breaking news
temple
-
‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య, శ్రీరంగపట్టణంలోని ప్రసిద్ధ ఆరతి ఉక్కడ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిణిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భీమన అమావాస్య సందర్భంగా చోటుచేసుకుంది.ఆగస్టు 12న భీమన అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగపట్టణంలోని ఆరతి ఉక్కడ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో తీవ్రమైన రద్దీ నెలకొన్న తరుణంలో గర్భాలయంలోకి ప్రవేశించడానికి అందరూ నిబంధనల ప్రకారం కొంత సమయం వేచి ఉండాలని అధికారులు సూచించారు.ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్యను నిబంధనల ప్రకారం వేచి ఉండాలని అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా పీఎస్ఐ సవిత కోరారు. ఒక్కసారిగా అందరినీ లోపలికి అనుమతిస్తే భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆమె వివరించడానికి ప్రయత్నించారు.అయితే, దీనిపై ఐశ్వర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే కుమార్తెనని చెబుతూ పోలీస్ అధికారిణితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అనుచిత పదజాలం ఉపయోగించినట్లు పీఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తున్న తనను అడ్డుకుంటున్నారనే కోపంతో ఐశ్వర్య పీఎస్ఐ సవితను చెంపదెబ్బ కొట్టారని, అంతేకాకుండా ఆమె కెరీర్ను నాశనం చేస్తానని బెదిరించారని సమాచారం.పోలీసుల కేసు నమోదు ఈ ఘటనపై బాధితురాలైన పీఎస్ఐ సవిత మాండ్య మహిళా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా యాతనహళ్ళి పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిస్పందించిన ఐశ్వర్య కూడా పోలీస్ అధికారిణి తనతో అసభ్యంగా,దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు తిరుగు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలు పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. -
23న ఏకంగా 377 పెళ్లిళ్లు.. ‘గురువాయూర్’లో సరికొత్త రికార్డు
గురువాయూర్: కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వివాహాల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. మలయాళ మాసం ‘చింగం’ నెలలో వచ్చే మొదటి ఆదివారం (ఆగస్టు 23) రోజున ఏకంగా 377 వివాహాలు జరగనున్నట్లు ఆలయ దేవస్థానం ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన గణాంకాల ప్రకారం ఇది సరికొత్త రికార్డు. ఇంకా 13 రోజుల సమయం ఉండటంతో, ఈ సంఖ్య 400 దాటే అవకాశం ఉందని దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి.గతంలో 2024, సెప్టెంబర్ 8న 334 వివాహాలు జరగడమే ఇప్పటివరకు ఉన్న అత్యధిక రికార్డు. ఈసారి రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివాహాలు జరిపించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలో ఐదవ శాశ్వత వివాహ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ భక్తుడు దీనిని విరాళంగా సమర్పించారు. శిల్పి సుధీల్ కుమార్ పర్యవేక్షణలో ఈ నిర్మాణం జరుగుతోంది.సాధారణంగా ఆలయంలో 200కు పైగా వివాహాలు ఉన్నప్పుడు తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేసేవారు. అయితే, భవిష్యత్తులో రద్దీని తట్టుకునేందుకు ఈసారి శాశ్వత ప్రాతిపదికన కొత్త మండపాన్ని సిద్ధం చేశారు. మరోవైపు, ఆలయంలో రద్దీని నియంత్రించేందుకు, భక్తుల వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు దేవస్థానం ఆగస్టు 4 నుంచి ‘వర్చువల్ క్యూ’ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం మంగళ, గురువారాల్లో అమలవుతున్న ఈ విధానం ద్వారా రోజుకు 2,400 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఓనం సీజన్, ఇతర పండుగ రోజుల్లో భక్తుల రద్దీని నిర్వహించడానికి ఈ డిజిటల్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: డేరా బాబా విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్! -
అరుణాచలంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర, రాబిన్హుడ్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ పుష్ప-2లో ఐటమ్ సాంగ్తో ఆకట్టుకుంది. కిస్సిక్ అంటూ అభిమానులను అలరించింది. ఈ ఏడాది శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. Our girl #Sreeleela at Tiruvannamalai pic.twitter.com/naeZUbBt0u— KUMAR || Vaathi సార్ || Venky Atluri&Nelson Fan || (@RajiniDhanush5) August 5, 2026 -
కుప్పం: గంగమ్మ గర్భగుడి మార్పుపై ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గ్రామ దేవత తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం వివాదానికి దారితీసింది. గర్భగుడిని దక్షిణం వైపు రెండు అడుగులు జరిపేందుకు అధికారులు చేపట్టిన చర్యలను ఆలయ అర్చకులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది.పురాతన ఆలయాన్ని కొత్తగా నిర్మించే క్రమంలో భాగంగా అధికారులు పలు మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని కొంతమేరకు దక్షిణం వైపు జరిపి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా గర్భగుడి స్థానాన్ని మార్చడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ నియమాలకు విరుద్ధంగా గర్భగుడిని పక్కకు జరపడం సరికాదని వారు చెబుతున్నారు. గర్భగుడి ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుందని.. దానిని మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.సమీక్ష సమావేశంలో వాగ్వాదంఆలయ పునర్నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారులు, ఆలయ అర్చకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గర్భగుడిని తరలించే ప్రతిపాదనపై అర్చకులు తమ అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే ఆలయ అభివృద్ధి, నిర్మాణ అవసరాల దృష్ట్యా మార్పులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఆందోళనకు సిద్ధమవుతున్న స్థానికులుఆలయ నిర్మాణ వ్యవహారంలో అధికారులు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ దేవత ఆలయ విషయంలో సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.కుప్పం ప్రాంతంలో గంగమ్మ ఆలయానికి భక్తుల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గ్రామ ప్రజల విశ్వాసాలతో ముడిపడిన ఆలయ నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా అందరి అభిప్రాయాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.సీఎం నియోజకవర్గంలో రాజకీయ వేడిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ వివాదం తెరపైకి రావడం రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది. ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి కార్యక్రమంగా భావిస్తున్న అధికారులకు.. సంప్రదాయ పరిరక్షణ అంశం కొత్త సవాల్గా మారింది. ప్రస్తుతం గర్భగుడి తరలింపు అంశంపై అర్చకులు, అధికారులు, స్థానికుల మధ్య నెలకొన్న విభేదాలు ఎలా పరిష్కారమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
నాలుక కోసుకున్న యువకుడు.. ఆలయం రక్తసిక్తం
గంజాం: కుటుంబ కలహాల కారణంగా ఒక యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఒక యువకుడు తన నాలుకను కోసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బెగునియాపడ పోలీసు స్టేషన్ పరిధిలోని హన్సతులి గ్రామానికి చెందిన కిరణ్ పాత్ర కుటుంబ తగాదాల కారణంగా గ్రామ సమీపంలోని కాళీ ఆలయం వద్ద ఈ చర్యకు పాల్పడ్డాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన కిరణ్, ఆలయం వెలుపల పదునైన కత్తితో తన నాలుకను కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా అతడిని తొలుత ఖళ్కోట్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఈజిప్ట్లో భూకంపం.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు -
కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)
-
సన్గ్లాసెస్తో గుడిలో హీరోయిన్ పూజలు.. నెటిజన్స్ ఫైర్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్..తన ఇన్స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు..ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ భూమి పెడ్నేకర్ పోస్ట్ చేసిన వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే బాలీవుడ్ నటి భూమి..తాజాగా శివాలయానికి వెళ్లింది. పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శివలింగానికి ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియాలను ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ శ్రావణ మాసంలో నా జీవితం సులభంగా మారిపోవాలని కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్’అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చింది.అయితే ఈ వీడియోలో భూమి కనిపించిన విధానంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బ్లాక్ టీషర్ట్, జీన్స్ ధరించి ఆమె గుడిలోకి వెళ్లారు. అంతేకాదు కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని శివలింగానికి అభిషేకం చేసింది. పవిత్రమైన ఆలయంలోకి వెళ్లినప్పుడు కనీసం కళ్లజోడు అయినా తీసేయాలనే సంస్కారం లేదా అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ‘పూజ చేస్తున్నారా లేదా ఫోటో షూట్కి పోజులు ఇస్తున్నారా?’, ‘సన్ గ్లాసెస్ పెట్టుకొని పూజ చేసినవాళ్లను ఇంతవరకు చూడలేదు’, ‘దయచేసి ఆ కళ్లజోడులో నుంచి దేవుడివైపు చూడకండి.. సంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వండి’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar) -
తొలి ఏకాదశి పూజలు ఫోటోలు
-
వేములవాడలో 10 అడుగుల నాగుపాము కలకలం..
కరీంనగర్, రాజన్న సిరిసిల్లా: జిల్లాలో ఓ పాము కలకలం రేపింది. వేములవాడలో భీమేశ్వర ఆలయం ముందున్న బెల్లం దుకాణం సమీపంలో దాదాపు 10 అడుగుల పాము ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఆలయంలోని భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే స్నేక్ క్యాచర్ జగదీశ్వర్ తీవ్రంగా శ్రమించి, సాహసోపేతంగా ఆ పామును పట్టుకోవడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. -
మొక్కు తీరిందని.. వెండి వర్షం కురిపించిన భక్తుడు
మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు బుధవారం రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లోని ‘‘శ్రీ సాంవలియాజీ’’ ఆలయంలో 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలు సమర్పించాడు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటి విలువ సుమారు రూ.25.65 లక్షలు.ఆ భక్తుడు తన పేరు వెల్లడించలేదు. తన కొడుకుకు సంబంధించిన ఓ కోరిక నెరవేరాలని ఈ ఆలయంలో ప్రార్థించానని ఆలయ నిర్వాహకులకు చెప్పాడు. కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా వెండి కడ్డీలు సమర్పించేందుకు మళ్లీ వచ్చానని తెలిపాడు.దేవాస్ జిల్లాలోని సోహంగంజ్ ప్రాంతానికి చెందిన ఆ భక్తుడు బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్నాడు. పూజలు ముగిసిన తర్వాత 11.4 కిలోల బరువు ఉన్న 19 వెండి కడ్డీలను ఆలయ కార్యాలయంలో నిర్వాహకులకు అప్పగించాడు.తన పేరు బయట పెట్టొద్దని కోరాడు. ఆలయ నిర్వాహకులు అతని కోరికను గౌరవించారు. అధికారులతో మాట్లాడిన సమయంలో, గతంలో తన కొడుకుకు సంబంధించిన ఓ కోరికతో సాంవలియా సేఠ్ ఆలయానికి వచ్చినట్టు చెప్పాడు.ఆ కోరిక నెరవేరిన తర్వాత తన విశ్వాసానికి, కృతజ్ఞతకు గుర్తుగా వెండి కడ్డీలు సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. అవసరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత వెండిని ఆలయ ఖజానాలో భద్రపరిచారు.రాజస్థాన్ బులియన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్ పిచోలియా మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 11.4 కిలోల వెండి విలువ సుమారు రూ.25.65 లక్షలు అని చెప్పారు. భారీ నగదు విరాళాలతో పాటు భక్తులు శ్రీ సాంవలియాజీ ఆలయానికి బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు కూడా తరచూ సమర్పిస్తారని తెలిపారు.శ్రీ సాంవలియాజీ ఆలయం దేశంలో ప్రముఖ శ్రీకృష్ణ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాజస్థాన్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించేందుకు ఇక్కడికి వస్తుంటారు. కోరికలు నెరవేరిన తర్వాత తమ స్తోమతకు తగ్గట్టు నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు సమర్పిస్తుంటారు. -
400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్డే ప్రత్యేక పూజలు చేసిన నటి
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekkar) తన 37వ పుట్టినరోజు (జూలై 18) సందర్భంగా గోవాలోని తన పూర్వీకుల గ్రామమైన పెడ్నేలోని 400 ఏళ్ల నాటి సుప్రసిద్ధ శ్రీదేవి మౌళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. తమ గ్రామంలోని మౌళి మాత కులదేవి అని స్వచ్ఛమైన మంచినీటి సెలయేటి పక్కన ఉన్న ఆమె పురాతన రాతి విగ్రహానికి ఔషధ గుణాలు ఉన్నాయని తెలిపింది. ‘‘నా వయసు మరో ఏడాది పెరిగింది. ఈ పుట్టినరోజును మా కులదేవి ఆశీస్సులతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈమె మా అందరి జీవితాల్లో ప్రేమను, ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను." అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు అభినందనలుతెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar)మౌళి దేవి ఆలయ విశిష్టతమాత మౌళి దేవి పెడ్నేకర్ వంశస్థులతో పాటు ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదైవం.ఈమెను దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు.ఇక్కడి ఒక స్పటిక నిర్మలమైన నీటి ప్రవాహం (జలపాతం) పక్కన కనీసం 400 ఏళ్ల నాటి పురాతన రాతి విగ్రహం ఉంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికుల నమ్మకం. ఇదే కాంప్లెక్స్లో ఒక కొత్త ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!ఈ ఆలయం నిర్మాణం ఇండో-పోర్చుగీస్ డిజైన్ శైలిని కలిగి ఉంటుంది. కొంకణ్ ప్రాంతానికి చెందిన అరుదైన ఎరుపు-గోధుమ రంగు క్లే ప్లాస్టర్ టెక్నిక్ అయిన 'కావి ఆర్ట్' (Kaavi art) తో ఇక్కడి గోడలను అలంకరించారు. ఇక్కడి మహిషాసుర మర్దిని శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ప్రాంగణంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొన్ని పురాతన విగ్రహాలు, నందితో కూడిన రామేశ్వర లింగం కూడా ఉన్నాయి. భగవతి దేవి ఆలయం, రావల్ నాథ్ ఆలయం కూడా ఇక్కడి ప్రత్యేకత. రావల్ నాథ్ స్వామిని ఆ గ్రామ రక్షకుడిగా, పెడ్నేకర్ వంశ సంరక్షకుడిగా భావిస్తారు. పెళ్లిళ్లు, కొత్త ఇళ్ల నిర్మాణం లేదా కొత్త పనులు ప్రారంభించే ముందు ఇక్కడ 'ప్రసాదం' అడిగి అనుమతి తీసుకునే ఆచారం ఉంది.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్న తిలక్ వర్మ (ఫొటోలు)
-
బిజ్లీ మహాదేవ్ అసలు రహస్యం! సైన్స్ కు అర్థంకాని శివుడి మహిమ
-
అమ్మ సన్నిధిలో ఆడబిడ్డకు రక్షణ కరువు
విజయవాడపశ్చిమ, ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహిళా సెక్యూరిటీ గార్డుపై వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సెక్యూరిటీ గార్డును అదే విభాగంలో విధులు నిర్వహిస్తున్న మరో గార్డు గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు సెక్యూరిటీ సీఎస్వోకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు గత కొంత కాలంగా మహామండపం రెండో అంతస్తులోని అన్నదానం విభాగంలో భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటుంది. అయితే అదే ఫ్లోర్ ఇన్చార్జిగా ఉన్న సూపర్వైజర్ కిరణ్ అనే గార్డు కొంతకాలంగా ఆ మహిళా గార్డును వేధింపులకు గురి చేయసాగాడు. విధులు ముగిసిన అనంతరం మూడో అంతస్తులోని కార్యాలయానికి వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తానని బెదిరింపులకు దిగాడు. గతంలో దుర్గాఘాట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ కిరణ్ ఆ మహిళా గార్డును వేధింపులకు గురి చేయడమే కాకుండా వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడేవాడు.అప్పట్లో సెక్యూరిటీ సూపర్వైజర్లు కిరణ్ను పిలిచి మందలించినా ప్రయోజనం లేకపోయింది. తాజా వేధింపులపై బాధితురాలు సెక్యూరిటీ అధికారికి ఫిర్యాదు చేసింది. ఆలయ అధికారుల సూచన మేరకు సీఎస్వో రూపేంద్రబాబు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సదరు ఫిర్యాదుపై సీఐ శుక్రవారం ఆలయానికి చేరుకుని మహా మండపం రెండో అంతస్తులో తోటి గార్డులతో పాటు సూపర్వైజర్లు, ఇతర సిబ్బందిని విచారించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు సీరియస్గా తీసుకుని సదరు సూపర్వైజర్ కిరణ్ను విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
మూకాంబిక ఆలయంలో వేల కోట్ల నిధి! సర్వముద్ర వెనుక రహస్యం?
-
5వేల ఏళ్ల మిస్టరీ వీడింది.. అశ్వత్థామ బతికే ఉన్నారా? ఆధారాలివే
చరిత్ర పుటల్లో కొన్ని రహస్యాలు కాలంతో పాటు కలిసిపోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం.. కాలానికి ఎదురునిలిచి, వేల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి!ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం! నమ్మశక్యం కాని.. అంతకన్నా ఊహించలేనంత భీతి గొలిపే ఒక సజీవ మిస్టరీ ఇది!మహాభారత ఘోర యుద్ధం ముగిసి ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న కోట్ల మంది వీరులు, రాజులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ.. సప్త చిరంజీవుల్లో ఒకరైన ఆ ఒక్కడు మాత్రం.. ఇంకా బతికే ఉన్నాడు! అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజం!నుదిటి నుంచి నిరంతరం రక్తం కారుతూ.. ఒళ్లంతా చీము, గాయాలతో.. ఆకలి దప్పులతో.. చావు కోసం తపిస్తూ.. చావు కన్నా ఘోరమైన నరకాన్ని అనుభవిస్తూ.. అశ్వత్థామ ఇప్పటికీ మన మధ్యే తిరుగుతున్నాడు!.శాపగ్రస్తుడైన ఆ అశ్వత్థామ.. ప్రతిరోజూ తెల్లవారుజామున, మనుషులెవరూ అడుగుపెట్టని ఒక రహస్య శివాలయానికి వస్తాడు.అక్కడ ఉన్న శివలింగానికి పూజలు చేసి వెళ్తాడు. తెల్లారి గుడి తలుపులు తీసి చూసేసరికి.. అక్కడ తాజా పూలు, చందనం కనిపిస్తాయి! ఇది కథ కాదు.. ఇప్పటికీ అక్కడ జరుగుతున్న పచ్చి నిజం!అసలు ఆ భయంకరమైన శివాలయం ఎక్కడుంది? అక్కడ అశ్వత్థామను చూసినవారెవరు? ఐదు వేల ఏళ్లుగా ఆ గాయాలతో అతడు ఎలా బతుకుతున్నాడు? ఈ రోజూ మన వీడియోలో.. సైన్స్కు సైతం సవాల్ విసురుతున్న ఆ అశ్వత్థామ గుడి మిస్టరీని విప్పబోతున్నాం! వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి! -
Kiradu Temples: చీకటి పడితే అంతే.. రాళ్లుగా మారిపోతారట..! శాపమా? లేక Scienceకి సవాలా?
-
తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు)
-
అయోధ్య: రాముడి సొమ్ముతో గర్ల్ఫ్రెండ్కు కానుకలు?
అయోధ్య: అయోధ్య రామాలయ కానుకల చోరీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ శుక్లా రూ. 15 లక్షలకు పైగా జరిపిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ సొమ్ము ఆలయ విరాళాల దొంగతనంతో ముడిపడి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడు తన స్నేహితురాలికి రూ. 2 లక్షల నగదుతో పాటు ఒక ఖరీదైన మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బు మూలాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితుని సోదరుడు అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ డ్యూటీ ముగిసిన తర్వాత పలుమార్లు యోగా కేంద్రానికి నగదు తీసుకెళ్లడం గమనించినట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించగా నిందితుడు దాటవేసే సమాధానం ఇచ్చాడని వెల్లడించారు.ఈ ఘటనల నేపథ్యంలో రామాలయ ట్రస్ట్ విరాళాల లెక్కింపు గదిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇకపై టేబుళ్లు, కుర్చీలకు బదులుగా నేలపై పరుపులు, ప్లైవుడ్ ఏర్పాటు చేసి నగదు లెక్కిస్తున్నారు. లెక్కింపు సమయంలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని, క్యాంటీన్, బాత్రూమ్లకు తరచూ వెళ్లేవారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిఘా విభాగం సిబ్బంది కూడా విధి నిర్వహణలో సీట్లను వదిలి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ, గది మొత్తాన్ని సీసీటీవీల పర్యవేక్షణలోకి తెచ్చారు. -
అది ‘తేజో మహాలయం’.. సర్వే కోరుతూ పిటిషన్!
ప్రయాగ్రాజ్: ఆగ్రాలోని తాజ్ మహల్ ఒక సమాధా లేక ఆలయమా? తాజ్ మహల్ నిజంగానే తేజో మహాలయమా? ఈ ప్రశ్నలు చాలా కాలంగా తలెత్తుతున్నాయి. ఈ వివాదం కూడా సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి తాజ్ మహల్ ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ..సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించడానికి నిరాకరిస్తూ ఆగ్రా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ పిటిషన్లో సవాలు చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఆలయం ఉందనే వాదన ఆధారంగా ఈ పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో ఈ కేసు విచారణ సజూలై 6న జరగనుంది. భగవాన్ ‘శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజమాన్ తేజో మహాలయ ఆలయం’ తరఫు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో ఒక దావా దాఖలైంది. ఈ కేసు ఆగ్రా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వద్ద పెండింగ్లో ఉంది. సదరు ప్రాంగణంలో ఆలయం ఉందని ప్రకటించాలని ఈ కేసులో కోరారు.తిరస్కరించిన రెండు కోర్టులుఈ కేసు పెండింగ్లో ఉన్న సమయంలో, సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ను నియమించాలని కోరుతూ అదనపు జిల్లా న్యాయమూర్తి ముందు ఒక దరఖాస్తు దాఖలు చేశారు. అయితే, రెండు జిల్లా కోర్టులు ఈ పిటిషన్ను తిరస్కరించాయి. ప్రస్తుత పిటిషన్లో భారత ప్రభుత్వం, భారతీయ పురాతత్వ శాఖ, మరో ఇద్దరిని ప్రతివాదులుగా చేర్చారు.మహాదేవ ఆలయం ఉందంటూ వాదనఆగ్రాలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద అయిన తాజ్ మహల్ ప్రాంగణంలో భగవాన్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజమాన్ తేజో మహాలయ ఆలయం ఉందని పిటిషన్లో వాదించారు. సివిల్ రివిజన్ సంఖ్య 03/2020లో ఆగ్రా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి (ADJ) 2026 ఏప్రిల్ 4న జారీ చేసిన ఆదేశాలను, అలాగే అంతకుముందు ఒరిజినల్ సూట్ సంఖ్య 356/2015లో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) 2019 జూలై 18న జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును అభ్యర్థించారు. ఈ రెండు ఆదేశాల్లోనూ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
అయోధ్య విరాళాల చోరీ .. కుంభమేళా టార్గెట్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. ఆలయానికి వచ్చే కానుకల చోరీలో అత్యధిక భాగం విరాళాల చోరి 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయంలోనే జరిగినట్లు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను విచారించగా ఈ అంశాలే వెల్లడైనట్లు పేర్కొన్నారు.కుంభమేళానే టార్టెట్?2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా ఉత్తరప్రదేశ్లోని జరిగింది. దీనికి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తుల పోటెత్తారు. ఆ భక్తులు అయోధ్యలోని రామమందిరానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో ఈ సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని పక్కా ప్రణాళికతో ఆలయ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల చోరీకి పాల్పడ్డారు. ఈ కుట్రను నిందితులంతా కలిసే పన్నారని పోలీసులు పేర్కొన్నారు.దోపిడిలో వారిదే సింహభాగంఈ విరాళాల చోరీలో లవ్కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే ఇద్దరు బావమరుదులు అత్యధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది. వీరు ఈ దొంగతనాల ద్వారా సంపాదించిన సొమ్ముతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు వీరిద్దరికీ సంబంధించి దాదాపు అర డజనుకు పైగా స్థిరాస్తులను పోలీసులు గుర్తించారు. నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలను లోతుగా పరిశీలించేందుకు అయోధ్య పోలీసులు ఆదాయపు పన్ను శాఖ సహాయం తీసుకుంటున్నారు. అలాగే, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరిపించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కూడా లేఖ రాయనున్నారు.ఎస్బీఐ (SBI) సిబ్బంది పాత్రపై అనుమానాలుఆలయంలోని విరాళాల లెక్కింపు ప్రక్రియను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం బ్యాంక్ ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. ఆలయంలోని నాలుగు విరాళాల పెట్టెల్లో వచ్చే నగదును లెక్కిస్తారు. ఈ లెక్కింపు బృందంలో 11 మంది బ్యాంక్ సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్ట్ సభ్యులతో కలిపి మొత్తం 14 మంది ఉంటారు. అయితే, ఈ చోరీలో కొందరు ఎస్బీఐ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.నిందితులలో ఒకరైన అవినాష్ శుక్లాకు చెందిన 'కౌశల్ పూరి' స్థావరం నుండి పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం అవినాష్ శుక్లా సోదరుడైన అభిషేక్ నడుపుతున్న ఒక యోగా కేంద్రం. జూన్ 5న పోలీసులు ఈ యోగా కేంద్రంపై దాడి చేసి భారీగా నగదును రికవరీ చేసినట్లు అక్కడి నిర్వాహకురాలు సీమా తివారీ తెలిపారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
-
శనీశ్వరుడి సన్నిధిలో రోజూ ప్రత్యక్షమవుతున్న కాకి..!
తిరువొత్తియూరు (తమిళనాడు): కాంచీపురం – వందవాసి హైవేపై ప్రసిద్ధి చెందిన 27 నక్షత్రాల ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న శనీశ్వర సన్నిధికి, శనీశ్వర భగవానుడి వాహనంగా గుర్తింపు పొందిన కాకి ఒకటి రోజూ పూజా సమయంలో తప్పకుండా వస్తోంది. పూజ పూర్తయిన తర్వాత ఇచ్చే ప్రసాదాన్ని తిన్న తర్వాతే ఆ కాకి అక్కడి నుండి వెళ్తుంది. ఈ ఘటన భక్తులలో అమితమైన భక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిని శనీశ్వర భగవానుడి అనుగ్రహానికి చిహ్నంగా భక్తులు భావిస్తున్నారు. శనీశ్వర పూజ సమయంలో వచ్చే ఈ కాకిని నేరుగా దర్శించుకోవడానికి, భగవంతుని ఆశీస్సులు పొందడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి పెద్దఎత్తున వస్తున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)
-
రాధాకృష్ణులు.. ఇప్పటికీ అక్కడే! రాత్రయితే.. చిన్న చీమ కూడా ఆ ప్రాంతం దాటదు!
ఎన్నెన్నో ఆధ్యాత్మిక వింతలకు భారతదేశం ఆలవాలం. పూరీజగన్నాథుడి ఆలయంపై ఉండే ధ్వజం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాజీ ఆలయంలో చమురు లేకుండానే దీపం వెలుగుతుంది. ఇలా సైన్స్కు కూడా అంతు చిక్కని విశేషాలెన్నెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే.. రాధాకృష్ణులు, గోపికలు రోజూ విహరించే ప్రదేశం ఒకటుంది. ఆ ప్రాంతంలో అన్నీ వింతలే.. చెట్ల కొమ్మలు ఆకాశంవైపు కాకుండా.. భూమివైపుగా పెరుగుతాయి. సైన్స్ కూడా హైపోథెసిస్ వరకే పరిమితమై.. అజెంప్షన్లతో ప్రకటనలు చేసిందే గానీ.. నిగూఢ రహస్యాలను ఛేదించలేకపోయింది. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలోని బృందావనంలో కనిపించే నిధివన్ అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక వింతల్లో ఒకటిగా ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ద్వాపరయుగం కొనసాగుతోందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజూ రాత్రి నిధివన్కు రాధాకృష్ణలు, గోపికలు చేరుకుంటారని భక్తుల విశ్వాసం. దట్టమైన అడవిలా ఉండే ఈ వనంలో ఉన్న రంగమహల్ కూడా అంతుచిక్కని రహస్యాలకు వేదికగా ఉంది. పూజారులు సాయంత్రం వేళలో ఈ మహల్లో రాధాకృష్ణుల కోసం ఓ మంచం వేసి, పక్కనే చందనం, లడ్డూలు, తాంబూలం, నీళ్ల బిందె, రాధమ్మ కోసం చీర, గాజులు, పండ్లు పెడతారు. ఆ తర్వాత మందిరం తలుపులకు తాళాలు వేస్తారు. ఉదయం 5 గంటలకు మందిరం తలుపులు తెరిచి చూస్తే.. ఆ మంచంపై ఎవరో పడుకున్నట్లు, నలిగిపోయి ఉంటుంది. నీళ్ల బిందెలో సగం నీళ్లు అయిపోయి కనిపిస్తాయి. తాంబూలం నమిలిన ఆధారాలు, సగం స్వీట్లు తిన్నట్లు అక్కడి దృశ్యాలు స్పష్టం చేస్తాయి. ఈ రహస్యాన్ని ఇప్పటికీ ఏ సైన్స్ కూడా ఛేదించకపోవడం గమనార్హం..!నిధివన్ ఓ దట్టమైన అడవిలా ఉంటుందని మనం చెప్పుకొన్నాం కదా? అయితే.. ఇక్కడి చెట్లన్నీ వింతగా ఉంటాయి. ఎక్కడైనా చెట్ల శాఖలు.. అంటే కొమ్మలు సాధారణంగా పైకి ఆకాశంవైపు పెరుగుతాయి. కానీ, నిధివన్లో మాత్రం శాఖలు భూమివైపునకు వంగుతూ పెరుగుతాయి. అంతేకాదు.. నిధివన్ చెట్లలో మరో విశేషాన్ని చూడవచ్చు. ఎక్కడైనా చెట్లు ఒంటరిగా పెరుగుతాయి. ఇక్కడ మాత్రం చెట్లు జంటలుగా.. జోడీలుగా పెరుగుతాయి. రాత్రిళ్లు ఈ చెట్లన్నీ గోపికలుగా మారుతాయని, ఉదయం అవ్వగానే మళ్లీ చెట్లరూపంలోకి రూపాంతరం చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాదిపొడవునా ఇక్కడ ఆకుపచ్చటి చెట్లే కనిపిస్తాయి. ఎండిపోయిన కొమ్మలు కనిపించడం చాలా అరుదు. అయితే.. వృక్షశాస్త్రవేత్తలు మాత్రం నిధివన్లో ఉన్నవి సాధారణ తులసి చెట్లు కావని.. వనతులసి అని.. ఉత్తర మైదానాల్లోని కొన్ని ప్రత్యేక నేలల్లో ఉండే కెమికల్ కంపోజిషన్కు నీటికొరత తోడవ్వడం వల్ల కొమ్మలు పైకి కాకుండా.. కిందవైపునకు పెరుగుతున్నాయని ఒక అజెంప్షన్ మాత్రం వ్యక్తపరిచారు. అయితే.. ఇక్కడి చెట్లు ఒంటరిగా కాకుండా.. జంటగా పెరగడంపై ఇప్పటికీ శాస్త్రీయమైన కారణాలను చెప్పలేకపోయారు.నిధివన్లో ఇంకో వింతను చూడవచ్చు. సాధారణంగా పగటిపూట ఈ వనంలో కోతులు సందడి చేస్తాయి. పక్షులు కిలకిలరావాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ, సాయంత్రం 7 దాటితే.. కోతులు, పక్షులు.. చివరకు ఉడతలు.. చిన్న చీమలు కూడా నిధివన్ను వీడి బయటకు వచ్చేస్తాయి. ఇందుకు కారణాలను సైన్స్ ఇప్పటకీ కనుక్కోలేకపోయింది. అయితే.. శతాబ్దాలుగా నిధివన్ను ఖాళీ చేయించడం వల్ల.. అక్కడి పక్షులు, జంతువుల్లో ఆ పద్ధతి సర్కేడియన్ రిథమ్గా మారడమో.. ఓ కండీషనల్ బిహేవియర్గా మారడమో జరిగి ఉండొచ్చనే సైకలాజికల్ థియరీల ఆధారంగా.. శాస్త్రవేత్తలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరైనా రాత్రివేళల్లో దొంగచాటుగా నిధివన్లోనికి వెళ్తే.. ఉదయానికి వాళ్లు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడమో.. కంటిచూపును కోల్పోవడమో.. బధిరులుగా మారిపోవడమో.. చనిపోవడమో జరుగుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తారు.నిధివన్ విషయంలో శాస్త్రీయ పరిశోధనల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. నిధివన్ మేనేజ్మెంట్ అందుకు అంగీకరించలేదు. స్థానికులు కూడా ఇలాంటి చర్యలను అడ్డుకుంటూ వస్తున్నారు. నిధివన్లో కెమెరాలు పెట్టడానికి స్థానికులు అంగీకరించరు. దీంతో.. ఇక్కడ పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగలేదు. నిధివన్పై పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరిగాయి. కొన్ని టీవీ చానళ్లు, రిసెర్చర్లు రాత్రివేళల్లో నిధివన్ సరిహద్దుల వెలుపల హై సెన్సిటివ్ ఆడియో రికార్డర్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను పెట్టి.. రికార్డింగ్కు ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రాంతం నుంచి రాత్రిళ్లు గజ్జెల సవ్వడి.. మహిళల గుసగుసలు వినిపించాయని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అవి గాలి శబ్దాలు లేదా హాల్యుజినేషన్ అవ్వొచ్చు అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా.. సైన్స్కు కూడా అంతుచిక్కని నిధివన్ను ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని వింతలువిశేషాలను మా నుంచి మిస్సవ్వకుండా ఉండేందుకు ఈ చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. -
గోబెక్లీ టెపే గురించి విన్నారా? ఇదొక పురాతన మందిరం..
ఈ ప్రపంచంలో అతి పురాతన గుళ్ల నిర్మాణాల్లో గోబెక్లీ టెపే ఒకటి. ఇది సుమారు క్రీ.పూ 9600-8200 కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా. అంటే దాదాపు 11,500 నుండి 12,000 సంవత్సరాల కాలంనాటిదన్నమాట.ఈ టెంపుల్ టర్కీలోని షాన్లీఉర్ఫా ప్రాంతంలో ఉంది. వ్యవసాయం పూర్తిగా అభివృద్ధి కాకమునుపే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని పరిశోధకులు సూచిస్తున్నారు. గోబెక్లీ టెపే ఆలయాన్ని ప్రపంచంలోనే ఇప్పటివరకు అతి పురాతన నిర్మాణాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు పరిగణిస్తున్నారు.గోబెక్లీ టెపే అంటే.. టర్కీభాషలో బొడ్డులాంటి కొండ లేదా పొట్టికొండ అని అర్థం. ఈ ఆలయం స్టోన్ ఏజ్ చివరి భాగమైన నియోథిక్ యుగానికి చెందినదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ నిర్మాణ జరుగుతున్న సమయానికి ఇంకా ప్రజలు వేట, ఆహార సేకరణపైనే ఆధారపడి జీవిస్తున్నారని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా.ఈ ప్రాంతం 1960లలో గుర్తించబడింది. యునెస్కో ఈ టెంపుల్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 1990లో జర్మన్ పురావస్తు శాస్రవేత్త అయిన క్లాస్ ష్మిత్ (Klaus Schmidt) దీని ప్రాముఖ్యతను గురించి చెప్పారు. నేడు ఈ నిర్మాణం సగానికన్నా ఎక్కువ భాగం పూడ్చివేయడం జరిగింది. ఎందుకంటే? దీనిపై ఖచ్చితమైన ఆధారం లేదు. అయితే ఆచారపరమైన లేదా కొత్త నిర్మాణాల కారణం అయిఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఈ టెంపుల్ కట్టడంతో.. మానవ నాగరికత, మతం, సమాజం ఎలా ప్రారంభమయ్యాయనే విషయాల గురించి శాస్త్రవేత్తల ఆలోచనలలో కొత్తములపు తిప్పిందని చెప్పవచ్చు. -
అప్పుడు మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్ చేశారు: సమంత
సమంత.. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఆమె హీరోయిన్గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమంత. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం ఓ అభిమాని గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత ఏం జరిగిందో వివరించింది.ఆంధ్రప్రదేశ్ని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని సమంత కోసం 2023లో ఓ గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుడి కట్టారనే విషయం తెలిసి తాను కూడా షాకయ్యానంటోంది సమంత.‘గుడి కట్టించుకునేంత అర్హత నాకు లేదు. నేనేం స్పెషల్ కాదు. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. అంతేకాని నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. ఇలా గుడి కట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఆ అభిమానితో నేను మాట్లాడాను. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ఆ గుడి కట్టి పూజలు చేశాడట. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే గుడి కట్టిన విసఁం తెలిసిన తర్వాత మాత్రం మా ఇంట్లోవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నీకోసం గుడి కట్టారట అంటూ ఇంట్లో వాళ్లే ట్రోల్ చేశారు(నవ్వుతూ..)’ అని సమంత చెప్పుకొచ్చింది. -
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం (ఫొటోలు)
-
బనియన్, షార్ట్ తోనే గుడిలోకి.. అది గుడి అనుకున్నావా.. జిమ్ అనుకున్నావా! నెటిజన్స్ ఫైర్
-
ప్రముఖ ఆలయంలో తనికెళ్ల భరణి పూజలు
టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి నారపల్లి దివ్యనగర్లోని శివ పంచాయతన సమేత హనుమదాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం గురించి తెలుసుకున్న తనికెళ్ల భరణి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కామాఖ్య దేవాలయ దర్శనంలో శ్రీముఖి (ఫొటోలు)
-
దైవ దర్శనానికి వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు
సాక్షి,జగిత్యాల: మేడిపల్లి మండలం కొండాపూర్లో విషాదం చోటుచేసుకుంది. శివగంగ ఆలయం సమీపంలోని కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. తొలుత ఇద్దరు మృతదేహాలు లభించగా ఒకరు గల్లంతయ్యారు. దీంతో వెంటనే గల్లంతైన చిన్నారి కోసం గజ ఈతగాళ్లు కోనేరులో దిగి గాలింపులు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. మృతులు మనస్వి, అర్వింద్గా గుర్తించారు. పిల్లల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మకానికి అర్చక పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ‘అది ఉమ్మడి కరీంనగర్లోని ప్రధాన దేవాలయం. నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఐదారు నెలల క్రితం ఆ ఆలయంలో పరిచారకుల (సహాయ అర్చకులు) నియామకాలు జరిగినప్పుడు, అప్పటికే ఆ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారి కుమారులు నియమితులయ్యారు. ఇతర అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఆలయంలో నాలుగు అర్చకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జరగబోతోంది. అర్చకుల పిల్లలు నలుగురు దరఖాస్తు చేశారు. వారికే పోస్టులు దక్కేలా తెరవెనక రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.’ అర్చకుల పోస్టులను బేరానికి అంగట్లో పెట్టేశారు. అర్చకులు, సహాయ అర్చకుల (పరిచారక) పోస్టులకు కొందరు అధికారులు ధర ఖరారు చేసి అమ్మకానికి తెరదీశారు. కొన్ని ఆలయాల్లో పద్ధతిగానే సాగుతున్నా, కొన్నింట్లో అక్రమాలకు గేట్లు ఎత్తారు. పే స్కేల్ పోస్టులు కావటంతో... గతంలో ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, డోలు సన్నాయి వాయించే వారి పోస్టులంటే పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. వారికి జీతాలను ఆ దేవాలయ ఆదాయం నుంచే అత్తెసరుగా చెల్లించేవారు. కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో పనిచేసేవారికి ప్రభుత్వ పేస్కేల్ ప్రకారం జీతాలు అందుతున్నాయి. దీంతో ఆయా పోస్టులకు మంచి డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలోని 55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. అయితే, భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సీ లాంటి నియామక సంస్థల ద్వారా కాకుండా, ఆలయాల స్థాయిలోనే జరిగేలా ఏర్పాటు చేశారు. నియామక నోటిఫికేషన్లను కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్ ద్వారా కాకుండా ఆయా దేవాలయాల స్థాయిలోనే జారీ అయ్యాయి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. దేవాలయ ఈఓలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తుల ప్రక్రియ యావత్తు లోపభూయిష్టంగా సాగింది. చాలాచోట్ల అభ్యర్థులకు రశీదు కూడా ఇవ్వలేదు. ఒక్కో దేవాలయానికి ఒక్కో తేదీన నియామక తేదీలను ప్రకటించారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు.. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కొన్నింటికి దేవాదాయశాఖ ప్రధాన సెంటర్లలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లోని ఓ ప్రధాన దేవాలయంలో ప్రక్రియ ఒక్కటి ప్రస్తుతానికి పూర్తయింది. అక్కడ దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు కనీసం పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ కూడా వెల్లడించలేదు. తీరా ఇంటర్వ్యూల విషయం తెలిసి అభ్యర్థులు వెళ్లేసరికి ప్రక్రియ పూర్తయిందని, వారి దరఖాస్తులను తిరస్కరించామని చెప్పటంతో కంగు తిన్నారు. దీనిపై వారు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, దేవాలయం స్థాయిలోనే ప్రక్రియ జరిగినందున, అక్కడే తేల్చుకోవాలని చెప్పి పంపించేశారు. అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని, అందుకే చెప్పాపెట్టకుండా ప్రక్రియను పూర్తి చేశారని ఇతర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మిగతా ఆలయాల ప్రక్రియ మొదలవుతోంది. చాలాచోట్ల ఇప్పటికే ఇదే తరహా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు ఖరారు చేసి బేరమాడుకుని పోస్టులను రిజర్వ్ చేశారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ ప్రక్రియను రద్దు చేసి, నియామక బోర్డు ద్వారా పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించి అర్హులకే పోస్టులు దక్కేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. డోలు సన్నాయి వాద్యకారుల పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొందరు అర్హతలేని వారికి బాధ్యత అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ⇒ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ అంతర్గతంగానే జరిగే సంప్రదాయం ఉండేది. కానీ, ఇది అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీకి కేటాయించింది. త్వరలో జరగబోయే నియామక ప్రక్రియ పూర్తిగా నియామక బోర్డుల ఆధ్వర్యంలో జరగనుంది. డ్రైవర్, కండక్టర్ పోస్టులను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, డీఎం, అసిస్టెంట్ డీఎం అయితే టీజీపీఎస్సీ, ఆర్టీసీ ఆసుపత్రి సిబ్బంది నియామకాలు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతోంది. -
ధనుష్ కొత్త సినిమా.. భారీ ఆలయ సెట్!
ధనుష్ హీరోగా నటించిన కర చిత్రం ఇటీవలే విడుదలై ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం ఆయన తన 55వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఇందులో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలకపాత్రను పోషిస్తున్నారు. అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పెరియస్వామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని, ఎళిల్ అరసు చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో ధనుష్పై ఓపెనింగ్ సాంగ్ ఉంటుందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన యూనిట్ సభ్యులు తాజాగా షూటింగ్ వేగాన్ని పెంచినట్లు సమాచారం.చిత్త షూటింగ్ను చైన్నె చెంగల్పట్టు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకంగా నిలిచే ఒక ఆలయాన్ని చైన్నె సమీపంలోని గ్రామంలో బ్రహ్మాండంగా సెట్ వేసి షూటింగులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఈ సెట్లో జరగనున్న షూటింగ్లో ధనుష్ పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్లో ధనుష్, శ్రీలీలపై ఒక పాటను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ధనుష్ ఈ చిత్రాన్ని జూలై రెండవ వారానికంతా పూర్తిచేసి తను తన తర్వాత తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో నటించనున్న షూటింగ్కు సిద్ధమవుతారని సమాచారం. -
శ్రీవారి ఆలయం.. పేదల తిరుపతిగా అభివృద్ధి.. సీఎం రేవంత్
సాక్షి, వికారాబాద్: కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని పేదల తిరుపతిగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు( శుక్రవారం) కొడంగల్లో పర్యటించిన సీఎం వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ప్రాంత పిల్లలు ఇతర ప్రాంతాలకు చదువుకోసం వెళ్లేవారని ఇప్పుడు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి చదువుకోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. కొడంగల్లో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని సీఎం తెలిపారు. కొడంగల్ బిడ్డ తెలంగాణకు సీఎంగా ఉన్నారని తెలిపారు.వికారాబాద్- కృష్ణా రైల్వే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా గతంలో తాగు, సాగునీరుకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కొడంగల్ నారాయణ పేట భూసేకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని త్వరలోనే కృష్ణా జలాలు కొడంగల్ని ముద్దాడాలన్నారు.పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఉండే గొప్పగొప్ప పరిశ్రమలు రెండేళ్లలో కొడంగల్కు వచ్చాయన్నారు.ఈ ప్రాంత నాయకులు రాజకీయాలు పక్కనబెట్టి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని సీఎం రేవంత్ ఈ సందర్భంగా కోరారు. -
ఏపీలో ఉన్న శ్రీ లలితా దేవి ఆలయం గురించి మీకు తెలుసా? (ఫొటోలు)
-
తాత్కాలికంగా ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన నిలిపివేత
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి ఆలయం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీశాఖ-చెంచు డ్రైవర్ల మధ్య వివాదం చెలరేగింది. ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తిని ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లడానికి ఈడీసీ అధికారులు అనుమతించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలా అనుమతిస్తారంటూ చెంచు డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వివాదం మొదలైంది.వివాదం ముదరడంతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్లే భక్తుల టికెట్ల రుసుమును అటవీశాఖ సిబ్బంది వెనక్కి ఇచ్చేశారు. వివాదం సద్దుమణిగిన తర్వాతనే యాత్ర పున:ప్రారంభిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆలయం తాత్కాలికంగా మూసివేయడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..
ఎన్నో కేఫ్లు చూసుంటాం. ఇలాంటి కేఫ్ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్ లేదా రెస్టారెంట్ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్ ఇది. ఎక్కడ ఉందంటే..బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్తో ఈ కేఫ్ని నిర్మించారట. ఈ కేఫ్లో హైలెట్గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇలా కేఫ్ని తీర్చిదిద్దామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంతేగాదు పోస్ట్లో రామేశ్వరం కేఫ్ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది. View this post on Instagram A post shared by Aditya Raj | Dev & Creator (@addywithlens) (చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..) -
రైలు బోగినే దేవాలయం, బెర్త్పైనే పూజలు, వైరల్ వీడియో
రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్ పూజా మందిరంగా మార్చేసి, కాషాయ వస్త్రాలు, పూలమాలలు, దేవతా విగ్రహాలతో అలంకరించి, కదులుతున్న రైలులోనే హారతుల్విడం ఈ వీడియోలో చూడవచ్చు.భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'భారత్ గౌరవ్' అనే థీమ్డ్ రైల్వే రైలులో ఈ సంఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణికులంతా గుమిగూడి పూజాకార్యక్రమాలు భక్తి గీతాలు పాడుతూ, ఆచారాలలో నిర్వహించడం గమనార్హం. భారత్ గౌరవ్ రైళ్లు సాధారణంగా భారతదేశం అంతటా తీర్థయాత్రలకుద్దేశించినవేఅయినప్పటికీ కానీ ఈ వీడియో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన ఆచారాలపై చర్చను రేకెత్తించింది. View this post on Instagram A post shared by TUBELIGHT (@the_tubelight)సోషల్ మీడియా స్పందనఈ వీడియో ఇంటర్నెట్లో భారీ వ్యూస్ను సంపాదంచుకుంది. కొంతమంది వినియోగదారులు ప్రజా రవాణాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు రైల్వే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది ఈ చర్యను సమర్థించారు. ఇది భారతదేశపు లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికతలో భాగమని పేర్కొన్నారు. “ఒక ముస్లిం వ్యక్తి రైలులో నమాజ్ చేస్తే అది తప్పా... మరి దీని సంగతేంటి... నేను హిందువునే, కానీ అన్నిటికంటే ముందు నేను భారతీయుడిని.” అని ఒకరు వ్యాఖ్యానించారు. “సందర్భం ముఖ్యం! ఇది తీర్థయాత్రల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైలు. ఈ భక్తి కార్యక్రమాలకు సిబ్బంది అధికారికంగా మద్దతు ఇస్తున్నారు, ఇవి థీమ్ ఆధారిత ప్రయాణ అనుభవంలో భాగం. ప్రజలు వివరణ చదవకుండా లేదా ఇది ఒక సాధారణ పబ్లిక్ కోచ్ కాదని అర్థం చేసుకోకుండా స్పందిస్తున్నారు.” ఇంకొకరు ఆగ్రహం ప్రకటించారు. “వారిని ఇప్పటికే జైల్లో ఎందుకు పెట్టలేదు? బహిరంగ ప్రదేశంలో ఇలాంటి అర్థంలేని పనులను ఎలా సహిస్తున్నారు? ఇది కేవలం వైరల్ రీల్స్ కోసమా లేక ఏంటి?” ఒకరు, “ పనీ పాటా, జ్ఞానం లేని ప్రజలు, ఇలా తయారవుతున్నారు.” అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. హితవు చెప్పిన NCIBఈ వీడియో బాగా వైరల్గా మారడంతో, NCIB అధికారిక ఖాతా ద్వారా స్పందించింది. బహిరంగ ప్రదేశాల నిబంధనలను గౌరవించాలని ప్రయాణికులను కోరింది. -
బిహార్లో తొక్కిసలాట.. 8 మంది మృతి
నలంద: బిహార్లో విషాదం జరిగింది. నలందలోని శీతల మాత ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలింఒచారు. పూజలు నిర్వహించడానికి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. #WATCH | Bihar: A stampede occurred during puja at Maa Sheetla Mandir in Maghra village of Nalanda. Injuries reported, deaths feared. More details awaited. Visuals from the spot as an ambulance reaches here. pic.twitter.com/1UU0kwN6OA— ANI (@ANI) March 31, 2026 -
ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి
బెంగళూరు: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లపై ఆసక్తి బాగా పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం పరిధులు దాటుతోంది. ఒక్కోసారి ఘర్షణలకు దారి తీస్తోంది. అప్పుడప్పుడూ విషాదంగా కూడా మారిపోతోంది. తాజాగా కర్ణాటకలోని సకలేశపుర తాలూకాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. స్టోరీ ఏంటంటేఅసలేం జరిగింది?కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర తాలూకాలోని ప్రముఖ బెట్టద భైరవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. పచ్చని ప్రకృతికి నిలయమైన ఈ ప్రాంతం ప్రీ-వెడ్డింగ్ షూట్లకు చాలా ప్రసిద్ధి.ఇక్కడ ఒక జంట తమ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్లతో కలిసి ఈ ఆలయానికి వచ్చింది. షూటింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లు పాదరక్షలు (షూలు) ధరించి ఆలయ పరిధిలోకి ప్రవేశించారని, అలాగే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఫోటోగ్రఫీ చేస్తున్నారని కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘర్షణ చెలరేగింది.మాట మాట పెరిగి అది భౌతిక దాడికి దారితీసింది. స్థానికులు ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడమే కాకుండా, వారి కెమెరాను కూడా పగులగొట్టారు.ఈ దాడిలో నవీ, నందన్ అనే ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సకలేశపుర తాలూకా ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న సకలేశపుర రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముదిగెరె తాలూకాకు చెందిన ఏడుగురిని (ఆశి, ప్రశాంత్, రక్షా, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!నోట్: ఆధ్యాత్మిక, పర్యాకట ప్రదేశాల్లోఇలాంటి షూట్లు చేసేటప్పుడు స్థానిక పద్దతులను నియమాలను పాటించడం అవసరం. స్థానికుల మనోభావాలకు భంగం కలగకుండా సున్నితత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. (షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ) -
రఘురామ పర్యటనతో టెన్షన్!
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. డిప్యూటీ స్పీకర్ వెంట వచ్చిన కూటమి కార్యకర్తలు తమపై దాడిచేశారని స్థానిక దళితులు ఆందోళనచేశారు. ఈ గొడవ పేరుతో పలువురిని స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని వారు పేర్కొన్నారు. ఆకివీడులోని పెదపేటలో దళితుల నివాసాల మధ్య ఉన్న ఓ ఆలయంలో రఘురామకృష్ణరాజు పూజలు చేయడానికి శుక్రవారం వచ్చారు. ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం, వారంతా ఏదో దాడికి వచ్చినట్లు హడావిడి చేయడం, ఆ ప్రాంతంలోని దళితులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. డిప్యూటీ స్పీకర్ మందీమార్బలం హడావుడి..శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మందీమార్బలాన్ని వేసుకుని హడావుడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ఆ ప్రాంత దళిత మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రఘురామ పర్యటన నేపథ్యంలో అక్కడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 57 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులురఘురామ వెంట వచ్చిన వారు దురుసుగా వ్యవహరించడంతోనే ఘర్షణ తలెత్తిందని స్థానికులు పేర్కొన్నారు. దాంతో తోపులాటకు దారితీసిందని, ఈ ఘటనలో పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం పెదపేటలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాయంత్రం వేళ తిరిగి ఆ ప్రాంతానికి చేరుకుని 57 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు స్థానిక పోలీస్ స్టేషన్లో లేకపోవడం, ఎక్కడికి తరలించారనే సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. -
నటుడు సుదీప్కు గుడి కట్టిన వీరాభిమాని
తమ అభిమాన నటీనటులకు ఆలయాలు కట్టి పూజలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులకు తమిళ సినీ అభిమానులు గుడి కట్టించడమే విశేషం. అలా ఇంతకుముందు ఉత్తరాదికి చెందిన తమిళనాడులో ఆమె వీరాభిమాని గుడి కట్టించి ఆరాధించిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు సుదీప్కు తమిళనాడులో ఒక వీరాభిమాని గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. కన్నడం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకుడిగా 50 కి పైగా చిత్రాల్లో నటించిన నటుడు సుదీప్. తెలుగులో ఈయన నటించిన “ఈ “చిత్రం “ నాన్ ఈ “గా తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.అదేవిధంగా విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. మరికొన్ని చిత్రాల్లో నటించిన సుదీప్కు తమిళనాడు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలా ఈరోడ్ జిల్లా, తొట్టాగాజనూర్ ప్రాంతానికి చెందిన సుందరరాజ్ నటుడు సుదీప్కు వీరాభిమాని. ఇతను ద్విచక్రవాహంలో ఐస్ వ్యాపారం చేస్తుంటాడు. కాగా తన అభిమాన నటుడు సుదీప్ కోసం తన ఇంటి ముందు గుడిని కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆ గుడిలో సుదీప్ చిత్ర పటంతో పాటు మహర్షి వాల్మీకి, వీర మాతంగరి ఫొటోలు పొందుపరిచి పూజలు చేస్తున్నారు. -
ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
-
దేవాలయంలో ఘోర ప్రమాదం.. భక్తులు నిద్రిస్తుండగా ఊడిపడిన సీలింగ్
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
-
హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)
-
చిలుకూరులో విషాదం ఆలయ ప్రధాన అర్చకులు ఇకలేరు
-
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్లో ఉద్యోగాలు
జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్ టైమ్లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్నెస్కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026 -
గ్రహణంలోనూ తెరిచే ఉండే ఆలయాలు
గ్రహణంలోనూతెరిచే ఉండే ఆలయాలుసాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేసి, గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేసి భక్తుల సందర్శనార్థం అనుమతించడం అనేది ఆచారం. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. ఆ ఆలయాలేమిటో తెలుసుకుందాం...గ్రహణసమయంలో కూడా తెరిచే ఉండే ఆలయాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, పెదకాకానిలోని కోటేశ్వర స్వామి ఆలయం ముఖ్యమైనవి. తమిళనాట గల అరుణాచల క్షేత్రం సరేసరి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడమే ఇందుకు కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని విశ్వాసం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ క్షేత్రానికి రాహు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు.మహా కాళేశ్వర్ ఆలయం... ఉజ్జయిని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభూ మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండనందువల్ల గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి. ఏ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం: ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కా దేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.ఏ కల్పేశ్వర్ ఆలయం – ఉత్తరాఖండ్ : గ్రహణ సమయంలో కూడా ఉత్తరాఖండ్లోని కల్పేశ్వర్ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిథిగా దర్శనాలు కొనసాగుతాయి. ఏ తిరువరప్పు శ్రీ కృష్ణ ఆలయం – కొట్టాయం ఏ కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీ కృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామి వారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. ఏ విష్ణుపాద ఆలయం – గయ: ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రధానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందట.ఏ లక్ష్మీనాథ్ ఆలయం – బికనీర్, ఏ రాజస్థాన్ రాష్ట్రం బికనీర్లోని లక్ష్మీనాథ్ ఆలయం. దీన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరు. ఎందుకంటే ఓసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.(మార్చి 3 బుధవారం సంపూర్ణ చంద్ర గ్రహణం) -
హోమంలో పాల్గొన్న జగన్
-
Exclusive Visuals: నందిపల్లి నందీశ్వరాలయం..
-
నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని.. భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో రెండో రోజు పర్యటన సందర్బంగా వైఎస్ జగన్.. నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి, స్వామివారికి భక్తి శ్రద్దలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది’ అని అన్నారు. ఈ క్రమంలోనే నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, కమిటీ సభ్యులను అభినందిస్తూ ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నందీశ్వర స్వామివారి కృపాకటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
పళని మురుగన్ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
ఢిల్లీలో హై అలర్ట్.. ఆలయాలకు భద్రత పెంపు
ఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో పోలీసులు అప్రతమ్తమై, హై అలర్ట్ ప్రకటించారు. పాక్ మసీదు వద్ద పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని భద్రతా సంస్థలు శనివారం మరోసారి హెచ్చరికలు జారీ చేశాయి. ఎర్రకోట సమీపంలోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు పేలుడు పరికరం (ఐఈడీ)తో దాడికి ప్రణాళిక వేస్తున్నారని నిఘా వర్గాలు సూచించాయి. చాందినీ చౌక్లోని ఒక ప్రముఖ ఆలయంపై ప్రత్యేకంగా దాడికి ప్రణాళిక వేస్తున్నాన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.ఫిబ్రవరి 6న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడు తర్వాత, ఆ సంస్థ భారతదేశంలో భారీ ఉగ్ర దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఈ సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ఎర్రకోట, చాందినీ చౌక్, చుట్టుపక్కల మతపరమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు ప్రత్యేక నిఘాలో ఉన్నాయి. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోని ఒక ప్రధాన ఆలయాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని ఒక ప్రముఖ ఆలయం లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)
-
కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్జున్ సర్జా
తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.కాగా.. అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ సీతాపయనం. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయన్గా మెప్పించింది. ఈ మూవీ ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్రలో మెప్పించారు. Aanaadu #SriAnjaneyam lo Anjaneyudu laa manalni abhimanulu ga maluchukunna #Arjun garu Eroju #SeethaPayanam hit Aina Sandharbhamga #Kondagattu #SriAnjaneya Swamy vaarini dharsinchukunnaru... pic.twitter.com/nOCrnrarH6— Prabhas Fan (@ivdsai) February 16, 2026 -
శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)
-
‘మా బుజ్జి కదూ.. ఊరుకో తల్లీ.. మా అమ్మకదా’
పెద్దపల్లి: ‘మా బుజ్జి కదూ.. ఊరుకో తల్లీ.. మా అమ్మకదా’ అని ఏడుస్తున్న ఆ చిన్నారిని లాలింపసాగింది అమ్మమ్మ. ‘పండుగ కదా తల్లీ.. ఈరోజు మన కడుపు నిండుతుంది’ అని ముద్దుల వర్షం కురిపించింది. ఈ దృశ్యం స్థానికుల మదిని కరిగించింది. ఈ పసికూన తన మనుమరాలేనని ‘సాక్షి’కి సంబురంగా తెలిపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన ఆదివారం దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. పండుగపూట తమ కడుపు నిండుతుందని గంపెడాశతో తమపిల్లలను చంకలో వేసుకొని గుడిముందు యాచిస్తూ కనిపించారు కొందరు మహిళలు. అంతలోనే ఒక్కసారిగా గురకపెట్టి ఆగకుండా ఏడుస్తున్న పాపని చూసి తోటి మహిళ తనకిమ్మంటూ ఎత్తుకొని తన లాలింపు మాటల పాటలు, ముద్దులు కురిపిస్తుంటే ఆ పసిపాప తల్లితో పాటు తోటి యాచకులు సైతం మొహంలో నవ్వులు చిందిస్తూ కనిపించారు. -
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
అయోధ్యపై దాడికి ప్లాన్.. యూపీ జైలులో దారుణ హత్య!
అయోధ్య రామమందిరంపై బాంబు దాడి యత్నం కేసులో అరెస్టైన అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి జైలులో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నిన్న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అతనిపై అరుణ్ చౌదరి అనే వ్యక్తి దాడి చేసినట్లు పేర్కొన్నారు.నిన్న రాత్రి పదునైన ఆయుధంతో రహ్మన్ తలపై దాడి చేయగా అతనికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారని పేర్కొన్నారు. కాగా అతనిపై దాడి చేసిన అరుణ్ చౌదరి జమ్మూకశ్మీర్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుతం రహ్మన్ ఫరిదాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 2025లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, హర్యాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు చేసి రహ్మాన్ ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని చేతిలో రెండు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అనంతరం జరిపిన విచారణలో రహ్మాన్ నకిలీ ధృవపత్రాలతో ఫరీదాబాద్ లో నివసిస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.అనంతరం అతని వద్ద స్వాధీనం చేసుకున్న వీడియోలలో రామమందిరానికి సంబంధించిన కీలక చిత్రాలు వీడియోలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే అతనికి ఐఎస్ఐతో సంబంధం ఉన్న సంస్థల ద్వారానే బాంబులు అందినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతని హత్య చేయడానికి గల కారణాలు తెలియదని.. ఎందుకోసం అతనిపై దాడి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
పాక్లో "లవు"ని ఆలయం పునఃప్రారంభం
పాకిస్థాన్లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి లాహెర్కోట లోని శ్రీ రామచంద్రుడి కుమారుడి లోహ్ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల సందర్శనార్థం పున:ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్ కోటలో చారిత్రక లోహ్ మందిరాన్ని వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ – పాకిస్థాన్ సహకారంతో పునరుద్ధరించారు. ఈ దేవాలయం శ్రీరాముడి ఇద్దరు కుమారుల్లో ఒకరైన లవుడికి సంబంధించిందిగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా ఇప్పుడు పూర్తిస్తాయిలో పునరుద్ధరించారు.అయితే హిందూ సంప్రదాయం ప్రకారం, లాహోర్ నగరానికి లవుడి పేరు మీద ఆ పేరు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు. చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలు—ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన ఓ సిక్కు ట్రావెలర్ సిక్కుల పాలన కాలంలో లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు. దీంతో లాహోర్ కోటకు సిక్కు సామ్రాజ్య కాలంలో ఉన్న చారిత్రక విలువను సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA) అమెరికాకు చెందిన సిక్కు పరిశోధకుడు డా. తరుంజీత్ సింగ్ బుటాలియాను నియమించి “Lahore Fort during the Sikh Empire” అనే పేరుతో ఒక టూర్ గైడ్ పుస్తకాన్ని రచించారు. -
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష్మీరాయ్ పూజలు (ఫొటోలు)
-
‘మగవారి పొంగళ్లు’.. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే..
సాక్షి, అన్నమయ్య జిల్లా: పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ‘మగవారి పొంగళ్లు’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీసంజీవరాయ స్వామికి మగవారు పూజలు చేయడం.. పొంగళ్లు పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నేడు ఒక్కరోజు ఇక్కడ ఆడవారికి ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. స్వామివారి నైవేద్యం కూడా ఆడవారు తినడం నిషేధం.ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మగవారి పొంగళ్లకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సాధారణంగా మహిళలు మాత్రమే పొంగళ్లు వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ.. తిప్పాయపల్లెలో మాత్రం పురుషులే పొంగళ్లు వండి స్వామి వారికి సమర్పించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఆలయం వెలపల నుంచే దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.స్థల పురాణం..ఒకప్పుడు గ్రామస్తులు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా సాగించేవారు. క్రీ.శ. 1716లో తీవ్రమైన కరువు కాటకాలు ఎదురయ్యాయని అప్పట్లో తాగడానికి నీరు, తినడానికి తిండిలేక పశుపోషణ భారమైన పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఊరిలోకి ఓ వేద పండితుడు వచ్చివెళ్లేవారని తెలిసింది. పొలాల్లోనే నివాసం ఉండే పండితుడు ప్రజల కష్టాలు తొలగించడానికి నైరుతి మూలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయస్వామిగా నామకరణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆ పండితుడు ఆంజనేయస్వామికి మహాభక్తుడు కావడంతో ఆడవారు ఎవరూ ఆలయంలోకి రాకూడదని సూచించారని తెలిసింది. అప్పటి నుంచి ఆలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించడం సంప్రదాయంగా మారింది. నాటి నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు. -
KPHB: ఆలయంలో భారీ చోరీ.. గర్భగుడి తాళాలు పగులగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు.తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు
-
కోడలికి మేడలు లేవని చెబుతాం!
కర్నూలు జిల్లా: తరాలు మారినా, కంప్యూటర్ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచీ్చరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దెపై మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జని్మంచిన శిశువులకు ఉచీ్చ రప్ప, ఉచీ్చరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది. -
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన సంఘటన
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
అయ్యప్పస్వామి మండల దీక్ష పూజకు సమయం సమీపిస్తున్న వేళ శబరిమలకు భక్తుల రద్దీ పెరుగుతుంది. మణికంఠ స్వామిని ఇప్పటివరకూ దర్శించుకున్న భక్తుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయ్యప్పస్వామి అభరణాల ఊరేగింపు "తంగాఅంకి" సందర్భంగా నేడు ( శుక్రవారం) నుంచి పలు ఆంక్షలు విధించినట్లు అధికారులు ప్రకటించారు.అయ్యప్పస్వామి మండలి పూజ డిసెంబర్ 27న జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధానానికి భక్తుల రద్దీ పెరిగింది. డిసెంబర్ 25, 2025 నాటికి స్వామివారిని 30,01,532 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే గతేడాది ఈ సంఖ్య 32,49,756 గా ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిమేర తగ్గినట్లు తెలిపారు.కాగా అయ్యప్పస్వామికి అభరణాల ఊరేగింపు ఉత్సవానికి అక్కడి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కుంబజా, పలమారుర్ వంచిప్పాడి, పులిముక్కు, ఇలకొల్లూర్ తదితర ప్రాంతాలలో స్వామివారి అభరణాల ఊరేగింపు సందర్భంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాగా రేపు శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజ ముగింపు కార్యక్రమం ఉంటుంది. -
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. -
శబరిమలలో ఫుడ్ సేఫ్టీ డ్రైవ్
కేరళ శబరిమల సన్నిధానం పర్యవేక్షణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. సన్నిధానం పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫుడ్ కాంప్లెక్స్లు ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పాటు సరైన నిబంధనలు పాటించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధించారు. అయ్యప్ప సన్నిధాన పవిత్రతను కాపాడడానికి దేవస్థానం బోర్టు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది వరకే శబరిమలలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో శబరిమలలోని హోటళ్లు, ఫుడ్కోర్టులు, ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేప్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకుండా నిబంధనలకు అనుగుణంగా లేని వాటిపై దాదాపు రూ. 98 వేల జరిమానా విధించారు.భక్తులు రద్దీని దృష్టిని ఉంచుకొని అధిక ధరలకు వస్తువుల అమ్మడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం తదితర అంశాలను ఆరా తీశారు. ఆహార పదార్థల ధరలను పట్టికలో పొందుపర్చాలని వాటిని ఎట్టి పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మకూడదని తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా భక్తులకు కచ్చితంగా వేడినీటినే సరఫరా చేయాలని కూల్ వాటర్ ఇవ్వకూడదని తెలిపారు. అదే విధంగా దేవస్థానం ఉద్యోగస్థుల పేరుతో మోసం చేసే వారిపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. -
గుప్త నిధుల ఆశతో..
అనంతపురం కల్చరల్: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి.. ఆయన్ని గెంటేసి ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే అరాచకాలపై స్థానిక అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో బాధిత అర్చకుడు బీఈ సిరి రమణ న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ఫుట్పాత్పై ఆమరణదీక్షకు పూనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దుర్గాంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధులున్నాయని, రూ.6 కోట్ల ఫండ్ ఉందని ప్రచారం జరుగుతోందని, వీటి కోసమో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కుటుంబం కుట్ర పన్ని.. అర్చక కుటుంబంపై ఆరోపణలు చేస్తూ దాష్టీకానికి పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్చకుడు ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీల నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. అయినా న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగించాలని ప్రతిన బూనాడు. రాత్రంతా గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగించాడు. అయితే.. అర్ధరాత్రి అనంత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన ఆలయ పూజారి రమణాచారి అరెస్ట్ చేశారు. బలవంతంగా జీజీహెచ్కు తరలించారు. శ్రావణి ఆదేశాలతో సీఐ బెదిరింపులుఎమ్మెల్యే శ్రావణి ఆదేశాలతో పోలీసులు ఆలయ కబ్జాకు సహకరిస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో.. కాళ్లు విరగొడతానని పూజారి రమణాచారి ని శింగనమల సీఐ కౌలుట్లయ్య బెదిరించారని తెలుస్తోంది. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పూజారి రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. గుప్త నిధుల కోసమే టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తల్లి లీలావతి ఈ దారుణానికి పాల్పడ్డారని అందులో ఆయన ఆరోపించడం ఉంది. హిందూ సంఘాల మద్దతు.. మంగళవారం అయ్యప్ప మాలధారులు, వీహెచ్పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అర్చకునికి సంఘీభావం తెలిపారు. అర్చకుడంటే మరీ అంత అలుసా.. భగవంతుని సేవ తప్ప మరొకటి తెలియని వారిపై ఇంత అరాచకం జరుగుతున్నా పట్టనట్టు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మద్ధతు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. మంగళవారం అర్చకుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆలయాలకు భద్రత కరువు రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిందట సింహాచల దేవస్థానంలో హుండీ చోరీ జరిగిందని, ఆరు నెలల కిందట అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అనుచరులు హుండీ చోరీ చేసినా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి వేవస్థానంలో శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందన్నారు. నిత్యం ఏదో ఒక ఆలయంలో టీడీపీ నాయకులు వివాదం రగిలిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. శింగనమల అర్చక కుటుంబంపై ఎమ్మెల్యే కుటుంబం కుట్ర పన్ని ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. గుప్తనిధుల కోసం సాగుతున్న దాషీ్టకంపై అధికారులకు తెలియజేసినా ఏమీ స్పందించకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ గొప్పగా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇదంతా కనిపించడం లేదా అని నిలదీశారు. ఆయన స్పందించాలంటే చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. -
సింహాచల పుణ్యక్షేత్రంలో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
-
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్
జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025 -
ఆలయం సొమ్మును ఆ దేవత కోసమే వినియోగించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: ఆలయానికి చెందిన సొమ్మును ఆ దేవత కోసం వాడాలే తప్ప, కష్టాల్లో ఉన్న సహకార బ్యాంకుల కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తిరునెల్లి టెంపుల్ దేవస్వోమ్కు చెందిన డిపాజిట్లను తిరిగి ఆలయానికి వాపసు చేయాలంటూ కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘బ్యాంకులను కాపాడుకునేందుకు మీరు ఆలయం సొమ్మును వాడుకోవాలనుకుంటున్నారా? నష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో ఆలయం డబ్బును ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు మళ్లించాలని ఆదేశించడంలో తప్పేముంది?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ‘ఆలయం సొమ్ము ఆ దేవతకే చెందుతుంది. అందుకే, ఆ సొత్తును దాచాలి, కాపాడుకోవాలి, ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. అంతేగానీ, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకు మనుగడకు ఒక వనరుగా ఆ సొమ్ము మారరాదు’అని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. బ్యాంకులు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలన్న ధర్మాసనం.. ఖాతాదారులను, డిపాజిట్లను ఆకర్షించలేకపోవడం మీ సమస్య’అని పిటిషనర్లనుద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. అయితే, డిపాజిట్ల ఉపసంహరణ గడువు పెంచాలని కేరళ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆలయానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కొన్ని సహకార బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో తిరునెల్లి ఆలయ బోర్డు కోర్టుకెక్కింది. -
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పూజలు.. (ఫోటోలు)
-
అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..!
ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం అనగానే భారత్లోనే ఎక్కడ అని ఆత్రుతగా వెతక్కండి. ఎందుకంటే..అతి పెద్ద ఆలయం మన ఇండియాలో లేదు కంబోడియాలో ఉంది. చుట్టూ కందకంతో చుట్టుబడి అద్భుతానికి ప్రతిరూపంలా అలారారుతోంది ఆ ఆలయం. అది హిందూ దేవాలయమేనా కాదా అనేది చరిత్రకే తెలియని ఓ మిస్టరీ. ఇప్పటికీ ఈ దేవాలయం చర్చనీయాంశంగా ఉంటుందట. ఎందుకంటే ఇందులో అడగడుగున కనిపించే అద్భుతమైన కళా సంపద, ఆ గోడలపై కనిపించే రాతి కళా నైపుణ్యం మనల్ని కట్టిపడేయడమే కాదు..ఎన్నో అనుమానాలు, సందేహాలను రేకెత్తిస్తుంటదట. మరి అలాంటి ఆలయం ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కించుక్ను కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం దాదాపు 400 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కంబోడియాలోని ఒక అందమైన, కందకంతో చుట్టుముట్టిన అంగ్కోర్ వాట్ దేవాలయం అతి పెద్ద ఆలయంగా ఖ్యాతీ దక్కించుకుంది. ప్రతి ఏడాది వేలాదిగా ప్రయాణికులను మంత్రముగ్ధులన్ని చేసే ఈ గుడి గొప్ప సంక్లిష్టంగా చెక్కిన ఆలయ సముదాయం. నిజానికి ఈ దేవాలయం దానికదే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది అందులోకి అడుగుపెట్టగానే. దీన్ని 12వ శతాబ్దం ప్రారంభంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ II విష్ణువు దేవుని కోసం నిర్మించిన స్మారక చిహ్నంగా చెబుతుంటారు. పశ్చిమాన ఉన్న అరుదైన ఆగ్నేయాసియా దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. అంతేగాదు అంగ్కోర్ పురావస్తు ఉద్యానవనానికి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. అది హిందూ దేవాలయమా?నివేదికల ప్రకారం, అంగ్కోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత ఆయమే గానీ హిందూ దేవాలయమేనే అనేది నేటికి మిస్టరీనే. ఎందుకంటే దాని సంక్లిష్ట చరిత్ర కారణంగా దీనిని కొన్నిసార్లు హిందూ-బౌద్ధ దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదట హిందూ దేవాలయంగా నిర్మించిన అంగ్కోర్ వాట్ శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. సియామ్ రీప్లోని అంగ్కోర్ ఖైమర్ రాజ్యానికి కేంద్రంగా ఉండేది. పైగా ఇది అనేక స్మారక చిహ్నాలు, పట్టణ ప్రణాళికలు, పెద్ద నీటి జలాశయాలను కలిగి ఉంది. అంగ్కోర్ లోపల, అంగ్కోర్ వాట్, బయోన్, ప్రీహ్ ఖాన్, టా ప్రోహ్మ్ వంటి దేవాలయాలు గొప్ప కళా సంపదకు నిలయంగా ఉన్నాయి.అయితే ఈ ప్రాంతంలో హిందూ మతం క్రమంగా తగ్గుముఖం పట్టి బౌద్ధమతం అభివృద్ధి చెందడంతో, ఆలయం కూడా క్షీణించకుండా దినదినాభివృద్ధి చెందింది. పైగా ఈ ఆలయానికే బౌద్ధ మందిరాలు కూడా జోడించారు. దాంతో చాలామంది సన్యాసులు ఇక్కడికి తరలివచ్చేవారు. అంగ్కోర్ సామ్రాజ్యంలోని ఇతర నిర్మాణాలను అడవి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ ఆలయం చాలా కాలం పాటు సజీవంగా, ప్రార్థనా మందిరంగా ఉంది.వందలాది విభిన్న దేవాలయాలు, స్మారక చిహ్నాలకు నిలయంగా ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం గుండా నడవడం, రాతితో చెక్కిన పురాతన ఇతిహాసం గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అర కిలోమీటరుకు పైగా విస్తరించి ఉన్న బాస్-రిలీఫ్ గ్యాలరీలు రామాయణం, మహాభారతం, ఖగోళ యుద్ధాలు, ప్రసిద్ధ క్షీర మహాసముద్ర మథనం వంటి దృశ్యాలను వర్ణిస్తాయి. అంగ్కోర్ వాట్ మూడు స్తంభాలు ఖైమర్ వాస్తుశిల్పానికి విలక్షణమైనది. పైగా హిందూ మతంలోని దేవతల నివాసమైన మౌంట్ మేరు సాంప్రదాయ ఆలయ శిఖరాన్ని(పర్వతాన్ని) సూచిస్తాయి. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపించినా..దగ్గర నుంచి చేస్తే ఇప్పటికీ ఈ కట్టడం ఎలా మనగలిగింది అనే సందేహం మెదులుతుంటుంది.(చదవండి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్మాస్టర్ టైటిల్! అసలేంటి గేమ్..) -
అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టు రట్టు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దేవస్థానాన్ని నమ్ముకుని వచ్చే భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ బట్టల అక్రమ వ్యాపారం చేసిన ఘటన భద్రాచలం సీతా రామాలయంలో(Bhadrachalam Sita Ramachandraswamy temple) వెలుగులోకి వచ్చింది. భక్తి ముసుగులో జరుగుతున్న ఈ రహస్య వ్యాపారాన్ని దేవస్థానం అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అక్రమార్కులను నిలువరించారు.సాధారణంగా భక్తులు స్వామివారికి సమర్పించిన వస్త్రాలను తిరిగి కొనుగోలు చేసే విధానం దేవస్థానాలలో ఉంటుంది. అయితే ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ స్వామివారికి సమర్పించిన వస్త్రాలు కాకుండా మార్కెట్లోని దుకాణాల నుంచి కొనుగోలు చేసిన బట్టలను భక్తులకు అమ్మేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ విషయంపై సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు అక్రమంగా నిల్వచేసిన వస్త్రాలను తనిఖీ చేసి అక్కడికక్కడే ఈ అవకతవకలను బయటపెట్టారు. భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచడం దారుణం. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ రావు స్పష్టం చేశారు.జరిగిన ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.ఇదీ చదవండి: బోరబండ కార్పొరేటర్ బాబా సంచలన వ్యాఖ్యలు -
360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత అనేది భక్తుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు కూడా దోహదపడుతోంది. ప్రొఫెషనల్ 360° వర్చువల్ టూర్ల రూపకల్పన సంస్థ ‘P4Panorama’ ఇప్పుడు లక్షలాది అయ్యప్ప భక్తులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 360 డిగ్రీల వర్చువల్ టూర్గా రూపొందించింది. దూరం, అనారోగ్యం లేదా ఇతరత్రా కారణాలతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేని భక్తులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది.ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా దర్శనం!‘P4Panorama’ రూపొందించిన ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ శబరిమల ఆలయాన్ని ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా చూసేందుకు అవకాశం కల్పించింది. ఇమ్మర్సివ్ వర్చువల్ రియాలిటీ (వీఆర్)ద్వారా భక్తులు అత్యంత పవిత్రమైన పదునెట్టాంబడి (18 పవిత్ర మెట్లు)ని, దేవస్థానాన్ని , పరిసరాలను ప్రత్యక్ష అనుభూతితో చూడవచ్చు.వర్చువల్ టూర్లోని ప్రధానాంశాలుఈ 360° టూర్ శబరిమల ఆలయ సంప్రదాయం, అక్కడి వాస్తుశిల్పం, పర్యావరణాన్ని సంపూర్ణంగా దర్శింపజేస్తుంది.స్వర్ణమయ సన్నిధానం: బంగారు పూతతో మెరిసిపోతున్న అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయం (గర్భగుడి)ను దగ్గర నుంచి చూసిన అనుభూతిని పొందవచ్చు.పవిత్ర సోపానం: ఈ టూర్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదునెట్టాంబడి దృశ్యాలు భక్తి భావాన్ని మరింతగా పెంచుతాయి.ధ్వజస్తంభం (కొడిమరం): ఆలయ ప్రాంగణంలోని బంగారు తాపడం చేసిన ధ్వజస్తంభంను వీక్షించవచ్చు.ఉపదేవతల సన్నిధులు: మాలిక్పురతమ్మ వంటి ఉపదేవతల మందిరాలను కూడా దీనిలో జూమ్ చేసి చూడవచ్చు.యాత్రా మార్గాలు: సాంప్రదాయ ట్రెక్కింగ్ దారుల వెంబడి ఉన్న సుందరమైన దృశ్యాలు, ముఖ్యమైన ల్యాండ్మార్క్లు కూడా ఈ టూర్లో ప్రధానంగా కనిపిస్తాయి.సాంకేతికత - ఆధ్యాత్మికత - పర్యావరణంఈ వర్చువల్ టూర్ కేవలం ఒక సాంకేతిక అద్భుతం మాత్రమే కాదు. పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. వర్చువల్ దర్శనాన్ని ఎంచుకోవడం ద్వారా, భక్తులు శబరిమల అటవీ పర్యావరణ వ్యవస్థను ఒక విధంగా కాపాడినవారవుతారు.‘P4Panorama’ ప్రతినిధులు చెప్పినట్లు.. ఈ వర్చువల్ టూర్ అటు ఆధ్యాత్మికత, ఇటు ఆధునిక సాంకేతికతల సామరస్యపూర్వక కలయిక. వీరు అందించిన ఈ టూర్లో కేవలం ఒక క్లిక్తో భక్తులు తమ ఇంటి నుంచే అయ్యప్పను దర్శనం చేసుకోగలుగుతారు. ఈ సంస్థ శబరిమల ఆలయంతో పాటు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, గురునానక్ దర్బార్ తదితర ప్రాంతాలను కూడా 360 డిగ్రీలలో చూపిస్తోంది.👉: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: అయోధ్య: ప్రాణప్రతిష్ఠ నుంచి నేటి ధ్వజారోహణ వరకూ.. -
నాథ్ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్ అంబానీ (ఫొటోలు)
-
భక్తురాలి అత్యుత్సాహం.. హుండీలో డబ్బులన్నీ బూడిద
-
ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్గా వెనక్కి ప్రవహించే నది..
కంబోడియాలోని సీమ్ రీప్ నగరంలో ఉన్న ‘ఆంగ్కోర్ వాట్’ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. అలాగే ఇది ఆగ్నేయాసియా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ఉనికిలో ఉన్న ఖ్మేర్ సామ్రాజ్యపు అద్భుత సృష్టి. ఇది క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో రెండవ సూర్యవర్మ ఆధ్వర్యంలో నిర్మించిన వైష్ణవాలయం. విష్ణువు వెలసిన ఈ ఆలయం తర్వాత బౌద్ధ ఆరామంగా మారింది. దీని నిర్మాణ శైలి హిందూ పురాణాలలోని దేవతల నివాసమైన మేరు పర్వతాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం తదితర పురాణ గాథల దృశ్యాలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. వందలాది మంది అప్సరసల నృత్య భంగిమలు, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఆలయానికి గల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా, దీన్ని 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. నదికి నీరాజనం‘బోన్ ఓమ్ టౌక్’ అనే వేడుక– కంబోడియాలో అత్యంత ఆకర్షణీయమైన ఉత్సవం. ఇది వర్షాకాలం ముగింపును, టోన్లే సాప్ నది ప్రత్యేకతను సూచిస్తుంది. ఈ సంబరాలు మూడురోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాదిలో నవంబర్ 4 నుంచి మొదలై నవంబర్ 6 వరకు కొనసాగుతాయి.‘వర్షాకాలంలో మీకాంగ్ నది ఉప్పొంగడంతో– టోన్లే సాప్ నది దాని సహజ దిశలో ప్రవహించకుండా, వెనక్కి ప్రవహిస్తుంది. ఈ పండుగ సమయంలో, వర్షాకాలం ముగిసిపోవడంతో, ఆ వెనక్కి ప్రవహించే ప్రవాహం ఆగిపోయి, టోన్లే సాప్ నది తిరిగి తన సహజ దిశలో మీకాంగ్ వైపు ప్రవహించడం మొదలవుతుంది. టోన్లే సాప్ నది తిరిగి సహజదిశలో ప్రవహించడాన్ని స్థానికులు ఈ వేడుకతో పండుగ చేసుకుంటారు.ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా రాజభవనం ముందు టోన్లే సాప్ నదిపై సంప్రదాయబద్ధంగా పొడవైన పడవల రేసులు (డ్రాగన్ బోట్ రేసులు) నిలుస్తాయి. ఆ దేశ నలుమూలల నుంచి వందలాది పడవలు పోటీపడతాయి. మూడు రోజులు అందంగా అలంకరించిన, దీపాలతో వెలిగించిన పడవల ఊరేగింపు జరుగుతుంది. ఈ పోటీలే కాకుండా పలు క్రీడా పోటీలు జరుగుతాయి. ఈ సంబరాలు చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తారు. చివరగా పౌర్ణమి రాత్రి చంద్రుడికి ప్రత్యేక వందనాలు తెలుపుతారు. అలాగే అక్ అంబోక్ అనే బియ్యం లేదా అటుకులతో చేసే తీపి వంటకాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఉత్సవం కంబోడియన్ల ఐక్యతకు నిదర్శనం. హిందూ, బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సంప్రదాయంలో, చంద్రుడిని గౌరవించడం ఒక ఆచారం. (చదవండి: వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు కేరట్ల వజ్రంతో..) -
అలసత్వాన్ని కప్పిపుచ్చి ‘ప్రైవేట్ దేవాలయమా’!
సాక్షి, అమరావతి: కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణిస్తే అది ఓ ప్రైవేట్ గుడి అంటూ టీడీపీ కూటమి సర్కారు తన వైఫల్యాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నం చేయడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వినాయక ఉత్సవాల సమయంలో వీధిలో చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పోలీసులు పర్యవేక్షించి అనుమతి ఇస్తారని, అలాంటిది కాశీబుగ్గలో వేల మంది భక్తులు పాల్గొంటున్న కార్యక్రమంతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రులు చెప్పడం ఏమిటి? ప్రైవేట్ ఆలయమని బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యత్యాసం ఉండదు..దేవదాయశాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ గుడి, ప్రైవేట్ గుడి అనే వ్యత్యాసం ఉండదని, ఆయా ఆలయాల పర్యవేక్షణ శాఖ పరిధిలోనే ఉంటుందని పేర్కొంటున్నారు. దేవదాయ శాఖ పరిధిలో 26,968 ఆలయాలు ఉండగా దాదాపు 20 వేల ఆలయాలకు ఈవోలే లేరని చెబుతున్నారు. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే ఏ ఉద్యోగికీ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించదు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ఆదాయం నుంచే చెల్లింపులు చేస్తారు. భక్తులు ఇచ్చే కానుకల నుంచే జీతాలు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేట్, ప్రభుత్వం అనే ప్రస్తావన ఉండదని స్పష్టం చేస్తున్నారు. భద్రత బాధ్యత ప్రభుత్వానిదేదేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలి్సన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటున్నారు. అందుకే ఎంత పెద్ద ఉత్సవం జరిగినా పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులతో ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉందని ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని ఆలయాలతో పాటు దేవదాయ శాఖ పరిధిలో నమోదు కాని ఆలయాలలో సైతం సీసీ కెమేరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తున్నారు. -
కాళ్ల కింద శవాలు.. సంచలన నిజాలు బయటపెట్టిన ప్రత్యక్షసాక్షి
-
కాశీబుగ్గ ఘటనపై మాట్లాడకుండా తప్పించుకుపోయిన పోలీసులు
-
కాశీబుగ్గ తొక్కిసలాట: రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పరిధిలోగల కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై‘ఎక్స్’ పోస్ట్లో ‘ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్…— PMO India (@PMOIndia) November 1, 2025రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ‘వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై స్పందిస్తూ ‘తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మరణించిన భక్తుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కాశీబుగ్గ ఘటన: వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
కాశీబుగ్గలో తొక్కిసలాటపై అచ్చెన్నాయుడుపై బాధితులు ఫైర్
-
Kashibugga Temple: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాటలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది
-
అమలా నవమి ఉత్సవాలు, సాక్షి గోపాల్ టెంపుల్ గురించి తెలుసా?
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లా సాక్షి గోపాల్ పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. పూరీ నుండి 19 కి.మీ దూరంలో ఉన్న సాక్షిగోపాల్ పట్టణంలో ఉంది. ఇక్కడ రాధా కృష్ణులను ఆరాధిస్తారు. మధ్యయుగ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చి బియ్యం బదులుగా దేవతకు గోధుమలు సమర్పిస్తారు.సాక్షి గోపాల్ ఈ పేరు ఎలా వచ్చింది?సఖిగోపాల్ అని పిలువబడే ఒక పేదవాడు గ్రామాధికారి కుమార్తెను ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు.కానీ వారి ఆర్థిక స్థితిలో తేడాను చూసి గ్రామ పెద్ద వీరి ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కొంతకాలానికి గ్రామపెద్ద సఖిగోపాల్తో పాటు, కొంతమంది ప్రజలు తీర్థయాత్ర కోసం కాశీకి వెళ్లారు. అక్కడ గ్రామ పెద్ద అనారోగ్యానికి గురవుతాడు. గ్రామస్తులు ఎవరూ అతనికి సహాయం చేయలేదు. అప్పుడు సఖిగోపాలు మాత్రమే సపర్యలు చేస్తాడు. దీంతో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన మాట మారుస్తాడు. దీనికి సాక్షులని తెమ్మంటాడు. దీంతో స్వయంగా శ్రీకృష్ణుడు సాక్ష్యమిస్తాడు. అలా ఈ ఆలయానికి సాక్షిగోపాల్ అని పేరు వచ్చింది. ఇదీ చదవండి: పంచారామాలలో ప్రథమం అమరలింగేశ్వరాలయంఈ క్షేత్రంలో రాధాదేవీ పాద దర్శనం ప్రముఖ ఉత్సవం. ఏటా కార్తీక మాసం శుక్ల నవమి నాడు ఈ దర్శనం లభిస్తుంది. ఈ ఏడాది శుక్రవారం రాధా పాద దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గోపాల్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దీన్నే అక్షయ నవమి, అమలా నవమిగా పేర్కొంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సాక్షిగోపాల్ పట్టణం ఉత్సవ సన్నాహాలతో కళకళలాడుతోంది. ఈ ప్రత్యేక రోజున, భక్తులకు రాధారాణి దేవి పాదాలను చూసే అరుదైన అవకాశం లభిస్తుంది. ఏడాది పొడవునా దేవీ పాదాల దర్శనం లభించదు. ఈ దివ్య దృశ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. రాధా పాద దర్శనం మోక్షం ప్రసాదిస్తుందని భక్తుల నమమ్మకం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రాచీన సంప్రదాయానికి అనుగుణంగా రాధా పాద దర్శనం ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాధారాణి దేవత అద్భుతమైన ఒడియా ఇంటి ఆడపడుచు (ఒడియాణి) అలంకరణలో, సాక్షి గోపాలుడు నటవర్ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ఉదయం 5 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. సంప్రదాయ ఆచార వ్యవహారాలతో పూజాదులు నిర్వహించి భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భారీ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికార యంత్రాంగం విçస్తత ఏర్పాట్లు చేస్తుంది. గట్టి భద్రత రాధా పాద దర్శనం కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో సాక్షి గోపాలు పట్టణ వ్యాప్తంగా భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. వరుస క్రమంలో భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాల రవాణా క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షల పైబడి భక్తులు రాధా పాద దర్శనం కోసం తరలి వస్తారని నిర్వహణ యంత్రాంగం అంచనా. తదనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పూరీ జిల్లా మేజి్రస్టేటు , పోలీసు సూపరింటెండెంట్ తదితర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సాక్షిగోపాల క్షేత్రం సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. దర్శనం పురస్కరించుకుని 11 వరుసల బారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు పంచసఖ బహిరంగ స్థలం, పరిసర ప్రాంతాలలో సువిశాల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ శాఖ ఈఈ
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ శాఖ ఈఈ రామారావు ఏసీబీ వలకు చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూ. 1.90 లక్షలు లంచం తీసుకుంటూ ఈఈ అడ్డంగా దొరికిపోయారు. ఓ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ అప్పగించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన రామారావు.. లంచం ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ను రామారావు ఇబ్బందులకు గురిచేశాడు.ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గతంలోనూ రామారావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉండగా.. ఇరవై ఏళ్లుగా యాదగిరి గుట్ట ఆలయంలోనే తిష్ట వేశారు. బదిలీ చేసినా కానీ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి యాదగిరిగుట్ట దేవస్థాన పరిధిలోనే పోస్టింగ్ ఇప్పించుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణ సమయంలో రామారావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా.. గతంలో రామారావు అవినీతిపై ఫిర్యాదులు రాగా.. చిక్కకుండా పకడ్బందీగా తప్పించుకున్నారు. తాజాగా రూ.1.90 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. -
ఆలయాల రక్షణకు ‘టెండర్’
సాక్షి, అమరావతి: ఏ కాంట్రాక్టు అయినా కావాల్సినవాళ్లకు ఇవ్వాలనో, తమను కనిపెట్టుకునేవాళ్లకు ఇవ్వాలనో చూసే కూటమి ప్రభుత్వ పెద్దలు దేవదాయశాఖపైనా కన్నేశారు. ఇందుకోసం నిబంధనలను కూడా మార్చేస్తున్నారు. అనుకూలంగా లేదంటే టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలుస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో సెక్యూరిటీ ఉద్యోగుల నియామకానికి ఉమ్మడిగా పిలిచిన టెండర్లే దీనికి ఉదాహరణ.సింహాచలం, అన్నవరం, ద్వారక తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం ఆలయాల్లో మొత్తం 1,072 మంది సెక్యూరిటీ గార్డులు, 30 మంది సెక్యూరిటీ సూపర్వైజర్లు, 12 మంది సెక్యూరిటీ ఆఫీసర్లు, ఆరుగురు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువుతో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈ సెక్యూరిటీ ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.2.5 కోట్లను వేతనాల రూపంలో ఆయా ఆలయాలు చెల్లిస్తాయి.వీరిని సమకూర్చే కాంట్రాక్టరుకు ప్రతి నెలా దీన్లో కమీషన్ లభిస్తుంది. ఈ కమీషన్ను తక్కువగా కోట్ చేసినవారికి ఈ కాంట్రాక్టు ఇస్తారు. ఈ ఉద్యోగాల నియామకానికి జూన్లో టెండర్లు పిలిచారు. నలుగురు టెండర్లు దాఖలు చేశారు. ఈ ఆలయాల్లో ఒకదానికి ఇప్పటివరకు సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టరు దాఖలు చేసిన బిడ్ అనర్హమైనదని అధికారులు తిరస్కరించారు. మిగిలిన ముగ్గురిలో నెలకు రూ.23 లక్షల కమీషన్ ఇవ్వాలని దాఖలు చేసిన టెండరును ఎల్–1గా నిర్ధారించారు. తిరస్కరణకు గురైన బిడ్ను దాఖలు చేసిన కాంట్రాక్టరు హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాల మేరకు అతడి బిడ్ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆ బిడ్ ఓపెన్ చేస్తే ఆ కాంట్రాక్టరు ఎల్–1 అవుతారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు తనకే ఇవ్వాలని తొలుత ఎల్–1గా వచ్చిన బిడ్ దాఖలు చేసిన వ్యక్తి మంత్రి ద్వారా, కోర్టుకు వెళ్లిన వ్యక్తి సీఎంవోలోని ఒక అధికారి ద్వారా పైరవీలు మొదలుపెట్టారు. రెండువైపులా ఒత్తిడితో దేవదాయశాఖ అధికారులు ఆ టెండర్లను సెపె్టంబర్లో రద్దుచేసి, మళ్లీ టెండర్లు పిలిచారు. గతంలో విడివిడిగా.. ఇప్పుడు ఉమ్మడిగా.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కోట్ల రూపాయల పనులు అప్పగించేందుకు దేవదాయశాఖలో ఇష్టానుసారం టెండరు నిబంధనలు మార్చేస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయం అవసరాన్ని బట్టి పారిశుద్ధ్య పనులకు, రక్షణ విధులకు ఎక్కడికక్కడే టెండర్లు పిలిచేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పనులకు ఏడు ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు పిలిచారు. ఈ ఏడు ఆలయాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు పిలిచిన టెండర్లను కూడా ఒకసారి రద్దుచేశారు.ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారికి ఆ పనులు అప్పగించేందుకు మొదట పిలిచిన టెండర్లను రద్దుచేసి, నిబంధనలు మార్చి ఈ ఏడాది జూన్లో రెండోసారి టెండర్లు పిలిచారు. దాదాపు రూ.వందకోట్ల విలువ ఉండే ఆ టెండరు చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువుగా పేర్కొన్న వ్యక్తికి సంబంధించిన సంస్థకే దక్కడం గమనార్హం. -
పుణ్యభారతాన ఆదివైద్యుడి ఆలయాల గురించి తెలుసా?
శ్రీ మహావిష్ణువు అవతారంగా, దేవతలకు వైద్యుడుగా, ఆయుర్వేద వైద్యానికి ఆది వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన ధన్వంతరి క్షీర సాగర మథన సమయాన ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. చతుర్భుజుడైన ధన్వంతరి నాలుగు చేతులలో శంఖం, చక్రం, జలౌకం (జలగ) అమృత తుల్యమైన పునరుజ్జీవన తేనె భాండం దర్శనమిస్తాయి.ధన్వంతరిని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజిస్తున్నప్పటికీ, ధన్వంతరికి అంకితం చేయబడిన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువ. ఆ ఉన్న కొద్ది ఆలయాలు కూడా దక్షిణ భారతదేశంలోనే దర్శనమిస్తాయి ఉత్తర భారతాన న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఒక విగ్రహం, హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో మరొక విగ్రహం తప్ప ఉత్తర భారతాన ధన్వంతరికి ఆలయాలంటూ అసలేం లేవనే చెప్పాల్సి ఉంటుంది.రంగనాథస్వామి ఆలయం వద్ద ధన్వంతరి ఆలయంతమిళనాడులో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. శ్రీ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో 12వ శతాబ్దానికి చెందిన పురాతన మందిరం ఉంది. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. ఆరోగ్యాభిలాషులైన భక్తులకు ‘ప్రసాదం’గా మూలికలను అందిస్తారు.కోయంబత్తూరు శ్రీ ధన్వంతరి ఆలయంకోయంబత్తూరులోని శ్రీ ధన్వంతరి ఆలయం తమిళనాడులోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. కోయంబత్తూరు నగర నడిబొడ్డున ఆర్య వైద్య చికిత్సాలయం, పరిశోధనా సంస్థలో ఉన్న శ్రీ ధన్వంతరి మందిరం, జీవానికి, వైద్యానికి దేవుడు, ధన్వంతరిని ప్రధాన దేవతగా ప్రతిష్టించింది.నెల్లువాయ భగవాన్ ధన్వంతరి ఆలయంగురువాయూర్, త్రిసూర్ నుండి 20 కి.మీ దూరంలో ఉన్న నెల్లువాయ వద్ద ఉన్న లార్డ్ ధన్వంతరి ఆలయం కేరళలోని ముఖ్యమైన ధన్వంతరి ఆలయాలలో ఒకటి. ఆయుర్వేద వైద్యులు వైద్యం ్ర΄ారంభించే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదంగా భావిస్తారు.మలప్పురంలో రుద్ర ధన్వంతరి ఆలయంమలప్పురంలోని పులమంథోల్ మధ్యలో ఉన్న శ్రీ రుద్ర ధన్వంతరి ఆలయం కేరళలోని మరొక ప్రసిద్ధ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయం ప్రసిద్ధ అష్టవైద్య పులమంథోల్ మూస్ కుటుంబానికి చెందినది, అయితే అన్ని వర్ణాలకు చెందిన హిందువులు ఆలయంలో పూజలు చేసుకోవడానికి అనుమతి ఉంది.శ్రీ ధన్వంతరి ఆలయం, పెరింగవుకేరళలోని త్రిస్సూర్ పట్టణ శివార్లలో ఉన్న మరొక పురాతన ధన్వంతరి ఆలయం పెరింగావులోని శ్రీ ధన్వంతరి ఆలయం. ఈ ఆలయ గర్భగుడి రెండు అంతస్తులతో గుండ్రని ఆకారంలో నిర్మించబడింది, ఇది ఇతర కేరళ శైలి నిర్మాణ శైలికి భిన్నంగా అరుదైన డిజైన్. గణపతి, లక్ష్మీదేవి, అయ్యప్పన్ ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన ఇతర దేవతలు.వడక్కంచెరి ధన్వంతరి ఆలయంవడక్కంచెరి ఆయుర్వేద ప్రభువుకు అంకితం చేయబడిన మరొక ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం కేరళలోని త్రిస్సూర్కు ఉత్తరాన 18 కి.మీ దూరంలో వడక్కంచెరి నుండి 8 కి.మీ దూరంలో కున్నంకుళం – వడక్కంచెరి రహదారిపై ఉంది. (అక్టోబర్ 18, శనివారం ధన్వంతరి జయంతి) -
హైకోర్టు ఉత్తర్వులకన్నా.. ఎమ్మెల్యే ఆదేశాలే మిన్న!
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆగ్రహం, ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారన్న విషయం పలు దఫాలు స్పష్టమవుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో పేరుగాంచిన శ్రీసిద్ధి భైరవేశ్వరస్వామి ఆలయం ఇందుకు తాజా ఉదాహరణ. గత మూడు దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కమిటీ పగ్గాలను కూటమి నేతలు బలవంతంగా లాక్కున్నారు. గుడి తాళాలు, హుండీలు పగలగొట్టారు.ఈ ఘటనపై వాస్తవ కమిటీ ప్రెసిడెంట్ శ్రీరంగారెడ్డి ఈ ఏడాది జూన్ 19న ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైపెచ్చు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ శ్రీరంగారెడ్డినే వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై శ్రీరంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాచర్ల పోలీసులను ఆదేశించింది. అయినా రాచర్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైకోర్టు ఆదేశాల కన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే పోలీసులు విలువిస్తున్నారు. కోర్టు ధిక్కార పిటిషన్ల దాఖలు వరకూ పరిస్థితి.. దేవస్థానం వ్యవహారాల్లో జోక్యం వద్దని హైకోర్టు ఆదేశించినా వాటిని అమలు చేయకపోవడంతో, శ్రీరంగారెడ్డి రాచర్ల ఏఎస్ఐ వై. ఆదిశేషయ్యపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏఎస్ఐకు నోటీసులు జారీ అయ్యాయి. అలాగే, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంగా, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు, డీఎస్పీ డాక్టర్ యు. నాగరాజు, రాచర్ల ఎస్హెచ్వో పి. కోటేశ్వరరావులపై మరో ధిక్కార పిటిషన్ కూడా ఆయన దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ చేపట్టే వీలుంది. మరో కుట్రకు శ్రీకారం కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వస్తున్న తరుణంలోనే శ్రీరంగారెడ్డి, ఆయన సోదరుడు నెమిలిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ రాచర్ల పోలీసులు తాజాగా కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దేవస్థానానికి సంబంధించిన ఆభరణాలను తీసుకున్నారన్నది ఈ కేసు సారాంశం. -
నృత్యార్చనం
దేశవ్యాప్తంగా ఆలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ టెంపుల్ డ్యాన్సర్గా పేరుతెచ్చుకుంది విజయవాడవాసి కూచిపూడి నృత్యకారిణి కావ్య కంచర్ల. దసరా నవరాత్రుల సందర్భంగా తన విద్యార్థులతో కలిసి అమ్మవారి రూ పాలను వివిధ ఆలయాలలో నృత్యరూపకాలుగా ప్రదర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగే కేరళ తరంగ్లో పాల్గొని విజేతగా నిలిచారు. గిన్నిస్బుక్ రికార్డ్లోనూ చోటు సం పాదించారు. నృత్యం ద్వారా తమ శక్తిని ఎలా ప్రదర్శిస్తారో ఈ సందర్భంగా వివరించారు.‘‘దసరా నవరాత్రులలో అంతటా అమ్మవారే కనిపిస్తుంటారు. ఇక విజయవాడలోనే కొలువైన అమ్మవారికి చేరువలో ఉంటూ నృత్యం ద్వారా సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఉన్న వివిధ ఆలయాలకు ముందుగానే అప్లికేషన్స్ ఇచ్చాం. వారు ఇచ్చిన టైమ్ ప్రకారం నృత్యం ప్రదర్శనలు ఇస్తున్నాం. అలసట తెలియదునవరాత్రుల మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆరు ప్రదర్శనలు ఇచ్చాం. అమ్మవారి మీద ఎన్నో గీతాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో గీతాన్ని ఒక్కో ఆలయంలో మాకు ఇచ్చిన సమయం వరకు ప్రదర్శన ఇస్తున్నాం. పూర్తయ్యాక పెద్ద వయసున్నవారు కూడా ఏమాత్రం సంకోచించకుండా మమ్మల్ని కలిసి ‘ఆ అమ్మవారే నృత్యం చేస్తున్నారా అనే భావన కలిగింది’ అని చెప్పినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఒక తొంభై ఏళ్ల బామ్మగారు ప్రదర్శన పూర్తయ్యాక వచ్చి తన చిన్నప్పుడు నేర్చుకున్న ఆలాపన ఇప్పుడు గుర్తుకు వచ్చిందని భావయుక్తంగా పాడి వినిపించారు. ‘ఆ అమ్మవారు ఈ రూపంలో నాకు కనిపించారు’ అని పొంగిపోయారు. ఇలాంటి ఎన్నో అనుభూతులను ప్రతిసారీ మేం పొందుతుంటాం. మా దగ్గర నృత్యం నేర్చుకునే విద్యార్థులు కూడా ‘అమ్మవారి నృత్యంలో అలసట ఎందుకు రాదు’ అని అడుగుతుంటారు. నృత్యం ఒక యాక్టివిటీ కాదు దైవికంగా ఎంత దగ్గరవుతుంటామో ఈ నృత్యం మాకు స్పష్టం చేస్తుంటుంది. విజయవాడ అంటేనే అమ్మవారు. దసరానవరాత్రుల్లో ఆలయాల్లో మేం నృత్యం చేయడం అంటే అమ్మకు దగ్గరగా ఉన్నట్టే. ఒక భక్తి పూర్వక ప్రార్థన. మా నృత్యాన్ని అమ్మ చూస్తుంది అనే భావనతోనే చేస్తాం. ‘ఎంతసేపు నృత్యం చేసినా అలసటగా ఎందుకు అనిపించడం లేదు?’ అని మా విద్యార్థులు అడుగుతుంటారు. ఆధ్యాత్మికంగా అమ్మవారికి దగ్గరగా ఉంటే మరేమీ తెలియదు. అమ్మవారి ప్రతి రూపం మనకు ప్రేరణ ఇచ్చే పాఠమే. మన జీవన విధానానికి ఎంతగానో తోడ్పడేదే. ఆ శక్తిని మేం నృత్యం ద్వారా ప్రదర్శించడమే కాదు మేమూ పొందుతుంటాం. సేవ చేస్తున్న కొద్దీ శక్తి పెరిగేదే. శ్రీశైలం, తిరుపతి, శిరిడీ, మహానంది, భద్రాచలం, హరిద్వార్, కేదార్నాద్, బదిరీనాద్... ఇలా మనదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. వందల, వేల మంది ముందు ప్రదర్శనలు ఇస్తుంటాం కాబట్టి ధైర్యం పెరుగుతుంది. మధురమైన మాటతీరు, ఏకాగ్రత.. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలు పెరుగుతాయి. రోజూ సాధన చేయడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆనందం కలుగుతుంది. వీటన్నింటి వల్ల జీవనశైలి కూడా బాగుంటుంది.బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ, నృత్యంలో డిప్లొమా చేశాను. మా అమ్మ మాధవికి కూచిపూడి నృత్యం అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల వయసు నుంచి నాకు నృత్యం నేర్పించారు. ఐదేళ్ల వయసు నుంచి ప్రదర్శనలు ఇస్తున్నాను. అకాడమీ పెట్టి, నృత్యసేవను కొనసాగిస్తూ ఉండాలని మా నాన్న కల. నాన్న వెంకట రత్నకుమార్ కరోనాలో మాకు దూరమయ్యారు. నాన్న కలను నెరవేర్చడానికి ‘పంచమవేద’ అకాడమీ ద్వారా కృషి చేస్తున్నాను. జాతీయ స్థాయి నృత్య పోటీ అయిన కేరళ తరంగ్లో పాల్గొన్ని విజేతగా నిలిచాను. ఇప్పటి వరకు 1500 కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. గ్రూప్గా చేసిన శతనృత్య యాగంలో పాల్గొనే అవకాశం రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కింది. ఎంతో సాధన చేస్తూ శక్తిని పెంచుకోవడానికే ఈ నృత్య సేవ చేస్తున్నాను’ అని వివరించారు ఈ నృత్యకారిణి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నాలుగు గంటల గిరి ప్రదక్షిణ.. అరుణాచలంలో యాంకర్ శ్రీముఖి (ఫోటోలు)
-
ఘోర విషాదం: తెగిపడిన రోప్వే.. ఆరుగురు మృతి
పంచమహల్: గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్వే కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆరుగురు మృతిచెందారు. ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ కొండపైకి రోప్వేలో నిర్మాణ సామగ్రి తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కార్గో రోప్వే ట్రాలీ, కొండపైకి నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్న క్రమంలో నాలుగో టవర్ నుండి కేబుల్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, ఇద్దరు కశ్మీర్, ఒకరు రాజస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను తీసుకెళ్లే ప్యాసింజర్ రోప్వే మూసివేశామని.. అయితే నిర్మాణ పనుల కోసం గూడ్స్ రోప్వే మాత్రం వినియోగంలో ఉందని పోలీసులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం, జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ట్రాలీ దాని సామర్థ్యానికి మించి సామాగ్రిని తీసుకెళ్ళిందా?, సాధారణ తనిఖీలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 1986లో ఈ రోప్వేను నిర్మించారు. -
‘మమ్మల్ని క్షమించు దేవుడా’.. దోచేసిన సొమ్ముతో పాటు లేఖను వదిలేసిన దొంగలు
సాక్షి,అనంతపురం: దొంగలు దేవుడికి భయపడ్డారు. తప్పైపోయింది. మమ్మల్ని క్షమించు దేవుడా అంటూ దోచేసిన సొమ్ముతో పాటు ఓ లేఖను విడుదల చేశారు. నెలరోజుల క్రితం ప్రముఖ బుక్కరాయసముద్రం శ్రీ శ్రీ ముసలమ్మ పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ జరిగింది. ఈ క్రమంలో దోచేసిన నగదును మళ్లీ ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు. అందుకు గల కారణాల్ని వివరిస్తూ డబ్బుతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.‘దొంగతనం చేసిన నాటి నుంచి ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగా లేదు. తప్పు తెలుసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నాం. కొడుకు హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బును వాడుకున్నాం. క్షమించండి’ అంటూ ఆ లెటర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగిలించిన సొమ్ము రూ.లక్షా 86 వేలుగా ఆలయ అధికారులు లెక్కతేల్చారు. హుండీని చోరీ చేసింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్రఇక దొంగతనం జరిగిన ముసలమ్మ దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉండటంతో చర్చకు దారితీసింది. ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
Delhi: ప్రసాద వితరణలో వివాదం.. ఆలయ సేవకుడి హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కల్కాజీ ఆలయంలో ఘోరం జరిగింది. ఆలయంలో ప్రసాద వితరణ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, ఆలయ సేవకుని హత్యకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసులు తెలిపిన ప్రకారం శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కల్కాజీ ఆలయంలో చోటుచేసుకున్నఘర్షణ గురించి పోలీసులకు ఫోన్ వచ్చింది. కొందరు భక్తులు ప్రసాదం కోసం డిమాండ్ చేసిన సందర్భంగా వివాదం చెలరేగింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపధ్యంలో కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ, కర్రలతో ఆలయ సేవకునిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో ఆలయ సేవకుడు అపస్మారక స్థితిలో పడి ఉండటం, ఇద్దరు వ్యక్తులు అతనిని కర్రలతో కొట్టడం కనిపిస్తోంది. Tragic incident at #Delhi's Kalkaji Temple: Sevadar Yogesh Singh beaten to death over "chunni prasad" dispute. CCTV footage captures mob violence, highlighting no fear of police in the city. Authorities investigating, public safety concerns rise. #KalkajiTemple #DelhiCrime pic.twitter.com/C1j33Uejvu— Thepagetoday (@thepagetody) August 30, 2025ఆలయ సేవకుడిని ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్కు చెందిన యోగేంద్ర సింగ్ (35) గా పోలీసులు గుర్తించారు. అతను గత 15 ఏళ్లుగా ఆలయంలో సేవ చేస్తున్నాడు. దాడి అనంతరం బాధితుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. స్థానికులు ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరైన అతుల్ పాండే (30)ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. -
టాలీవుడ్ దర్శకులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య దంపతులు (ఫోటోలు)
-
శబరిమలైలో పెద్దిరెడ్డి విజువల్స్
-
20 అడుగుల కాలువలోకి వైష్ణోదేవి బస్సు.. ఒకరు మృతి
సాంబా (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లాలోని జాత్వాల్ ప్రాంతంలో ఈరోజు(గురువారం )ఉదయం మాతా వైష్ణోదేవి క్షేత్రానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 20 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ నుండి కాట్రాలోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి వెళుతున్న ఈ బస్సులో నుండి 70 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు. కాలువలోని బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు అత్యవసర సేవల విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సాంబా జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయ్పూర్ ఎయిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదం దరిమిలా ఈ మార్గంలోని ట్రాఫిక్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
అభీష్ట... ఐశ్వర్య ప్రదాయిని కోట సత్తెమ్మ: సంతాన వృక్షానికి ఆదరణ
శంఖ చక్రగద అభయ హస్తయజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలిసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్ధం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు΄ాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల పాలిట కొంగు బంగారం కోట సత్తెమ్మ అమ్మవారు విరజిల్లుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి దేవస్ధానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కనుమరుగై, 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో వ్యవసాయ పనుల కోసం పొలం దున్నుతుండగా అమ్మవారి విగ్రహం బయటపడింది. భూమి యజమాని రామమూర్తి శాస్త్రికి వచ్చిన కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచారు. ఈ ఆలయానికి ఎక్కువగా ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతో పాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్ధానం ఆధ్వర్యంలో మహిళలలకు ఉచితంగా పసు పు, కుంకుమ, గాజులు, తమల΄ాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.సంతాన లక్ష్మీ చెట్టుకు ఊయలు కడుతున్న మహిళా భక్తులు సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడిశ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సాంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, రెండు పూర్తిగా పండిన అరటి పండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును ఎర్రవస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అంటూ వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి పేరుపెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు నగదు, నాణేల రూపంలో, పటిక బెల్లం కాని తూకం సమర్పించుకుని, మొక్కుబడి తీర్చుకుంటారు.చురుగ్గా సాగుతున్న 9 అంతస్ధుల రాజగోపురం నిర్మాణం ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుఆలయానికి వచ్చే మార్గం...అమ్మవారి ఆలయానికి నిడదవోలు రైల్వేస్టేషన్ నుండి బస్టాండ్ మీదుగా గణపతిసెంటర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలో మీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ముందుగా నిడదవోలు పట్టణం చేరుకోవాలి. అక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చును. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
ప్రకృతిలో మమేకమై.. మెగా డాటర్ అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ (ఫొటోలు)
-
తిరుమల దర్శనం చేసుకున్న నిర్మాత సురేశ్ బాబు (ఫొటోలు)
-
బిక్షాటన చేస్తూ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం
కృష్ణా: ఓ మహిళా యాచకురాలు బిక్షాటన చేస్తూ ఏకంగా రూ.1.83 లక్షలు పోగు చేసింది. ఆ మొత్తాన్ని ఓ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన వృద్ధురాలు రంగమ్మ కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చేరుకుంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. తన అవసరాలను తీర్చుకోగా మిగిలిన డబ్బును కొద్ది కొద్దిగా జమ చేస్తూ వచ్చింది. ఇలా కొన్నేళ్లపాటు జమ చేయగా.. మొత్తం రూ.1.83 లక్షలు అయ్యింది. ఈ మొత్తాన్ని రాయచూర్ జిల్లాలోని బిజనగేరి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి దేవుడిపై తన భక్తిని చాటుకుంది. రూ.కోట్లు సంపాయిస్తున్న వారు సైతం రూ.వెయ్యి విరాళం ఇచ్చేందుకు వెనకాడే ఈ రోజుల్లో ఏళ్ల తరబడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని రూ.లక్షలు జమ చేసి ఆలయానికి విరాళంగా ఇవ్వడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు రంగమ్మ పెద్ద మనస్సును కొనియాడుతున్నారు. -
నమ్మినోల్లకు నమ్మినంత
అదొక పల్లెటూరు. ఊరి వెనుక ఒక పెద్ద గుట్ట ఉంది. ఊర్లోని ఒక భక్తుడికి ఆ గుట్టపైన గుడి కట్టాలనిపించింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గుడి నిర్మాణం పూర్తి చేశాడు.గుడి పక్కనే ఒక చిన్న పెంకుటిల్లు కట్టుకుని తల్లితో పాటు అక్కడే నివాసం ఉండే వాడు. గుడి, ఊరికి దూరంగా ఉండటంతోను, కష్టపడి గుట్ట ఎక్కాల్సి రావడంతోనూ గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు.ఆ భక్తుడిలో బాధ, భయం మొదలయ్యాయి. కొండంత భారం మోయలేకపోతున్నానని తల్లితో చెప్పుకుని ఏడ్చాడు. అతడి బాధ చూసి ఆమె ‘కష్టాలు కలకాలం కాపురముండవు. మనకూ మంచి రోజులు వస్తాయి. నమ్మినవాళ్ళని భగవంతుడు ఎన్నటికీ విడిచి పెట్టడు’ అని ధైర్యం చెప్పేది.పైకి గంభీరంగా ఉన్నా ఆమెలో కూడా బాధ లేకపోలేదు. హారతిపళ్ళెంలో పడే పైసలు చమురు ఖర్చులకే రావడం లేదని లోలోపలే ఆందోళన చెందేది. ‘అయినా ఇది దైవసేవ. దేవుడే మనకు దారి చూపుతాడు’ అని గట్టిగా నమ్మేది.ఒకరోజు ఆమె గుడిపూజ సామానులు శుభ్రంగా కడిగి ఎత్తి పెడుతున్న సమయంలో హారతి పళ్ళెం గుట్ట బండరాయి మీద పడింది. పళ్ళెం పడిన చోట ఒక వీనుల విందైన రాగం ఆమెకు వినిపించింది. ‘ఇంతలో అయ్యో... పళ్ళెం సొట్టబోయిందే..’ అని బాధపడుతూ వచ్చాడు కొడుకు. కానీ ఆమె అలాగే బండరాయి మీద కూర్చుని చిన్న రాయి తీసుకుని కొట్టసాగింది. ఉన్న పళ్ళెం సొట్టపోయిందని బాధపడుతూ ఉంటే నువ్వేమి చేస్తున్నావని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వింది. గుడి చుట్టూ ఉన్న బండరాళ్ళను రాతితో కొట్టి చూడసాగింది. తల్లి చేష్టలను వింతగా చూడసాగాడు కొడుకు. ఆమె గట్టిగా ‘‘మన కష్టాలు తీరిపోయాయి. గుడి పోషణ ఇక సులభం’’ అని చెప్పింది. ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరికి వెళ్ళి ‘ఎలా?’’ అని అడిగాడు. ‘‘ఈ బండ రాళ్ళను కొట్టి చూస్తే, సరిగమపదనిసలు పలుకుతున్నాయి. వెంటనే శిల్పకళ గురువు స్థపతిని పిలిపించు. సప్తస్వరాల్లోని ఒక్కో రాగం పలికే బండను ఎంపిక చేసి వరుసగా పెట్టించాలి. ఆ రాగాలను పలికించడానికి ఒక రాయిని అందుబాటులో ఉంచాలి. వచ్చిన భక్తులు ఆసక్తిగా వీటిని కొట్టి సంతోష పడతారు’’ అని చెప్పింది. మారుమాట్లాడకుండా తల్లి చెప్పినట్లే చేశాడు.ఆ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టూ ఉన్న గ్రామాలకు చేరింది. మొదట పిల్లలు, ఆ తర్వాత యువకులు, చిన్నగా ఊరిజనం, చుట్టుపక్కల గ్రామస్తులూ గుట్ట ఎక్కడం ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకుని సరిగమలు పలికిస్తూ సంతోషపడసాగారు. గుడి ఆదాయం చిన్నచిన్నగా పెరగసాగింది. తల్లీకొడుకు దేవుడికి నమస్కరిస్తూ ‘నమ్మినోల్లకు నమ్మినంత’ అనుకున్నారు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
అరుణాచలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
ఆలయంలో అజిత్ దంపతుల ప్రత్యేక పూజలు.. కాళ్లకు నమస్కరించిన భార్య!
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ప్రకటించారు. ఈ సమయంలో ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా అజిత్ తన భార్య షాలినితో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తన భార్యకు నుదుట తిలకం దిద్దారు. ఆమె కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి భర్త ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఈ వీడియోను అజిత్ భార్య తన షాలిని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. నా హదయాన్ని కరిగించిందంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అజిత్, షాలిని 1999లో అమర్కాలం అనే మూవీ సెట్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరు 2000 సంవత్సరంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత షాలిని సినిమాలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది రెండు హిట్ తన ఖాతాలో వేసుకున్న అజిత్.. మరో మూవీని ఇంకా ప్రకటించలేదు. విరామం దొరికితే చాలు కారు రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు మన స్టార్ హీరో. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) Made for each other ❤️ The cutest duo ever - Thala Ajith & #Shalini Mam 🥰#AjithKumar #ShaliniAjithKumar pic.twitter.com/QqBfYXQjx9— AJITH FANS COMMUNITY (@TFC_mass) August 9, 2025 -
దుర్గం గట్లు.. అభివృద్ధి చేస్తే ఒట్టు
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెం గ్రామ శివారులోని దుర్గం గట్టుపై కాకతీయుల కాలంలో నిర్మించిన పలు కట్టడాలు, శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి. కాకతీయుల చరిత్రను ఇనుమడింపజేసేలా ఉన్న ఈ కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు దుర్గం గట్టుపై పలు చారిత్రక కట్టడాలు, ఆలయాలు నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ గట్టుపై.. క్రీ.శ.1289 – 1323 మధ్య కాలంలో శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయంతో పాటు గట్టు చుట్టూ శత్రుదుర్భేద్యమైన రాతికోట నిర్మించారు. నీటి సౌలభ్యం కోసం గట్టుపై ఆరు బావులు తవ్వి, వాటి లోపల రాతి కట్టడాలు నిర్మించారు. ఆ బావి నీటితోనే కాకతీయులు దుర్గేశ్వర స్వామికి అభిషేకం, అర్చన చేసేవారంటారు. గుట్టపై నిర్మించిన ధ్యాన మందిరాలు నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మందిరాల్లో ఆనాడు కాకతీయ వంశీయులు ధ్యానం చేసేవారని తెలుస్తోంది. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముప్పయ్ సంవత్సరాల క్రితం వరకు కూడా దుర్గం గట్టుపై ఉన్న శివయ్యకు విశేష పూజలు చేసి, దీపధూప నైవేద్యాలు సమరి్పంచేవారు. మహా శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహించేవారు. కాకతీయుల చరిత్రకు తార్కాణంగా నిలిచే, ఈ గట్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.సరైన మార్గం లేక.. దుర్గం గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో.. కాలక్రమేణా ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గిపోగా, నేటితరం వారికి దుర్గం గట్టు అంటే కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలయం, కాకతీయుల చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు గట్టుపై.. గుప్త నిధుల కోసం పలుచోట్ల తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలతో ఆలయంతో పాటు పలు రాతి కట్టడాలు ధ్వంసం కావడంతో.. పది సంవత్సరాల క్రితం మండల వాసులు తాత్కాలికంగా శివయ్యకు ఆలయం నిర్మించారు. అమలుకాని ఎమ్మెల్యే హామీ దుర్గం గట్టుపై ఆలయ పునర్నిర్మాణంతో పాటు కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాల ఆనవాళ్లను మెరుగుపరిచి, గట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని.. ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గత జనవరిలో దుర్గమ్మ గట్టును సందర్శించిన ఎమ్మెల్యే.. గట్టుపై చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే సౌర విద్యుత్ సౌకర్యంతో పాటు, తాగునీటి కోసం బోరు కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా.. అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రవాణా సౌకర్యం లేదు దుర్గమ్మ గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో ఆలయ ప్రాధాన్యం మసకబారిపోతోంది. గట్టు పైకి వెళ్లడానికి సరైన మార్గం ఏర్పాటు చేస్తే, తిరిగి ఆలయానికి సందర్శకులు పెరుగుతారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి, ఆలయ అభివృద్ధికి పూనుకోవాలి. – పాశం ప్రసాద్, గోపాలపురం, దమ్మపేట మండలం చరిత్రను కాపాడుకోవాలి ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులు నిర్మించిన శ్రీ శంకరగిరి దుర్గేశ్వరస్వామి ఆలయ చరిత్ర, విశిష్టతను కాపాడుకోవలసిన అవసరం ఉంది. గట్టుపై ఉన్న ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దేవాదాయ, పర్యాటక శాఖల సహకారంతో దుర్గం గట్టును అభివృద్ధి చేసి, విద్యుత్, రవాణా, తాగు నీటి సౌకర్యాలను కల్పించాలి. – విజయ మారుతి శర్మ, దమ్మపేట -
శ్రావణ మాసం : వరాలమ్మ తల్లి.. వల్లూరమ్మ
తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్థి చెందిన అమ్మవారి ఆలయాలలో ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ ఆలయం ఒకటి. మూడు వందల సంవత్సరాల క్రితం హోమ గుండంనుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామనామంతో వల్లూరమ్మగా వ్యవహరింపబడుతూ భక్తుల పూజలందుకుంటున్నది. ప్రజలను, పశుసంపదను వ్యాధి బాధలనుండి, దుష్టశక్తులనుండి కాపాడే చల్లనితల్లిగా విరాజిలుతోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారులు వంటివారు వల్లూరమ్మను తప్పక దర్శించి పూజలు నిర్వహిస్తారు. నాయకులకు వల్లూరమ్మ ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకురావడం నేటికీ అమలు జరుగుతున్న సంప్రదాయం. వల్లూరమ్మ ఆవిర్భావం వెనుక ఆసక్తిదాయక కథనం ఉంది. 17వ శతాబ్దిలో ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాలను ఒంగోలు రాజులుగా పేరొందిన మందపాటి జమీందారులు పాలించేవారు. రామభద్రరాజు, రామచంద్రరాజు హైదరాబాద్, కర్నాటక నవాబులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించుకున్నారు. వీరిలో రామచంద్రరాజు అమిత ధైర్యశాలిగా, పరాక్రమవంతునిగా పేరొందాడు. ఒంగోలు రాజుల ప్రాబల్యం వెంకటగిరి రాజులకు కంటగింపైంది. చిలికిచిలికి గాలివాన అన్నట్లు కొన్ని విషయాలలో ఉభయుల మధ్య ఏర్పడిన తగాదా చివరకు యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు రాజులు పరాక్రమంలో గొప్పవారు కాగా వెంకటగిరి రాజులు ఆర్థికంగా, సైనికపరంగా బలోపేతులు. యుద్ధంవల్ల జననష్టం, ధన నష్టం జరుగక తప్పదనే భావన కలిగింది. దీనితో వెంకటగిరి రాజులను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జయించాలనే ఆలోచన ఒంగోలు రాజులలో కలిగింది. ఒంగోలు రాజులకు సన్నిహితుడు, దేవీ ఉపాసకుడు, మంత్రతంత్ర శాస్త్రాలలో అపార ప్రావీణ్యం కలిగిన అద్దంకి రామచంద్రయ్య బరూరి నరసింహ యోగీంద్రుల సహకారంతో అగ్నిగుండంనుండి దివ్యశక్తిని ఉద్భవింపచేసి వెంకటగిరి రాజులను జయింవచ్చని సలహా ఇచ్చాడు. అద్దంకి రామచంద్రయ్య యజ్ఞకర్తగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతి గూఢచారులద్వారా తెలుసుకున్న వెంకటగిరి రాజులు ΄ోలూరి వంశజుల సహకారంతో, పరాంకుశవారి తోడ్పాటుతో ఒంగోలు రాజులు తలపెట్టిన హోమానికి విఘాతం కలిగించే మంత్రతంత్ర ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన యజ్ఞకర్తౖయెన బరూరి నరసింహ యోగీంద్రునిపై మంత్రతంత్ర ప్రయోగం చేసారు. దాని ప్రభావంతో ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. యజ్ఞగుండంనుండి అమ్మవారుఆవిర్భవించే సమయం ఆసన్నమైందని, ఆమె ఆవిర్భవించగానే ఆమెకు హారతి ఇచ్చి, బలి సమర్పించి సంప్రీతురాలిని చేయవలసినదిగా చెప్పి ఆయన బహిర్భూమికి వెళ్లారు. జ్వాలలు వెలిగక్కుతూ యజ్ఞగుండంనుండి 12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు బయలువెడలడంతో అది చూసిన అద్దంకి రామచంద్రయ్య చేష్టలుడిగి అమ్మవారికి నివేదన చేయలేదు. దాంతో ఆమె అలిగి ముందుకు సాగింది. ఆమె చూపులు ప్రసరించిన మేర అంతా మంటలు వ్యాపించి కాలి బూడిద అయ్యాయి. ఆందువల్ల ఆమెకు జ్వాలాముఖి అనే పేరు కలిగింది. ఆమె ఈతముక్కల ప్రాంతానికి చేరగానే గ్రామ రైతు రామచంద్రారెడ్డి అమ్మవారిని గమనించి ఆమెకు పాలను సమర్పించి సంతోషపరచాడు. తాను గ్రామాన్ని, ప్రజలను చల్లగా కాపాడుతూ అక్కడనే ఉంటానని పలికి జ్వాలాముఖి ఈతముక్కల గ్రామ పొలిమేరలో వెలసింది.ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!ఉల్కాముఖి ఆవిర్భావం..వెంకటగిరి రాజుల వంచనవల్ల తమ కార్యం విఫలమైందని మందపాటి రాజులు, అద్దంకి రామచంద్రయ్య బాధపడుతుండగా బరూరి నరసింహ యోగీంద్రులు శుచిౖయె యజ్ఞస్థలికి వచ్చి పరిస్థితిని గ్రహించారు. యజ్ఞగుండం నుండి మరో దివ్యశక్తిని ఆవిర్భవింపచేయవచ్చని పలికి యజ్ఞాన్ని కొనసాగించారు. కొంతసేపటికి యజ్ఞగుండంనుండి చిటపటలతో, ఉల్కలను వెదజల్లుతూ ఉల్కాముఖి ఆవిర్భవించింది. ఉల్కాముఖి ఆవిర్భవించ గానే అద్దంకి రామచంద్రయ్య, బరూరి నరసింహ యోగీంద్రులు ఆమెకు నివేదనలు సమర్పించి సంతృప్తిపరిచారు. ప్రజలను ఆపదలనుండి కాపాడవలసినదిగా వారు ఆమెను ప్రార్థించారు. వారి ప్రార్థన మేరకు ముందుకు సాగిన ఉల్కాముఖి వల్లూరు చెరువు కట్ట వద్దకు రాగానే అక్కడ నిలిచి΄ోయింది. తాను అక్కడనే ఉండి ప్రజలను, పశుసంపదను చల్లగా కాపాడుతుంటానని ఆమె వారికి హామీ ఇచ్చింది. ఆ ప్రకారమే ఉల్కాముఖి ప్రజలను దుష్టశక్తులనుండి, వ్యాధి బాధలనుండి కాపాడుతూ చల్లనితల్లిగా పూజలందుకుంటున్నది. యజ్ఞకుండంలో ఉల్కల మధ్యనుండి ఆవిర్భవించినందున ఉల్కాముఖిగా ఆమె పేరొందింది. వల్లూరు గ్రామంలో వెలసినందున వల్లూరమ్మ అనే పేరు ఆమెకు స్థిరమైంది. వల్లూరమ్మ ఆవిర్భావానికి కారణభూతులైన అద్దంకి వారి ఆడపడుచుగా వల్లూరమ్మ ప్రసిద్థి చెందింది. ఆ తర్వాత ్ర΄ాణప్రతిష్ఠ జరిగింది. తరువాతి కాలంలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారు. మరికొద్దికాలం తర్వాత శిథిలావస్థకు చేరి నిరాదరణకు గురైన ఆలయం ఆ తర్వాత జరిగిన శతచండీ యాగం లనంతరం నూతన విగ్రహ ప్రతిష్ఠ, విమాన గోపురం, ముఖ మండపం, ప్రహరీ గోడ, సింహద్వార నిర్మాణం జరిగాయి. ఆలయంలో పరివార దేవతలుగా గంగమ్మ. పొలేరమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయంలో సుందరశిల్పాల ఏర్పాటు : దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంలో అష్టలక్ష్ములతోపాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి, శివ పార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి వంటి పలు దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులనుఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.విశేష కార్యక్రమాలు : వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. వెయ్యిమందికిపైగా మహిళలు పాల్గొంటారు. ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పర్వదినంనాడు అమ్మవారికి గ్రామోత్సవంతోపాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది. వాహన పూజలు : వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాలనుండి కూడా ఎంతోమంది భక్తులు తాము నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలాచేస్తే అమ్మవారి అనుగ్రహంతో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా రక్షిస్తుందని విశ్వాసం. పొంగళ్ల సమర్పణ : ప్రతి ఆదివారం ఆలయంలోని వల్లూరమ్మకు భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. సంతానం లేనివారు, వివాహం కానివారు తమ ఈప్సితాలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆలయం బయట పొర్లుదండాలు పెడతారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రైతులు, వ్యాపారులు కూడా తమ కోరికలు తీర్చాలంటూ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పిస్తారు. ఆదివారం వల్లూరమ్మ ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడుతుంటుంది చేరుకునే మార్గం..వల్లూరమ్మఆలయం విజయవాడ–చెన్నై ప్రధాన జాతీయ రహదారిలో ఉండడంతో రవాణాపరంగా ప్రయాణీకులకు, భక్తులకు అనుకూలమే. ఉంటుంది. పల్లెవెలుగు బస్సులతోపాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)
-
శివాలయంలోనే మద్యం తాగుతూ పూజలు చేస్తున్న ప్రధాన అర్చకుడు
-
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
-
షావోలిన్ గురువుపై చైనా విచారణ
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్ టెంపుల్ అధిపతి షి యోంగ్ జిన్పై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. లంచాలు తీసుకోవడం, పలువురు మహిళలతో అనైతిక సంబంధాలు నెరపడం, అక్రమ సంతానాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలను ఆయనపై మోపిందని టెంపుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాలు దర్యాప్తు చేపట్టాయంది. దాదాపు 1,500 ఏళ్ల చరిత్ర కలిగిన షావోలిన్ టెంపుల్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో ఉంది. ప్రపంచవ్యాప్తంటా ఏటా వేలాదిగా శిష్యులు ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతుంటారు.షి యోంగ్ జిన్ ఈ షావోలిన్ టెంపుల్ అధిపతిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. షావోలిన్ టెంపుల్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సొంతం చేసుకున్న ఈయనకు సీఈవో మాంక్ అనే పేరూ ఉంది. షి హయాంలోనే షావోలిన్ టెంపుల్ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. సన్యాసుల బృందాలు షావోలిన్ కుంగ్ఫూ విన్యాసాల్లో పాల్గొనడం మొదలైంది. ‘షి యోంగ్జిన్ చర్యలు తీవ్రమైనవి, బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి’అని బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఔషధవనంలో అపురూప ఆలయం
వనపర్తి జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలోని చిట్టడవిలో.. ఎత్తయిన కొండ శిఖరంపై భూదేవి, శ్రీదేవి సమేతుడై కొలువుదీరిన తిరుమలనాథస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ప్రాంత ప్రజలు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవి తల్లిని నమ్ముకున్న ముదిరాజ్లు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు. వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు వెళ్లే ప్రధాన రహదారిలో.. 5 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.ఆలయ చరిత్ర శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తయిన కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేల అడుగుల ఎత్తులో విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు (నీటి కొలను) ఉండటం చూశారు. శిఖరాగ్రాన స్వామివారిని ప్రతిష్టించాలని నిర్ణయించుకుని.. ఏకశిలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ట చేసినట్లు చరిత్ర కథనం. ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు. వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయ ధర్మకర్తలుగా, పెద్దగూడెంలోని ఓ ముదిరాజు కుటుంబాన్ని పూజలు చేసేందుకు నియమించారు. నాటి నుంచి నేటివరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.తాటిచెట్టు మెట్ల నుంచి.. మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెబుతారు. 1993 ప్రాంతంలో దాతల సహాయంతో ఇనుప మెట్లను, ఇటీవల కాంక్రీట్ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెంలోని కోదండరామస్వామి ఆలయాలతోపాటు తిరుమలనాథస్వామి ఆలయాల్లో సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ట చేయించి పూజలు చేసేవారని స్థానికులు పేర్కొంటారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హయాంలో తారురోడ్డును నిర్మించారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.ఔషధ మొక్కలకు పుట్టినిల్లు.. తిరుమలనాథస్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు (Medicinal Plants) ఉన్నట్లు గుర్తించారు. ఏటా శ్రావణ మాసంలో పచ్చని చెట్లు, ఎన్నో రకాల ఔషధ మొక్కలతో పాటు.. చేతికి అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం మంతమ్రుగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని, జాతరను తిలకించి.. ప్రకృతిని ఆస్వాదిస్తారు.సుదూర ప్రాంతాల నుంచి.. వనపర్తికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన తిరుమలనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకునేందుకు జిల్లాతోపాటు గద్వాల, మహబూబ్నగర్, కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కర్ణాటక ప్రాంతవాసులు.. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు.తొలి శనివారం.. శ్రావణ మాసంలో వచ్చే తొలి శనివారం తిరుమలనాథస్వామి గుట్టపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి, అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తులతోనే కల్యాణ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి విశేషం.చదవండి: ఈ జలపాతాలకు చూసేందుకు రెండు కళ్లు చాలవు -
Thailand-Cambodia: గుడి కోసం రెండు దేశాల పోరాటం
-
Australia: హిందూ ఆలయ గోడలపై జాత్యహంకార వ్యాఖ్యలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు. -
తెలంగాణ : పేదల తిరుపతి ఆలయం.. ఆ పేరెలా వచ్చిందో తెలుసా?(ఫొటోలు)
-
‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?
-
శ్రీవారి సన్నిధిలో రోజా, పెద్దిరెడ్డి
-
రూ.10 లక్షల ఖర్చు దాటితే.. ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అ«దీనంలోని దేవాలయాల వార్షిక బడ్జెట్కు ఆమోదముద్ర వేసే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాల బడ్జెట్ ప్రతిపాదనలన్నీ కచి్చతంగా ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సిందేనని తాజాగా ఆదేశించింది. ఇక దేవాలయాల్లో రూ.10 లక్షలకు మించి ఖర్చు చేయాల్సిన ప్రతి పనికి ప్రభు త్వ ఆమోదం కూడా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకాలం డిప్యూటీ కమిషనర్లు, రీజినల్ జాయింట్ కమిషనర్లు, కమిషనర్ స్థాయిలో బడ్జెట్లను ఆమోదిస్తున్నా రు. అయితే, కొందరు అధికారులు బడ్జెట్కు ఆమోదముద్ర వేయాలంటే ఆలయ కార్యనిర్వహణాధికారులను కమీషన్ల కోసం వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వారికి డబ్బులివ్వకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను పెండింగులో ఉంచుతున్నారని కొన్ని ప్రధాన దేవాలయాల కార్యనిర్వహణాధికారులు ఆరోపిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు చేస్తే వేధిస్తారన్న భయంతో ఎక్కడా లిఖితపూర్వక ఫిర్యాదులు చేయట్లేదు. దీన్ని ఆసరా చేసుకుని అలాంటి అధికారులు మరింత చెలరేగిపోతున్నారు. అవినీతి అధికారుల వల్ల దేవాదాయశాఖకు చెడ్డపేరు వస్తోంది. ఈ తీరుపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరాలు ఆరాతీసి చర్యలకు ఉపక్రమించారు. శాఖను అప్రదిష్టపాలు చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా పరిగణించారు. వెంటనే తీరు మారాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి రాకుండా ఆలయాల బడ్జెట్లను అధికారులే మంజూరు చేయటం కూడా సరికాదని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈమేరకు తాజాగా దేవాదాయ శాఖ ప్రత్యేక సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆమోదిస్తేనే నిధులు.. ప్రస్తుతం దేవాదాయ శాఖలో 6ఏ, 6బీ, 6 సీలుగా దేవాలయాలను వాటి ఆదాయం ప్రకారం విభజించారు. ఇందులో తక్కువ ఆదాయం ఉన్నవాటిని 6సీలో ఉంచారు. ఆదాయం ఎక్కువ ఉండే దేవాలయాల్లో 6బీ కేటగిరీలోని దేవాలయాల బడ్జెట్లను డిప్యూటీ కమిషనర్లు ఆమోదిస్తున్నారు. 6ఏ కేట గిరీ దేవాలయాల్లో రూ.25 లక్షల వరకు ఉండే బడ్జెట్లను రీజినల్ జాయింట్ కమిషనర్ ఆమోదిస్తున్నారు. అంతకంటే ఎక్కువుండే జాయింట్ కమిషనర్ స్థాయి దేవాలయాల బడ్జెట్లను కమిషనర్ ఆమోదిస్తున్నారు. ఇకపై అన్ని దేవాలయా ల బడ్జెట్లను తొలుత నేరుగా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం ఆమోదిస్తేనే అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసే అంశాలను తిరిగి మార్చాల్సి ఉంటుంది. దీంతో అధికారుల ఇష్టారాజ్యానికి కళ్లెం వేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అలాగే రూ.10 లక్షలను మించి ఖర్చయ్యే ప్రతి పనికి ఇక ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రేమకథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు అమేయా డబ్లీని ఈ లవ్బర్డ్స్ ప్రేమ, ప్రపోజల్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గురించి కొన్ని విషయాలను తాజాగా వివరించారు. ఆనంద్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ కుమారుడు, ఆనంద్ ఇషాకు మహాబలేశ్వరంలో ప్రపోజ్ చేశాడట. ఈ విషయాన్ని అమేయా ఇలా వివరించారు. అజయ్ భాయ్ పిరమల్, స్వాతి జీ పిరమల్ చాలా సంవత్సరాల నుండి తెలుసు. "రేపు మీరు మహాబలేశ్వర్ రావాలి అని రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసారు. కొంతమంది అతిథులు సాయంత్రం మా ఫామ్హౌస్లో ఉంటారు. వారికోసం బ్రీఫ్ 'డాన్సింగ్ అండర్ ది స్టార్స్',అనే థీమ్పై ఒక కచేరీ చేయాలి’ అని అడిగారు. ఉదయం సాఫ్ట్ మ్యూజిక్ ,మధ్యాహ్నం ఎనర్జిటిక్ నంబర్లను ప్లే చేయమన్నారు. మరుసటి రోజు, స్వాతి జీ కూడా కాల్చేశారు. కోకిలా ఆంటీ, ముఖేష్ భాయ్, నీతా భాబీ , మిగతా అందరూ ఇంటికి వస్తున్నారని చెప్పారు. ఇది గుజరాతీ ,మార్వాడీ కుటుంబాల కలయిక కాబట్టి, బాలీవుడ్ కూడా పాటలు కూడా ఉండొచ్చుఘూమర్ లాగా అన్నారు. అన్నట్టు, వాళ్లు బాలీవుడ్ అభిమానులు, షారుఖ్ ఖాన్ వాళ్ల ఫ్యావరెట్ హీరో’’ అని చెప్పారని తెలిపాడు.సింగర్ : అమేయ డబ్లీకానీ ఈ వేడుకు ఆనంద్, ఇషాల ప్రపోజల్గురించి తెలియదనీ, వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని లేదా వివాహం చేసుకోబోతున్నారని చెప్పలేదు. అక్కడికి వెళ్లిన మరుసటి రోజు,ఆనంద్, ఇషా ఒక ఆలయంలో ప్రపోజ్ చేశారని అమేయా గుర్తు చేసుకున్నాడు. చదవండి: సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లుకాగా ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ 2016 నుంచి డేటింగ్లో ఉండి రెండేళ్ల తరువాత 2018లో వివాహం చేసుకున్నారు.ఇషా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె. 2022లో వీరికి కవలలు పుట్టారు. ఆనంద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అయిన పిరమల్ ఎంటర్ప్రైజెస్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఇషా రిలయన్స్ జియో , రిలయన్స్ రిటైల్ డైరెక్టర్గా ఉన్నారు.ఇదీ చదవండి: అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియడ్ని పెళ్లాడింది! -
ఆషాఢం
సాక్షి, భీమవరం: సంస్కృతి, సంప్రదాయాల పుట్టిల్లు తెలుగు నేల. ప్రకృతితో మమేకం చేస్తూ ఇక్కడి ప్రతి నెలకి ఏదోక విశిష్టత ఉంటుంది. అందులోనూ నాలుగో నెలైన ఆషాఢ మాసం మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. వాతావరణాన్ని చల్లబరుస్తూ తొలకరి వర్షాలు, పొంగి ప్రవహించే కాలువలు, వరి నాట్లుతో పచ్చ తివాచీని పరుచుకునే పంట పొలాలు, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక వంటకాలు, ఆచారాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ నెలను ఆషాఢ మాసంగా పిలుస్తారు. మిగిలిన నెలలతో పోలిస్తే శూన్య మాసంగా భావించి శుభకార్యాలు తలపెట్టనప్పటికి దేవతారాధనకు ఇదే సరైన సమయంగా పెద్దలు చెబుతారు. ఆషాఢంలోని తొలి ఏకాదశి రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్లేది. హిందువుల తొల పండుగ కూడా ఇదే. గురు పౌర్ణమి, స్కంధ షష్ఠి తదితర పర్వదినాలు జరుపుకుంటారు. జిల్లాలోని గ్రామ దేవతలకు ఆషాఢం సారెలు, మొక్కుబడులు సమరి్పంచుకోవడం అనాదిగా వస్తోంది. భీమవరం మావూళ్లమ్మ, రాయకుదురు మావూళ్లమ్మ, మహాలక్షి, ఏలూరుపాడులోని ముసలమ్మ, ఎల్లమ్మ, మోగల్లులోని పెన్నేరమ్మ, మారమ్మ, గంగాదేవి అమ్మవార్లు, జిల్లాలో పేరొందిన గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శాఖాంభరిగా, ప్రత్యేక అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనిమిస్తున్నారు. నవ దంపతుల చక్కర్లు కొత్తగా పెళ్లైన జంట ఆషాఢంలో అత్తవారింటి గడప దాటకూడదని సంప్రదాయం. ఈనెల్లో దంపతులు కలిస్తే తొమ్మిది నెలల తర్వాత మండు వేసవిలో కాన్పు వచ్చే అవకాశం ఉంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆ రోజుల్లో ఇది తల్లీబిడ్డకు మంచిది కాదు. తొలకరి జల్లులతో సార్వా పనులు మొదలయ్యేది ఇప్పుడే. కొత్త పెళ్లికొడుకు పొలం పనులకు పోకుండా భార్య కొంగు పట్టుకుని తిరిగితే తిండి గింజలకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది ఒక కారణం. అనుభవ జ్ఞానంతోనే పూరీ్వ కులు ఆషాఢం వేళ కొత్తజంట అత్తింటి గడప దాటకూడదనే ఆచారం తెచ్చారంటారు. అయినా ఇంటిలోని వారికి ఏవో సాకులు చెప్పి నవ దంపతులు చక్కర్లు కొట్టడం, ఏమీ తెలీనట్టుగా అత్తమామలు లోలోపల మురిసిపోవడం ప్రతి ఇంటా జరిగే తంతే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో పార్కులు, పేరుపాలెం బీచ్, ఇతర పర్యాటక కేంద్రాలు కొత్త జంటలతో కళకళతాడుతున్నాయి. గోరింట పూస్తుంది ఆరేళ్ల పాపాయి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు అరచేతులు, కాళ్లకు పారాణిగా గోరింటాకు పెట్టుకునేందుకు ఉత్సాహపడతారు. పల్లెల్లోని అమ్మ మ్మలు, నానమ్మలు గోరింటాకును రుబ్బించి పట్టణాల్లోని తమ కుమార్తెలు, కోడళ్లు, మనవరాళ్లకు పంపిస్తుంటారు. ఈ సీజన్లో గోరింటాకు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ కారణంగా ఉంది. వర్షాల వలన ఇంట్లో పనులు చేసుకునే మహిళల కాళ్లు, చేతులు పగుళ్లు తీస్తుంటాయి. గోరింటాకు పగుళ్లు రాకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబు తున్నారు. ఇలా ఆషాఢ ఆచారాలు ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారకాలుగా ఉన్నాయి. వంటకాలూ ప్రత్యేకమే వర్షాలతో శరీరం చల్ల బడి నజ్జు చేయడం, ప్రతికూల వాతావరణంతో ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటికి నివారణగా తెలగపిండి–మునగాకు, పప్పు–వాగ కాయలు ఈ ఆషాఢ మాసంలో వండుకోవడం జిల్లా అంతటా కనిపిస్తుంది. గ్రామల్లో నివసించే వారు పట్ట ణాల్లోని తమ వాళ్లకు ప్రత్యేకంగా వండి పంపిస్తుంటారు. వీటిలోని పోష కాలు శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆషాఢంలో ఒక్కసారైన ఈ కూరలు తినాలనేది ఆనాదిగా వస్తున్న ఆచారం. ఈ సీజన్లో వచ్చే నేరేడుపండ్లు, తాటికాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అన్నింటా ఆఫర్ల మేళా ఆషాఢం వేళ అన్నింటా ఆఫర్ల మేళానే. జిల్లాలో ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, నూజివీడు తదితర పట్టణాల్లోని క్లాత్, రెడీమేడ్, జ్యూయలరీ, కాస్మోటిక్స్ షోరూంలతో పాటు మండల కేంద్రాల్లోని చిన్న దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఆషాఢం ఆఫర్లు నడుస్తున్నాయి. మహిళల్ని ఆకర్షించి అమ్మకాలు ఆషాఢం సేల్ అంటూ వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అరుదైన కాలం ఆషాఢం ఆషాఢ మాసం అన్ని నెలల్లోనూ అరుదైనది. సూర్యుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. వీటిని తట్టుకునేలా మనుషులు ఆధ్యాతి్మక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాతి్మక కార్యక్రమాలతో వచ్చే మార్పుల ప్రభావం వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. పండితులు చాతుర్మాస దీక్షలు చేపడతారు. ఆధ్యాతి్మకతతో పాటు ఆరోగ్యం పెనవేసుకున్నా మాసం ఆషాఢం. – రామశాస్త్రి, పండితులు, ఆకివీడు -
తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)
-
భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ మలేషియాలోని ఒక భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. ఆశీర్వాదం నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, అనుచితంగా తాకాడని ఆరోపించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ సంఘటన గత నెలలో మలేషియాలోని సెపాంగ్లోని మరియమ్మన్ ఆలయంలో జరిగింది. దీంతో నెట్టింట ఎవరీమె అన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ లిషల్లిని కనారన్ తెలుసుకుందామాం.లిషల్లిని కనారన్ మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేతగా నిలిచింది. ఆమె టీవీ నటి, మోడల్. మలేషియాలోని సెలంగోర్కు చెందిన లిషల్లిని యూనివర్సిటీ తుంకు అబ్దుల్ రెహమాన్ (UTAR)లో ఆర్కిటెక్చర్ విద్యార్థిని. కాలేజీ విద్యార్థినిగా ఉన్నపుడే మిస్ గ్రాండ్ సెలంగోర్ 2020 టైటిల్ గెలుచుకుందిట. ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత, లిషా పేదరికం , పిల్లల విద్య కోసం పనిచేయాలని భావించింది. అలాగే 2023లో విడుదలైన మలేషియా టీవీ సిరీస్ జీయుమ్ నీయుమ్లో కనిపించింది. స్థానిక ప్లాట్ఫామ్ ఆస్ట్రో విన్మీన్లో ప్రసారం అవుతున్న థిగిల్ అనే వెబ్ షోలో కనిపించింది. లిషల్లినికి ఇన్స్టాగ్రామ్లో దాదాపు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారుపూజారిపై ఆమె ఆరోపణలు తన తల్లి ఇండియాలో ఉండటంతో జూన్ 21న సెపాంగ్లోని మరియమ్మన్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని లిషల్లిని చెప్పింది. ఆలయ ఆచారాలు తనకు తెలియకపోవడంతో, తాను పూర్తిగా పూజారిని నమ్మినట్టు పేర్కొంది. "నేను వీటన్నింటికీ కొత్త. ఆచారాల గురించి పెద్దగా తెలియదు తన వేధింపుల పర్వాన్ని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. "ఆ రోజు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆశీర్వాదం కోసం తన ప్రైవేట్ రూంకు పిలిచిన పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం, రక్షణ దారం అంటూ నీటిని తనపై పోశాడని వెల్లడించింది. తనను బట్టలు విప్పమని చెప్పాడని, పైగా తన మంచి కోసమే ఇదంతా చేస్తున్నాఅన్నాడని ఆమె చెప్పింది. అంతేకాదు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించినందుకు పూజారి తనను దూషించాడని కూడా వెల్లడించింది. దీంతో తాను స్తంభించి పోయాననీ, ఏం జరుగుతుందో అర్థం కాలేదని వాపోయింది. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా వెల్లడించింది. మరోవైపు నిందితుడు పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి
లెజెండరీ నటుడు కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో తలుపులమ్మ ఆలయంలో ఆమె అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి.. ప్రభాస్ పేరిట విశేష కుంకుమార్చన పూజ చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. -
ఆలయంలో అబ్బురపరుస్తున్న బామ్మ
చిత్రంలో కనిపిస్తున్న బామ్మ పేరు రాజి.. వయసు సుమారు 80 సంవత్సరాలపైనే ఉంటాయి. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అప్పటినుంచి అదే తన ఇల్లు.. అక్కడే ఉంటోంది.. గుడిలో ప్రసాదం తింటూ అక్కడే గడిపేస్తుంది.. సరిగ్గా నిటారుగా నుంచునే ఓపిక కూడా లేదు.. వయసు పైబడడంతో బామ్మ నడుము ఒంగిపోయింది. కానీ స్వామివారి ఆరగింపు సమయం వచ్చిందంటే చాలు వెంటనే గుడిలో ఏర్పాటు చేసిన 250 కిలోల భారీ గంట వద్దకు వడివడిగా వెళ్లిపోతుంది. 15 నిమిషాల పాటు జరిగే ఆరగింపు తంతు పూర్తయ్యే వరకూ గంట కొడుతూనే ఉంటుంది.. ఒక్క క్షణం కూడా ఆగదు.. ఇలా ప్రతిరోజూ మూడు సార్లు ఆరగింపు సమయాల్లో బామ్మ గంట కొట్టాల్సిందే.గుడికి వచ్చిపోయే వాళ్లంతా బామ్మను చూస్తూ ఈ వయసులో ఈవిడకి ఇంత శక్తి ఎలా వస్తుందని ఆశ్చర్యపోతుంటారు.. తాను ఎవ్వరితోనూ మాట్లాడదు.. ఎలా గంట కొడుతున్నావ్ బామ్మా అని అడిగితే మాత్రం ఆ దేవుడే నాతో ఇలా కొట్టిస్తున్నాడని చెబుతుంది. ఆలయ ప్రధాన అర్చకుడు మురళీధర శర్మ బామ్మ గురించి చెబుతూ ఈ వయసులో కూడా ఆ బామ్మ అలా గంట కొడుతుండటం చూస్తే స్వామివారే ఆమెకు శక్తినిచ్చినట్లు అనిపిస్తుందని, తాను కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనవుతుంటానని, ఇదంతా స్వామివారి దయని అన్నారు. – బంజారాహిల్స్ చదవండి: ఆషాఢ శుక్ల ఏకాదశి బంగారుస్వామి -
ప్రతి మంగళవారం జాతరే!
జగిత్యాల జిల్లా: మంగళవారం వస్తే చాలు.. ఆ ఆలయంలో భక్తుల సందడి ఉంటుంది. ఆ రోజు జరిగే జాతరకు భక్తజనకోటి తరలి వస్తుంది. ఆ విశిష్ట ఆలయం మెట్పల్లి మండలం వెల్లుల గ్రామంలో ఉంది. ఇక్కడి ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి మంగళవారం జరిగే జాతరకు విశేషంగా భక్తులు తరలి వస్తున్నారు. గ్రామ శివారులో రహదారి పక్కనే చెట్టు రూపంలో ఉన్న ఈ ఆలయానికి.. ఇటీవలి కాలంలో భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి మంగళవారం ఇక్కడ జాతర జరగడం విశేషం. ఇక్కడి ఎల్లమ్మకు ఎన్నో మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి వారం జరిగే జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా.. ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సుమారు 300 ఏళ్ల క్రితం.. ఎక్కడైనా ఆలయంలో దేవుడు, దేవత ఉండడం.. భక్తులు పూజిస్తుండటం సహజం. కానీ ఇక్కడ చెట్టునే దైవంగా భావించి పూజలు చేస్తున్నారు. మెట్పల్లి మండలం వెల్లుల గ్రామ శివారులోని ఒక చెట్టు కింద.. సుమారు 300 ఏళ్ల క్రితం ఎల్లమ్మ తల్లి వెలసింది. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం వద్ద ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ప్రతి వారం జరిగే జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ జిల్లాలు, మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్నారు. అమ్మవారికి బెల్లం, పుటా్నలు, కల్లు సమరి్పంచి కోళ్లు, పొట్టేళ్లను బలిస్తున్నారు. కుటుంబ సమేతంగా వంటలు చేసుకొని సహపంక్తి భోజనం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే జనాలతో ఈ ప్రాంతమంతా ప్రతి మంగళవారం సందడిగా మారుతుంది. బావినీటితో స్నానం ఆరోగ్యకరం ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులు అక్కడి బావి నీటితో స్నానం చేస్తారు. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో భక్తులు బావిలోని నీటిని వెంట తీసుకెళ్తారు. పంటలు వేసే ముందు అమ్మవారిని దర్శించుకొని వెళ్తే బాగా పండుతాయని రైతులు నమ్ముతుంటారు. దేవాదాయశాఖ పరిధిలోకి.. సుమారు 40 ఏళ్లుగా వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగిన ఎల్లమ్మ ఆలయాన్ని కొన్ని నెలల క్రితం ప్రభుత్వం దేవాదాయశాఖలోకి విలీనం చేసింది. దీంతో ప్రతి మంగళవారం జరగనున్న జాతర రోజు దేవాదాయశాఖ అధికారులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ప్రతి మంగళవారం మెట్పల్లి–వెల్లుల రహదారిలో వాహనాల సంఖ్య సైతం పెరిగింది. దీంతో పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేసి రాకపోకలు సాఫీగా జరిగేలా చూస్తున్నారు. -
గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)
-
తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుతమైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)
-
పూరీ జగన్నాథ యాత్ర.. రథాల తయారీ చూశారా?
-
ఏపీలో ప్రసిద్ధి చెందిన ఆలయం..ఈ ఎత్తైన గోపురం పైకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
-
ఆరేండ్ల నుంచి గుడికొస్తున్న నెమలి
-
Murugan పళని మురుగన్కి ప్రణామాలు!
తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి అత్యంత విశిష్టమైనవి.. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే ఉంది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే... కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ – ఇలా ఎన్నో పేర్లున్నాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి గల వైభవ ఆలయాలలో’పళని’ (Arulmigu Dhandayuthapani Swamy) ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన కుమారులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివదేవుడు జాలిపడి ’అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం – ని’ నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు’ అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!మురుగన్ కొండపళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది! దీనిని ‘మురుగన్ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్ రోప్ – వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతప్రకృతి దృశ్యాలుమెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలాచిత్రాలతో మంత్రముగ్ధులు గావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వార΄ాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.విశిష్టమైన విగ్రహంగర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ’నవ పాషాణం’ అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తిమంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకు పోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శనభాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.బోగర్ సిద్ధుని సమాధిఈ పళని కొండలో బోగర్ సిద్ధుని సమాధి, ప్రత్యేక గర్భగుడి ఉన్నాయి. ఇక్కడి స్వామివారి విగ్రహం చిలుక బొమ్మను కలిగి ఉంటుంది. ఇక్కడి స్వామిని కీర్తిస్తూ ‘‘తిరుపుగళ్’’ అనే పాటలను అరుణగిరినాథుడు రచించాడు. అంతేకాదు, తన పాటలతో చిలుక రూపంలో కుమారస్వామితో ఉండే వరం పొందాడని భక్తుల విశ్వాసం. పళని కొండకు వెళ్లే దారిలో ఇడుంపన్ మందిరం ఉంది. తెల్లవారుజామున ఇక్కడ పూజలు చేసిన తర్వాతే, కొండపై ఉన్న కుమారస్వామికి పూజలు చేస్తారు. – డి.వి.ఆర్ -
భర్తతో కలిసి మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
-
ఆలయ ప్రహరీని ఎందుకు కూలదోశావు అని టీడీపీ నేతను ప్రశ్నించిన గ్రామస్తులు
-
ఏపీలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
వారాహి ఆలయ ధ్వంసంపై కేసు నమోదు
సాక్షి, టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసంపై హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామిరెడ్డి, మణిరెడ్డి, హేమాద్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేయక పోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి, నామమాత్రపు సెక్షన్లతో కేసు పెట్టడం వల్లే ముగ్గురి ఇలా అరెస్ట్ చేయడం.. అలా బెయిల్ మంజూరు చేసి పంపడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకోకపోయినా.. తీసుకున్నట్లు కనిపించాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వచి్చనట్లు సమాచారం. అందువల్లే తూతూ మంత్రపు చర్యలతో పోలీసులు ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘నన్నెవరూ ఏమీ చేయలేరు. నాని అన్న మంత్రి లోకేశ్తో మాట్లాడాడు. వాళ్లేం చేస్తారో చేసుకోని.. మనం చేసేది చేద్దాం’ అని ఆలయం కూల్చివేతలో కీలక నిందితుడు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆలయాన్ని నేలమట్టం చేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం ఎస్ఐ జగన్నాథరెడ్డి పరిశీలించారు. కూటమి నాయకుల దాడిలో శిథిలమైన విగ్రహాలు, ఉత్సవమూర్తులను పోలీసు స్టేషన్కు తరలించారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణిరాజశయన ఆలయ ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించి, ఆలయ ఉపచారకులు శ్రీమహారుద్ర వారాహి స్వామిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.కాగా, విజయవాడకు చెందిన జై భారత్ హిందూ సంఘానికి చెందిన సభ్యులు ఘటనా స్థలి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటనలో నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు కావడంపై హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్లో ఉన్నామా? చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హిందువులపై ఎందుకు ఇంత విద్వేషమని హిందూ సంఘ ప్రతినిధి చీనేపల్లి కిరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్లోనే ఉన్నామా.. లేక పాకిస్తాన్లో ఉన్నామా అని అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించక పోవడం శోచనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందించక పోవడం పట్ల హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెడితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదని స్పష్టం చేశారు. -
వారాహి అమ్మవారి గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు
-
వారాహి ఆలయాన్నీ వదలని టీడీపీ నేతలు
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖిలో పడేశారు. ఇన్నాళ్లూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు వారాహి మాత ఆలయ స్థలంపై కన్నేశారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడి మంగళవారం అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ దీక్ష చేసిన వారాహి అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడేయడం కలకలం రేపింది. మారణాయుధాలతో దాడిచేసి.. ఆలయ నిర్వాహకులు, హిందూ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీవారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆలయం ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచి్చన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపించారు.అర్ధరాత్రి ఆలయం నేలమట్టం పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూలవిరాట్ శ్రీవారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాల చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై భజరంగ్దళ్ కార్యకర్తలు బుధవారం ఘటన స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు, అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి.హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీసు స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆలయాన్ని కూలి్చవేసి.. ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం. ఈ దురాగతం టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. కిశోర్రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కావడం గమనార్హం.టీడీపీ నేత అండతోనే కూల్చివేతశ్రీవారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత, విగ్రహాల ధ్వంసం ఘటనలు తిరుచానూరుకు చెందిన టీడీపీ నాయకుడు కిషోర్రెడ్డి అండతోనే జరిగిందని జై భజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు కిరీఠి ఆరోపించారు. టీడీపీ నేతలు ఆలయాలపై దాడికి పాల్పడడం సహించబోమని, జిల్లావ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూటమి కనుసన్నల్లోకి వెళ్లిపోయిందని, సీఐ సునీల్కుమార్ కూటమి నేతల దౌర్జన్యాలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. -
Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు
-
గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు
సాక్షి, తిరుపతి: తిరుచానూరులో టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు.. ఆలయాన్ని కూల్చివేశారు. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని రాత్రి రాత్రే నేలమట్టం చేసిన టీడీపీ నేతలు.. ఆలయ ఆనవాళ్లు లేకుండా స్వర్ణముఖి నదిలో కలిపేశారు. అనంతరం.. టీడీపీ నేత కిశోర్రెడ్డి ఆలయ భూమిని కబ్జా చేసేశారు. గుడి ఆనవాళ్లను హిందూ సంఘాలు.. స్వర్ణముఖి నది నుంచి బయటకు తీశాయి. హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు.. విగ్రహాన్ని తీసుకుపోయారు. టీడీపీ నేత కిశోర్రెడ్డి, పోలీసులు తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. -
యాదగిరిగుట్టకు బారులుదీరిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని శనివారం లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో జంట నగరాలతో పాటు రాష్ట్రం, దేశం నలుదిశల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10.30 గంటల వరకు ధర్మదర్శనం, వీఐపీ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. ఒక్క రోజులో లక్ష మంది భక్తులు శ్రీస్వామిని దర్శించుకోవడం ఇదే మొదటి సారని ఆలయాధికారులు చెబుతున్నారు. గత వారం 90 వేల మంది భక్తులు దర్శించుకోగా.. శనివారం రాత్రి 10.30 గంటల తరువాత భక్తులు అధికంగా క్యూలైన్లలో శ్రీస్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం స్వాతి నక్షత్రంతో పాటు సెలవు రోజు కావడంతో.. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయాధికారులు చెబుతున్నారు. -
కామాఖ్య ఆలయంలో 'బిగ్బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)


