తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ | - | Sakshi
Sakshi News home page

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ

Feb 10 2026 7:52 AM | Updated on Feb 10 2026 7:52 AM

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ

తడారిన గుండెలకు.. పసి హృదయాల స్పర్శ

గంభీరావుపేట(సిరిసిల్ల): ఎవరూ లేరని ఆ గుండెలు తడారిపోయాయి. మలివయసులో అనాథ వృద్ధాశ్రమంలో సేద తీరుతున్న వారిని పసిహృదయాలు తట్టిలేపాయి. వృద్ధుల అనుభవాలు.. విద్యార్థుల పలకరింపులతో రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని మా అనాథ వృద్ధాశ్రమం అనుబంధాల వేదికగా నిలిచింది. మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాసంస్థల్లో భాగమైన జెడ్పీ గర్‌ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థులు ‘మా’ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సోమవారం సందర్శించారు. ఆశ్రమంలోని వృద్ధులతో మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకున్నారు. వారితో కాసేపు ముచ్చటించారు. పసిపిల్లల ఆప్యాయతను చూసిన ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్దమనసు చూస్తామని ఊహించలేదంటూ పలువురు కన్నీరుపెట్టారు. కుటుంబాలకు దూరంగా జీవి స్తున్న తమకు ఈ పిల్లల రాక ఓ పండుగలా మారిందన్నారు. వృద్ధులపై మన బాధ్యత ఏమిటో గుర్తు చేసేలా ఈ సందర్శన నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి 25 కిలోల సన్నబియ్యం అందించారు. పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం భూస లక్ష్మణ్‌, తెలుగు సబ్జెక్టు టీచర్‌ శివకుమార్‌ పాల్గొన్నారు.

అనాథ వృద్ధులను పలకరించిన విద్యార్థులు

వృద్ధుల జ్ఞాపకాలు.. విద్యార్థుల పలకరింపులు

అనుబంధాల వేదికగా మా అనాథ వృద్ధాశ్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement