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. హైదారాబాద్–గోరఖ్పూర్(07075) మధ్య ఈనెల 16, జనవరి 23వ తేదీల్లో నడుస్తుంది. గోరఖ్పూర్–హైదరాబాద్(07076) మధ్య ఈనెల 18, జనవరి 25వ తేదీ నడుస్తుంది. మచిలీపట్నం–అజ్మీర్(07274) ఈనెల 21న ఉదయం పదిగంటలకు బయలు దేరుతుంది. అదేరైలు తిరుగు ప్రయాణం(07275)లో అజ్మీర్–మచిలీపట్నం ఈనెల 28న ఉదయం 8.25 గంటలకు అజ్మీర్లో ప్రారంభమవుతుంది. రోడ్డుపై పడి వ్యక్తి మృతిసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడుకు చెందిన ఏస పర్శరాములు(55) గురువారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. పర్శరాములు గత ఆరు నెలలుగా సిరిసిల్లలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. రాత్రి 10 గంటలకు పని ముగించుకొని నడుచుకుంటూ రగుడు వెళ్తుండగా చంద్రంపేట చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య వనజ, కుమారులు సాయిదీప్, శ్రీనివాస్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొలంలో పడి రైతు..రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన శనిగరపు అంతయ్య(65) గుండెపోటుతో వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం అంతయ్య శుక్రవారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా గుండెపోటుకు గురై పొలంలో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్కు తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. గీత కార్మికుడు..రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మల్లారపు శంకరయ్య(70) అనే గీతకార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు వెళ్లి ఇంటి వచ్చాడు. కాసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాల గ్రామంలోని పత్తిమిల్లులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని మిల్లులో అగ్ని ప్రమాదం ఏర్పడింది. మిల్లులో పనిచేస్తున్న కార్మికులు, హమాలీలు సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వేములవాడలోని ఫైర్స్టేషన్కు సమాచారం అందించడంతో వాహనం వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చింది. మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన పత్తి నిల్వలు ఉన్నాయి. ఎలాంటి నష్టం జరగకపోవడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆధిపత్య ఆరాటం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ అనూహ్య ఫలితాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. 10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది. తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్ల లోనూ 85 సర్పంచ్ స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. -
‘కిసాన్’ సంబురం
పెద్దపల్లి: ఈ ఏడాది రెండో విడతను కిసాన్ సమ్మాన్ నిధులను కేంద్రప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున చెల్లించింది. పథకం ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేల చొప్పున సాయం అందిస్తోంది. తగ్గిన రైతుల సంఖ్య జిల్లాలోని 65,757 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. అంతకుముందు 73,400 మంది రైతులకు సాయం అందించగా.. అనేక కారణాలు, అనర్హులను తొలగిస్తూ 65,757మందిని అర్హులుగా తేల్చింది. వీరికే రెండోవిడత నిధులు జమచేసింది. పొరపాట్లు సరిచేయండి జిల్లాలో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 65,757 మంది రైతులకు రూ.2వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నారు. మిగిలిన వారు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబరులో పొరపాట్లు సవరించి తమ వివరాలను సమర్పిస్తే.. వారికి కూడా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంది. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి -
దివ్యాంగులు ఇలా ఓటు వేయండి..
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు సహాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన సహాయకుడిని ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి తెలిపితే ఆయన అనుమతి ఇస్తారు. దివ్యాంగులు సహాయకుడితో లోపలికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని సహాయకుడు గోప్యంగా ఉంచడంతోపాటు మరోమారు ఇతరులకు సహాయకుడిగా రానంటూ అతను డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటువేసే వ్యక్తి ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి మాత్రం కుడిచేతి చూపుడు వేలికి గుర్తువేస్తారు. స్మార్ట్ ఫోన్కు అనుమతి లేదు పోలింగ్ కేంద్రంలోకి స్మార్ట్ఫోన్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం నిషేధమన్నారు. ఎవరైనా స్మార్ట్ఫోన్ తీసుకొస్తే స్విచ్ ఆఫ్ చేసి భద్రత సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్వో వద్ద ఉంచాలని స్పష్టం చేశారు. రామగుండం: గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు గురువా రం మృతిచెందినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి తెలిపిన వివరాలు.. అక్టోబర్ 24న సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు రైల్వేవంతెన కింద పట్టాల పక్కన తీవ్రగాయాలతో ఉండడంతో స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఎవరైనా బంధువులు గుర్తిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని కోరారు. లారీ బోల్తాపడి ముగ్గురికి గాయాలుధర్మపురి: లారీ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మండలంలోని ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన ఐరన్లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. డబ్బులు పంచుతూ పట్టుబడిన వ్యక్తిఇబ్రహీంపట్నం: మండలంలోని తిమ్మాపూర్లో గురువారం ఉడయం ఏడు గంటల సమయంలో దాసరి రాజేశ్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రేవంత్ పట్టుకున్నారు. రాజేశ్ నుంచి రూ.40వేలు స్వాధీనం చేసుకుని పోలిసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
రంగు పడింది!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివైడర్లకు కొత్తగా రంగులు పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద బ్యూటిఫికేషన్లో భాగంగా ఈ రంగులు వేస్తున్నట్లు చెబుతున్నా, టెండర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో రూ.30 లక్షలు గోల్మాల్ అయినట్లు జరుగుతున్న ప్రచార క్రమంలో హఠాత్తుగా డివైడర్లకు రంగులు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుండడం తెలిసిందే. ఆయా మున్సిపాలిటీలు, నగరపాలకసంస్థలు స్వచ్ఛతలో ర్యాంక్లు సాధించేందుకు ఈ నిధులు వెచ్చిస్తుంటారు. తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంచడం, పారిశుధ్యాన్ని పాటింపచేసేలా ప్రజలను చైతన్యపరిచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగరంలో అలాంటి ప్రచారాలు లేనప్పటికి, రూ.30 లక్షలు బిల్లు చెల్లిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల ‘సాక్షి’లో ‘రంగులేశారట’ పేరిట వెలుగులోకి తేవడం తెలిసిందే. ఎలాంటి రంగులు లేకుండానే రూ.30 లక్షలు స్వాహా చేసేందుకు సిద్దమయ్యారనే కథనం బాధ్యుల్లో కలవరాన్ని పుట్టించింది. ఈ క్రమంలో నగరంలోని బస్స్టేషన్కు సమీపంలోని మెయిన్రోడ్ డివైడర్లకు హఠాత్తుగా రంగులు వేస్తుండడం కలకలం రేపింది. ఈ రంగులకు సంబంధించి అసలు టెండర్ పిలిచారా, టెండర్లేకుండానే పనులు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రంగులు ఎవరేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో, టెండర్ పిలిచారో లేదో కూడా తమకు తెలియదని నగరపాలకసంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. హఠాత్తుగా డివైడర్లపై ప్రత్యక్షమైన రంగులకు, స్వచ్చ సర్వేక్షన్లో రూ.30 లక్షల గోల్మాల్ వ్యవహారానికి ఏదైనా లింకు ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛసర్వేక్షణ్లో భాగంగా నగరంలో చేపట్టిన కార్యక్రమాలు, పిలిచిన టెండర్లు, చెల్లించిన బిల్లులు.. ఈ మొత్తంపై వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్తలు, పలువురు మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఆరోగ్య సేవలు
జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్కు చెందిన అలువాల ఈశ్వర్ ఆర్ఎంపీగా కార్మిక ప్రాంతంలోని నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు. హెల్పింగ్హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేతకార్మికుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు శిబిరాలు, మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామగ్రిని సేకరించి సమకూర్చడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, దివ్యాంగులకు సహాయం తదితర సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి గ్లోబల్ఐకాన్ అవార్డునిచ్చి సత్కరించింది. -
హస్తం హవా
కరీంనగర్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ మొదటి స్థానంలోకి దూసుకురాగా, బీజేపీ తన స్థానాలను మెరుగుపరుచుకొని మూడో స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలకు గానూ కోర్టు వ్యవహారంతో పెద్దంపేట ఎన్నికల నిలిచిపోయింది. కమాన్పూర్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నాలుగు గ్రామాలను కాంగ్రెస్ ఏకగ్రీవంతో ఎగరేసుకుపోయింది. -
వృద్ధులకు బాసటగా..
