గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు | TDP Leaders Demolished The Temple In Tiruchanur | Sakshi
Sakshi News home page

గుడిని కూల్చేసిన టీడీపీ గూండాలు

Jun 11 2025 4:08 PM | Updated on Jun 11 2025 7:24 PM

TDP Leaders Demolished The Temple In Tiruchanur

సాక్షి, తిరుపతి: తిరుచానూరులో టీడీపీ గూండాలు రౌడీయిజానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు.. ఆలయాన్ని కూల్చివేశారు. తిరుచానూరు వారాహి అమ్మవారి గుడిని రాత్రి రాత్రే నేలమట్టం చేసిన టీడీపీ నేతలు.. ఆలయ ఆనవాళ్లు లేకుండా స్వర్ణముఖి నదిలో కలిపేశారు. అనంతరం.. టీడీపీ నేత కిశోర్‌రెడ్డి ఆలయ భూమిని కబ్జా చేసేశారు.

 గుడి ఆనవాళ్లను హిందూ సంఘాలు.. స్వర్ణముఖి నది నుంచి బయటకు తీశాయి. హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు.. విగ్రహాన్ని తీసుకుపోయారు. టీడీపీ నేత కిశోర్‌రెడ్డి, పోలీసులు తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. ఆందోళనకారులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

 

Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement