ఓటు లేకున్నా.. పోలింగ్ బూత్లోకి
జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: ఓటు లేకున్నా.. ఓ వ్యక్తి ఓటేసేందుకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఘటన జిల్లాకేంద్రంలోని ఏడోవార్డు బూత్ నంబర్ 22లో చోటుచేసుకుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చాడని అనుమానించిన పోలింగ్ ఏజెంట్లు పోలీ సులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఓటు వేయలేదని తేలడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే 26వ వార్డులో ఓటేసేందుకు ఓ వ్యక్తి రాగా.. పోలింగ్ కేంద్రం వద్దే స్వతంత్ర అభ్యర్థి భర్త సదరు వ్యక్తిని గుర్తించి నిలదీశాడు. దొంగ ఓటు వేసేందుకు వచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతడిని పోలీసులకు అప్పగించారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓటు లేకున్నా.. పోలింగ్ బూత్లోకి