కనిపెంచిన వారసుల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న వయోవృద్ధులు, ఆస్తులు లాక్కుని అన్నానికి దూరం చేసిన అయిన వాళ్ల నుంచి బాధలు పడుతూ నిస్సహాయ స్థితికి చేరిన వృద్ధులకు బాసటగా నిలుస్తున్నారు ఆర్డీవో వెంకటేశ్వర్లు. ఏడు నెలల క్రితం సిరిసిల్లకు ఆర్డీవోగా బాధ్యతలు తీసుకునే నాటికి జిల్లా కేంద్రంలో బాధలు పడుతున్న వృద్ధుల కేసులు సుమారు 60 వరకు పెండింగ్లో ఉండేవి. ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కేసులపై దృష్టి సారించారు. స్వల్పకాలంలోనే 40 కేసులను పరిష్కరించి వారసుల చేత ఇబ్బందిపడుతున్న వయోవృద్ధులకు ఊరట కలిగించారు. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సమస్యలపై మానవత దృక్పథంతో స్పందిస్తూ త్వరితగతిన కేసుల పరిష్కారానికి చొరవ చూపుతున్న సేవలను గుర్తించిన ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ గురువారం తమ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్శర్మ చేతుల మీదుగా బెస్ట్ ప్రిసైడింగ్ అఽధికారిగా గుర్తించారు. అలాగే సేవారత్న బిరుదునిచ్చి సత్కరించారు. -
వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు
జమ్మికుంట: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామంలో డబ్బులు, మద్యం తమకు వద్దని గ్రామ అభివృద్ధి చేసే సర్పంచ్, వార్డు మెంబర్లకు ఓట్లు వేస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రంగమ్మపల్లి భూలక్ష్మి దేవతల వద్ద సీసీ రోడ్డు ,డ్రైనేజీ నిర్మించే నాయకులు కవాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ధర్మపురిలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలుధర్మపురి: ధర్మపురిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. దీంతో వివిధ దుకాణదారులు వారివారి షాపులను మూసివేశారు. ఫుడ్సేఫ్టీ జిల్లా అధికారి అనూష ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా విషయం తెలిసిన వెంటనే షాపులకు తాళం వేసి వెళ్లిపోయారు. కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ బేకరిలో తనిఖీలు చేసి యజమానికి రూ. పది వేల జరిమానా విధించారు. -
ఆరోగ్యానికి క్రీడలు ముఖ్యం
కరీంనగర్స్పోర్ట్స్: ఆరోగ్యానికి వ్యాయామ క్రీడలు దోహదం చేస్తాయని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ అన్నారు. గురువారం వర్సిటీ క్రీడా మైదానంలో సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. వ్యాయామంతో శారీ రక ధృఢత్వం పెరుగుతుందని, ఆత్మధైర్యం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు రన్స్, జంప్స్, త్రోస్ విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మునవర్, విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మనోజ్ కుమార్, పీడీ విజయకుమార్, దినేశ్, పర్వీన్, అరవింద్, జిలాని పాల్గొన్నారు. సీపీఐ మద్దతుదారులను గెలిపించండిచిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో సీపీఐ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించాలని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఓటర్లను కోరారు. చిగురుమామిడి, సుందరగిరి, రేకొండ గ్రామాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో కలిసి గురువారం ఇంటింటా ప్ర చారం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బూడిద సదాశివ, బోయిని పటేల్, చాడ శ్రీధర్రెడ్డి, మావురపు రాజు పాల్గొన్నారు. కరీంనగర్కల్చరల్: యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని హైదరాబాద్ ది లైఫ్ చర్చ్కు చెందిన అంతర్జాతీయ ప్రవచకుడు డాక్టర్ ఆషేర్ ఆండ్రూ అన్నారు. నగరంలోని కోర్డురోడ్డులోని సెయింట్ మార్క్చర్చ్ గ్రౌండ్లో గురువారం కరీంనగర్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు ప్రధాన ప్రసంగీకుడిగా హాజరై సందేశమిచ్చారు. అంతకు ముందు డాక్టర్ ఆషేర్ ఆండ్రూకు కేసీఏ బాధ్యులు ఘనస్వాగతం పలికారు. కేసీఏ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎం.క్రిస్టోఫర్, ఎంపాలా నాయక్, కార్యదర్శి సురేశ్, సహకార్యదర్శి కెయేల్, కోశాధికారులు ప్రేమసాగర్, బాలరాజు, శ్యాం, అభిలాష్, కృపాకర్ పాల్గొన్నారు. సిటీలో పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ., ఎల్టీ లైన్ వావిలాలపల్లి ఫీడర్ పరిధిలోని బూత్బంగ్లా, అల్ఫోర్స్ కళాశాల, పోచమ్మ ఆలయం, గుండు హనుమాన్ఆలయం, తేజస్స్కూల్, రెడ్డి ఫంక్షన్ హాల్, సుభాష్నగర్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైతన్యపురి ప్రాంతాలతో పాటు విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాసుదేవకాలనీ, కట్టరాంపూర్, అయోధ్యకాలనీ, రెడ్హిల్స్కాలనీ, వాసుదేవకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ‘సర్పంచ్ల విజయంతో కాంగ్రె్స్కు మహర్దశ’కరీంనగర్ కార్పొరేషన్: సర్పంచ్ ఎన్నికలతో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు మహర్దశ వచ్చిందని పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులు అధికంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్గా వడ్లూరి అంజయ్య, తహేర్ కొండాపూర్ సర్పంచ్గా ఆకుల గిరి, దుబ్బపెల్లి సర్పంచ్గా మోతె ప్రశాంత్రెడ్డి, ఫకీర్పేట్ సర్పంచ్గా బొద్దుల విజయలక్ష్మి, బహదూర్ ఖాన్పేట్ సర్పంచ్గా తిరుపతిరెడ్డిని అభినందించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని పేర్కొన్నారు. -
కౌన్సెలింగ్.. స్వచ్ఛంద సేవ
పున్నం చందర్ కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. జీవితంపై నిరాసక్తితో ఆత్మహత్యే శరణ్యమనుకునే వాళ్లను గుర్తించి కౌన్సెలింగ్ ప్రక్రియతో వారిలో విశ్వాసం నింపుతున్నా రు. ఈమేరకు కార్మికులు ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నా రు. కుటుంబ తగాదాలు, దంపతుల భావోద్వేగపరమైన సమస్యల విషయంలో అదే రీతిలో స్పందిస్తున్నారు. కౌమారదశలో బాలికలకు స్వీయ ఆత్మరక్షణ విద్య, గృహహింస బాధితులకు సాయం, బాలల వికాసంపై సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ మానవహక్కుల దినో త్సవం రోజున హైదరాబాద్లో గ్లోబల్ఐకాన్ అవార్డునిచ్చి సత్కరించింది. -
సమాన ఓట్లతో డ్రాలో గెలుపు
● బహుదూర్ఖాన్పేట 1వ వార్డులో ముగ్గురు పోటీ కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేట గ్రామపంచా యతీలో 1వ వార్డులో పో టీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధి కారులు గురువారం డ్రా విధానంలో ఒకరిని ఎంపికచేశారు.1వ వార్డులో మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్ కాగా రెండు చెల్లలేదు. మిగితా 81 ఓట్లలో పోటీ చేసిన బుర్ర మారుతీ, బుర్ర సంపత్కుమార్, బుర్ర తిరుపతి లకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో ముగ్గురు అభ్యర్థుల అంగీకారంతో డ్రా తీయగా బుర్ర మారుతి గెలుపొందారు. కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో 800లకు పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్ని కలు నిర్వహిస్తే కేవలం 22 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఈసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ కమార్ ఆధ్వర్యంలో తొలి దశ ఎన్నికల్లోనే 40కిపైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తొలిదశ ఎన్నికల్లో 160 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు పోటీ చేశారు. అందులో నాలుగో వంతుకుపైగా గెలుపొందడం విశేషం. తొలిదశ ఎన్నికల్లో గెలిచిన మరో 10 మందికి ఇండిపెండింట్ అభ్యర్థులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. బండి సంజయ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతన్నందున ఎంపీ లాడ్స్, సీఎస్సార్ ఫండ్స్ తోపాటు కేంద్రంతో మాట్లాడిన అత్యధిక నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకొచ్చే అవకాశముందని వారు భావిస్తున్నారు. -
ఐదు మండలాలు.. ఆరుగురు ఏసీపీలు
కరీంనగర్క్రైం: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఐదు మండలాలకు ఒక ఏసీపీస్థాయి అధికారిని ఇన్చార్జీగా నియమించి, అన్నింటిని సమన్వయం చేసుకునేందుకు మరో ఏసీపీకి విధులు అప్పగించారు. కరీంనగర్ రూరల్ మండలానికి శ్రీనివాస్ జీ, కొత్తపల్లి మండలానికి వెంకటస్వామి, చొప్పదండి మండలానికి సతీశ్కుమార్, గంగాధర మండలానికి వేణుగోపాల్, రామడుగు మండలానికి యా దగిరిస్వామిని ఇన్చార్జీగా కేటాయించారు. ఐదు మండలాలను సమన్వయం చేసుకునేందకు ఏసీపీ విజయ్కుమార్కు బాధ్యతలు ఇచ్చారు. మొత్తం 782 మంది సిబ్బంది ఉండగా 19మంది సీఐలు 40 మంది ఎస్సైలు, 34 మందిహెడ్కానిస్టేబుళ్లు, 392 మంది కానిస్టేబుళ్లు, 47 స్పెషల్ యాక్షన్ టీం పోలీ సులు, 144 మంది హోంగార్డులు, 100 మంది బెటాలియన్తో బందోబస్తు నిర్వహించారు. సీపీ గౌస్ఆలం ఐదు మండలాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు అందించారు. ఏసీపీల అనుమతి ఉంటేనే విజయోత్సవ సంబరాల ర్యాలీ నిర్వహించాలని, లేకుంటే కోడ్ ఉల్లంఘన అవుతుందని సీపీ సూచించారు. -
ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఓటరు స్లిప్తోపాటు గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గుర్తింపు కార్డులివే.. ● ఆధార్ కార్డు, పీహెచ్సీ ఫొటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు. ● బ్యాంకులు, కోఆపరేటివ్ సంస్థలు ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డులు. ● ప్రభుత్వమిచ్చే హెల్త్ కార్డు, జాతీయ జనాభా నమోదు(ఎన్పీఆర్) కార్డు. ● ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు. ● కార్మిక శాఖ జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం కార్డు. ● మాజీ సైనికులు, వితంతువుల పింఛన్ పుస్తకం, వృద్ధుల పింఛన్ పత్రం. ● ఫొటోతో కూడిన రేషను కార్డు, ఫొటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం. ● స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు. ● ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సు. ● దివ్యాంగుల ధ్రువపత్రం. ● ఫొటోతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం. -
అద్దె చెల్లించడం లేదని వాటర్ ప్లాంట్ మూత
ధర్మపురి: మున్సిపాలిటీకి డాక్టర్ వాటర్ ప్లాంట్ యజమానికి అద్దె చెల్లించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లాంట్ను మూసివేశారు. ధర్మపురి మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2011లో డాక్టర్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ను సుకుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నప్పటికీ అద్దె మాత్రం చెల్లించడంలేదు. దీంతో కమిషనర్ అద్దె చెల్లించాల్సిందేనంటూ ప్లాంట్లో విధులు నిర్వర్తిస్తున్న కర్నె గంగాధర్కు సూచించారు. సుకుమార్కు సమాచారం చేరవేయాలని కోరినా.. నిర్లక్ష్యం చేస్తున్నారు. అద్దె బకాయిలు రూ.5లక్షలకుపైగా చేరడంతో వారం క్రితం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాంట్కు తాళం వేశారు. ప్లాంట్ మూసివేయడంతో చుట్టుపక్కల ఇళ్లవారు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. -
అనాథ వృద్ధులకు పెద్ద దిక్కు
గంభీరావుపేట(సిరిసిల్ల): రెండు దశాబ్దాలుగా అనాథ వృద్ధుల సేవలో తరిస్తున్న మల్లుగారి నర్సాగౌడ్కు అరుదైన గౌరవం దక్కింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ‘మా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సాగౌడ్ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మలిసంధ్యలో అన్నీ తానై వారి బాగోగులు చూసుకుంటున్నారు. తనువు చాలించిన వారికి కన్నకొడుకులా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం 31 మంది అనాథ వృద్ధులు ఉన్నారు. తన సొంతింటిలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి 9వ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా గురువారం ‘సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. నర్సాగౌడ్కు అవార్డు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తొలి విడత ప్రశాంతం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో మొత్తం 92 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మూడు గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. చొప్పదండి మండలంలోని దేశాయిపేట గ్రామంలో సర్పంచ్తోపాటు ఎనిమిది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 91 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1,52,408 మంది ఓటర్లకు గాను, 1,24,088 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 59,504 మంది పురుషులు కాగా, 64,540 మంది సీ్త్రలు ఉన్నారు. మహిళలు 82.51శాతం ఓటుహక్కు వినియోగించుకుని ముందంజలో ఉండగా, 80.26శాతం పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. పరిశీలించిన అధికారులు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ జరిగిన గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. సీపీ గౌస్ఆలం ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలీసు సిబ్బందిని, ఓటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు. మండలం మొత్తం గ్రామాలు ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తంశాతం చొప్పదండి 15 27,677 23,154 11,145 83.02 12,008 84.26 83.66 గంగాధర 33 44,163 34,758 16,293 76.15 18,464 81.10 78.70 కరీంనగర్రూరల్ 14 22,053 18,672 9,233 84.94 9,438 84.40 84.67 కొత్తపల్లి 06 17,767 14,069 6,810 77.98 7,259 80.35 79.19 రామడుగు 23 40,748 33,435 16,023 81.29 17,411 82.78 82.05 మొత్తం 91 1,52,408 1,24,088 59,504 80.26 64,580 82.51 81.42 -
కరీంనగర్
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 20259ఓటుపై మమకారం ఓటు వేసేందుకే వెనకాముందు ఆలోచించే ఈ రోజుల్లో వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కొందరు.క్వింటాల్ పత్తి రూ. 7,400జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తి రూ. 7,400 పలికింది. క్రయ, విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
చొప్పదండి పరిశోధకుడికి అంతర్జాతీయ గుర్తింపు
చొప్పదండి: పోరస్ మీడియంలో హైపర్బోలిక్ టాంజెంట్ నానోఫ్లూయిడ్ ప్రవాహంపై పరిశోధనకు గాను చొప్పదండికి చెందిన కళ్లెం శ్రీనివాస్రెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హైపర్బోలిక్ టాంజెంట్ ప్లోలో కంప్యూటేషనల్ అనాలిసిస్ అనే శీర్షికతో శ్రీనివాస్రెడ్డి చేసిన పరిశోధనకు ప్రతిష్టాత్మక క్యూ1, క్యూ2 ర్యాంక్ గల జర్నల్స్లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. శ్రీనివాస్రెడ్డి చేసిన అధ్యయనాలు అణు రియాక్టర్ శీతలీకరణ, మెటలర్జీ, భౌగోళిక ప్రాసెస్లు, అంతరిక్ష సాంకేతికత వంటి అనేక అధునాతన పరిశ్రమల్లో ఉపయోగపడే విలువైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి. నాన్లీనియర్ సమీకరణాలను పరిష్కరించడంలో ఉన్న క్లిష్టతను అధిగమించి ఈ పరిశోధన ద్వారా థర్మో ఫ్లూయిడ్ వ్యవస్థల రూపకల్పన, విశ్లేషణ, ఆప్టిమైజేషన్లో గణనీయమైన పురోగతిని సాధించినట్లు శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శాసీ్త్రయ నైపుణ్యంతోపాటు పరిశోధనలో నవ్యత, అత్యుత్తమ ప్రచురుణా ప్రమాణాలు కలగలిసిన ఈ అధ్యయనం భారతీయ పరిశోధకుల అంతర్జాతీయ ప్రతిష్టను మరింతగా పెంచిందని అభిప్రాయపడ్డారు. గీతం యూనివర్శిటీ ద్వారా ఆయన ఈ పరిశోధనలో పాల్గొన్నారు. జూలై 30న మాథమెటిక్స్, స్టాటిక్స్ విభాగం ద్వారా ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు. -
ఏకగ్రీవ యత్నం.. ఎన్నిక అనివార్యం
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి పంచాయతీ (జనరల్ స్థానం) ఎన్నికల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన పార్టీల నాయకుల జోక్యంతో గ్రామంలోని దేవాలయం నిధికి విరాళాలు భారీగా వచ్చి చేరాయి. మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెంకట్రావుపల్లి వివిధ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఉపసంహరణకు గడువు లోపు అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోలేదు. రూ.25.25లక్షలకు వేలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులు ఏకగ్రీవం కోసం బహిరంగ వేలం వేశారు. వేలంలో ముగ్గురు అభ్యర్థులు పాల్గొనగా.. తలా రూ.2లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో చివరకు కాంగ్రెస్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి తన భార్య అనిత తరఫున రూ.25.25లక్షలు చెల్లించేందుకు అంగీకరించాడు. వేలం పూర్తయ్యాక.. ఓడిన అభ్యర్థుల డిపాజిట్ను వారికి తిరిగి ఇచ్చి కృష్ణారెడ్డి భార్యకు పోటీగా ఎవరూ ఉండరాదని గ్రామస్తులంతా బాండ్ పేపర్పై సంతకాలు చేసి ఏకగ్రీవం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మొత్తాన్ని తొలి విడతగా గ్రామ శివాలయం అకౌంట్లో జమ చేశారు. సీన్లోకి బీఆర్ఎస్ అభ్యర్థి.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించి.. కృష్ణారెడ్డి చెల్లించిన మొత్తానికి సమానంగా రూ.25.25లక్షల చెక్కును పార్టీ తరఫున అందించారు. దీంతో బీఆర్ఎస్ తరఫున కన్నెబోయిన విజేందర్ బరిలో నిలిచినట్లయ్యింది. మరోవైపు కృష్ణారెడ్డి చెల్లించిన రూ.25.25లక్షలు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన రూ.25.25 లక్షలు శివాలయం అకౌంట్లోకి వచ్చి చేరాయి. అదే సమయంలో తన భార్య ఏకగ్రీవమైందన సంతోషం కృష్ణారెడ్డికి లేకుండాపోయింది. ప్రస్తుతం అనిత, విజేందర్తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా ముద్ధమల్ల లక్ష్మి బరిలో నిలిచారు. -
రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం సంతోషం
● చాడ వెంకట్రెడ్డి చిగురుమామిడి: గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల రావడం సంతోషించదగిందని సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్లో యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణతోపాటు నిరుద్యోగులకు లక్షన్నర ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక టీం లీడర్గా సీఎం రేవంత్రెడ్డి సక్సెస్ అయినట్లు అని అన్నారు. సీపీఐ బలపర్చిన అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గూడెం లక్ష్మి, తేరాల సత్యనారాయణ, మండల సహాయకార్యదర్శి బూడిద సదాశివ, నాయకులు బొలుమల్ల రాజమౌళి, అనిల్, జంపయ్య పాల్గొన్నారు. కరీంనగర్: పెరుక సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెరుక కుల కుటుంబ సమగ్ర డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్కుమార్ కరీంనగర్లో ప్రారంభించారు. జిల్లా సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక ఇంపీరియల్ కన్వెన్షన్లో జరిగింది. జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాండ్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బస్వ వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దొంగరి మనోహర్, సుంకరి ఆనంద్, కీత విజయ్కుమార్, చుంచు ఉషన్న, దొరిశెట్టి వెంకటయ్య, కందుల సంధ్యారాణి, బరుపాటి సంపత్, అల్లం రాజేశ్వర్మ, పోకల నాగయ్య, రేణ మల్లయ్య, వనపర్తి మల్లయ్య, సాయిని దేవన్న, పెట్టాం సంపత్, దాసరి అశోక్, మీసా శ్రీనివాస్, తమ్మిశెట్టి రవి, వంగల మధు, కరుకూరి మల్లేశ్ పాల్గొన్నారు. -
ఓటేసే ముందు ఆలోచించండి..
