ఇదేందిరా సామీ.. కుర్చీ కోసం రైలు ఆపిన గార్డు! | Guard Halts Superfast Train for 38 Minutes Over a Missing Chair | Sakshi
Sakshi News home page

ఇదేందిరా సామీ.. కుర్చీ కోసం రైలు ఆపిన గార్డు!

Aug 19 2026 12:49 PM | Updated on Aug 19 2026 12:50 PM

Guard Halts Superfast Train for 38 Minutes Over a Missing Chair

గోరఖ్‌పూర్: బోగీలో తాను కూర్చునేందుకు కుర్చీ లేదనే నెపంతో రైలు గార్డు ఒక సూపర్‌ఫాస్ట్ రైలును ఏకంగా 38 నిమిషాల పాటు స్టేషన్‌లోనే నిలిచిపోయేనా చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి లలిత్‌గ్రామ్ వెళ్తున్న వైశాలి ఎక్స్‌ప్రెస్ గోరఖ్‌పూర్ జంక్షన్‌కు చేరుకున్న సమయంలో ఈ వివాదం తలెత్తింది. రైలు గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న రామాశిష్ దాస్, తన కేబిన్‌లో కూర్చోవడానికి సరైన కుర్చీ సదుపాయం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

తనకు సరైన సీటు ఏర్పాటు చేసేంత వరకు రైలుకు పచ్చజెండా ఊపేది లేదని, ముందుకు తీసుకెళ్లబోనని ఆయన మొండికేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గార్డుతో చర్చలు జరిపారు. రైలు ప్రయాణ మార్గంలోని తదుపరి ముఖ్య స్టేషన్ అయిన డియోరియాలో కూర్చోవడానికి  తగిన సీటింగ్ ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో గార్డు శాంతించి రైలు కదలడానికి అనుమతించారు. ఈ తతంగానికి 38 నిమిషాల సమయం పట్టడంతో వైశాలి ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటన రైల్వే వర్గాల్లో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: విజయ్ ఓ వర్గానికే సీఎం?.. నిలదీసిన బీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement