మల్కాపూర్లో నంది విగ్రహం లభ్యం
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనుల తవ్వకాల్లో శివలింగం, నంది విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాలు. ఉపాధిహామీ పనులు చేసే పలువురు కార్మికులు మల్కాపూర్లోని గోగులగుట్ట పరిధిలో ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో నంది, లింగం రూపంలో ఉన్న విగ్రహాలు వెలుగుచూశాయి. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పూజలు చేశారు. విగ్రహాలు బయటపడ్డ ప్రాంతంలో ఆలయం నిర్మించాలని అనుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఉపాధిహామీ పనుల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహం


