
క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పుణ్య క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో వుంది.

దీనినే క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం అంటారు.

దేవాలయం ఎత్తైన గోపురంతో, సంక్లిష్టమైన శిల్పాలతో అందంగా ఉంటుంది.

ఇక్కడ ప్రధాన దైవం శివలింగం. లింగం క్షీరవర్ణంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి క్షీరారామం అనే పేరు వచ్చింది.

ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది.
















