గుంటూరు : బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఇవాళ(సెప్టెంబర్ 9, బుధవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.
'మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గమనించారు. ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోంది.
వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా పాదయాత్ర సాగుతుంది.
మన పాలనపై మన ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోగలిగేలా.. ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా మన పాలన సాగింది. అలా ఏ ఇంటికి అయినా వెళ్లి, వైఎస్సార్సీపీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి.
మ్యానిఫెస్టోకు ఒక అర్ధం తీసుకొచ్చి, మొత్తం అమలు చేసిన చరిత్ర మనద'ని వైఎస్ జగన్ అన్నారు.