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లె ప్రగతికి పాటుపడుతోంది.. పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమేనని, ఇప్పటివరకు గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవేనని స్పష్టం చేశారు. రైతు వేదిక నుంచి శ్మశాన వాటిక దాకా.. రోడ్ల నిర్మాణం మొదలు వీధిదీపాల దాకా.. ఆఖరికి గ్రామాల్లో జరిగే పారిశుధ్య పనులకు సైతం కేంద్ర నిధులే వెచ్చిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని విమర్శించారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా, చేసిన పనులకు బిల్లులియ్యకుండా సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చింది బీఆర్ఎస్సేనని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి పైసలిస్తున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా చిచ్చుపెడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే.. ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నయా పైసాఇయ్యలేదు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు.. నన్ను కోసినా నయా పైసా రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే చెబుతున్నడు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనూ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇయ్యలేదు.. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కేంద్ర మంత్రిగా ఎంపీ లాడ్స్ నిధులున్నాయి.. సీఎస్సార్, ఎంపీ లాడ్స్ సహా అనేక రూపాల్లో పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న.. భవిష్యత్తులోనూ కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తెస్తానని తెలిపారు. -
పంచాయతీ
ఇయ్యాల్నే తొలివిడతసాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్: గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,224 గ్రామాలకు గాను మొదటి విడతలో భాగంగా 389 గ్రామాల్లో అధికారులు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలవారీగా కలెక్టర్లు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బుధవారం జిల్లా, మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రితో మధ్యాహ్నమే బయల్దేరి ఎన్నికలు జరగనున్న గ్రామాలను చేరుకున్నారు. కరీంనగర్ 28 గ్రామాలు, పెద్దపల్లిలో 15, జగిత్యాల 21, సిరిసిల్లలో 41 గ్రామాలు 500 లోపు ఓట్లున్నాయి. తక్కువ ఓటర్ల కారణంగా వీటి ఫలితాలు మధ్యాహ్ననికి వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కరీంనగర్లో ఇలా.. కరీంనగర్లో తొలి దశలో భాగంగా 5 మండలాల్లోని 92 గ్రామాల్లో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 3 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా.. 866 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 276 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 590 వార్డులకు యధావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల్లోని జెడ్పీ హైస్కూళ్లలో, కరీంనగర్ రూరల్కు సంబంధించి కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో డిస్ట్రిబ్యూష న్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను బుధవారం స్వయంగా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పోలింగ్ బూత్కు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి, చెక్ లిస్ట్ను తనిఖీ చేసుకోవాలని, ఇబ్బందులుంటే రూట్ ఆఫీసర్ను సంప్రదించాలని ఆదేశించారు. -
గెలిచినోడే మనోడు!
హుజూరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు.. ముగ్గురు పోటీ పడుతున్నారు. వారి కి ఆ పార్టీ నేతలు సర్ది చెప్పలేక గెలిచినోడే మనోడు అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రధానంగా అధికార పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. సర్ది చెప్పినా వినకపోవడంతో పోటీ అనివార్యమైంది. గెలిచి రండంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసొచ్చి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు మధ్య లోకల్ వార్ నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. లోకల్ వార్.. జిల్లాలో మొదటి, రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే.. ఓటర్లు ఎవరికి మద్దతిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ రెండు వర్గాలు పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం దీటుగానే తలపడుతున్నారు. ఇరువర్గాలు బలంగా ఉన్న గ్రామాల వైపు పార్టీ కీలక నేతలు చూసీచూడనట్టుగానే వదిలేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా డబుల్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తోంది. అయితే పలువురు అభ్యర్థులు పార్టీ మద్దతు మాకంటే మాకే ఉందని ప్రచారం చేయడమే గాక.. ప్రచారం వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పార్టీ జెండాలతోనే ప్రచారం పార్టీల రహితంగా జరిగే ఎన్నికలే అయినా.. అభ్యర్థులు మాత్రం పార్టీల జెండాలతోనే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ స్థానికంగా అవగాహనతోనే పోటీ చేస్తున్నాయి. మద్యం, డబ్బు పంపిణీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మద్యం, డబ్బు ఏరులై పారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే మద్యం పంపిణీ జోరుగా సాగుతుండగా.. ఓటర్లకు పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేలతోపాటు క్వార్టర్, ఓ మోస్తరు పంచాయతీల్లో మందుతోపాటు రూ.500, చిన్న గ్రామాల్లో మందు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
వర్సిటీలో ఘనంగా ఎథ్నిక్ డే
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలోని కామర్స్ కళాశాలలో బుధవారం ఘనంగా ఎథ్నిక్ డే నిర్వహించారు. ఈ వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేశ్కుమార్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉట్టి కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యార్థులు సంప్రదాయాలను మరవొద్దని, జాతి గౌరవాన్ని పెంపొందించే ఆచారాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఆచారాలకు సంబంధించిన పండుగలను జరుపుకొని జాతి ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు కట్టుబడి ఉండి దేశ సంస్కృతిని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్కుమార్, ప్రిన్సిపాళ్లు రమాకాంత్, సుజాత, అధ్యాపకులు నజిముద్దీన్ మున్వర్, పద్మావతి, శ్రీవాణి, కృష్ణకుమార్, తిరుపతి, మనోజ్కుమార్, నరేశ్, పరశురాం, సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ వీసీ, ఇతర అధికారులు, విద్యార్థినులు ఉత్సాహంగా పట్టు చీరలు, ధోవతులు, కుర్తాలు, పైజామాలు వంటి సంప్రదాయ వస్త్రధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
ఊరు రమ్మంటోంది..
తొలి విడత పోలింగ్: ఈనెల 11(నేడే) పోలింగ్ జరిగే సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం: అదే రోజు ● సమగ్ర కుటుంబ సర్వేను మరిపించమంటోంది.. ● ఒక్క ఓటూ కీలకమే.. ● శత శాతం ఓటింగ్తోనే ప్రజాస్వామ్యం ● నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..కరీంనగర్ అర్బన్: దసరా వచ్చిందంటే.. రెక్కలు కట్టుకొని సొంతూళ్లో వాలిపోతాం. సంక్రాంతి ఇంకా నెల ఉందనగానే పుట్టిన పల్లెకు పోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తాం. బంధువులను పలకరించి.. అయినవాళ్లతో హాయిగా గడిపి మళ్లీ వెళ్లిపోతాం. మరి ఈనెల 11, 14, 17 తేదీల్లో మీమీ జన్మస్థలాల్లో గొప్ప కార్యం జరగబోతోంది. దానికి అందరూ తప్పకుండా రావాలని ఊరు పిలుస్తోంది. ఓటు తలస్తోంది. అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం. మిగతా సంబురాల్లాగానే దీనికి తప్పకుండా వచ్చి ఓటేసి సొంత గడ్డపై ఒకరోజు హాయిగా సేదదీరి వెళ్లాలని కోరుతోంది. ఓటేసి పొమ్మంటోంది. ● ఒక్క ఓటూ కీలకమే.. దేశ, రాష్ట్రంలోనే కాదు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్క ఓటు కీలకమైంది. అందుకు గత ఎన్నికలే నిదర్శనం. గంగాధర మండలం మల్లాపూర్లో కిషన్, అంజయ్య పోటీ పడగా.. ఇద్దరికి 471 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీసి అంజయ్యను సర్పంచ్గా ప్రకటించారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కల్పన, మాధవి పోటీ పడగా.. ఇద్దరికి 1,250 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడుసార్లు ఓట్లను లెక్కించినా.. అదే ఫలితం రావడంతో టాస్ వేసి కల్పనను విజేతగా ప్రకటించారు. జిల్లాలో 318 గ్రామాలకు గానూ 316 గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పావువంతు గ్రామాల్లో నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఈక్రమంలో ఒక్క ఓటూ ఫలితాన్ని మార్చనుంది. ● పలు రాష్ట్రాల్లో ఓటర్లు జిల్లాలోని చాలామంది విద్య, వ్యాపారం, ఉపాధిరీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్లి నివసిస్తున్నారు. చేనేత కార్మికులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇలా అనేక వర్గాల ప్రజలు మరోచోట ఉన్నా.. ఓటు మాత్రం సొంతూళ్లోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లోని వారు ఒకరోజు సెలవు పెట్టుకొని వస్తే ఓటేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడొచ్చు. పలకరించొచ్చు. ఉత్సవాలను ఆత్మీయుల మధ్య చేసుకొని ఓ ప్రజాస్వామ్య పండగ్గా భావించి పోలింగ్ రోజును ఘనంగా నిర్వహించుకోండి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకరా్యాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. ఒకరోజు ముందే వస్తే మంచిది. ● యాది చేసుకోండి.. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అప్పుడు బయట ఉండేవారంతా రెక్కలు కట్టుకొని వచ్చి వాలారు. అలాగే ఓటు వేడుకకూ తరలొచ్చి నచ్చిన వారికి ఓటేసి వెళ్తే ప్రజా స్వామ్య యజ్ఞంలో పాలుపంచుకున్న తృప్తి ఉంటుంది. నాకెందుకులే అనుకోవద్దు. నీ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించొచ్చు. కీలకంగా మా రొచ్చు. మీరు ఎన్నుకున్న వ్యక్తి వల్ల ఊరు బాగు ప డిందంటే అభివద్ధిలో మీ భాగస్వామ్యం ఉన్నట్టేగా. ● ప్రలోభాలకు లొంగొద్దు ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టాయి. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి బూత్ కమిటీలతో ఆరా తీసి ఇప్పటికే ఫోన్లు చేశారు. దారి ఖర్చులతోపాటు ఇతర ఖర్చులను భరిస్తామని ప్రలోభపెడుతున్నారని సమాచారం. పోలింగ్ తేదీన రప్పించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరి మాటలూ నమ్మకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి. విద్యార్థులు: ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కర్నాటక, పంజాబ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు: బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరువనంతపురం, ముంబయి, ఢిల్లీ చేనేతలు: సూరత్, భీవండి, అహ్మదాబాద్, ముంబయి ఉద్యోగులు: కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వ్యాపారులు: హైదరాబాద్తోపాటు అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కార్మికులు: ముంబయి, హైదరాబాద్ -
అప్పుడు నో.. ఇప్పుడు సై..
● 2019లో ఎన్నికలను బహిష్కరించిన గొల్లపల్లి గ్రామస్తులు ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామ ఓట్లు తమ గ్రామం నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలో కలవడాన్ని నిరసిస్తూ.. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను గొల్లపల్లి గ్రామస్తులు బహిష్కరించారు. అదే సంవత్సరం మూడు నెలల తర్వాత మళ్లీ గొల్లపల్లి గ్రామానికి రీనోటిఫికేషన్ వేశారు. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు అభ్యర్థులు వేశారు. తీరా ఓటర్ లిస్టు పరిశీలించగా.. తమ గ్రామం నుంచి విడిపోయిన 148 ఓట్లు కలవకపోవడంతో మళ్లీ బహిష్కరించారు. గ్రామ పరిపాలన అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్చార్జి అధికారులే నిర్వహిస్తూ వచ్చారు. సంవత్సర క్రితం జరిగిన రీసర్వేలో తమ గ్రామ ఓట్లు 150, సరిహద్దులు తమ గ్రామంలో మళ్లీ కలవడంతో.. ఆరేళ్ల అనంతరం తిరిగి ఈసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొంటున్నారు. గ్రామంలో 620 ఓటర్లున్నారు. 8 వార్డులుండగా.. మూడు, నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. రడం లక్ష్మి, కడగండ్ల శిరీష పోటీ చేస్తున్నారు. శిరీష అంగన్వాడీ ఆయా పోస్టుకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలబడ్డారు. -
అందుబాటులోకి ‘మ్యాంగోమాస్టర్’
జగిత్యాలఅగ్రికల్చర్: తెగుళ్ల బారి నుంచి మామిడి తోటలను కాపాడుకునేందుకు రైతులు నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తుంటారు. చెట్లు ఎత్తుగా ఉంటే పిచికారీ చేయడం చాలా ఇబ్బంది. ఈ క్రమంలో రైతుల ఇబ్బందులు తప్పించేందుకు మ్యాంగో మాస్టర్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం 42 హెచ్పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్కు బిగించుకోవచ్చు. యంత్రం ద్వారా పొగమంచులాగా నీటి బిందువులు మామిడి ఆకులపై పడతాయి. చెట్టు ఎంత ఎత్తు ఉన్నా మందును సమంగా పిచికారీ చేస్తుంది. 25 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల అడ్డంతో మందును సమర్థవంతంగా పిచికారీ చేస్తుంది. యంత్రం బరువు 220 కిలోలు. గంటకు 3 వేల లీటర్ల మందును చెట్లపై పిచికారీ చేస్తుంది. యంత్రానికి కంప్యూటరైజ్డ్ బ్యాలెన్స్డ్ ఫ్యాన్ సిస్టం రివర్స్గా ఉంటుంది. తద్వారా యంత్రం నడిచేటప్పుడు చెట్ల ఆకులు, భూమి మీది గడ్డిని ఫ్యాన్లలోకి లాక్కోకుండా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వద్ద కంప్యూటరైజ్డ్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. కూలీల అవసరం లేకుండానే మందు పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుంది. మామిడి తోటల్లో పిచికారీ యంత్రం కూలీల సమస్యకు చెక్ -
చీరకు నిప్పంటుకొని వృద్ధురాలు సజీవ దహనం
కోరుట్లరూరల్: సంగెం గ్రామానికి చెందిన గోపిడి హన్మక్క(81) చీర కొంగుకు నిప్పంటుకొని సజీవ దహనమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మక్క ఆదివారం ఉదయం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చీర పూర్తిగా కాలి శరీరానికి నిప్పంటింది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొదుతూ బుధవారం మృతిచెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మీ పల్లెను మాట్లాడుతున్నా..
సిరిసిల్ల: అప్పుడే తెల్లారుతోంది. మంచుతెరలు కమ్ముకున్నాయి. సూర్యుడి లేలేత కిరణాలు పల్లెముంగిలికి చేరుతున్నాయి. ఈరోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రారాజువి. పోటీ చేసిన అభ్యర్థులంతా నీ చుట్టూ చేరి చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇది. బయలుదేరు.. ఓటు అస్త్రాన్ని సంధించు. ఊరికి ఉపకారం చేసే అభ్యర్థిని సర్పంచిగా గెలిపించు. వంగి వంగి దండాలు పెట్టిన అభ్యర్థులంతా మట్టి కరువాలి. మన తలరాతలను మార్చే మంచోడికి ఓటేయ్యి. ఎన్నికల రోజు కాబట్టి నా మనసు ఊరుకో లేక.. మీకో లేఖ రాస్తున్నా..! ఊరుకు సర్పంచే సుప్రీం ఒక్కసారి ఆలోచించండి. ఊరికి సర్పంచే సుప్రీం. పల్లె మారాలి.. ప్రగతి పల్లవించాలంటే మీ ఓటుతోనే సాధ్యం. సర్పంచిగా పోటీచేసిన అభ్యర్థులు చెప్పే మాయమాటలు నమ్మకండి. అరచేతిలో వైకుంఠం.. చూపించే మాటల గారడి అభ్యర్థుల సంగతి చూడండి. ఐదు వందలకో, వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, ఓ చీరకో ఓటును అమ్మకండి. ఆ నవ్వు వెనక నయవంచనను గుర్తించండి గతంలో ఏం జరిగిందో ఆలోచించండి. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వాళ్లు అబద్ధపు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతుండ్రు. కులం, మతం, వాడకట్టు పాటలు పాడి మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపం ఏంటో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆ నవ్వు వెనక ఉన్న నయవంచనను గుర్తించండి. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. ఎన్నెన్నో చెప్పి గెలిచాక ఊరి అభివృద్ధిని మరిచి గ్రామసభలు పెట్టకుండా.. సమస్యల ప్రాధాన్యతను గుర్తించకుండా.. ప్రజల బాధలను పట్టించుకోకుండా కాంట్రాక్టులు చేసి సంపాదించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా? ఏదైనా పని పడి వెళ్తే ఇంటి గేటవుతల నిలబెట్టే వారిని గెలిపించాలా? ఇకనైన కళ్లు తెరవండి. దండం పెట్టాడని ఓటేస్తే... మళ్లీ ఓట్ల సీజన్ దాకా కనిపించడు. ఆత్మసాక్షిగా ఓటేయండి మీకు అందుబాటులో ఉండి సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. గతంలో ఊరి సర్పంచులుగా ఎన్నికై న వారు ఏం చేశారో ఆలోచించండి. అందుకే ఎన్నికల వేళ మీ అందరికీ ఓ విన్నపం. మీకు మంచి పనులు చేసే సర్పంచిని, వార్డు సభ్యులనే ఎన్నుకోండి. మీకు మేలు చేసే వారిని మరవద్దు. తెలంగాణలో ఓ సామెత ఉంది. కళ్ల ముందు కనిపించే కూట్లో రాయి తీయనోడు.. ‘ఎక్కడో ఉండే ఏట్లో రాయి తీస్తడా..’ అని. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ‘తిన్న రేవును తలవాలంటారు’ అందుకే చెబుతున్నా. మీకు మంచి చేసిన వారిని విస్మరించొద్దు. కులమనో.. ప్రాంతమనో... ఓటు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఊరందరి సమస్యలను తనవిగా భావించే వారినే ఎన్నుకోండి. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దిగమించిన సంగతి మీకు తెలుసు. పింఛన్ కోసం వెళ్తే పైసలు గుంజిన సంగతి ఎరుకే. అన్నింటికి మించి తాగేందుకు నీరు ఇవ్వని వారు.. ఒక్క వీధిదీపమైనా పెట్టని వారు.. ఎందరో ఉన్నారు. సహజ సంపదను దోచెటోళ్లు వాగు ఇసుకను, గుట్టల రాళ్లను, మొరం, అడవులను దోచి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి సంపాదించినోళ్లూ ఉన్నారు. మీ క్షేమం.. నా సంక్షేమాన్ని చూసుకునే మంచి వారు అందలమెక్కాలి. ఇక లెవ్వు.. చలి కాలమని.. పనికాలమని ఓటు వేయకుండా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఉండొద్దు. మీ ఓటే వజ్రాయుధం. నీతివంతులకు పట్టం కడితే... మీ ఊరూ, వాడ బాగవుతుంది. అవినీతిపరులను, డబ్బులిచ్చినోడికి ఓటేస్తే ఇక ఐదేండ్లు అతడి అవినీతికి లైసెన్సిచ్చినట్లవుతుంది. ఇంకో మాట ఈ రోజు పోలింగ్ పగలు ఒంటిగంట వరకు ఉంటది. ఈలోగా నువ్వు పోలింగ్ కేంద్రానికి వెళ్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే అంతే.. సంగతి.. ఇంకో మాట ఈ సారి రెండు ఓట్లు ఉంటయి. బ్యాలెట్ పత్రాలు రెండు ఇస్తారు. ఒక్క గులాబి రంగు సర్పంచి ఓటు.. ఇంకోటి తెల్లరంగు పత్రం వార్డు సభ్యుడి ఓటు సరిగ్గా గుర్తును చూసి ఓటేయండి.. మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వేయండి. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా మొర ఆలకించినందుకు మీ అందరికీ నా దండాలు.. ఇక ఉంటాను. ఇట్లు మీ అందరి సంక్షేమాన్ని కోరే మీ పల్లె తల్లి -
మెడికల్ రిప్ ఆత్మహత్య
● వెంటాడిన బట్టల షాపు అప్పులు ● వడ్డీలు కట్టలేక మనస్తాపం చొప్పదండి: పట్టణంలోని మసీద్ రోడ్డుకు చెందిన కటుకం శరత్చంద్ర(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్చంద్రకు దివ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్లుగా కుటుంబంతో కరీంనగర్లో కిరాయికుంటున్న శరత్ మెడికల్ రిప్గా పని చేస్తున్నాడు. శరత్ తల్లిదండ్రులు కూడా కరీంనగర్లోనే నివాసముంటున్నారు. గతంలో కరీంనగర్లోని విద్యానగర్లో బట్టల షాపు పెట్టి శరత్ నష్టపోయాడు. అప్పుల బారిన పడ్డాడు. లోన్ యాప్స్, ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా బంగారం కుదువబెట్టి అప్పులు చేశాడు. మెడికల్ రిప్గా పని చేస్తూ మిత్తీలు కూడా కట్టకపోవడంతో ప్రస్తుత సంపాదనతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పేవాడు. ఈనెల 9న డ్యూటీ మీద హుజూరాబాద్ వెళ్తున్నానని చెప్పి శరత్ వెళ్లిపోయాడు. ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా కలవకపోవడంతో బుధవారం చొప్పదండిలోని మృతుడి స్నేహితులకు శరత్ భార్య దివ్య ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని చెప్పింది. అప్పుల బాధకు మనస్తాపం చెందిన శరత్ మంగళవారం రాత్రి చొప్పదండికి చేరుకొని ఉరేసుకున్నాడు. చొప్పదండిలోని ఇంటికి వచ్చి స్నేహితులు చూసేసరికి మృతిచెంది కనిపించాడు. మృతుడి భార్యకు సమాచారమందించారు. శరత్ సూసైడ్ నోట్ రాసి చనిపోగా.. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపారు. -
గుండెపోటుతో అభ్యర్థి మృతి
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీలో నిలిచిన ముత్యాల చంద్రారెడ్డి(46) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చంద్రారెడ్డికి వార్డు సభ్యుడిగా పోటీచేసే అవకాశం రావడంతో గ్రామంలోని 8వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నిలిచారు. బుదవారం ఉదయం కూడా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈదునూరి బానేశ్, భాగ్య, దుర్గమ్మ, రుద్ర, నర్మదపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి రుద్ర, మరో నలుగురిని కొరికింది. ఇందులో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడినవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. పిచ్చి కుక్కల బారినుంచి తమను రక్షించాలని కాలనీవాసులతోపాటు సీపీఎం నాయకులు రామాచారి, భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, మల్లేశ్, నాగలక్ష్మి డిమాండ్ చేశారు. -
కేటీఆర్ కాన్వాయ్ తనిఖీ
తంగళ్లపల్లి: సిరిసిల్లలో పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు కాన్వాయ్ను బుధవారం జిల్లా శివారులోని జిల్లెల్ల చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిబంధనల ప్రకారం కేటీఆర్ కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేసి తర్వాత అనుమతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కారు దిగి అధికారులకు సహకరించారు. 14న తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని తేజస్ ఐఐటీ/నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 14న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్–2025ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ సీహెచ్ సతీశ్రావు తెలిపారు. కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాలలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 10 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 81063 10960, 81063 66661, 98494 66661లో సంప్రదించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ జి.కిషన్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తొలి విడతకు సిద్ధం
కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని కలెక్టర్తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ జిల్లా పరిస్థితిని వివరించారు. మొదటి విడత ఎన్నికలకు పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, 5 మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలకు గానూ మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరిపడా భద్రత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్ఆలం తెలిపారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. సైలెన్స్ పీరియడ్లో ప్రజలు గుంపులుగా చేరరాదని స్పష్టం చేశారు. ఏదేని ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఆదేశించారు. ‘ఓటే భవితకు బాట’ ఆడియో సీడీ ఆవిష్కరణ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కంసాని ఉదయ, ప్రకృతి ప్రకాష్ నిర్మించిన ‘ఓటే భవితకు బాట’ ఆడియో సీడీని కలెక్టర్ పమేలా సత్పతి మంగవారం ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆవిష్కరించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. పాటలను రచించిన తెలంగాణ సాంస్కృతి సారధి పాటల రచయిత ప్రకృతి ప్రకాష్, ఆలపించిన కంసాని ఉదయను అభినందించారు. -
డంప్యార్డ్లో భారీగా మంటలు˘
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డంప్యార్డ్లో మంటలు చెలరేగాయి. భారీగా చెత్త కుప్పలు తగలబడడం, గంటల పాటు మంటలు కొనసాగడంతో పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన మంటలు రాత్రి 9గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిసారి డంప్యార్డ్ మధ్యలో, పక్కన చెత్త కుప్పల్లో మంటలు చెలరేగేవి. ఈ సారి డంప్యార్డ్లోని మెయిన్గేట్ వద్ద చెత్తకుప్పలు తగలబడడం గమనార్హం. అదికూడా గతంలో ఎప్పుడూలేని స్థాయిలో భారీగా మంటలు చెలరేగడంతో, ఆటోనగర్, అలకాపురికాలనీ, కోతిరాంపూర్, కట్టరాంపూర్తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి నగరపాలకసంస్థ అధికారులు డంప్యార్డ్కు వెళ్లి, ఫైరింజన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. -
రాములపల్లి సర్పంచ్గా లక్ష్మీనారాయణ
పెగడపల్లి: మండలంలోని రాములపల్లి సర్పంచ్గా అమిరిశెట్టి లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వ్ కావడంతో నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం ఉపసంహరించుకోవడంతో లక్ష్మీనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. పెగడపల్లి: మండలంలోని రాజరాంపల్లి సర్పంచ్గా ఇస్లావత్ రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థా నం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అ యింది. ఇద్దరు నామినేషన్ వేయగా.. తిరుపతినాయక్ తన నామినేషన్ ఉప సంహరించకున్నారు. దీంతో రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. -
పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’
పంచాయతీ ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఇంటింటి ప్రచారంతో అలసి, సొలసిన మద్దతుదారులకు, పార్టీ కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ చీప్ లిక్కర్, బాంద్రి, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మందు విక్రయాలు బాగా పెరిగి పల్లెలు మత్తులో జోగుతున్నాయి. పోలీసు యంత్రాంగం దాడులతో ‘బెల్టు’ షాపులకు తాళాలు పడగా, గతంలో ఎన్నడూ లేనంతగా బెల్టుషాపులను నియంత్రించారు. కానీ, దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలతో, పార్టీ గుర్తులతో, బీ–ఫామ్లతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. పార్టీల రంగులు, జెండాలు పల్లె పొలిమెరల్లోనే రెపరెపలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పల్లెలను ‘పంచభూతాలు’ ఆవహించాయి. ఎన్నికలను అవి శాసిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే శక్తిని ప్రదర్శిస్తున్నాయి. హామీలను ఎరగా వేసి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయి లాభసాటి వ్యాపారంలా పరిణమించాయి. ఎంత వెచ్చించాం, ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలువాలనేది అభ్యర్థుల లక్ష్యంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు అసలు కార్యానికి తెరలేపారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 పంపిణీ చేసేందుకు డబ్బు సంచులను సిద్ధం చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కులసంఘాల పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అనేక మంది ఎన్నికల్లో ఉండడంతో డబ్బుకు వెనకాడకుండా వెదజల్లుతున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు.పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎజెండాలు ఏమీ లేకుండా సొంత ఎజెండాలతో అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఊరిలో సొంత ఖర్చులతో ఫ్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఉచితంగా మంచినీరు అందిస్తామని, ఊరిలో ఆడపిల్ల పుడితే.. రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్, ఊరందరికీ డిష్ బిల్లు లేకుండా ఫ్రీగా టీవీ కనెక్షన్లు, పల్లె దవాఖానా నిర్మిస్తామని, ఇంటింటికీ సీసీ రోడ్డు వేస్తామని సొంత ఎజెండాలతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ‘మీ సామాజిక వర్గానికి భవనాలను కట్టిస్తాం’ అని రకరకాల హామీలిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు యథాశక్తిగా ప్రయత్నిస్తున్నారు.అనుకూలంగా, అందుబాటులో ఉండే అనుయాయులకు సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టు ఇప్పించి కాసులు దోచిపెడుతామంటూ నేతలు హామీలిస్తున్నారు. ఊరిలో ఏం చేయాలన్నా పంచాయతీ తీర్మానాలు ఇస్తామని చెబుతున్నారు. ‘గెలిస్తే చాటుగా మీ అందరికి నేనున్నా’ అంటూ అనుచరులకు నమ్మబలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికప్పుడు సెల్ఫోన్లు కొనిస్తూ, ద్విచక్ర వాహనాలు సమకూర్చుతూ ఎన్నికల ప్రచారానికి యువతరాన్ని వినియోగించుకుంటున్నారు. ‘నేను గెలిస్తే భవిష్యత్ ఉంటుందంటూ ఆశలురేపుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు హామీలతో ఎన్నికల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ పంచభూతాలు ఎన్నికల్ని ఆవహించి ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివిధ రకాల కుల సంఘాలు, వృత్తిసంఘాలు, యువజన సంఘాలకు గాలమేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు ఇస్తూ, యువజన సంఘాలు కట్టిస్తామని, ఓపెన్జిమ్లు నిర్మిస్తామని, కోతులను తరిమేస్తామని, సామాజిక భద్రత కల్పిస్తామని హామీలిస్తున్నారు. యువకులను గోవా లాంటి ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇలా పల్లెల్లో సెల్ఫోన్ మెస్సేజ్లు చేస్తున్నారు. ‘చెప్పిన పనులు చేయకుంటే చెప్పులు మెడలో వేసుకుంటాం, గాడిదమీద ఊరేగించండి’ అని బాండు పేపర్లు రాసిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఆవహించిన ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు.. పైఎత్తులు సొంత ఎజెండా.. అభివృద్ధికి హామీలు.. బాండు పేపర్లు గ్రామాల్లో పట్టు కోసం నేతల ప్రయత్నాలు -
అండర్– 19 వైస్ కెప్టెన్గా శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్ మహిళల అండర్– 19 క్రికెట్ జట్టుకు కరీంనగర్కు చెందిన కట్ట శ్రీ వల్లీ వైస్ కెప్టెన్గా ఎంపికై ంది. ఫాస్ట్ బౌలర్గా రాణిస్తున్న శ్రీవల్లీ గతంలో అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. తాజాగా హెచ్సీఏ అండర్ 19 జట్టును ప్రకటించగా శ్రీవల్లీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి నుంచి లక్నో వేదికగా బీసీసీఐ అండర్–19 ఉమెన్ వన్డే ట్రోపీ జరుగనుంది. శ్రీవల్లి ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమా లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బాగోగులు చూసుకోవడం లేదని ఫిర్యాదుచొప్పదండి: పట్టణానికి చెందిన వృద్ధురాలి బాగోగులు పెద్ద కుమారుడు చూసుకోవడం లేదని ఆర్డీవో కార్యాలయంలో, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తల్లితండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను అనుభవిస్తూ, రెండు నెలలుగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని పెద్ద కుమారుడు పట్టించుకోవడం లేదని, తల్లితండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తిరిగి తల్లికి స్వాధీనం చేయాలని బాధితురాలి తరుఫున ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తామానకొండూర్ రూరల్: మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్–వరంగల్ రహదారిపై కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నర్సంపేట జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందినవారు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మానకొండూర్ శివారు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రాగా.. తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముత్యాల కవిత, పెండ్లి యాదమ్మ, పెండ్లి నీల, పెండ్లి లక్ష్మి, పెండ్లి సుధాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్లో దేహదాతకు నివాళి అర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి(92) ఈనెల 6న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు శ్యాంసుందర్రెడ్డి తనతండ్రి పార్ధివదేహాన్ని సిమ్స్కు దానంచేశారు. ఆయన మనుమరాలు వర్ష, మనుమడు వర్షిత్కు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.అనాటమీ విభాగం హెచ్వోడీ డాక్టర్ శశికాంత్ కిరాగి,డాక్టర్ కల్పన ఉన్నారు. -
రిజిస్టర్లు చిరుగుతున్నాయని..
కరీంనగర్ కార్పొరేషన్: దశాబ్దాల తరువాత నల్లాల కనెక్షన్లను ప్రక్షాళన చేసేందుకు నగరంలో నగరపాలకసంస్థ చేపట్టిన సర్వేలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. డిజిటలైజేషన్కు ముందటి వివరాల సేకరణ, నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో దశాబ్దాల నాటి పాత రిజిస్టర్లు తీస్తుంటే, అవి చిరిగిపోతుండడంతో అతిపెద్ద సమస్యగా మారింది. చిరుగుతున్న రిజిస్టర్లను స్కానింగ్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొనసాగుతున్న సర్వే నల్లాల కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా నగరపాలకసంస్థ నల్లాలపై సర్వే చేపట్టింది. నల్లాకనెక్షన్ తీసుకున్నారా లేదా, బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నారా, గృహావసరాలకు తీసుకొని వాణిజ్య అవసరాలకు వాడుతున్నారా అనేదానిపై ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వే అనంతరం గుర్తించిన కనెక్షన్లకు నోటీసులు జారీచేస్తున్నారు. నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తున్నారు. కమర్షియల్ అయితే డొమెస్టిక్ నుంచి కన్వర్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ గృహావసరాల పేరిట కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించి, నోటీసులు ఇచ్చారు. ఆ హాస్పిటల్స్ నల్లాలను కమర్షియల్కు కన్వర్ట్ చేశారు. కన్వర్షన్ చార్జీలుగా రూ.38 వేల చొప్పున వసూలు చేశారు. ఇప్పటివరకు రెండు అపార్ట్మెంట్లు కూడా సాధారణ డిపాజిట్ కింద తీసుకున్నట్లు గుర్తించి, రూ.లక్ష కన్వర్షన్ చార్జీలు వసూలుచేశారు. వినియోగదారుల గగ్గోలు సర్వే సందర్భంగా తేలిన అంశాలకు అనుగుణంగా వినియోగదారులకు నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నల్లా బిల్లులు ఏళ్లుగా బకాయిలు ఉన్నవాళ్లు, డొమెస్టిక్ తీసుకొని కమర్షియల్ వాడుతున్న వాళ్లు తదితరులు ఉన్నారు. తాము బిల్లులు సంవత్సరాల నుంచి చెల్లిస్తూ వస్తున్నా, బకాయిలు చూపించడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరపాలకసంస్థ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాము చెల్లించిన రశీదులు కూడా పట్టుకొని వస్తున్నారు. ఆన్లైన్లో బిల్లులు చెల్లించిన వివరాలు చూపకపోవడం, కనెక్షన్ వివరాలు ఆన్లైన్లో లేకపోవడంతో సమస్యలు తీవ్రమవుతూ వచ్చాయి. రిజిస్టర్ల స్కానింగ్ నగరపాలకసంస్థలో 2020 నుంచి నల్లా కనెక్షన్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయి. దాదాపు 1990నుంచి నల్లా కనెక్షన్ల వివరాలు మాన్యువల్గా ఉన్నాయి. దాదాపు 42 వేల నల్లా కనెక్షన్ల వివరాలు రిజిస్టర్లో నమోదు చేశారు. ఇప్పుడు వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సర్వేలో తేలిన అంశాల ఆధారంగా వివరాలు చూసేందుకు రిజిస్టర్లు తీయాల్సి వస్తోంది. రిజిస్టర్లు దశాబ్దాల క్రితంనాటివి కావడం, కనీసం తీసి కూడా చూసిన దాఖలాలులేకపోవడంతో అవి కాస్తా చిరుగుతున్నాయి. దీంతో నల్లా వివరాలు పూర్తిగా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందుకు విరుగుడుగా రిజిస్టర్లలోని నల్లా కనెక్షన్ వివరాలను తాజాగా అధికారులు స్కాన్ చేస్తున్నారు. స్కాన్చేయడం ద్వారా ఆ వివరాలను కూడా డిజిటల్లో సంక్షిప్తం చేస్తున్నారు. 27 పాత రిజిస్టర్లను స్కానింగ్ చేస్తున్నారు. నల్లాల కనెక్షన్ల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు అధికారులు చేస్తున్న కసరత్తు గాడినపడుతోంది. -
స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్ మంచిర్యాలలో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తున్న అలివేలు అనే మహిళతో నరేశ్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నరేశ్ మంగళవారం సాయంత్రం గ్రామానికి రాగా.. కొద్దిసేపటికి సదరు మహిళ కూడా చేరుకుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆవేశంలో నరేశ్ ఆ మహిళను రోకలిబండతో తలపై మోదాడు. అనంతరం కత్తితో మెడకోసి పారిపోయాడు. నరేశ్ గతంలో మంచిర్యాల ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి బంగారం దోచుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నరేశ్ నేర ప్రవృత్తి తెలిసి భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారని సమాచారం. ఆ హత్యలో సహకరించిన అలివేలుతో అప్పటినుంచే నరేశ్ సహజీవనం చేస్తున్నాడని సమాచారం. హత్య విషయం తెలుసుకున్న సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కరీంనగర్క్రైం: కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని వివరాలు తెలిస్తే టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సూచించారు. రాయికల్: రాయికల్కు చెందిన తాటిపాముల దేవక్క (82) మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. దేవక్క కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పైగా మానసిక స్థితి సరిగా లేదు. మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు దేవక్కకోసం గాలిస్తుండగా.. ఇంటి సమీపంలోని బావిలో శవమై తేలింది. దేవక్క కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్మపురి: మానసికంగా బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మేడిశెట్టి తిరుపతి (35)కి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యులను సంప్రదించి మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఊరుచివర డంపింగ్యార్డులో ఉరేసుకున్నాడు. తిరుపతికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి లక్ష్మి (45) అనారోగ్యం బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు.. లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, భర్త ముత్యం సెస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మి గతంలో అనారోగ్యానికి గురికాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా నయం కాలేదు. మంగళవారం ముత్యం అనారోగ్యంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లగా, ఇంట్లో లక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మనస్తాపంతో ఒకరు.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): నేరెళ్ల గ్రామంలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. నేరెళ్లకు చెందిన అంజయ్య–మణేమ్మ కూతురు దీటి రజిత (31) ఐదురోజుల క్రితం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామం నుంచి పుట్టింటికి వచ్చింది. ఆమె భర్త సంతోష్ మూడెళ్లక్రితం అనారోగ్యంతో మరణించగా అప్పటి నుంచి మనోవేదనకు గురవుతోంది. ఇటీవల ఆమెకు అనారోగ్య, ఆర్థిక సమస్యలు రావడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఉదయం తల్లిగారి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. -
పెరిగిన పత్తి ధర
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి ధర రూ.7,300 పలుకగా.. మంగళవారం రూ.7,450పలికింది. మార్కెట్కు 47వాహనాల్లో 447 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.7,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు, నూతన డీటీఆ ర్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వ లపార్కు ఫీడర్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిమార్ట్, శ్రద్ధ ఇన్ హోటల్, అల్కాపురికాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
ఆర్టీసీకి ‘లక్ష్మీ’ కటాక్షం
కరీంనగర్టౌన్: సరిగా రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న తెలంగాణలో మహాలక్ష్మీ పథకం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం సక్సెస్ కావడం విశేషం. పథకంలో భాగంగా పల్లె నుంచి పట్నం వరకు మహిళలు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడం విశేషం. తెలంగాణలో ఆర్టీసీ ఆర్థికానికి వెన్నుదన్నుగా నిలిచిన కరీంనగర్ రీజియన్ పరిధిలో మహిళలు ఉత్సాహంగా రాకపోకలు సాగించారు. రెండేళ్లలో సుమారు 22 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రోజూ 3,00,822 లక్షల మంది.. కరీంనగర్ రీజీయన్ పరిధిలో మొత్తం 11 డిపోలున్నాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు 21.96 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. రోజూ సగటున 3,00,822 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. కరీంనగర్ రీజియన్లో రెండేళ్లలో రూ.895.83 కోట్ల ఆదా చేసుకున్నారు. అత్యధికంగా గోదావరిఖని డిపో పరిధిలో రూ.3.35 కోట్లు, అత్యల్పంగా మంథనిలో 1.60 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. మహాలక్ష్మీ పథకంలో రెండేళ్లలో 21.96 కోట్ల మంది మహిళల ప్రయాణం కరీంనగర్ రీజియన్కు రూ.895.83 కోట్ల ఆదాయం కరీంనగర్ రీజియన్ పరిధిలో రెండేళ్ల మహాలక్ష్మీ ఆదాయం డిపో మహాలక్ష్మీ రూ. కోట్లలో ప్రయాణికులు (కోట్లలో) గోదావరిఖని 3.35 130.37 హుస్నాబాద్ 1.53 53.50 హుజూరాబాద్ 1.69 70.14 జగిత్యాల 2.89 112.53 కరీంనగర్–1 2.15 76.31 కరీంనగర్–2 2.13 112.73 కోరుట్ల 1.89 70.52 మంథని 1.06 57.87 మెట్పల్లి 1.78 72.26 సిరిసిల్ల 1.66 71.15 వేములవాడ 1.82 68.45 మొత్తం 21.96 895.83 -
పంచింగ్ స్టార్ట్
జిల్లా మొదటి ఏకగ్రీవం ఎన్నికలు కరీంనగర్ 92 03 89 పెద్దపల్లి 99 04 95 సిరిసిల్ల 76 09 67 జగిత్యాల 122 04 118 మొత్తం 389 20 369సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు రసవత్తరస్థాయికి చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. మైకులు బంద్ కావడంతో నిన్న మొన్నటి వరకు హోరెత్తిన ప్రచారం మూగబోయింది. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 389 గ్రామాల్లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 369గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా కొన్ని గ్రామాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు వెనకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు. తొలి విడతలో 369 జీపీలకు ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 369 పంచాయితీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావతుల్లో ముంచెత్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్లకు వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతుదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం. కొరవడిన నిఘా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తెరవెనక పంపిణీని పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.మూడుదశల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. మహిళా సంఘాల వారీగా డబ్బులు, చీరలు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్కు ఒక రోజే గడువు ఉండడంతో ప్రలోభాల పర్వం కీలక దశకు చేరుకుంది. ఇంటింటికీ డబ్బులు పంచుతూ... మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో అందుబాటులో లేని వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.


