‘నీట్‌’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు | Kerala Aspirant with 640 Marks Denied Government Seat Now Pays Rs 10 Lakh a Year | Sakshi
Sakshi News home page

‘నీట్‌’లో 640.. అయినా ప్రభుత్వ సీటు గల్లంతు

Aug 10 2026 8:16 AM | Updated on Aug 10 2026 9:00 AM

Kerala Aspirant with 640 Marks Denied Government Seat Now Pays Rs 10 Lakh a Year

వడకంచెరి: కేరళలోని వడకంచెరికి చెందిన నీట్-యూజీ(NEET-UG) 2024 అభ్యర్థి అంజలి ఎస్ ప్రవేశ పరీక్షలో 640 మార్కులు సాధించినప్పటికీ, ప్రభుత్వ మెడికల్ సీటు పొందలేకపోయానని, ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో ఏటా రూ. 10 లక్షలు చెల్లించి చదువుకోవాల్సి వస్తోందని ఆరోపించారు. పరీక్షలో జరిగిన అక్రమాల వల్లే తనకు ఈ దుస్థితి దాపురించిందని ఆమె వాపోయారు. కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అంజలి ఆరోపించారు.

తాము ముందుగా అంచనా వేసిన ర్యాంకులు, లభ్యత ఉన్న సీట్ల ఆధారంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఖాయమని ఎంతో ధీమాగా ఉన్నామని, ​కానీ అనూహ్యంగా ప్రభుత్వ సీటు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చిందని, దీనివల్ల తమ కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వైఫల్యానికి కారణమైన బాధ్యులు స్పందించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శనివారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం పంపినట్లు అంజలి వెల్లడించారు. నీట్-2024 పరీక్షల వివాదాలు, గ్రేస్ మార్కుల కేటాయింపు వంటి అంశాలు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement