ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీలు, దళితులకు కాంగ్రెస్ బాసటగా నిలుస్తోంది. మా పార్టీ ముస్లింల అభివద్ధికి కట్టుబడి ఉంది. ఈసారి మేం బల్దియాలో మెరుగైన స్థానాలు సాధిస్తాం. నగరంలో పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో కనీస సదుపాయాలు లేక మైనార్టీ ప్రాంతాలు వెనకబడ్డాయి. స్మార్ట్సిటీ పేరుతో అభివద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఈసారి బల్దియాపై మూడు రంగుల జెండా ఎగరేస్తాం. ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటాం. ముఖ్యంగా ఉపాధి, నైపుణ్య అభివద్ధి, ఆరోగ్యం, వసతుల కల్పనలో పూర్తి ప్రాధాన్యం కల్పిస్తాం. – వెలిచాల
రాజేందర్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, కరీంనగర్


