భార్యాభర్తలిద్దరూ..
గోదావరిఖని: ఒక్కరు పోటీలో ఉంటేనే ఇంటిల్లిపాది ప్రచారం చేసి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది రెండు డివిజన్లలో.. అదీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి భార్యాభర్తలిద్దరూ కార్పొరేటర్లుగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 58వ డివిజన్లో బీఆర్ఎస్ నుంచి మేకల సమ్మయ్య కాంగ్రెస్ అభ్యర్థి మేకల హరికృష్ణపై 362 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 60వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి మేకల శారద కాంగ్రెస్ అభ్యర్థి మోతిపాటి స్వప్నపై 89 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
నాడు భర్త.. నేడు భార్య
రాయికల్: రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో నాడు భర్త తురగ శ్రీధర్రెడ్డి 4వ వార్డు కౌన్సిలర్గా ఎన్నిక కాగా.. ఆయన భార్య తురగ సౌజన్య శుక్రవారం అదే వార్డు నుంచి సురతాని భాగ్యలక్ష్మిపై విజయం సాధించారు.
భార్యాభర్తలిద్దరూ..


