సాక్షి, అమరావతి: ఇదివరకే అప్పులలో రికార్డు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ అప్పు తెచ్చింది. ఈ రోజు (మంగళవారం) రూ. 3800 కోట్లు అప్పుగా తీసుకవచ్చింది. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఈ అప్పుతెచ్చింది. చంద్రబాబు అధికారం చేపట్టిన 26 నెలల్లోనే రూ. 3 లక్షల 68 వేల కోట్లు అప్పు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోనే అత్యధికంగా అప్పు తెచ్చిన ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టించింది.


