సాక్షి,జగిత్యాల: మేడిపల్లి మండలం కొండాపూర్లో విషాదం చోటుచేసుకుంది. శివగంగ ఆలయం సమీపంలోని కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. తొలుత ఇద్దరు మృతదేహాలు లభించగా ఒకరు గల్లంతయ్యారు. దీంతో వెంటనే గల్లంతైన చిన్నారి కోసం గజ ఈతగాళ్లు కోనేరులో దిగి గాలింపులు చేపట్టగా బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. మృతులు మనస్వి, అర్వింద్గా గుర్తించారు. పిల్లల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


